indefinite fasting
-
ఓలా.. ఉబర్ డ్రైవర్ల నిరవధిక దీక్ష
క్యాబ్ల సంఖ్య విచ్చలవిడిగా పెరిగిపోవడంతో ఒకప్పుడు నెలకు 85 వేల రూపాయల వరకు సంపాదించిన క్యాబ్ ఓనర్లు.. ఇప్పుడు 15 వేలు జేబులో వేసుకోవడం కూడా కనాకష్టంగా మారింది. కారు ఈఎంఐ కట్టడానికి కూడా ఆ డబ్బులు సరిపోకపోవడంతో ఎలా తినాలి, ఎలా బతకాలని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు నిరవధిక సమ్మె ప్రారంభించారు. తాజాగా తమ డిమాండ్ల సాధన కోసం 20 మంది డ్రైవర్లు నిరవధిక దీక్షలు కూడా మొదలుపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కూడా వాళ్ల దీక్షకు మద్దతు పలకడంతో.. ఉద్యమం మరింత వేడెక్కింది. ఇతర రవాణా కార్మిక సంఘాలు కూడా వారికి తోడయ్యాయి. కంపెనీల తీరును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి కర్ణాటకలో ఓలా, ఉబర్ డ్రైవర్లు నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టారు. క్యాబ్ కంపెనీలకు తగిన నిబంధనలు విధించాలని రవాణాశాఖను కూడా వాళ్లు డిమాండ్ చేశారు. మాజీ సీఎం కుమారస్వామిని కలిసిన తర్వాత వాళ్లు ఫ్రీడం పార్కులో నిరాహార దీక్ష మొదలుపెట్టారు. కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు కొడిహళ్లి చంద్రశేఖర్ కూడా వాళ్ల కార్యక్రమానికి హాజరై.. అక్కడున్నవారిని ఉద్దేశించి మాట్లాడారు. కంపెనీల విషయంలో కలగజేసుకోవాలని సీఎం సిద్దరామయ్యను, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డిని కోరారు. క్యాబ్ డ్రైవర్ల డిమాండ్లివీ.. కొత్త క్యాబ్లను ఎటాచ్ చేసుకోవడాన్ని ఓలా, ఉబర్ తక్షణం ఆపాలి. దానివల్ల ఇప్పటికే తక్కువగా ఉన్న బుకింగ్లు మరింత తగ్గిపోతున్నాయి. డ్రైవర్లకు తగిన ఇన్సెంటివ్లు ఇవ్వాలి. నెలకు రూ. 85వేల నుంచి రూ. 15వేలకు ఆదాయం పడిపోయింది. కస్టమర్ రేటింగుల ఆధారంగా డ్రైవర్లకు జరిమానాలు విధించడాన్ని కంపెనీలు తక్షణం ఆపాలి. -
’ఇది ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం’
-
'పోలీసుల తీరు బాధాకరం'
-
బలవంతంగా పోలీసులు దీక్షను భగ్నం చేశారు
-
దీక్ష భగ్నం ఎలా జరిగిందంటే..
-
ఐసీయూలో వైఎస్ జగన్
-
దీక్ష భగ్నం ఎలా జరిగిందంటే..
హైదరాబాద్: ముందస్తు వ్యూహం ప్రకారమే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నిద్రహారాలు మానుకొని యావత్ ఆంధ్రప్రజానీకం భావి ప్రయోజనాలకోసం ఆయన అకుంఠిత పట్టుదలతో దీక్ష కొనసాగించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ముఖ్యంగా శరీరంలో కీటోన్స్ సోమవారం ప్లస్ 3 ఉండగా.. మంగళవారం తెల్లవారు జాము సమయానికి ప్లస్ 4కు చేరుకుని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అంతకుముందు ఆయన దీక్షపై ఏ విధమైన స్పందన తెలియజేయని ప్రభుత్వం ముందస్తు వ్యూహంలో భాగంగానే అందరు నిద్రిస్తున్న సమయంలో పోలీసులను దీక్షా స్థలి వద్దకు పంపించారు. ఆ సమయంలో దీక్షా ప్రాంగాణంతోపాటు చుట్టుపక్కల అంతా నిద్రలోనే ఉన్నారు. అక్కడికి చేరుకుంటుండగానే కెమెరాల కేబుల్స్ను కట్ చేయడంతో పాటు లైట్స్ కూడా ఆర్సేసినట్లు తెలిసింది. ఆ వెంటనే వైఎస్ జగన్ వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి విషమించినందున దీక్ష వెంటనే విరమించాలని కోరారు. కానీ అందుకు నిరాకరించిన వైఎస్ జగన్ తాను దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. దీంతో బలవంతంగా పోలీసులు దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి ఓ స్ట్రెచర్పై తీసుకెళ్లి 108 అంబులెన్స్లో ఎక్కించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జికి దిగి అక్కడి వారిని చెల్లా చెదురు చూశారు. అంబులెన్స్కు ఎవరూ అడ్డు రాకుండా ముందు కొంతమంది పోలీసులు లాఠీలతో పరుగెత్తుతుండగా వేగంగా అంబులెన్స్ను గుంటూరు జీజేహెచ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నేరుగా ఐసీయూలోకి తీసుకెళ్లి ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తనకు ఫ్లూయిడ్స్ వద్దని, దీక్షను కొనసాగిస్తానని తీవ్రంగా వైద్యులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆరోగ్యం విషమించిందని, ఇలాగే కొనసాగితే ఊహించని ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ బలవంతంగా వైఎస్ జగన్కు ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి, సోదరి వైస్ షర్మిల ఆస్పత్రికి వచ్చి ఆయనతో ఉన్నారు. మరోపక్క, పోలీసుల తీరుపట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే యత్నం
-
'పోలీసుల తీరు బాధాకరం'
గుంటూరు: అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రభుత్వాస్పత్రికి తరలించే సందర్భంలో పోలీసుల తీరు చాలా బాధాకరమని చెప్పారు. కనీస మర్యాద పాటించలేదని, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా ఓ సాధారణ స్ట్రెచర్ మీద ఆయనను అంబులెన్స్లోకి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్ష చేస్తున్న ప్రస్తుతం ఆయన ఇంకా ఫ్లూయిడ్స్ తీసుకోలేదని, ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తారని చెవిరెడ్డి చెప్పారు. ప్రభుత్వం అండ చూసుకొని పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార అహంబావంతో వ్యవహరించి అందరు నిద్రిస్తున్న సమయంలో పోలీసులను పంపించారని, నిద్రలో ఉన్న వైఎస్ జగన్ను బలవంతంగా నిద్రలేపి తీసుకెళ్లారని చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కేబుల్ టీవీల, కెమెరాల వైర్లను కూడా కట్ చేశారని చెప్పారు. -
బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే యత్నం
గుంటూరు: ప్రత్యేక హోదా కోసం తన దీక్షను కొనసాగిస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీక్షా స్థలి వద్ద నుంచి బలవంతంగా గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు.. అక్కడి ప్రభుత్వ వైద్యులచే వైఎస్ జగన్ కు ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేయగా అందుకు ఆయన నిరాకరించారు. తాను దీక్ష కొనసాగిస్తానని పోలీసులకు స్పష్టం చేశారు. అయినా, ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఆయనకు రక్తం, బీపీ, షుగర్, కీటోన్స్ వంటి ఐదురకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫ్లూయిడ్స్ ఎక్కించాలని వారు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
విషమం.. ఆందోళనకరం
► బాగా నీరసించిపోయిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ► శరీరంలో ప్రమాదకరస్థాయిలో కీటోన్స్ ► దీక్ష కొనసాగితే కోమాలోకే.. ► వైద్యుల హెచ్చరిక ► హుటాహుటిన దీక్షాశిబిరం వద్దకు విజయమ్మ, భారతి ► కన్నీటిపర్యంతమవుతున్న అభిమానులు ► పార్టీలకు అతీతంగా నేతల సంఘీభావం ► శిబిరం వద్ద ఆత్మాహుతికి ప్రయత్నించిన ఓ యువకుడు ► జగన్ను పరామర్శించిన సోదరి షర్మిల సాక్షి ప్రత్యేక ప్రతినిధి, గుంటూరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏడురోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం బాగా విషమించింది. బాగా నీరసించిపోయారు. సోమవారం మూడుసార్లు పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. దీక్షను ఆపి తక్షణం ఆహారం తీసుకోకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు సోమవారం రాత్రి జగన్కు వివరించారు. అయితే తన ప్రాణాల కన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే ముఖ్యమంటూ దీక్షను కొనసాగించడానికే జగన్ నిర్ణయించుకున్నారు. ఆహారం తీసుకోవాలంటూ తాము చేసిన సూచనలను జగన్ తోసిపుచ్చారని వైద్యులు తెలిపారు. జగన్ రక్తపరీక్షల్లో చక్కెర నిల్వలు బాగా పడిపోయి 61 ఎంజీకి చేరుకున్నాయని, ‘కీటోన్ బాడీస్ స్థాయి 3 ప్లస్’గా ఉందని వెల్లడైంది కనుక మూత్రపిండాల పనితీరుపైనా, మెదడు పనితీరుపైనా తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్యులు పేర్కొన్నారు. శరీరంలో ‘పొటాషియం’ నిల్వలు అసాధారణ స్థాయికి చేరుకుంటాయని, అపుడు పరిస్థితి ఇంకా విషమిస్తుందని, కోమాలోకి కూడా వెళ్లిపోయే ప్రమాదం తలెత్తుతుందని వైద్యులు హెచ్చరించారు. దీక్షను ఇంకా మిగతా 6వ పేజీలో ఠ కొనసాగించడమంటే అది సాహసమే అవుతుందని వారు చెబుతున్నారు. సోమవారం ఉదయం 7.30లకు జరిపిన పరీక్షల్లో జగన్ 72.7 కిలోల బరువున్నారు. బీపీ 130/ 90, పల్స్ 80గా ఉన్నాయి. షుగర్ ల్యాబ్లో పరీక్షిస్తే 61 ఎంజీగా, స్ట్రిప్పై 84 ఎంజీగా ఉంది. తేడా ఉండటం వల్ల వైద్యాధికారులు షుగర్ రిపోర్టు ప్రకటించకుండా నిలిపివేశారు. మద్యాహ్నం 1.30కి జరిపిన పరీక్షల్లో బీపీ 130/80, పల్స్ 80 ఉండగా బరువు 72.7 కిలోలు ఉన్నారు. రాత్రి 9.00 గంటలకు పరీక్షల్లో బీపీ 130/ 80, పల్స్ 77 ఉండగా బరువు 72.4 కిలోలున్నారు. బాగా నీరసించి పోవడంతో సోమవారం కొద్ది సేపు మాత్రమే జగన్ కూర్చోగలిగారు. కళ్లు బాగా వేడెక్కుతూ ఉండటంతో కళ్లపై చల్లని బట్టను కప్పుకుని పూర్తిగా పడుకుండి పోయారు. ఉద్విగ్న భరిత వాతావరణం జగన్ దీక్షా వేదిక వద్ద సోమవారం ఉదయం నుంచీ ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది. ఆయన ఆరోగ్యం గంట, గంటకూ ప్రమాదస్థాయికి చేరుకుంటోందని టీవీల ద్వారా తెలుసుకున్న ప్రజలు, అభిమానులు వెల్లువలాగా తరలి వచ్చారు. గుంటూరు పరిసరాల్లో నుంచి భారీగా తరలి వచ్చిన జనం వేదికకు దగ్గరగా వెళ్లి చూడడానికి ప్రయత్నించడం, చూడలేనివారు నిరాశ పడడం కనిపించింది. జగన్ ఆరోగ్య పరిస్థితిపై వారందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. జగన్ స్థితిని వేదిక వద్ద ఏర్పాటు చేసిన తెరలపై చూసి మహిళలు కన్నీటి పర్యంతం అయ్యారు. జగన్ దీక్షను నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై శాపనార్థాలు పెడుతూ మహిళలు పెద్దపెట్టున రోదించడం కనిపించింది. యువకులైతే ఆగ్రహావేశాలతో ఊగి పోతూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, సీనియర్లు చంద్రబాబు వైఖరిని, కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ ప్రసంగించారు. మరోమారు జగన్ వద్దకు విజయమ్మ, భారతి తనయుని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని తెలిసి ఆందోళన చెందిన జగన్ మాతృమూర్తి , పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆయన సతీమణి వైఎస్ భారతి హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారు. దీక్షా శిబిరానికి చేరుకున్నారు. (ఆదివారమే ఇక్కడకు వచ్చి వెళ్లిన భారతి ఆందోళనతో మళ్లీ సోమవారం భర్త వద్దకు చేరుకున్నారు) నీరసంగా, మాట్లాడలేకుండా ఉన్న తనయుని చూసి ఆవేదన చెందిన విజయమ్మ ఆయనకు సపర్యలు చేస్తూ పక్కనే ఉండి పోయారు. భర్త యోగక్షేమాల సమాచారం గురించి వైద్యులతో వాకబు చేస్తూ భారతి కూడా వేదికపై జగన్ పక్కనే కింద కూర్చుండిపోయారు. జగన్ పరిస్థితి, విజయమ్మ, భారతి విషణ్ణ వదనాలను గమనించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరింత ఉద్వేగానికి లోనయ్యారు. కాగా వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా సోమవారం సాయంత్రానికి దీక్షాశిబిరాన్ని సందర్శించారు. జగన్ను పరామర్శించి కొద్దిసేపు ఉండి వెళ్లారు. రగిలిన రాష్ర్టం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జగన్పై ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని, ప్రత్తిపాటి అవమానకరమైన రీతిలో వ్యాఖ్యలు చేయడంపై సోమవారం రాష్ర్టవ్యాప్తంగా నిరసనలు మిన్నుముట్టాయి. ఒకవైపు జగన్ నిరాహార దీక్షకు సంఘీభావంగా రిలేనిరాహార దీక్షలు చేస్తున్న పార్టీ నాయకులు,కార్యకర్తలు సోమవారం మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యులు పనిచేయని పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ నివేదికల ఆధారంగా జగన్పై విమర్శలకు పూనుకోవడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. జగన్ ఆరోగ్యం కోసం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. రాత్రి రాష్ర్టవ్యాప్తంగా పలు చోట్ల కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. ఆత్మాహుతి యత్నాలు.. బాధ్యతగలిగిన ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాాష్ర్ట శ్రేయస్సుకోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా ఆయన ఆరోగ్యం గురించి గానీ, ఆయన చేస్తున్న డిమాండ్ గురించి గానీ కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఆరోగ్యం క్షీణిస్తుండడంపై ఆందోళన చెందుతూ, రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని నిరసిస్తూ రాష్ర్టంలో పలువురు ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపింది. మొత్తం ఐదు చోట్ల ఆత్మాహుతి యత్నాలు జరిగినట్లు వార్తలందడం చూస్తుంటే రాష్ర్ట ప్రజలు ప్రత్యేక హోదా గురించి, ప్రతిపక్ష నేత ఆరోగ్యం గురించి ఎంతగా ఆందోళన చెందుతున్నారో అర్ధం చేసుకోవచ్చునని పరిశీలకులంటున్నారు. దీక్షా శిబిరానికి వచ్చిన ఓ యువకుడు జగన్ పరిస్థితి చూసి చలించిపోయి పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించడంతో నాయకులు,కార్యకర్తలు అడ్డుకుని రక్షించారు. ఆ యువకుడిని గుంటూరునగరానికి చెందిన దగ్గుమల్లి పూర్ణ వెంకటసాయిగా గుర్తించారు. గుంటూరుజిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ సైదా, ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మునగాల కృష్ణారెడ్డి, తిరుపతి ఎస్వీయూలో మాసుమయ్య అనే విద్యార్థి పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నిస్తే పక్కనున్నవారు అప్రమత్తమై కాపాడారు. వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరులో రాస్తారోకోలో పాల్గొన్న తురకపల్లి కేశమ్మ అలియాస్ రంగమ్మ విష గుళికలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంగమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సీపీఐ సంఘీభావం జగన్ ప్రత్యేక హోదా దీక్షకు సోమవారం సీపీఐ నేతలు సంఘీభావం ప్రకటించారు. సీపీఐ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి జగన్కు తాము సంపూర్ణ సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. వారు వచ్చినపుడు కూడా జగన్ లేవలేని స్థితిలో ఉన్నారు. జగన్ దీక్షపై ఏపీ ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తూండటాన్ని సీపీఐ నేతలు తప్పు పట్టారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దీక్ష విరమణకు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22 వ తేదీన రాష్ట్రానికి వస్తున్నందున అంతకు ముందే ప్రత్యేక హోదాపై ఒక విస్పష్టమై ప్రకటన చేయాలని కోరారు. ఉదయం 7.30లకు.. (సోమవారం) బరువు 72.9 కిలోలు బీపీ 130/90 పల్స్ 80 మధ్యాహ్నం 1.30కి బరువు 72.7 కిలోలు బీపీ 130/80 పల్స్ 80 రాత్రి 9.00కి బరువు 72.4 కిలోలు బీపీ 130/80 పల్స్ 77 షుగర్... ల్యాబ్లో పరీక్షిస్తే 61 ఎంజీగా, స్ట్రిప్పై 84 ఎంజీగా ఉంది. తేడా ఉండటం వల్ల వైద్యాధికారులు షుగర్ రిపోర్టు ప్రకటించకుండా నిలిపివేశారు. -
వైఎస్ జగన్కు షర్మిల పరామర్శ
గుంటూరు: వైఎస్ షర్మిల గుంటూరు చేరుకున్నారు. వెంటనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి ఆరు రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను పరామర్శించేందుకు వచ్చారు. అంతకు ముందే వైఎస్ జగన్ను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఈ రోజు హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయల్దేరి వైఎస్ జగన్ను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన సోదరి వైఎస్ షర్మిల గుంటూరుకు బయల్దేరారు. సోమవారం మధ్యాహ్నం షర్మిల బెంగళూరు నుంచి గుంటూరుకు పయనమయ్యారు. -
'కాలచక్రం తిరిగొస్తుంది.. పాతాళంలోకి వెళతారు'
-
'కాలచక్రం తిరిగొస్తుంది.. పాతాళంలోకి వెళతారు'
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన కుటుంబం దొంగపనులు చేయలేదని అంబటి రాంబాబు అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను దొంగ దీక్ష అని చంద్రబాబు మంత్రులు మాట్లాడటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ఆరో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ దొంగలెక్కలు, మోసపూరిత హామీలు మీవే అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. చిత్తశుద్దితో దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ పై ఆరోపణలు మానుకోవాలని లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇష్టమొచ్చినట్లు వాఖ్యానిస్తున్నారని, అసలు రక్త నమునాలు ఎప్పుడు తీసుకుంటున్నారో పరీక్షలు ఎప్పుడు చేస్తున్నారో మీకు తెలుసా అని ప్రశ్నించారు. గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరికరాలు లేక ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో టెస్టులు చేస్తున్నారంటే ప్రభుత్వం ఎంత పనికిరాని పరిపాలన చేస్తుందో అర్థం కావడం లేదా అని నిలదీశారు. ఆరు రోజులుగా నిద్రాహారాలు మానుకొని వైఎస్ జగన్ దీక్ష చేస్తుంటే కనిపించడం లేదా అన్నారు. మెచ్చుకోకపోయినా పర్వాలేదుకానీ ఆరోపణలు మాత్రం చేయొద్దని అన్నారు. మంత్రులు, చంద్రబాబునాయుడు అధికార తిమ్మిరితో అహంబావంతో వ్యవహరిస్తున్నారని, కాలం తిరిగొచ్చి వారిని అధపాతాళంలోకి నెట్టి వేసే రోజు తొందర్లోనే వస్తుందని మండిపడ్డారు. ప్యాకేజీలు గురించి అసలు ఎందుకు మాట్లాడుతున్నారని, దాని గురించి మాట్లాడకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, ప్రత్యేక హోదాపై మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కుట్ర చేసి రాష్ట్రాన్ని విడదీసి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని, అందుకు టీడీపీ కూడా మద్దతు పలికిందని ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా ఎందుకని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'మందిని ముంచినవారు మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని లక్ష్మీ పార్వతి అన్నారు. నైతిక హక్కులేని వారంతా వైఎస్ జగన్ ఆరోగ్యంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి గంటా శ్రీనివాసరావుల గురించి ఎవరికీ తెలియని విషయం లేదని, ప్రత్తిపాటి పుల్లారావు మందిని ముంచినవారేనని, తక్కువ ధరలకే రైతుల భూములు ఆక్రమించుకున్నారని, వారి పత్తి పంట సొమ్ములు తన ఖాతాలోకి వేసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసపూరిత హామీలతో అధికారంలోకి వస్తే రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం చిన్నవాడైనా వైఎస్ జగన్ అనేక దీక్షలు, ధర్నాలతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ లాగా ఎవరూ శ్రమించలేదని పేర్కొన్నారు. ఆయనను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. గాంధీ అనుసరించిన మార్గాన్ని వైఎస్ జగన్ఎంచుకున్నారని, నిరవధిక దీక్ష అంటే అమరణ నిరాహార దీక్షేనని, అలాంటి దీక్షను అవమాన పరుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని విస్మరిస్తారా.. అందుకేనా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది అని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ పేరిట ప్రత్యేక హోదా అడ్డుకుంటున్నారని, నాడు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని సభలో అడిగిన వెంకయ్యనాయుడికి ఇప్పుడు ఆ విషయం ఎందుకు అర్థం కావడంలేదో అని అన్నారు. కేవలం 4,200 కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిందని, కాని తెలంగాణ 5,145కోట్లు కేంద్రం నుంచి సాధించుకుందని చెప్పారు. -
'మందిని ముంచినవారు మాట్లాడుతున్నారు'
-
'జాతీయ మీడియా నిర్లక్ష్యం చేస్తోంది'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడమేనని, నిరుద్యోగాన్ని పారద్రోలడమేనని సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో నాడు కేంద్రంలోని అధికార పార్టీ, ప్రతిపక్ష బీజేపీ హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. మరోపక్క, ప్రత్యేక హోదా కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారా దీక్షను జాతీయ మీడియా నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. సాధారణంగా జాతీయ మీడియా పట్టించుకున్నప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి సమస్య తెలుస్తుందని, అలాంటిది ఆ మీడియా ఎందుకు ఈ విషయాన్ని పక్కకు పెట్టాయో అర్థం కావడం లేదని చెప్పారు. స్థానిక మీడియా బాగానే ప్రచారం చేస్తుందని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని, కొంత ఆందోళన కరంగా ఉందని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పారు. ఈ దీక్ష వైఎస్ జగన్ కోసం చేస్తున్నది కాదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసమే దీక్ష చేస్తున్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. -
'జాతీయ మీడియా నిర్లక్ష్యం చేస్తోంది'
-
'బాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి'
చిత్తూరు: చంద్రబాబునాయుడికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో పడ్డాయని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తన మీడియా ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు మద్దతుగా భూమన ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరు ఆర్డీవో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన వాటికి భయపడే వ్యక్తి వైఎస్ జగన్ కాదని అన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకోసం పోరాడుతున్న ఏకైక నేత ఒక్క వైఎస్ జగనే అని చెప్పారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అరెస్టు
ప్రకాశం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రభుత్వం తన అధికార బలంతో ఝులం ప్రదర్శిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న వైఎస్ జగన్కు మద్దతుగా నిలుస్తున్న వారిని పోలీసులతో అణిచివేయాలని చూస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా వంటావార్పు, బైక్ ర్యాలీ చేపట్టినందుకు ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతమాగులూరు మండలం, పుట్టావారిపాలెం వద్ద ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు మద్దతుగా రాష్ట్ర నలు మూలల మద్దతు లభిస్తోంది. దీక్షకు మద్దతు తెలుపుతున్నవారిని పోలీసులు పలుకారణాలపేరిట అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. -
'వైఎస్ జగన్ ప్రాణాలు లెక్కచేయడం లేదు'
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం పట్ల పార్టీ సీనియర్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కీలక నేతల భేటీ నిర్వహించిన అనంతరం పార్టీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారని చెప్పారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జగన్ దీక్ష చేస్తున్నారని చెప్పారు. దీక్షకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోందని, అశేష ప్రజానీకం మద్దతు తెలుపుతోందని వివరించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా మాత్రమే సంజీవని ఆయన అన్నారు. 22న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక హోదాపై స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. జగన్ దీక్షపై చంద్రబాబు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే జాలి వేస్తుందని అన్నారు. చంద్రబాబులా మోసం చేసే మాటలు జగన్ కు తెలియవదని అన్నారు. అలీబాబా నలభై దొంగల్లా పంచభూతాలను టీడీపీ దోచుకుంటుందని ఆరోపించారు. టీడీపీ నేతల తీరును ప్రజలంతా గమనిస్తున్నారని, పోలవరంపై బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్.. బాబు భాగస్వామా కాదా అని ప్రశ్నించారు. వ్యాపార భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకే రాజధాని భూముల తాకట్టు పెట్టారని చెప్పారు. -
'వైఎస్ జగన్ ప్రాణాలు లెక్కచేయడం లేదు'
-
రెండు కేజీలు తగ్గిన వైఎస్ జగన్
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ నాగభూషణ్ రెడ్డి ఆదివారం 11 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్కు పరీక్ష చేశారు. రక్త నమూనాను సేకరించారు. దీని ప్రకారం ప్రస్తుతం వైఎస్ జగన్ శరీరంలో చక్కెర స్థాయి 83కు, నాడీ 67కు పడిపోయింది. ఇక అంతకుముందు ఆయన 75 కేజీలకు పైగా ఉండగా ప్రస్తుతం ఆయన బరువు 73.4 కేజీలకు తగ్గింది. మొత్తం రెండు కేజీల బరువు వైఎస్ జగన్ తగ్గినట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవడంతో గంటగంటకు ఆయన శరీరంలోని బీపీ, షుగర్, పల్స్ స్థాయిల్లో మార్పు వస్తుందని వైద్యులు తెలిపారు. -
వైఎస్ఆర్ సీపీ కీలక నేతల భేటీ
-
వైఎస్ఆర్ సీపీ కీలక నేతల భేటీ
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న చోట వారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే అంశంతోపాటు వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితులపట్ల చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆదివారం ఉదయం ఓసారి 11గంటలు దాటిన ప్రాంతంలో ఓసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. -
రెండు కేజీలు తగ్గిన వైఎస్ జగన్
-
'బాబు దుష్ట పన్నాగానికి దిగారు'
-
'బాబు దుష్ట పన్నాగానికి దిగారు'
గుంటూరు: ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘోర వైఫల్యం చెందారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. రాష్ట్రం దుర్భిక్షంలో ఉంటేనే తన దుష్టపన్నాగాలు అమలవుతాయని చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్యోతుల మాట్లాడుతూ రైతుల దుస్థితిని ఆయుధంగా వాడుకుని, వారికి భ్రమలు కల్పించి చంద్రబాబునాయుడు మోసం చేశారని చెప్పారు. యువతను కూడా ఉద్యోగాలిస్తామని.. నిరుద్యోగ ఉదృతి భృతి ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా పక్కకు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ గురించి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారని, అది తెచ్చి ఎవరికి పెడతారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో కూడా చంద్రబాబునాయుడు ఘోర తప్పిదాలకు పాల్పడ్డారని, తనకు ఎక్కడ లంఛాలు రావో అని పోలవరం పక్కకు పెట్టేశారని, దానిని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తానని అంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం లేకుంటే పోలవరం పూర్తి కాదనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. పోలవరం కాలువ వైఎస్ తవ్విస్తే దానిని ప్రారంభించి తానేదో గొప్పలు సాధించినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నాడని ఆయన చేసిందేమీ లేదని ఆరోపించారు. వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తుందని, అయినా దీక్ష కొనసాగించి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. ఓటుకు నోటు కేసుల కుంభకోణంలో ఇరుక్కుని చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని చెప్పారు. -
'బాబూ.. ఎందుకు ఈ నాటకాలు'
-
'ఇలాగే ఉంటే ఆరోగ్యం విషమిస్తుంది'
-
'బాబూ.. ఎందుకు ఈ నాటకాలు'
గుంటూరు: పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో వాదించిన మీకు చట్టంలో ఆ హామీ పెట్టారా లేదా అని చూసుకునే బాధ్యత లేదా అని బీజేపీ నేత వెంకయ్యనాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఒక వేళ చట్టంలో పెట్టకపోయినా.. నాటి వాదనల ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదా అని నిలదీశారు. నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరహార దీక్షకు మొత్తం రాష్ట్రం నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. ప్రజల మద్దతుతోనే ప్రత్యేక హోదా ఆయన సాధిస్తారని చెప్పారు. ప్రజలంతా జగన్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం మాత్రం చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా, కబోది ముందు నాట్యం చేసినట్లుగా ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై ఆరోపణలు చేస్తోందని, లక్ష కోట్లు పంపించామని చెప్తుందని అన్నారు. ఒక వేళ నిజంగానే లక్ష కోట్లు ఇస్తే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతోపాటు వాటి వ్యయాల గురించి తెలియజేయాలని డిమాండ్ చేశారు. హుద్ హుద్ తుఫానుకు కేంద్రం సాయం అందిస్తే ఆ లెక్కలు ఇప్పటి వరకు చెప్పలేదని బీజేపీ నేత పురందేశ్వరి అంటున్నారని, ఆ వివరాలు కూడా తెలియజేయాలని కోరారు. ఈ లెక్కలు గట్టిగా కేంద్రం అడుగుతుందనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను కోరడం లేదా అని నిలదీశారు. ఇలా, బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం విషమిస్తుంది
గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. వైఎస్ జగన్ దీక్ష ఐదో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం వైఎస్ జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మరోసారి 11 గంటల సమయంలో పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైఎస్ జగన్ కేజిన్నర బరువు తగ్గి బాగా నీరసించిపోయారన్నారు. షుగర్ లెవల్స్ మరింత పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉందని చెప్పారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తున్న నేపథ్యంలో ఇక నుంచి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు వైద్యులు తెలిపారు. -
అనంతపురంలో YSRCP నిరసన దీక్షలు
-
'ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు'
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష కొనసాగుతుందని పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కేబినెట్ నిన్న సమావేశం అయ్యి కూడా ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న దీక్షపై చర్చ చేయకపోవడం, ఎలాంటి ప్రకటన స్పందన లేకపోవడం దారుణం అన్నారు. ఇష్టమొచ్చినట్లుగా చంద్రబాబునాయుడు, ఆయన మంత్రులు ప్రవర్తిస్తున్నారని, మాట్లాడుతున్నారని ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. మరోపక్క, పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని అన్నారు. ఢిల్లీలో దీక్ష చేయాలని వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు మంత్రులు అపహాస్యం చేస్తున్నారని, వీరికి తగిన సమాధానం ప్రజలు చెప్పే రోజు దగ్గరిలోనే ఉందన్నారు. గతంలో కుటుంబకార్యక్రమంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రబాబు ఈ సారి శంఖుస్థాపన కూడా అలాగే చేస్తున్నారని మండిపడ్డారు. ఓ పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్ జగన్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వం తమకేమి పట్టనట్లు ఉంటుందని, దీనికి వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. -
'ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు'
-
'పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్కు మద్దతు ఇవ్వాలి'
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని హైదరాబాద్లోని వివిధ ఐఏఎస్ స్టడీ సర్కిల్స్లో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అన్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ ఏం చేసినా విజయం సాధించారని, ప్రత్యేక హోదా విషయంలో కూడా విజయం సాధిస్తారన్న నమ్మకం తమకు ఉందని, అలా జరగాలని కూడా తాము కోరుకుంటున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా విద్యార్థిలోకానికి, యువతకు, సామాన్యకు చాలా అవసరం అని వారు చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలని, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనదని అన్నారు. రాజధాని విషయం నుంచి ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్ సంస్థాపరంగా, వ్యవస్థాపరంగా చాలా నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని, ఇది ఒక్క ప్రత్యేక హోదాతోనే సాధ్యమని చెప్పారు. నాడు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు, బీజేపీ కూడా హామీ ఇచ్చి మరిచాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య తీరాలన్నా, రైతుల సమస్యలు పోవాలన్నా, తీవ్ర అంతరం ఉన్న రెవిన్యూలోటు పూడ్చాలన్నా ప్రత్యేక హోదా అవసరం అని పేర్కొన్నారు. కేంద్రం కొన్ని కొన్ని కారణాలు చూపెడుతూ ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్తోందని, కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు అన్ని రంగాల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం మూలంగా ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయిందని, కష్టాల్లో కూరుకుపోయిందని చెప్పారు. -
ప్రత్యేక ప్యాకేజీ లోకేశ్ జేబు నింపడానికా..!
-
’మొద్దు నిద్రమాని సంఘీభావం తెలపండి’
-
'వైఎస్ జగన్ విజయం సాధించారు'
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకత, అవసరం, దానివల్ల వచ్చే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించారని విద్యార్థులు, మహిళలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మద్దతుదారులు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దీక్ష ప్రాంగణానికి చేరుకుంటున్న వారంతా మీడియాతో మాట్లాడింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ చేస్తున్న దీక్షపై చర్చ జరుగుతోందని, ప్రతి ఇంట్లో ఆయన నిరాహార దీక్ష గురించే మాట్లాడుకుంటున్నారని వారు పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ అవగాహన వచ్చిందని, ఇది ఓ రకంగా వైఎస్ జగన్ సాధించిన విజయమని వారు చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి నుంచి దీక్షకు మద్దతు లభిస్తోందని, ప్రతి ఒక్కరూ దీక్షా ప్రాంగాణానికి బయలుదేరి వస్తున్నారని, ఈ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. అబద్ధాల యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారని, దాని వల్ల బాబు కుటుంబమే బాగుపడుతుంది తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమి లేదని చెప్పారు. వైఎస్ జగన్కు ఏదైనా జరిగితే సహించేది లేదని, మంత్రులను తిరగనివ్వబోమని, క్యాంపు ఆఫీసులను, వారి పార్టీ కార్యాలయాలను ముట్టడించి తీరుతామని చెప్పారు. విద్యార్థులను కలుపుకొని ముందుకు వెళతామని, విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలవలేదనే విషయం తెలుసుకోవాలని వారు హెచ్చరించారు? -
ప్రత్యేక ప్యాకేజీ లోకేశ్ జేబు నింపడానికా..!
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాలకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నారని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. నాగార్జున యాదవ్ అనే విద్యార్థి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భావి విద్యార్థి తరం, యువతరం, సమస్త ఆంధ్ర ప్రజానీకం బాగుండాలని ఉద్దేశంతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఇప్పటికే ఆయనకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, కీటోన్స్ పాజిటివ్గా వచ్చే అవకాశం ఉందని, కిడ్నీలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, పల్స్ పోడిపోతున్నాయని సమాచారం వస్తుందని, ఆయనకు ఏమైనా అయితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తుంటే ప్రత్యేక ప్యాకేజీ గురించి బాబు మాట్లాడుతున్నారని, అది ఎందుకు ? లోకేశ్ జేబు నింపడానికా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర పోవడం సరికాదని చెప్పారు. ఇప్పటికే దీక్ష ఐదో రోజుకు చేరుకుందని, ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోందని, అయినా ప్రభుత్వం నిమ్మకుండా ఉండటం వెనుక దురుద్దేశం ఏమిటని నిలదీశారు. రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ను ఏమైనా చేయాలనుకుంటున్నారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని వేదికనుంచి ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం స్పందించకుంటే విద్యార్థిలోకం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. -
వెల్లువలా ప్రజా మద్దతు.. ఉద్యమం ఉధృతం
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు వెల్లువలా ప్రజా మద్దతు లభిస్తోంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం భారీ సంఖ్యలో యువత, విద్యార్థిలోకం, సామాన్యులు దీక్షా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. పలు చోట్ల ఆయన దీక్షకు మద్దతుగా ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ కు మద్దతుగా పుత్తూరులో వైఎస్ఆర్ సీపీ నేత ఏనుమలై ఆధ్వర్యంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసన జరుగుతుండగా.. నగరిలో వైఎస్ఆర్ సీపీ నేత కేజే కుమార్ ఆధ్వర్యంలో నిరసన జరుగుతోంది. ఇక విజయపురంలో వైఎస్ జగన్ కు మద్దతుగా జాతీయ రహదారిపై పార్టీ నేత లక్ష్మీ పతిరాజు ఆధ్వర్యంలో ర్యాలీతోపాటు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీ కాళహస్తిలో ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహిస్తున్నారు. మరోపక్క, నిండ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ జగన్ ఆరోగ్యం బాగుండాలని వారు ప్రార్థించారు. -
కాసేపట్లో వైఎస్ఆర్ సీపీ కీలక నేతల భేటీ
-
కాసేపట్లో వైఎస్ఆర్ సీపీ కీలక నేతల భేటీ
గుంటూరు: ప్రత్యేక హోదా విషయంలో మరింత వేగంతో ముందుకు పోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన దీక్షా స్థలివద్దే పార్టీ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే అంశంతోపాటువైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపైనే చర్చించనున్నారు. మరోపక్క, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం వైద్యులు వైఎస్ జగన్కు వైద్య పరీక్షలు చేశారు. వైఎస్ జగన్ బరువు తగ్గి బాగా నీరసించిపోయారు. షుగర్ లెవల్స్ పడిపోయాయి. వైఎస్ జగన్ ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బీపీ 110/70, పల్స్ రేట్ 66 ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం వైఎస్ జగన్కు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక దీక్షకు రోజురోజుకు మద్దతు ఎక్కువవుతోంది. విద్యార్థులు, యువకులు, రైతుల సమర దీక్షకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. -
'పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్కు మద్దతు ఇవ్వాలి'
-
'ముఖ్యమంత్రి క.వి. అయిపోయారు'
రాష్ట్రంలో ఉన్న సమస్యలేవీ చంద్రబాబుకు కనపడటం లేదని, ఆయన క.వి. అయిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అంటే ఆయనకు ఏదీ కనపడదు, వినపడదని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబుకు గుంటూరు జిల్లాలో 30 వేల ఎకరాలు తీసుకుని వ్యాపారం చేసుకోవాలని తప్ప మరో ఆలోచన లేదు ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలన్నీ బ్రహ్మాండంగా బాగుపడ్డాయి. మాకు ఈ రాష్ట్ర అభివృద్ధి అక్కర్లేదు, ఈ ఐదేళ్లు కాలం గడుపుకొని సంపాదించుకుంటే చాలన్న ఏకైక ధ్యేయంతో చంద్రబాబు పనిచేస్తున్నాడు ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారం చేపట్టాడు వెంకయ్య నాయుడు రాజ్యసభ సాక్షిగా కూడా పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగాడు ఇప్పుడు అలాంటాయన ఏం మాట్లాడుతున్నారో కూడా అందరికీ తెలుసు ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్న శత్రవులు చంద్రబాబు, వెంకయ్య నా జోలికి రావద్దు, ప్రత్యేక హోదా ఇచ్చినా లేకపోయినా పర్వాలేదని కేంద్రం వద్ద చంద్రబాబు చెబుతున్నాడు ఓటుకు కోట్ల కేసు రాకూడదని అంటున్నాడు. దానిమీదే మోదీ ముందు మోకరిల్లి, కుయ్యో మెర్రో అని అడుక్కుంటున్నాడు వెంకయ్య నాయుడు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి ప్రాజెక్టులు కడతామని చెబుతున్నారు పోలవరం ప్రాజెక్టుకు 50 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా.. ఇప్పటికి కేవలం 700 కోట్లు మాత్రమే ఇచ్చారు. మరి ఐదేళ్లలో ఎలా పూర్తవుతుంది? దానికి బదులు 1400 కోట్లు ఖర్చుపెట్టి పట్టిసీమ ప్రాజెక్టు ఎందుకు చేపట్టినట్లు? ఆ ప్రాజెక్టుతో రాయలసీమకు నీళ్లు ఇస్తామని అంటాడు. కానీ జీవోలో మాత్రం ఆ నీళ్లు కేవలం రాజధానికి, అక్కడి పరిశ్రమలకు మాత్రమేనని స్పష్టంగా ఉంది అసలీ పట్టిసీమ పనిచేస్తుందా అని అడుగుతున్నాను. బుడమేరుకు బలేరావు చెరువు నుంచి నీళ్లు తరలించి, నదుల అనుసంధానం చేశానని నీళ్లలో మునిగి తేలి స్వీట్లు కూడా తిన్నారు నిజంగా అవి గోదావరి జలాలే అయితే జిల్లా పేరు నిలబెట్టారని మేం కూడా అంటాం. కానీ తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలతో రాయలసీమ వాసులను మోసం చేస్తున్నారు -
బాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజొస్తుంది
చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుందని, ఈయన పాలనకు చరమగీతం పలికే రోజు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం గుంటూరు సమీపంలోని నల్లపాడు రోడ్డులో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరంలో బుధవారం మధ్యాహ్నం ఆయన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే... గుంటూర్.. ఈవాళ ఈ నిరవధిక దీక్షకు ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఈ పోరాటంలో సంఘీభావం తెలిపేందుకు తోడుగా మేమంతా ఉన్నామంటూ సంకేతాలివ్వడం కోసం కష్టం అనిపించినా, ఎండను కూడా ఖాతరు చేయకుండా, దూరాలు లెక్క చేయకుండా, చెరగని చిరునవ్వులతో ఆప్యాయత చూపిస్తున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఈవాళ ప్రత్యేక హోదా విషయంగా నిరవధిక దీక్షలు చేస్తున్నాం. ఇంతకన్నా ముందు అందరం కలసికట్టుగా రాష్ట్రంలో బంద్ చేశాం అసెంబ్లీలో సైతం కేంద్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశాం మంగళగిరిలో దీక్ష చేశాం.. ఢిల్లీ వరకు ఈ పోరాటాన్ని తీసుకెళ్లాం. ఢిల్లీ వాళ్లకు అర్థం కావాలని అక్కడ సైతం దీక్షలు చేశాం. అయినా ఏ ఒక్కరికీ బుద్ధి రాలేదు. చివరకు ఈ పోరాటం కొనసాగింపులో భాగంగా గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష ఈరోజు ప్రారంభించాం. ఇప్పటికైనా చంద్రబాబుకు ఏం జరుగుతోందో తెలిసి వస్తుందని, ఆయన మనసు మారుతుందని, ఆయన మీద ఒత్తిడి తెస్తే.. ఆయన కేంద్రం మీద ఒత్తిడి తెస్తారని అప్పుడైనా మనకు ప్రత్యేక హోదా ఇస్తారన్న ఆశ. ఈవాళ ప్రత్యేక హోదా కోసం మనమంతా పోరాడుతున్నాం. ఒక్కోసారి నాకు అర్థం కాదు. చంద్రబాబుకు ఈ విషయం తెలిసినా, ఆయన ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడుతున్నారు, తర్వాత ప్లేటు ఎందుకు మారుస్తున్నారో తెలియట్లేదు అప్పుడు ఐదు కాదు, పదేళ్లు హోదా ఉండాలన్నారు. ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీటింగులలో చెప్పారు రాష్ట్రాన్ని విడగొట్టద్దని కోరితే వినలేదు ఆరోజు పార్లమెంటులో ఏంజరిగిందో గుర్తు తెచ్చుకుంటే.. అడ్డగోలుగా విడగొట్టారు నాటి ప్రధాని పార్లమెంటులో మైకు పట్టుకుని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతున్నాం, మీకు జరిగిన అన్యాయానికి పరిహారంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు హైదరాబాద్ లాంటి నగరం మనకు లేకపోతే.. చదువుకున్న ప్రతి పిల్లాడు పట్టాతో ఉద్యోగం కోసం వెళ్లేది హైదరాబాద్ నగరానికే అని అందరికీ తెలుసు 95 శాతం సాఫ్ట్ వేర్ పరిశ్రమలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని అందరికీ తెలుసు ఇలాంటి అన్యాయం జరుగుతోంది, జరగబోతోందని.. దానికోసం ప్రత్యేక హోదాతో ఈ అన్యాయాన్ని పూడుస్తామన్నారు ఆరోజు ప్రధాని ఆ హామీ ఇస్తే, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, బాబు ఐదు కాదు.. పదేళ్లు చేస్తామన్నారు చివరకు ఇద్దరూ కలిసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టారు. ఎన్నికలకు వెళ్లారు.. ఎన్నికల్లో మేనిఫెస్టోలు కూడా తయారుచేశారు. అందులో కూడా పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని పెట్టారు ఏ టీవీలో చూసినా అదే ప్రకటన కనిపించేది అంతటితో ఆగలేదు..ఇంటింటికీ పాంప్లెట్లు తీసుకెళ్లారు. ఏ టీవీ ఆన్ చేసినా జాబు కావాలంటే బాబు సీఎం కావాలని వినిపించేది ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2 వేల భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లున్నాయి. బాబుకు సీఎం జాబ్ వచ్చింది.. మాకేమో ఉన్న జాబులు కూడా పీకేస్తున్నారని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు బాబు ముఖ్యమంత్రి అయ్యారు.. ఒక్క కొత్త ఉద్యోగమూ ఇవ్వలేదు, ఉన్నవి ఊడబీకుతున్నారు రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలున్నాయని విభజించేటప్పుడు లెక్క చూపించారు. డీఎస్సీ పరీక్షలు రాసి ఏడాది దాటినా ఇంతవరకు వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వలేదు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్కూళ్లను, హాస్టళ్లను తగ్గించేస్తున్నారు. మిగులు ఉద్యోగాలు వేల సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నారు.. అంటే, డీఎస్సీ పరీక్షలు రాసిన పిల్లలకు ఎగనామం పెడతామన్న సంకేతాలిస్తున్నారు ఏపీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు పెడతారోనని పిల్లలు ఎదురుచూస్తున్నారు. వాటికోసం జిల్లాల నుంచి పెద్ద ఊళ్లకు వచ్చి, అక్కడ కష్టం అనిపించినా బాడుగకు ఇళ్లు తీసుకుని కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఏళ్ల తరబడి కోచింగులు తీసుకుంటున్నారు ఇంతవరకు ఆ పిల్లలకు ఏపీపీఎస్సీ పరీక్షలు పెట్టలేదు, నోటిఫికేషన్లు ఇవ్వలేదు, కనీసం క్యాలెండర్ కూడా ప్రకటించలేదు కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన చేస్తున్న వాళ్ల ఉద్యోగాలు లెఫ్ట్, రైట్, సెంటర్ ... ఇలా ఊడబెరుకుతున్నారు 30 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 30 వేల మంది ఆదర్శ రైతులను ఇప్పటికే పీకేశారు. మిగిలినవాళ్లు కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు 40 వేల మంది సంఘమిత్రలు ఉన్నారు.. బాబు సీఎం కాకముందు వాళ్లు రెగ్యులరైజ్ అవుతారనుకున్నారు. అంతకుముందు 4 వేలు వచ్చేది.. దాన్ని 2 వేలకు కోసేశారు పిల్లలు ఉద్యోగాలు దొరక్క, చదివే పిల్లలు కూడా భవిష్యత్తు కోసం సతమతం అవుతున్నారు దాదాపు మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావేమోనని, చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురాడేమో అని భయంతో బెంగతో రాష్ట్రంలో ఐదుగురు చనిపోయారు. నెల్లూరులో లక్ష్మయ్య, తిరుపతిలో కోటి, లోకేశ్వరరావు కర్నూలులో, రామయ్య నెల్లూరులో.. ప్రాణాలు కోల్పోయారు. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి, దానివల్ల కలిగే మేలేంటో చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలుసో, తెలియదో నాకు తెలీదు. తెలిసి ఉంటే చంద్రబాబు కాలర్ ఎందుకు పట్టుకోలేదని అడుగుతున్నాను ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. దానివల్ల ప్రధానంగా రెండు మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఒకటి.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటుగా ఇస్తారు. 10 శాతం మాత్రమే రుణం అవుతుంది. ప్రత్యేక హోదా లేకపోతే గ్రాంటు 30 శాతమే అవుతుంది, రుణం 70 శాతం అవుతుంది. దానివల్ల రాష్ట్రానికి అప్పులు తగ్గుతాయి. ఇవన్నీ వాళ్లకు తెలుసు. చట్ట ప్రకారం మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రోరైళ్లు, ఇంకా రకరకాల సంస్థలు కట్టిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. హంద్రీ నీవా, గాలేరు- నగరి, వెలిగొండ అన్నీ చట్టంలో పెట్టారు. ఈ మూడు నాలుగు ప్రాజెక్టులకే కనీసం 10వేల కోట్లవుతుంది. చట్టంలో పెట్టారు కదా అని ఏఐబీపీలో పెట్టిస్తే.. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి ఇందులో 90 శాతం గ్రాంటుగా వస్తుంది. అదే ప్రత్యేక హోదా లేకపోతే ఏఐబీపీలో పెట్టినా 25-55 శాతం లోపే గ్రాంటు వస్తుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. రాష్ట్రానికి జరిగే ఇంకో మేలు.. మెట్రో రైళ్లు కట్టిస్తామన్నారు. ఉజ్జాయింపుగా ఈ ప్రాజెక్టులకు 15 వేల కోట్లు అవుతుందని లెక్క వేసుకున్నారు. ఇవి తేవడానికి జపాన్, సింగపూర్ వెళ్లి అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకునే కార్యక్రమం చేస్తున్నారు. అలా చేస్తే ఆ డబ్బులు ఎలాగూ ఈ ప్రాజెక్టులు మన చట్టంలో ఉన్నాయి కాబట్టి ఆ డబ్బు విదేశాల నుంచి తెచ్చుకున్నా కేంద్రం మనకు ఇస్తుంది. ప్రత్యేక హోదా ఉంటే ఆ డబ్బును కేంద్రమే కడుతుంది, వడ్డీలు కూడా కట్టక్కర్లేదు అదే హోదా లేకపోతే.. విదేశాల నుంచి తెచ్చే డబ్బులు, వడ్డీ కూడా మనమే కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ చంద్రబాబుకు తెలియనిది కాదు.. అయినా అలాగే మాట్లాడతారు ఇక రెండోది.. మనందరికీ సంబంధించిన మేలు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలైతే మాత్రమే పరిశ్రమలకు రాయితీలు భారీగా వస్తాయి. మన రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమ పెడితే, ప్రత్యేక హోదా ఉంటే వాటికి 100 శాతం ఆదాయపన్ను, ఎక్సైజ్ డ్యూటీ, రవాణా ఖర్చులు అన్నీ మినహాయింపు ఉంటాయి. కరెంటు సగం ధరకే 20 ఏళ్ల పాటు లభ్యమవుతుంది ఇలాంటి భారీ ప్రోత్సాహకాలుంటే పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తారు. పక్క రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా వస్తారు 972 కిలోమీటర్ల సముద్ర తీరం మనకుంది. లక్షల కోట్ల పెట్టుబడులతో పిల్లలకు లక్షల ఉద్యోగాలు వస్తాయి ఇలాంటి ప్రోత్సాహకాలు కేవలం ప్రత్యేక హోదా ఉంటేనే వస్తాయి. అప్పుడు ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందన్నది మనం మర్చిపోకూడదు. చంద్రబాబు ఉద్యోగాలు ఇవ్వరు, నిరుద్యోగ భృతి ఇవ్వరు. కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా తెస్తే.. పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయంటే అదీ చేయరు ప్రత్యేక హోదా వస్తే నో వేకెన్సీ బోర్డులు ఎక్కడా కనిపించవు.. వాంటెడ్ అనే బోర్డులు కనిపిస్తాయి. అప్పుడు మనమే కంపెనీలను ఎంచుకోవచ్చు చంద్రబాబు ఇవన్నీ పట్టించుకోరు.. ఇంత మంచి జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు పోరాటం చేయరని ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకో తెలుసా.. ఈమధ్య కాలంలో మనమంతా టీవీలలో చూశాం. చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో లంచాలు తీసుకుని ఆ లంచాల ద్వారా తీసుకున్న డబ్బులతో పట్టిసీమ దగ్గర్నుంచి పోలవరం దాకా లంచాలే. బొగ్గు నుంచి ఇసుక, మట్టి వరకు అన్నీ లంచాలే. చివరకు మద్యాన్ని తగ్గిస్తామని.. దాన్ని పెంచేందుకు లైసెన్సుల కోసం కూడా లంచాలే ఈ లంచాల డబ్బును ఏం చేయాలోతెలియక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యేకు 5 నుంచి 20 కోట్ల వరకు వెచ్చించి కొనడానికి ప్రయత్నించి అడ్డంగా వీడియో, ఆడియోలలో దొరికిపోయారు ఆ టేపులు వింటే మనకంతా వినిపిస్తుంది.. 'మనోళ్లు దే బ్రీఫ్డ్ మీ ' అని వినిపిస్తుంది. ఆ మాటలు విని ఎంత గొప్ప ఇంగ్లీషు మాట్లాడాడో మన ముఖ్యమంత్రి అని అంతా అన్నారు ఆ కేసు నుంచి తప్పించుకోడానికి కేంద్రం దగ్గర మొరపెట్టుకుని.. ప్రత్యేక హోదాను పక్కన పెట్టి కేంద్రంతో లాలూచీ పడ్డారు. చంద్రబాబు తనమీద కేసులు రాకూడదని దిగజారిపోయారు ఆయనకు కూడా ఇది అర్థం కావాలి. కేసులు పెట్టడం కాదు.. ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్లమీద కేసులు పెడతారు. నామీద కూడా కేసులు పెట్టారు అధికారంలో ఉన్న సోనియాతో కుమ్మక్కై, కిరణ్ ప్రభుత్వాన్ని రక్షించి ఇద్దరూ ఒకటై నామీద కేసులు పెట్టారు. అప్పుడు రాజశేఖరరెడ్డి బతికున్నంత వరకు జగన్ మంచోడే, రాజశేఖరరెడ్డి మంచోడే జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టగానే రాజశేఖరరెడ్డి మంచోడు కాకుండా పోయాడు రాజకీయంగా నన్ను అణగదొక్కేందుకు ఈ చంద్రబాబు చీకటిలో చిదంబరాన్ని కలిసి నామీద కేసులు పెట్టారు అయినా నేను భయపడలేదు.. రాష్ట్రాన్ని విడగొట్టొద్దని గట్టిగా నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడుతున్నా ఆరోజు నేను భయపడలేదు. కారణం ఏమిటంటే.. వాళ్లు కేసులు పెట్టగలరు గానీ, తలరాతలు రాసేది పైనున్న దేవుడని ఎవరూ మర్చిపోకూడదు చంద్రబాబు పైనున్న దేవుడిని నమ్ముకోకుండా... ప్రధాని కాళ్లు పట్టుకుంటున్నారు హోదా ఇవ్వకపోగా దానిమీద అనేక అబద్ధాలు చెబుతున్నారు తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిసా ఒప్పుకోవడం లేదని ఇప్పుడు చెబుతున్నారు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిసా లేవా.. అని అడుగుతున్నా ఆరోజు ఆరాష్ట్రాలన్నీ ఉండగానే మన రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఇప్పుడెందుకు ప్లేటు మారుస్తున్నారు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదని ఇప్పుడు చెబుతున్నారు అసలు ప్రత్యేక హోదా ఇవ్వాలా లేదా అనే అంశం 14వ ఆర్థిక సంఘం పరిధిలో లేదు దేశం మొత్తంమీద వసూలైన పన్నుల మొత్తాన్ని రాష్ట్రాల మధ్య ఎలా పంచాలో మాత్రమే ఆర్థిక సంఘం చూస్తుంది అది కాక.. నాన్ ప్లాన్ గ్రాంటులు, రుణాల విషయం మాట్లాడుతుంది ప్రత్యేక హోదా అంశం నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్, ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్, కేంద్ర మంత్రివర్గం పరిధిలోనిది. వీటన్నింటికీ ప్రధానమంత్రే అధ్యక్షుడు. అలాంటి ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటే ఎందుకు హోదా రాదని అడుగుతున్నాను ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు వాజ్ పేయి ఒక్క సంతకంతో రాష్ట్రం ఇచ్చేశారు. తర్వాత ప్లానింగ్ కమిషన్కు పంపారు. 2014 మార్చి 2న అప్పటి ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ కలిసి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.. ఇప్పటికి ఆ ఉత్తర్వులు ఇచ్చి 19 నెలలు అయిపోయింది. ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు డిసెంబర్లో మోదీ గారు ప్లానింగ్ కమిషన్ను రద్దు చేశారు. అంటే ప్రధాని అయిన తర్వాత కూడా 7 నెలలు ఆ ఫైలు పెండింగులో పడి ఉంది కేంద్ర కేబినెట్ నిర్ణయమని తెలిసి కూడా ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నావని చంద్రబాబును నిలదీస్తున్నా అడగాల్సింది మనం... ఇవ్వాల్సింది వాళ్లు. మనం ఏం చేయాలంటే చంద్రబాబు మీద ఒత్తిడి తేవాలి కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకుంటానని చంద్రబాబు అల్టిమేటం ఇస్తే ఆరోజు ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని చెబుతున్నా. ఆ మాట చెప్పిన 24 గంటల్లో తాను జైలుకు పోతానేమోనని ఈయన భయపడుతున్నాడు కానీ మనం ఈ పోరాటం ఆపకూడదు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు జరిగే మేలేంటో చూద్దాం హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే.. ప్రత్యేక హోదా వల్ల 30వేల కోట్ల పెట్టుబడులు వచ్చి 130 శాతం అధికంగా పరిశ్రమలు, 490 శాతం అధికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. ప్రత్యేక హోదా వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకోసం ఎంతవరకైనా పోరాడేందుకు నేను సిద్ధం చంద్రబాబు పాలన మోసం, మోసం, మోసం, వెన్నుపోటు. అంతే! ఎన్నికలకు ముందు బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పాడా లేదా? మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా? మోసం చేశాడు.. డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పాడా లేదా? డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అయ్యాయా? మోసం.. బాబు వస్తేనే జాబు వస్తుందని చెప్పాడా లేదా? మరి జాబు వచ్చిందా..? పోనీ 2 వేల నిరుద్యోగ భృతి వచ్చిందా? ఏవీ రాలేదు. చివరకు పింఛన్లు కూడా కొంతమందికి ఇస్తారు, ఎక్కువ మందికి ఎగ్గొడతారు ఇళ్లు కట్టించడం కాదుకదా, కట్టిన వాటికి బిల్లులు కూడా ఇవ్వడంలేదు. ఈ పాలనకు చరమగీతం పలికే రోజులు రావాలి. ఈ పాలన బంగాళాఖాతంలో కలిసే రోజు వస్తుంది మనమంతా కలిసి కట్టుగా పోరాడదాం. చంద్రబాబే కాదు.. ఆయన నాయన మనసు కూడా మారుతుంది ఈయన అల్టిమేటం ఇస్తారు, కేంద్రం కూడా దిగివస్తుందని చెబుతున్నా మీరంతా ఇక్కడికొచ్చి సంఘీభావం చెబుతున్నందుకు పేరుపేరునా హృదయపూర్వంగా నమస్కారాలు. -
ప్రాణం పోయేంతవరకూ దీక్ష కొనసాగిస్తా
-
ప్రాణం పోయేంతవరకూ దీక్ష కొనసాగిస్తా: శివాజీ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై నిరాహార దీక్ష చేస్తున్న నటుడు శివాజీ ...భారతీయ జనతా పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పనిలో పనిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని శివాజీ ఈ సందర్భంగా ఆరోపించారు. ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్నారు. ఢిల్లీ ప్రజలు కుళ్లుకునేలా ఏపీకి అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానంటూ మోదీ మోసం చేశారన్నారు. ఏపీలో టీడీపీ, వైఎస్ఆర్ సీపీని చీల్చి బీజేపీని బలోపేతం చేయాలని చూస్తున్నారని శివాజీ వ్యాఖ్యానించారు. అయితే ప్రత్యేక హోదా ఇస్తే తప్ప బీజేపీ ఏపీ ప్రజలు ఆదరించన్నారు. తన ప్రాణం పోయేంతవరకూ దీక్ష కొనసాగుతుందని శివాజీ స్పష్టం చేశారు. కాగా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శివాజీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటికి మూడో రోజుకు చేరింది. -
నటుడు శివాజీ దీక్ష విరమించాలి
గుంటూరు : ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని నటుడు శివాజీ దీక్ష విరమించాలని మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు కోరారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, అందుకు అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ శివాజీ ఆదివారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహర దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన దీక్ష సోమవారానికి రెండోరోజుకు చేరింది. -
యువత భవిత కోసమే శివాజీ ఆమరణ దీక్ష
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ సినీ నటుడు శివాజీ ఆదివారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహర దీక్షను చేపట్టారు. శివాజీ చేపట్టిన దీక్షకు మాల మహనాడు, గిరిజన సమాఖ్య విద్యార్థి నేతలతోపాటు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. శివాజీ చేపట్టిన దీక్ష స్థలి వద్దకు స్థానికులతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర విభజన జరిగి ఏడాదైనా ఇప్పటి వరకు ఆంధ్ర్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను ప్రకటించలేదు. అదికాక ప్రత్యేక హోదా సాథ్యం కాదంటూ పలువురు మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో శివాజీ ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకు దిగారు. -
యువత భవిత కోసమే దీక్ష: నటుడు శివాజీ
గుంటూరు: రాష్ట్ర యువత భవితే లక్ష్యంగా ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపడుతున్నట్టు సినీనటుడు శివాజీ తెలిపారు. ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ 48 గంటల దీక్షను ఆయన గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆదివారం ప్రారంభించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ శివాజీ మెడలో పూల మాలవేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉద్యమంలో కలసి రావాలని కోరారు. తాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చానని, ఆంధ్ర ప్రేక్షకుల అభిమానంతోనే ఇంతటి వాడినయ్యానని ఆ రుణం తీర్చుకోవటానికే ఈ ఉద్యమం చేపట్టానని చెప్పారు. ఎన్నికల సమయంలో పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించిన బీజేపీ జాతీయ నాయకులు నేడు లేనిపోని సాకులు చూపించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం దీనిపై నోరుమెదపకపోవడం దారుణమని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందన్న టీడీపీ నాయకులు నేడు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు విదేశాలు తిరుగుతున్నారని... అక్కడి వారు రాయితీలు కోరుతున్నారనీ, ప్రత్యేక హోదా లేకుండా రాయితీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాను ఈ ఉద్యమం చేస్తున్నందుకు బీజేపీ తనను బహిష్కరించినా సంతోషమేనని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ మిజోరాం, అసోం, జార్ఖండ్ రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన ప్రత్యేక హోదా కల్పించారో ఆ అర్హతలన్నీ మన రాష్ట్రానికి ఉన్నాయన్నారు. శివాజీ ప్రాణాలు పోకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. దీక్షకు మాలమహానాడు, అమ్ఆద్మీ పార్టీ, యువజన కాంగ్రెస్, నవతరం పార్టీ నాయకులు, పలువురు విద్యార్థులు మద్దతు తెలిపారు. -
ఫలించని జానా దౌత్యం
వనపర్తి: వనపర్తిని జిల్లాగా ప్రకటిం చాలని మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి దీక్షను విరమించజేసేందుకు సీఎల్పీ నేత జానారెడ్డి చేసిన ప్రయత్నం ఫలించలేదు. సోమవారం హైదరాబాద్లో జానారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రెడ్డితో చిన్నారెడ్డి దీక్ష విషయం చర్చించిన అనంతరం ఆయన రాత్రి వనపర్తికి వచ్చారు. చిన్నారెడ్డిని పరామర్శించి ఆయనతో మాట్లాడుతూ ప్రస్తుతానికి దీక్ష విరమించాలని.. అసెంబ్లీ వేదికగా వనపర్తి జిల్లా కోసం పోరాటం సాగిద్దామని చెప్పారు. తాను సీఎంతో మాట్లాడానని.. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పరిశీలిస్తామని సీఎం చెప్పారని వివరించారు. అయితే, దీక్ష విరమణకు చిన్నారెడ్డి ఒప్పుకోలేదు. వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నేరుగా ప్రకటించే వరకు దీక్షను కొనసాగిస్తానని చిన్నారెడ్డి చెప్పారు. జానారెడ్డి మాట్లాడుతూ చిన్నారెడ్డికి వనపర్తి ప్రజల ఆకాంక్ష అత్యంత ముఖ్యమే అయినా.. ఆయన జాతీయస్థాయిలో కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పని చేస్తున్నారని.. ఆయన సేవలను మిగతా అంశాల్లో వినియోగించుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చి ఉంటే రెండు నిమిషాల్లో వనపర్తిని జిల్లాగా చేసేవారమని జానారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ అన్నం పెడ్డితే.. తమ పార్టీకి ఇక్కడి ప్రజలు సున్నం పెట్టారని అన్నారు. పదవులు పోగోట్టుకుని పార్టీని ఫణంగా పెట్టి ఆనాడు తాము తెలంగాణ తెచ్చే విషయంలో సోనియాగాంధీని ఒప్పించామన్నారు. తాము పడిన కష్టాన్ని ఓటర్లు గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆమరణ నిరాహార దీక్ష కు మద్దతిచ్చిన అఖిలపక్షాలతో చర్చించిన అనంతరం వారు దీక్ష కొనసాగింపునకే మొగ్గు చూపడంతో దీక్షను విరమించేది లేదని చిన్నారెడ్డి తెగేసి చెప్పారు. దీంతో జానారెడ్డి ఆయన వెంట వచ్చిన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్లు వెనుదిరిగారు. -
అర్ధరాత్రి హైడ్రామా..!
వనపర్తి టౌన్: వనపర్తిని జిల్లాగా ఏర్పా టు చేయూలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో అర్థరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. తన దీక్షను భగ్నం చేసి, ఆసుపత్రికి తరలించేందుకు ఆదివారం అర్ధరాత్రి పోలీసులు ప్రయత్నాలు చేపట్టడంతో వారి రాకను ముందే పసిగట్టిన ఆయన హటాత్తుగా ఇంట్లోకి వెళ్లి గేటుకు తాళం వేసుకుని అక్కడే దీక్ష ను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మార్గమధ్యమంలో జరి గిన తోపులాటలో చిన్నారెడ్డి కింద పడిపోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రాపిడ్ యాక్షన్ బలగాలను రంగంలోకి దింపారు. అరుుతే కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు చిన్నారెడ్డి ఇంటి ఎదుటే డీఎస్పీ చెన్నయ్య, సీఐ మధుసూదన్రెడ్డిలను అడ్డుకున్నారు. తామె ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు మాత్రమే వచ్చామని చెప్పడం తో ఆయన లోపలినుంచే వారితో మాట్లాడారు. తాను దీక్ష చేపట్టి రెండు రోజులు కూడా కాలేదని, తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. మీ ఆరోగ్యం క్షీణిం చిందని డాక్టర్లు చెప్పినందునే తాము వ చ్చినట్లు డీఎస్పీ చెప్పినా ఆయన విని పించుకోకుండా దీక్షను కొనసాగించారు. పోలీసులు మొండిగా వ్యవహరిస్తే ఆత్మార్పన చేసుకుంటామని కార్యకర్తలు హెచ్చరించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. సోమవారం ఉదయం 6 గంటలకు ఆయ న దీక్ష స్థలికి వచ్చి దీక్షలో కూర్చున్నారు. హామీ ఇచ్చారు..అమలు చేయూల్సిందే...! వనపర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో మెుదటివిడతలో నే వనపర్తి జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లుగానే జిల్లాను ఏర్పాటు చేయూలని జి.చిన్నారెడ్డి అన్నారు. చిన్నారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం మూడో రోజు కొనసాగింది. ఆయన మాట్లాడుతూ తన దీక్షను భగ్నం చేసేందుకు ఆదివారం రాత్రి అధికారులు విఫలయత్నం చేయడం మంచి పద్దతి కాదన్నారు. వనపర్తికి చారిత్రక ప్రాధాన్యత ఉన్నదని, భౌగోళికంగానూ జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. నిలకడగా చిన్నారెడ్డి ఆరోగ్యం... చిన్నారెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. సాయంత్రం ఆయనకు బీపీ, షుగర్ పరీక్షలను నిర్వహించగా, బీపీ 138 నమోదు కాగా, షుగర్ 102గా నమోదైంది.