వైఎస్ షర్మిల గుంటూరు చేరుకున్నారు. వెంటనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
గుంటూరు: వైఎస్ షర్మిల గుంటూరు చేరుకున్నారు. వెంటనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి ఆరు రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను పరామర్శించేందుకు వచ్చారు.
అంతకు ముందే వైఎస్ జగన్ను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఈ రోజు హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయల్దేరి వైఎస్ జగన్ను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన సోదరి వైఎస్ షర్మిల గుంటూరుకు బయల్దేరారు. సోమవారం మధ్యాహ్నం షర్మిల బెంగళూరు నుంచి గుంటూరుకు పయనమయ్యారు.