గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్ | ys jagan mohan reddy reached gannavaram airport | Sakshi
Sakshi News home page

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్

Published Wed, Oct 19 2016 9:37 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్ - Sakshi

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్

గన్నవరం : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా బయల్దేరతారు. జిల్లాలో ప్రతిపాదిన మెగా ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, మత్య్సకారులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన ఈవాళ భీమవరంలో పర్యటించనున్నారు.

అలాగే తణుకు సబ్ జైల్లో ఉన్న ఆక్వా బాధితులను పరామర్శిస్తారు. గన్నవరంలో పార్టీ నేతలతో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాకు పయనం అవుతారు. అక్కడ మెగా ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, మత్య్సకారులతో ముఖాముఖీ నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం గన్నవరం విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ బయల్దేరి వెళతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement