ఎఫ్‌సీఐలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు | Management Trainee posts in FCI | Sakshi
Sakshi News home page

ఎఫ్‌సీఐలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

Published Thu, Jun 18 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

ఫుడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐ) వివిధ జోన్లలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఫుడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐ) వివిధ జోన్లలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 349 ఖాళీలతో విడుదలైన ప్రకటనలో సౌత్‌జోన్‌లోనే 113 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్ష బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్ష తరహాలో ఉన్నందున బ్యాంకు పరీక్షలకు సిద్ధమౌతున్న వారికి ఇది సదవకాశం.
 
 మొత్తం పోస్టులు: మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్, డిపో, అకౌంట్స్, మూవ్‌మెంట్, ఎలక్ట్రికల్, టెక్నికల్)-349
 అర్హత: మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్, డిపో, మూవ్‌మెంట్): 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు) లేదా సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్మేనేజ్‌మెంట్ ట్రైనీ (అకౌంట్స్): సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతోపాటు ఎంబీఏ(ఫైనాన్స్)/డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.మేనేజ్‌మెంట్ ట్రైనీ(టెక్నికల్/ఎలక్ట్రికల్ / మెకానికల్ /సివిల్ ఇంజనీరింగ్): సంబంధిత విభాగంలో డిగ్రీ వయసు: 2015 ఆగస్టు 1 నాటికి 28 ఏళ్లు మించరాదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు ఉంది.
 
 ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, బృంద చర్చ, ఇంటర్వ్యూలు ఉంటాయి.రాతపరీక్ష: మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్, డిపో, మూవ్‌మెంట్) పోస్టులకు జనరల్ ఆప్టిట్యూడ్ పక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే 120 ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ఈ పరీక్షలో రీజనింగ్, డేటా అనాలసిస్, కంప్యూటర్ అవేర్‌నెస్, జనరల్ అవేర్‌నెస్, మేనేజ్‌మెంట్, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.అకౌంట్స్, టెక్నికల్/ఎలక్ట్రికల్/మెకానికల్/సివిల్ ఇంజనీరింగ్ పోస్టులకు జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్షతోపాటు మరో పరీక్ష ఉంటుంది. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ విదానంలో 120 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి ఒక జోన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు: దరఖాస్తు ఫీజు రూ. 600. ఎస్సీ, ఎస్టీలు, పీడబ్ల్యూడీ, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. ఎస్‌బీఐ ఇంటర్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అన్ని నేషనల్ బ్యాంకుల ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
 
 ముఖ్యతేదీలు:
 దరఖాస్తులు ప్రారంభం: జూన్ 2, 2015.
 దరఖాస్తులకు చివరితేదీ: జూలై2, 2015.
 వెబ్‌సైట్:
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement