Bhavitha
-
నీట్ కౌన్సెలింగ్.. ఇలా!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా నీట్–యూజీ! దేశ వ్యాప్తంగా.. ఎంబీబీఎస్, బీడీఎస్తోపాటు ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష! కొద్దిరోజుల క్రితమే నీట్ యూజీ–2024 ఫలితాలు వెల్లడయ్యాయి. మరోవైపు ఈ పరీక్షపై వివాదం కొనసాగుతున్నా.. నీట్ కౌన్సెలింగ్కు సన్నాహాలు మొదలయ్యాయనే వార్తలు! ఈ నేపథ్యంలో నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా సీట్ల భర్తీ విధానం.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సీట్ల భర్తీ తీరు, నీట్ ర్యాంకర్లు కౌన్సెలింగ్కు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు తదితర అంశాలపై విశ్లేషణ..‘నీట్ యూజీ–2024 ఫలితాలపై ఆందోళనలు జరుగుతున్నా.. మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశాలు తక్కువే. కాబట్టి నీట్ ఉత్తీర్ణులు ఫలితాలపై వస్తున్న వార్తల జోలికి వెళ్లకుండా.. కౌన్సెలింగ్కు సిద్ధమవ్వాలి’ అంటున్నారు నిపుణులు. పెరుగుతున్న సీట్లు⇒ నేషనల్ మెడికల్ కమిషన్ గణాంకాల ప్రకారం–దేశ వ్యాప్తంగా మొత్తం 783 ఎంబీబీఎస్ కళాశాలల్లో 1,61,220 సీట్లు ఉన్నాయి. వీటిలో 331 ప్రైవేట్ కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఉండగా.. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 74,703. అదేవిధంగా నీట్ స్కోర్తోనే భర్తీ చేసే బీడీఎస్ కోర్సులో 28,088 సీట్లు, ఆయుష్ కోర్సుల్లో 52,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ⇒ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో.. ప్రస్తుతం 16 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,935 ఎంబీబీఎస్ సీట్లు; మరో 16 ప్రైవేట్ కళాశాలల్లో 2,850 సీట్లు ఉన్నాయి. రెండు మైనారిటీ కళాశాలల్లో 300 సీట్లు; స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. బీడీఎస్కు సంబంధించి.. రెండు ప్రభుత్వ డెంటల్ కళాశాలల్లో 140 సీట్లు; 14 ప్రైవేట్ కళాశాలల్లో 1,300 సీట్లు చొప్పున ఉన్నాయి.⇒ తెలంగాణ రాష్ట్రంలో.. ఎంబీబీఎస్కు సంబంధించి 27 ప్రభుత్వ కళాశాలల్లో 3,790 సీట్లు; 29 ప్రైవేట్, మైనారిటీ కళాశాల్లో 4,700 సీట్లు ఉన్నాయి. బీడీఎస్కు సంబంధించి ఒక ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లు; పది ప్రైవేట్ కళాశాలల్లో 1,000 సీట్లు; వీటికి అదనంగా సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కళాశాలలో ఆరు సీట్లు ఉన్నాయి.పేరున్న కళాశాలలో సీటుప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఆల్ ఇండియా స్థాయిలో రిజర్వ్డ్ కేటగిరీలో రెండు లక్షల వరకు ర్యాంకు వరకూ సీట్లు పొందే అవకాశముందని అంచనా. పేరున్న ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు సొంతం చేసుకోవాలంటే మాత్రం జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకుతోనే సాధ్యమని చెబుతున్నారు.కౌన్సెలింగ్.. ఏఐక్యూ, స్టేట్ కోటానీట్ యూజీ కౌన్సెలింగ్ను రెండు విధానాల్లో నిర్వహించి సీట్ల భర్తీ చేపడతారు. అవి.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. రాష్ట్ర కోటాకు సంబంధించి.. రాష్ట్రాల వైద్య విశ్వ విద్యాలయాలు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.ఆల్ ఇండియా కోటాజాతీయ స్థాయిలోని మెడికల్ కళాశాలలను నేషనల్ పూల్లోకి తీసుకెళ్లినప్పటì æనుంచి ఆల్ ఇండియా కోటా పేరుతో కౌన్సెలింగ్ను నిర్వహిస్తున్నారు. ఈ విధానం ప్రకారం.. జాతీయ స్థాయిలోని అన్ని మెడికల్, డెంటల్ కళాశాలలు, యూనివర్సిటీల్లోని 15 శాతం సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ చేపడుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఎంసీసీ నిర్వహించే కౌన్సెలింగ్కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటా విధానంలో ఒక రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లోని వైద్య కళాశాలలకు కూడా పోటీ పడే అవకాశం లభిస్తుంది.స్టేట్ కోటా కౌన్సెలింగ్జాతీయ స్థాయిలో ఎంసీసీ కేవలం 15 శాతం సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. మిగతా 85 సీట్లను ఆయా రాష్ట్రాలు సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 85 శాతం సీట్లు(ఆల్ ఇండియా కోటాకు కేటాయించాక మిగిలిన సీట్లు), ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా పేరుతో అందుబాటులో ఉండే 50 శాతం సీట్లను.. అదే విధంగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రైవేట్–బి పేరిట ఉండే 35 శాతం సీట్లు, ఎన్ఆర్ఐ కోటాగా పిలిచే 15 శాతం సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీలే కౌన్సెలింగ్ విధానంలో భర్తీ చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉండే సీట్లను కూడా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియను కూడా హెల్త్ యూనివర్సిటీలే చేపడతాయి.ఫీజులు ఇలా⇒ ఏపీలో ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ పేరిట ఉండే కన్వీనర్ కోటాలో రూ.15 వేలు ఫీజుగా నిర్ధారించారు. ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కేటగిరీ–బి సీటుకు రూ.12 లక్షలు; పైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(కేటగిరీ–సి) సీట్లకు: రూ.36 లక్షలుగా పేర్కొన్నారు. బీడీఎస్ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ కన్వీనర్ కోటా సీట్లకు ఫీజు రూ.13 వేలు; ప్రైవేట్ కళాశాలల్లోని కేటగిరీ–బి మేనేజ్మెంట్ సీట్లకు రూ.4 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు రూ.12 లక్షలు వార్షిక ఫీజుగా ఉంది. ⇒ తెలంగాణలో ప్రభుత్వ కళాశాలల్లో సీటుకు రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటుకు రూ.60 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీటుకు రూ.11.55 లక్షలు–రూ.13 లక్షలుగా ఫీజు ఉంది. అదే విధంగా.. ప్రైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(సి–కేటగిరీ) సీటు ఫీజు బి కేటగిరీ సీటుకు రెండు రెట్లుగా ఉంది. బీడీఎస్ కోర్సులో.. ప్రభుత్వ కళాశాలల్లో రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో ఎ–కేటగిరీ(కన్వీనర్ కోటా) సీట్లు: రూ.45 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీట్లు: రూ.4.2 లక్షలు – రూ.5 లక్షలు చొప్పున ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో సి–కేటగిరీ(ఎన్ఆర్ఐ కోటా) సీటుకు బి కేటగిరీ సీటుకు 1.25 రెట్లు సమానమైన మొత్తం ఫీజుగా ఉంది. ⇒ ఈ ఫీజుల వివరాలు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించినవిగా గుర్తించాలి. కౌన్సెలింగ్ సమయానికి వీటిలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.ఏఐక్యు.. కౌన్సెలింగ్ విధానమిదే⇒ విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాలి. జాతీయ స్థాయిలోని సీట్లకు పోటీ పడాలనుకునే విద్యార్థులు.. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించే ఆన్లైన్ కౌన్సెలింగ్కు హాజరు కావాలి. ఇందుకోసం ఎంసీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉండే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ను క్లిక్ చేసి.. ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్ అప్లికేషన్లో ఉండే అన్ని వివరాలను నమోదు చేయాలి. ⇒ ఆ తర్వాత అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలు కనిపిస్తాయి. వాటికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలను పేర్కొంటూ.. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత రౌండ్ల వారీగా సీట్ అలాట్మెంట్ వివరాలను వెల్లడిస్తారు. ⇒ తొలి రౌండ్లో సీట్ అలాట్మెంట్ పొందిన అభ్యర్థులు సదరు కళాశాలలో చేరాలనుకుంటే.. నిర్దేశిత మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ⇒ తొలి రౌండ్లో సీటు వచ్చిన కళాశాలలో చేరడం ఇష్టం లేకుంటే.. ఫ్రీ ఎగ్జిట్ అవకాశం అందుబాటులో ఉంది. వీరు రెండో రౌండ్ కౌన్సెలింగ్కు హాజరవ్వచ్చు. ⇒ తొలి రౌండ్ కౌన్సెలింగ్లోనే సీటు లభించి ఫీజు చెల్లించిన అభ్యర్థులు మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్కు హాజరయ్యే అవకాశం కూడా ఉంది.స్టేట్ కోటాకు ప్రత్యేక కౌన్సెలింగ్రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే స్టేట్ కోటా సీట్ల కౌన్సెలింగ్కు విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంసీసీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ముగిసిన తర్వాత హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఈ కౌన్సెలింగ్ కూడా పలు రౌండ్లలో జరుగుతుంది. స్టేట్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వారికి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ముందుగా ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ను ప్రకటిస్తారు. ఈ మెరిట్ లిస్ట్లో చోటు సాధించిన అభ్యర్థులు నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి.. ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది.పూర్తిగా ఆన్లైన్హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్దేశించిన వెబ్సైట్లో లాగిన్ ఐడీ, పాస్ట్వర్డ్ క్రియేట్ చేసుకోవడం, ఆ తర్వాత నీట్ ర్యాంకు సహా, ఇంటర్మీడియెట్ వరకూ.. అన్ని అర్హతల వివరాలను పేర్కొనడం, ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ తప్పనిసరి.ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యంనీట్లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏఎంసీ–విశాఖపట్నం, జీఎంసీ–గుంటూరు, కాకినాడ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కళాశాలలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. తెలంగాణలో.. ర్యాంకర్ల తొలి ప్రాధాన్యం ఉస్మానియా మెడికల్ కళాశాల కాగా ఆ తర్వాత స్థానంలో గాంధీ మెడికల్ కళాశాల, కాకతీయ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ మెడికల్ కళాశాల నిలుస్తున్నాయి.ఈ సర్టిఫికెట్లు సిద్ధంగానీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే కౌన్సెలింగ్కు అవసరమైన పత్రాలు, సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. అవి.. నీట్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డ్, నీట్ ర్యాంక్ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పదో తరగతి సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు మార్క్ షీట్, సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వర్టకు స్టడీ సర్టిఫికెట్స్(స్థానికతను నిర్ధారించేందుకు), పాస్పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్ ఎనిమిది. ఇలా కౌన్సెలింగ్ విధానంతోపాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకుంటే.. కౌన్సెలింగ్ ఎప్పుడు జరిగినా తడబాటులేకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. -
అంతులేని అభిమానం సీఎం జగన్ పై విశాఖ ప్రజలు పూల వర్షం
-
రోల్మోడల్ స్టేట్గా ఏపీ.. జగనన్నకు థ్యాంక్స్
సాక్షి, విశాఖపట్నం: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే ‘భవిత’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. పాలిటెక్నిక్ ఐటిఐ విద్యార్థులతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన యువత ఏమన్నారంటే.. వారి మాటల్లోనే మధ్య తరగతి కుటుంబం నుంచి.. అందరికీ నమస్కారం.. మాది విశాఖపట్నం పెదగంట్యాడ.. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను.. మా నాన్న ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్. అమ్మ గృహిణి. నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నేను నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్ రంగంలో స్ధిరపడాలని భావించాను. సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు నేర్చుకున్నాను. మాకు అక్కడ మంచి శిక్షణ ఇచ్చారు. మాకు టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్కు ఎన్నికయ్యాను. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ జరిగింది. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ఆ కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను. మా బ్యాచ్లో అనేకమంది వివిధ కంపెనీలకు సెలక్ట్ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, ఏపీ ప్రభుత్వానికి, స్కిల్ డెవలప్మెంట్కు సీడాప్కు అందరికీ కృతజ్ఞతలు. -దీపిక, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ, చెన్నై ఏడాదికి రూ.7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నా.. అందరికీ నమస్కారం.. నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశాను.. అప్పుడు ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. ఆ శిక్షణలో నేను చాలా నేర్చుకున్నాను. మెషిన్ ఆపరేటింగ్, సాప్ట్స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పారు. ఆ తర్వాత 2021లో ఏషియన్ పెయింట్స్ వారి ఇంటర్వ్యూకు హాజరయ్యాను, అందులో నేను ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఏడాదికి రూ.5 లక్షల ప్యాకేజ్లో సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ వన్గా ఏడాదికి రూ.7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎం గారికి నా కృతజ్ఞతలు. ఏపీ రోల్మోడల్ స్టేట్గా ఉందని నేను నమ్ముతున్నాను. నాలాగా మరింత మంది యువత ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ -భార్గవ్, విశాఖపట్నం ఇదీ చదవండి: ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్.. కేడర్కు గూస్ బంప్స్ -
స్కూల్ నుంచి కాలేజీల వరకు ఇవే అడుగులు వేస్తున్నాం: సీఎం జగన్
-
భవిత ప్రాముఖ్యత అందుకోసమే.. చదువుల్లో క్వాలిటీ పెంచుతున్నాం
-
చదువుకుంటూనే సంపాదించొచ్చు.. నెలకు రూ.15 వేల వరకు
పార్ట్ టైమ్ జాబ్స్.. కొన్నేళ్ల క్రితం వరకు విదేశాలకే పరిమితం. ఉన్నత విద్య కోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు పార్ట్టైమ్ జాబ్స్ చేస్తున్నట్లు చెప్పటం తెలిసిందే. ఇప్పుడు మన దేశంలోనూ పార్ట్టైమ్ కొలువుల కల్చర్ విస్తరిస్తోంది. ముఖ్యంగా డిజిటలైజేషన్, ఈ–కామర్స్ రంగాల విస్తరణ కారణంగా.. విద్యార్థులు చదువుకుంటూనే ఖాళీ సమయంలో కొన్ని గంటలు పనిచేసి కొంత ఆదాయం పొందేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. పార్ట్టైమ్ అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుకునేందుకు మార్గాలు, వేతనాలు తదితర వివరాలతో ప్రత్యేక కథనం.. మన దేశంలో ప్రస్తుతం పార్ట్ టైమ్ జాబ్స్ ట్రెండ్ మారుతోంది. గతంలో పార్ట్ టైమ్ జాబ్స్, ఫ్రీలాన్స్ జాబ్స్ అంటే ట్రాన్స్లేషన్స్, జర్నలిజం, ఫోటోగ్రఫీ వంటి వాటికే పరిమితం. కానీ..ప్రస్తుత కార్పొరేట్ యుగంలో..అన్ని రంగాల్లోనూ పార్ట్ టైమ్ ఉద్యోగాల సంస్కృతి పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సేవల రంగం మొదలు ఐటీ వరకూ.. పార్ట్ టైమ్ జాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. అఫ్లియేట్ మార్కెటింగ్ ఇటీవల పార్ట్ టైమ్ ఉద్యోగాల్లో వినిపిస్తున్న మాట.. అఫ్లియేట్ మార్కెటింగ్. సొంతంగా వెబ్సైట్ రూ΄÷ందించుకున్న వ్యక్తులు.. సదరు పోర్టల్లో ఇతర సంస్థలకు సంబంధించిన వెబ్ లింక్స్ను, ఉత్పత్తులను తమ వెబ్సైట్ వీక్షకులకు కనిపించేలా చేయడమే అఫ్లియేట్ మార్కెటింగ్. ఒక విధంగా చెప్పాలంటే.. తమ వెబ్సైట్ ద్వారా మరో సంస్థకు మార్కెటింగ్ చేయడాన్నే అఫ్లియేట్ మార్కెటింగ్గా పేర్కొనొచ్చు. ఈ పద్ధతిలో సంస్థలు సదరు వెబ్సైట్ నుంచి ఎక్స్టర్నల్ లింక్స్తో తమ ఉత్పత్తులను వీక్షించిన వారి సంఖ్య ఆధారంగా పారితోషికం చెల్లిస్తున్నాయి. ఈ విధానంలోనూ నెలకు రూ.20వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నాయి. డెలివరీ అసోసియేట్స్ డెలివరీ అసోసియేట్స్ అంటే.. సంస్థల ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేసే వారు. ఇవి ఎక్కువగా ఈ–కామర్స్, రిటెయిల్ రంగాల్లో లభిస్తున్నాయి. వీటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్హతగా ఆయా సంస్థలు నిర్దేశిస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు మొగ్గు చూపే యువత సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డెలివరీ డ్రైవర్స్, విష్ మాస్టర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనిపిస్తోంది. డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారని క్వికర్జాబ్స్ నివేదిక పేర్కొంది. వీరికి సగటున రూ.15వేలు లభిస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్/ఆఫ్లైన్ ట్యూటర్స్ పార్ట్ టైమ్ ఉపాధి పరంగా మరో చక్కటి అవకాశం..ట్యూటర్స్గా పని చేయడం. సబ్జెక్ట్ నాలెడ్జ్తో΄ాటు దాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. ప్రస్తుతం హోంట్యూటర్స్, ఆన్లైన్ ట్యుటోరియల్స్కు పప్రాధాన్యం పెరుగుతోంది. కాబట్టి వీరు ఆన్లైన్, పార్ట్టైమ్ విధానాల్లో నెలకు రూ.20వేల వరకు సంపాదించుకునే అవకాశముంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్లతో బీఎస్సీ, ఎమ్మెస్సీ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందడానికి ఇది చక్కటి మార్గం. ప్రస్తుతం ఎన్నో ఎడ్టెక్ స్టార్టప్ సంస్థలు ఆన్లైన్ ట్యాటర్స్కు స్వాగతం పలుకుతున్నాయి. కాపీ రైటర్ పార్ట్ టైమ్ జాబ్స్ విభాగంలో టాప్ లిస్టింగ్లో ఉన్న కొలువు.. కాపీ రైటర్. సోషల్ నెట్వర్క్ వెబ్సైట్స్లో ఒక సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్స్, సర్వీసెస్కు సంబంధించిన వివరాలను క్లుప్తంగా, ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా రాయడం కాపీ రైటర్ ప్రధాన విధి. ప్రస్తుతం పలు సంస్థలు ఆన్లైన్ విధానంలో కాపీ రైటర్స్ను నియమించుకుంటున్నాయి. తొలుత ఒక నమూనా కాపీని అడుగుతున్న సంస్థలు..దానికి మెచ్చితే పని చేసే అవకాశం ఇస్తున్నాయి. టైమ్ రేట్, పీస్ రేట్ ప్రతిపదికన రూ.800 నుంచి రూ.వేయి వరకు అందిస్తున్నాయి. డేటాఎంట్రీ టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ బేసిక్స్ ఉంటే.. ఆదాయం అందించే మరో పార్ట్ టైమ్ అవకాశం.. డేటాఎంట్రీ. బీపీఓ, కేపీఓ, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి సేవలు అందించే సంస్థలు తమ క్లయింట్లు పంపించే రికార్డ్లను ఎంట్రీ చేయడానికి శాశ్వత సిబ్బంది కంటే పార్ట్ టైమ్ లేదా ఆన్లైన్ విధానంలో నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. పీస్ రేట్, టైమ్ రేట్ విధానంలో పారితోషికం లభిస్తోంది. పీస్ రేట్ విధానంలో ఒక్కో పదానికి రూ.2 నుంచి రూ.5 వరకు పొందొచ్చు. టైమ్ రేట్ విధానంలో గంటకు రూ.300 నుంచి వేయి వరకు సంపాదించుకునే అవకాశముంది. యాడ్ పోస్టింగ్ ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడ్వర్టయిజ్మెంట్ రూపంలో తీర్చిదిద్ది కమర్షియల్ వెబ్సైట్స్లో పోస్ట్ చేయడమే..ఆన్లైన్ యాడ్ పోస్టింగ్. ఒక ఉత్పత్తికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన వివరణ, స్పెసిఫికేషన్స్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్ ఉంటే.. ఈ పార్ట్టైమ్ జాబ్లో రాణించొచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఆన్లైన్ యాడ్ పోస్టింగ్స్కు క్వికర్, ఓఎల్ఎక్స్ తదితర వెబ్సైట్స్ ప్రధాన ఆదాయ మార్గాలుగా నిలుస్తున్నాయి. ఒక్కో యాడ్కు రూ.100 నుంచి రూ.150 వరకు ముందే వీలుంది. ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్ ఫిజికల్గా ఫిట్గా ఉంటే ఆరోగ్య సమస్యలు రావనే ఆలోచనతో ఫిట్నెస్ కోసం మార్గాలను అన్వేసిస్తున్నారు. ఇది కూడా యువతకు పార్ట్ టైమ్ ఆదాయ వనరుగా నిలుస్తోంది.జిమ్లు,ఫిట్నెస్ సెంటర్స్లో ఉపయోగించే పద్ధతుల గురించి అవగాహన ఉండటం తప్పనిసరి.ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ఈ విభాగం సరితూగుతుందని చెప్పచ్చు. పార్ట్ టైమ్ విధానంలో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్గా రోజుకు రెండు,మూడు గంటల సమయం వెచ్చిస్తే రూ.500 వరకు సం΄ాదించొచ్చు. సేల్స్ అసోసియేట్ ప్రతి రోజు నిర్దిష్టంగా ఒక సమయంలో.. స్టోర్స్లో సేల్స్ విభాగంలో పని చేసే వ్యక్తులనే పార్ట్ టైమ్ సేల్స్ అసోసియేట్స్గా పిలుస్తున్నారు. విధుల పరంగా సదరు అవుట్లెట్లోని స్టాక్ వివరాలు నమోదు చేయడం, కస్టమర్లకు సహకరించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ.. ఏ కోర్సు చదువుతున్న వారైనా రిటెయిల్ సేల్స్ అసోసియేట్గా పార్ట్ టైమ్గా పని చేయొచ్చు. సగటున నెలకు రూ.15 వేలు సంపాదించే వీలుంది. క్యాబ్ డ్రైవర్స్ ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన మరో పార్ట్ టైమ్ ఆదాయ మార్గం.. క్యాబ్ డ్రైవర్స్గా పని చేయడం. ప్రస్తుతం పలు సంస్థలు ఆటోలు, క్యాబ్లు, టూ వీలర్ ద్వారా సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వారికి రైడర్స్ కొరత ఏర్పడుతోంది. దీంతో పార్ట్ టైమ్ అవకాశాలకు సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్తోపాటు, పదో తరగతి ఉండాలి. నెలకు రూ.15 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. సోషల్ మీడియా అసిస్టెంట్ ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు తమ సర్వీసులు, ఉత్పత్తులకు సంబంధించి సమాచారాన్ని సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయా సర్వీసులు, ప్రాడక్ట్లకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ తదితరాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రాయగలిగే నేర్పు ఉండాలి. సోషల్ మీడియా రైటింగ్పై అవగాహనతోపాటు,ఎస్ఈఓ, ఎస్ఈఎం, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి అంశాల్లో నైపుణ్యం అవసరం. వీరు సోషల్ మీడియా అసిస్టెంట్స్గా పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందొచ్చు. ఐటీ రంగంలోనూ ఐటీ రంగంలో సైతం పార్ట్ టైమ్ జాబ్స్ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధానంగా ప్రొగగ్రామర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, మొబైల్ యాప్ డెవలపర్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. టెక్నికల్ కోర్సులు చదువుతూ.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న వారు వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకున్న జాబ్ పప్రొఫైల్,పప్రాజెక్ట్ ఆధారంగా నెలకు రూ.20వేల వరకు ఆదాయం పొందే అవకాశముంది. ఆన్లైన్ కన్సల్టెంట్ ఇటీవల కాలంలో కనిపిస్తున్న సరికొత్త ధోరణి..ఆన్లైన్ కన్సల్టెంట్. కంపెనీల్లో ఉన్నత స్థాయి వ్యూహాలు మొదలు ప్రొగ్రామింగ్, కోడింగ్ వరకూ.. ఆన్లైన్ విధానం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. అందుకునే మార్గాలివే ప్రస్తుత టెక్ యుగంలో ఒక్క క్లిక్తో వందల ఉద్యోగాల సమాచారం అందించే వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో జాబ్ సెర్చ్ పొర్టల్స్ ప్రధానంగా నిలుస్తున్నాయి. వీటిలో ఏ స్థాయి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో తెలియజేస్తే చాలు.. వాటికి సంబంధించిన సమాచారం, నిర్వర్తించాల్సిన విధులు, లభించే పారితోషికం, అవసరమైన నైపుణ్యాలు.. ఇలా అన్నీ ప్రత్యక్షమవుతున్నాయి. పలు మొబైల్ యాప్స్ కూడా పార్ట్టైమ్ జాబ్స్ వివరాలు అందిస్తున్నాయి. -
ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులు.. వివరాలివిగో..
బిజినెస్ స్కూల్స్.. మరో మాటలో చెప్పాలంటే.. మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్! పీజీ స్థాయిలో ఎంబీఏ, పీజీడీఎం ప్రోగ్రామ్ల ద్వారా.. మేనేజ్మెంట్ నైపుణ్యాలు అందించే విద్యాసంస్థలు! ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. టెక్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందుకోసం ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో ప్రత్యేకంగా టెక్నికల్ కోర్సులు బోధిస్తున్నాయి. దేశంలో.. ప్రతిష్టాత్మక బీస్కూల్స్ ఐఐఎంలు మొదలు మరెన్నో ప్రముఖ బీస్కూల్స్.. పీజీ ప్రోగ్రామ్స్ కరిక్యలంలో.. టెక్నికల్ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇస్తుండటం నయా ట్రెండ్గా మారింది. ఈ నేపథ్యంలో.. బీస్కూల్స్లో టెక్ కోర్సుల బోధనకు కారణాలు.. వాటితో ప్రయోజనాలపై ప్రత్యేక కథనం... సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్.. సంక్షిప్తంగా స్టెమ్ కోర్సులుగా గుర్తింపు. వీటిని సైన్స్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు, మూడేళ్లుగా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు సైతం ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. డేటా సైన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లలో స్టెమ్ కోర్సులను ప్రవేశపెడుతున్న ఇన్స్టిట్యూట్లు ప్రధానంగా.. డేటాసైన్స్, డేటా అనలిటిక్స్కు ప్రాధాన్యమిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. కార్పొరేట్ ప్రపంచంలో డేటా అనలిటిక్స్కు ప్రాధాన్యం పెరగడమే! అనలిటిక్స్ ఆధారంగా బిజినెస్ వ్యూహాలు రూపొందించే మేనేజ్మెంట్ నిపుణుల అవసరం నెలకొంది. అనలిటిక్స్ నైపుణ్యాలకు టెక్ స్కిల్స్ పునాదిగా నిలుస్తున్నాయి. దీంతో మేనేజ్మెంట్ విద్యార్థులకే డేటాసైన్స్, డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్మెంట్పై అవగాహన కల్పిస్తే.. కార్పొరేట్ వర్గాల నుంచి చక్కటి ఆఫర్లు లభిస్తాయని భావిస్తున్నారు. ఏఐ–ఎంఎల్ కూడా ►మేనేజ్మెంట్ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) కూడా బోధిస్తున్నారు. ఇప్పుడు అన్నింటా ముఖ్యంగా వస్తు సేవల్లో.. ఏఐ, ఎంఎల్కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఒక ఉత్పత్తి లేదా సర్వీస్ను ఏఐ ఆధారంగా రూపొందించాలనుకుంటే.. సదరు నిర్వహణ అధికారులకు దీనిపై అవగాహన ఉండాలి. అంతేకాకుండా కంపెనీల రోజువారీ విధుల్లోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అకౌంట్స్, ఫైనాన్స్,ప్రొడక్షన్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో.. ఏఐ ఆధారంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ►ఏఐ ఆధారంగా..పని భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా.. అందుకు అయ్యే వ్యయం కూడా తగ్గించుకోవచ్చు. అదే విధంగా.. సంస్థకు కీలకమైన హెచ్ఆర్ విభాగంలో సైతం నూతన నియామకాలు, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏఐ–ఎంఎల్ ద్వారా దరఖాస్తుల పరిశీలన, అర్హులను గుర్తించడం సులభం అవుతోంది. దీంతో.. మేనేజ్మెంట్ విభాగాల్లో పని చేసే వారికి సైతం టెక్నికల్ నైపుణ్యాలపై పట్టు సాధించాల్సిన ఆశ్యకత నెలకొంది. అందుకే ఇప్పుడు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. ఏఐ, ఎంఎల్ వంటి టెక్ స్కిల్స్ను బోధిస్తున్నాయి. బిజినెస్ అనలిటిక్స్ మేనేజ్మెంట్ విభాగంలో టెక్నికల్ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు.. బిజినెస్ అనలిటిక్స్కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. సంస్థకు సంబంధించి రా మెటీరియల్ సేకరణ నుంచి ప్రొడక్షన్, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ వరకూ.. అన్ని అంశాలు కంప్యూటరీకరణ జరుగుతోంది. ఒక్కో దశలో ఆయా అంశాల నిర్వహణకు సంబంధించిన విషయాలు(ఖర్చులు, నిర్వహణ వ్యయం, అనుసరించిన విధానం తదితర)ను కంప్యూటర్ ద్వారా విశ్లేషించి మేనేజ్మెంట్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై స్పష్టతకు రావలసి ఉంటుంది. దీంతో క్షేత్ర స్థాయిలో సాంకేతిక నైపుణ్యాలు ఆవశ్యకంగా మారుతున్నాయి. దీంతో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ బిజినెస్ అనలిటిక్స్ను తమ కరిక్యులంలో భాగంగా చేర్చుతున్నాయి. ప్రత్యేక ప్రోగ్రామ్లు సైతం ►మేనేజ్మెంట్ కోర్సుల్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు స్టెమ్ కోర్సులను బోధిస్తుండగా.. మరికొన్ని ఇన్స్టిట్యూట్లు పూర్తి స్థాయిలో ప్రత్యేక టెక్ ప్రోగ్రామ్లను రూపొందిస్తున్నాయి. ►ఐఐఎం–అహ్మదాబాద్.. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా 16 నెలల అడ్వాన్స్డ్ బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ను రూపొందించింది. ►ఐఐఎం–బెంగళూరు.. బిజినెస్ అనలిటిక్స్లో రెండేళ్ల ఎంబీఏ ప్రోగ్రామ్ను అందిస్తోంది. ►ఐఐఎం–కోల్కత.. ఏడాది వ్యవధిలో బిజినెస్ అనలిటిక్స్లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది. అదే విధంగా డేటా సైన్సెస్లో అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్లో సైతం ప్రవేశం కల్పిస్తోంది. ►ఐఐఎం–కాశీపూర్ కూడా అనలిటిక్స్లో ఎంబీఏ ప్రోగ్రామ్కు రూపకల్పన చేసింది. ఇతర బీ–స్కూల్స్ కూడా ► ఐఐఎంలే కాకుండా.. దేశంలోని ఇతర ప్రముఖ బీ–స్కూల్స్ కూడా మేనేజ్మెంట్ పీజీ లేదా పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సుల బాట పడుతున్నాయి. ► ఐఎస్బీ–హైదరాబాద్ బిజినెస్ అనలిటిక్స్లో హైబ్రీడ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ను అందిస్తోంది. ప్రత్యేక రీసెర్చ్ కేంద్రాలు ►ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులను అందిస్తున్న మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. సంబంధిత విభాగాల్లో ప్రత్యేకంగా రీసెర్చ్ కేంద్రాలను కూడా నెలకొల్పుతున్నాయి. ►ఐఐఎం అహ్మదాబాద్ కొద్ది రోజుల క్రితం సెంటర్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పరిశోధనలు నిర్వహించి.. వ్యాపారాలకు, పాలనకు, విధాన నిర్ణయాలకు సహకరించడం లక్ష్యంగా చేసుకుంది. ►ఐఐఎం–రాయ్పూర్ కూడా సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పేరుతో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, టెక్నాలజీ అడాప్షన్, ఆన్లైన్ సెక్యూరిటీ, డిజిటైజేషన్ స్ట్రాటజీ విభాగాల్లో పరిశోధనల కోసం ప్రత్యేక రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించింది. కార్పొరేట్ వర్గాలు టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ నిపుణులకు కార్పొరేట్ వర్గాలు సైతం పెద్దపీట వేస్తున్నాయి. వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తే.. టెక్, మేనేజ్మెంట్ రెండు నైపుణ్యాలున్న వారి కోసం సంస్థలు అన్వేషణ సాగిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇన్స్టిట్యూట్లు స్టెమ్ కోర్సుల బాట పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 70 శాతం వారే టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ నిపుణులకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. టెక్ కంపెనీల నియామకాల్లో సైతం 70 శాతం మేరకు మేనేజ్మెంట్ విద్యార్థులే ఉంటున్నారు. ►జీమ్యాక్ సర్వే ప్రకారం–గత ఏడాది టెక్ ఆధారిత సేవలందిస్తున్న సంస్థల్లో 89 శాతం ఎంబీఏ ఉత్తీర్ణులను నియమించుకున్నాయి. ►మేనేజ్మెంట్ సంస్థల విషయానికొస్తే.. టెక్, మేనేజ్మెంట్ నైపుణ్యాలున్న విద్యార్థులను నియమించుకున్న సంస్థల సంఖ్య 60 శాతంగా నిలిచింది. టెక్.. మేనేజ్మెంట్ ► ఒకవైపు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు టెక్ కోర్సులను అందిస్తుండగా.. మరోవైపు.. టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు సైతం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ల్లో ప్రవేశాలు కల్పిస్తుండటం విశేషం. ►ఐఐటీ హైదరాబాద్.. ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ఇన్ డేటాసైన్స్ కోర్సును అందిస్తోంది. ►ఐఐటీ–ఢిల్లీ,ఐఐటీ–కాన్పూర్,ఐఐటీ–ఖరగ్పూర్ వంటి ప్రముఖ ఐఐటీలు, ఇతర ఎన్ఐటీలు ఎంటెక్ (సీఎస్ఈ)లో బిగ్ డేటా అనలిటిక్స్ స్పెషలైజేషన్తో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ► వీటితోపాటు పలు ఇతర ఐఐటీలు, మరెన్నో ప్రముఖ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు ఎంటెక్ స్థాయిలో డేటా అనలిటిక్స్ను అందిస్తున్నాయి. ప్రయోజనం ఇప్పుడు కంపెనీలన్నీ ఏఐ బాట పడుతున్నాయి. దీంతో సంస్థల స్థాయిలో సాంకేతిక విభాగాల నుంచి కార్యాలయంలో పని చేసే మేనేజీరియల్ సిబ్బంది వరకూ.. ప్రతి ఒక్కరికి వీటిపై అవగాహన ఉంటేనే సంస్థ లక్ష్యాలు నెరవేరుతాయి. వీటికి అనుగుణంగా అకడమిక్ స్థాయిలోనే టెక్ నైపుణ్యాలు అందిస్తే కెరీర్ పరంగా రాణించగలుగుతారు. అదేసమయంలో కంపెనీలకు అవసరమైన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా లభిస్తాయి. టెక్ కోర్సులు–ముఖ్యాంశాలు ►ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో టెక్ కోర్సులను అందిస్తున్న ఐఐఎంలు, ఇతర ప్రముఖ బీ–స్కూల్స్. ► బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లకు ప్రాధాన్యం. ► కోర్సు కరిక్యులంతో పాటు ప్రత్యేక ప్రోగ్రామ్లకు రూపకల్పన. ►ఏఐ–ఎంఎల్, డేటా అనలిటిక్స్లో రీసెర్చ్ సెంటర్లను సైతం ఏర్పాటు చేస్తున్న మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు. ►ఈ నైపుణ్యాలతో సంస్థల్లో విధుల నిర్వహణలో మరింత సమర్థంగా రాణించే అవకాశం. ►టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ విద్యార్థులను నియమించుకోవడానికి ప్రాధాన్యమిస్తున్న టెక్ కంపెనీలు. ►టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లోనూ డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్మెంట్ వంటి కోర్సులు. ► ఇండస్ట్రీలో.. ఐఓటీ ఆధారిత కార్యకలాపాలు నిర్వహణ పెరగడమే ప్రధాన కారణం. డేటా అనలిటిక్స్కు ప్రాధాన్యం అన్ని రంగాల్లోనూ డేటా విశ్లేషణ.. ఆయా సంస్థల భవిష్యత్తు వ్యూహాలకు, మార్కెట్ ప్రణాళికలకు కీలకంగా మారింది. వీటి ఆధారంగానే ఉత్పత్తుల రూపకల్పన, నిర్వహణ తదితర కార్యకలాపాలు చేపట్టాల్సి వస్తోంది. ఇంత కీలకమైన డేటాను విశ్లేషించాలంటే.. మేనేజ్మెంట్తోపాటు డేటా మైనింగ్, డేటాసైన్స్ నైపుణ్యాలు కూడా అవసరమే. అందుకే మేనేజ్మెంట్ విద్యలోనే వీటిని అందించే విధంగా కోర్సుల రూపకల్పన జరుగుతోంది. –ప్రొ‘‘ యు.దినేశ్ కుమార్, డేటాసెంటర్ అండ్ అనలిటిక్స్ ల్యాబ్ చైర్మన్, ఐఐఎం–బెంగళూరు -
మేలుకో మహిళ.. ఈ మేటి కొలువులు నీకోసమే!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. మరో చక్కటి నోటిఫికేషన్తో ఉద్యోగార్థుల ముందుకొచ్చింది! మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ విభాగంలోని..ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్–1 పోస్ట్ల భర్తీకి ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. హోంసైన్స్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, సోషల్ వర్క్ తదితర విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన మహిళలు ఈ కొలువులకు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్ట్లకు అర్హతలు, ఎంపిక విధానం, విజయం సాధించేందుకు ప్రిపరేషన్ గైడెన్స్.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విభాగాల్లో ఒకటి. అంతటి కీలక విభాగంలో ఖాళీగా ఉన్న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్ట్ల భర్తీకి ఏపీపీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అకడమిక్గా ఆయా సబ్జెక్ట్లపై పట్టున్న వారు ఈ పరీక్షలో విజయం సాధించడం సులభమే అంటున్నారు నిపుణులు. ► మొత్తం పోస్ట్ల సంఖ్య: 22 ► పోస్టుల వివరాలు: ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్–1(సూపర్వైజర్) అర్హతలు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్, ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లలో ఏదో ఒకటి గ్రూప్ సబ్జెక్ట్గా బీఎస్సీ (బీజెడ్సీ) ఉత్తీర్ణత ఉండాలి. ► హోంసైన్స్/సోషల్ వర్క్/సోషియాలజీ/ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో.. ఉన్నత విద్య అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వయో పరిమితి ►వయసు జూలై 1, 2021 నాటికి 18–42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ప్రారంభ వేతనం ► ఏపీపీఎస్సీ భర్తీ చేయనున్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని సబార్డినేట్ సర్వీస్లోని ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను గ్రేడ్–1 హోదా పోస్ట్లుగా పేర్కొన్నారు. ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లనే సూపర్వైజర్లుగా కూడా పిలుస్తారు. వీరికి వేతన శ్రేణి రూ.24,440–రూ.71,510గా ఉంటుంది. ఎంపిక విధానం ఆన్లైన్ విధానం(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో జరిగే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక చేస్తారు. ఈ ఆన్లైన్ పరీక్షలో రెండు పేపర్లు మొత్తం 300 మార్కులకు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు–150 మార్కులకు; పేపర్ 2 హోం సైన్స్ అండ్ సోషల్ వర్క్ 150 ప్రశ్నలు–150 మార్కులకు నిర్వహిస్తారు. ► ప్రశ్నలన్నింటినీ ఆబ్జెక్టివ్ తరహా బహుళైచ్ఛిక విధానంలోనే అడుగుతారు. ► ఈ రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)గా నిర్వహిస్తారు. ► ఒక్కో పేపర్కు పరీక్ష సమయం రెండున్నర గంటలు ఉంటుంది. ► ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3 తగ్గిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్ట్లకు అభ్యర్థులు రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందుబాటులో ఉన్న పోస్ట్లు, రిజర్వ్డ్ కేటగిరీలకు కేటాయించిన పోస్ట్లు తదితర నిబంధనలను పరిగణనలోకి తీసుకొని.. ఆయా కేటగిరీల్లో మెరిట్ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు. దరఖాస్తు విధానం: ► ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: నవంబర్ 18–డిసెంబర్ 8, 2021 ► అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెంబర్ 7, 2021 ► ఆన్లైన్ దరఖాస్తులో సవరణ:దరఖాస్తు చివరి తేదీ నుంచి ఏడు రోజుల లోపు సవరణలు చేసుకోవచ్చు. ► వెబ్సైట్ https://psc.ap.gov.in/ రాత పరీక్షలో రాణించాలంటే ► రెండు పేపర్లుగా నిర్వహించే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రాత పరీక్షలో రాణించేందుకు అభ్యర్థులు పక్కా ప్రిపరేషన్ ప్రణాళికతో ముందుకు సాగాలి. ► పేపర్–1(జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ) అంతర్జాతీయంగా, జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు, సమకాలీన పరిణామాలపై పట్టు సాధించాలి. తాజాగా ముగిసిన కాప్ సదస్సు, ఆయా అంశాలకు సంబంధించి ఐరాస నివేదికలు, భారత్–ఇతర దేశాల మధ్య ఇటీవల కాలంలో జరిగిన ద్వైపాక్షిక సమావేశాలు, ఒప్పందాలు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ►రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాలు, కళలు, క్రీడలు, సంస్కృతి, పాలనకు సంబంధించి జాతీయ అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలపై పట్టు సాధించాలి. ► కరెంట్ ఆఫైర్స్కు సంబంధించి.. పరీక్షకు నెల రోజుల ముందు నుంచి అంతకుముందు సంవత్సర కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై దృష్టి పెట్టాలి. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమకాలీన అంశాలకు సంబంధించి తాజా పాలసీలు, పథకాలు, నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై గణాంక సహిత సమాచారంతో సిద్ధంగా ఉండాలి. ►మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన పోస్ట్లకు పరీక్ష నిర్వహిస్తున్న∙నేపథ్యంలో.. ఏపీలో మహిళలు, చిన్నారుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వారి కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి తెలుసుకోవాలి. ► ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆధునిక భారత దేశ చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలపై పట్టు సాధించాలి. పాలిటీ, గవర్నెన్స్కు సంబంధించి రాజ్యాంగం, ఇటీవల కాలంలో పాలనలో చోటు చేసుకుంటున్న సాంకేతిక పరిణామాలు(ఈ–గవర్నెన్స్ తదితర), తాజా విధానాల గురించి తెలుసుకోవాలి. ఈ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పరిపాలన పరమైన నూతన విధానాలపై ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి. ► ఆర్ధికాభివృద్ధికి సంబంధించి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు.. దేశ ఆర్థిక ప్రగతి, ఆర్థికాంశాల క్రమాన్ని తెలుసుకోవాలి. ► జాగ్రఫీలో.. భారత్తోపాటు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సహజ వనరులు, అవి లభించే ప్రాంతాలు, అభివృద్ధికి దోహదపడే తీరుపై అవగాహన పెంచుకోవాలి. ► ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న డిజాస్టర్ మేనేజ్మెంట్, సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తాజా పరిణామాలు, అదే విధంగా ప్రాథమిక లక్ష్యాల గురించి తెలుసుకోవాలి. ► మెంటల్ ఎబిలిటీలో... లాజికల్ రీజనింగ్, డేటాలు, ఫ్లో చార్ట్స్, డేటా విశ్లేషణ నైపుణ్యాలు పెంచుకోవాలి. ► అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతర పరిణామాలు, సమస్యలను ప్రత్యేక దృష్టితో చదవాలి. ► 2021–22 బడ్జెట్లోని ముఖ్యమైన అంశాలు, ఏపీ, ఇండియా సోషియో–ఎకనామిక్ సర్వేలు, వాటిలో పేర్కొన్న ముఖ్య వివరాలను, గణాంకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పేపర్–2కు ఇలా ► హోంసైన్స్, సోషల్ వర్క్ సబ్జెక్ట్ అంశాలు రెండు విభాగాలుగా ఉండే పేపర్–2లో రాణించేందుకు దృష్టి పెట్టాల్సిన అంశాలు.. ► ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ సబ్జెక్ట్లోని పలు రకాల ఆహార ధాన్యాలు, బలమైన ఆరోగ్యానికి దోహదం చేసే తృణ ధాన్యాలు గురించి తెలుసుకోవాలి. ► అదే విధంగా పోషకాహార పదార్థాలు, వాటి నిల్వ, వాటి వల్ల కలిగే లాభాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. ► ఆయా ఆహార పదార్థాల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకోవాలి. ► వయో వర్గాల వారీగా అవసరమైన ఆహార, పోషకాల వివరాలు గురించి తెలుసుకోవడం కూడా మేలు చేస్తుంది. ► ఆయా వ్యాధులకు సంబంధించి అనుసరించాల్సిన ఆరోగ్య, ఆహార నియమాల గురించి తెలుసుకోవాలి. ► శిశు అభివృద్ధికి సంబంధించి ఇమ్యునైజేషన్, మానసిక–శారీరక అభివృద్ధి, ప్రీ–స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యం, పాపులేషన్ ఎడ్యుకేషన్లపై దృష్టిపెట్టాలి. ► అదే విధంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆయా ఏజెన్సీలు/సంస్థల ఆధ్వర్యంలో అమలవుతున్న మహిళా, శిశు సంక్షేమ సేవల గురించి తెలుసుకోవాలి. ► చిన్నారులకు రాజ్యాంగ, శాసన పరంగా అందుబాటులో ఉన్న హక్కుల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. ► ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, వారి విషయంలో చేపడుతున్న చర్యలపై దృష్టి పెట్టాలి. ► వ్యవసాయానికి సంబంధించిన అంశాలు.. ముఖ్యంగా ఆహార ధాన్యాల డిమాండ్–సప్లయ్, సాగు ప్రణాళికలు, ప్రభుత్వ విధానాల గురించి తెలుసుకోవాలి. ► ఎక్స్టెన్షన్ వర్క్కు సంబంధించిన విధానాలు, పద్ధతులు, ప్రోగ్రామ్ ప్లానింగ్, నిర్వహణ, మూల్యాంకన, గ్రామాల్లో మహిళల ఆధ్వర్యంలోని స్వయంసహాయక సంస్థల ► అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ► సోషల్ వర్క్కు సంబంధించి మూల భావన, పరిధి, స్వరూపం తెలుసుకోవాలి. ► భారతీయ సంస్కృతిలో మార్పు విషయంలో సోషల్ వర్క్ సిద్ధాంతం ప్రాముఖ్యతపై అవగాహన ఏర్పరచుకోవాలి. ► సోషల్ వర్క్లో.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలు, స్థానిక సంస్థలు, కుటుంబం, శిశు సంక్షేమ చర్యలు, మహిళలకు ఎదురవుతున్న సమస్యలు, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ స్వరూపం, విధులపై అవగాహన అవసరం. డిగ్రీ పుస్తకాల అధ్యయనం పేపర్–2కు సంబంధించిన విభాగాల్లోని ప్రశ్నలు డిగ్రీ స్థాయి పుస్తకాల నుంచే అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సిద్ధాంతాలు, మూల భావనలకు సంబంధించి డిగ్రీ స్థాయి పుస్తకాల అభ్యసనం మేలు చేస్తుంది. సంక్షేమ పథకాలు, సేవలు, సమస్యలకు సంబంధించి సమకాలీన అంశాలను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఇలా ఒకవైపు బేసిక్స్, మరోవైపు సమకాలీన పరిణామాలపై అవగాహన పెంచుకుంటూ.. ప్రిపరేషన్ సాగిస్తే విజయావకాశాలు మెరుగవుతాయి. -
ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా.. ఈ సింపుల్ ట్రిక్స్ మర్చిపోకండి
చదువు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించడం ప్రతి ఒక్కరి కల. అందుకోసం ముందు ఇంటర్వ్యూను ఛేదించాల్సి ఉంటుంది. చాలామంది ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలో తెలియక అవకాశాలను కోల్పోతుంటారు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా.. సులభంగానే ఇంటర్వ్యూలో సక్సెస్ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. సంస్థ గురించి ఇంటర్వ్యూకు సన్నద్ధమవుతున్న అభ్యర్థి.. ముందుగా ఇంటర్వ్యూ చేస్తున్న సంస్థకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. ఇందుకోసం ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పటి నుంచి ఆ సంస్థ గురించి అధ్యయనం చేసి..అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. దరఖాస్తు చేసిన ఉద్యోగం, నిర్వర్తించాల్సిన విధులకు సంబంధించిన అంశాలపైనా అవగాహన కలిగి ఉండాలి. మంచి వస్త్రధారణ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు వస్త్రధారణ పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ తేడా వస్తే రిక్రూటర్లు అభ్యర్థిని త్వరగానే తిరస్కరించే ఆస్కారం ఉంటుంది. దరఖాస్తు చేసిన ఉద్యోగానికి తగినట్లు వస్త్రధారణ హుందాగా ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు తమ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా ఇంటర్వ్యూకు సన్నద్ధం కావాలి. చదవండి: వీసా ఇంటర్వ్యూ.. విజయం సాధించడం ఇలా! కాస్త ముందుగానే సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి సంస్థ వద్దకు చేరుకోవడం కంటే.. కాస్త ముందుగానే అక్కడికి వెళ్లేలా చూసుకోవాలి. దాంతో అనవసరపు ఒత్తిడి దరిచేరకుండా ఉంటుంది. సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి చేరుకోవడమో లేదా ఆలస్యంగా వెళ్లడమో చేస్తే గందరగోళ పరిస్థితి తలెత్తే ప్రమాదముంది. హుందాగా వ్యవహరించాలి సంస్థలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇంటర్వ్యూ పూర్తయి బయటకు వచ్చే వరకూ.. ఎంతో హుందాగా వ్యవహరించాలి. గేట్ దగ్గర పలకరించే సెక్యూరిటీ దగ్గర నుంచి.. ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల దాకా.. సంస్థలో ఎంతో మంది ఎదురవుతారు. వీరందరితో హుందాగా ప్రవర్తించాలి. కరచాలనం, పలకరించే సందర్భాల్లో పద్ధతిగా మసలుకోవాలి. ఇంటర్వ్యూలో మాట్లాడే సమయంలో ఉపయోగించే భాష, భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉండాలి. నిజాయితీ ముఖ్యం ఇంటర్వ్యూ చేసేవారు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవచ్చు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియకుంటే.. ఆ విషయాన్ని వినయంగా అంగీకరించాలి. అంతేతప్ప ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. ఏదో ఒకటి చెబితే ఆ విషయాన్ని రిక్రూటర్లు సులభంగానే గుర్తిస్తారు. హావభావాలు ఇంటర్వ్యూలో హావభావాలు కూడా ముఖ్యమే. చేతులు కట్టుకొని కూర్చోకూడదు. కాళ్లు కదపడం, ముందున్న బల్లపై ఒరిగిపోవడం, ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడం వంటి చేష్టలు అస్సలు చేయకూడదు. ప్రశాంతంగా ఉండటం, అవసరమైతే సందర్భానుసారంగా చిరునవ్వు చిందించడం అవసరం. ఇవి తీసుకెళ్లాలి ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు జాబ్ అప్లికేషన్తోపాటు రెజ్యూమ్ జిరాక్స్ కాపీలను కూడా తీసుకెళ్లాలి. ఇంటర్వ్యూలో మీరు చెప్పే సమాధానాలు రెజ్యూమ్లో పేర్కొన్నవాటికి భిన్నంగా ఉండకూడదు. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత చివర్లో బోర్డ్ సభ్యులకు ధన్యవాదాలు తెలపడం మరిచిపోవద్దు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంటర్వ్యూ గట్టెక్కి.. కోరుకున్న కొలువు సొంతమవుతుంది!! -
సాయుధ బలగాల్లో జాబ్, యువతకు శుభవార్త
శారీరకంగా ధృడంగా ఉండి.. దేశ సేవ చేయాలనే తపన కలిగిన యువతకు కేంద్ర పారామిలిటరీ దళాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆయా భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న 25వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి పూర్తిచేసి కేంద్ర సాయుధ బలగాల్లో కొలువు సాధించాలని కలల కనే యువతకు చక్కటి అవకాశం.. ఎస్ఎస్సీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఈ నేపథ్యంలో.. కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు అర్హతలు.. ఎంపిక విధానం.. సిలబస్.. ప్రిపరేషన్ టిప్స్... పోస్టు పేరు: కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) మొత్తం ఖాళీల సంఖ్య: 25,271 విభాగాల వారీగా పోస్టుల సంఖ్య: బీఎస్ఎఫ్–7545, సీఐఎస్ఎఫ్–8464, ఎస్ఎస్బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్–3785,ఎస్ఎస్ఎఫ్–240 సీఏపీఎఫ్ ఆర్మీ, నేవీ ఎయిర్ఫోర్స్ మాదిరిగానే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో ప్రతి ఏటా నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో పలు విభాగాలున్నాయి. అవి.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎప్ఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్(ఏఆర్). వీటిల్లో ఉమ్మడి పరీక్ష ద్వారా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆయా ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అర్హతలు ►ఎస్ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2021, ఆగస్టు 1 నాటికి పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే. ►వయసు: 2021, ఆగస్టు 1 నాటికి 18–23ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు్ల, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం ఎంపికైతే పే లెవెల్–3 ప్రకారం–రూ.21700–రూ.69100 వేతన శ్రేణి లభిస్తుంది. ఎంపిక విధానం: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(సీబీఈ),సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ ►తొలిదశలో సీబీఈ(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలకు–100 మార్కులకు ఈ టెస్ట్ ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ►ఈ పరీక్షలోనాలుగు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంగ్లిష్/హిందీల నుంచి 25ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ►జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో.. వెర్బల్, నాన్ వెర్బల్, అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పజిల్స్, డిస్టన్స్ అండ్ డైరెక్షన్, నంబర్ సిరీస్ కంప్లిషన్, అనాలజీ, కౌంటింగ్ ఫిగర్,డైస్, సిలోజిజం తదితర అంశాలుంటాయి. ఇందులో మంచి మార్కులు సాధించేందుకు లాజికల్ థింకింగ్ ఉపయోగపడుతుంది. ►జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగంలో.. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, పుస్తకాలు, రచయితలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో అభ్యర్థికి సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. కాబట్టి వర్తమాన అంశాలపై పట్టుకోసం నిత్యం దినపత్రికలు చదివి నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. బఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో..టైమ్ అండ్ డిస్టన్స్, బోట్ అండ్ స్ట్రీమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది అభ్యర్థికి గణితంపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం. కాబట్టి పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్ అంశాలపై గట్టి పట్టు సాధించాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వేగం పెంచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం చాలా అవసరం. ►ఇంగ్లిష్/హిందీ: ఇందులో మంచి స్కోర్ సాధించేందుకు గ్రామర్తోపాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. సెంటెన్స్ కరెక్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ ఎరేంజ్మెంట్, ఎర్ర ర్స్ ఫైండింగ్ తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ దినపత్రికలు, వ్యాసాలు చదవడం ద్వారా ఈ విభాగాన్ని సులువుగానే గట్టెక్కే అవకాశముంది. ►ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు(0.25) మార్కు తగ్గిస్తారు. ►ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ): ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల శారీరకంగా «ధృడంగా ఉండాలి. ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఉంటే సరిపోతుంది. ఛాతీ: పురుషులు 170 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. బరువు: ఎత్తుకు తగిన విధంగా ఉండాలి. ►ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ): ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల్లో భాగంగా పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో; అలాగే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 1/2 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ►ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ►తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ప్రిపరేషన్ టిప్స్ ►కానిస్టేబుల్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల పరీక్ష విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సరైన స్టడీ ప్లాన్ సిద్దం చేసుకోవాలి. ► సిలబస్ను గురించిన అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్ను గుర్తించాలి. ►గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఆన్లైన్ మాక్టెస్టులు రాయాలి. దీనిద్వారా పరీక్షలో ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో తెలుస్తుంది. ►ఒత్తిడిని దూరం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ►దరఖాస్తు చివరి తేదీ: 31.08.2021 ►పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు ►వెబ్సైట్: https://ssc.nic.in -
ఆ రెండు సబ్జెక్టులు రాకుంటే.. ఇంజనీరింగ్లో సాధ్యమేనా?!
బీటెక్లో చేరాలంటే..ఇంటర్మీడియెట్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ గ్రూప్ సబ్జెక్ట్లుగా.. ఉత్తీర్ణత సాధించాలనే అర్హత నిబంధన ఉన్న సంగతి తెలిసిందే! అందుకే..ఇంజనీరింగ్ లక్ష్యంగా చేసుకున్న లక్షల మంది విద్యార్థులు.. ఇంటర్ ఎంపీసీలో చేరుతుంటారు! ఆ అర్హత ఆధారంగా సదరు సబ్జెక్ట్లతో నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్లో.. విజయం సాధిస్తేనే ప్రస్తుతం బీటెక్లో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది! కానీ..తాజాగా ఏఐసీటీఈ(అఖిల భారత సాంకేతిక విద్యా మండలి).. ఇక నుంచి బీటెక్లో చేరాలంటే..‘ఇంటర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదవడం తప్పనిసరికాదు’ అనేలా ప్రకటన చేసింది. ఇదే ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది! ఈ నేపథ్యంలో.. బీటెక్లో చేరేందుకు ఏఐసీటీఈ తాజాగా పేర్కొన్న అర్హతలు.. వాటì తో కలిగే సానుకూల, ప్రతికూల ప్రభావంపై విశ్లేషణాత్మక కథనం.. ‘చిన్న ఇల్లు కట్టాలన్నా.. లేదా కొత్తగా ఒక రహదారి నిర్మించాలన్నా.. సివిల్ ఇంజనీర్లకు ఫిజిక్స్ నైపుణ్యాలు ఎంతో అవసరం. సదరు నిర్మాణం చేపట్టే ప్రదేశంలో సాంద్రత, పటిష్టత వంటివి తెలుసుకోవాలంటే.. ఫిజిక్స్ నైపుణ్యాలతోనే సాధ్యం. ఈ స్కిల్స్ లేకుండా.. సివిల్ ఇంజనీరింగ్లో రాణించడం కష్టమే. ఒకవేళ ఫిజిక్స్ లేకుండా.. సివిల్ ఇంజనీరింగ్ చదివినా.. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తడం ఖాయం’ – ఇది బీటెక్లో ఫిజిక్స్ నైపుణ్యాలపై విద్యావేత్తల అభిప్రాయం. ‘ప్రస్తుత పోటీ ప్రపంచంలో... ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న ఏఐ, ఎంఎల్, ఐఓటీ, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్.. ఇలా ఎందులోనైనా ప్రతిభ చూపాలంటే.. మ్యాథమెటిక్స్ నైపుణ్యాలు తప్పనిసరి. కోడింగ్, ప్రోగ్రామింగ్లను రూపొందించేందుకు అల్గారిథమ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, కాలిక్యులస్ వంటి వాటిలో బలమైన పునాది ఉండాలి’ –ఇది బీటెక్ ప్రవేశాల్లో మ్యాథమెటిక్స్ను ఐచ్ఛికం చేయడంపై నిపుణుల అభిప్రాయం. ...ఇలా ..ఒక్క సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అనే కాదు. ఇంజనీరింగ్లో సర్క్యూట్ బ్రాంచ్లుగా పిలిచే ఈసీఈ, ఈఈఈ, ఐటీ.. అదే విధంగా కోర్ బ్రాంచ్లుగా పేర్కొనే మెకానికల్, సివిల్.. అన్నింటిలోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సిద్ధాంతాల ఆధారంగా సమస్యలు పరిష్కరించే విధంగా ఇంజనీరింగ్ స్వరూపం ఉంటుంది. రోబోటిక్స్.. ఫిజిక్స్ సూ త్రాల ఆధారంగా పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇంజనీ రింగ్లో ప్రవేశానికి ఇంటర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లను చదవడం తప్పనిసరికాదనే ప్రకటన చర్చనీయాంశమైంది. 14 సబ్జెక్టుల జాబితా ఏఐసీటీఈ తాజాగా 2021–22 సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్ను విడుదల చేసింది. ఈ హ్యాండ్ బుక్లో పేర్కొన్న అర్హత ప్రమాణాల ప్రకారం–బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్లో ప్రవేశానికి ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివుండాలనే నిబంధన తొలగించింది. అంతేకాకుండా.. 14 సబ్జెక్ట్లతో జాబి తా పేర్కొని.. ఈ సబ్జెక్ట్లలో ఏవైనా మూడు చదివితే.. బీటెక్లో ప్రవేశించేందుకు అర్హులేనని పేర్కొంది. అవి.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ, ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, బయోటెక్నా లజీ, టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్ట్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్, ఎంటర్ప్రెన్యూర్షిప్. అయితే ఆయా రాష్ట్రాలు, యూనివర్సిటీలు బీటెక్ ప్రవేశాల్లో అర్హతలకు సంబంధించి తమ ఈ 14 సబ్జెక్టుల ప్రకటనకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని.. అర్హతల విషయంలో యూనివర్సిటీలకు, రాష్ట్రాలకు సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. ఆ సబ్జెక్ట్లు ఇంటర్లో? ఏఐసీటీఈ పేర్కొన్న 14 సబ్జెక్ట్లు ఆయా రాష్ట్రాల బోర్డ్ల ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల్లో అందుబాటులో ఉన్నాయా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. వాస్తవానికి ప్రస్తుతం చాలా రాష్ట్రాలు తమ సొంత కరిక్యులంతో ఇంటర్మీ డియెట్ తత్సమాన కోర్సులను బోధిస్తున్నాయి. ఇంజనీరింగ్ ఔత్సాహిక అభ్యర్థుల కోసం ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ అందిస్తున్నాయి. దీంతో ఏఐసీటీఈ తాజా నిర్ణయం పూర్తిగా సీబీఎస్ఈ +2 కరిక్యులంను దృష్టిలో పెట్టుకొని∙తీసు కున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐసీటీఈ బీటెక్ ప్రవేశ అర్హతలు.. ముఖ్యాంశాలు ► ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ చదవకపోయినా బీటెక్లో చేరే అవకాశం. ►బీటెక్ మొదటి సంవత్సరంలో బ్రిడ్జ్ కోర్సుల ద్వారా ఫిజిక్స్, మ్యాథ్స్ నైపుణ్యాలు అందించొచ్చని సూచన. ►ఫిజిక్స్, మ్యాథ్స్లో పూర్తి స్థాయి అవగాహన లేకుండా ఇంజనీరింగ్లో రాణించడం కష్టమంటున్న నిపుణులు. ► ఇంజనీరింగ్లోని దాదాపు అన్ని బ్రాంచ్లలోనూ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సిద్ధాంతాల ఆధారంగానే పట్టు సాధించాల్సిన ఆవశ్యకత. ►భవిష్యత్తులో జాబ్ మార్కెట్లో, ఉన్నత విద్య, విదేశీ విద్య పరంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం. ► రీసెర్చ్, డెవలప్మెంట్ కోణంలోనూ సైన్స్ రంగంలో పరిశోధనలు చేసే విషయంలో ఇబ్బందులు. టెస్ట్ల ద్వారానే ప్రవేశాలు అర్హతల విషయంలో పలు మార్పులు చేసిన ఏఐసీటీఈ.. ప్రవేశాలు ఖరారు చేసేందుకు మాత్రం తప్పనిసరిగా ఎంట్రన్స్ టెస్ట్లు నిర్వహించాలని పేర్కొంది. వాటిల్లో విద్యార్థులు సాధించిన ర్యాంకు, మెరిట్ ఆధారంగానే బీటెక్లో ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది. సొంతంగా ఎంట్రన్స్లు ప్రస్తుతం దేశంలోని ఆయా రాష్ట్రాలు ఇంజనీరింగ్లో ప్రవేశాల కోసం సొంత ఎంట్రన్స్ టెస్ట్లు నిర్వహించి.. అందులో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ ఎంట్రన్స్ టెస్ట్లకు అర్హత ఇంటర్ తత్సమాన కోర్సులో ఎంపీసీ ఉత్తీర్ణత. ఏఐసీటీఈ ఆయా రాష్ట్రాల విచక్షణ మేరకే తమ సూచనలు పాటించొచ్చని పేర్కొంది. సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే రాష్ట్రాలు అర్హతల విషయంలో స్వీయ నిబంధనలు రూపొందించొచ్చని తెలిపింది. దీంతో రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్లకు ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత నిబంధన కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. ఈ ఏడాది ఏఐసీటీఈ సంస్కరణలు అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. ఇప్పటికే తేదీలు ప్రకటిం చినందున ఎంసెట్నే కొనసాగిస్తామని స్పష్టం చేసింది. బ్రిడ్జ్ కోర్సులతో కష్టమే బీటెక్లో చేరడానికి మ్యాథ్స్, ఫిజిక్స్లను ఐచ్ఛికం అని పేర్కొ న్న ఏఐసీటీఈ.. విద్యార్థులు వాటికి సంబంధించిన బేసిక్ నైపు ణ్యాలు పొందేందుకు బీటెక్/బీఈ మొదటి సంవత్సరంలో బ్రిడ్జ్ కోర్సులు నిర్వహించొచ్చని సిఫార్సు చేసింది. ఈ బ్రిడ్జ్ కోర్సు లతో సదరు నైపుణ్యాలు లభిస్తాయా అంటే? కాదనే సమా ధానం వినిపిస్తోంది. వీటివల్ల ఆయా సబ్జెక్ట్లలోని ముఖ్యమైన అంశాల కాన్సెప్ట్లపై అవగాహన లభిస్తుందే తప్ప.. పూర్తి స్థాయి పట్టు సాధించడం కష్టమంటున్నారు. ఇంజనీరింగ్కు పునాదిగా భావించే మ్యాథ్స్లోని కాలిక్యులస్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ సహా పలు కీలకమైన టాపి క్స్ను; అదే విధంగా ఫిజిక్స్లో మ్యాగ్నటిజం, ఎలక్ట్రో మ్యా గ్నటిజం, థర్మో డైనమిక్స్, మెకానిక్స్ తదితర 20కు పైగా టాపి క్స్ను ఇంటర్లో రెండేళ్ల పాటు అభ్యసిస్తే తప్ప విద్యా ర్థులకు వాటిపై అవగాహన రావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒకట్రెండు సెమిస్టర్లలో నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు ద్వారా అవస రమైన నైపుణ్యాలు లభించడం కష్టమే అంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో సమస్యలు మ్యాథ్స్, ఫిజిక్స్పై పట్టు లేకుండా.. బీటెక్ పూర్తిచేసిన విద్యా ర్థులు.. పరిశోధనలు, ఆవిష్కరణల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారనే వాదన వినిపిస్తోంది. పర్యవసానంగా దేశంలో ఆర్ అండ్ డీ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడే ఆస్కారముంది. పీజీ స్థాయిలో.. సర్క్యూట్, కోర్ బ్రాంచ్ల విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్పై అవగాహన లేకుంటే రాణించడం కష్టమే అంటున్నారు. ఉదాహరణకు ఫిజిక్స్, మ్యాథ్స్ లేకుండా.. బీటెక్ పూర్తి చేసి.. ఎంటెక్లో వైర్లెస్ కమ్యూనికేషన్స్, ఆర్ఎఫ్ సిగ్నల్స్ వంటి సబ్జెక్ట్లలో రాణించడం ఎంతో కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విదేశీ విద్యకు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎంఎస్ కోర్సుల్లో చేరాలంటే.. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకూ.. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్లు చదివుండాలనే నిబంధన ఉంది. అంతేకాకుండా ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణిక టెస్ట్గా పరిగణించే జీఆర్ఈలోనూ మ్యాథమెటిక్స్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు. మరికొన్ని విదేశీ యూనివర్సిటీలు.. జీఆర్ఈ సబ్జెక్ట్ టెస్ట్లను కూడా అర్హతగా పేర్కొంటున్నాయి. వీటికి సంబంధించి విద్యార్థులు పీజీ స్థాయిలో తాము చదవాల నుకుంటున్న స్పెషలైజేషన్స్కు అనుగుణంగా ఈ సబ్జెక్ట్ టెస్ట్లలో స్కోర్ సాధించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో మ్యాథ మెటిక్స్ సంబంధిత కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు.. జీఆర్ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ టెస్ట్లో స్కోర్ సాధించాలి. ఈ సబ్జెక్ట్ టెస్ట్లో కాలిక్యులస్, అల్జీబ్రా, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నైపుణ్యాలు పొందాలంటే.. ఇంటర్మీడియెట్లో ఎంపీసీ గ్రూప్ స్థాయిలో వీటిని అభ్యసిస్తేనే సాధ్యమనేది నిపుణుల అభిప్రాయం. జాబ్ మార్కెట్ మ్యాథ్స్, ఫిజిక్స్ లేకుండా.. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టమేనని అభిప్రాయం నెలకొంది. ఉదాహరణకు.. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆటోమేషన్ ఆధారిత కార్యకలాపాలు సాగుతున్నాయి. రోబో టిక్స్, డేటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, కోడింగ్, 3–డి డిజైన్ ప్రింటింగ్ వంటి వాటికి ప్రధాన్యం పెరుగుతోంది. ఈ విభాగాల్లో రాణించాలంటే.. ప్రోగ్రామింగ్, కోడింగ్ స్కిల్స్ కీలకం అవుతున్నాయి. వీటికి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లలో పట్టుతో పాటు అప్లికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి. ఇలాంటి నైపుణ్యాలు ఇంటర్లో పూర్తి స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివిన వారికే లభిస్తాయని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. జేఈఈ పరిస్థితి ఏఐసీటీఈ తాజా నిర్ణయం అన్ని వర్గాలకు సాంకేతిక విద్యను అందుబాటులో తెచ్చే ఉద్దేశమే అయినప్పటికీ.. ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్ టెస్టులైన జేఈఈ–మెయిన్స్, జేఈఈ–అడ్వాన్స్డ్లకు అర్హత నిబం ధనల విషయంలో సూచనలు చేయకపోవడం గమనార్హం. ఎన్ఐటీలు, ఐఐటీలు.. మ్యాథ్స్,ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి చేస్తూ ఎంట్రన్స్ టెస్ట్లు నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఇంజనీ రింగ్లో చేరాలనుకునే విద్యార్థులు.. ఇంటర్మీడియెట్ స్థాయిలో ఎంపీసీనే ఎంచుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆసక్తి ఉన్నా... ప్రోత్సాహమేది!
స్టెమ్.. (STEM - Science, Technology, Engineering, Mathematics) కోర్సులు. ఇవి నేటి టెక్నాలజీ యుగంలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంటున్న కోర్సులు! మరోవైపు ప్రపంచవ్యాప్తంగా స్టెమ్ నిపుణుల కొరత నెలకొంది. ఈ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా... అందుకుతగ్గ ప్రోత్సాహం లభించట్లేదని తాజా సర్వే పేర్కొంది. అమెరికా మొదలు, అన్ని దేశాల్లోనూ ఇదే ధోరణి! మహిళా విద్యార్థుల్లో సైతం ‘స్టెమ్’ కోర్సులపై ఆసక్తి ఉన్నా.. లభించని తోడ్పాటు! తాజాగా అంతర్జాతీయంగా గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ సంస్థ ఎమర్సన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో మన దేశంలో స్టెమ్ కోర్సుల పరిస్థితి.. స్టెమ్ కోర్సులను అందిస్తున్న ప్రముఖ ఇన్స్టిట్యూట్లు, వాటి ద్వారా లభించే అవకాశాలపై ప్రత్యేక కథనం.. స్టెమ్.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్.. ఇండస్ట్రీ అవసరాల పరంగా అత్యంత కీలకమైనవి. సంస్థల్లో కార్యకలాపాలు సమర్థవంతంగా సాగడానికి, కొత్తకొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి తేవడానికి స్టెమ్ నిపుణుల సేవలు తప్పనిసరి. అందుకే స్టెమ్ కోర్సుల్లో ప్రతిభ చూపిన వారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొంది. అదే సమయంలో ఈ కోర్సులపై ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య సైతం ఏటా పెరుగుతోంది. కానీ, స్టెమ్ కోర్సుల విద్యార్థులు రాణించేందుకు అవసరమైన ప్రోత్సాహం, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా శిక్షణ లభించడం లేదని తాజా సర్వే పేర్కొంది. పర్యవ సానంగా ఈ విభాగంలో పరిశ్రమలు స్కిల్ గ్యాప్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ఆసక్తి ఇటీవల కాలంలో స్టెమ్ కోర్సుల్లో చేరాలనే ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. అగ్రరాజ్యంగా భావించే అమెరికాలో 60 శాతం మంది విద్యార్థులు స్టెమ్ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. కానీ, వీరిలో 40 శాతం మంది తమకు సరైన ప్రోత్సాహకాలు లేవని పేర్కొనడం గమనార్హం. మన దేశంలోనూ స్టెమ్ల్లోని ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల పట్ల ఆసక్తి రెట్టింపు అవుతోంది. అదేవిధంగా సైన్స్, మ్యాథమెటిక్స్ కోర్సుల విషయంలో విద్యార్థులకు సరైన మార్గం నిర్దేశం లభించడంలేదు. జండర్ గ్యాప్ స్టెమ్ కోర్సుల అభ్యసనం పరంగా దేశంలో ఎదురవుతున్న మరో సమస్య.. జండర్ గ్యాప్(లింగ వివక్ష). మహిళా విద్యార్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు. తాజా సర్వే ప్రకారం 41 శాతం మంది విద్యార్థినులు స్టెమ్ కెరీర్స్ పురుషుల కోసమే అనే అభిప్రాయంతో ఉన్నట్లు వెల్లడైంది. మరో 44 శాతం మంది మహిళలు సైతం ఈ రంగంలో తమకు రోల్ మోడల్స్ లేరని, దాంతో స్టెమ్ కోర్సుల్లో చేరేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోందన్నారు. తల్లిదండ్రులు కూడా స్టెమ్ కోర్సుల్లో అమ్మాయిలను చేర్పించేందుకు వెనుకాడుతున్నారు. ఈ విషయంలో ఇంజనీరింగ్ కోర్సులు కొంత ఫర్వాలేదు. కానీ సైన్స్, మ్యాథమెటిక్స్తో అమ్మాయిలకు పెద్దగా ఉపయోగంలేదనే భావన నేటికీ ఉంది. స్టెమ్తో ఉజ్వల భవిత వాస్తవానికి స్టెమ్లోని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్.. ఈ నాలుగింటిలో ఏ కోర్సు పూర్తిచేసుకున్నా.. ఉజ్వల భవిత ఖాయంగా కనిపిస్తోంది. ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాలనే పరిశీలిస్తే.. ఉత్పత్తి రంగం మొదలు ఐటీ, ఆటోమేషన్ వరకు.. అవకాశాలు పుష్కలం. సైన్స్, మ్యాథమెటిక్స్ల్లో పీహెచ్డీ స్థాయి కోర్సులు పూర్తిచేస్తే విస్తృత ఉపాధి వేదికలు అందుబాటులోకి రావడం ఖాయం. కానీ, ఈ సబ్జెక్ట్లలో ఈ స్థాయి నిపుణులు లేక పరిశ్రమ వర్గాలు, పరిశోధన కేంద్రాలు స్కిల్ గ్యాప్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మార్గాలు అనేకం స్టెమ్ కోర్సులు అభ్యసించేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో కోర్సులు అభ్యసించే అవకాశముంది. సైన్స్ కోర్సుల అభ్యర్థులు.. ఐఐఎస్ఈఆర్, ఐఐఎస్సీ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే రీసెర్చ్ వైపు అడుగులు వేసే వీలుంది. స్కిల్ గ్యాప్.. ప్రధాన సమస్య స్టెమ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. జాబ్ మార్కెట్లో స్కిల్ గ్యాప్ అనేది ప్రధాన సమస్యగా మారింది. అకడమిక్ స్థాయిలో సరైన సదుపాయాలు లేకపోవడం, ఇండస్ట్రీ వర్గాలు ఇన్స్టిట్యూట్లతో కలిసి నడవకపోవడం ఇందుకు ముఖ్య కారణంగా కనిపిస్తోంది. తాజా సర్వే ప్రకారం కంపెనీలు తమ ఉద్యోగుల్లో స్టెమ్ నైపుణ్యాలు పెంపొందించేలా శిక్షణ ఇవ్వాలని 87 శాతం మంది పేర్కొనడం స్కిల్ గ్యాప్ సమస్యకు నిదర్శనంగా చెప్పొచ్చు. అక్కడా భారతీయ నిపుణులు వాస్తవానికి మన దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న స్టెమ్ నిపుణుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం అమెరికా మొదలు పలు దేశాల్లోని సంస్థల్లో పనిచేస్తున్న స్టెమ్ నిపుణుల్లో భారతీయుల సంఖ్య 20 నుంచి 30 శాతంగా ఉంది. ఈ నిపుణులు దేశంలోనే ఉండేలా ప్రోత్సాహకాలు అందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి మేధో వలసలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భవిష్యత్తుకు స్టెమ్ నిపుణులే పునాది ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిశోధనల దృష్ట్యా.. భవిష్యత్తులో స్టెమ్ నిపుణులుæ దేశ ప్రగతికి పునాదులుగా నిలవనున్నారు. అందుకు తగ్గట్టుగా స్టెమ్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించాలని, స్కిల్ గ్యాప్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సైన్స్, మ్యాథమెటిక్స్ వంటి అంశాల్లో పరిశోధనలు చేసే వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు మరింత పెంచాలంటున్నారు. అదే విధంగా ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించి నూతన నైపుణ్యాలు అందించే విధంగా ప్రత్యేక ఇన్స్టిట్యూట్లు, కోర్సులు ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఇండస్ట్రీతో కలిసి స్టెమ్ విభాగాల్లో నెలకొన్న స్కిల్ గ్యాప్ సమస్య పరిష్కారానికి ఇన్స్టిట్యూట్లు, ఇండస్ట్రీ వర్గాలతో కలిసి పనిచేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోర్సు ప్రారంభించే సమయంలో ఇండస్ట్రీ వర్గాలతో సంప్రదించి పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను కరిక్యులంలో చేర్చాలి. అలాగే పరిశోధనల పరంగా జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ చేపట్టడం, వాటిలో విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా స్కిల్ గ్యాప్ సమస్యను అధిగమించే వీలుంది. ప్రోత్సాహకాలు అందించేలా స్టెమ్ కోర్సుల్లో చేరే మహిళా విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని నిపుణులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించి, ఆడ పిల్లలు సైతం స్టెమ్ విభాగాల్లో ముందంజలో నిలిచేలా చర్యలు తీసుకోవాలం టున్నారు. ఐఐటీల్లో మహిళల కోసం ప్రత్యేకంగా సూపర్ న్యూమరరీ కోటా పేరుతో సీట్లు కేటాయిస్తున్నప్పటికీ.. ఇతర ఇన్స్టిట్యూట్లు, కోర్సులకు కూడా వీటిని వర్తించాలనే అభిప్రాయం వినిపిస్తోంది. స్టెమ్ కోర్సులు.. సర్వే ముఖ్యాంశాలు ♦ దేశ అభివృద్ధిలో స్టెమ్ ఉద్యోగాలే కీలకమని చెప్పిన వారు– 84 శాతం. ♦ స్టెమ్ ఎడ్యుకేషన్ ముఖ్యం అన్నవారు–96% ♦ స్టెమ్ విభాగాల్లో మహిళా రోల్ మోడల్స్ లేకపోవడం కూడా సమస్యగా ఉందని చెప్పిన వారి సంఖ్య–44 శాతం. ♦ అమెరికాలో ప్రతి పది మందిలో ఆరుగురులో స్టెమ్ కోర్సుల పట్ల ఆసక్తి. కానీ, ప్రతి పది మందిలో నలుగురు ఈ విభాగంలో సరైన ప్రోత్సాహం లేదని చెప్పారు. ఎలాంటి సందేహం లేదు స్టెమ్ కోర్సులతో అటు ఇండస్ట్రీకి, ఇటు విద్యా ర్థులకు ప్రయోజనాలు చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య మ రింత పెరగాల్సిన అవ సరం ఉంది. ఇటీవల కాలంలో ఆసక్తి పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ, మార్కెట్ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది తక్కువనే చెప్పాలి. దీనికి పరిష్కారం ఈ కోర్సుల పట్ల విద్యార్థుల్లో ముందు నుంచే అవగాహన కల్పించడం.– ప్రొఫెసర్ ఎం.జె.స్వామి, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ, హెచ్సీయూ. -
ఏమిటీ సరా..?
కొద్ది రోజులుగా సరా (sarahah) యాప్ పేరు మార్మోగుతోంది. ఈజిప్ట్, సౌదీ అరేబియా దేశాల్లో విడుదలైన ఈ యాప్ అకస్మాత్తుగా భారత మార్కెట్లో హల్చల్ చే స్తూ.. చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ దీని కథేమిటో తెలుసా..? మెసెంజింగ్ యాప్ సరా యాప్ మెసేజ్ సెండింగ్, రిసీవింగ్ కోసం రూపొందించినది. అలా అని జీమెయిల్ లాంటిది కాదు. మీ ప్రొఫైల్ను క్రియేట్ చేసుకుంటే దాన్ని చూసి మీకు ఎవరైనా ఫీడ్ బ్యాక్ పంపించే యూనిక్ ఫీచర్తో వచ్చిన యాప్. ఆకాశరామన్న ఉత్తరాల్లాగా అజ్ఞాత వ్యక్తి ఫీడ్బ్యాక్, కామెంట్స్ ఈ యాప్ ప్రత్యేకం. ఐవోఎస్, ఆండ్రాయిడ్ల్లో లభిస్తుంది. ఎలా పనిచేస్తుందంటే..? మెయిల్ ఐడీ, సోషల్ మీడియా అకౌంట్ మాదిరిగానే సరా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. దీన్ని ఎవరైనా చూసే విధంగా ఉంటుంది. అంతేకాక ఇతరులు లాగిన్ కావల్సిన అవసరం కూడా లేకుండా ప్రొఫైల్ను చూడటమే కాదు.. మెసేజ్లు కూడా పంపవచ్చు. అలాగే అవతలి వ్యక్తి లాగిన్ అయితే వాళ్ల మెసేజ్లను మీరు ట్యాగ్ చే సుకోవచ్చు. మీ ప్రొఫైల్ను ఆధారంగా చేసుకుని అవతలి వ్యక్తి మీకు కామెంట్స్ పంపవచ్చు. రిసీవర్ యాప్లోని ఇన్బాక్స్లో మీకు నచ్చిన మెసేజ్లు చూసుకోవచ్చు. వాటిని ఫ్లాగ్ చేసుకోవచ్చు లేదా తొలగించవచ్చు. సమాధానం కూడా ఇవ్వొచ్చు. నచ్చినవాటిని ఫేవరెట్గా పెట్టుకోవచ్చు. భిన్నాభిప్రాయాలు తక్కువ సమయంలో ప్రజాదరణ సంపాదించినా ఈ యాప్ పనితీరుపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫైల్ను సెర్చ్ నుంచి తొలగించడం, ఆడియన్స్ను పరిమితం చేయడం, అనాథరైజ్ యూజర్లు మీ ప్రొఫైల్ను షేర్ చేయకుండా, లాగిన్ కాకుండా కామెంట్ చేయలేని విధంగా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. అంటే కేవలం లాగిన్ అయిన వారు మాత్రమే కామెంట్ పెట్టగలుగుతారు. నెగిటివ్ కామెంట్ ఇచ్చే వ్యక్తులను బ్లాక్ చేయొచ్చు. ఇన్ని ఫీచర్లు ఉన్నా కూడా ప్రైవసీ విషయంలో ఇంకా శ్రద్ధ పెట్టాల్సి ఉందన్నది యూజర్ల అభిప్రాయం. -
దేశంలోనే తొలి విదేశ్ భవన్ ప్రారంభం
జమిలి ఎన్నికలకు నీతి ఆయోగ్ సిఫారసు దేశంలో 2024 నాటికి లోక్సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. దీనికోసం కొన్ని రాష్ట్రాల శాసనసభల కాలాన్ని పొడిగించడమో/తగ్గించడమో చేయాలని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇదేమంత పెద్ద విషయం కాదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. ఆగస్టు 27న విడుదల చేసిన తన త్రైవార్షిక(2017–18 నుంచి 2019–20) ప్రణాళికలో పలు అంశాలను వెల్లడించింది. బార్కోడ్తో యుద్ధ వాహనాల ప్రారంభం సైన్యం అవసరాలకు అనుగుణంగా బార్కోడ్తో రూపొందించిన అత్యాధునిక బీఎంపీ–2 వాహనాలను ఆర్మీకి అందించే కార్యక్రమాన్ని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 27న సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారంలో ప్రారంభించారు. బార్కోడ్ ఆధారంగా వాహన ఉత్పత్తికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ట్రిపుల్ తలాక్ చెల్లదన్న సుప్రీంకోర్టు ముస్లిం సమాజంలో ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులివ్వడం ఇకపై కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇది చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో ఈ తీర్పు వెలువరించింది. ట్రిపుల్ తలాక్ను కొట్టివేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ఆగస్టు 22న 395 పేజీల తీర్పులో పేర్కొన్నారు. పునరాలోచన చేసుకునేందుకు ఆస్కారం లేని, క్షణాల్లో ఇచ్చేసే ట్రిపుల్ తలాక్ అంగీకార యోగ్యం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులివ్వడం అత్యంత ఏక పక్షం, అహేతుకం, రాజ్యాంగ ఉల్లంఘన అని పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల మధ్య ‘విద్యుత్’ సహకారం దక్షిణాది రాష్ట్రాలు విద్యుత్ను పరస్పరం ఇచ్చి పుచ్చుకునేందుకు అంగీకరించాయి. దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ(ఎస్ఆర్పీసీ) అధ్యక్షుడు, తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు అధ్యక్షతన కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆగస్టు 22న ముగిసిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఛత్తీస్గఢ్లో ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఛత్తీస్గఢ్లో 55 లక్షల స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 23న నిర్ణయించింది. ఈ పథకానికి సంచార్ క్రాంతి యోజన అని పేరు పెట్టారు. ఓబీసీ ఉప వర్గీకరణకు కేంద్రం నిర్ణయం కేంద్ర జాబితాలోని ఓబీసీ(ఇతర వెనకబడిన కులాలు) ఉప వర్గీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 23న నిర్ణయించింది. చైర్పర్సన్ను నియమించిన నాటి నుంచి 12 వారాల్లోపు ఈ కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కాగా జాతీయ స్థాయిలో ఓబీసీ కేటగిరీలో క్రీమీలేయర్ గరిష్ట వార్షికాదాయ పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచారు. ఫుడ్ ప్రాసెసింగ్ పథకం పేరు మార్పు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పథకానికి ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనగా పేరు మార్చేందుకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 23న అంగీకరించింది. రూ.6,000 కోట్లు కేటాయించిన ఈ పథకం ద్వారా 2020 నాటికి 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. 5.30 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలోనే తొలి విదేశ్ భవన్ ప్రారంభం ముంబైలో ఏర్పాటుచేసిన విదేశ్ భవన్ను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగస్టు 27న ప్రారంభించారు. దేశంలో ఈ తరహా కార్యాలయం ఏర్పాటుకావడం ఇదే ప్రథమం. విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి మహారాష్ట్రలో ఉన్న అన్ని కీలక కార్యాలయాలు విదేశ్ భవన్లో ఉంటాయి. డేరా సచ్చా సౌధా చీఫ్కు 20 ఏళ్ల జైలు శిక్ష డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్కు సీబీఐ కోర్టు ఆగస్టు 28న 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2002 నాటి రెండు అత్యాచార కేసుల్లో(ఒక్కో కేసులో పదేళ్ల చొప్పున) శిక్ష విధిస్తూ న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ తీర్పు వెలువరించారు. జైలు శిక్షతోపాటు ఒక్కో కేసుకు రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షల జరిమానా కూడా విధించారు. వ్యక్తిగత గోప్యత.. ప్రాథమిక హక్కు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు ఆగస్టు 24న స్పష్టం చేసింది. వ్యక్తుల గౌరవప్రదమైన జీవితానికి ఈ హక్కు తప్పనిసరని తెలిపింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వానికి ఉండే హక్కుల్ని, పరిమితుల్ని గుర్తుచేసింది. డిజిటల్ ప్రపంచంలో సమాచారాన్ని భద్రపరచాల్సిన జాగ్రత్తలన్నీ సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. సివిల్ సర్వీసెస్ అధికారులకు జోన్ల వారీ కేడర్లు సివిల్ సర్వీస్ అధికారులకు కేడర్ల కేటాయింపునకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ఖరారు చేసింది. సివిల్ సర్వీస్ అధికారుల్లో జాతీయ సమగ్రత భావనను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నూతన విధానం ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 26 కేడర్లను ఐదు జోన్లుగా విభజించారు. దీంతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఇకపై రాష్ట్రాలకు బదులు జోన్ల కేడర్లను ఎంపిక చేసుకోవాలి. క్రీడలు సింధుకి రజతం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్ పీవీ సింధు రజత పతకం కైవసం చేసుకుంది. గ్లాస్గో(స్కాట్లాండ్)లో ఆగస్టు 27న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నోజొమి ఓకుహార చేతిలో సింధు ఓటమి చవిచూసింది. ఈ ఛాంపియన్షిప్లో సింధు పతకం సాధించడం ఇదో మూడోసారి. 2013, 14ల్లో కాంస్య పతకాలు పొందింది. మహిళల డబుల్స్ టైటిల్ను చెన్ క్వింగ్ చెన్, జియో విఫాన్ (చైనా) గెలుచుకోగా పురుషుల సింగిల్స్ టైటిల్ను విక్టర్ ఆక్సెల్స్న్ (స్వీడన్) గెలుచుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను మొహమ్మద్ ఆసన్, లిలియానా నట్సిర్ (ఇండోనేషియా) కైవసం చేసుకున్నారు. మేవెదర్ వరల్డ్ రికార్డులు అమెరికా స్టార్ ప్లేయర్ ఫ్లాయిడ్ మేవెదర్.. ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో అజేయంగా నిలిచిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. లాస్వేగాస్(అమెరికా)లో ఆగస్టు 27న జరిగిన జూనియర్ సూపర్ ఫైట్ బౌట్లో గెలుపొందడం ద్వారా ప్రొఫెషనల్ కెరీర్లో వరుసగా 50వ విజయాన్ని నమోదు చేశాడు. మేవెదర్ పోటీపడిన 50 బౌట్లలోనూ ఆయనే విజేత. 49 వరుస విజయాలతో అమెరికా హెవీ వెయిట్ ప్రొఫెనల్ బాక్సర్ రాకీ మర్సియానో పేరిట ఉన్న రికార్డును మేవెదర్ అధిగమించాడు. కాగా తాను మళ్లీ రింగ్లోకి దిగే అవకాశాలు లేవని మేవెదర్ ప్రకటించాడు. హామిల్టన్కు బెల్జియం గ్రాండ్ ప్రీ టైటిల్ బెల్జియం ఫార్ములావన్ గ్రాండ్ ప్రీ టైటిల్ను లూయిస్ హామిల్టన్ సాధించాడు. ఆగస్టు 27న బెల్జియంలో జరిగిన రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. 32 ఏళ్ల హామిల్టన్(బ్రిటన్)కు ఇది ఓవరాల్గా 58వ విజయం. వార్తల్లో వ్యక్తులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా దీపక్ మిశ్రా సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా ఆగస్టు 28న బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ జేఎస్ ఖేహర్ పదవీ కాలం ముగియడంతో నూతన చీఫ్ జస్టిస్గా దీపక్ మిశ్రా చేత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. మిశ్రా ఈ పదవిలో 13 నెలలు కొనసాగుతారు. కరెంట్ అఫైర్స్ మూడు క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా ఉత్తర కొరియా మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా సైనిక అధికారులు ఆగస్టు 26న పేర్కొన్నారు. పసిఫిక్ సముద్ర తూర్పు జలాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించిందని తెలిపారు. మొదటి రెండు విఫలమవడంతో మూడోది ప్రయోగించినట్లు చెప్పారు. 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై ప్రయోగించే ఈ మూడు క్షిపణులు తేలికపాటివే అన్నారు. నేపాల్తో ఎనిమిది ఒప్పందాలు నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా భారత పర్యటనలో ఆగస్టు 24న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తమ గడ్డపై భారత వ్యతిరేక కార్యకాలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎనిమిది ఒప్పందాలు కుదిరాయి. ఇందులో మాదకద్రవ్యాల రవాణాకు కళ్లెం వేయడం, భూకంప అనంతర పునర్నిర్మాణ చర్యలతోపాటు వివిధ అంశాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన ఒడంబడికలు ఉన్నాయి. అవార్డులు 2017 క్రీడా పురస్కారాలు 2017 ఏడాదికి క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 22న ప్రకటించింది. వీటిని ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేశారు. ఇద్దరికి ‘రాజీవ్ ఖేల్రత్న’, ఏడుగురికి ‘అర్జున’, మరో ఏడుగురికి ‘ద్రోణాచార్య’, ముగ్గురుకి ‘ధ్యాన్చంద్’ పురస్కారాలు అందజేసింది. భారత పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియాకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్రత్న దక్కింది. రియో పారాలింపిక్స్లో జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జఝరియా రెండు స్వర్ణాలు గెలుపొందాడు. 25 ఏళ్ల ఖేల్రత్న అవార్డుల చరిత్రలో ఈ పురస్కారాన్ని ఓ పారాలింపియన్ అందుకోవడం ఇదే తొలిసారి. దశాబ్ద కాలానికి పైగా భారత హాకీకి సేవలందిస్తున్న మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్కు కూడా ఖేల్రత్న దక్కింది. ∙ రాజీవ్ ఖేల్రత్న: దేవేంద్ర జఝరియా (పారా అథ్లెటిక్స్), సర్దార్ సింగ్ (హాకీ) ∙అర్జున: జ్యోతి సురేఖ(ఆర్చరీ), సాకేత్ మైనేని(టెన్నిస్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి(బాస్కెట్ బాల్), దేవేంద్రోసింగ్(బాక్సింగ్); పుజారా, హర్మన్ ప్రీత్ కౌర్(క్రికెట్); ఒయినమ్ బెంబెందేవి(ఫుట్బాల్), చౌరాసియా (గోల్ఫ్), సునీల్(హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాశ్ నంజప్ప(షూటింగ్), ఆంథోనీ అమల్రాజ్ (టేబుల్ టెన్నిస్), మరియప్పన్ తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెటిక్స్), సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్). ద్రోణాచార్య: డాక్టర్ ఆర్.గాంధీ (అథ్లెటిక్స్), హీరానంద్ కటారియా (కబడ్డీ), జీఎస్వీ ప్రసాద్(బ్యాడ్మింటన్), బ్రిజ్ భూషన్ మహంతి(బాక్సింగ్), రోహన్లాల్(రెజ్లింగ్), రాఫెల్(హాకీ), సంజయ్ చక్రవర్తి(షూటింగ్). ధ్యాన్చంద్: భూపిందర్ సింగ్(అథ్లెటిక్స్), సయ్యద షాహిద్ హకీం(ఫుట్బాల్), సుమరాయ్ టకే(హాకీ). -
జాతీయ సమైక్యత
భారతదేశం విభిన్న మతాలు, సంస్కృతులు, జాతులు, భాషలు, కులాలు, తెగలు, భౌగోళిక ప్రత్యేకతలకు నిలయం. దేశంలో ఉన్న వైవిధ్యాలు, వైరుధ్యాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఈ వైవిధ్యాల వల్ల దేశంలో జాతీయ సమైక్యతతో కూడిన సమగ్ర అభివృద్ధిని సాధించడం పాలకులకు సవాలుగా మారింది. దేశంలో సామాజిక నిర్మితి మత, కుల ప్రాతిపదికపై ఉండటం వల్ల జాతీయ సమైక్యతకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. జాతీయ సమైక్యత అనేది ఒక ప్రబలమైన మానసిక భావోద్వేగం. ఒక ప్రాంతంలో కొన్నేళ్లపాటు జీవించినప్పుడు ఆ ప్రాంతం పట్ల మమకారం, ప్రేమ, అనుబంధం ఏర్పడతాయి. అలాంటి సందర్భాల్లో జాతి, మత, కుల, లింగ, ప్రాంత భేదాలు లేకుండా మనమంతా భారతీయులమనే విశాల, ఉదాత్త భావోద్వేగం కలుగుతుంది. దేశం పట్ల ఉన్న ఇలాంటి భావజాలాన్ని జాతీయ సమైక్యత అంటారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిప్రాయం ప్రకారం జాతీయ సమైక్యత అనేది ప్రజాబాహుళ్య ఆలోచనల పరంపర నుంచి వెలువడే మేధో కాంతి వంటిది. జాతీయ సమైక్యత అనేది రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మనోవైజ్ఞానిక రంగాలకు సంబంధించింది. అలాగే ఆయా రంగాల్లో ప్రజలందరి మధ్య సత్సంబంధాలను ఏర్పరచే ఒక బృహత్తర కార్యభావం. జాతీయ సమైక్యతకు అవరోధాలు/సమస్యలు జాతీయ సమైక్యతకు ఎదురవుతున్న అవరోధాలు లేదా సమస్యలను కింది విధంగా పేర్కొనవచ్చు. అవి..మతతత్వం: భారతదేశం అనేక మతాలకు నిలయం. భారత రాజ్యాంగం అన్ని మతాల పట్ల సమాన గౌరవం, తటస్థ వైఖరి కలిగి ఉంటుంది. మత స్వేచ్ఛను రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా గుర్తించింది. అల్ప సంఖ్యాక వర్గాలకు ప్రత్యేక హక్కులను కల్పించింది. అయితే దేశంలో పలు మతాల మధ్య గల భేదాల ఆధారంగా మతతత్వాన్ని ఒక రాజకీయవాదంగా ఉపయోగించుకోవడం వల్ల అది మతమౌఢ్యానికి దారితీసింది. చారిత్రకంగా పరిశీలిస్తే మన దేశంలో బ్రిటిష్ పాలనా కాలంలోనే మత గుర్తింపులు ప్రస్ఫుటంగా వెలుగులోకి వచ్చాయి. బ్రిటిష్ వారి కాలంలో మత ప్రాతిపదికన ఏర్పాటైన సంస్థలు, ప్రత్యేక ఓటర్లు, బ్రిటిష్ వారి విభజించు–పాలించు విధానం, మహ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతం మొదలైన వాటి ఫలితంగా భారత్ రెండు దేశాలుగా విడిపోయింది (పాకిస్థాన్ విడిపోవడం). ఈ విభజన ఒక విషాద ఘటనగా మిగిలిపోయింది. ఈ సందర్భంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో మత ప్రాతిపదికన ప్రజలను సమీకరించే ప్రయత్నం జరిగింది. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ప్రజల్లో మత విభజన స్పష్టంగా గోచరిస్తుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, గుజరాత్, మహారాష్ట్రల్లో మతపరమైన హింస జరుగుతూనే ఉంది. ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కు వ్యతిరేక సంఘర్షణలు, అలాగే బాబ్రీ మసీదు సంఘటన, గుజరాత్లో జరిగిన మత ఘర్షణలు దేశ సమైక్యతకు సవాలుగా మారాయి. కులతత్వం భారత సమాజంలో అనేక కులాలు, ఉపకులాలు ఉన్నాయి. కులపరమైన ప్రత్యేకతలు, కుల సంఘీభావం ఉండటం సమంజసమే. అయితే అది కులతత్వంగా పరిణమించినప్పుడు జాతి సమైక్యతకు ప్రమాదంగా మారుతోంది. కుల తత్వమంటే ఒక కులం పట్ల మరొక కులం ఈర్ష్య, ద్వేషం, పక్షపాతంతో కూడిన ప్రవర్తన. అధికారం కోసం రాజకీయ పార్టీలు కులాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి. తద్వారా సమాజం కుల ప్రాతిపదికన విడిపోతోంది. అది దేశ ఐక్యత, సమగ్రతకు సవాలుగా పరిణమిస్తోంది. ఉగ్రవాదం, తీవ్రవాదం ఇటీవలి కాలంలో ఇవి అంతర్జాతీయ సమస్యలుగా పరిణమించాయి. భారత్తో పాటు చాలా దేశాలు ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. ఉగ్రవాదం, తీవ్రవాదం పదాలకు నిర్వచనాలు వేరైనా వాటి ప్రభావం మాత్రం సమాజంపై ఎక్కువగా ఉంటోంది. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్లలో జరుగుతున్న బాంబు పేలుళ్లు, కశ్మీర్లో నిత్యం జరిగే అల్లర్లు భారత ఐక్యతకు, సమగ్రతకు ప్రధాన సవాళ్లుగా పరిణమించాయి. నేరమయ రాజకీయాలు ఆధునిక వ్యవస్థలో ప్రజాస్వామ్యానికి తీవ్ర సవాలుగా మారిన అంశం రాజకీయ ప్రక్రియ నేరమయం కావడం. 1993లో ఎన్ఎన్ వోహ్రా కమిటీ ఈ అంశంపై సా«ధికారిక నివేదిక ఇచ్చింది. కొందరు రాజకీయ నాయకులు, మాఫియా కుమ్మక్కై భూముల ఆక్రమణ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పలు వివరాలను వెల్లడించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన సుమారు 5380 మంది అభ్యర్థులు ఇచ్చిన అఫిడవిట్లలో 17% మందిపై నేరారోపణలు, 10% మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్లో 30%, మహారాష్ట్రలో 26%, బిహార్లో 16%, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 11% మంది అభ్యర్థులపై నేరారోపణలున్నాయి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పాలనకు ఇది పెను సవాలుగా మారింది. ప్రాంతీయ తత్వం మితిమీరిన ప్రాంతీయ తత్వం దేశ ఐక్యతకు, సమగ్రతకు ప్రమాదం. రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి ప్రాంతీయ ఉద్యమాలు భాష, సంస్కృతుల పరిరక్షణకు మాత్రమే పరిమితమై ఉండేవి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఈ సమస్య సమసిపోయింది. ఆ తర్వాతి కాలంలో అంటే 1975 తర్వాత ప్రాంతీయ ఉద్యమాలు ఆర్థిక సమానత్వం కోసం వచ్చాయి. ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాలు ఇతర ప్రాంతాల ఆధిపత్యానికిలోనై సాంస్కృతిక ప్రత్యేకతను కోల్పోతాయి. మొదట్లో ఈ ఉద్యమాలకు సంబంధించి వాటి న్యాయమైన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం జరిగినా తర్వాత వాటిని అణగదొక్కే యత్నం జరిగింది. దీంతో అవి శాంతిభద్రతలు, ఐక్యత, సమగ్రతలకు తద్వారా రాజ్యాంగ అమలుకు సవాలుగా మారాయి. అలాగే గిరిజనులు, దళితులు, పేద రైతులు, కార్మికులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఇలాంటివి దేశంలో ఏదో ఒక చోట తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించడం లేదా అణచివేయడం వల్ల మరికొన్ని కొత్త సమస్యలు వస్తున్నాయి. ముగింపు జాతీయ సమైక్యతకు ఎదురవుతున్న సమస్యలను విశాల దృక్పథంతో పరిశీలిస్తే వాటిలో ప్రధాన మైనవి ఆర్థిక సమస్యలని స్పష్టమవుతుంది. ఆర్థిక వెనకబాటుతనం, పేదరికం వివిధ రూపాల్లో వేర్పాటువాదానికి, భూమి పుత్రుల భావానికి దారితీస్తుంది. తద్వారా ప్రాంతీయ, ఉపప్రాంతీయ భావజాలం బలపడుతూ ఉంది. మౌలిక సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వివక్షతలు, తీవ్రవాద, ఉగ్రవాదాలకు కారణంగా మారాయి. అందువల్ల సంతులిత ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ప్రజలు జాతీయ భావాలను పెంపొందించుకోవాలి. ఈ మేరకు విద్యను సార్వత్రికం చేయాలి. జాతీయ సమైక్యతను పెంపొందించే మార్గాలు ప్రజల్లో మత, ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే కార్యక్రమాలకు రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలి. జాతి, కుల, భాషా భేదాలను ప్రోత్సహించకూడదు. మత సమస్యలను పరిష్కరించేందుకు రాజ్యాంగేతర ఆందోళన పద్ధతులను అనుమతించకూడదు. రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగించకూడదు. పాఠ్యాంశాల్లో మతతత్వ అంశాలను తొలగించాలి. జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేయాలి. -
అత్యంత నివాసయోగ్య నగరం?
‘చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’లోచ ప్రధాని ప్రసంగం నీతి ఆయోగ్ నేతృత్వంలో ఆగస్టు 17న ‘చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రభుత్వ చర్యలు, కార్యక్రమాలతోనే నవ భారత నిర్మాణం జరగదని, ప్రతి భారతీయుడూ మార్పు కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో 200 మంది యువ స్టార్టప్ వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు. సాఫ్ట్ పవర్, ఇంక్రెడిబుల్ ఇండియా 2.0, విద్య– నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం–పౌష్టికాహారం, డిజిటల్ ఇండియా, 2022 నాటికి నవ భారత నిర్మాణం తదితర ఇతివృత్తాలతో ప్రజెంటేషన్ ఇచ్చారు. డిజిటల్ పోలీస్ పోర్టల్ సేవలు ప్రారంభం డిజిటల్ పోలీస్ పోర్టల్(డీపీపీ)ని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ ఆగస్టు 21న ప్రారంభించారు. నేరాలు, నేరస్థులపై నిఘా నెట్వర్క్ వ్యవస్థలు (సీసీటీఎన్ఎస్) అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని రూపొందించారు. నేరాలు, నేరస్థుల వివరాలతో జాతీయ సమాచార నిధి ఏర్పాటే సీసీటీఎన్ఎస్ లక్ష్యం. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఫిర్యాదుల నమోదు, వివరాల ధ్రువీకరణ, అభ్యర్థనలు తదితర సేవలు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు 11 శోధన సదుపాయాలను, 46 నివేదికలను రాష్ట్ర పోలీస్ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు, పరిశోధన సంస్థలు పొందొచ్చు. సీసీటీఎన్ఎస్ సమాచార నిధిలో ఇప్పటివరకు ఏడు కోట్ల నేరాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. బిహార్ వరదల్లో 98 మంది మృతి బిహార్లో వరదల వల్ల ఆగస్టు 18 నాటికి 98 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 జిల్లాలకు చెందిన 93 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2.13 లక్షల మంది 504 సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. జాతీయ రహదారులతోపాటు 124 రోడ్లు ధ్వంసమయ్యాయి. 70 మంది ఆర్మీ సిబ్బంది, 114 ఎన్డీఆర్ఎఫ్, 92 ఎస్డీఆర్ఎఫ్ బోట్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉత్కళ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో 22 మంది మృతి ఉత్కళ్ ఎక్స్ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా ఖత్లి వద్ద ఆగస్టు 19న పట్టాలు తప్పడంతో 22 మంది మరణించారు. 156 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అమెరికా నుంచి భారత్కు తొలిసారిగా ముడి చమురు దిగుమతి ప్రపంచంలో మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారు అయిన భారత్ తొలిసారిగా అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. మొదటి దఫా రవాణా ఆగస్టు 8–14 మధ్య మొదలైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొనుగోలు చేసిన ఈ చమురు సెప్టెంబర్లో భారత్కు చేరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ జూన్లో అమెరికాలో పర్యటించినప్పుడు ఇరు దేశాలు ఇంధన రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించడంతో చమురు కొనుగోలు మొదలైంది. ఇందులో భాగంగా ఐఓసీ అమెరికా నుంచి 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. దీంతో అగ్ర రాజ్యం నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. దక్షిణ కొరియా, జపాన్, చైనా, థాయ్లాండ్, ఆస్ట్రేలియా, తైవాన్ ఇప్పటికే అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్).. ముడి చమురు ఉత్పత్తిలో కోత విధించడంతో ధరలు పెరిగాయి. దీంతో మధ్య ప్రాచ్య దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఇతర ప్రాంతాల నుంచి చమురు కొనుగోలును ప్రారంభించాయి. కరెంట్ అఫైర్స్ అత్యంత నివాసయోగ్య నగరంగా మెల్బోర్న్ ప్రపంచంలో అత్యంత నివాసయోగ్య నగరంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎంపికైంది. ఆస్ట్రియా రాజధాని వియన్నా, కెనడాలోని వాంకోవర్, టొరంటో, కల్గరీ.. వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మొత్తం 140 నగరాల్లో స్థిరత్వం, ఆరోగ్య సేవలు, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక వసతులు తదితర 30 అంశాల ఆధారంగా సర్వే చేశారు. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలను ఆగస్టు 17న న్యూయార్క్లో విడుదల చేశారు. ‘బాల మేధావి’ రాహుల్ దోశి బ్రిటన్లోని టీవీ చానల్ 4 నిర్వహించిన చైల్డ్ జీనియస్ క్విజ్ పోటీల్లో భారత సంతతికి చెందిన రాహుల్ దోశి విజేతగా నిలిచాడు. ఆగస్టు 19న నిర్వహించిన ఈ పోటీలో రాహుల్ 162 ఐక్యూ (ఇంటలిజెంట్ కోయిషెంట్) స్కోర్ సాధించాడు. ఇది అల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ ఐక్యూల కన్నా ఎక్కువ. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త వార్షిక సైనిక విన్యాసాలు ఆగస్టు 21న ప్రారంభమయ్యాయి. తమ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఉత్తర కొరియా అభ్యంతరాల మధ్యే ఈ విన్యాసాలు జరగడం గమనార్హం. వేలాది మంది సైనికులు ఈ ఉల్చి–ఫ్రీడం గార్డియన్ సంయుక్త సైనిక కసరత్తు నిర్వహించారు. దక్షిణ కొరియాలో రెండు వారాల పాటు సాగే ఈ విన్యాసాల్లో క్షేత్ర స్థాయిలో కాల్పులు, యుద్ధ ట్యాంకుల విన్యాసాలు వంటివేవీ లేకుండా కంప్యూటర్ల ఆధారంగా సాధన జరుగుతుంది. వీటిలో సుమారు 17,500 మంది అమెరికా సైనికులు, 50 వేల మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొంటారు. కాగా ఇవి రక్షణాత్మక విన్యాసాలేనని, ద్వీపకల్పంలో ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేవి కాదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేఇన్ పేర్కొన్నారు. అమెరికాలో 99 ఏళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికాలో ఆగస్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఒరెగాన్(పశ్చిమ తీరం)లోని లింకన్ బీచ్లో మొదలైన ఈ గ్రహణం 14 రాష్ట్రాల ద్వారా సాగింది. దీని వల్ల 70 కిలోమీటర్ల వెడల్పు ప్రాంతం చీకటిమయమైంది. అగ్రరాజ్యంలో దాదాపు 99 ఏళ్ల తర్వాత సంభవించిన ఈ సంపూర్ణ సూర్యగ్రహణం సుమారు 90 నిమిషాల పాటు కొనసాగింది. స్పెయిన్ ఉగ్రదాడిలో 13 మంది మృతి స్పెయిన్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బార్సిలోనాలోని లాస్ రాంబ్లాస్లో ఆగస్టు 17న ఓ వ్యాను పర్యాటకులపైకి దూసుకుపోవడంతో 13 మంది మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాదుల దాడి అని పోలీసులు ధ్రువీకరించారు. రోదసీలోకి చేరిన తొలి సూపర్ కంప్యూటర్ మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ (స్పేస్ బర్నో కంప్యూటర్) ఆగస్టు 16న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరింది. ఈ ప్రయోగాన్ని ఆగస్టు 7న ఫ్లోరిడాలోని కేప్కెనవారాల్లో నిర్వహించారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన 2,900 కిలోల మానవ రహిత రవాణా వ్యోమ నౌక డ్రాగన్ ఈ సూపర్ కంప్యూటర్ను మోసుకెళ్లింది. ఇప్పటికే రోదసీలో ఉన్న వ్యోమగాములకు ఈ నౌక ఆహారం, ప్రత్యేక దుస్తులను కూడా తీసుకెళ్లినట్లు నాసా పేర్కొంది. సూపర్ కంప్యూటర్ను హ్యూలెట్ ఎయాకార్డ్ సంస్థ రూపొందించింది. ఇది స్పేస్ ఎక్స్కు సంబంధించి 12వ అంతరిక్ష ప్రయోగం. ఈ సూపర్ కంప్యూటర్ అంతరిక్షంలోని ప్రతికూల వాతావరణంలో పనిచేయగలదా లేదా అనే అంశాన్ని పరిశోధకులు పరీక్షించనున్నారు. నౌకాదళంలోకి ఉభయచర యుద్ధనౌక నేల పైన, సముద్రంలోనూ పోరాడగల ఉభయచర యుద్ధనౌక ఆగస్టు 21న భారత నౌకాదళంలో చేరింది. ఈ అధునాతన ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ (ఎల్సీయూ) ద్వారా యుద్ధ ట్యాంకులను, ఇతర భారీ ఆయుధ వ్యవస్థలను, సైనిక బలగాలను యుద్ధ రంగానికి రవాణా చేయొచ్చు. దీన్ని కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ యుద్ధ నౌక అండమాన్ దీవుల్లో విధులు నిర్వర్తిస్తుంది. ఈ శ్రేణికి చెందిన మరో ఆరు నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి వచ్చే రెండేళ్లలో నౌకాదశంలో చేరనున్నాయి. ఉమెన్ హెల్ప్ లైన్ 181 ప్రారంభం తెలంగాణలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 24 గంటల హెల్ప్ లైన్ నంబర్ 181ను ఆగస్టు 19న ప్రారంభించారు. వేధింపులు, దాడులకు గురైన మహిళలు హెల్ప్లైన్కు ఫోన్ చేసి సాయం కోరవచ్చు. ఫోన్ చేసిన మహిళలకు సఖీ కేంద్రాలు, అంబులెన్స్, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ల ద్వారా సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆపదలో ఉన్నవారికి తాత్కాలిక వసతి కూడా కల్పిస్తారు. -
ప్రయాణం, పర్యాటకం
ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణ, పర్యాటక రంగం.. అత్యంత ప్రాధాన్యత గల పరిశ్రమగా రూపొందింది. పర్యాటక రంగ అభివృద్ధి.. రవాణా, వసతి, పర్యాటకులను ఆకర్షించడం, మార్కెటింగ్, ప్రభుత్వ నియంత్రణ తదితర అనేక అంశాలపై ఆధారపడి ఉంది. పర్యాటక రంగం.. విదేశీ మారక ద్రవ్య ఆర్జన ద్వారా సంపదను సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. స్మిత్ (1995) అభిప్రాయంలో పర్యాటక రంగ పరిశ్రమ ముఖ్య లక్షణం.. శ్రమ సాంద్రత.ఈ పరిశ్రమ ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుంది. ఒకే ఆదాయ స్థాయి, పెట్టుబడి మూలధనం వద్ద వ్యవసాయం, ఆటోమొబైల్, పెట్రోకెమికల్ రంగాల్లో కల్పించే ఉపాధి కంటే ప్రయాణ, పర్యాటక రంగంలో కల్పించే ఉపాధి అధికంగా ఉంటుంది. ప్రయాణ, పర్యాటక రంగం.. నైపుణ్యం లేని, మధ్యస్థ నైపుణ్యాలున్న, పూర్తిస్థాయి నైపుణ్యాలున్న శ్రామికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రపంచ ప్రయాణ, పర్యాటక మండలి (World Travel and Tourism Council )..‘ప్రయాణ, పర్యాటక రంగ ఆర్థిక ప్రభావం–2017’ పేరుతో విడుదల చేసిన నివేదికలో 185 దేశాల్లోని పరిస్థితులను వివరించింది. ప్రపంచ ప్రయాణ, పర్యాటక మండలి నివేదిక (2017) ఐక్యరాజ్యసమితి 2017ని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టెయినబుల్ టూరిజం ఫర్ డెవలప్మెంట్’గా వర్ణించింది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక రంగాల్లో ఒకటైన ప్రయాణ, పర్యాటక రంగం ప్రపంచవ్యాప్తంగా ఉపాధి కల్పనతోపాటు ఎగుమతుల పెంపు, సంపద సృష్టికి దోహదపడుతోంది. ఇది ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, పర్యావరణ, వారసత్వ విలువల పెంపునకు దోహదపడగలదని భావించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద కార్యకలాపాలు, రాజకీయ అస్థిరత్వ పరిస్థితులు ఉన్నప్పటికీ 2016లో ప్రత్యక్ష స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి 3.1 శాతాన్ని తన వాటాగా అందించడంతో పాటు 60 లక్షల నికర అదనపు ఉద్యోగాలను సృష్టించింది. మొత్తంమీద ఈ రంగం 2016లో 7.6 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని (ప్రపంచ జీడీపీలో 10.2 శాతాన్ని) అందించడంతోపాటు 29.20 కోట్ల మందికి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతి 10 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగాన్ని ఈ రంగం తన వాటాగా కలిగి ఉంది. మొత్తం ప్రపంచ ఎగుమతుల్లో ఈ రంగం వాటా 6.6 శాతం కాగా ప్రపంచ సేవల ఎగుమతుల్లో ఈ రంగం వాటా 30 శాతంగా నమోదైంది. 2017 వార్షిక నివేదిక 185 దేశాలు, ప్రపంచవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో 2016లో ఈ రంగంలో జరిగిన అభివృద్ధితోపాటు వచ్చే పదేళ్లలో అభివృద్ధి అంచనాలను వెల్లడించింది. వృద్ధి దిశగా పర్యాటకం 2016తో పోల్చితే 2017లో ప్రపంచ ప్రయాణ, పర్యాటక రంగ వృద్ధి 2.1 శాతం ఉండగలదని అంచనా. 2016లో ఈ రంగం ప్రత్యక్షంగా 10.87 కోట్ల మందికి ఉపాధి కల్పించింది. మొత్తం ఉపాధిలో ఈ రంగం వాటా 3.6 శాతం. 2017–27 మధ్య కాలంలో ఈ రంగంలో సగటు ఉపాధి వృద్ధిని 2.2 శాతంగా అంచనా వేశారు. 2017లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి వృద్ధి 1.9 శాతంగా, 2027 నాటికి సగటు సాంవత్సరిక ఉపాధి వృద్ధి 2.5 శాతంగా ఉండగలదని అంచనా. గత ఆరేళ్లుగా ప్రయాణ, పర్యాటక రంగంలో వృద్ధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును (2.5 శాతాన్ని) అధిగమించింది. 2016లోనూ ప్రయాణ, పర్యాటక రంగ వృద్ధి.. వరల్డ్ ట్రావెల్, టూరిజం కౌన్సిల్ రూపొందించిన ‘ప్రయాణ, పర్యాటకం – ఆర్థిక ప్రభావం 2017’ నివేదిక ప్రకారం మొత్తం 185 దేశాల్లోని 116 దేశాలు సాధించిన సగటు వార్షిక వృద్ధి కన్నా ఎక్కువ. ఆయా దేశాల్లో ఆర్థిక, వ్యాపార సేవలు; తయారీ, పౌర సేవలు; రిటైల్, పంపిణీ, రవాణా రంగం సాధించిన వృద్ధి కన్నా ప్రయాణ, పర్యాటక రంగం సాధించిన వృద్ధి అధికం. 2017లోనూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంపద, ఉపాధి కల్పనకు ప్రయాణ, పర్యాటక రంగం దోహదపడగలదని నివేదిక పేర్కొంది. ప్రత్యక్ష ప్రయాణ, పర్యాటక రంగ జీడీపీ వృద్ధి 2016లో 3.1 శాతం కాగా 2017లో 3.8 శాతానికి పెరగగలదని అంచనా. దీర్ఘకాలంలో ఈ రంగంలో పెట్టుబడి, అభివృద్ధి ఇదేవిధంగా కొనసాగితే ప్రయాణ, పర్యాటక రంగంలో వృద్ధి పటిష్టంగా ఉండగలదని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ ప్రయాణ, పర్యాటక రంగ ప్రగతి – అంచనాలు 2016లో ప్రపంచ జీడీపీకి ప్రయాణ, పర్యాటక రంగం ప్రత్యక్ష వాటాగా 2,306 బిలియన్ డాలర్లను అందించగా జీడీపీలో ఈ రంగం మొత్తం వాటా 7,613.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. విజిటర్ ఎక్స్పోర్ట్స్ 1,401.5 బిలియన్ డాలర్లు, వ్యాపార వ్యయం 1,153.6 బిలియన్ డాలర్లు, మూలధన పెట్టుబడి 806.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2016లో ప్రపంచ స్వదేశీ వ్యయంలో ప్రయాణ, పర్యాటక రంగ వాటా 4.8 శాతం. కాగా లీజర్ స్పెండింగ్లో 2.3 శాతం, వ్యాపార వ్యయంలో 0.7 శాతం, మూలధన పెట్టుబడిలో 4.4 శాతం వాటాను ప్రయాణ, పర్యాటక రంగం నమోదు చేసుకుంది. 2017లో ప్రపంచ జీడీపీలో ప్రయాణ, పర్యాటక రంగ ప్రత్యక్ష వాటాలో వృద్ధి 3.8 శాతం. జీడీపీలో ఈ రంగం మొత్తం వాటాలో వృద్ధి 3.6 శాతంగా; మొత్తం ఉపాధికి సంబంధించి ప్రత్యక్ష వాటాలో 2.1 శాతంగా; ఉపాధిలో ఈ రంగం మొత్తం వాటాలో వృద్ధి 1.9 శాతంగా నమోదు కాగలదని అంచనా. 2017లో ప్రయాణ, పర్యాటక రంగం స్వదేశీ వ్యయంలో 3.7 శాతం. లీజర్ స్పెండింగ్లో 3.9 శాతం. వ్యాపార వ్యయంలో 4 శాతం. మూలధన పెట్టుబడిలో 4.1 శాతం వృద్ధిని ఈ రంగం నమోదు చేసుకుంటుందని అంచనా. 2027లో ప్రపంచ జీడీపీలో ప్రయాణ, పర్యాటక రంగ ప్రత్యక్ష వాటాలో వృద్ధి 4 శాతం, మొత్తం ఉపాధికి సంబంధించి ప్రత్యక్ష వాటాలో వృద్ధి 2.2 శాతంగా నమోదు కాగలదని అంచనా. 2027లో ప్రయాణ, పర్యాటక రంగానికి సంబంధించి స్వదేశీ వ్యయంలో వృద్ధి 3.9 శాతం, లీజర్ స్పెండింగ్లో 4.1 శాతం, వ్యాపార వ్యయంలో 3.7 శాతం, మూలధన వ్యయంలో ఈ రంగం 4.5 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుందని అంచనా. 2016లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం పెట్టుబడిలో ప్రయాణ, పర్యాటక రంగ పెట్టుబడి 4.4 శాతం (806.5 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. 2017లో ఈ రంగం పెట్టుబడిలో 4.1 శాతం, రానున్న పదేళ్ల కాలంలో సగటున 4.5 శాతం పెరుగుదల ఉండగలదని అంచనా. మొత్తం ఎగుమతుల్లో విజిటర్ ఎక్స్పోర్ట్స్ 2016లో 6.6 శాతం కాగా 2017లో ఈ మొత్తంలో 4.5 శాతం, 2017–27 మధ్య కాలంలో సగటున 4.3 శాతం పెరుగుదల ఉండగలదని అంచనా. n 2011లో ప్రపంచవ్యాప్తంగా అంతర్గత సందర్శకుల వినియోగం 4143.4 బిలియన్ డాలర్లు కాగా 2016లో 4976.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2017లో ఈ మొత్తం 5169.8 బిలియన్ డాలర్లుగా, 2027లో 7635.1 బిలియన్ డాలర్లుగా ఉండగలదని అంచనా. 2016లో మొత్తం ఎగుమతుల్లో విజిటర్ ఎక్స్పోర్ట్స్ వాటా 6.6 శాతం కాగా 2017లో విజిటర్ ఎక్స్పోర్ట్స్లో వృద్ధి 4.5 శాతంగా, 2027లో 4.3 శాతంగా ఉండగలదని అంచనా. 2011లో ప్రపంచంలోని ప్రభుత్వాల ఉమ్మడి వ్యయంలో వృద్ధి 1.4 శాతంగా, 2016లో 3.7 శాతంగా నమోదైంది. ఈ వ్యయంలో వృద్ధి 2017లో 2.6 శాతంగా, 2027లో 2.5 శాతంగా ఉండగలదని అంచనా. -
బయోటెక్నాలజీ ప్రయోజనాలు
జీవ సాంకేతిక శాస్త్రం అంటే ఏమిటి? దాని పరిధి, ప్రయోజనాలను వివరించండి? మానవాళి మనుగడకు, సంక్షేమానికి అవసరమైన ఉత్పత్తులను తయారు చేయడం కోసం సూక్ష్మజీవుల ధర్మాలను, వాటి వల్ల కలిగే ఉపయోగాలను లేదా కణాలు, వాటిలోని భాగాలను పారిశ్రామిక స్థాయిలో వినియోగించుకొనే విజ్ఞానమే జీవ సాంకేతిక శాస్త్రం. (లేదా) సూక్ష్మజీవులను లేదా వాటి శరీర భాగాలను ఉపయోగించి మానవజాతికి ఉపయోగకరమైన ఉత్పత్తులను తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘జీవసాంకేతిక శాస్త్రం’ లేదా ‘బయోటెక్నాలజీ’ అంటారు. ఈ పదాన్ని మొదటిసారిగా కార్ల్ ఎరిక్ (1919) అనే శాస్త్రవేత్త ఉపయోగించాడు. పరిధి: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే, వ్యాధి నిరోధకత కలిగిన వంగడాల అభివృద్ధికి, వ్యాక్సిన్ల తయారీకి, అధిక స్థాయిలో ఔషధాలు, రసాయనాలు, జీవ ఎరువులు, బయోపెస్టిసైడ్ల ఉత్పత్తికి జీవసాంకేతిక శాస్త్రం ఉపయోగపడుతుంది. జీవసాంకేతిక శాస్త్ర ప్రయోజనాలు వైద్యశాస్త్రంలో... మానవ హార్మోన్లయిన ఇన్సులిన్, పెరుగుదల హార్మోన్, ఇంటర్ఫెరాన్ వంటి వాటిని జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయడం. పోలియో, మశూచి, హెపటైటిస్–బి, డిఫ్తీరియా వంటి వ్యాధులను నియంత్రించే అధునాతన వ్యాక్సిన్ల తయారీ. సూక్ష్మజీవులను ఉపయోగించి విటమిన్లు ఉత్పత్తి చేయడం. సూక్ష్మజీవ నాశకాలైన పెన్సిలిన్, ఎరిథ్రోమైసిన్ వంటి యాంటీ బయాటిక్లను వాణిజ్య స్థాయిలో తక్కువ ధరకు ఉత్పత్తి చేయడం. వ్యాధులను గుర్తించే ఈజ్చీజnౌట్టజీఛి జుజ్టీటను ఉత్పత్తి చేయడం. ఉదా: ఎయిడ్స్ టెస్ట్ కిట్, మలేరియా టెస్ట్ కిట్, వైడల్ టెస్ట్ కిట్, గర్భనిర్ధారణ టెస్ట్ కిట్ మొదలైనవి. వ్యవసాయ రంగంలో జీవ సాంకేతిక శాస్త్రం అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ, పండ్లు, కూరగాయలు, ఇతర వంగడాలు, హైబ్రిడ్ విత్తనాలను ఉత్పత్తి చేయొచ్చు. వ్యాధి నిరోధక శక్తి కలిగిన వంగడాలను ఉత్పత్తి చేయొచ్చు ఉదా: ఆ్ట పత్తి, ఆ్ట వంకాయ. అధిక పోషక విలువలు కలిగిన పంటలు ఉత్పత్తి చేయొచ్చు. ఉదా: గోల్డెన్ రైస్ (విటమిన్–ఎ). వైరస్, కీటక, గుల్మనాశక నిరోధకతతో పాటు మంచి పోషక విలువలను కలిగిన వందలాది పరివర్తిత మొక్కలను ఉత్పత్తి చేయొచ్చు. జీవ ఎరువులు, జీవ కీటక నాశినులను, కృత్రిమ విత్తనాలను ఉత్పత్తి చేయొచ్చు. పరిశ్రమల్లో జీవ సాంకేతిక శాస్త్రం జీవ సాంకేతిక శాస్త్రం సహాయంతో వాణిజ్యపరంగా సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు వంటి వాటి నుంచి పారిశ్రామిక స్థాయిలో ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తున్నారు. జంతు ఎంజైమ్లు: లైపేజ్, ట్రిప్సిన్, రెన్నట్... వృక్ష ఎంజైమ్లు: పపైన్, ప్రోటియేజ్, అమైలేజ్.. సూక్ష్మజీవుల నుంచి∙లభించే ఎంజైమ్లు: గ్లూకోజ్, ఐసోమెరేజ్, ఆల్ఫా అమైలేజ్, ప్రోటియేజ్. ఈ ఎంజైమ్లను డిటర్జెంట్లు, పిండి పదార్థాలు, బీర్, వైన్, మందుల పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. ఉదా: మాంసాన్ని మృదువుగా ఉంచడానికి పపైన్ ఎంజైమ్, తోళ్లను మెత్తబరచడానికి ప్రోటియేజ్ను, జున్ను ఉత్పత్తికి రెన్నట్ను, ఆహార పదార్థాలకు రుచి తేవడానికి మోనో సోడియం గ్లుటామేట్ వంటివి వాడుతున్నారు. విటమిన్లు, హార్మోన్లు, ఆమైనో ఆమ్లాలను ఉత్త్పత్తి చేయొచ్చు. కృత్రిమ తీపి పదార్థాలను కూడా పారిశ్రామికంగా తయారు చేయొచ్చు. ఆహార రంగంలో అధిక పోషక విలువలు కలిగిన ఏక కణ ప్రొటీన్లను ( Single cell protein) ఉత్పత్తి చేయొచ్చు. ఉదా: స్పైరులినా. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు, ఆవశ్యక అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభించే పుట్టగొడుగులను పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేయొచ్చు. అధిక దిగుబడినిచ్చే జన్యు పరివర్తిత వంగడాలను ఉత్పత్తి చేయొచ్చు. ఉదా: ఆ్టవంకాయ, ఎఝసోయా, ఎఝ మొక్కజొన్న మొదలైనవి. నేర పరిశోధనలో జీవ సాంకేతిక శాస్త్రం D.N.A ఫింగర్ ప్రింటింగ్ సహాయంతో నేర నిర్ధారణ చేయొచ్చు. అలాగే జీవుల ఆవిర్భావం, వర్గీకరణ మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు. పర్యావరణంలో జీవ సాంకేతిక శాస్త్రం బయోమైనింగ్, బయోరెమిడియేషన్ పద్ధతుల ద్వారా పర్యావరణాన్ని శుభ్రపర్చొచ్చు. కాలుష్యాన్ని తగ్గించే సూక్ష్మజీవులను ఉత్త్పత్తి చేయొచ్చు. బయోగ్యాస్, వర్మి కంపోస్ట్, బయోఫెర్టిలైజర్స్ వంటి పర్యావరణ హిత పద్ధతులను అభివృద్ధి చేయొచ్చు. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ఇతర కాలుష్య కారకాల వల్ల భూమి కలుషితం అవుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం జీవసాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. బయోరెమిడియేషన్, బయో స్క్రబ్బింగ్, బయోప్లాస్టిక్, బయోఫెర్టిలైజర్స్, బయోపెస్టిసైడ్స్, బయోడీజిల్, బయోగ్యాస్ వంటి వాటిని ఉపయోగించి పర్యావరణాన్ని పరిరక్షించొచ్చు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో జీవసాంకేతిక శాస్త్రం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రమాదవశాత్తు సముద్రంలో పడే ముడిచమురును విచ్ఛిన్నం చేయడానికి, ఓడరేవుల్లో చమురుతెట్టును తొలగించడానికి సూపర్బగ్గా పిలిచే సూడో మోనాస్ పుటిడా అనే బ్యాక్టీరియాను ఉపయోగిస్తున్నారు. బయోరెమిడియేషన్: సూక్ష్మజీవులను ఉపయోగించి హానికర కాలుష్య కారకాలను నిర్వీర్యం చేయడం లేదా తొలగించడాన్ని బయోరెమిడియేషన్ అంటారు. వృక్ష ప్లవకాలు లేదా మొక్కల సాయంతో పర్యావరణంలోని కాలుష్య కారకాలను తొలగించడాన్ని ఫైటోరెమిడియేషన్ అంటారు. ఉదా: క్లోరెల్లా, యూగ్లీనా, క్లామిడోమోనాస్, సిన్డెస్మస్ తదితర శైవలాలు మురుగునీటిలోని కర్బన పదార్థాలను తొలగిస్తాయి. నీటి నుంచి కాపర్, పాదరసం, యురేనియం మూలకాలను క్లోరెల్లా తొలగిస్తుంది. రైజోపస్, ఆస్పరజిల్లస్, పెన్సిలియం, న్యూరోస్పోరా తదితర శిలీంధ్రాలు లెడ్, పాదరసం వంటి మూలకాలను తొలగిస్తాయి. పాడి, చెరకు, పండ్లరసాల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు పర్యావరణానికి హాని చేస్తాయి. ఈ వ్యర్థాల ఆధారంగా పుట్టగొడుగులు పెంచడంతోపాటు ఏకకణ ప్రొటీన్లను ఉత్పత్తి చేయొచ్చు. ఈ విధానం ద్వారా పర్యావరణానికి కలిగే హానిని నివారించొచ్చు. బయోఫెర్టిలైజర్స్: రసాయన ఎరువుల వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది. అందువల్ల నత్రజని లోపం ఉన్న నేలల్లో రసాయన ఎరువులకు బదులుగా జీవ ఎరువులైన రైజోబియం, నాస్టాక్, అనాబినా, అజోల్లా, అజటోబ్యాక్టర్, బాసిల్లస్, సూడోమోనాస్ వంటి సూక్ష్మజీవులను జీవ ఎరువులుగా ఉపయోగించి రసాయన ఎరువుల వాడకాన్ని నివారించాలి. ఈ విధానం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించొచ్చు. ∙బయోపెస్టిసైడ్స్: రసాయన పురుగు మందుల వల్ల ఎన్నో అనారోగ్యాలు కలుగుతున్నాయి. బాక్యులో వైరస్, ట్రైకోడెర్మా, బవేరియా బస్సీనా వంటి శైవలాలను క్రిమిసంహారకాలుగా వాడుతున్నారు. ప్రమాదకర లోహాల తొలగింపునకు.. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల్లో పాదరసం, ఆర్సెనిక్, కాడ్మియం, సీసం, నికెల్ వంటి ప్రమాదకర లోహాలుంటాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులను ఉపయోగించి వీటిని నిర్వీర్యం చేయొచ్చు. ఉదా: స్టెఫెలోకోకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా భూమి, నీటిలో ఉన్న పాదరసాన్ని తొలగిస్తుంది. కొరినే బ్యాక్టీరియం ఫ్లక్కమ్ ఫేషియన్స్ అనే బ్యాక్టీరియా.. నేల/నీటి నుంచి∙ఆర్సెనిక్ను తొలగిస్తుంది. సూడోమోనాస్ ఆర్గ్యునోసా అనే బ్యాక్టీరియా క్రోమియాన్ని తొలగిస్తుంది. ఎశ్చర్షియాకోలై అనే బ్యాక్టీరియా ఆర్సెనిక్, ఆంటిమొనీ లోహాలను, అనే జాతి రాగి లోహాలను తొలగిస్తుంది. ఆస్పరజిల్లస్ నైగర్, ప్యూసేరియా ఆక్సీస్పోరమ్, మ్యూకర్ వంటి శిలీంధ్రాలు పర్యావరణం నుంచి ఈఈఖీని తొలగిస్తాయి. జన్యు మార్పిడి పంటల ద్వారా పర్యావరణ పరిరక్షణ సిట్రేట్ సింథటేస్ అనే ఎంజైమ్ తయారీకి కావాల్సిన జన్యువును కలిగి ఉన్న ఎఝ బొప్పాయి, ఎఝ పొగాకు, ఎఝ మొక్కజొన్న, ఎఝ వరి వంటి జన్యు మార్పిడి మొక్కలు భూమిలో అధికంగా ఉన్న అల్యూమినియాన్ని తొలగిస్తాయి. ∙నైట్రోరిడక్టేస్ అనే ఎంజైమ్ తయారీకి కావాల్సిన జన్యువును కలిగి ఉన్న జన్యు మార్పిడి పొగాకు మొక్క భూమిలో పాతిపెట్టిన మందుపాతరల్లోని ప్రమాదకర పేలుడు పదార్థం నిర్వీర్యం చేస్తుంది. ∙బయోమైనింగ్: సూక్ష్మజీవులను, అవి విడుదలచేసే ఎంజైమ్లను ఉపయోగించి గనుల్లో నుంచి లోహాన్ని వేరుపరిచే ప్రక్రియనే బయోమైనింగ్ అంటారు. అలాగే కొన్ని సూక్ష్మజీవులు లోహాలను కూడా కరిగిస్తాయి. దీన్ని బయోలీచింగ్ అంటారు. ఉదా: థయోబాసిల్లస్ ఫెర్రోఆక్సిడెన్స్ – ఇనుప దాతువు నుంచి రాగిని వేరు చేస్తుంది. లెప్టోస్పెరిల్లం ఫెర్రోఆక్సిడెన్స్ – ఫెర్రస్, కాపర్లను కరిగిస్తుంది. ఆస్పర్జిల్లస్, పెన్సిలియమ్ – Pb, Ni, Al, Zn లను కరిగిస్తుంది. Biosorption: అంటే సూక్ష్మజీవుల సహాయంతో నీటిలో కరిగి ఉన్న లోహాలను తొలగించడం. సాధారణంగా ఎరువులు, తోళ్లు, వస్త్రాల తయారీ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థపదార్థాల్లో ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం, లెడ్, నికెల్, మెర్క్యురి, జింక్ లోహాలు అధికంగా ఉంటాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులు నీటిలో ఉన్న లోహాలను తొలగించి పరిసరాలను శుభ్రపరుస్తాయి. కాలుష్య కోరల్లో చిక్కుకున్న నదులు, సరస్సుల్లో ఈ సూక్ష్మజీవులను వదిలితే అవి నీటిని శుభ్రపరుస్తాయి.∙ ఉదా: హైపోమైక్రోబియం (మాంగనీస్), గాలియోనెల్లా (fe & cu) జీవసాంకేతిక విధానాలను ఉపయోగించి బంజరు భూములు, చవుడుబారిన నేలలను సారవంతంగా మార్చొచ్చు. బయోగ్యాస్ తయారీలో సమర్థ మీథేన్ జనకæ ఆర్కిబ్యాక్టీరియాన్ని ఉపయోగించడం ద్వారా అధిక ఫలితాన్ని పొందొచ్చు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల తయారీలో కూడా బయోటెక్నాలజీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్యాక్టీరియమ్లు హైడ్రోజన్ ఉత్పత్తికి తోడ్పడతాయని కనుగొన్నారు. కాలుష్య రహిత హైడ్రోజన్ వాయువును అభివృద్ధి చేసి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించొచ్చు. ప్రవీణ్ దత్తు అధ్యాపకులు, ఎల్.హెచ్.ఆర్. ్రప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం. -
జాబ్ పాయింట్
ఐబీపీఎస్...పీవో/ఎంటీ 3,562 ఖాళీలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. వివిధ బ్యాంకుల్లోని 3,562 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/ మేనేజ్మెంట్ ట్రైనీ (ఎంటీ) ఖాళీలకు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్– సీడబ్ల్యూఈ పీవో/ ఎంటీ–7 ద్వారా దరఖాస్తులు కోరుతోంది. పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్మెంట్ ట్రైనీ (ఎంటీ). మొత్తం ఖాళీలు : 3,562 (అన్ రిజర్వుడ్–1,738 +ఓబీసీ 961+ ఎస్సీ– 578 + ఎస్టీ–285). అర్హతలు : ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణులై ఉండాలి. వయో పరిమితి : 2017 ఆగస్ట్ 1 నాటికి 20–30 ఏళ్ల లోపు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం : మూడు దశల్లో ఉంటుంది. అవి.. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ. పరీక్షల విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ : మార్కులు 100; వ్యవధి గంట. విభాగం ప్రశ్నలు మార్కులు మీడియం రీజనింగ్ ఎబిలిటీ 35 35 ఇంగ్లిష్, హిందీ ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 30 ఇంగ్లిష్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 35 ఇంగ్లిష్, హిందీ మొత్తం 10 100 మెయిన్ ఎగ్జామినేషన్: మొత్తం 225 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్– 45 ప్రశ్నలు 60 మార్కులు (వ్యవధి గంట), జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్.. 40 ప్రశ్నలు 40 మార్కులకు (వ్యవధి 35 నిమిషాలు), ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్.. 35 ప్రశ్నలు 40 మార్కులు (40 నిమిషాలు), డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్.. 35 ప్రశ్నలు 60 మార్కులు (వ్యవధి 45 నిమిషాలు), లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే (ఇంగ్లిష్)–2 ప్రశ్నలు 25 మార్కుల (వ్యవధి 30 నిమిషాలు)కు ఉంటాయి. రుణాత్మక మార్కులు: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్ రెండింట్లోనూ ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగిటివ్ మార్కు ఉంటుంది. ఇంటర్వ్యూ: మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూలో మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు (తెలుగు రాష్ట్రాల్లో): ఆంధ్రప్రదేశ్లో.. చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మెయిన్ ఎగ్జామినేషన్ కేంద్రాలు (తెలుగు రాష్ట్రాల్లో): ఆంధ్రప్రదేశ్లో.. గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం; తెలంగాణలో.. హైదరాబాద్. నోట్: ఐబీపీఎస్ నిర్ణయాన్ని బట్టి పరీక్షల కేంద్రాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100; మిగిలిన అభ్యర్థులకు రూ.600. దరఖాస్తు విధానం: వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. www.ibps.in ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్ట్ 16, 2017 ఆన్లైన్ దరఖాస్తుల ముగింపు: సెప్టెంబర్ 5, 2017 ఆన్లైన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ: ఆగస్ట్ 16, 2017– సెప్టెంబర్ 5, 2017 ప్రి–ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్లెటర్ డౌన్లోడ్: సెప్టెంబర్, 2017 ప్రి–ఎగ్జామ్ ట్రైనింగ్ : సెప్టెంబర్ 23–29, 2017 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్: సెప్టెంబర్, 2017 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆన్లైన్): అక్టోబర్ 7,8,14,15, 2017 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాలు: అక్టోబర్, 2017 మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్: నవంబర్, 2017 మెయిన్ ఎగ్జామినేషన్(ఆన్లైన్): నవంబర్ 26, 2017 మెయిన్ ఎగ్జామినేషన్ ఫలితాలు: డిసెంబర్, 2017 ఇంటర్వ్యూ కాల్లెటర్ డౌన్లోడ్: జనవరి, 2018 ఇంటర్వ్యూ: జనవరి/ఫిబ్రవరి, 2018 ప్రొవిజినల్ అలాట్మెంట్: ఏప్రిల్ 2018 యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 696 ఖాళీలు చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖల్లోని 696 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. యూఐఐసీఎల్ భారత ప్రభుత్వ ఆధీనంలోని పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. పోస్టు పేరు: అసిస్టెంట్ వేతనం: రూ.14,435–రూ.32,030+ నిబంధనల మేర ఇతర అలవెన్సులు. ఉద్యోగ ప్రాంతాన్ని బట్టి వేతనంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మొత్తం పోస్టులు: 696 (అన్రిజర్వుడ్–414, ఓబీసీ–122, ఎస్సీ–110, ఎస్టీ–50). తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్–32(అన్రిజర్వుడ్–14, ఓబీసీ–6, ఎస్సీ–7, ఎస్టీ–5); తెలంగాణ–20(అన్రిజర్వుడ్–13, ఎస్సీ–3, ఎస్టీ–4).అర్హతలు: ఏదైనా డిగ్రీ. అలాగే స్థానిక భాషలో మంచి పట్టు (మాట్లాడగలగడం, చదవడం, రాయడం) తప్పనిసరి. వయో పరిమితి: 2017 జూలై 30 నాటికి 18–28 ఏళ్ల లోపు ఉండాలి; ఎస్సీ /ఎస్టీ కేటగిరీలకు అయిదేళ్లు, ఓబీసీ–మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంది. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కేటగిరీల్లోని దివ్యాంగ అభ్యర్థులకు, ఎక్స్–సర్వీస్మెన్ కేటగిరీకి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఇందులో టైర్–1 (ప్రిలిమినరీ ఎగ్జామినేషన్), టైర్–2 (మెయిన్ ఎగ్జామినేషన్) దశలు ఉంటాయి. ఠి పరీక్షల (ప్రిలిమినరీ, మెయిన్) విధానం: టైర్–1 (ప్రిలిమినరీ ఎగ్జామినేషన్) ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్–30 ప్రశ్నలు, రెండో విభాగంలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్–35, మూడో విభాగంలో టెస్ట్ ఆఫ్ న్యూమెరికల్ ఎబిలిటీ–35 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. ఇందులో కనీస అర్హత మార్కులు వచ్చిన అభ్యర్థుల్లో రాష్ట్ర, కేటగిరీ ప్రకారం 1:7 నిష్పత్తిలో మెరిట్ జాబితా తయారుచేస్తారు. వీరికి టైర్–2 (మెయిన్) ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్–2 (మెయిన్ ఎగ్జామినేషన్)లో ఐదు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 50 మార్కుల చొప్పున మొత్తం 250 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులోని ఐదు విభాగాలు.. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ న్యూమెరికల్ ఎబిలిటీ. ఇందులోనూ నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణులైన వారికి స్థానిక భాషపై పరీక్ష (రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్) ఉంటుంది. ఇందులోనూ క్వాలిఫై అయితే ఆర్నెళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అభ్యర్థి పనితీరు, ప్రవర్తన ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పరీక్ష కేంద్రాలు(తెలుగు రాష్ట్రాల్లో): ఆంధ్రప్రదేశ్–చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, కంచికచర్ల, ఏలూరు, విజయనగరం; తెలంగాణ–హైదరాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100; మిగిలిన కేటగిరీలకు రూ.500. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 28, 2017. వెబ్సైట్: www.uiic.co.in కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో అప్రెంటీస్ 172 ఖాళీలు కేరళలోని కొచిలో ఉన్న కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్.. 172 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. పోస్టు పేరు–ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటీసెస్–72(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్–12, మెకానికల్ ఇంజనీరింగ్–27, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్–6, సివిల్ ఇంజనీరింగ్–12, కంప్యూటర్సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–8, సేఫ్టీ ఇంజనీరింగ్–3, మెరైన్ ఇంజనీరింగ్–2, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్బిల్డింగ్–2) ; టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటీసెస్–100(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్–22, మెకానికల్ ఇంజనీరింగ్–28, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్–8, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్–7, సివిల్ ఇంజనీరింగ్–9, కంప్యూటర్ ఇంజనీరింగ్–6, కమర్షియల్ ప్రాక్టీస్–20). శిక్షణ వ్యవధి: ఏడాది స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్కు రూ.8,000; టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్–రూ.7 వేలు అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి బీఈ/ బీటెక్/డిప్లొమా. వయో పరిమితి: అప్రెంటీస్షిప్ నిబంధనల ప్రకారం. ఎంపిక విధానం: విద్యార్హతల మార్కుల శాతం అనుసరించి షార్ట్లిస్టింగ్. దరఖాస్తు విధానం: ఎన్ఏటీఎస్ (నేషనల్ అప్రెంటీస్షిప్ ట్రైనింగ్ స్కీమ్)లో రిజిస్టర్ అయి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 31, 2017. వెబ్సైట్: www.cochinshipyard.com ముంబై పోర్ట్ ట్రస్ట్ స్పోర్ట్స్ క్లబ్లో 56 ఖాళీలు ముంబై పోర్ట్ స్పోర్ట్స్ క్లబ్.. 56 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. పోస్టు పేరు: స్పోర్ట్స్ ట్రైనీ పోస్టులు: 56 (పురుషులు 54+మహిళలు 2). ఖాళీలు: అథ్లెటిక్స్–5, షటిల్ బ్యాడ్మింటన్–3, బాడీ బిల్డింగ్–2, క్రికెట్–8, ఫుట్బాల్–9, హాకీ–9, కబడ్డీ–7, టేబుల్ టెన్నిస్–2, వాలీబాల్–6, వెయిట్ లిఫ్టింగ్–5. నోట్: అథ్లెటిక్స్ విభాగంలో రెండు పోస్టులను మహిళలకు కేటాయించారు. మిగిలినవన్నీ పురుషులకే. అర్హతలు: సంబంధిత క్రీడా విభాగాల్లో మూడేళ్లుగా (2014, 2015, 2016) దేశం తరఫున అంతర్జాతీయ/జాతీయ పోటీల్లో పాల్గొని ఉండాలి. లేదా జాతీయ స్థాయిలో కంబైన్డ్ యూనివర్సిటీ టీమ్లో కానీ, యూనివర్సిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ నిర్వహించిన ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో కానీ పాల్గొని ఉండాలి. ‘ఏ’ డివిజన్ క్రికెట్ లేదా సూపర్/ఎలైట్ డివిజన్ (హాకీ, ఫుట్బాల్)లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. వయో పరిమితి: 2017 ఆగస్ట్ 10 నాటికి 18–26 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపిక విధానం: క్రీడా విభాగాల్లో సాధించిన విజయాల ఆధారంగా... స్టైపెండ్: రూ.15 వేలు. ఇదికాక కిట్కు రూ.10 వేలు, మెడికల్ క్లైమ్ + యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రూ.3,500 (ఏడాదికి) ఉంటాయి. ఉచిత వసతి కల్పిస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.100 దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీలు పంపాల్సిన చిరునామా: జేటీ.జనరల్ సెక్రెటరీ, ముంబై పోర్ట్ ట్రస్ట్ స్పోర్ట్స్ క్లబ్, సెకండ్ ఫ్లోర్, రైల్వే మేనేజర్స్ బిల్డింగ్, రామ్జీ భాయ్ కమని మార్గ్, నియర్ వసంత్ హోటల్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబై–400001. దరఖాస్తులు చేరడానికి చివరి తేదీ: ఆగస్ట్ 31, 2017 www.mumbaiport.gov.in ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300ఖాళీలు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఓఐసీఎల్)లో 300 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది. ఓఐసీఎల్.. భారత ప్రభుత్వ ఆధీనంలోని పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(స్కేల్–1). మొత్తం పోస్టులు: 300(అన్రిజర్వుడ్–158, ఓబీసీ–77, ఎస్సీ–44, ఎస్టీ–21). విభాగాల వారీ ఖాళీలు: అకౌంట్స్–20, యాక్చురీస్–2, ఇంజనీర్స్ (ఆటోమొబైల్)–15, లీగల్–30, మెడికల్ ఆఫీసర్(ఎంఓ)–10, జనరలిస్ట్ –223. వేతనం: రూ.32,795–రూ.62,315 అర్హతలు: సంబంధిత విభాగాలను అనుసరించి డిగ్రీ/లా డిగ్రీ/ పీజీ/ ఎంకామ్/సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/ఎంబీబీఎస్/నాలుగు యాక్చురియల్ పేర్స్(ఐఏఐ/ఐఎఫ్ఓఏ)లో ఉత్తీర్ణత. వయో పరిమితి: 2017 జూలై 31 నాటికి 21–30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: మూడు దశల్లో ఎంపిక ఉంటుంది. ఫేజ్–1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్–2లో మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్–3లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్షల (ఫేజ్–1, ఫేజ్–2) విధానం: ఫేజ్–1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. నిర్దేశిత మార్కులతో క్వాలిఫైడ్ అభ్యర్థుల నుంచి 1:20 నిష్పత్తిలో మెయిన్ ఎగ్జామినేషన్కు ఎంపిక చేస్తారు. ఫేజ్–2 (మెయిన్ ఎగ్జామినేషన్)లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో, 30 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ వ్యవధి రెండు గంటలు. జనరలిస్ట్స్ పోస్టులకు 4 విభాగాలు, మిగిలిన పోస్టులకు 5 విభాగాలుగా ప్రశ్నపత్రం ఉంటుంది. జనరలిస్ట్స్కు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.. ఒక్కోటి 50 మార్కులకు చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. మిగిలిన పోస్టులకు టెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అదనంగా నిర్వహిస్తారు. ఒక్కో విభాగానికి 40 మార్కులకు చొప్పన 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఫేజ్–2 పరీక్ష వ్యవధి గంట; డిస్క్రిప్టివ్ విధానంలో 30 మార్కులకు లెటర్ రైటింగ్, ఎస్సే ఉంటాయి. ఫేజ్–1, ఫేజ్–2 రెండు పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. ఫేజ్–3 (ఇంటర్వ్యూ): మెయిన్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణుల మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అనంతరం తుది ఎంపిక చేపడతారు. దరఖాస్తు ఫీజు: రూ.600(అప్లికేషన్ ఫీ+ఇంటిమేషన్ ఛార్జెస్); ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 (ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే). దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ప్రారంభం: ఆగస్ట్ 18, 2017. దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2017. వెబ్సైట్: www.mumbaiport.gov.in యూపీఎస్సీ...54 ఖాళీలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 54 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. పోస్టుల పేరు–ఖాళీలు: అసిస్టెంట్ డైరెక్టర్(కెమిస్ట్రీ)–1; అసిస్టెంట్ ఇంజనీర్–3(ఎలక్ట్రికల్–1+ మెకానికల్–2); అసిస్టెంట్ ఫ్రొఫెసర్ (స్పెషలిస్ట్ గ్రేడ్–3)–37(అనాటమీ–8+ ఒబేస్ట్రిక్ అండ్ గైనకాలజీ–13+ ఆప్తాల్మాలజీ–3 + ఆర్థోపీడియాక్(స్పోర్ట్స్ ఇంజూరీ సెంటర్)–1+ పీడియాట్రిక్ కార్డియాలజీ–2+ రేడియో థెరపీ–10); అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–6; డ్రిల్లర్ ఇంచార్జ్–5; లెక్చరర్–2 (ఎలక్ట్రికల్–1+మెకానికల్–1). వేతనం: అసిస్టెంట్ డైరెక్టర్ (కెమిస్ట్రీ), అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు–రూ.15,600–రూ.39,100; అసిస్టెంట్ ఇంజనీర్కు– రూ.44,900–రూ.1,42,400; అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు– రూ.56,100–రూ.1,77,500; డ్రిల్లర్ ఇంచార్జ్కు–రూ.9,300–34,800. అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా/ఎంఎస్సీ/ఎంబీబీఎస్/డీఎన్బీ/ఎంసీహెచ్/డీఎం/ఎండీ/ఎంఎస్. దీంతోపాటు నిబంధనల మేర ఉద్యోగానుభవం, మార్కుల శాతం ఉండాలి. వయోపరిమితి: పోస్టులను అనుసరించి నిబంధనల మేరకు. ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ. దరఖాస్తు ఫీజు: రూ.25; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 31, 2017. వెబ్సైట్: www.upsconline.nic.in నిట్–రూర్కెలా 203 ఖాళీలు రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో 203 బోధన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది. మొత్తం ఖాళీలు: 203 (అన్రిజర్వుడ్–55, ఓబీసీ–82, ఎస్సీ–40, ఎస్టీ–26). ఇందులో కొన్ని పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. పోస్టుల పేరు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. బోధన విభాగాలు: ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ డిజైన్, ఆర్కిటెక్చర్, సైన్స్/ హ్యుమానిటీస్ అండ్ సోషియల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. వేతనం: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.15,600–రూ.39,100; అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు రూ.37,400–రూ.67,000. వీటిలో పోస్టులవారీ గ్రేడ్ పేలో మార్పులు ఉంటాయి. అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి పీహెచ్డీతో పాటు బీఈ/బీటెక్/బీ.డిజైన్/బీఆర్క్/ఎంఆర్క్/మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీడీబీఎం. నిబంధనల మేర మార్కుల శాతం ఉండాలి. ఉద్యోగానుభవం అభిలషణీయం. వయో పరిమితి: 2017 సెప్టెంబర్ 11 నాటికి ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 45 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కాంట్రాక్ట్/శాశ్వత ప్రాతిపదికను అనుసరించి 30/35/40 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ. దరఖాస్తు ఫీజు: లేదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 11, 2017 వెబ్సైట్: www.upsconline.nic.in ఐఆర్డీఏఐ 30 ఖాళీలు హైదరాబాద్లోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ).. 30 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్ వేతనం: ప్రారంభ వేతనం రూ.28,150 +అలవెన్సులు. మొత్తం ఖాళీలు: 30 (అన్రిజర్వుడ్–16, ఓబీసీ–7, ఎస్సీ–4, ఎస్టీ–3). విభాగాల వారీ ఖాళీలు: యాక్చ్యురియల్–4, అకౌంట్స్–4, లీగల్–2, జనరల్–20. అర్హతలు : 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. యాక్చ్యరియల్ విభాగం పోస్టులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్యు ్చరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) పరీక్షలో తొమ్మిది పేపర్ల ఉత్తీర్ణత, అకౌంట్స్ పోస్టులకు ఏసీఏ/ ఏఐసీడబ్ల్యూఏ/ ఏసీఎంఏ/ఏసీఎస్/సీఎఫ్ఏ, లీగల్ విభాగం పోస్టులకు ఎల్ఎల్బీ తప్పనిసరి. వయో పరిమితి : 2017 సెప్టెంబర్ 9 నాటికి 21–30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఫేజ్–1లో ప్రిలిమినరీ, ఫేజ్–2లో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్, ఫేజ్–3లో ఇంటర్వ్యూ. పరీక్షల విధానం: ఫేజ్–1 ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్లో ఆన్లైన్లో నిర్వహిస్తారు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నల చొప్పున 160 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున రుణాత్మక మార్కు ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. ఫేజ్–2 (డిస్క్రిప్టివ్) ఎగ్జామినేషన్.. మూడు పేపర్లు ఉంటాయి. పేపర్–1లో ఇంగ్లిష్, పేపర్–2లో ఎకనమిక్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇంపాక్టింగ్ ఇన్సూరెన్స్, పేపర్–3లో ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్. ఒక్కో పేపర్ 100 మార్కులకు చొప్పున 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి ఒక్కో విభాగానికి గంట. ఫేజ్–3(ఇంటర్వ్యూ): ఫేజ్–2 మెరిట్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఫేజ్–2, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్ష కేంద్రాలు (తెలుగు రాష్ట్రాల్లో): ఫేజ్–1.. హైదరాబాద్, విజయవాడ; ఫేజ్–2.. హైదరాబాద్ దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/ఎక్స్–సర్వీస్మెన్ రూ.100 (ఇంటిమేషన్ ఛార్జెస్); మిగిలిన అభ్యర్థులకు రూ.650(ఎగ్జామినేషన్ ఫీ+ ఇంటిమేషన్ ఛార్జెస్) దరఖాస్తు విధానం: వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 5, 2017. వెబ్సైట్: www.irdai.gov.in -
ఓటర్ నివాదం?
ఎన్నికల ప్రక్రియ ఓటర్ల జాబితా తయారీ ఎన్నికల ప్రధాన అధికారి పర్యవేక్షణలో ఓటర్ల జాబితా రూపకల్పన, మార్పులు, చేర్పులు చేస్తారు. ఇది ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్రపతి పేరుతో, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు గవర్నర్ పేరుతో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. వీటిని కేంద్ర ఎన్నికల సంఘమే వారి పేర్లతో జారీ చేస్తుంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడానికి కొన్ని వారాల ముందు ఎన్నికల షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ వెలువరిస్తుంది. ఆ వెనువెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకొస్తుంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారికి సమర్పించాలి. దానికి సంబంధించి ధ్రువీకరణ ప్రమాణం కూడా చేయాలి. సాధారణంగా నామినేషన్ల పరిశీలన పూర్తయిన రెండు రోజుల్లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఎన్నికల ప్రచారం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ సిద్ధాంతాలు, విధానాలను తెలియజేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన రోజు నుంచి రెండు వారాల వరకు ఎన్నికల ప్రచారానికి సమయం ఉంటుంది. పోలింగ్కు 48 గంటల ముందు నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి. బ్యాలెట్ పత్రాలు, గుర్తులు నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఇంగ్లిష్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఎన్నికల అధికారి రూపొందిస్తారు. బ్యాలెట్ పత్రం/ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)పై అభ్యర్థికి కేటాయించిన గుర్తుతోపాటు పేరును ఆంగ్లం, సంబంధిత ప్రాంతీయ భాష లేదా హిందీలో ముద్రిస్తారు. ఎన్నికల విధానం రహస్య ఓటింగ్ పద్ధతిని పాటిస్తారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో 1,500 మంది ఓటర్లకు మించకుండా చూస్తారు. ఎన్నికల రోజున పోలింగ్ స్టేషన్ను కనీసం 8 గంటలకు తక్కువ కాకుండా తెరచి ఉంచాలి. ఓట్ల లెక్కింపు ఓటింగ్ పూర్తయ్యాక ఒకటి లేదా రెండు రోజుల తర్వాత రిటర్నింగ్ అధికారి, పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించి రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఎన్నికలు – వివాదాలు – పరిష్కారం ప్రకరణ 323 (బి) ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసన సభల ఎన్నికల వివాదాలను పరిష్కరించడానికి పార్లమెంటు ఒక చట్టం ద్వారా ప్రత్యేక ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయొచ్చు. అయితే ఇప్పటివరకు అలాంటి ట్రైబ్యునల్ ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం ఇలాంటి వివాదాలను సంబంధిత రాష్ట్ర హైకోర్టులోనే పరిష్కరించుకుంటున్నారు. దీనికి సంబంధించి అభ్యర్థి లేదా ఓటర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి. ప్రత్యేక వివరణ ఎన్నికలు జరిగే సమయంలో అంటే ఫలితాలను ప్రకటించక ముందు ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన, ఇతర ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి తీర్పు వెలువరిస్తుంది. ఈ దశలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీల్లేదు. ఫలితాలు వెలువడిన తర్వాత సంబంధిత వివాదాలను హైకోర్టులోనే పరిష్కరించుకోవాలి. ఓటర్ నినాదం ‘ఓటర్గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను’. ఓటర్ దినోత్సవం ఏటా జనవరి 25న ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాం. 2011 నుంచి దీన్ని ప్రారంభించారు. 7వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2017, జనవరి 25న జరుపుకున్నాం. ఓటర్ల ప్రతిజ్ఞ ‘ప్రజాస్వామ్యంలో విశ్వసనీయతకు కట్టుబడి ఉన్న భారత పౌరులైన మేము మా దేశంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛ, న్యాయమైన, శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలిపి ఉంచుతామని, ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా, మతం, వర్గం, కులం, సంఘం భాష తదితర ప్రలోభాలను పరిగణనలోకి తీసుకోకుండా, వాటికి గురికాకుండా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము’. ప్రజా ప్రాతినిధ్య చట్టాలు పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలో గరిష్ట సభ్యుల సంఖ్య, సీట్ల కేటాయింపులకు సంబంధించి కొన్ని నియమాలను భారత రాజ్యాంగ ప్రకరణలు 81, 170లో పేర్కొన్నారు. అయితే వాటికి సంబంధించి సమగ్ర వివరాలను పొందుపరచలేదు. సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, రిజర్వేషన్లు మొదలైన విషయాలను పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి పార్లమెంటు రెండు చట్టాలను రూపొందించింది. అవి.. 1. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950 2. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950 ఈ చట్టం ప్రధానంగా పార్లమెంటు, రాష్ట్ర శాసన సభల్లో సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించింది. అలాగే ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటరుగా నమోదు చేసుకోవడానికి సంబంధించిన అర్హతల గురించి తెలుపుతుంది. ఈ చట్టంలో 32 సెక్షన్లు, 5 భాగాలు, 4 షెడ్యూళ్లు ఉన్నాయి. ఈ చట్టాన్ని పార్లమెంటు చాలాసార్లు సవరించింది. 2008లో ఈ చట్టానికి సమగ్ర సవరణలు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభ సభ్యుల అనర్హతల గురించి ఈ చట్టంలో పేర్కొన్నారు. కింది సందర్భాల్లో వారు సభ్యత్వం కోల్పోతారు, లేదా పోటీకి అనర్హులవుతారు. రెండేళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడినవారు శిక్షా కాలంలో, శిక్ష ముగిసిన తర్వాత ఆరేళ్ల వరకు పోటీకి అనర్హులు. వరకట్న నిషేధ చట్టం, ఆహార కల్తీ మొదలైన నేరాల్లో ఆరేళ్ల కంటే తక్కువ కాకుండా శిక్ష పడినవారిని అనర్హులుగా ప్రకటిస్తారు. అవినీతి నిరోధక చట్టం, ప్రజా శాంతి చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లలో పేర్కొన్న కొన్ని నేరాలకు పాల్పడి, నేరం రుజువైతే కూడా అనర్హులవుతారు. అవినీతి నేరం కింద తొలగింపునకు గురైన ప్రభుత్వ ఉద్యోగులు ఐదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. మతం, కులం, జాతి, భాష ప్రాతిపదికన ఓట్లు అడిగినప్పుడు, వాటి పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టినప్పుడు అనర్హులుగా ప్రకటిస్తారు. ఎన్నికల నిర్వహణ – ప్రవర్తన నియమావళి ఎన్నికలను సజావుగా, అవినీతి రహితంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శక సూత్రాలను రాజకీయ పార్టీలు, పౌరులకు జారీ చేస్తుంది. 1971లో 5వ సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి వీటిని ప్రకటించారు. వీటికి రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధత లేదు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించడమే ఈ ప్రవర్తన నియమావళి ముఖ్య ఉద్దేశం. డబ్బు, మద్యం తదితర బలహీనతల ఆధారంగా ఓటర్లను ప్రభావితం చేయకూడదు. కులం, మతం, ఇతర సెంటిమెంట్ల ఆధారంగా ఓట్లు అడగకూడదు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓటర్లను ప్రభావితం చేసేలా కొత్త పథకాలను ప్రకటించకూడదు. నిరాధార ఆరోపణలు, గౌరవాన్ని కించపరిచే విమర్శలు చేయకూడదు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వాహనాలు, సిబ్బందిని వినియోగించకూడదు. ఎన్నికల్లో పోటీకి అర్హతలు లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. లోక్సభకు పోటీ చేసే వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే సంబంధిత నియోజకవర్గంలోని పది మంది ఓటర్ల మద్దతు తెలపాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థికి ఒక ఓటరు మద్దతు సరిపోతుంది. పై షరతులు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు కూడా వర్తిస్తాయి. లోక్సభ, రాజ్యసభకు పోటీ చేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు నామినేషన్ సమయంలో రూ.25,000 ధరావతు(డిపాజిట్) చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 ధరావతు చెల్లించాలి. రాష్ట్ర శాసనసభ, శాసన మండలికి పోటీచేసే అభ్యర్థి ఆ రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలికి పోటీ చేసే జనరల్, బీసీ అభ్యర్థులు రూ.10,000 ధరావతు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,000 ధరావతు చెల్లించాలి. లోక్సభ లేదా రాష్ట్ర విధాన సభకు సంబంధించి ఒక అభ్యర్థి రెండు స్థానాలకు మించి పోటీ చేయడానికి అవకాశం లేదు. ఫలితాలు వెలువడిన 30 రోజుల్లోపు ఎన్నికలకు సంబంధించిన వ్యయాల వివరాలను ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. డిపాజిట్ దక్కించుకోవడం (లేదా) కోల్పోవడం దేశంలో జరిగే ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేసిన అభ్యర్థికి పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు వస్తే డిపాజిట్ దక్కినట్లుగా ప్రకటిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ కోల్పోయినట్లు. వ్యయ పరిమితులు 2014 ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ జారీచేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించి పరిమితులు విధించింది. పెద్ద రాష్ట్రాల్లో లోక్సభ నియోజకవర్గంలో రూ.70 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. చిన్న రాష్ట్రాల్లో (అరుణాచల్ప్రదేశ్, గోవా, సిక్కిం) లోక్సభ నియోజకవర్గంలో, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.54 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాలైతే రూ.28 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు. చిన్న రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో (ఢిల్లీ మినహా) అభ్యర్థులు రూ.20 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు. -
ఉన్నత విద్య ప్రక్షాళనకు..హీరా!
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. ఇక కనుమరుగు కానుందా? ఏఐసీటీఈ.. అనే మాట భవిష్యత్తులో వినపడదా..? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. కారణం.. Higher Education Empowerment Regulation Agency (HEERA-హీరా) పేరుతో దేశంలోని రెండు ప్రధాన విద్యా నియంత్రణ సంస్థల (యూజీసీ, ఏఐసీటీఈ) స్థానంలో ఒకే వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ యోచనే. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఉమ్మడి నియంత్రణ వ్యవస్థ రూపకల్పన దిశగా అడుగులు పడుతున్న తరుణంలో.. ‘హీరా’పై విశ్లేషణ.. శంలో ఉన్నతవిద్య పరంగా పలు రకాల నియంత్రణ వ్యవస్థలు.. ఒక్కోదాని పరిధిలో ఒక్కో కోర్సు. ఇదే క్రమంలో యూజీసీ.. ఏఐసీటీఈ. మిగతా నియంత్రణ వ్యవస్థలు (ఎంసీఐ, పీసీఐ, బీసీఐ తదితర) పరంగా... ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. యూజీసీ, ఏఐసీటీఈల మధ్య నిరంతరం ఏదో ఒక సమస్య. దీనికి పరిష్కారంగా నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న వ్యవస్థే ‘హీరా’. ఒకే గొడుగు కిందకు అన్ని సంస్థలు హీరా ప్రధాన ఉద్దేశం.. దేశంలోని సాంకేతిక, సంప్రదాయ ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు అన్నీ.. ఇకపై ఒకే నియంత్రణ వ్యవస్థకు జవాబుదారీగా ఉండటం. అదే విధంగా యూనివర్సిటీలకు అనుమతుల నుంచి ప్రమాణాలు, నైపుణ్యాల పెంపు వరకు ప్రతి అంశాన్ని హీరా పేరిట ఏర్పడనున్న కమిటీ పర్యవేక్షిస్తుంది. ఫలితంగా ఇప్పుడు ఒకే యూనివర్సిటీలో అమలవుతున్న పలు కోర్సులకు ఇటు ఏఐసీటీఈ, అటు యూజీసీ అనుమతులు తీసుకోవడమనే భారం తొలగనుంది. ఉదాహరణకు ఒక యూనివర్సిటీ పరిధిలో ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పాలనుకుంటే ముందుగా ఇటు ఏఐసీటీఈకి, మరోవైపు సంబంధిత యూనివర్సిటీకి రెండింటికీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీంతో వివిధ సందర్భాల్లో గందరగోళం నెలకొంటోంది. ఈ క్రమంలోనే యూజీసీ, ఏఐసీటీఈ మధ్య కొంత ఆధిపత్య పోరు జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటివాటికి అడ్డుకట్ట వేసేందుకు.. అన్ని యూనివర్సిటీలు, కోర్సులను ఒకే నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తెచ్చేవిధంగా హీరాకు అంకురార్పణ జరిగింది. ఒకే వ్యవస్థపై ఎన్నో ఏళ్లుగా.. వాస్తవానికి దేశంలో అన్ని యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లకు యూజీసీ, ఏఐసీటీఈల స్థానంలో ఒకే నియంత్రణ వ్యవస్థను నెలకొల్పాలనే ప్రతిపాదనలు ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్నాయి. గతంలో యశ్పాల్ కమిటీ, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రస్తుతం తాజాగా హరిగౌతమ్ కమిటీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో నీతి ఆయోగ్ ఆ సిఫార్సుల అమలు సాధ్యాసాధ్యాల పరిశీలన బాధ్యతలను తీసుకొని.. పలు సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయానికి వచ్చి ‘హీరా’ పేరుతో ఒకే నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. వ్యవస్థల వైఫల్యాలు కూడా కారణం హీరా పేరుతో ఒకే నియంత్రణ వ్యవస్థను తీసుకురావడంలో ఇప్పటికే ఉన్న నియంత్రణ వ్యవస్థలు యూజీసీ, ఏఐసీటీఈలు బాధ్యతలు నిర్వర్తించడంలో వైఫల్యం చెందడం కూడా మరో ముఖ్య కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు.. యూనివర్సిటీలు, కళాశాలలకు అనుమతులిచ్చేందుకే పరిమితమవుతున్నాయని.. ఆ తర్వాత వాటిపై కన్నెత్తి కూడా చూడటం లేదని, నిరంతర పర్యవేక్షణ సాగించడం లేదని, ఫలితంగా విద్యార్థులు నిపుణులుగా రూపొందలేకపోతున్నారనే వాదనలు కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తున్నాయి. ఉదాహరణకు సాంకేతిక సంస్థల ఏర్పాటు, అనుమతులు, ఇతర పర్యవేక్షణాధికారాలున్న ఏఐసీటీఈనే పరిగణనలోకి తీసుకుంటే ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేస్తున్న విద్యార్థుల్లో దాదాపు 70 శాతం మందిలో ఉద్యోగ మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలు ఉండట్లేదు. దీనికి ప్రధాన కారణం అనుమతుల జారీకే పరిమితమవుతున్న ఏఐసీటీఈ, తర్వాత కాలంలో వాటిపై నిరంతర పర్యవేక్షణ సాగించకపోవడమే అని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. యూజీసీది కూడా ఇదే తీరు యూజీసీ.. తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం వరకే పరిమితమవుతూ ఆపై వాటిపై నిరంతర పర్యవేక్షణలో వైఫ్యలం చెందిందనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా ఆయా యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల లేమి, ఇతర సమస్యల కారణంగా పరిశోధనలు జరగకపోవడం, పర్యవసానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి యూనివర్సిటీలు ఆశించిన రీతిలో నిధులు పొందలేకపోతున్నాయని.. ఫలితంగా కొన్ని మూతపడే స్థితికి చేరుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలకు అనుమతులిస్తున్న యూజీసీ.. వాటి ఏర్పాటు తర్వాత కన్నెత్తి చూడకపోవడం, ఫలితంగా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండే ఈ యూనివర్సిటీలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ప్రొఫెషనల్ విద్యార్థులకు మేలు హీరా పేరుతో విద్యాసంస్థలపై ఒకే నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రధానంగా ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు మేలు చేయనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అన్ని రంగాలకు చెందిన నిపుణులు ఉండే హీరాలో.. ఆయా కోర్సులకు సంబంధించి తీసుకోవాల్సిన ప్రమాణాలు, చేపట్టాల్సిన తాజా చర్యలపై నిరంతరం సమీక్షించే అవకాశం కలుగుతుంది. వాస్తవానికి ఏఐసీటీఈ, యూజీసీలు వైఫల్యం చెందడానికి మరో కారణం.. ఈ రెండు సంస్థల్లోనూ పలు నేపథ్యాలున్న వారు సభ్యులుగా ఉండటం, వారిలో కొందరికి అకడమిక్ సంబంధిత అంశాలపై అవగాహన లేకపోవడమేనని హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పేర్కొన్నారు. యూజీసీ ఏదైనా చర్యను తీసుకోవాలంటే దానికి సంబంధించిన అకడమిక్ ఫ్యాకల్టీ సభ్యులుగా సబ్ కమిటీలను ఏర్పాటు చేసి, వాటి నివేదికలు – సిఫార్సుల ఆధారంగా చర్యలు తీసుకుంటారు. దీనివల్ల అనవసర జాప్యం తలెత్తుతోంది. హీరాతో ఆ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. న్యాక్, ఎన్బీఏలు.. నామమాత్రమే యూజీసీ, ఏఐసీటీఈ.. తమ పరిధిలోని యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో అనుసరిస్తున్న ప్రమాణాలు, చేపట్టాల్సిన సంస్కరణలపై సిఫార్సులు చేసేందుకు న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కమిటీ), ఎన్బీఏ (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్)లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ.. వాటి పనితీరు నామమాత్రంగా మిగిలిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు కమిటీలు.. ఆయా కళాశాలలకు తనిఖీలకు నిపుణులను పంపే క్రమంలో శాశ్వత ప్రాతిపదికన సంబంధిత అకడమీషియన్స్ లేకపోవడం. ఈ కారణంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన విద్యావేత్తలను ఇన్స్పెక్షన్ కమిటీల్లో తాత్కాలికంగా నియమించడం, వాటి ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇన్స్టిట్యూట్లలో జవాబుదారీతనం తగ్గుతోంది. ఈ ఏడాది చివరికి ప్రారంభం? ఇప్పటికే హీరాకు సంబంధించిన విధివిధానాలతో నివేదిక రూపొందిన నేపథ్యంలో ఈ ఏడాది చివరికి ప్రారంభించేలా ఎంహెచ్ఆర్డీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2018–19 విద్యా సంవత్సరానికి కొత్త ఇన్స్టిట్యూట్ల అనుమతుల మంజూరు కూడా హీరా నేతృత్వంలోనే జరిగేలా చర్యలు ఊపందుకున్నట్లు సమాచారం. ఆహ్వానించదగ్గ పరిణామం ఒకే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. దీనివల్ల ఇటు ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలకు, అటు విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. నిరంతర పర్యవేక్షణ, కరిక్యులంలో మార్పులు వంటి వాటికి అవకాశం ఉండి విద్యార్థులకు ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ అలవడతాయి. – ప్రొఫెసర్ ఎం.జగదీశ్ కుమార్, వీసీ, జేఎన్యూ. -
పరిశ్రమల అభివృద్ధి, క్రమబద్ధ చట్టం లక్ష్యాలు?
ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పాత్ర; దేశీయ, విదేశీ పెట్టుబడులు; సాంకేతిక పరిజ్ఞానం మొదలైన వాటి విషయంలో ప్రభుత్వ వైఖరిని సంబంధిత దేశ పారిశ్రామిక విధానంలో వివరిస్తారు. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వనరులను అభిలషణీయంగా ఉపయోగించుకోవాలి. నిర్దేశిత లక్ష్య సాధనకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. దీనికి సంబంధించి ఉత్పత్తి ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పాత్రను పారిశ్రామిక విధానం వివరిస్తుంది. స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశానికి సరైన, కచ్చితమైన పారిశ్రామిక విధానం లేదు. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం పారిశ్రామిక విధానం ఆవశ్యకతను గుర్తించి 1948, ఏప్రిల్ 6న మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ఈ తీర్మానంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పరిధిని స్పష్టంగా పేర్కొంటూ పరిశ్రమలను నాలుగు వర్గాలుగా విభజించారు. ఈ తీర్మానంతో మన దేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకొంది. మొదటి వర్గం (ప్రభుత్వ ఏకస్వామ్యం): ఈ వర్గంలోని పరిశ్రమలు ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉంటాయి. మూడు రకాల కార్యకలాపాలను నిర్వహించే పరిశ్రమలను ఈ వర్గంలో చేర్చారు. అవి.. 1.దేశ రక్షణ, తత్సంబంధ పరిశ్రమలు, ఆయుధ సామగ్రి, ఆయుధాల ఉత్పత్తి, నియంత్రణ. 2.అణుశక్తి ఉత్పత్తి, నియంత్రణ. 3.రైల్వేలు వాటి నిర్వహణ, యాజమాన్యం రెండో వర్గం (మిశ్రమ రంగం): ఇందులో ఆరు కీలక, మౌలిక పరిశ్రమలను చేర్చారు. అవి.. 1. బొగ్గు, 2. ఇనుము, ఉక్కు, 3. విమానాల ఉత్పత్తి, 4. నౌకా నిర్మాణం, 5.టెలిఫోన్, టెలిగ్రాఫ్, వైర్లెస్ పరికరాల ఉత్పత్తి, 6. ఖనిజ నూనెలు. ఈ తీర్మానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ వర్గంలోని పరిశ్రమల్లో కొత్త వాటిని ప్రైవేటు రంగంలో స్థాపించడానికి వీల్లేదు. ఇకపై వీటిని ప్రభుత్వ రంగంలోనే స్థాపిస్తారు. అప్పటికే ప్రైవేటు రంగంలో ఉన్న వాటిని కొనసాగించవచ్చు. అవసరమనుకుంటే పదేళ్ల తర్వాత నష్టపరిహారం చెల్లించి వాటిలో దేన్నయినా ప్రభుత్వం జాతీయం చేయొచ్చు. డో వర్గం (ప్రభుత్వ నియంత్రణ): ఈ వర్గంలో జాతీయ ప్రాముఖ్యం ఉన్న 18 పరిశ్రమలను చేర్చారు. వీటిని ప్రభుత్వం నిర్వహించనప్పటికీ వీటి నియంత్రణ, అజమాయిషీ ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి వీటి ఉత్పత్తులు కొనసాగాలి. ఇందులో ఆటోమొబైల్స్, భారీ రసాయనాలు, భారీ యంత్రాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, పంచదార, కాగితం, సిమెంట్, వస్త్ర, ఊలు మొదలైన పరిశ్రమలను చేర్చారు. నాలుగో వర్గం (ప్రైవేటు రంగం): పై మూడు వర్గాల్లో లేని పరిశ్రమలను ఇందులో చేర్చారు. వీటిని ప్రైవేటు రంగానికి వదిలేశారు. అయితే వీటిపై ప్రభుత్వం సాధారణ అజమాయిషీ కలిగి ఉంటుంది. 1951–పారిశ్రామికలైసెన్సింగ్ విధానం (పరిశ్రమల అభివృద్ధి, క్రమబద్ధ చట్టం) మన దేశంలో ప్రైవేటు రంగ పరిశ్రమల అభివృద్ధిని క్రమబద్ధం చేయడం, వాటిని నియంత్రించడం అనే రెండు ప్రధాన ఉద్దేశాలతో 1951, అక్టోబర్లో పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని (పరిశ్రమల అభివృద్ధి, క్రమబద్ధ చట్టం) పార్లమెంటు చట్టం ద్వారా రూపొందించారు. ఈ చట్టం 1952, మే 8 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం లక్ష్యాలు 1.ప్రణాళికా లక్ష్యాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా పారిశ్రామిక పెట్టుబడులు, ఉత్పత్తులు ఉండేలా చూడటం. 2.పెద్ద పరిశ్రమల పోటీ నుంచి చిన్న పరిశ్రమలను రక్షించడం. 3.ఏకస్వామ్యాలను నిరోధించడం. 4.సంతులిత ప్రాంతీయాభివృద్ధి. 5.వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం. 6.దేశీయ మార్కెట్లో సప్లై, డిమాండ్ల మధ్య సహ సంబంధాన్ని తీసుకురావడం. 7.సామాజిక మూలధనాన్ని అభిలషణీయంగా ఉపయోగించుకోవడం. ఈ చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమలు ప్రారంభంలో 37 ఉండగా, తర్వాత కాలంలో 70కి పెంచారు. ఇందులోని పరిశ్రమలు రిజిస్టర్ చేసుకొని లైసెన్స్ పొందాలి. 1953లో రూ.1 లక్ష కంటే ఎక్కువ పెట్టుబడి కలిగిన పరిశ్రమలను దీని పరిధిలోకి తెచ్చారు. అయితే లైసెన్సింగ్ అ«థారిటీపై పరిపాలన పరమైన భారం, ఒత్తిడి మూలంగా 1956లో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించారు. 1956లో విద్యుత్ను ఉపయోగించి, 50 మంది శ్రామికులతో ఉత్పత్తిని చేపట్టే పరిశ్రమలు (లేదా) విద్యుత్ను వాడకుండా 100 మంది శ్రామికులతో ఉత్పత్తిని నిర్వహించే పరిశ్రమలను ఈ చట్టం పరిధిలోకి చేర్చారు. ఈ చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమల పెట్టుబడి పరిమితిని 1960లో రూ.10 లక్షలకు పెంచారు. ఈ పరిమితిని 1963లో రూ.25 లక్షలకు పెంచారు. 1970లో రూ. కోటికి పెంచారు. 1978లో రూ.3 కోట్లకు పెంచారు. ఆ తర్వాత పెట్టుబడి పరిమితిని రూ.5 కోట్లకు పెంచారు. 1988–89లో ప్రభుత్వం లైసెన్సింగ్ విధానంలో విప్లవాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. దీని ప్రకారం అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో రూ.15 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల్లో రూ.50 కోట్లకు పైబడిన పెట్టుబడి గల పరిశ్రమలు మాత్రమే లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. లిబరలైజేషన్ పాలసీ (సరళీకృత విధానం)లో భాగంగా లైసెన్స్ల రద్దు వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. రెండో పారిశ్రామిక విధాన తీర్మానం–1956 1956, ఏప్రిల్ 30న భారత ప్రభుత్వం రెండో పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. 1956 నాటికి మన దేశంలో అనేక రాజకీయ, ఆర్థిక మార్పులు సంభవించాయి. 1956 నాటికి మొదటి పంచవర్ష ప్రణాళికను పూర్తి చేసుకోవడం, రెండో ప్రణాళికలో భారీ, మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం, సమ సమాజ స్థాపనను లక్ష్యంగా నిర్ణయించుకోవడం మొదలైనవి 1956 పారిశ్రామిక విధాన తీర్మాన ప్రకటనకు కారణమయ్యాయి. మూడు జాబితాలు: 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను ఎ, బి, సి అనే మూడు జాబితాలుగా వర్గీకరించారు. జాబితా–ఎ: ఇందులో 17 పరిశ్రమలను చేర్చారు. దేశ రక్షణ, తత్సంబంధ పరిశ్రమలు దీనిలో ఉన్నాయి. వీటిలో ఆయుధాలు, అణుశక్తి, విమాన రవాణా, రైల్వే రవాణా పరిశ్రమలు ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉంటాయి. మిగతా 13 పరిశ్రమలను ఈ తీర్మానం తర్వాత నుంచి ప్రభుత్వమే స్థాపిస్తుంది. అప్పటికే ప్రైవేటు రంగంలో ఉన్నవి కొనసాగవచ్చు. అవసరమైతే వీటిని ప్రైవేటు రంగంలో కూడా నెలకొల్పే అవకాశం కల్పించారు. ఈ తీర్మానంలో పరిశ్రమలను జాతీయం చేసే ప్రతిపాదన లేదు. జాబితా–బి: అన్ని రకాల ఖనిజాలు, లోహాలు, యంత్ర పనిముట్లు, మిశ్రమ లోహాలు, ఎరువులు, రబ్బరు, బొగ్గు తదితర 12 పరిశ్రమలను ఇందులో చేర్చారు. ప్రభుత్వం నూతన సంస్థలను స్థాపించి తన భాగస్వామ్యాన్ని పెంచుకోవచ్చు. అయితే ప్రైవేటు రంగం కొత్త సంస్థలను స్థాపించడానికి, ఉన్న వాటిని విస్తృతం చేసుకోవడానికి ఏ ఆటంకం ఉండదు. జాబితా–సి: ఎ, బి జాబితాల్లో లేని పరిశ్రమలను ఇందులో చేర్చారు. ఈ జాబితాలోని పరిశ్రమల అభివృద్ధి ప్రైవేటు రంగం చొరవపై ఆధారపడి ఉంటుంది. పారిశ్రామికీకరణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ జాబితాలోని పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించడమే కాకుండా నియంత్రిస్తుంది. 1970, 1973, 1975ల్లో పారిశ్రామిక విధాన తీర్మానాలను ప్రకటించినా, వాటికి 1956 తీర్మానమే ప్రాతిపదికగా నిలిచింది. ఈ తీర్మానాల్లో మౌలిక మార్పులు లేకుండా కేవలం కుటీర, చిన్నతరహా పరిశ్రమల నిర్వచనాల్లో, లైసెన్సింగ్ విధానంలో, విదేశీ మూలధనం విషయంలో స్వల్ప మార్పులు చేశారు. జనతా ప్రభుత్వ పారిశ్రామిక విధానం–1977 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం, తన శైలిలో 1977 డిసెంబర్ 23న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. గాంధేయ విధానానికి అనుగుణంగా దీన్ని రూపొందించారు. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి ఇందులో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నూతన పారిశ్రామిక విధానం–1991 1980 నుంచి మొదలైన సరళీకృత విధానం, నిర్ణయాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. పి.వి.నరసింహారావు ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా 1991, జూలై 24న దీన్ని ప్రకటించారు. ప్రపంచ మార్కెట్తో భారత ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేసి, విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర సామగ్రి దిగుమతులను పెంచి, వేగవంతమైన అభివృద్ధిని సాధించడం ఈ తీర్మానం ముఖ్య ఉద్దేశం. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో లైసెన్సింగ్ విధానంలోని నిబంధనలను గణనీయంగా సడలించారు. 1991 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రధాన లక్ష్యాలు సాధించిన ఆర్థిక ప్రగతి ఫలాలను ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఉపయోగించడం. ఆర్థిక ప్రగతికి ఆటంకం కలిగించే అంశాలను సరిచేయడం. ఉత్పత్తి, ఉద్యోగితల్లో సుస్థిర వృద్ధిని నిలుపుకోవడం. అంతర్జాతీయంగా ఎదురయ్యే పోటీని తట్టుకోవడం. అక్కెనపల్లి మీనయ్య ఎకనామిక్స్ (హెచ్వోడీ)– రిటైర్డ్ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్లగొండ -
ఆలోచనకు అండాదండ
ఆలోచనకు అండాదండ స్టార్టప్ సంస్థలు, ఎంటర్ప్రెన్యూర్ ఔత్సాహికులు.. ఇటీవల విస్తృతంగా వినిపిస్తున్న మాటలు. ముఖ్యంగా.. యువత వినూత్న ఆలోచనలు, విభిన్న వ్యాపార అంశాలతో స్వయం ఉపాధి(స్టార్టప్స్) దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు తోడ్పడే చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అకడమిక్ స్థాయి నుంచే నైపుణ్యాలు అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) కొత్త స్టార్టప్ పాలసీని రూపొందించింది. ఆ వివరాలు.. ఇదీ ఉద్దేశం సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించడం, స్వదేశీ ఉత్పత్తులను పెంచడం, అందులో యువతను భాగస్వాములు చేసి స్వయం ఉపాధి దిశగా వారు అడుగులు వేసేలా చూడడం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్టార్టప్ ఇండియా’ లక్ష్యం. ఇదీ పరిస్థితి ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్ల విద్యార్థులు మినహా దేశంలో చాలామంది యువతకు ‘స్టార్టప్’ గురించి పెద్దగా పెద్దగా అవగాహన లేదు. స్టార్టప్స్ ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మరికొందరిలో అయోమయం. ఇదీ కార్యాచరణ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, ప్రధానంగా ఏఐసీటీఈ పరిధిలో దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు స్టార్టప్స్పై పూర్తి అవగాహన కల్పించడం. అందుకుతగ్గట్లు విధానపరంగా మార్పుచేర్పులు. తొలి దశలో రూ. 433.53 కోట్ల నిధుల కేటాయింపు. 2025 నాటికి లక్ష సాంకేతిక స్టార్టప్స్ ఏఐసీటీఈ స్టార్టప్ పాలసీ ప్రధాన లక్ష్యం.. 2025 నాటికి జాతీయ స్థాయిలో కనీసం లక్ష సాంకేతిక(టెక్నాలజీ) ఆధారిత సంస్థలు నెలకొల్పేలా చూడటం. తద్వారా పది లక్షల మందికి ఉపాధి కల్పించడం. విద్యా సంస్థలు, విద్యార్థులు ఆసక్తి చూపేలా కరిక్యులం, బోధన విధానం, అకడమిక్ స్ట్రక్చర్లో మార్పులను ఏఐసీటీఈ నిర్దేశించుకుంది. ఆన్–క్యాంపస్ స్టార్టప్స్ స్టూడెంట్ డ్రివెన్ ఆన్–క్యాంపస్ స్టార్టప్స్ రూపొందడం పాలసీలో ప్రధానంగా పేర్కొనాల్సిన అంశం. ఇందుకోసం విద్యార్థులు ఎంటర్ప్రెన్యూర్షిప్ను లక్ష్యంగా ఎంచుకునేలా ఇన్స్టిట్యూట్స్ ప్రోత్సహించాలి. ప్రస్తుత కరిక్యులం, పెడగాగీలో మార్పులు చేసి స్టార్టప్స్కు ఎక్కువ ప్రాధాన్యం దక్కేలా కొత్త కరిక్యులం తీసుకురావాలి. కొత్త కరిక్యులం ఇలా వ్యాపార అవకాశాలను గుర్తించడం.. ఐడియా జనరేషన్, ఐపీఆర్/పేరెంటింగ్ ‘లా’స్, స్టార్టప్ ఫైనాన్స్, స్టార్టప్ ఏర్పాటు –మనుగడ కోణంలో సదరు వ్యక్తులకు ఉండాల్సిన సహజ కమ్యూనికేషన్ స్కిల్స్ అంశాల సమ్మిళితంగా స్టార్టప్ కోర్స్ కరిక్యులం ఉండాలి. టీబీఐల ఏర్పాటు ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ప్రత్యేకంగా టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (టీబీఐ)లు ఏర్పాటు చేయాలి. స్టార్టప్ ఆలోచనలకు.. ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా అనుమతి లభించే విధంగా టీబీఐలు తోడ్పడాలి. యాక్సలరేటర్స్ ఔత్సాహిక యువతకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించేందుకు యాక్సలేటర్స్ విధానాన్ని పేర్కొన్నారు. దీనిప్రకారం.. స్టార్టప్ యాక్సలరేటర్స్, మెంటార్స్, ఇతర నిపుణుల నేతృత్వంలో నిర్దిష్ట ప్రోగ్రామ్లను రూపొందించడం, మంచి వ్యాపార ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడం చేయాలి. గుర్తింపు లభించేలా జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్లాట్ఫామ్ రూపొందించడం ఔత్సాహికులకు కలిసొచ్చే మరో ముఖ్య విధానం. ఔత్సాహిక విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ను ఈ ప్లాట్ఫామ్లో ఇన్స్టిట్యూట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక విద్యార్థి తన ఆలోచనతో రూపొందించిన స్టార్టప్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఏంజెల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్లు సైతం చూసే అవకాశం లభిస్తుంది. ప్రత్యేక సబ్జెక్ట్లు కరిక్యులం మార్పులపరంగా బీటెక్ ప్రోగ్రామ్లో ఏడాదికో నిర్దిష్ట కోర్సులను బోధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు... బీటెక్ మూడో సంవత్సరంలో బేసిక్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ఉండాలని పేర్కొంది. సంవత్సరాలవారీగా బేసిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్, బేసిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూరియల్ మార్కెటింగ్, ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వంటి అంశాలను వారంలో గరిష్టంగా నాలుగు గంటల వ్యవధిలో బోధించాలి. స్పెషలైజేషన్గా స్టార్టప్ స్ట్రీమ్ స్టార్టప్ స్ట్రీమ్ను ఒక స్పెషలైజేషన్గా ఎంచుకునే అవకాశం కల్పించడం మరో ముఖ్యాంశం. బీటెక్, బీఆర్క్, పీజీడీఎం, ఎంటెక్, ఎంబీఏ, బీ ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ ప్రోగ్రామ్లలో.. ‘స్టార్టప్ : లాంచింగ్ అండ్ సస్టెయినింగ్’ పేరుతో ఇన్స్టిట్యూట్లు స్పెషలైజేషన్ సబ్జెక్ట్ను ఆఫర్ చేయాల్సి ఉంటుంది. వేసవి/శీతాకాల ఇంటర్న్షిప్ స్టార్టప్ లాంచింగ్ అండ్ సస్టెయినింగ్ స్పెషలైజేషన్ విద్యార్థులు.. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, పూర్వ విద్యార్థులు నెలకొల్పిన స్టార్టప్ సంస్థల్లో వేసవి లేదా శీతాకాల ఇంటర్న్షిప్ చేయడం తప్పనిసరి. దీనివల్ల వారికి ఆర్థిక నిర్వహణ అంశాలపై ప్రాథమిక అవగాహన లభిస్తుంది. ఐడియా ల్యాబ్స్ ఏర్పాటు ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ఐడియా ల్యాబ్ను ఏర్పాటు చేయాలి. బీటెక్ తృతీయ సంవత్సర విద్యార్థులకు అవకాశం కల్పించి, వారి వ్యాపార ఆలోచనలను సంబంధిత నిపుణులు పరిశీలించేలా చూడటం, కార్యాచరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడం, ఐపీఆర్లను దాఖలు చేయడం వంటివి ఈ ఐడియా ల్యాబ్స్ నిర్వహించాలి. మూక్ నమోదు తప్పనిసరి విద్యార్థులు తప్పనిసరిగా స్టార్టప్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్సును మాసివ్లీ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్) విధానంలో అభ్యసనం చేయాలి. స్టార్టప్పై అవగాహన కలిగేందుకు ఇది ఉపయుక్తం. ఇందుకోసం ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యాసంస్థలు అందిస్తున్న మూక్స్లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఏంజెల్స్, వీసీస్.. ఇన్స్ట్రక్టర్స్గా స్టార్టప్ ఏర్పాటులో అత్యంత కీలకమైనది నిధుల సమీకరణ. నిధుల సమీకరణ కోసం ఎలా వ్యవహరించాలి..? అనే అంశంపై అవగాహన కల్పించేందుకు ఏంజెల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్లను పార్ట్ టైం కోర్స్ ఇన్స్ట్రక్టర్స్గా రప్పించే ఏర్పాట్లు చేయాలి. స్టార్టప్–ఫెస్ట్ ఔత్సాహిక యువత, వెంచర్ క్యాపిటలిస్ట్లు, ఫండింగ్ ఏజెన్సీలను అనుసంధానం చేసేలా.. ప్రతి ఇన్స్టిట్యూట్ స్టార్టప్ ఫెస్టివల్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రేరణకు వెబ్పోర్టల్ ఔత్సాహికులకు ప్రేరణ లభించేలా ఏఐసీటీఈ ప్రత్యేక వెబ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురానుంది. తద్వారా విద్యార్థులు మెంటార్స్తో అనుంసధానమై సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం లభించనుంది. ఈ వెబ్పోర్టల్లో సబ్జెక్ట్ నిపుణులు, పరిశోధకులు, ఫ్యాకల్టీ, ట్రైనర్స్ వివరాలు అందుబాటులో ఉంటాయి. జాతీయస్థాయి ప్రోగ్రామ్ ఇన్స్టిట్యూట్ స్థాయిలో స్టార్టప్ ఫెస్టివల్స్ను నిర్వహించడమే కాక .. ఏఐసీటీఈ కూడా జాతీయ స్థాయిలో ప్రత్యేక యాక్సలరేషన్ ప్రోగ్రామ్ నిర్వహించనుంది. ఇది నాస్కామ్ 10000 స్టార్టప్స్ ప్రోగ్రామ్ మాదిరిగా ఉంటుంది. దీనిద్వారా ఎంపికైన 50 స్టార్టప్ సంస్థలకు ఏడాదికి రూ. 25 లక్షలు చొప్పున ఏంజెల్ ఫండ్స్ లభిస్తాయి. ఆలోచన మంచిది స్టార్టప్లు, ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ప్రముఖ ఇన్స్టిట్యూట్లలోనే సాధ్యం అనుకుంటున్న పరిస్థితులున్నాయి. అలాంటిది ఏఐసీటీఈ అనుబంధ కళాశాలల్లో ఔత్సాహికులను ప్రోత్సహించే విధానం తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇన్స్టిట్యూట్లు తప్పనిసరిగా చొరవ చూపేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఉద్దేశం నెరవేరుతుంది. – ప్రొఫెసర్ వి.వెంకట రమణ, కో ఆర్డినేటర్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్, హెచ్సీయూ -
సామాజిక ఉద్యమాలు
మహిళా ఉద్యమాలు ప్రాచీన కాలంలో స్త్రీలు.. పురుషులతో సమానంగా హక్కులు కలిగి ఉన్నారని తెలుస్తోంది. వేద కాలంలో గార్గి, మైత్రేయి వంటి ఎందరో మహిళలు పురుషులతో సమానంగా విద్యనభ్యసించారు. స్త్రీలకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండేదని రుగ్వేద శ్లోకాల ద్వారా తెలుస్తోంది. అయితే తర్వాతి కాలంలో స్త్రీల పరిస్థితి క్రమంగా దయనీయంగా మారుతూ వచ్చింది. మధ్యయుగం నాటికి మతం, సంప్రదాయాల పేరిట బాల్య వివాహాలు, సతీసహగమనం, దేవదాసీ వ్యవస్థ, పునర్వివాహాలను అంగీకరించకపోవడం వంటి ఎన్నో దురాచారాలు ఆవిర్భవించాయి. సతీసహగమనం భర్త మృతి చెందినప్పుడు అతని మృతదేహం తో పాటు భార్య కూడా చితిమంటలో కాలి మరణించడం సతీసహగమనం. దీన్ని స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా చేయించేవారు. ఈ దురాచారం బెంగాల్లో ఎక్కువగా ఉండేది. దయాభాగ విధానం అమల్లో ఉండటం దీనికి కారణంగా చెబుతారు. దయాభాగ విధానం ప్రకారం మరణించిన భర్త ఆస్తిపై వితంతువుకు హక్కు ఉంటుంది. ఈ అడ్డును తొలగించుకునేందుకు సతీసహగమనాన్ని ఉపయోగించుకున్నట్లు భావిస్తున్నారు. భర్త చనిపోయిన పరిస్థితిలో భార్య మానసిక స్థితిని అంచనా వేయకుండా, ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించి, బలవంతంగా సహగమనం చేయించేవారు. 1815–1828 మధ్య ఒక్క బెంగాల్లోనే 8,000 మందికి పైగా మహిళలు ఈ దురాచారానికి బలయ్యారు. జౌహర్ ఓడిపోయిన రాజుల కుమార్తెలు, భార్యలు, బంధువర్గంలోని స్త్రీలు సామూహికంగా, స్వచ్ఛందంగా అగ్నిలోకి దూకి మరణించడాన్ని జౌహర్ అంటారు. గెలిచిన రాజులు, సైన్యం చేతిలో లైంగిక దాడులకు గురవకుండా, తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఇలా చేసేవారు. ఈ ఆచారం రాజపుత్రుల్లో ఎక్కువగా ఉండేది. మధ్యయు గంలో రాణి పద్మావతి జౌహర్ ప్రముఖమైంది. పరదా పద్ధతి మధ్యయుగంలో ఈ ఆచారం ఎక్కువగా ముస్లింలు, హిందూ కులీనులు, కొన్ని జాతుల్లో కనిపించేది. స్త్రీలు తాము బయటకు కనిపించకుండా తెర వెనుక ఉండేవారు. లేదా మేని ముసుగు ధరించేవారు. దీనివల్ల బయటకు వెళ్లడానికి, స్వేచ్ఛగా ఇతరులను కలవడానికి అవకాశం ఉండేది కాదు. స్త్రీల విద్యాభ్యాసానికి ఇది ముఖ్య అవరోధంగా ఉండేది. దేవదాసీ వ్యవస్థ దక్షిణ భారతదేశంలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పదో శతాబ్దంలో ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ ఆచారం ప్రకారం కన్యలకు దేవుని విగ్రహంతో వివాహం జరిపిస్తారు. వారు దేవుణ్ని సేవిస్తూ, నృత్యాలు చేస్తూ జీవితాంతం కన్యలుగా ఉండేవారు. తర్వాతి కాలంలో ఈ వ్యవస్థను పక్కదారి పట్టించి, వారిని వేశ్యలుగా మార్చారు. బాల్య వివాహాలు చాలా చిన్న వయసులోనే బాలికకు వివాహం జరిపించాలనే దురాచారం భారతీయ సమాజంలో ఉండేది. మూడేళ్లు, ఐదేళ్ల వయసులోనే వివాహాలు జరిపించేవారు. ఇది బాలికల విద్యాభ్యాసానికి అవరోధంగా నిలిచేది. పసి వయసులోనే వితంతువులుగా మారి, దుర్భర జీవితాన్ని అనుభవించేవారు. చిన్నతనంలోనే గర్భం దాల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తేవి. స్త్రీవాద ఉద్యమాలు భారతదేశంలో స్త్రీవాద ఉద్యమాలను మూడు దశలుగా విభజించొచ్చు. మొదటి దశ (బ్రిటిష్ పాలనా కాలం–1915): ఈ దశలో ఐరోపా వలస పాలకులు మూఢాచారాల గురించి బహిరంగంగా మాట్లాడటంతోపాటు వాటి నిర్మూలనకు కొన్ని చట్టాలు చేశారు. స్త్రీల అణచివేతను, మూఢాచారాలను తొలగించేందుకు సంఘ సంస్కర్తలు ప్రయత్నించారు. రెండో దశ (1915–1947): ఈ దశలో స్త్రీలు తమ కోసం ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. మూడో దశ (స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు): ఈ దశలో స్త్రీవాద ఉద్యమాల దృక్పథం, పోరాట పద్ధతుల్లో ఎంతో వైవిధ్యాన్ని గమనించవచ్చు. స్త్రీవాద ఉద్యమాలను కొందరు స్వాతంత్య్ర పూర్వదశ, అనంతర దశగా విభజించారు. స్వాతంత్య్ర పూర్వ దశ: ఈ దశలో స్త్రీవాద ఉద్యమాలను రెండు దశలుగా విభజించొచ్చు. అవి.. సాంఘిక సంస్కరణ ఉద్యమం, స్వాతంత్య్ర ఉద్యమం. సాంఘిక సంస్కరణ ఉద్యమంలో స్త్రీలను అణచివేస్తున్న మూఢాచారాల తొలగింపునకు సంఘసంస్కర్తలు ప్రయత్నించారు. ఇదే సమయంలో మరోవైపు స్త్రీలు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. దేశంలో సంఘసంస్కరణలకు ఆద్యుడు రాజా రామ్మోహన్రాయ్. సతీసహగమన నిషేధం, కులీనుల్లో బహు భార్యత్వ నిర్మూలన, స్త్రీల హక్కులకోసం ఆయన కృషి చేశారు. ఆయన కృషి వల్ల అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ సతీసహగమన నిషేధ చట్టం (1829, డిసెంబరు 4) చేశారు. వితంతు పునర్వివాహాలు జరిపించేందుకు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఎంతో కృషి చేశారు. ఆయన 1855 జనవరిలో వితంతు పునర్వివాహాన్ని సమర్థిస్తూ కరపత్రం ప్రచురించారు. ఆయన కృషి ఫలితంగా ప్రభుత్వం 1856, జూన్ 25న స్త్రీ పునర్వివాహాన్ని చట్టబద్ధం చేసింది. మొదటి వితంతు వివాహాన్ని విద్యాసాగర్ 1856, డిసెంబర్ 7న జరిపించారు. దక్షిణ భారతదేశంలో వితంతు వివాహాలకు కందుకూరి వీరేశలింగం పంతులు కృషి చేశారు. ఆయన 1881, డిసెంబర్ 11న వితంతు వివాహం జరిపించారు. పునర్వివాహం విషయంలో మహదేవ్ గోవింద రనడే, విష్ణుశాస్త్రి పండిట్, గోపాల్ దేశ్ముఖ్ వంటి ఎందరో సంస్కర్తలు కృషి చేశారు. దేశవ్యాప్తంగా బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం (మహారాష్ట్ర) సభ్యులు బాల్య వివాహాల నిషేధానికి, వితంతు వివాహాలకు, స్త్రీ విద్యాభ్యాసానికి కృషి చేశారు. బ్రహ్మ సమాజ సభ్యుడు కేశవచంద్రసేన్ బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేశారు. ఆయన కృషి వల్ల శారదా చట్టం (1929) వచ్చింది. దీని ప్రకారం బాలికల వివాహ వయసు 14 ఏళ్లు, బాలుర వివాహ వయసు 18 ఏళ్లు. స్త్రీ విద్యకు మొదట్లో మిషనరీలు కృషి చేశాయి. 1818లో లండన్ మిషనరీ.. బెంగాల్లోని చిన్సురాలో బాలికల పాఠశాలను నెలకొల్పింది. అగ్రవర్ణాల్లో బాలికల విద్యపై అపోహ తొలగించేందుకు గౌరీ మోహన్ విద్యాలంకార్ 1822లో ‘స్త్రీ శిక్షా విధాయక్’ పేరిట కరపత్రం ప్రచురించారు. 1849 మేలో కలకత్తాలో జేఈడీ బెతూనీ ఒక పాఠశాలను ప్రారంభించారు. అది 1879 నాటికి మహిళా పాఠశాలగా మారింది. పియరీ చరణ్ సర్కార్ బెంగాల్లోని బర్సాత్లో బాలికల కోసం మొదటి ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఇది తర్వాతి కాలంలో కాళీకృష్ణా బాలికా ఉన్నత పాఠశాలగా మారింది. సంఘసంస్కర్తల కృషి వల్ల ఎందరో స్త్రీలు విద్యావంతులై, తమ హక్కుల కోసం పోరాడే చైతన్యం పొందారని చెప్పొచ్చు. మహిళా సంఘ సంస్కర్తలు మహిళా సంఘ సంస్కర్తలకు సంబంధించి మొదటగా చెప్పుకోదగినవారు సావిత్రీబాయి పూలే, పండిత రమాబాయి. సావిత్రీబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. తన భర్త జ్యోతిబా పూలేతో కలసి స్త్రీల అభ్యున్నతికి పాటుపడ్డారు. ప్రముఖ సంఘ సంస్కర్త గోవింద రనడే భార్య రమాబాయి.. ‘ది హై క్యాస్ట్ హిందూ ఉమెన్’ పుస్తకంలో స్త్రీల అణచివేత, మతం, వలసవాదం మొదలైన అంశాలను విమర్శించారు. పుణెలో సేవా సదన్ సంస్థను స్థాపించి, స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారు. ఎన్నో స్త్రీ పాఠశాలలు, వితంతు ఆశ్రమాలను స్థాపించారు. రమా బాయి పుణెలో ఆర్య మహిళా సమాజ్ను, బాంబేలో శారదా సదన్ను ఏర్పాటు చేశారు. బెంగాల్ రచయిత్రి రసుందరీ దేవి.. ‘అమర్ జీవన్’ పేరిట 1876లో ఆత్మకథ రాశారు. ఆత్మకథను రాసిన తొలి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఇందులో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడంతోపాటు స్త్రీలు చైతన్యవంతులు కావాలని సూచించారు. 19వ శతాబ్దం చివరి నాటికి మహిళలు తమ కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసుకోగలిగే స్థాయికి ఎదిగారు. అలాంటి వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరి స్వర్ణకుమారీ దేవి ఒకరు. ఆమె 1882లో కలకత్తాలో లేడీస్ సొసైటీని స్థాపించారు. స్త్రీల విద్యాభ్యాసం, వితంతు వివాహాలను ప్రోత్సహించడంతో పాటు, పేద స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన శిక్షణను ఈ సొసైటీ ఇచ్చేది. భారతి అనే పత్రికను కూడా స్వర్ణకుమారి నడిపారు. దీనికి ఎడిటర్గా పనిచేసి, తొలి భారతీయ మహిళా ఎడిటర్గా ఆమె గుర్తింపు పొందారు. జాతీయ కాంగ్రెస్ మూడో సమావేశంలో సామాజిక సమస్యలపై అధ్యయనం కోసం 1887లో ఎం.జి.రనడే ‘నేషనల్ కాన్ఫరెన్స్’ను స్థాపించారు. ఇందులో మహిళా విభాగం (ఇండియన్ ఉమెన్ కాన్ఫరెన్స్) 1904లో ఏర్పడింది. దీని శాఖలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. కులం, మతం, వర్గం, పార్టీలనే భేదం లేకుండా దేశంలోని మహిళలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు, వారి నైతిక, ఆర్థికాభివృద్ధికి స్వర్ణకుమారీ దేవి కుమార్తె సరళాదేవి చౌధురాణి 1910లో ‘భారత స్త్రీ మండల్’ సంస్థను ప్రారంభించారు. లాహోర్, అమృత్సర్, హైదరాబాద్, ఢిల్లీ, కరాచీ వంటి చాలా నగరాల్లో ఈ సంస్థ శాఖలు ప్రారంభమయ్యాయి. ఈ సంస్థ కొంత కాలమే మనుగడ సాగించినప్పటికీ జాతీయ స్థాయిలో స్త్రీలకు ప్రాతినిధ్యం వహించిన మొదటి సంస్థగా చెప్పొచ్చు. స్త్రీలకు రాజకీయ హక్కులు! స్త్రీలకు రాజకీయ హక్కులు, వ్యక్తిగత చట్టాల్లో సవరణలు ప్రాతిపదికన 1917–1945 మధ్య కాలంలో స్త్రీ వాద ఉద్యమాలు జరిగాయి. 1917లో అనీబిసెంట్, మార్గరెట్ కజిన్స్ వంటి ఐరిష్ మహిళలు ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ను స్థాపించారు. వీరు స్వదేశంలో మహిళల ఓటు హక్కు కోసం పోరాటం సాగించారు. భారతదేశంలో కూడా మహిళల ఓటు హక్కు కోసం పోరాడారు. 1917 జాతీయ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, ముస్లింలీగ్లు మహిళల ఓటు హక్కు డిమాండ్ను సమర్థించాయి. సరోజినీ నాయుడు ‘మాంటేగ్’ను కలసి, స్త్రీలకు ఓటు హక్కు కల్పించేందుకు సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. పార్లమెంటు కమిటీ లింగ ఆధారిత అనర్హతను తొలగించినా, మహిళలకు ఓటు హక్కు నిర్ణయాన్ని రాష్ట్ర శాసనసభల విచక్షణకు వదిలేసింది. భారత్లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి స్వదేశీ సంస్థానం ట్రావెన్కోర్–కొచ్చిన్ సంస్థానం. ఇది 1920లో మహిళలకు ఓటు హక్కు కల్పించింది. 1921లో మద్రాస్, బాంబేలు ఓటు ఓటుహక్కు ఇచ్చాయి. అయితే కొన్ని పరిమితులు విధించాయి. 1926లో కమలాదేవి చటోపాధ్యాయ్ మద్రాస్ శాసన మండలికి పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓడిపోయారు. ముత్తులక్ష్మీ రెడ్డిని మద్రాస్ ప్రభుత్వం శాసనమండలి సభ్యురాలిగా నియమించింది. -
రాష్ట్రపతి.. బిల్లును పూర్తిగా తిరస్కరించడం?
కాంపిటీటివ్ గైడెన్స్ ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగం ప్రకారం డిజ్యూర్ సార్వభౌమాధికారిగా ఎవరు వ్యవహరిస్తారు? రాష్ట్రపతి పదవీ కాలంలో రాష్ట్రపతి ప్రథమ పౌరునిగా ఉంటే... పదవీ విరమణ తర్వాత హోదా క్రమంలో ఎన్నో స్థానాన్ని పొందుతారు? 5వ స్థానం భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి తెలిపే అధికరణలు? ఆర్టికల్–52 నుంచి ఆర్టికల్–151 వరకు భారతదేశంలో మూడు ప్రభుత్వాంగాలు ఏ సూత్రంపై పనిచేస్తాయి? చెక్స్, బ్యాలెన్స్ విధానంలో భారతదేశానికి ప్రధాన కార్యనిర్వాహక అధికారి రాష్ట్రపతి అని తెలిపే ఆర్టికల్? ఆర్టికల్–53 రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి చెల్లించాల్సిన డిపాజిట్ మొత్తం? రూ.15,000 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1952 రాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల గణంలో అతని అభ్యర్థిత్వాన్ని ఎంతమంది ప్రతిపాదించాలి, ఎంతమంది బలపర్చాలి? 50, 50 రాష్ట్రపతి ఎన్నికను సవాల్ చేయాలంటే నియోజకగణంలోని ఎంత మంది సభ్యులు బలపరచాలి? 20 ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి ఎన్నిక వివాదాలకు సంబంధించిన మార్గదర్శకాలను రాజ్యాంగంలో చేర్చారు? 11వ సవరణ, 1961 రాష్ట్రపతి భవన్ రూపశిల్పులు? హెర్బర్ట్ బేకర్, ఎడ్వర్ట్ లుట్టియాన్స్ రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం గురించి తెలిపే ఆర్టికల్? ఆర్టికల్–61 రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేయడం? ప్రోరోగ్ రాష్ట్రపతి.. బిల్లును పూర్తిగా తిరస్కరించడం? నిరపేక్ష వీటో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు? ఆర్టికల్–108 ప్రస్తుతం లోక్సభలో ఆంగ్లో–ఇండియన్ సభ్యులు? జార్జ్ బకెర్, రిచర్డ్ హే భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు? ఆర్టికల్–123 రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ దురుద్దేశ కారణాలతో ఉంటే న్యాయ సమీక్ష చేయొచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? కూపర్ కేంద్ర ప్రభుత్వం 1970 రాష్ట్రపతి వద్ద ఉండే నిధి? ఆగంతుక నిధి రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారం కల్పించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్? ఆర్టికల్–72 ఆర్థిక సంఘం, కాగ్ తమ నివేదికలను ఎవరికి సమర్పిస్తాయి? రాష్ట్రపతికి ఉరిశిక్షను అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే విధించాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? బచన్ సింగ్ కేసు భారత రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు అని తెలిపే ఆర్టికల్? ఆర్టికల్–53 (2) రాజ్యాంగంలోని ఏ భాగం రాష్ట్రపతి అత్యవసర అధికారాల గురించి తెలుపుతోంది? 18వ భాగం జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్? ఆర్టికల్–352 రాష్ట్రపతి పాలన గురించి తెలిపే ‘ఆర్టికల్ 356’ను మృత పత్రంగా పేర్కొన్నవారు? డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు? మూడుసార్లు (1962, 1971, 1975) ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అకృత్యాలపై (1975–77) జనతా ప్రభుత్వం నియమించిన కమిషన్? షా కమిషన్ అత్యవసర అధికారాలను దుర్వినియోగం చేయకుండా మార్గదర్శకాలను కల్పించిన రాజ్యాంగ సవరణ? 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 రాష్ట్రపతి పాలనను దుర్వినియోగం చేయకుండా సుప్రీంకోర్టు్ట ఏ కేసులో మార్గదర్శకాలు ఇచ్చింది? ఎస్.ఆర్. బొౖమ్మై కేసు (1994) ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్? ఆర్టికల్ –360 అమెరికా అధ్యక్షుడికి ఉండి, భారత రాష్ట్రపతికి లేని వీటో? క్వాలిఫైడ్ వీటో రెండుసార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినవారు? హిదయతుల్లా (1969, 1983) మొదటి రాష్ట్రపతి ఎన్నికల్లో (1952) బాబూ రాజేంద్రప్రసాద్పై పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి? కె.టి. షా హిందూ కోడ్ బిల్లులో సవరణల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన రాష్ట్రపతి? బాబూ రాజేంద్రప్రసాద్ అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసినవారు? జాకీర్ హుస్సేన్ (1967–69) ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని ఇందిరాగాంధీ ఎప్పుడు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా పిలుపునిచ్చారు? 1969 రాష్ట్రపతి ఎన్నిక తన ఎన్నికపై వచ్చిన వివాదంపై సుప్రీంకోర్టుకు స్వయంగా హాజరై తన వాదనను వినిపించిన రాష్ట్రపతి? వి.వి.గిరి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, స్పీకర్గా, రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి? నీలం సంజీవరెడ్డి ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ సైనిక చర్య ఏ రాష్ట్రపతి కాలంలో జరిగింది? జ్ఞానీ జైల్సింగ్ (1984) అత్యధికంగా నలుగురు ప్రధానమంత్రుల ప్రమాణ స్వీకారం ఏ రాష్ట్రపతి కాలంలో జరిగింది? ఆర్. వెంకట్రామన్ (1987–92) -
మూక్స్లో చేరండిలా...
హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎంఐటీ.. ఇవన్నీ ప్రపంచ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు. వీటిలో చదవడం ఒక కల. అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఈ యూనివర్సిటీల్లో చేరే అవకాశం అతికష్టమ్మీద లభిస్తుంది. ఇంతటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం అందించే కోర్సుల్లో ప్రతి ఒక్కరూ చేరే అవకాశం కల్పిస్తోంది.. మూక్స్ (మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్). అంతేకాదు.. కూర్చున్న చోటు నుంచే ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్ల పాఠాలు వినే స్వప్నాన్ని సైతం సాకారం చేస్తోంది మూక్స్. ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్, ల్యాప్ట్యాప్ లేదా కంప్యూటర్. మూక్స్ ద్వారా తమకు నచ్చిన, మెచ్చిన యూనివర్సిటీల్లో పేరు నమోదు చేసుకుని అవి అందించే కోర్సులు అభ్యసించొచ్చు. సదరు కోర్సు సర్టిఫికెట్లు కూడా పొందొచ్చు. ఈ నేపథ్యంలో మూక్స్ కోర్సులు, వాటిలో చేరడం ఎలాగో తెలుసుకుందాం.. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ విధానంలో యూనివర్సిటీలు/కాలేజీలు/ ఇన్స్టిట్యూట్లు అధికారికంగా సర్వీస్ ప్రొవైడర్లతో (ఎన్పీటీఎల్, ఎడ్ఎక్స్, కోర్స్ ఎరా, యుడాసిటీ వంటివి ) ఒప్పందాలు చేసుకుంటాయి. ఔత్సాహిక అభ్యర్థులు ఆయా వెబ్సైట్లల్లో ఏ సమయంలోనైనా వారి వీలును బట్టి క్లాసెస్కు ఎన్రోల్ అవ్వొచ్చు. క్రేజీ కోర్సులు ఇవే ప్రస్తుతం మూక్స్లో ఎక్కువమంది ఆసక్తి చూపుతున్న కోర్సులు.. డేటాసైన్స్, గేమిఫికేషన్, మెంటల్ టూల్స్, డెవలపింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఫర్ న్యూ కంపెనీస్, పైథాన్ ప్రోగ్రామింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, రెజ్యుమే రైటింగ్ అండ్ కవర్ లెటర్స్, వెబ్సైట్ బేసిక్స్, హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రుబీ వెబ్ సర్వీసెస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సులు, క్వాలిటీ మేనేజ్మెంట్ కోర్సులు, జీఎస్టీ సర్టిఫికేషన్ కోర్సులు, రిస్క్ మేనేజ్మెంట్ కోర్సులు. మూక్స్.. ఉపయోగం మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్(మూక్స్) ద్వారా ఇంట్లోనే ఇంటర్నెట్ సహాయంతో ప్రపంచంలోని ఏ యూనివర్సిటీ కోర్సులనైనా అభ్యసించే వీలుంది. వీటిద్వారా వివిధ కోర్సుల పట్ల ఆసక్తి ఉన్న వారు తమ ఇష్టమైన కోర్సుకు నమోదు చేసుకోవచ్చు. నాలెడ్జ్ను పెంచుకోవడానికి ఉపయోగపడే కోర్సుల్లో చేరవచ్చు. ఆర్థికంగా వెసులుబాటు లేక నేర్చుకోవడం ఆపేసిన వారు ఈ కోర్సుల్లో చేరి నాలెడ్జ్ను పెంచుకోవచ్చు. మూక్స్ కోర్సులకు రిజిస్ట్రేషన్ విధానం మూక్స్ సర్వీస్ను అందించే ప్రొవైడర్లను బట్టి కోర్సుకు నమోదయ్యే విధానం ఉంటుంది. ఆయా ప్రొవైడర్ల నిబంధనలకు అనుగుణంగా కొన్ని కోర్సులు ఉచితంగా అభ్యసించొచ్చు. మరికొన్ని కోర్సులకు నిర్దిష్ట ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ప్రముఖ మూక్స్ ప్రొవైడర్గా పేరొందిన కోర్సెరాలో ఉచిత, పెయిడ్ కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం కోర్సెరా 29 దేశాలకు చెందిన దాదాపు 150 యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుంది. వీటిల్లో స్టాన్ఫోర్డ్, డ్యూక్, పెన్న్, ప్రిన్స్టన్, మిచిగాన్, పెకింగ్, హెచ్ఈసీ ప్యారిస్ లాంటి ప్రముఖ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటికి తోడు ఐబీఎం, గూగుల్, పీడబ్ల్యూసీ వంటి కంపెనీలతోనూ పార్టనర్షిప్స్ ఏర్పరచుకుంది. ఈ కంపెనీలు కూడా పలు కోర్సులను ప్రారంభిస్తున్నాయి. ఇక కోర్సెరా అందించే మూక్స్ను అభ్యసించి సదరు కోర్సులో సర్టిఫికేట్ పొందాలంటే మాత్రం నిర్ణీత ఫీజు చెల్లించాల్సిందే. నిర్ణీత ఫీజు చెల్లించి గ్రేడెడ్ అసైన్మెంట్లు పూర్తి చేస్తేనే సర్టిఫికెట్ లభిస్తుంది. చాలా కోర్సుల్లో కొంత భాగం వరకు ఉచితంగా చేసే వీలుంది. కానీ సర్టిఫికేషన్ చేయాలంటే మాత్రం ఫీజు చెల్లించాలి. కోర్సెరాలోని కొన్ని కోర్సుల్లో గ్రేడెడ్ అసైన్మెంట్స్ కూడా పూర్తిగా ఉచితంగా ఉన్నాయి. ‘ఆడిట్ ఆప్షన్’ కోర్సెరాలో ఆన్లైన్ కోర్సెస్, స్పెషలైజేషన్స్ అనే రెండు రకాల కోర్సులు ఉంటాయి. స్పెషలైజేషన్స్ ఆప్షన్ ద్వారా ఒక టాపిక్పై వరుస లెక్చర్లు ఉంటాయి. అంటే.. ఒక సబ్జెక్ట్లో ప్రావీణ్యులు కావడానికి స్పెషలైజేషన్స్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఈ కరిక్యులమ్లో చివరగా ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. కోర్సెరాలో ఉచిత క్లాసులను ఆడిట్ ఆప్షన్ ద్వారా చూడవచ్చు. www.coursera.org/courses వెబ్సైట్లో ఆసక్తి ఉన్న కోర్సును కీవర్డ్స్తో సెర్చ్ చేయాలి. ఫలితంగా వచ్చిన జాబితాలో నుంచి కోర్సును ఎంచుకోవాలి. తర్వాత ఎన్రోల్ బటన్ వస్తుంది. దానిపై క్లిక్ ఇస్తే లాగిన్/సైనప్ బాక్స్ ఓపెన్ అవుతుంది. లాగిన్ తర్వాత చివర్లో చిన్నగా ఆడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఎలాంటి చెల్లింపులు చేయకుండా క్లాసులు వినవచ్చు. మూక్స్ ప్రొవైడర్స్ కోర్స్ ఎరా; వెబ్సైట్: www.coursera.org ఎడెక్స్; వెబ్సైట్: www.edx.org యుడాసిటీ; వెబ్సైట్:www.udacity.com ఎన్పీటీఈఎల్ మన దేశంలోనూ.. ఐఐటీ, ఐఐఎం, ఇతర ప్రముఖ ఇన్స్టిట్యూట్స్కు చెందిన ప్రొఫెసర్స్ లెక్చర్స్ను మూక్స్ విధానంలో అభ్యసించే అవకాశం అందుబాటులో ఉంది. ఈ మేరకు.. కేంద్ర మానవ వనరుల శాఖ ఎన్పీటీఈఎల్ (నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హ్యాన్స్డ్ లెర్నింగ్) అనే ప్రత్యేక వెబ్పోర్టల్ను జాతీయ స్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఐఐటీలు, ఐఐఎస్సీకి చెందిన నిష్ణాతులైన అధ్యాపకులు ఇచ్చే లెక్చర్స్ అభ్యసించొచ్చు. ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్మెంట్, హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ సబ్జెక్టులను అభ్యసించే వీలుంది. సాధారణ కాలేజీలో చదువుతున్నా ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్ అధ్యాపకుల క్లాసులు వినే అవకాశం ఎన్పీటీఈఎల్ ద్వారా కలుగుతుంది. కాబట్టి విద్యార్థులు సరైన బోధనా సిబ్బంది లేరనే ఆందోళన లేకుండా వీరి క్లాసులు వినే సదవకాశముంది. ఇప్పటికే సదరు కోర్సులు చదువుతున్నవారు, ఆసక్తి ఉన్న ఎవరైనా ఎన్పీటీఈఎల్ మూక్స్ కోర్సులకు ఎన్రోల్ చేసుకోవచ్చు. జూలై – నవంబర్లో ప్రారంభమయ్యే కోర్సులు ఎన్పీటీఈఎల్లో నిరంతరం మూక్స్ అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే లెక్చర్స్ వివరాలు కూడా ఈ పోర్టల్లో ముందుగానే తెలియజేస్తారు. ప్రస్తుతం జూలై నుంచి నవంబర్ వరకు అందుబాటులో ఉండే కోర్సుల వివరాలు.. బయోలాజిలక్ సైన్సెస్ అండ్ బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మేనేజ్మెంట్, హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, సివిల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగాలు, మెకానికల్/ ఇండస్ట్రియల్/ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. మేనేజ్మెంట్ విభాగంలో ఇంట్రడక్షన్ టు డేటా అనలిటిక్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, జండర్ జస్టిస్ అండ్ వర్క్ప్లేస్ సెక్యూరిటీ, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫర్ మేనేజర్స్, మార్కెటింగ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్, పేటెంట్ లా ఫర్ ఇంజనీర్స్ అండ్ సైంటిస్ట్స్, ఈ బిజినెస్, సిక్స్ సిగ్మా కోర్సులకు ఈ నెల 23/ 24 తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. సీఎస్ఈ ఇందులో సీ, సీ++, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, సెర్చ్ మెథడ్స్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటాబేస్ సిస్టమ్స్, పైథాన్, డిజైన్ అండ్ అనాలసిస్ ఆఫ్ అల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్, ఆబ్జెక్ట్ ఓరియెంటేడ్ అనాలసిస్ అండ్ డిజైన్, థియరీ ఆఫ్ కంప్యూటేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్రిప్టాలజీ లాంటి కోర్సులు ప్రారంభం కానున్నాయి. కోర్సు పరిమితి: 4 వారాల నుంచి 12 వారాల వరకు ఉంటుంది. ఎన్రోల్ ఇలా.. ఎన్పీటీఈఎల్ కోర్సులకు ఎన్రోల్ కావాలనుకునే వారు https://onlinecourses.nptel.ac.in వెబ్సైట్లోకి వెళ్లి కోర్సు కేటగిరీ లేదా ఆల్ రన్నింగ్ కోర్సెస్లో మీకు ఇష్టమైన కోర్సును ఎంచుకోవాలి. తర్వాత గూగుల్ అకౌంట్తో పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిచేయాలి. దీని తర్వాత కోర్సు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. కోర్సు ప్రారంభమయ్యాక అభ్యర్థులు తమకు వీలైన సమయంలో వీడియో లెక్చర్లు వినవచ్చు. ప్రతివారం క్రమం తప్పకుండా అసైన్మెంట్స్ పూర్తి చేయాలి. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెషన్ ఎగ్జామ్ ఉంటుంది. దీని కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
నవ పధం
దేశంలో ఉపాధ్యాయ విద్యకు సరికొత్త రూపు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.ఉపాధ్యాయ విద్యలో వినూత్న మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం ఎన్సీఈర్టీ బిల్లు–2017ను రూపొందించింది. పాఠశాల స్థాయి నుంచి 12వ తరగతి వరకు.. ముఖ్యంగా బోధన పరంగా పలు కీలక మార్పులు తీసుకురానుంది. ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించేందుకు సంబంధిత కోర్సుల్లో లక్షల సంఖ్యలో చేరుతున్నా.. బోధన వృత్తికి అవసరమైన నైపుణ్యాలు అధికశాతం మందిలో ఉండటంలేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ఎన్సీఈఆర్టీ బిల్లు–2017పై విశ్లేషణ.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.. సంక్షిప్తంగా ఎన్సీఈఆర్టీ. ప్రాథమిక విద్య నుంచి సీనియర్ సెకండరీ వరకు బోధన, కరిక్యులం, సిలబస్ రూపకల్పన దిశగా కార్యకలాపాలు నిర్వహించే సంస్థ. ఎన్సీఈఆర్టీ సలహా మేరకే కేంద్ర స్థాయిలో సీబీఎస్ఈ సిలబస్లో మార్పులుచేర్పులు జరుగుతాయి. రాష్ట్రాల స్థాయిలో ఎస్సీఈఆర్టీలకు సైతం మార్గనిర్దేశకాలను ఎన్సీఈఆర్టీ జారీ చేస్తుంది. దీన్ని మరింత పటిష్టం చేసేందుకు.. మరింత స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు హెచ్ఆర్డీ శాఖ ఉపక్రమించింది. ఆ క్రమంలోనే ఎన్సీఈఆర్టీ బిల్లు–2017కు శ్రీకారం చుట్టింది. జాతీయ ప్రాధాన్య సంస్థగా ఎన్సీఈఆర్టీ బిల్లులోని ముఖ్య ప్రతిపాదన.. ఎన్సీఈఆర్టీని జాతీయ ప్రాధాన్యం (ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్–ఐఎన్ఐ) గల సంస్థగా గుర్తించాలని నిర్ణయించడం. అంతేకాకుండా ఎన్సీఈఆర్టీకి అనుబంధంగా ఉన్న రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లకు కూడా ఈ హోదా ఇవ్వనున్నారు. ఫలితంగా ఈ సంస్థ పూర్తిస్థాయిలో స్వయం ప్రతిపత్తి పొందుతుంది. దాంతో ప్రభుత్వం నుంచి మంజూరయ్యే నిధుల పరంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. తద్వారా ఎన్సీఈఆర్టీ విద్యారంగంలో నాణ్యమైన పరిశోధనలు, శిక్షణ దిశగా మరింత సమర్థంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఎన్సీఎఫ్ రూపకల్పన బాధ్యత ఎన్సీఈఆర్టీ బిల్లు ప్రకారం–నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ (ఎన్సీఎఫ్)ను సిద్ధం చేయడం.. ప్రాథమిక విద్య నుంచి సీనియర్ సెకండరీ వరకు సిలబస్ రూపొందించడం.. సంబంధిత పుస్తకాల ముద్రణను సైతం ఎన్సీఈఆర్టీ నేరుగా పర్యవేక్షించనుంది. ఎన్సీఈఆర్టీ పరిధిలోని ఉపాధ్యాయ బోధన ఇన్స్టిట్యూట్స్లో పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా ఇన్నోవేటివ్ టీచింగ్ పరంగా ఆకర్షణీయమైన కొత్త పద్ధతుల ఆవిష్కరణ జరుగుతుంది. కరిక్యులంలో చేయాల్సిన మార్పులపై పరిశోధన చేస్తారు. దాంతో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్కు అనుకూలమైన కొత్త విధానాలను ఆవిష్కరించేందుకు అవకాశం ఎన్సీఈఆర్టీకి లభించనుంది. డిగ్రీలు అందిస్తుంది ఎన్సీఈఆర్టీ ముసాయిదా బిల్లు–2017లోని మరో ముఖ్యాం శం.. ఎన్సీఈఆర్టీకి యూనివర్సిటీ హోదా అందించడం. ఫలితంగా ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన కోర్సులు పూర్తిచేసిన వారికి ఎన్సీఈఆర్టీ డిగ్రీలు అందించగలుగుతుంది. ఇప్పటి వరకు ఎన్సీఈఆర్టీ పరిధిలోని ఉపాధ్యాయ విద్య, బోధన కళాశాలలు.. అవి ఏర్పాటైన ప్రాంతంలోని యూనివర్సిటీకి అనుబంధంగా మనుగడసాగిస్తూ... కోర్సులు, సర్టిఫికెట్లు అందిస్తున్నాయి. తాజా ప్రతిపాదన ప్రకారం– ఆ పరిస్థితికి ఫుల్స్టాప్ పడుతుంది. నేరుగా ఎన్సీఈఆర్టీయే డిగ్రీలు అందించేందుకు అవకాశం లభిస్తుంది. ఫలితంగా.. ప్రస్తుతం ఎన్సీఈఆర్టీకి అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎన్ఐఈ)–న్యూఢిల్లీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ–న్యూఢిల్లీ, పండిట్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్–భోపాల్తోపాటు అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూరు, షిల్లాంగ్లలోని రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్లో పలు ఉపాధ్యాయ విద్య కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అంతర్జాతీయ ఒప్పందాలు విదేశాలకు చెందిన టీచింగ్ ఎడ్యుకేషన్ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా కొలాబరేటివ్ రీసెర్చ్కు అవకాశం కల్పించాలన్నది ఎన్సీఈఆర్టీ ముసాయిదా బిల్లులోని మరో ప్రతిపాదన. అలాగే ఎన్సీఈఆర్టీ.. కొత్తగా దేశంలో ఎక్కడైనా అనుబంధ యూనిట్ లేదా ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఆ యూనిట్ వల్ల సంబంధిత ప్రాంతంలోని వారికి లభించే ప్రయోజనాలపై కార్యనిర్వాహక కమిటీకి ఆమోదయోగ్యమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయ విద్యను అందిస్తున్న యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లతో అనుసంధానమవుతూ అక్కడ అమలవుతున్న కరిక్యులంను నిరంతరం సమీక్షించడంతో పాటు సలహాలు సూచనలు అందించాల్సి ఉంటుంది. ఈ సలహాలు, సూచనలను సంబంధిత యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు తప్పనిసరిగా పాటించాలి. టీచర్లకు నిరంతర శిక్షణ ఎన్సీఈఆర్టీ బిల్లు ప్రకారం.. ఎన్సీఈఆర్టీ, ఇకపై నిరంతరం టీచర్లకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ పరంగా ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించాల్సి ఉంటుంది. వీటిద్వారా టీచింగ్ ఎడ్యుకేషన్లో వస్తున్న మార్పులపై టీచర్లకు అవగాహన కల్పించనుంది. బిల్లులో సానుకూలంగా ఉండే మరో అం శం.. ఈ సంస్థ అందిస్తున్న కోర్సుల ఫీజులు, ఆయా కోర్సుల వ్యవధికి సంబంధించి సొంతగా నిర్ణయం తీసుకునే అధికారం కల్పించడం. పరిశోధన దిశగా అడుగులు వేస్తున్న విద్యార్థులకు ఫెలోషిప్స్ అందించడం, అందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా లభిస్తుంది. ఎస్సీఈఆర్టీలకు మార్గనిర్దేశకాలు తాజా బిల్లులో ప్రతిపాదించిన విధానాల ప్రకారం.. రాష్ట్రాల స్థాయిలో ఉన్న ఎస్సీఈఆర్టీలకు మార్గనిర్దేశకాలు జారీచేసే అధికారం ఎన్సీఈఆర్టీకి లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రాల స్థాయిలోని ఎస్సీఈఆర్టీలు.. తమ స్వేచ్ఛకు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ అనుసరిస్తున్న విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ బిల్లు ద్వారా ఎస్సీఈఆర్టీలు తప్పనిసరిగా ఎన్సీఈఆర్టీ మార్గనిర్దేశకాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని తెలుస్తోంది. బిల్లులో ప్రతిపాదించిన అంశాల కార్యాచరణ, అమలు, పర్యవేక్షణ దిశగా ఎగ్జిక్యూటివ్ కమిటీ పేరుతో ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇది ఎప్పటికప్పుడు ఎన్సీఈఆర్టీ చేపట్టిన చర్యలను పర్యవేక్షించడమే కాకుండా ఆర్థిక, కార్యనిర్వాహక పరమైన అంశాలకు సంబంధించి సూచనలిస్తుంది. -
FM launched Aaykar Setu
International G-20 discussed Climate Change The Group of 20 Summit has ended without a consensus on the key issues of climate change and trade, leaving deep divisions between U.S. President Donald Trump and the rest of the developed world. This is the 12th summit of the group and was held on 7th and 8th July, in Hamburg, Germany. G20 backed free trade and pledged to “continue to fight protectionism”. On the side lines of summit India invited Norwegian pension funds to invest in India’s National Infrastructure Investment platform. In 2018 G-20 Summit will be held in Argentina, in 2019 in Japan and in 2020 in Saudi Arabia. UNESCO opts against 'in danger' status for Great Barrier Reef UNESCO opted to keep the Great Barrier Reef off of its official list of World Heritage sites 'in danger' at a meeting in Poland. There are currently 55 World Heritage sites on the 'in danger' list, including the Everglades National Park, the Syrian city of Palmyra, and Liverpool's historic docklands. UN conference adopts a treaty banning nuclear weapons Countries met at a United Nations conference in New York on 7th July adopted the Treaty on the Prohibition of Nuclear Weapons, the first multilateral legally-binding instrument for nuclear disarmament to have been negotiated in 20 years. The treaty – adopted by a vote of 122 in favour to one against (Netherlands), with one abstention (Singapore) – prohibits a full range of nuclear-weapon-related activities, such as undertaking to develop, test, produce, manufacture, acquire, possess or stockpile nuclear weapons or other nuclear explosive devices, as well as the use or threat of use of these weapons.The treaty will be open for signature to all States at UN Headquarters in New York on 20 September 2017, and enter into force 90 days after it has been ratified by at least 50 countries. National India’s first heritage city: Ahmedabad The United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO) on 8th July declared the 600-year-old walled city of Ahmedabad as a world heritage city, the first Indian city to make it to the list. The World Heritage Committee of Unesco met in Karlow, Poland. Other cities added to the list of World Heritage city in the same summit-Asmara, the capital of Eritrea, Hebron-Al Khalil Old Town (Palestine) and W-Arly-Pendjari Complex (Benin, Burkina Faso), the site of Hebron-Al Khalil to the list of World Heritage Sites in Danger. Of the 287 world heritage cities across the globe, the only two cities in the Indian subcontinent which enjoy the status are Bhaktapur in Nepal and Galle in Sri Lanka. Draft National Policy for Women a pprovedA Group of Ministers, headed by External Affairs Minister Sushma Swaraj approved a draft national policy for women. It proposes.. Free education for girls from poor families Health card for all women A woman accused of a non-heinous crime, who has remained an under-trial for one-third of her jail time, should be given bail. High speed rail Training centre to come up in Gujarat India’s first high-speed rail training centre is to come up at Gandhinagar.The centre will provide for advanced training modules on cutting edge technologies. Being constructed over railway land measuring 4,400 metres at an estimated cost of Rs 600 crore, the training centre will have a sample track fitted with the overhead electrical systems to enable testing of bullet trains that will run on the Mumbai-Ahmedab-ad route.While India’s first bullet train is proposed to hit the track in 2023, the training centre is supposed to start operating by 2020. Bilateral India-US-Japan joint drill at Bay of Bengal The US, Japanese and Indian Navies on 10th July began the Malabar Naval Exercise-2017 aimed at achieving deeper military ties between the three nations. The 21st edition of the exercise, conducted ashore and at-sea, would include professional exchanges on carrier strike group operations, maritime patrol and reconnaissance operations, surface and anti-submarine warfare. e-visa facility extended to Uganda India has added Uganda to the list of countries to which it extends the electronic visa (or e-visa) facility. At present, India offers e-visa facility to only 18 of the 54 African nations. The e-visa is an online pre-authorisation that allows visa on arrival through nine designated airports and three sea-ports for a 60-day stay. The Home Ministry implements the e-visa scheme. At present, India offers the e-visa facility to 162 countries. Economy FM launched Aaykar Setu Union Finance Minister Arun Jaitley launched Aaykar Setu, a new income tax payer e-service module, in New Delhi on 10th July. To enhance mobile access experience, a mobile responsive Android version was also released along with the desktop version. This app will reduce the physical interface between the Assessees and the tax assessing authorities. 5 States, a UT signed on e-Marketplace Five States and a Union Territory (UT) on 11th July adopted the Government e-Marketplace (GeM) that aims to ensure that public procurement of goods and services in India worth more than Rs.5 lakh crore annually is carried out through the online platform for transparency and to eliminate corruption. The States and the UT that signed an MoU with the Centre include Andhra Pradesh, Assam, Gujarat, Telangana and Arunachal Pradesh. The only UT is Puducherry. India to become largest milk producer in 2026: OECD India will be the world’s largest milk producer by 2026 and will account for the biggest increase in wheat production globally, according to a report by the United Nations (UN) and the Organisation for Economic Co-operation and Development (OECD). The OECD-FAO Agricultural Outlook 2017-2026 said the world’s population will increase from 7.3 to 8.2 billion over the course of the next decade with India and Sub-Saharan Africa accounting for 56% of total population growth. Over the course of the outlook period alone, milk production in India will grow 49%; in 2026, India will be the world’s largest milk producer, with an output one-third above that of the second largest producer. India @ 116 on SDG goals India is ranked 116 out of 157 nations on a global index that assesses the performance of countries towards achieving the ambitious Sustainable Development Goals (SDGs). Sweden leads the list, followed by Denmark and Finland. The SDG Index ranks countries based on their performance across the 17 Sustainable Development Goals. Science and Technology Massive iceberg breaks away from Antarctica A massive iceberg weighing more than one trillion tons has broken away from western Antarctica, according to a UK-based research team. Scientists from Project MIDAS had been monitoring a break in the Larsen C ice shelf - the fourth largest in Antarctica following the collapse of the Larsen A ice shelf in 1995 and had observed significant advances in the rift over the past 12 months. Sports Victory for Harinder Sandhu India's Harinder Pal Sandhu has won the South Australian Open squash title, defeating Australia’s Rhys Dowling. The final was held in Adelaide on 8th July 2017. Srinivas Gokulnath created history in Cycle Race Srinivas Gokulnath created history by becoming the first Indian to complete the 4,900 km cycle Race Across America, RAAM in solo category. Considered to be the toughest cycle race in the world, he cycled for eleven days, 18 hours and 45 minutes. Mithali Raj created Record Mithali Raj scored 34 runs, in the match against Australia; with this she created history by becoming the leading run-getter in Women’s ODIs, going past England player Charlotte Edwards’ record of 5992 ODI runs. Persons in News John Joseph: He has been appointed as Director General of Goods and Services Tax Intelligence (DG GSTI). The DG GSTI is the new name given to the Directorate General of Central Excise Intelligence (DGCEI), mandated to check service tax and central excise duty evasion. Ravi Shastri: The BCCI named Ravi Shastri as the new chief coach of the Indian cricket team till ICC World Cup 2019. Khaltmaa Battulga: He is elected as the President of the Mongolia. He replaces Tsakhia Elbegdorj. -
నానాసాహెబ్ పేరు కలిగిన పీష్వా?
పీష్వాల ప్రాబల్యాన్ని అంతం చేసిన యుద్ధం? – మూడో పానిపట్ యుద్ధం(క్రీ.శ.1761) చివరి పీష్వాల్లో గొప్పవాడు – పీష్వా మాధవరావ్ చివరి పీష్వా – రెండో బాజీరావ్ పీష్వాల యుగ కాలం – క్రీ.శ.17131818 పీష్వాల రాజధాని? –పూనా మహారాష్ట్ర కూటమిని ఏర్పాటు చేసిన వ్యక్తి?– బాలాజీ విశ్వనాథ్ పీష్వాల్లో అగ్రగణ్యుడు?–మొదటి బాజీరావ్ మూడో పానిపట్ యుద్ధంలో మరాఠా కూటమి నాయకుడు?– సదాశివ రావ్ పీష్వా పదవి రద్దయిన సంవత్సరం? క్రీ.శ.1818 మహారాష్ట్ర చరిత్రలో పీష్వాల యుగం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వీరి కాలంలో మహారాష్ట్ర ప్రాబల్యం, ఆసేతు హిమాలయాల వరకు విస్తరించింది. బాలాజీ విశ్వనాథ్ క్రీ.శ. 17131720 సాహు నుంచి పరిపాలనాధికారాన్ని వంశపారంపర్య హక్కులతో పొందాడు. బాలాజీ విశ్వనాథ్ చిత్పవన వంశానికి చెందిన బ్రాహ్మణుడు. ఇతని పూర్వీకులు జింజిరా రాజ్యంలోని శ్రీవర్ధన్ ప్రాంతానికి చెందినవారు. బాలాజీ విశ్వనాథ్ మొగలులతో సత్సంబంధాలను ఏర్పరచుకున్నాడు. మొగల్ రాకుమార్తె జీనత్ ఉన్నిసా మెప్పు పొందాడు. సాహు మొగల్ చెర నుంచి విముక్తుడై∙మహారాష్ట్ర చేరుకున్నప్పుడు అతనికి కుడి భుజంగా నిలిచాడు. సాహును రాజును చేయడానికి తోడ్పడ్డాడు. బాలాజీ శక్తి సామర్థ్యాలు, రాజభక్తిని గుర్తించిన సాహు క్రీ.శ. 1713 నవంబర్ 16న అతన్ని పీష్వాగా నియమించాడు. బాలాజీ విశ్వనాథ్ను మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుడుగా చెప్పవచ్చు. బాలాజీ విశ్వనాథ్ క్రీ.శ.1714లో మొగలులతో సంధి చేసుకొని దక్కన్లో చౌత్, సర్దేశ్ముఖ్(పన్నులు)లను వసూలు చేసుకొనే హక్కు పొందాడు. ఈ సంధిలో మొగలుల తరపున సయ్యద్ సోదరులు ముఖ్యపాత్ర పోషించారు. అదేవిధంగా మొగల్ చక్రవర్తి ఫరుక్సియార్ను పతనం చేయడంలో సయ్యద్ సోదరులకు బాలాజీ విశ్వనాథ్ సహాయం అందించాడు. రాజారాం కాలంలో ప్రారంభమైన జాగీర్దారీ విధానం, బాలాజీ విశ్వనాథ్ కాలంలో విస్తృతమైంది. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజ్యం వివిధ భాగాలుగా విభజితమై.. మహారాష్ట్ర కూటమి అనే వ్యవస్థ ఏర్పడింది. ఈ పరిణామాలు చివరికి ఎవరికి వారు స్వాతంత్రం ప్రకటించుకునే స్థాయికి వెళ్లాయి. ఈ కూటమే మహారాష్ట్రుల పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. మహారాష్ట్ర కూటమి సభ్యులు ఖాందేష్, బాలాఝాట్–పీష్వాల ఆధీనంలో కొంకణ్ – ఆంగ్లేయుల ఆధీనంలో బీరార్, గోండ్వానా– భోంస్లేల ఆధీనంలో గుజరాత్ – గైక్వాడ్ల ఆధీనంలో మాళవ – నేమాజీ సింధియా ఆధీనంలో ఉంచారు. బాలాజీ విశ్వనాథ్ను సాహు ‘అతుల పరాక్రమ సేవక’ అని అభినందించాడు. ఇతడు తారాబాయితో వార్నా సంధి చేసుకున్నాడు. విశ్వనాథ్ క్రీ.శ.1720, ఏప్రిల్ 2 అకస్మాత్తుగా మరణించాడు. పీష్వా మొదటి బాజీరావ్ క్రీ.శ. 17201740 బాలాజీ విశ్వనాథ్ పెద్ద కుమారుడే బాజీరావ్. మహారాష్ట్ర చరిత్రలో శివాజీ తర్వాత చెప్పుకోదగ్గ యోధుడు. ఇతని తెలివితేటలు, శక్తి సామర్థ్యాలపై నమ్మకంతో సాహు ఇతన్ని పీష్వాగా నియమించాడు. బాజీరావ్కు పరిపాలనలో అతని సోదరుడు చిమ్నాజీ అప్పా సహకరించాడు.మొదటి బాజీరావు ఆశయం హిందూ పద్ పద్ షాహీ స్థాపించడం. మొదటి బాజీరావ్ దక్కన్ సుబేదార్ అయిన నిజాం–ఉల్–ముల్క్తో మూడు యుద్ధాలు చేసి నిజాంను ఓడించి, అతన్ని మూడు సంధి షరతులకు ఒప్పించాడు. పీష్వా బాజీరావ్ క్రీ.శ.1728లో పాల్కేడ్ వద్ద జరిగిన యుద్ధంలో నిజాం –ఉల్–ముల్క్ను ఘోర పరాజితుడిని చేశాడు. పాల్కేడ్ యుద్ధంలో ఓడిపోయిన నిజాం క్రీ.శ. 1728లో ముంగిషివగావాన్ సంధి చేసుకున్నాడు. క్రీ.శ. 1731లో నిజాం రెండోసారి బాజీరావ్తో చేసిన సూరత్ యుద్ధంలో ఓడిపోయి క్రీ.శ. 1732లో రోహారామేశ్వర్ సంధి చేసుకున్నాడు. మహారాష్ట్ర దాడులను ఎదుర్కొనే సమర్ధత ఒక్క నిజాంకే ఉందని భావించిన మొగల్ చక్రవర్తి, మçహ్మద్షా అతన్ని ఢిల్లీకి రప్పించి అసఫ్జా అనే బిరుదును ప్రదానం చేశాడు. దాంతోపాటు తగిన సహాయ సంపత్తిని అందించి మహారాష్ట్రులను ఎదుర్కోవాలని ఆదేశించాడు. క్రీ.శ.1738లో చారిత్రాత్మకమైన భోపాల్ యుద్ధంలో బాజీరావ్ చేతిలో నిజాం ఓడిపోయి క్రీ.శ.1738, జనవరి 17న దోరాహ్ సంధి చేసుకున్నాడు. సాహు గురువు బ్రహ్మేంద్రస్వామి స్థాపించిన పరశురామ్ ఆలయాన్ని ధ్వంసం చేసిన జింజిరా సిద్ధీలను కూడా ఓడించాడు. అదే విధంగా మాళ్వా సుబేదార్ గిరిథర్ బహుదూర్ని ఓడించి చంపేశాడు. మస్తానీ ఒక మహ్మదీయ స్త్రీ. ఆమెను ఛత్రసాల్ బుందేలా.. బాజీరావ్కు బహూకరించాడు. గొప్ప సౌందర్యరాశి అయిన ఆమె∙బాజీరావ్కు అత్యంత ప్రీతిపాత్రమైంది. మస్తానీ వల్లే బాజీరావ్ తప్పుదోవ పడుతున్నాడనే కారణంతో ఆమెను బాజీరావ్æ కుమారులు బాలాజీ బాజీరావ్, చిమ్నాజీ అప్పాలు నిర్బంధంలో ఉంచారు. దాంతో మనోక్షోభకు గురైన బాజీరావ్ క్రీ.శ. 1740లో మరణించాడు. ఈ వార్త తెలిసిన మస్తానీ కూడా కన్నుమూసింది. పీష్వా బాలాజీరావ్ లేదా బాలాజీ బాజీరావ్ క్రీ.శ. 17401761 మొదటి బాజీరావ్ మరణానంతరం అతని పెద్ద కుమారుడు బాలాజీ బాజీరావ్ పీష్వా పదవిని అలంకరించాడు. ఇతనికి నానా సాహెబ్ అనే పేరు కూడా ఉంది. ఇతడు కర్నాటక నవాబు దోస్త్ ఆలీని చంపడంతోపాటు ఇతని అల్లుడు చాందా సాహెబ్ను బందీ చేశాడు. సాహు నిర్వాసితుడిగా మరణిస్తూ తన తర్వాత ఛత్రపతిగా తారాబాయి మనవడు రామరాజును ప్రకటించాడు. మూడో పానిపట్ యుద్ధం – 1761 అబ్దాలీ తెగకు చెందినవాడు అహ్మద్ షా. ఇతడు పర్షియాలో నాదిర్షా కొలువులో ఉండేవాడు. అహ్మద్షా అబ్దాలీకి, మహారాష్ట్రులకు జరిగిన చారిత్రక యుద్ధమే మూడో పానిపట్టు యుద్ధం (క్రీ.శ.1761, జనవరి 14). మూడో పానిపట్టు యుద్ధంలో అబ్దాలీని ఎదుర్కొనేందుకు సదాశివరావ్, విశ్వాసరావ్లు మహారాష్ట్ర సేనలకు నాయకత్వం వహించారు. కానీ, విజయం అబ్దాలీ వశమైంది. ఈ యుద్ధంతో మహారాష్ట్ర పతనం ప్రారంభమైంది. ఓటమిని భరించలేని బాలాజీ బాజీరావ్ క్రీ.శ. 1761లో మరణించాడు. తర్వాత పీష్వాగా మాధవరావ్ వచ్చాడు. ఛత్రపతుల పరంపర సాహు క్రీ.శ.17081748 రామరాజు క్రీ.శ.17491777 రెండో సాహు క్రీ.శ.17771808 ప్రతాప్ సిన్హా క్రీ.శ.18081839 చివరి పీష్వా రెండో షాజీ క్రీ.శ. 18391848. పీష్వాల పరంపర మాధవరావ్ క్రీ.శ. 17611772 నారాయణ రావ్ క్రీ.శ. 17721773 రెండో మాధవరావ్ క్రీ.శ. 17731795 రెండో బాజీరావ్ క్రీ.శ. 17951818 -
మిల్క్ ఆఫ్ లైమ్ అంటే?
ఆమ్లాల ధర్మాలు రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త తొలిసారిగా ఆమ్లాల ధర్మాలను ప్రతిపాదించాడు. అవి.. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి. ఆమ్లాల తయారీ: అలోహ ఆక్సైడ్లకు ఆమ్ల ధర్మం ఉంటుంది. వీటిని నీటిలో కరిగిస్తే సంబంధిత ఆమ్లాలు ఏర్పడతాయి. గమనిక: H2SO4కి వాసన, రంగు ఉండవు. HNO3Mకి వాసన, పసుపు రంగు ఉంటాయి. వివిధ పదార్థాలు/ఫలాల్లో ఉండే ఆమ్లాలు పదార్థం/ ఫలం ఉండే ఆమ్లం పత్తి లినోలిక్ ఆమ్లం వేరుశనగ ఆరాఖిడోనిక్ ఆమ్లం ఉసిరి, విటమిన్స్ ఆస్కార్బిక్ ఆమ్లం సిట్రస్/నిమ్మజాతులు సిట్రిక్ ఆమ్లం ఆపిల్ మాలిక్ ఆమ్లం చింతపండు టార్టారిక్ ఆమ్లం పుల్లని పెరుగు, పాలు లాక్టిక్ ఆమ్లం ద్రాక్ష (వెనిగర్) ఎసిటిక్ ఆమ్లం ఎర్రచీమ ఫార్మిక్ ఆమ్లం జఠర రసం హైడ్రోక్లోరికామ్లం మూత్రం యూరికామ్లం టమాట,పుచ్చకాయ ఆక్జాలిక్ ఆమ్లం కొబ్బరి కాప్రిక్, కాప్రోయిక్ ఆమ్లం మొక్కల నూనెలు స్టియరిక్, పామిటిక్ ఆమ్లం పాలు, పాల ఉత్పత్తులు బ్యుటిరిక్ ఆమ్లం ఆమ్లాల ప్రాముఖ్యత 1.సల్ఫ్యూరిక్ ఆమ్లం (H2SO4): దీన్ని రసాయనాల రాజు, ‘ఆయిల్ ఆఫ్ విట్రియోల్’గా పిలుస్తారు. పేలుడు పదార్థాలు, డ్రగ్స్, ఫెర్టిలైజర్స్, నూనె, చక్కెర శుద్ధిలో ఉపయోగిస్తారు. ఆమ్ల వర్షాలకు ఇదే ప్రధాన కారణం. 2.హైడ్రోక్లోరికామ్లం(HCl ): గ్లూ, జిలాటిన్, డెక్స్ట్రోస్, పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) తయారీ, లోహాల శుద్ధిలో ఉపయోగిస్తారు. హైడ్రోక్లోరికామ్లం..నత్రికామ్లంతో (HNO3) చర్య జరిపినప్పుడు ఆక్వారీజియా (ద్రవరాజం) ఏర్పడుతుంది. దీన్ని బంగారం కరిగించేందుకు ఉపయోగిస్తారు. 3.నత్రికామ్లం (HNO3) దీన్ని ఆక్వాఫోర్టిస్ అంటారు. బంగారు ఆభరణాల పరిశ్రమలో ద్రావణి గా, ఫెర్టిలైజర్స్, పేలుడు పదార్థాలు (డైన మైట్), పిక్రిక్ ఆమ్లం, ట్రైనైట్రోటోలీన్ (టీఎన్టీ)ల తయారీలో వాడతారు. 4.ఎసిటిక్ ఆమ్లం (CH3COOH) రసాయనాల తయారీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా సెల్యులోజ్ ఎసిటేట్ ఉత్పత్తిలో వాడతారు. ద్రాక్షను పులియబెట్టి దీన్ని ఉత్పత్తి చేస్తారు. 5.హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం (HF): రిఫ్రెజిరెంట్స్, కొన్ని ప్లాస్టిక్ల తయారీలో వాడతారు. గాజుపై అక్షరాలు రాయడానికి వాడతారు. 6. సిట్రిక్ ఆమ్లం: సాఫ్ట్ డ్రింక్స్ (కోలా పానీయాలు)ను నిల్వ చేసేందుకు తోడ్పడుతుంది. నోట్: గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, గాఢ నత్రికామ్లాలను 3:1 నిష్పత్తిలో కలిపితే ఏర్పడే ద్రావణాన్ని ఆక్వరీజియా అంటారు. క్షారాలు క్షారాల ధర్మాలు: క్షారాల ధర్మాలను తొలిసారిగా రౌలే అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. ఎర్ర లిట్మస్ను నీలి రంగుకు మారుస్తాయి. తాకితే జారిపోయే స్వభావం ఉంటుంది. నారింజ రంగులోని మిథైల్ ఆరంజ్ సూచికను పసుపు రంగుకు మారుస్తాయి. వీటిని అమ్మోనియం లవణాలతో వేడి చేస్తే అమ్మోనియా వాయువు వెలువడుతుంది. క్షారాల ప్రాముఖ్యం 1.సోడియం హైడ్రాక్సైడ్ దీన్ని కాస్టిక్ సోడా (దాహక సోడా) అని కూడా పిలుస్తారు. ఉపయోగాలు: నూలును మెర్సిడైజ్ చేసి తెల్లగా మార్చేం దుకు ఉపయోగపడుతుంది. రేయాన్, సబ్బు, పేపర్, పెట్రోలియం పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. 2.కాల్షియం హైడ్రాక్సైడ్: దీన్ని ‘మిల్క్ ఆఫ్ లైమ్ (తడిసున్నం)’ అంటారు. ఉపయోగాలు: నేలల ఏను పెంచేందుకు ఉపయోగపడుతుంది. కీటక నాశకాల తయారీలో వాడతారు. నీటి తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించేందుకు వినియోగిస్తారు. ఇళ్లకు సున్నం వేయటానికి వాడతారు. 3.పొటాషియం హైడ్రాక్సైడ్: దీన్ని కాస్టిక్ పొటాష్ అంటారు. తటస్థీకరణం ఆమ్లం.. క్షారంతో కలిసి జలద్రావణంలో నీరు ఏర్పడే చర్యను తటస్థీకరణం అంటారు. ఒక లవణం ఏర్పడాలంటే తప్పనిసరిగా ఒక ఆమ్లం, క్షారం కావాలి.తటస్థీకరణ చర్య ఎప్పుడూ ఉష్ణమోచక చర్యే. బలమైన ఆమ్లం.. బలమైన క్షారంతో చర్య జరిపినప్పుడు అత్యధిక పరిమాణంలో ఉష్ణం విడుదలవుతుంది. బలహీన ఆమ్లం.. బలహీన క్షారంతో చర్య జరిపినప్పుడు తక్కువ ఉష్ణం వెలువడు తుంది. ఉదా: హైడ్రోక్లోరికామ్లం, సోడియం హైడ్రాక్సైడ్ లు రసాయన చర్యలో పాల్గొని సోడియం క్లోరైడ్ (ఉప్పు), నీరుగా మారతాయి. HCl + NaOH ®NaCl+ H2O లవణాలు– ప్రాముఖ్యత సోడియం క్లోరైడ్ (NaCl ): దీన్ని టేబుల్ సాల్ట్/ సామాన్య ఉప్పు అంటా రు. ఆహార రుచికి, నీటి శుద్ధికి దీన్ని ఉపయో గిస్తారు. పొటాష్ ఆలం (K2SO4. Al2 (SO4)3.24H2O) గాయాలు తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఆపేందుకు, మురికినీటిని తేర్చి స్వచ్ఛంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. మెర్క్యూరిక్ క్లోరైడ్ (HgCl2): దీన్ని ‘కాలోమెల్’ అంటారు. నిద్రమాత్రల తయారీకి ఉపయోగిస్తారు. సోడియం థయోసల్ఫేట్/హైపో ఇది దుస్తులపై అధికంగా ఉన్న క్లోరిన్ను తొలగిస్తుంది. దీన్ని ఫొటోగ్రఫీలో ఫిక్సింగ్ ఏజెంట్గా వాడతారు. సోడియం బై కార్బొనేట్ (NaHCO3) దీన్ని బేకింగ్సోడా/వంటసోడా అంటారు. ఎసిడిటీని తగ్గించేందుకు ఉపయోగిస్తారు. మెగ్నీషియం క్లోరైడ్ (MgCl2): ఇది కాటన్ పరిశ్రమలో పోగుల పటుత్వానికి, పగిలిన దంతాలకు సిమెంటేషన్కు తోడ్పడుతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్/కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్: సర్జికల్ బ్యాండేజ్ల తయారీకి, గోడల ప్లాస్టరింగ్కు వాడతారు. పొటాషియం నైట్రేట్: దీన్ని బెంగాల్ సాల్ట్ పీటర్ అంటారు. గన్పౌడర్ తయారీలో వాడతారు పొటాషియం అయోడైడ్ (ఓఐ): దీన్ని ఫొటోగ్రఫీలో వాడతారు. నోట్: ఆమ్లాలు, క్షారాలు రెండిటితో చర్య జరిపే పదార్థాన్ని ‘ఆంఫోటెరిక్’ అంటారు. ఉదా: అల్యూమినియం హైడ్రాక్సైడ్, జింక్ హైడ్రాక్సైడ్ (Zn (OH)2) రూపాంతరత మూలకాలు ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉండటాన్నే రూపాంతరత అంటారు. ఉదాహరణలు: భాస్వరం: ఇది తెల్లభాస్వరం, పచ్చభాస్వరం అనే రూపాంతరాలుగా లభిస్తుంది. కార్బన్: గ్రాఫైట్, వజ్రం, బొగ్గు తదితర రూపాంతరాల్లో లభిస్తుంది. వజ్రం: కార్బన్ రూపాంతరమైన వజ్రం చాలా దృఢమైన పదార్థం. దీని సాంద్రత 3.5 గ్రా/సెం.మీ3 èÜ్వచ్ఛమైన, ఎటువంటి మలిన పదార్థాలు లేని వజ్రం వర్ణరహితంగా ఉంటుంది. వజ్రాన్ని గాలిలో 900నిఇ నుంచి∙1000నిఇ వరకు వేడి చేస్తే కార్బన్ డై ఆక్సైడ్గా మారుతుంది. వజ్రాన్ని శూన్యంలో 1500నిఇ వరకు వేడి చేస్తే గ్రాఫైట్గా మారుతుంది. కోహినూర్ వజ్రం 186 క్యారెట్లు, పిట్ వజ్రం 136.25 క్యారెట్లు బ్రెజిల్లో నల్లటి వజ్రాలు లభిస్తాయి. గ్రాఫైట్: ఫైట్ను నలుపు సీసం అంటారు.ñæడ్ పెన్సిల్లో గ్రాఫైట్ బంకమన్ను మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. గ్రాఫైట్ పొరల వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. అందువల్లే దీన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద ఘర్షణను తగ్గించేందుకు కందెనగా ఉపయోగిస్తారు. స్టౌవ్, కొలిమిలపై పూత పూసేందుకు గ్రాఫైట్ను ఉపయోగిస్తారు. దీన్ని గాలిలో మండిస్తే కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద కార్బన్ స్థిరమైన రూపాంతరం గ్రాఫైట్. దీన్ని నీటిలో కలపగా ఏర్పడే ద్రావణాన్ని ఆక్వాడాగ్ అని పిలుస్తారు. బక్మినిస్టర్ఫుల్లరీన్ (ఇ60) ఇది కార్బన్ రూపాంతరం. బక్మినిస్టర్ ఫుల్లరీన్ 1985 నుంచి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఫుట్బాల్ వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. దీన్ని కనుగొని, నిర్మాణంపై పరిశోధన చేసినందుకు హెచ్.డబ్లు్య.క్రోట్, రిచర్డ్.ఈ.స్మాలీలకు 1996లో రసాయ నశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది -
జాతీయోద్యమంలో రెండో దశ
అతివాద యుగం (1905–1919) జాతీయోద్యమంలో రెండో దశను అతివాద యుగంగా పిలుస్తారు. అతివాదుల లక్ష్యాలు, విధానాలు మితవాదులకు భిన్నంగా ఉండేవి. అందుకే వీరికి నూతన జాతీయవాదులనే పేరు వచ్చింది. మితవాదుల విధానాలతో తీవ్రంగా విసిగిపోయిన యువ నాయకులు వారిపై విమర్శలు చేయటం ప్రారంభించారు. ఇందులో భాగంగా మితవాదుల లక్ష్యాలను ‘బుడగలతో ఆటల వలే ఉన్నాయని’ అరబిందో ఘోష్, ‘కాంగ్రెస్ సమావేశాలను మూడు రోజుల తమాషా’అని అశ్వనీకుమార్ దత్తా, జాతీయ కాంగ్రెస్ను ‘యాచన సంస్థ’గా బిపిన్ చంద్ర, రాజకీయ హక్కులు యాచనతో కాదు పోరాడితే వస్తాయని లజపతిరాయ్, ‘కప్పల్లా సంవత్సరానికి ఒకసారి అరవటం వల్ల ఉపయోగం లేదు’ అని తిలక్ మితవాదుల చర్యలను తీవ్రంగా విమర్శించారు. అతివాదయుగం వృద్ధికి కారణాలు ప్రభుత్వ భారతీయ వ్యతిరేక విధానాలు. 1896లో పత్తిపై దిగుమతి సుంకాల రద్దు. కర్జన్ చర్యలు – 1904 విశ్వవిద్యాలయాల చట్టం, 1905 బెంగాల్ విభజన మొదలైనవి. ప్రాంతీయ భాషా పత్రికలు పెరగటం. 1896లో ఇథియోపియా.. ఇటలీని ఓడించటం, 1905లో జపాన్.. రష్యాను ఓడించటంతో యూరోపియన్లు అజేయులనే భ్రమ తొలగిపోవడం.విప్లవభావాలు కలిగిన తిలక్, లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్ వంటి నాయకులు జాతీయ కాంగ్రెస్లో ఉండటం. లాల్, బాల్, పాల్లను అతివాద త్రయంగా పిలుస్తారు.ఆర్యసమాజం, బ్రహ్మసమాజం, వివేకానంద మొదలైన వారి బోధనలతో ప్రాచీన భారతదేశ గొప్పతనంపై అవగాహన పెరిగి ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానాలు అధికమయ్యాయి. ముఖ్యంగా తిలక్ బోధనలు, ఆయన నిర్వహించిన గణేష్, శివాజీ పండుగలు దేశవ్యాప్తంగా జాతీయవాదాన్ని ప్రచారం చేశాయి. తొలిసారిగా ఆయనిచ్చిన ‘స్వరాజ్య, స్వదేశీ, విదేశీ బహిష్కరణ’ వంటి నినాదాలు స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో స్ఫూర్తిని రగిలించాయి.అతివాదుల లక్ష్యం: స్వరాజ్య సాధన అతివాదుల ముఖ్య లక్ష్యం. అతివాదుల దృష్టిలో స్వరాజ్యమంటే సంపూర్ణ స్వాతంత్య్రం. పరపాలన కంటే స్వపరిపాలన ఉత్తమమైంది. అందువల్లే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతా’ అని తిలక్ ప్రకటించారు. కార్యక్రమాలు: అతివాదులు తమ లక్ష్యసాధనకు నిష్క్రియాత్మక ప్రతిఘటన పాటించారు. ఇందులో భాగంగా బహిష్కరణ, స్వదేశీ, జాతీయ విద్యావిధానం, జాతీయ భావాలను వ్యాప్తి చేశారు.బహిష్కరణ:బ్రిటిష్ వస్తువులను బహిష్కరించటం ఆంగ్లేయుల విద్యా సంస్థల్లో విద్యనభ్యసించకపోవటం. బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించటం. పన్నులు చెల్లించకపోవటం. బ్రిటిష్ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారంతా రాజీనామాలు చేయటం. స్వదేశీ: స్వదేశీ పంచాయతీ కోర్టుల పునఃప్రతిష్టాపన. స్వదేశీ విద్యా సంస్థల స్థాపన. స్వదేశీ పరిశ్రమల్లో తయారైన వస్తువుల వాడకం. దేశీయ పరిశ్రమల అభివృద్ధి. జాతీయభావాల వ్యాప్తి: జాతీయభావాన్ని హిందూ మతంతో జోడించి వ్యాప్తి చేయడం. హిందూ దేవతలైన దుర్గా, కాళీలతోపాటు భారతదేశాన్ని భారతమాతగా ఆరాధించటం. వందేమాతరం గీతం ద్వారా దేశ ఔన్నత్యాన్ని చాటడం. ఒకరికొకరు ‘వందేమాతరం’ అని అభివాదం చేసుకోవటం.గణేష్, శివాజీ ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహించటం. ఉద్యమాలు స్వదేశీ ఉద్యమం పరిపాలనా నెపంతో లార్డ్ కర్జన్ బెంగాల్ను తూర్పు, పశ్చిమ బెంగాల్లుగా విభజించాడు. కానీ, అతని అసలు వ్యూహం..బెంగాల్ విభజనతో పెరుగుతున్న జాతీయ భావాన్ని తగ్గించి, హిందూ–ముస్లింల ఐక్యతను దెబ్బతీయడమే. దీనికి వ్యతిరేకంగా ప్రారంభమయ్యిందే స్వదేశీ/వందేమాతర ఉద్యమం.కర్జన్ 1905, జూలై 4న బెంగాల్ విభజనను ప్రకటించాడు. ఇది అక్టోబర్ 16, 1905 నుంచి అమల్లోకి వచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతో అక్టోబర్ 16న రాఖీ దినంగా పాటించి హిందూ, ముస్లింలు సోదరభావాన్ని ప్రకటించారు. హర్తాళ్లు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయం జాతీయగేయంగా మారింది. వందేమాతరం నినాదంతో విదేశీ వస్తు బహిష్కరణ పెద్ద ఎత్తున జరిగింది. ఈ ఉద్యమంతో స్వదేశీ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.వందేమాతరం ఉద్యమం సందర్భంలో 1907 లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో పర్యటించారు.భారతీయ విద్యాభివృద్ధికి జాతీయ విద్యామండలి (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్) స్థాపించారు.దీంతో ఇది జాతీయస్థాయిలో జరిగి విజయం సాధించిన తొలి ఉద్యమంగా నిలిచింది.1911లో ఐదో జార్జ్ భారత పర్యటనలో భాగంగా 1911, డిసెంబర్ 11న నిర్వహించిన ఢిల్లీ దర్బారులో వైశ్రాయ్ లార్డ్ హార్టింజ్–ఐఐ బెంగాల్ విలీనాన్ని ప్రకటించారు. హోమ్రూల్ ఉద్యమం 1916 అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ ప్రతిపాదించిన జాతీయ స్వయం నిర్ణయ సూత్రం ప్రకారం భారతీయులకు కూడా తమ జాతీయ ప్రభుత్వం ఏర్పర్చుకునే హక్కు ఉందని అనిబిసెంట్, తిలక్లు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. తిలక్ పుణె కేంద్రంగా 1916 ఏప్రిల్లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీని కోసం హోమ్రూల్లీగ్ అనే సంస్థను ప్రారంభించారు. తిలక్ ఉద్యమం మహారాష్ట్ర, సెంట్రల్ ప్రావిన్స్ల్లో కొనసాగింది. అనిబిసెంట్ మద్రాసు కేంద్రంగా 1916 సెప్టెంబర్లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది తిలక్ ఉద్యమ ప్రాంతాలు మినహా మొత్తం భారతదేశమంతా కొనసాగింది. అనిబిసెంట్ అఖిల భారత హోమ్రూల్ లీగ్ను స్థాపించారు. బ్రిటిష్ అధికార పరిధికి లోబడి మతస్వేచ్ఛ, జాతీయ విద్య, సాంఘిక, రాజకీయ సంస్కరణలతో భారతీయులకు స్వయం పాలన అందించడం ఈ ఉద్యమ లక్ష్యం. 1917లో మాంటేగ్ ప్రకటనతో అనిబిసెంట్ ఉద్యమం నిలిపివేశారు. తిలక్ తన ఉద్యమాన్ని కొనసాగించారు. అతివాద యుగంలో ప్రముఖ సంఘటనలు 1906– కలకత్తాలో జాతీయ కళాశాల స్థాపన. 1906, డిసెంబర్ 30న ఢాకా కేంద్రంగా నవాబ్ హబీబుల్లా అఖిల భారత ముస్లింలీగ్ను స్థాపించారు. 1907– సూరత్ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో అతివాదులు, మితవాదులుగా చీలిక. జాతీయ కాంగ్రెస్ నుంచి అతివాదుల బహిష్కరణ. 1909–మింటో–మార్లే సంస్కరణలు– ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు. 1911, డిసెంబర్ 11న ఢిల్లీ దర్బార్ – బెంగాల్ పునరేకీకరణ. దేశ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్పు. ఒడిశా, బీహార్లను బెంగాల్ నుంచి వేరు చేయటం. 1912, డిసెంబర్ 23 లార్డ్ హార్డింజ్ బాంబు కేసు – నూతన రాజధాని ప్రవేశ సమయంలో ఢిల్లీలో చాందినీ చౌక్ వద్ద హార్డింజ్ హత్యకు బాంబు దాడి. 1914–1918 – మొదటి ప్రపంచ యుద్ధం. 1916 – లక్నో ఒప్పందం – ముస్లింలీగ్, కాంగ్రెస్లు ఐక్యపోరాటానికి అంగీకారం అతివాద, మితవాదుల కలయిక. 1917, ఆగస్టు 20 – మాంటేగ్ ప్రకటన. పాలనలో భారతీయులకు ప్రాతినిధ్యం పెంచటం. అంచెలంచెలుగా స్వయంపాలనా సంస్థల ఏర్పాటు. బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు. 1918 ఆగస్టు – సురేంద్ర నాథ్ బెనర్జీ నాయకత్వంలో మితవాదులు కాంగ్రెస్ను వీడటం. నేషనల్ లిబరల్ లీగ్ స్థాపన. ఇదే ఆల్ ఇండియా లిబరల్ ఫెడరేషన్గా మారింది. 1919 – మాంటేగ్ – చెమ్స్ఫర్డ్ సంస్కరణలు– రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ప్రవేశ పెట్టడం. రచనలు 1.బాలగంగాధర్ తిలక్ – ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్, గీతా రహస్యం. 2.లాలా లజపతిరాయ్ – అన్ హ్యాపీ ఇండియా, ఉnజ ్చnఛీ’టఈ్ఛb్ట ్టౌ ఐnఛీజ్చీ, కాల్ టు యంగ్ ఇండియా, ఇండియాస్ విల్ టు ఫ్రీడమ్, ఏన్ ఇంటర్ప్రిటేషన్ అండ్ హిస్టరీ ఆఫ్ ది నేషనల్ మూవ్మెంట్. 3.అరబిందో ఘోష్ – ద లైఫ్ డివైన్, సావిత్రి, డాక్ట్రిన్ ఆఫ్ పాసివ్ రెసిస్టెన్స్, భవానీ మందిర్. 4.బిపిన్ చంద్రపాల్ – మెమరీస్ ఆఫ్ మై లైఫ్ అండ్ టైమ్స్, ద సోల్ ఆఫ్ ఇండియా: ఎ కన్స్ట్రక్టివ్ స్టడీ ఆఫ్ ఇండియన్ థాట్స్ అండ్ ఐడియల్స్. -
ప్రకరణ–22 దేన్ని వివరిస్తుంది?
ప్రకరణ–22: అక్రమ నిగ్రహణ (అరెస్ట్), నిర్బంధం (డిటెన్షన్) నుంచి రక్షణ, అక్రమ అరెస్టులకు, నిర్బంధాలకు వ్యతిరేకంగా రక్షణ. ఈ ప్రకరణ ప్రకారం చట్టబద్ధంగా అరెస్ట్ చేయడానికి కొన్ని ప్రాతిపదికలు పాటించాలి. అవి.. ప్రకరణ–22(1) ఎ) ప్రతి అరెస్టుకూ కారణం ఉండాలి లేదా కారణాన్ని తెలపాలి. న్యాయవాదిని సంప్రదించుకునే అవకాశం ఇవ్వాలి. బి) నిందితుణ్ని అరెస్టు చేసిన 24 గంటల్లోపు (ప్రయాణ సమయాన్ని మినహాయించి) సమీప న్యాయస్థానంలో హాజరుపర్చాలి. ప్రత్యేక వివరణ 24 గంటల సమయాన్ని లెక్కించేటప్పుడు ప్రయాణ సమయాన్ని మినహాయిస్తారు. అయితే సెలవు దినాలను మినహాయించరు. అరెస్టయిన వ్యక్తిని సమీప మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపర్చాలి. పై రక్షణలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ప్రకరణ–22(3) ప్రకారం ఈ రక్షణలు శత్రు దేశ పౌరులకు, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్టయినవారికి వర్తించవు. ప్రకరణ–22(4) ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్టయినవారిని మూడు నెలలకు మించి నిర్బంధంలో ఉంచరాదు. అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద ఏర్పాటైన అడ్వైజరీ బోర్డు సూచన మేరకు మూడు నెలల కన్నా ఎక్కువ నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ బోర్డులో హైకోర్టు న్యాయమూర్తులు లేదా హైకోర్టు న్యాయమూర్తిగా నియామకానికి అర్హత కలిగిన వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ప్రకరణ–22 (5) ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్టయినవారికి అరెస్టుకు గల కారణాలను సాధ్యమైనంత త్వరగా తెలపాలి. తద్వారా బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసుకునే అవకాశాన్ని పొందుతారు. ప్రకరణ–22(6) ప్రకారం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రివెంటివ్ అరెస్టుకు గల కారణాలను వెల్లడించకుండా ఉండేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. ప్రకరణ–22(7) ప్రకారం పైన పేర్కొన్న క్లాజులతో సంబంధం లేకుండా మూడు నెలల కన్నా ఎక్కువ కాలం నిర్బంధించేలా పార్లమెంట్ శాసనాలు చేయొచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు–వివరణ సాధారణంగా నిర్బంధాలు రెండు రకాలు. 1. శిక్షించే చట్టాలు 2. నివారక చట్టాలు. శిక్షించే చట్టాల్లో ముద్దాయి నేరం నిరూపితమై కోర్టు విధించిన శిక్షను అమలుచేయడానికి నిర్బంధిస్తారు. నివారక చట్టాల్లో నిందితుణ్ని/అనుమానితుణ్ని నేరం చేస్తాడేమో అనే అనుమానంతో విచారణ లేకుండా ముందుగానే నిర్బంధిస్తారు. దేశ రక్షణ, శాంతిభద్రతల దృష్ట్యా ఇలా చేస్తారు. ముఖ్య ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు నివారక నిర్బంధ చట్టాన్ని 1950లో చేశారు. కానీ, దాన్ని 1969లో రద్దు చేశారు. ‘అంతర్గత భద్రతా చట్టం (మెయింటనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్: ఎంఐఎస్ఏ: మిసా)–1971’ని 1978లో రద్దు చేశారు. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, దొంగ వ్యాపార నిరోధక చట్టం–1974. అత్యవసర సరకుల దొంగ మార్కెట్ నిరోధక నిర్వహణ చట్టం–1980 ‘జాతీయ భద్రతా చట్టం–1980’ని 1984లో సవరించారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి రెగ్యులేషన్ నిర్బంధాలు; స్మగ్లర్, ఫారెన్ ఎక్సే్ఛంజ్ నిరోధక చట్టం–1976 ‘ఉగ్రవాద, కల్లోల కార్యక్రమాల నివారక చట్టం(టాడా)–1985’ను 1995లో రద్దు చేశారు. ‘ఉగ్రవాద నిరోధక చట్టం (పోటా)–2002’ను 2004లో రద్దు చేశారు. -
పనిచేసే చోట పదిలంగా..!
ఉద్యోగమే ఒక వైకుంఠపాళి.. ఇక్కడ కెరీర్కు ఊతమిచ్చే నిచ్చెనలే కాదు.. సమయం వచ్చినప్పుడు కిందకు తోసేసేవి కూడా ఉంటాయి. దీన్నుంచి తప్పించుకోలేం. తప్పక ఎదుర్కోవాల్సిందే! మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేని పోరాటమిది. ఎదురు దెబ్బలుంటాయి, బెదురు పరుగులుంటాయి.ఇక్కడ పనికి సంబంధించిన ఒత్తిళ్లు ఒక ఎత్తయితే.. మానవీయ సమస్యలు ఇంకోవైపు. వీటన్నింటినీ అధిగమించి కెరీర్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం ఎలాగో తెలుసుకుందాం... కష్టపడి పని చేయడం మానాలి చిన్నప్పటి నుంచి ఎవరూ మనకు ఆనందంగా చదువుకోమని, ప్రేమగా పని చేయమని చెప్పి ఉండరు. అందరూ ‘కష్టపడి చదవండి.. కష్టపడి పనిచేయండి’ అనే చెబుతారు. అందుకే మనం ప్రతి పనీ కష్టపడి చేస్తాం. జీవితం, ఉద్యోగం, వ్యాపారం.. ఏదీ సులభం కాదని అసంతృప్తితో బతుకుతుంటాం. ఆఫీసులోనూ, ఉద్యోగం విషయంలోనూ ఇదే చేస్తాం. చివరకు చుట్టూ ఉన్నవారిపై అసంతృప్తితో రగిలిపోతుంటాం. నిజానికి ప్రతిదీ కష్టపడి చేయడమనేది అహానికి నిదర్శనం. ఎందుకంటే.. అందరికన్నా ఒక మెట్టు పైన ఉండాలన్నదే దానికున్న ఏకైక లక్షణం. ఇది సహజంగానే అసంతృప్తికి మూల కారణమవుతుంది. అలాకాకుండా చేసే ప్రతి పనీ ఆనందంగా, ఇష్టంతో చేస్తే చేసినట్లే అనిపించదు. కాబట్టి కష్టపడి పని చేయడం మాని... ఇష్టపడి చేయడం అలవాటు చేసుకోవాలి. పోటీని దాటి వెళ్లాలి ప్రస్తుతం ప్రపంచమంతటా ఎక్కడ చూసినా.. విపరీతమైన పోటీ! ప్రతి ఒక్కరూ ఇతరులను మించిపోవాలనే పరుగు పెడుతుంటారు. ఆ పోటీ వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు మాత్రం సుముఖంగా ఉండరు. అలాకాకుండా మనం చేసే ప్రతి పనికీ ఒక పర్యవసానం ఉంటుందని గ్రహించాలి. ఇతరుల కంటే ముందుండాలని కోరుకోకుండా... మనకున్న శక్తిసామర్థ్యాల గురించి ఆలోచించుకోవాలి. వేగంగా పనిచేస్తూనే కచ్చితత్వం ఉండేలా చూసుకోవాలి. మనల్ని నిరుత్సాహ పరిచే అంశాలు ఎన్ని ఉన్నా.. అన్నింటినీ తట్టుకుని ముందుగు సాగాలి. అప్పుడే కెరీర్ గ్రాఫ్ సజావుగా సాగుతుంది. సంస్థలో మంచి గుర్తింపు వస్తుంది. స్వచ్ఛంద కార్యకర్తలా ఉండాలి మనం స్వచ్ఛంద సేవ చేసినప్పుడు.. ఆ సేవను ఒక సమర్పణగా భావిస్తాం. అయితే ఇంట్లో లేదా ఆఫీసులో చేసే అదే పని భారంగా అనిపిస్తుంది. కారణం.. చేసే పని ఒకటే అయినా చేసే విధానంలో తేడా ఉంటుంది. అందుకని ఆఫీసులో చేసే ప్రతి పనీ ఒక సమర్పణగా భావించాలి. ఎల్లప్పుడు ఒక స్వచ్ఛంద కార్యకర్తలా వ్యవహరించాలి. ఇక్కడ స్వచ్ఛందం అంటే ఇష్టంగా అని అర్థం. స్వచ్ఛంద కార్యకర్త అంటే.. అన్ని రకాల పరిస్థితులను అంగీకరించి.. ప్రతి క్షణాన్ని సరైన రీతిలో ఇష్టంగా నిర్వహించడం. అయిష్టత ఏర్పడిన మరుక్షణం జీవితంలో ఎంతో అద్భుతం జరగబోతున్నా.. ఓడిపోతున్నామనే భావన కలుగుతుంది. స్వీయ విశ్లేషణ చేసుకోవాలి మనిషి తన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండాలని కోరుకోడు. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిగత జీవితంలోనూ విజయం సాధించాలని.. అత్యున్నత స్థాయికి ఎదగాలని నిరంతరం తపిస్తుంటాడు. కానీ, చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోలేక ఎన్నో పొరపాట్లు చేస్తుంటాడు. ఆ సమయంలో మనలో మనకే తెలియని ఒక శూన్యత, అభద్రతా భావం, అసంతృప్తి అలముకుంటాయి. అలాంటప్పుడు మనకున్న శక్తిసామర్థ్యాలను, అనుకూల, ప్రతికూలతలను, మనం చేస్తున్న తప్పొప్పులను విశ్లేషించుకోవడం చాలా ముఖ్యం. అవసరమైతే సీనియర్ల సలహాలను కూడా తీసుకునేందుకు వెనుకాడకూడదు. సహనం.. శ్రద్ధ.. మంచిమాట ఆశిష్.. బీటెక్ పూర్తిచేశాడు. మంచి మాటకారి. ఇల్లు, ఆఫీసు, ఇంటర్వూ్య.. ఇలా ఎక్కడైనా సరే టపటపా మాట్లాడేస్తుంటాడు. కానీ, విచిత్రమేమిటంటే ఇంతటి మాటకారి అయిన ఇతను ఇప్పటి వరకు ఐదారు సంస్థల్లో ఉద్యోగాలు మారాడు. ఎక్కడా రెండు మూడు నెలలకు మించి పనిచేయలేదు. కారణం.. ఎవరితో ఎలా మాట్లాడాలి.. ఎక్కడ ఏం మాట్లాడాలి.. ఎప్పుడు ఎలా మాట్లాడాలి.. అనే విషయాలు తెలియకపోవడమే. అతనిలా కాకుండా ఎవరేం చెప్పినా శ్రద్ధగా విని.. ప్రశాంతంగా ఆలోచించి.. వివేకంతో సమాధానమిస్తే అందరి మన్ననలు పొందుతాం!! -
తెలుగు భాష – వికాసం
తెలుగు భాషను తెనుగు, త్రిలింగం, ఆంధ్రం అని వ్యవహరిస్తారు. తెలుగు పదం ఆవిర్భావంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. తెలుగు నేలపై శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం క్షేత్రాలున్నాయి. అందువల్లే ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని కూడా పిలుస్తారు. ఈ త్రిలింగం నుంచే తెనుగు పదం పుట్టిందనేది కొందరి వాదన. తెలుగు భాషకు శతాబ్దాల చరిత్ర ఉంది. తెలుగు భాషను పలువురు కింది విధంగా కీర్తించారు. తెలుగు భాషా చరిత్రను సాహిత్యకారులు మూడు భాగాలుగా విభజించారు. అవి.. 1.ప్రాకృత భాష ప్రభావం – శాతవాహనుల కాలం నుంచి క్రీ.శ.11వ శతాబ్దం వరకు. 2.సంస్కృత భాష ప్రభావం – క్రీ.శ.11వ శతాబ్దం నుంచి క్రీ.శ.19వ శతాబ్దం వరకు. 3.పాశ్చాత్య ప్రభావం – క్రీ.శ.19వ శతాబ్దం నుంచి. తెలుగు భాష ఆవిర్భావానికి సంబంధించి సాహిత్యకారుల్లో వేర్వేరు అభిప్రాయాలున్నాయి. కొంతమంది ప్రాకృత, సంస్కృత భాషల నుంచి తెలుగు భాష ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. అయితే అత్యధిక మంది భాషావేత్తలు మాత్రం ద్రావిడ భాషా కుటుంబం నుంచి తెలుగు ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు, ఆంధ్ర పదాల మధ్య విడదీయలేని బంధం ఉంది. క్రీ.పూ.2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 2వ శతాబ్దం వరకు (శాతవాహనుల కాలంలో) ప్రాకృత భాషనే రాజ భాషగా పరిగణించారు. శాతవాహన రాజుల్లో 17వవాడైన హాలుడు గాథాసప్తశతిని ప్రాకృతంలో రచించాడు. శాసనాల్లో తెలుగు భాష క్రీ.శ.6వ శతాబ్దం నుంచి క్రీ.శ.8వ శతాబ్దం వరకు వేయించిన శాసనాల్లోని తెలుగు భాష చాలా ప్రాచీనమైందని తెలుస్తోంది. తెలుగు భాషలో మొట్టమొదటి శాసనం క్రీ.శ.575లో రేనాటి చోడులు వేయించిన ధనుంజయని కలమళ్ల శాసనం. ఇది తెలుగు శాసనాల్లో అత్యంత ప్రాచీనమైంది. ఇందులోని పద్య రచన ప్రాథమిక రూపంలో కనిపిస్తుంది. వీరి కాలంలో సుమారు 33 శాసనాలు వచనంలో ఉన్నాయి. తూర్పు చాళుక్య రాజుల శాసనాల్లో తెలుగు వచనం కనిపించిన మొదటి శాసనం మొదటి జయసింహ వల్లభుని శాసనం (క్రీ.శ.641–673), కాగా రెండోది మంగిరాజు శాసనం (క్రీ.శ.682–706). వీరి తర్వాత చాళుక్య రాజులైన మూడో విష్ణువర్ధనుడు, గుణగ విజయాదిత్యుడు, చాళుక్య భీముడు, యుద్ధమల్లుడు, విమలాదిత్యుడు, రాజరాజనరేంద్రుడు వేయించిన తెలుగు శాసనాలు కూడా లభ్యమయ్యాయి. అయితే వాటిలో ప్రాకృత, సంస్కృత పదాలు అధికంగా కనిపిస్తాయి. అనంతర కాలానికి చెందిన అద్దంకి, ధర్మవరం, బెజవాడ, సామలూరు శాసనాల్లో వచనం, పద్యం కలిసి (మిశ్రమంగా) కన్పిస్తాయి. తొలి కాలానికి చెందిన శాసనాల్లో సంస్కృత తత్సమాలు, దీర్ఘ సమాసాలు ఉండగా, తర్వాతి కాలం శాసనా ల్లో దేశీయ పదాలు, మాండలికాలు అధికంగా ఉన్నాయి. రెండో దశకు చెందిన శాసనాల్లో ప్రాకృత, సంస్కృత ప్రభావం తగ్గింది. 9వ శతాబ్దం నాటి చాళుక్య భీముని కొరవి శాసనంలో తెలుగు లిఖిత సాహిత్యం కనిపిస్తుంది. గుణగ విజయాదిత్యుని సేనాని పండరంగడు వేయించిన అద్దంకి శాసనంలో తరువోజ పద్యం కన్పించింది. పల్లెపాటలు, స్త్రీల పాటలు, దంపుడు పాటలు వంటివి తరువోజ ఛందస్సులోనే ఉన్నాయి. దీన్నుంచే ద్విపద (రెండు వరుసలు) పుట్టిందని ఆరుద్ర పేర్కొన్నారు. తరువోజ, ద్విపద, మధ్యాక్కర, సీసం వంటి వాటిని దేశీ ఛందస్సులుగా గుర్తించారు. గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనంలో సీస పద్యం, ధర్మవరం శాసనంలో ఆటవెలది, యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో మధ్యాక్కర (సంస్కృతేతర) పద్యాలు కన్పిస్తాయి. తెలుగు సాహిత్యాభివృద్ధి – నన్నయ యుగం తూర్పు చాళుక్యరాజైన రాజరాజ నరేంద్రుని కాలంలో నారాయణ భట్టు సహకారంతో నన్నయ భట్టు వ్యాసుని సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. అనువాద ప్రక్రియ ఈ యుగం నుంచే ప్రారంభమైంది. ఆది, సభా పర్వాలతోపాటు అరణ్య పర్వంలోని కొంత భాగాన్ని నన్నయ తెలుగులోకి అనువదించాడు. నన్నయ మరణానంతరం సుమారు 200 ఏళ్ల తర్వాత తిక్కన.. మహాభారతంలోని 15 పర్వాలను తెలుగులోకి అనువాదం చేశాడు. నన్నయ అసంపూర్తిగా వదిలిపెట్టిన అరణ్య పర్వాన్ని తిక్కన పూర్తి చేయలేదు. తిక్కన.. నిర్వచనోత్తర రామాయణంను తెలుగు వచనంలో రచించాడు. ఇతనికి కవి బ్రహ్మ, ఉభయకవి మిత్రుడు వంటి బిరుదులున్నాయి. ఎర్రాప్రగడ ఇతడు క్రీ.శ.14వ శతాబ్దానికి చెందినవాడు. నన్నయ అసంపూర్తిగా రచించిన అరణ్య పర్వాన్ని ఎర్రాప్రగడ (ఎర్రన) పూర్తి చేశాడు. అలాగే హరివంశం, నృసింహ పురాణం వంటి ప్రబంధ కావ్యాలను రచించాడు. ప్రబంధ కావ్యాల మొదటి రచయితగా పేరుగాంచాడు. అందుకే ఇతడికి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది. సంస్కృత మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడలు తెలుగులోకి అనువదించి ‘కవిత్రయం’గా ప్రసిద్ధి చెందారు. ముఖ్యాంశాలు: వాల్మీకి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని గోనబుద్ధారెడ్డి (కాకతీయ ప్రతాపరుఅదేవిధంగా మంత్రి భాస్కరుడు భాస్కర రామాయణాన్ని రాశాడు. నన్నయకు సమకాలికుడైన నన్నెచోడుడు కళ్యాణీ చాళుక్యుల సామంతుడు. ఒక చిన్న మండలాన్ని ఏలిన ఈ తెలుగు చోడ కవి యోధుడు కూడా. నన్నెచోడుడు ఒక యుద్ధంలో మరణించాడు. ఇతడు నన్నయకు పూర్వం వాడని కొందరి వాదన. ఇతడు కుమార సంభవం అనే వర్ణనాత్మక కావ్యం రచించి కవిరాజశిఖామణిగా పేరొందాడు. శైవమత కవైన నన్నెచోడుడు కుమార సంభవం రచించాడు. ఇతని రచనల్లో మధురమైన పద చిత్రాలు, వర్ణనలు ఉంటాయి. నన్నెచోడుడు ఆ కాలంలో వాడుకలో ఉన్న దేశీయ పదాలు, దేశీయ ఛందస్సును అధికంగా ఉపయోగించాడు. అందువల్లే ఇతడు జాను తెనుగు రచయితగా పేరుగాంచాడు. మల్లికార్జున పండితారాధ్యుడు శివ భక్తుడు. శివతత్వసారం అనే గ్రంథాన్ని రచించాడు. తెలుగు శతక వాఙ్మయానికి ఒరవడి తీసుకొచ్చిన మరో శైవ కవైన యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకంరచించాడు. ఆంధ్ర దేశంలో వీరశైవ మతాన్ని బాగా ప్రచారం చేసినవారిలో మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథుడు ప్రసిద్ధులు. పాల్కురికి సోమనాథుడు తన కావ్యాలను దేశీ ఛందస్సు అయిన ద్విపదలో రచించాడు. వీర శైవ మత స్థాపకుడైన బసవడు ఇతని గురువు. పాల్కురికి సోమనాథుడు వృషాధిప శతకం, బసవ పురాణం (బసవేశ్వరుని జీవితం), పండితారాధ్య చరిత్రలను జాన తెలుగులోకి (ద్విపదలో) రచించాడు. అందువల్లే ఇతణ్ని ద్విపద సాహిత్య పితామహుడిగా పేర్కొంటారు. బసవ పురాణాన్ని వీర శైవమత గ్రంథంగా పరిగణిస్తారు. సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో అనేక తరహా జానపద గేయాలు, తుమ్మెద పదాలు, నివాళి పదాలు, వెన్నెల, గొబ్బి పదాలు, దంపుడు పాటలు, యక్షగానాలను పేర్కొన్నాడు. పల్లె పాటలు, జానపద నృత్యాలు, దేశీ నృత్యాల గురించి పండితారాధ్య చరిత్రలో వర్ణించాడు. శ్రీనాథుడు, పోతన తెలుగు సాహిత్యంలో తొలి కవిసార్వభౌముడుగా శ్రీనాథుడు ప్రసిద్ధి చెందాడు. ఇతడు సంస్కృత, తెలుగు భాషల్లో నిష్ణాతుడు. రెడ్డి రాజుల కాలంలో విద్యాధికారిగా నియమితుడయ్యాడు. సంస్కృత సాహిత్య గోష్టిలో విజయనగర రాయల ఆస్థాన కవుల్లో ఒకడైన డిండిమ భట్టును ఓడించి కవిసార్వభౌముడనే బిరుదు పొందాడు. శ్రీహర్షుడు సంస్కృత భాషలో రచించిన శృంగారనైషధ గ్రంథాన్ని శ్రీనాథుడు తెలుగులోకి అనువదించాడు. కాశీ ఖండం, భీమేశ్వర పురాణం, హరివంశం, పల్నాటి వీర చరిత్ర, క్రీడాభిరామం వంటి గ్రంథాలను తెలుగులో రచించాడు. క్రీడాభిరామం ఒక వీధి నాటకం. ఇది ఆనాటి సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది. బమ్మెర పోతన (క్రీ.శ.1450–1510) మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించి ఆంధ్రుల అభిమాన కవిగా మారాడు. తెలుగు సాహిత్యంలో ఆంధ్ర మహాభాగవతం గ్రంథం అపూర్వమైంది. ఇందులో గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర ఘట్టాలను సామాన్య ప్రజలు కూడా ఉటంకిస్తారు. పోతన, శ్రీనాథుని బావమరిది అని కొందరి అభిప్రాయం. పోతన రాజాస్థానాలను ఆశ్రయించలేదు. భాగవత గ్రంథాన్ని ఏ రాజుకీ అంకితమివ్వలేదు. ఇతడు వీరభద్ర విజయం, భోగినీ దండకం అనే గ్రంథాలను కూడా రచించాడు. ఈ కాలంలోనే గౌరన ద్విపదలో హరిశ్చంద్రోపాఖ్యానం, పినవీరభద్రుడు శృంగార శాకుంతలం నాటకాన్ని తెలుగులో రచించారు. -
సాక్షి మీడియా గ్రూప్ ఎడ్యుకేషనల్ ఫెయిర్
-
ఓజోన్ ఆవరణం అని దేన్నంటారు?
భూ ఆవరణాలు – వాతావరణం భూ ఉపరితలంపై నాలుగు ఆవరణాలున్నాయి. అవి.. 1. శిలావరణం 2. జలావరణం 3. వాతావరణం 4. జీవావరణం వీటిని భూ భౌతికాంశాలు అంటారు. 1. శిలావరణం: గ్రీకు భాషలో ‘లిథోస్’ అంటే శిల అని అర్థం. ఈ ఆవరణాన్ని ఆంగ్లంలో లిథో స్పియర్ అంటారు. దీన్ని ‘ఆశ్మావరణం’ అని కూడా పిలుస్తారు. 2. జలావరణం: గ్రీకు భాషలో ‘హదర్’ అంటే జలం అని అర్థం. ఈ ఆవరణాన్ని ఆంగ్లంలో ‘హైడ్రోస్పియర్’ అంటారు. భూ ఉపరితలంపై ఉన్న జలభాగం మొత్తం దీని కిందకు వస్తుంది. 3. వాతావరణం: గ్రీకు భాషలో ‘అట్మోస్’ అంటే గాలి/ఆవిరి అని అర్థం. ఈ ఆవరణాన్ని ఆంగ్లంలో ‘అట్మాస్పియర్’ అంటారు. దీనిలో వివిధ రకాల వాయువులు ఉంటాయి. 4. జీవావరణం: గ్రీకు భాషలో ‘బయో’ అంటే జీవం అని అర్థం. ఈ ఆవరణాన్ని ఆంగ్లంలో బయోస్పియర్ అంటారు. అనేక జీవరాశులు దీని కిందకు వస్తాయి. వాతావరణం భూమిని ఆవరించి ఉన్న దట్టమైన గాలి పొరను వాతావరణం అంటారు. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘మెటియొరాలజి’ అంటారు. భూమిని ఆవరించి ఉన్న వాతావరణం బరువు సుమారు 56 కోట్ల టన్నులు ఉంటుందని అంచనా. కార్బన్ డై ఆక్సైడ్ (ఛిౌ2), నీటి ఆవిరి 90 కి.మీ. ఎత్తు వరకు మాత్రమే ఉంటాయి. ఆక్సిజన్ 120 కి.మీ. ఎత్తు వరకు ఉంటుంది. 22 కి.మీ. ఎత్తులో 96% వాతావరణం విస్తరించి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. వాతావరణంలోని వాయువుల శాతం నత్రజని – 78.08% ఆక్సిజన్ – 20.94% ఆర్గాన్ – 0.93% కార్బన్ డై ఆక్సైడ్ – 0.03% హీలియం, క్రిప్టాన్, గ్జినాన్ ఇతర జడ వాయువులు – 0.02% నత్రజని (నైట్రోజన్): దీన్ని మొక్కలు పరోక్షంగా నైట్రేట్స్ రూపంలో గ్రహిస్తాయి. లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు వాతావరణంలోని నత్రజనిని గ్రహించి భూసారాన్ని పెంచుతాయి. ఆక్సిజన్: ఇది జీవరాశులన్నింటికీ ప్రాణ వాయువు. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా అడ్డుకునే ఓజోన్ (ౌ3) పొరను ఏర్పరచడంలో ఆక్సిజన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కార్బన్ డై ఆక్సైడ్: దీన్నే బొగ్గుపులుసు వాయువు అంటారు. మొక్కలు ఛిౌ2ను గ్రహించి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. గ్రీన్హúస్ ఎఫెక్ట్కు ఛిౌ2 కారణమవుతుంది. ఆర్గాన్: భూ ఉపరితలంపై ఎక్కువగా ఉన్న జడవాయువు. దీన్ని ఎలక్ట్రిక్ బల్బుల్లో వినియోగిస్తారు. వాతావరణం – పొరలు భూ ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు, ఇతర మార్పుల ఆధారంగా వాతావరణాన్ని ఐదు ఆవరణాలుగా విభజించారు. అవి.. ట్రోపో ఆవరణం ఇది భూ ఉపరితలం నుంచి సగటున 13 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. భూమధ్య రేఖా ప్రాంతాల వద్ద 18 కి.మీ, ధృవాల వద్ద 8 కి.మీ. ఎత్తు వరకు ఉంటుంది. ట్రోపో అంటే మార్పు అని అర్థం. వాతావరణంలో మార్పులన్నీ ఈ ఆవరణంలోనే జరుగుతాయి. జీవరాశులన్నీ ఇందులోనే ఉంటాయి. సంవహన వాయు ప్రవాహాల వల్ల ఈ ఆవరణం ఎత్తు భూ మధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఆవరణంలో ఒక కి.మీ. ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత 6.4నిఇ తగ్గుతుంది. 75% వాతావరణం ఈ ఆవరణంలోనే ఉంటుంది. కాబట్టి ఇది జీవక్రియలకు అనుకూలం. మేఘాలు, తుపాన్లు, అవపాతం ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి. ఇందులో జెట్ ప్రవాహాల వల్ల వాతావరణంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల దీన్ని ‘గందరగోళ ఆవరణం’ అని కూడా అంటారు. ట్రోపో ఆవరణం పైభాగపు సరిహద్దును ‘ట్రోపో పాస్’ అంటారు. స్ట్రాటో ఆవరణం ఇది 50 కి.మీ ఎత్తు వరకు ఉంటుంది. స్ట్రాటో అంటే శ్రీకారం చుట్టడం అని అర్థం. ఈ ఆవరణంలో పైకి వెళుతున్నకొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇందులో సిర్రస్ మేఘాలు కనిపిస్తాయి. ఇక్కడ దుమ్ము, ధూళి కణాలు; నీటి ఆవిరి పరిమాణం తక్కువ. స్ట్రాటో ఆవరణాన్ని ప్రశాంత మండలం అంటారు. ఇందులో జెట్ విమానాలు ప్రయాణిస్తాయి. ఓజోన్ పొర ఈ ఆవరణంలో ఉంటుంది. ఇది 35 నుంచి 60 కి.మీ. ఎత్తు ప్రాంతంలో విస్తరించి ఉంది. ఓజోన్ పొర ఉండే ప్రాంతం ఘాటైన చేపల వాసన కలిగి ఉంటుంది. స్ట్రాటో ఆవరణాన్ని ఓజోన్ ఆవరణం అని కూడా అంటారు. ఈ ఆవరణాన్ని చేరిన తొలి భారతీయుడు టీఎన్ సురేశ్ కుమార్. 2014 ఆగస్టు 15న మిగ్–29 నౌకలో ప్రయాణించి ఈ ఆవరణాన్ని చేరుకున్నారు. స్ట్రాటో ఆవరణం పై భాగపు సరిహద్దును ‘స్ట్రాటో పాస్’ అంటారు. మీసో ఆవరణం ఇది స్ట్రాటో పాస్ను ఆనుకొని 80 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇందులో సంవహన క్రియ యథావిధిగా జరుగుతుంది. లక్షణాలు ట్రోపో ఆవరణం మాదిరిగా ఉండటం వల్ల దీన్ని బాహ్య ట్రోపో ఆవరణం అంటారు. కొద్ది పరిమాణంలో ఓజోన్ పొర ఈ ఆవరణంలో కనిపిస్తుంది. ఇందులో కాంతి ప్రేరేపిత రసాయన చర్యలు జరుగుతాయి. అందువల్ల దీన్ని రసాయనిక ఆవరణం అంటారు. ఈ ఆవరణంలో ఉల్కలు నాశనమవుతాయి. మీసో ఆవరణం సరిహద్దును ‘మీసో పాస్’ అంటారు. థర్మో ఆవరణం మీసోపాస్ నుంచి 400 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరగడం వల్ల దీన్ని థర్మో ఆవరణం అంటారు. ఇందులో వాయువులు అయాన్ల రూపంలో ఉంటాయి. అందువల్ల దీన్ని ఐనో ఆవరణం అని కూడా అంటారు. ఈ ఆవరణంలో అయోనైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. అణుసంబంధ ఆక్సిజన్, నైట్రోజన్ల నిరంతర రసాయన చర్యల వల్ల ఉష్ణం, కాంతి జనిస్తుంది. కాంతి పుంజాలు ఏర్పడతాయి. వీటినే ‘అరోరా’లు అంటారు. ఈ ఆవరణంలో రేడియో, సమాచార తరంగాలు పరావర్తనం చెందుతాయి. అందువల్ల దీన్ని సమాచార పొర అంటారు. స్పేస్ షటిల్స్ ఈ ఆవరణంలో ఉంటాయి. ఎక్సో ఆవరణం ఇది ఐనో ఆవరణంపై ఉంటుంది. అతి తేలిక హైడ్రోజన్, హీలియం వాయువులు ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ ఆవరణంలో భూమ్యాకర్షణ శక్తి తక్కువగా ఉన్నందువల్ల వాతావరణ సంఘటనంలో మార్పులు కనిపిస్తాయి. అందువల్ల దీన్ని విరుద్ధ ఆవరణం అంటారు. కృత్రిమ ఉపగ్రహాలను ఈ ఆవరణంలో (36,000 కి.మీ. ఎత్తులో) ప్రవేశపెడతారు. మాదిరి ప్రశ్నలు 1. సిర్రస్ మేఘాలు కనిపించే ఆవరణం? 1) ట్రోపో 2) ఐనో 3) స్ట్రాటో 4) మీసో 2. ఓజోన్ రసాయనిక సాంకేతికం? 1) o2 2) o4 3) oc3 4) o3 3. ఉల్కలు నాశనమయ్యే ఆవరణం? 1) మీసో 2) థర్మో 3) ఎక్సో 4) ట్రోపో 4. గ్రీకు భాషలో ‘హదర్’ అంటే? 1) శిల 2) జీవం 3) ఆవిరి 4) జలం 5. భూ ఉపరితలంపై ఎక్కువగా ఉన్న జడ వాయువు? 1) ఆర్గాన్ 2) హైడ్రోజన్ 3) నియాన్ 4) గ్జినాన్ సమాధానాలు 1) 3 2) 4 3) 1 4) 4 5) 1 -
డాక్ట్రిన్ ఆఫ్ వైవర్ అంటే?
ప్రాథమిక హక్కుల వర్గీకరణ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ప్రధానంగా ఏడు రకాలుగా వర్గీకరించారు. సమానత్వపు హక్కు (ప్రకరణలు 14–18) వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రపు హక్కు (ప్రకరణలు 19–22) పీడనాన్ని నిరోధించే హక్కు (ప్రకరణలు 23, 24) మత స్వాతంత్య్రపు హక్కు (ప్రకరణలు 25–28) సాంస్కృతిక, విద్యా హక్కులు (ప్రకరణలు 29–30) ఆస్తి హక్కు (ప్రకరణ 31) రాజ్యాంగ పరిహార హక్కు (ఆర్టికల్ 32) ప్రత్యేక వివరణ: ప్రాథమిక హక్కుల్లో అత్యంత వివాదాస్పద మైన ఆస్తిహక్కు (ప్రకరణ 31)ని, అలాగే ఆస్తి సంపాదన విషయంలో వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన 19(1)(ఎఫ్)ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి 12వ భాగంలోని ‘300–ఎ’లో చేర్చారు. ప్రస్తుతం ఆస్తిహక్కు రాజ్యాంగబద్ధ హక్కు మాత్రమే. అలాగే చట్టబద్ధ హక్కుగా కూడా పరిగణిస్తున్నారు. ప్రకరణ–12: రాజ్యం–నిర్వచనం–ప్రాముఖ్యత ప్రాథమిక హక్కులను మౌలికంగా రాజ్య నిరపేక్ష అధికారాలకు వ్యతిరేకంగా పొందుపర్చారు. రాజ్యం అనే పదాన్ని రాజ్యాంగంలో చాలా చోట్ల ప్రయోగించారు. అయితే రాజ్యానికి విస్తృత నిర్వచనాన్ని మాత్రం ప్రకరణ–12లో పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులను రాజ్యం/ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా గుర్తించినందున ఏ సంస్థలు రాజ్యం పరిధిలోకి వస్తాయో స్పష్టంగా నిర్వచించకపోతే కొన్ని సంస్థలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినా వాటిపై న్యాయ స్థానంలో ప్రశ్నించే అవకాశం ఉండదు. అందువల్ల విస్తృత నిర్వచనం అవసరం. రాజ్యం అంటే.. ఎ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; కేంద్ర, రాష్ట్ర శాసన సభలు బి) స్థానిక ప్రభుత్వాలు.. అంటే మునిసిపాలిటీ లు, పంచాయతీలు, జిల్లా బోర్డులు, ట్రస్టులు సి) ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పాటైన చట్టబద్ధ, చట్టేతర సంస్థలైన ఎల్ఐసీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ మొదలైనవి. డి) న్యాయ వ్యవస్థ కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు తన తీర్పుల్లో పేర్కొంది. అలాగే ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న ప్రైవేట్ సంస్థలూ రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రత్యేక వివరణ: పైన పేర్కొన్న వాటితోపాటు మరే ఇతర సంస్థలు రాజ్యం పరిధిలోకి వస్తాయనే అంశాన్ని సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో పేర్కొంది. అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీబ్ (1981) ఈ వివాదంలో.. ఒక సంస్థను రాజ్యం అనే నిర్వచనంలోకి చేర్చడానికి కింది ప్రాతిపదికలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మూలధనంలో ప్రభుత్వ వాటా ఉండాలి. సంస్థ మొత్తం ఖర్చును ప్రభుత్వం భరించాలి, సంస్థపై సంపూర్ణ పరిపాలన నియంత్రణ ప్రభుత్వానికి ఉండాలి. సంస్థ ఆర్థిక లావాదేవీలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. న్యాయస్థానాలు రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయి – సుప్రీంకోర్టు తీర్పులు ఎ.ఆర్. అంతులే వర్సెస్ ఆర్.ఎస్.నాయక్ (1988) న్యాయస్థానాల కొన్ని చర్యలు రాజ్య నిర్వచనంలోకి వస్తాయని సుప్రీంకోర్టు ఈ కేసులో పేర్కొంది. దీనికి రాజ్యాంగంలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ప్రకరణ–145, 146 ప్రకారం సుప్రీంకోర్టు సొంతంగా నియమ నిబంధనలను రూపొందించుకోవచ్చు. అలాగే తన సిబ్బందిని నియమించుకునే అధికారం కూడా ఉంటుంది. ఈ చర్యలు కార్యనిర్వాహకపరమైనవి. వీటి వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వాటిని న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు. అందువల్ల న్యాయశాఖ.. కార్యనిర్వాహక విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మాత్రమే రాజ్యం పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. మినహాయింపులు సహకార సంఘాలు, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా(బీసీసీఐ), ప్రభుత్వ ధన సహాయం పొందని ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ పాలన, ఆర్థిక నియంత్రణ లేని ఇతర సంస్థలు రాజ్యం పరిధిలోకి రావు. ప్రకరణ–13 చట్ట నిర్వచనం, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు – న్యాయ సమీక్షాధికారం ప్రకరణ–13(1) ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు అమల్లో ఉన్న చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైతే అవి చెల్లవు. ప్రకరణ–13(2) ప్రకారం ప్రాథమిక హక్కులను హరించే/పరిమితం చేసే చట్టాలు, ఆదేశాలు చెల్లవు. ప్రకరణ–13(3)లోని చట్టం నిర్వచనంలోకి కింది అంశాలు వస్తాయి.. కేంద్ర, రాష్ట్ర శాసన సభల శాసనాలు. రాష్ట్రపతి, గవర్నర్లు జారీ చేసిన ఆదేశాలు, ఆర్డినెన్సులు. ప్రభుత్వ నియమ నిబంధనలు, ప్రకటనలు ప్రభుత్వం గుర్తించి చట్టబద్ధత కల్పించిన ప్రజల ఆచార వ్యవహారాలు. ప్రత్యేక వివరణ: 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా నిబంధన 368 ప్రకారం రాజ్యాంగానికి చేసిన సవరణలను నిబంధన 13లో పేర్కొన్న చట్టం నిర్వచన పరిధి నుంచి మినహాయించారు. ఈ అంశాన్ని గోలక్నాథ్ కేసు(1967)లో సుప్రీంకోర్టు తీర్పును అధిగమించేందుకు చేశారు. కానీ సుప్రీంకోర్టు 1973లో కేశవానంద భారతి కేసులో ఈ సవరణ చెల్లదని తీర్పు చెప్పింది. అందువల్ల రాజ్యాంగ సవరణ కూడా చట్ట నిర్వచన పరిధిలోకి వస్తుంది. న్యాయ సమీక్షాధికారం సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం ఉన్నట్లు ప్రకరణ–13లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే న్యాయ సమీక్ష అనే పద ప్రయోగం లేదు. ఏదైనా చట్టం ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే అది చెల్లదు. అలా చెల్లుబాటు కాకుండా తీర్పు చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఈ నిబంధన ద్వారా సంక్రమించింది. అందువల్ల న్యాయ సమీక్షాధికారం అనేది మౌలిక నిర్మాణంలో అంతర్భాగమవుతుంది. దీన్ని పరిమితం చేసే అధికారం పార్లమెంట్కు ఉండదు. న్యాయ సమీక్షాధికారాన్ని లాటిన్ పరిభాషలో కింది విధంగా పేర్కొంటారు. ఏదైనా చట్టం తన పరిధి దాటి ఉంటే దాన్ని "Ultra Vires" అంటారు. (Ultra=Beyond, Vires=Limits) "Null and Void" A…sôæ Not Valid లేదా చట్టం చెల్లుబాటు కాదు అని అర్థం. సూచన: న్యాయ సమీక్ష అధికారం గురించి సుప్రీంకోర్టు చాప్టర్లో మరింత వివరంగా పేర్కొన్నారు. నిబంధన–13లో పొందుపర్చిన చట్ట నిర్వచనం పరిధి, పార్లమెంట్కు ప్రాథమిక హక్కులను సవరించే అధికారాల గురించి సుప్రీంకోర్టు కొన్ని న్యాయ సూత్రాలను ప్రకటించింది. వాటికి సంబంధించిన వివరాలు.. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటి (Doctrine of Severability) పార్లమెంట్ చట్టాలు, ప్రభుత్వ ఆదేశాలు నిబంధన 13 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఆ చట్టాలు చెల్లవు. అయితే మొత్తం చట్టాన్ని రద్దు చేయకుండా ఏ భాగమైతే ప్రాథమిక హక్కులకు విరుద్ధమో చట్టంలోని ఆ భాగం మాత్రమే రద్దవుతుంది. ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన అంశాలను చట్టం నుంచి వేరు చేయడానికి వీలుకాకపోతే, అప్పుడు మొత్తం చట్టం రద్దవుతుంది. ఈ ప్రక్రియనే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ వైవర్ (Doctrine of Waiver) రాజ్యాంగంలోని 3వ భాగంలో పొందుపర్చిన హక్కులను ప్రభుత్వాలు అమలుచేయాలి. ఏ పౌరుడూ తన హక్కులను వదులుకోవడానికి వీల్లేదు. అమలుచేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వాన్ని మినహాయించడానికీ వీల్లేదు. పౌరులు తమకు ఇష్టం ఉన్నా లేకున్నా; అవగాహన ఉన్నా లేకపోయినా తమ హక్కులను వదులుకోవడానికి కోర్టులు అనుమతించవు. ఈ సూత్రాన్నే డాక్ట్రిన్ ఆఫ్ వైవర్ అంటారు. ఈ సూత్రాన్ని సుప్రీంకోర్టు 1959లో బసేశ్వర్నాథ్ వర్సెస్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ట్యాక్స్ కేసులో ప్రస్తావించింది. అయితే ఈ సూత్రం భారత్లో పరిమితంగానే వర్తిస్తుంది. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ (Doctrine of Eclipse) రాజ్యాంగం అమల్లోకి రాకముందు అమల్లో ఉన్న చట్టాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్లు భావిస్తే వాటి చెల్లుబాటు విషయంలో సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని వినియోగిస్తుంది. రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు రాజ్యాంగ విరుద్ధమైతే వాటిని పూర్తిగా కొట్టేయకుండా అమలును మాత్రమే నిలిపేస్తారు. అంటే వాటికి తాత్కాలిక గ్రహణం పడుతుంది. అనంతర చట్టం ద్వారా వివాదాస్పద అంశాన్ని తొలగిస్తే చట్టాలు అమల్లోకి వస్తాయి. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చట్టాలు రాజ్యాంగ విరుద్ధమైతే వాటిని మొత్తానికి రద్దు చేస్తారు. ఈ విధమైన ప్రక్రియనే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటారు. బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వివాదం(1955)లో సుప్రీంకోర్టు పై సూత్రాన్ని పరిగణలోకి తీసుకుంది. దీప్చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వివాదం(1959)లో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది రాజ్యాంగం అమల్లోకి రాక ముందు ఉన్న చట్టాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. అంబికా మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు(1974)లో సుప్రీంకోర్టు భిన్న తీర్పును ప్రకటించింది. ఈ సూత్రం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన చట్టాలకూ వర్తిస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
ఐదో తరగతి డ్రాపవుట్..వందల మందికి పాఠాలు!
చదువంటే అమితాసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించక ఐదో తరగతితోనే బడి మానేసిన ఆ బాలుడు తర్వాత బతుకుతెరువుకు ఎన్నో పనులు చేశాడు. ఫ్యాక్టరీల్లో కూలిపనులకు వెళ్లాడు. రెస్టారెంట్లు, గ్యారేజీల్లో పనిచేశాడు. టీలు, సమోసాలు అమ్మాడు. ఎన్నోసార్లు అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో అన్నదానం ద్వారా ఆకలి తీర్చుకున్నాడు. కొన్ని రోజులు ఆటో నడిపాడు. కానీ చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని, ఎప్పటికైనా తాను చదువు కొనసాగించి తనలాంటి వారికి సాయపడాలని సంకల్పించాడు. అదే సంకల్పంతో పదేళ్ల తర్వాత మళ్లీ చదువు మొదలు పెట్టి డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం బిహార్ మారుమూల ప్రాంతాల్లో వందల మంది నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాడు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించిన బిహార్ యువకుడు విజయ్ కుమార్ చౌహాన్ స్ఫూర్తిదాయక కథనం. విజయ్ కుమార్ చౌహాన్ తల్లిదండ్రులు దినసరి కూలీలు. పూటగడవడం కోసం కుటుంబంలో అందరూ పని చేయాల్సిన పరిస్థితి. అందువల్ల విజయ్ ఐదో తరగతి తర్వాత చదువు మానేసి కూలి పనులకు వెళ్లేవాడు. పదిహేనేళ్ల వయసులో లూథియానాకు మకాం మార్చాడు. పొట్టకూటికోసం ఎన్నో పనులు చేశాడు. అయితే మనసులో చదువుకోలేకపోయాననే బాధ నిరంతరం వెంటాడేది. తన స్వస్థలం బిహార్లో ఎంతో మంది తనలాగే చదువుకు దూరమవడం కలచివేసేది. ఎలాగైనా తాను చదువును కొనసాగించి అలాంటి వారికి సాయపడాలని భావించేవాడు. మళ్లీ సొంతూరుకు దాదాపు పదేళ్ల తర్వాత విజయ్ కుమార్ 2012లో స్వగ్రామానికి తిరిగొచ్చాడు. అక్కడ ప్రయోగ్ అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) అమలు చేస్తున్న బోధన విధానం విజయ్కు బాగా కలిసొచ్చింది. దానిద్వారా పలు పుస్తకాలు, శిక్షణ సదుపాయాలు అందుబాటులో ఉండేవి. వాటిని వినియోగించుకొని పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత దూరవిద్యా విధానంలో బీఏ సైతం పూర్తి చేశాడు. అసలు ప్రస్థానం ప్రయోగ్ ద్వారా చదువు నేర్చుకున్న తర్వాతి నుంచే విజయ్ తన అసలు ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ముందుగా ప్రయోగ్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ సమీప గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లి ప్రయోగ్ విశేషాలను అక్కడి విద్యార్థులకు వివరించేవాడు. దాన్ని ఉపయోగించుకోవడం వల్ల లభించే ఫలితాల గురించి తననే ఉదాహరణగా పేర్కొంటూ వారిలో చదువు పట్ల ఆసక్తి పెంచాడు. అలాగే ఆ ఎన్జీవో సాయంతో వందల మంది పేద విద్యార్థులు బడి బాట పట్టేలా చేశాడు. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ స్థాయి విద్యాభివృద్ధిపై విజయ్ దృష్టి సారించాడు. తానే స్వయంగా ఇంటర్మీడియెట్ స్థాయి విద్యార్థులకు శిక్షణనిచ్చేలా సంస్థను నెలకొల్పేందుకు నడుం బిగించాడు. కానీ ఇంటర్లో ఉండే మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్ల బోధనకు ముందుకొచ్చే వారు కనిపించలేదు. దాంతో మ్యాథ్స్, సైన్స్లను తానే నేర్చుకొని విద్యార్థులకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. రెండేళ్లపాటు ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్లను ఔపోసన పట్టాడు. వాటిలోని మెళకువలన్నీ నేర్చుకొని బోధనలో ఆరితేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వీడియో లెక్చర్స్ ఇంటర్ సబ్జెక్ట్లలో నైపుణ్యాలు పొందిన విజయ్.. ఆ పాఠాలు అందరికీ చేరువయ్యేందుకు వీడియో లెక్చర్స్ సరైన మార్గమని భావించాడు. అప్పటికే బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ప్రయోగ్ ద్వారా వాటిని అందుబాటులోకి తెచ్చాడు. వాటికి ఇప్పుడు ఎంతో ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ప్రయోగ్ ద్వారా శిక్షణ ఇస్తున్న విజయ్ త్వరలోనే సొంతగా శిక్షణ సంస్థను నెలకొల్పుతానని, అందుకు అవసరమైన నిధుల సమీకరణకు అన్వేషిస్తున్నానని చెబుతున్నాడు. ఎందరో ఉత్తీర్ణులు.. అదే ఆనందం ప్రయోగ్ డిజిటల్ క్లాస్లు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం గతం కంటే ఎంతో పెరిగిందని, అది తనకు చాలా ఆనందం కలిగిస్తోందని అంటున్నాడు విజయ్. ఇప్పుడు డిజిటల్ పాఠాలు నేర్చుకొని ఇంజనీరింగ్, ఇతర డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నారు. దృఢ సంకల్పం ఉంటే అడ్డంకులెన్ని ఎదురైనా అనుకున్నది సాధించొచ్చని, ఆ సంకల్ప బలమే తనకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిందని అంటాడు విజయ్. ఇల్లు గడవడానికి ఐదో తరగతిలో బడి మానేసి కూలి పనులు చేసిన తాను ఇప్పుడు డిగ్రీ పట్టాతో వందల మందికి పాఠాలు చెప్పగలగడానికి దృఢ సంకల్పమే కారణమంటున్నాడు. -
భారత సైన్స్ కాంగ్రెస్ మొట్టమొదటి సదస్సు ఏ నగరంలో జరిగింది?
1.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 112 అడుగుల ఎల్తైన ఆదియోగి శివుని విగ్రహాన్ని 2017 ఫిబ్రవరిలో ఎక్కడ ఆవిష్కరించారు? 1) కోయంబత్తూర్ 2) కొచ్చి 3) వారణాసి 4) మైసూర్ 2.64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది? 1) జనతా గ్యారేజ్ 2) శతమానం భవతి 3) పెళ్లిచూపులు 4) నాన్నకు ప్రేమతో 3.మణిపూర్ ముఖ్యమంత్రిగా 2017 మార్చిలో ఎవరు బాధ్యతలు చేపట్టారు? 1) త్రివేంద్రసింగ్ రావత్ 2) కిరణ్ రిజిజు 3) బీరేన్ సింగ్ 4) సర్బానంద సోనోవాల్ 4.సీఎన్బీసీ టీవీ 18.. 2017 మార్చిలో ‘స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఏ రాష్ట్రానికి అందజేసింది? 1) తెలంగాణా 2) ఆంధ్రప్రదేశ్ 3) మహారాష్ట్ర 4) గుజరాత్ 5.యశ్చోప్రా అవార్డును 2017 ఫిబ్రవరిలో ఎవరికి బహూకరించారు? 1) అక్షయ్ కుమార్ 2) షారుక్ ఖాన్ 3) అజయ్ దేవ్గన్ 4) అమీర్ఖాన్ 6.భారత సైన్స్ కాంగ్రెస్ మొట్టమొదటి సదస్సు ఏ నగరంలో జరిగింది? 1) చెన్నై 2) చండీగడ్ 3) కోల్కతా 4) భువనేశ్వర్ 7.జ్ఞాన్పీఠ్ పురస్కారం 2016 సంవత్సరానికి ఏ భాషా రచయితకు లభించింది? 1) పంజాబీ 2) బెంగాలీ 3) హిందీ 4) గుజరాతీ 8.జాతీయ విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ప్రాంతీయ కార్యాలయానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో శంకుస్థాపన చేశారు? 1) చిత్తూరు 2) ప్రకాశం 3) కర్నూలు 4) నెల్లూరు 9. డిజిటల్ చెల్లింపులపై ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు? 1) ఆర్. గాంధీ 2) ఎస్.ఎస్.మూద్రా 3) రతన్ వతల్ 4) ఉర్జిత్ పటేల్ 10. కిందివాటిలో ఏ క్షిపణి పరిధి పెంపునకు ఇటీవల భారత్, రష్యాలు అంగీకరించాయి? 1) నిర్భయ్ 2) బ్రహ్మోస్ 3) బరాక్–8 4) అగ్ని – 2 11.కిందివాటిలో ఖండాంతర క్షిపణి సామర్థ్యం గల దేశం? 1) చైనా 2) అమెరికా 3) భారత్ 4) పైవన్నీ 12.భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా 2017 జనవరిలో ఎవరు బాధ్యతలు చేపట్టారు? 1) రాకేశ్ మోహన్ 2) విఠల్ ఆచార్య 3) అమితాబ్ కాంత్ 4) కౌశిక్ బసు 13.ప్రపంచ సుందరి–2016గా ఏ దేశానికి చెందిన మహిళ ఎంపికయ్యారు? 1) ఫ్రాన్స్ 2) అమెరికా 3) పోర్టోరికో 4) వెనెజువెలా 14. ఇటీవల మరణించిన ప్రముఖ పాప్ గాయకుడు జార్జి మైకేల్ ఏ దేÔ స్తుడు? 1) అమెరికా 2) ఫ్రాన్స్ 3) స్పెయిన్ 4) బ్రిటన్ 15. భాషా సమ్మాన్ అవార్డుకు 2016 డిసెంబర్లో ఎవరు ఎంపికయ్యారు? 1) కాత్యాయినీ విద్మహే 2) నాగళ్ల గురుప్రసాదరావు 3) పాపినేని శివశంకర్ 4) ఓల్గా 16.ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)–2016 ఫుట్బాల్ టోర్నమెంట్ విజేత? 1) అట్లెటికో డి కోల్కతా 2) కేరళ బ్లాస్టర్స్ 3) ముంబై సిటీ 4) పుణే సిటీ 17. 2016 డిసెంబర్లో మరణించిన సుందర్లాల్ పట్వా ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి? 1) ఉత్తరాఖండ్ 2) ఉత్తరప్రదేశ్ 3) మధ్యప్రదేశ్ 4) ఒడిశా 18.వికాస్ కృష్ణన్ ఏ క్రీడకు చెందిన వ్యక్తి? 1) చెస్ 2) బాక్సింగ్ 3) హాకీ 4) కబడ్డీ 19.రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) ప్రస్తుత డైరక్టర్ ఎవరు? 1) రాజీవ్ జైన్ 2) బి.ఎస్.ధనోవా 3) అనిల్ ధస్మానా 4) నెహ్చల్ సంధూ 20. భారత్లో తొలి పూర్తిస్థాయి సేంద్రియ ఆధారిత వ్యవసాయ రాష్ట్రం? 1) ఆంధ్రప్రదేశ్ 2) గోవా 3) కేరళ 4) సిక్కిం 21.తొలి జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని 2016లో ఏ తేదీన నిర్వహించారు? 1) అక్టోబర్ 28 2) నవంబర్ 28 3) డిసెంబర్ 28 4) సెప్టెంబర్ 28 22. ప్రపంచకప్ కబడ్డీ టోర్నమెంట్–2016 భారత్లో ఏ నగరంలో జరిగింది? 1) లక్నో 2) అహ్మదాబాద్ 3) భువనేశ్వర్ 4) న్యూఢిల్లీ 23. తొలి జాతీయ గిరిజన ఉత్సవాన్ని 2016 అక్టోబర్లో ఏ నగరంలో నిర్వహించారు? 1) ముంబై 2) షిల్లాంగ్ 3) న్యూఢిల్లీ 4) కోల్కతా సమాధానాలు 1) 1 2) 3 3) 3 4) 2 5) 2 6) 3 7) 2 8) 4 9) 3 10) 2 11) 4 12) 2 13) 3 14) 4 15) 2 16) 1 17) 3 18) 2 19) 3 20) 4 21) 1 22) 2 23) 3 -
సివిల్స్ సమరానికి ప్రణాళిక
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఐఏఎస్, ఐపీఎస్ తదితర 24 కేంద్ర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)నిర్వహించే ఎంపిక ప్రక్రియ. మూడంచెల సివిల్ సర్వీసెస్ ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. జూన్ 18న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది.అంటే ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయం దాదాపు రెండు నెలలు. ఆ తర్వాత మలి దశ మెయిన్స్ అక్టోబర్ 28 నుంచి జరగనుంది.అభ్యర్థులు ప్రిలిమ్స్పై ఫోకస్ చేస్తూనే, మలిదశ మెయిన్స్ను దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2017లో విజయానికి నిపుణుల సలహాలు, సూచనలు.. తగ్గిన పోస్టుల సంఖ్య సివిల్ సర్వీసెస్–2017 నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీల సంఖ్య 980. గతేడాది కంటే వంద పోస్టులు తక్కువ. పోస్టుల సంఖ్య తగ్గినా అభ్యర్థులకు ఉపశమనం కలిగించిన అంశం ఎంపిక ప్రక్రియలో ఎలాంటి మార్పులు లేకపోవడం. నిజానికి సివిల్ సర్వీసెస్ పరీక్షలో మార్పులు జరుగుతాయని, అటెంప్ట్ల సంఖ్య, వయోపరిమితి తగ్గిస్తారని కొంత కాలంగా వార్తలు వచ్చాయి. అయితే ఎలాంటి మార్పులు లేకపోవడం గత రెండు, మూడేళ్లుగా ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులకు పెద్ద ఊరటని చెప్పొచ్చు. తులనాత్మక అధ్యయనం అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్కు ప్రాధాన్యమిస్తూనే మెయిన్లో సైతం ఉన్న ఉమ్మడి అంశాలను గుర్తించాలి. ఈ క్రమంలో తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఫలితంగా ప్రిలిమినరీ తర్వాత మెయిన్ పరీక్షకు లభించే మూడు నెలల స్వల్ప వ్యవధిలో ప్రిపరేషన్ పరంగా కలిసొస్తుంది. మెయిన్ ఎగ్జామినేషన్లోని ఎథిక్స్ అండ్ ఇంటెగ్రిటీ, ఆప్షనల్ సబ్జెక్ట్ మినహా మిగతా అన్ని పేపర్లు కూడా జనరల్ స్టడీస్కు సంబంధించినవే! దీన్ని సానుకూలంగా మార్చుకొని ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమయంలోనే మెయిన్స్లోని ఉమ్మడి అంశాల ప్రిపరేషన్ను కూడా పూర్తిచేసుకోవాలి. ఆబ్జెక్టివ్లోనూ అంతర్లీనంగా ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కొన్నేళ్లుగా ఇందులో అడుగుతున్న ప్రశ్నలను గమనిస్తే.. అభ్యర్థికి నిర్దిష్టంగా ఒక అంశంపై పలు కోణాల్లో ఉన్న నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం కొశ్చన్ అండ్ ఆన్సర్ పద్ధతికి మాత్రమే పరిమితం కాకుండా విశ్లేషణాత్మక దృక్పథంతో ప్రిపరేషన్ సాగించడం అవసరం. ప్రిలిమినరీ విషయంలో అభ్యర్థులు వాస్తవ ఘటనలు, గణాంకాలకు ప్రాధాన్యమిస్తూనే మూల భావనలు, ప్రాథమిక సూత్రాలపైనా అవగాహన పెంచుకోవాలి. అప్పుడే ప్రశ్నను ఏ తీరులో అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. సీశాట్.. వెరీ కేర్ఫుల్ సివిల్స్ ప్రిలిమ్స్లో పేపర్–2 సీశాట్ (సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్) విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వాస్తవానికి దీన్ని కేవలం అర్హత పరీక్షగానే నిర్దేశించినా.. 200 మార్కులకు నిర్వహించే ఈ పేపర్లో కచ్చితంగా 33 శాతం మార్కులు పొందాలనే నిబంధన విధించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు పేపర్–2లో పేర్కొన్న ఇంగ్లిష్ రీడింగ్ కాంప్రెహెన్షన్, లాజికల్ రీజనింగ్, బేసిక్ న్యూమరసీ అంశాలపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. ఇంగ్లిష్ రీడింగ్ కాంప్రెహెన్షన్ కోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్స్లోని ఎడిటోరియల్స్ చదవడం, వాటి సారాంశాన్ని గుర్తించడం, వాక్య నిర్మాణ శైలి లాంటి వాటిపై దృష్టిసారించాలి. బేసిక్ న్యూమరసీకి సంబంధించి పదో తరగతి స్థాయిలో కంప్యుటేషనల్ స్కిల్స్పై పట్టు సాధించాలి. లాజికల్ రీజనింగ్కు సంబంధించి ఒక అంశాన్ని భిన్న కోణాల్లో చదివి అందులోని కీలక అంశాలను గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. పేపర్–1 + మెయిన్స్ ఏక కాలంలో సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్–1 (జనరల్ స్టడీస్), మెయిన్ ఎగ్జామినేషన్లోని పేపర్లకు ఏక కాలంలో ప్రిపరేషన్ సాగించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రిలిమ్స్లోని అంశాలను డిస్క్రిప్టివ్ అప్రోచ్తో చదవాలి. తద్వారా మెయిన్లోని జనరల్ ఎస్సే, జనరల్ స్టడీస్ పేపర్లకు ఒకే సమయంలో సంసిద్ధత లభిస్తుంది. గత ఏడాది కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయంగా, ఆర్థికంగా పలు పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో అభ్యర్థులు పాలిటీ, ఎకానమీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రీడింగ్ విత్ రైటింగ్ సివిల్స్ అభ్యర్థులు చదువుతున్న టాపిక్లోని ముఖ్యమైన అంశాలను పాయింట్ల రూపంలో సొంత నోట్స్గా రూపొందించుకోవాలి. దీనివల్ల రైటింగ్ ప్రాక్టీస్, రైటింగ్లో వేగం పెరగడమే కాకుండా రివిజన్ పరంగానూ ఉపయుక్తంగా ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్టులు సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమయంలోనే మెయిన్ ఎగ్జామినేషన్లో రాయాల్సిన ఆప్షనల్ సబ్జెక్ట్ ప్రిపరేషన్కు కొంత సమయం కేటాయించాలి. అంతేకాకుండా అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్ను ప్రిలిమ్స్ సిలబస్లోని అంశాలు, అలాగే మెయిన్స్లోని ఇతర పేపర్లతో అనుసంధానం చేసుకునే వీలుందో లేదో చూసుకోవాలి. ఉదాహరణకు పాలిటీని ఆప్షనల్గా తీసుకున్న అభ్యర్థులకు ప్రిలిమ్స్లోని ఇండియన్ పాలిటీ– గవర్నెన్స్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ అంశాలతో అనుసంధానం చేసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్లోని జనరల్ స్టడీస్–2 (గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్)తో అనుసంధానం చేసుకునే వీలుంటుంది. సివిల్స్ –2017 ప్రిపరేషన్ టైం ప్లాన్ ⇔ ఇప్పటి నుంచి జూన్ ఒకటి వరకు ప్రిలిమ్స్ + మెయిన్స్ దృక్పథంతో చదవాలి. ⇔ రోజూ ఆరు నుంచి 8 గంటలు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ⇔ జూన్ ఒకటి నుంచి పూర్తిగా ప్రిలిమ్స్కే సమయం కేటాయించాలి. ⇔ ప్రిలిమ్స్ పూర్తయిన వెంటనే మెయిన్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ప్రారంభించాలి. ⇔ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కోసం ప్రత్యేకంగా కనీసం నాలుగు గంటల సమయం కేటాయించాలి. ⇔ ప్రిలిమ్స్ కోణంలో ప్రతి వారం మోడల్ టెస్ట్లకు హాజరు కావాలి. ⇔ ప్రిలిమ్స్కు ముందు నెల రోజుల వ్యవధిలో మాక్ టెస్ట్లు రాసి మూల్యాంకన చేయించుకోవాలి. రిఫరెన్స్ బుక్స్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ– బిపిన్ చంద్ర ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ – బిపిన్ చంద్ర ఇండియన్ కల్చర్ – స్పెక్ట్రమ్ ఇండియన్ జాగ్రఫీ – మాజిద్ హుస్సేన్ ఇండియన్ పాలిటీ – లక్ష్మీకాంత్ ఇండియన్ ఎకానమీ – రమేశ్ సింగ్ ఇండియా ఇయర్ బుక్ ఎకనామిక్ సర్వే అనలిటికల్ రీజనింగ్– ఎం.కె.పాండే వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ – ఆర్.ఎస్.అగర్వాల్ సివిల్స్ ప్రిలిమ్స్–2017 సమాచారం పరీక్ష తేదీ: జూన్ 18, 2017 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్–1: జనరల్ స్టడీస్ – 200 మార్కులు పేపర్–2: ఆప్టిట్యూడ్ టెస్ట్ – 200 మార్కులు (పేపర్–2 ఆప్టిట్యూడ్ టెస్ట్లో తప్పనిసరిగా 33 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి). మెయిన్ ఎగ్జామినేషన్–2017 (మెరిట్కు పరిగణనలోకి తీసుకునే పేపర్లు) పేపర్–1: జనరల్ ఎస్సే పేపర్–2: జనరల్ స్టడీస్–1 (ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ సొసైటీ) పేపర్–3: జనరల్ స్టడీస్–2 (గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్) పేపర్–4: జనరల్ స్టడీస్–3 (టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్) పేపర్–5: జనరల్ స్టడీస్–4 (ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్) పేపర్–6: ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్–1 పేపర్–7: ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్–2 ప్రతి పేపర్కు 250 మార్కులు చొప్పున 1750 మార్కులకు మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఖాళీల ఆధారంగా 1:1.2 లేదా 1.3 నిష్పత్తిలో అభ్యర్థులను పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వూ్య–275 మార్కులు)కు ఎంపిక చేస్తారు. -
తెలంగాణ సోషియో ఎకనమిక్ ఔట్లుక్–2017
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక ప్రగతి వేగవంతమైంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో.. జాతీయ వృద్ధిరేటును తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు అధిగమించి.. రెండంకెల వృద్ధి నమోదు చేసింది. ఇదే సమయంలో జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి దేశ తలసరి ఆదాయ వృద్ధి కంటే తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి అధికంగా ఉందని అర్థమవుతోంది. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో వృద్ధి.. ఆర్థికS వ్యవస్థ ప్రగతిని తెలియజేస్తుంది. 2015–16లో ప్రస్తుత ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి రూ.5.76 లక్షల కోట్లు కాగా, 2016–17లో రు.6.54 లక్షల కోట్లుగా(ముందస్తు అంచనాల ప్రకారం) ఉంటుందని అంచనా. 2015–16తో పోల్చితే 2016–17లో ప్రస్తుత ధరల వద్ద జీఎస్ డీపీలో వృద్ధి 13.7 శాతం. 2015–16లో స్థిర ధరల వద్ద జీఎస్డీపీ రూ.4.64 లక్షల కోట్లు కాగా, 2016–17లో రూ.5.11 లక్షల కోట్లని అంచనా. 2015–16తో పోల్చితే 2016–17లో స్థిర ధరల వద్ద జీఎస్డీపీలో వృద్ధి 10.1 శాతంగా నమోదైంది రాష్ట్ర ప్రగతి (2016–17) జాతీయ స్థూల దేశీయోత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర వాటా 2015–16లో 4.21 శాతం కాగా, 2016–17లో 4.28 శాతం. దేశ వృద్ధిరేటుతో తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ) వృద్ధిని పోల్చితే 2012–13లో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 5.5 శాతం కాగా, తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి కేవలం 2.7 శాతం మాత్రమే. కానీ, 2014–15 తర్వాత తెలంగాణ వృద్ధిరేటు మెరుగై దేశ జీడీపీ వృద్ధిరేటును అధిగ మించింది. 2013–14లో స్థిర ధరల వద్ద తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి 5.6 శాతం కాగా, 2014–15లో 8.7 శాతంగా, 2015–16లో 9.5 శాతంగా, 2016–17లో 10.1 శాతంగా నమోదైంది. భారతదేశ జీడీపీ వృద్ధి స్థిర ధరల వద్ద 2013–14లో 6.5 శాతం కాగా, 2014–15లో 7.2 శాతంగా, 2015–16లో 7.9 శాతానికి పెరిగి, 2016–17 లో 7.1 శాతానికి తగ్గింది. స్థిర ధరల వద్ద (2011–12) తెలంగాణ జీఎస్డీపీ రూ.5,11,286 కోట్లు కాగా, భారతదేజీడీపీ రూ.1,21,65,481 కోట్లు. వివిధ రంగాల్లో ప్రగతి ఆర్థిక వ్యవస్థను మూడు రంగాలుగా విభజించవచ్చు. అవి.. 1) ప్రాథమిక రంగం 2) ద్వితీయ రంగం 3) తృతీయ రంగం ప్రాథమిక రంగంలో పంటలు, పశు పోషణ, అడవులు, ఫిషింగ్–ఆక్వాకల్చర్, గనులు –క్వారీయింగ్ వంటిæ ఉపరంగాలు ఉంటాయి. ద్వితీయ రంగంలో తయారీ–నిర్మాణ రంగాలు, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వంటి ఉప రంగాలు ఉంటాయి. తృతీయ రంగంలో వాణిజ్యం, రిపేర్ సర్వీసులు, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, కోల్డ్ స్టోరేజ్ సేవలు (నిల్వ) సమాచార–ఫైనాన్షియల్ సర్వీసులు, రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలు, ప్రభుత్వ పాలన తదితర ఉపరంగాలు ఉంటాయి. తెలంగాణలో వ్యవసాయ–అనుబంధ కార్య కలాపాలతో కూడిన ప్రాథమిక రంగ స్థూల సమ కూరిన విలువలో వృద్ధి.. ప్రస్తుత ధరల వద్ద 17.2 శాతంగా నమోదైంది. అదే సమయంలో దేశంలో వ్యవసాయ–అనుబంధ కార్యకలాపాల్లో వృద్ధి 9 శాతంగా ఉంది. తెలంగాణలో ద్వితీయ రంగం వృద్ధి ప్రస్తుత ధరల వద్ద 9.8 శాతం కాగా, దేశంలో 8.7 శాతంగా ఉంది. తెలంగాణలో సేవా రంగంలో వృద్ధి 14.6 శాతం కాగా, దేశంలో 11.9 శాతంగా నమోదైంది. lస్థిర ధరల వద్ద 2015–16లో తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక రంగంలో రుణాత్మక వృద్ధి నమోదైంది. కాగా, 2016–17లో ప్రాథమిక వృద్ధిని 12.8 శాతంగా, ద్వితీయ రంగ వృద్ధిని 6.2 శాతంగా, తృతీయ రంగ వృద్ధిని 8.2 శాతంగా అంచనా వేశారు. ఉపరంగాల్లో వృద్ధిని పరిశీలిస్తే స్థిర ధరల వద్ద జీవీఏలో 2016–17లో (ముందస్తు అంచనాల ప్రకారం) ప్రాథమిక రంగంలో పంటల ఉత్పత్తి వృద్ధి 19 శాతంగా, వ్యవసాయం, అడవులు, ఫిషింగ్లో వృద్ధి 12.1 శాతంగా, మైనింగ్–క్వారీయింగ్లో వృద్ధి 15.6 శాతంగా నమోదయ్యాయి. స్థిర ధరల వద్ద స్థూల సమకూరిన∙విలువలో ద్వితీయ రంగంలోని ఉపరంగాల్లో వృద్ధిని పరిశీలిస్తే 2016–17లో తెలంగాణలో తయారీ రంగ వృద్ధి 7.1 శాతంగా, నిర్మాణ రంగ వృద్ధి 6 శాతంగా ఉన్నాయి. అయితే విద్యుచ్ఛక్తి –నీటి సరఫరాల్లో మాత్రం రుణాత్మక వృద్ధి (–2.4 శాతం) నమోదైంది.lతెలంగాణ రాష్ట్రంలో 2016–17లో స్థిర ధరల వద్ద స్థూల సమకూరిన విలువలో తృతీయ రంగంలోని ఉపరంగాల్లో వృద్ధిని పరిశీలిస్తే వాణిజ్యం, రిపేర్, హోటళ్లు, రెస్టారెంట్లలో వృద్ధి 9.8 శాతం కాగా, ఫైనాన్షియల్ సర్వీసుల్లో వృద్ధి 9.8 శాతంగా,S రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవల్లో వృద్ధి 7.2 శాతంగా, ఇతర సేవల్లో వృద్ధి 6.2 శాతంగా ఉంది. 2016–17లో ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల సమకూరిన విలువలో వివిధ రంగాల వాటాలను పరిశీలిస్తే ప్రాథమిక రంగం వాటాS18.5 శాతంగా, ద్వితీయ రంగం వాటా 19 శాతంగా, తృతీయ రంగం వాటా 62.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రాథమిక రంగం వాటాలో వ్యవసా యం–అనుంబంధ కార్యకలాపాల వాటా 15 శాతంగా, మైనింగ్–క్వారీయింగ్ వాటా 3 శాతంగా నమోదయ్యాయి. ద్వితీయ రంగంలో(19 శాతంలో) తయారీ రంగ వాటా 12 శాతం కాగా, నిర్మాణ రంగ వాటా 6 శాతంగా, విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా వాటా 1 శాతంగా ఉన్నాయి. తృతీయ రంగంలో(62.6 శాతం) రియల్ ఎస్టేట్–వృత్తిపరమైన సేవల వాటా 21 శాతం కాగా.. వాణిజ్యం, రిపేర్లు, హోటళ్లు–రెస్టారెంట్ల వాటా 15 శాతంగా, ఫైనాన్షియల్ సేవలు వాటా 6 శాతంగా, ఇతర సేవల వాటా 9 శాతంగా ఉన్నాయి. రవాణా, నిల్వ (స్టోరేజ్), సమాచారం వాటా 8 శాతంగా ఉంది. స్థిర ధరల వద్ద (2011–12) తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ప్రాథమిక రంగం వాటా 2016–17లో రూ.76,083 కోట్లు కాగా, ద్వితీయ రంగం వాటా రూ.98,439 కోట్లు, తృతీయ రంగం వాటా రూ.2,84,572 కోట్లు. 2016–17లో తెలం గాణ రాష్ట్ర çస్థూల దేశీయోత్పత్తి.. స్థిర ధరల వద్ద రూ.5,11,286 కోట్లు. స్థిర ధరల వద్ద(2011–12) 2016–17లో రాష్ట్ర స్థూల సమకూరినlవిలువలో ప్రాథమిక రంగం వాటా 16.6 శాతం కాగా, ద్వితీయ రంగం 21.4 శాతం వాటాను, తృతీయ రంగం 62 శాతం వాటాను కలిగున్నాయి. తలసరి ఆదాయం ఆర్థికాభివృద్ధి స్థాయితోపాటు ప్రజల జీవన ప్రమాణాన్ని కొలిచేందుకు తలసరి ఆదాయాన్ని ముఖ్య సూచికగా పరిగణిస్తారు. ముందస్తు అంచనాల ప్రకారం 2016–17లో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,58,360 కాగా, 2015–16లో రూ.1,40,683గా నమోదైంది. 2015–16తో పోల్చితే 2016–17లో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయంలో వృద్ధి 12.6 శాతం. జాతీయ తలసరి ఆదాయం 2015–16లో రూ.94,178 కాగా, 2016–17లో రూ.1,03,818కు పెరిగింది. 2015–16తో పోల్చితే 2016–17లో ప్రస్తుత ధరల వద్ద దేశ తలసరి ఆదాయంలో వృద్ధి 10.2 శాతం మాత్రమే. 2011–12 నుంచిl2016–17 మధ్య కాలంలో దేశ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ. ఈ కాలంలో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య అంతరం పెరగడం తెలంగాణ రాష్ట్ర అధిక ప్రగతిని సూచిస్తుంది. జిల్లా ఆర్థిక వృద్ధి స్థాయిని తెలుసుకునేం దుకుS జిల్లా స్థూల దేశీయోత్పత్తి కొలమానంగా ఉపకరిస్తుంది. 2015–16లో స్థూల జిల్లా దేశీయో త్పత్తిని పరిశీలిస్తే మిగిలిన జిల్లాలతో పోల్చితే హైదరాబాద్, రంగారెడ్డి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల జీడీడీపీ ఎక్కువ. హైదరాబాద్ జీడీడీపీ 2015–16లో రూ.1,36,388 కోట్లు కాగా, రంగా రెడ్డి జీడీడీపీ రూ.82,359 కోట్లుగా, మేడ్చల్– మల్కాజ్గిరి జీడీడీపీ రూ.47,604 కోట్లుగా నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఈ నాలుగు జిల్లాల (హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, సంగారెడ్డి) వాటా 52 శాతంగా ఉంది. దీన్నిబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పై నాలుగు జిల్లాల్లోనే కేంద్రీకృతమయ్యాయని తెలుస్తోంది. రాష్ట్రంలో 31 జిల్లాల తలసరి ఆదాయాల్లో తేడాలు ఉన్నాయి. 2015–16లో రాష్ట్ర సగటు తలసరి ఆదాయం రూ.1,40,683. అయితే నాలుగు జిల్లాల తలసరి ఆదాయం మాత్రం రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది. తలసరి ఆదా యంలో హైదరాబాద్ ప్రథమ స్థానంలో (రూ.2,99,997) ఉండగా, ద్వితీయ స్థానంలో రంగారెడ్డి(రూ.2,88,408), తృతీయ స్థానంలో Üంగారెడ్డి(రూ.1,69,481), నాలుగో స్థానంలో ólుడ్చల్–మల్కాజ్గిరి(రూ.1,62,327) ఉన్నాయి. రాష్ట్రంలో 18 జిల్లాల తలసరి ఆదాయం లక్ష రూపాయల కన్నా తక్కువ. అదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం (రూ.94,178) కన్నా 14 జిల్లాల తలసరి ఆదాయం తక్కువగా ఉంది. ఉపాధి, నిరుద్యోగం 2015–16లో రాష్ట్రంలో మొత్తం శ్రామికుల్లో వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాల వాటా 54 శాతం కాగా, 18.1 శాతం మంది శ్రామికులు పారిశ్రామిక రంగంపై, 27.8 శాతం మంది శ్రామికులు సేవా రంగంపై ఆధారపడి 2015–16లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతా ల్లో వివిధ రంగాలపై ఆధారపడిన శ్రామి కులను పరిశీలిస్తే మొత్తం శ్రామికుల్లో వ్యవ సాయ–అనుబంధ రంగాలపై ఆధారపడిన వారు 73 శాతం కాగా, పారిశ్రామిక రంగంపై ఆధారపడిన వారు 13.7 శాతంగా, సేవా రంగంపై ఆధారపడినవారు 13.4 శాతంగా ఉన్నారు. 2015–16లో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వివిధ రంగాలపై ఆధారపడిన శ్రామికులను పరిశీలిస్తే.. మొత్తం శ్రామికుల్లో వ్యవసాయ– అనుబంధ రంగాలపై ఆధారపడినవారు 6.5 శాతం కాగా, పారిశ్రామిక రంగంపై 29.6 శాతం, సేవా రంగంపై 64.1 శాతం శ్రామిక శక్తి ఆధారపడి ఉంది. 2015–16లో తెలంగాణ రాష్ట్రంలో పనిలో పాల్గొనే శ్రమశక్తి రేటు 56.6 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 62.2 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 46.1 శాతంగా ఉంది. 2015–16లో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 2.7 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 1.2 శాతం, పట్టణ ప్రాంతాల్లో 6.1 శాతం నమోదైంది. వ్యవసాయ రంగం 2014–15లో రాష్ట్ర స్థూల నీటి పారుదల విస్తీర్ణం 25.29 లక్షల హెక్టార్లు కాగా, 2015–16లో 20.28 లక్షల హెక్టార్లకు తగ్గింది. 2015–16లో మొత్తం స్థూల నీటిపారుదల విస్తీర్ణంలో గొట్టపు బావుల వాటా 58.83 శాతంగా, ఇతర బావుల వాటా 30.18 శాతంగా, చెరువుల వాటా 5.96 శాతంగా, కాల్వల వాటా 3.01 శాతంగా ఉంది. 1955–56లో మొత్తం నీటి పారుదల విస్తీర్ణంలో చెరువుల వాటా 64 శాతం కాగా, 1985–86లో 28 శాతానికి, 2012–13లో 8 శాతానికి తగ్గింది. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పవచ్చు. చెరువులు, కాల్వల కింద నీటిపారుదల విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. 2016–17లో ఆహార ధాన్యాల సాగు కింద ఉన్న విస్తీర్ణం 29.29 లక్షల హెక్టార్లు కాగా, 2015–16తో పోల్చితే 2016–17లో విస్తీర్ణంలో వృద్ధి 33 శాతంగా ఉంది. 2015–16లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 51.45 లక్షల టన్నులు కాగా, 2016–17లో 77.93 లక్షల టన్నులు. -
ఇంజనీరింగ్పై క్రేజ్ తగ్గుతోందా?
ఇంజనీరింగ్.. యువతలో క్రేజ్ ఉన్న కోర్సు. ఇంటర్లో చేరిన తొలిరోజు నుంచే ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో సీటు లక్ష్యంగా శ్రమిస్తుంటారు. నాణేనికి మరోవైపు చూస్తే... ఇటీవల కాలంలో బీటెక్పై విద్యార్థుల్లో ఆసక్తి తగ్గుతోందా.. ఇంజనీరింగ్ పూర్తిచేసినా.. ఉద్యోగాలు లభించవనే ఆందోళన పెరుగుతోందా.. అందుకే ప్రత్యామ్నాయ కోర్సులపై విద్యార్థులు దృష్టి సారిస్తున్నారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత రెండు, మూడేళ్లుగా గణాంకాలను పరిశీలిస్తే ఇవి నిజమే అనిపిస్తోంది. ఈ ధోరణిపై ప్రత్యేక కథనం.. కోర్ బ్రాంచ్ల్లో ఎవర్గ్రీన్గా పేర్కొనే మెకానికల్ ఇంజనీరింగ్ మొదలు.. సాఫ్ట్వేర్ నిపుణులను తయారు చేసే సీఎస్ఈ వరకూ.. బ్రాంచ్ ఏదైనా ఆయా కోర్సుల స్వరూపం, ఉద్దేశం ఒకటే. ప్రొడక్ట్ డిజైన్, డెవలప్మెంట్, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్, ప్లానింగ్, తదితర సాంకేతిక నైపుణ్యాలు నేర్పించే కోర్సు ఇంజనీరింగ్. కానీ.. గత కొన్నేళ్లుగా ఇంజనీరింగ్పై ఆసక్తి తగ్గుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీల్లో సైతం ఐఐటీలు, నిట్లు.. దేశంలో ఇంజనీరింగ్ విద్యను అందించడంలో పేరున్న ఇన్స్టిట్యూట్లు. వీటిలో సైతం గత రెండు, మూడేళ్లుగా సీట్లు మిగిలిపోతున్నాయి. గతేడాది జోసా(జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) ఆధ్వర్యంలో ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి ఆరు రౌండ్లుగా కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ.. తుది రౌండ్ తర్వాత 3,100 సీట్లు మిగిలిపోవడం గమనార్హం. ఐఐటీ సీటు హాట్ కేక్ అనుకునే పరిస్థితుల్లో.. ఇలా సీట్లు మిగిలిపోవడం హెచ్ఆర్డీ శాఖను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. సీట్లు మిగిలిపోవడంపై ప్రత్యేకంగా విచారణ కమిటీని నియమించింది. అంతకుముందు ఏడాది (2015–16)లోనూ ఇదే పరిస్థితి. 60 నుంచి 70 శాతం లోపే భర్తీ రాష్ట్రాల స్థాయిలో ఇంజనీరింగ్ ప్రవేశాలు, విద్యార్థుల ఆసక్తిని పరిగణనలోకి తీసుకుంటే.. గత రెండు, మూడేళ్లుగా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ అవుతున్న సీట్ల సంఖ్య మొత్తం సీట్లలో 60 నుంచి 70 శాతం లోపే ఉంటోంది. తెలుగు రాష్ట్రాలే కాకుండా.. జాతీయ స్థాయిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏఐసీటీఈ గణాంకాల ప్రకారం– జాతీయ స్థాయిలో ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్లలో 16 లక్షలకుపైగా సీట్లు ఉంటే భర్తీ అయిన సీట్లు మాత్రం 8.5 లక్షలలోపే. ఇంజనీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోవడానికి రాష్ట్ర స్థాయి, ప్రాంతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లలో ఫ్యాకల్టీ కొరత, లేబొరేటరీ, ల్యాబ్స్, ఇతర మౌలిక సదుపాయాల కొరతే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. సరైన బోధన, మౌలిక సదుపాయాలు లేని కాలేజీల్లో చేరితే తమ భవిష్యత్తు పరంగా ఉద్యోగ, ఉన్నత విద్య పరంగా నేటి పోటీ ప్రపంచంలో రాణించడం కష్టమని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో కౌన్సెలింగ్లో సీటు వచ్చినాlనిరాకరించే పరిస్థితి నెలకొంది. ఐఐటీ, ఎన్ఐటీల్లో ఖాళీలెందుకు? రాష్ట్ర స్థాయి, ప్రాంతీయ స్థాయి కళాశాలల్లో సీట్లు మిగిలిపోవడానికి మౌలిక సదుపాయాల కొరత కారణంగా కనిపిస్తోంది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో సైతం సీట్లు మిగిలిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. అవి.. జోసా పేరుతో చేపడుతున్న ఉమ్మడి కౌన్సెలింగ్లో ప్రాథమ్యాలు సరిగా పేర్కొనకపోవడం.. పర్యవసానంగా సీటు కేటాయింపు పరంగా ఆసక్తి లేని బ్రాంచ్ లభించడం. దీనిలో చేరేందుకు విద్యార్థులు నిరాకరించడం. ఫీజుల పెంపు కూడా విద్యార్థులు ఇంజనీరింగ్కు దూరమయ్యేలా చేస్తున్నాయి. గతేడాది నుంచి ఇంజనీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో కొన్ని ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్ టాప్ ర్యాంకర్లకు, ఇంటర్మీడియెట్ స్థాయిలో బోర్డ్ టాపర్స్కు ఉచిత విద్యను అందిస్తున్నాయి. దీంతో విద్యార్థులు వాటివైపు దృష్టి సారిస్తున్నారు. ఇండస్ట్రీ సర్వేలు కూడా.. ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లలో సీట్లు మిగిలిపోవడానికి సీఐఐ, నాస్కామ్ వంటి సంస్థల సర్వేలు కారణమనే వాదన వినిపిస్తోంది. విద్యార్థుల్లో జాబ్ రెడీ స్కిల్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కంపెనీలు ఆశించిన స్థాయిలో ఉండటంలేదని; కేవలం 7 శాతం నుంచి 10 శాతం మందిలో మాత్రమే నైపుణ్యాలుంటున్నాయన్నది, ఇలాంటివారికే ఉద్యోగాలు లభిస్తున్నాయన్నది పలు సర్వేల సారాంశం. టైర్–2, టైర్–3 ఇన్స్టిట్యూట్లలో మౌలిక సదుపాయాల కొరత విద్యార్థుల ఎంప్లాయబిలిటీ స్కిల్స్పై ప్రభావం చూపుతోందని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇక విద్యార్థుల కోణంలో.. సాఫ్ట్వేర్ రంగం పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. దాంతో భవిష్యత్ అవకాశాల పరంగా ఎన్నో సందేహాలు. ఇలాంటి కారణాలు విద్యార్థులను ఇంజనీరింగ్కు ప్రత్యామ్నాయాలు వెతికేలా చేస్తున్నాయంటున్నారు నిపుణులు. కోర్సు గురించి తెలియకుండానే వాస్తవానికి ఇంజనీరింగ్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ఆ కోర్సు గురించి సరైన అవగాహన ఉండటం లేదు. బెస్ట్ ర్యాంకు సాధిస్తే ఐఐటీల్లో చేరొచ్చు.. ఇంజనీరింగ్ పూర్తిచేస్తే మంచి ఉద్యోగం వస్తుంది అని మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ, ఇంజనీరింగ్ కోర్సు స్వరూపం గురించి తెలుసుకోవడానికి ముందస్తు ప్రయత్నం చేయడంలేదు. దానికి తోడు తల్లిదండ్రుల ఒత్తిడి కూడా ఉంటోంది. కోర్సులో చేరిన తర్వాత తమ అంచనాలకు భిన్నంగా కోర్సు ఉండటంతో విద్యార్థులు మనసు పెట్టి చదవక, రాణించలేకపోతున్నారు. ఐఐటీలు, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో సైతం తొలి ఏడాదిలో ఉత్తీర్ణత శాతం 50 శాతం లోపే ఉండటం ఇందుకు నిదర్శనం. సైన్సెస్పై పెరుగుతున్న ఆసక్తి ఇంజనీరింగ్పై క్రేజ్ తగ్గడానికి విద్యార్థుల్లో సైన్స్ కోర్సులపై ఆసక్తి, అవగాహన పెరగడం మరో కారణం అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇటీవల కాలంలో హైస్కూల్ స్థాయి నుంచే సైన్స్, అందులో పరిశోధనలను ప్రోత్సహించేలా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతూ, స్కాలర్షిప్ పథకాలను సైతం అందిస్తోంది. దాంతో విద్యార్థులు తమ సహజ ఆసక్తి మేరకు సైన్స్ కోర్సులపై దృష్టిసారిస్తున్నారు. దీనికి అనుగుణంగానే సైన్స్ కోర్సులను అందించే ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ల సంఖ్య సైతం పెరుగుతోంది. ఇలాంటి ఇన్స్టిట్యూట్లలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్, బీఎస్–ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ వంటి సైన్స్ కోర్సులను ఆఫర్ చేయడం ద్వారా... ఒక్కసారి కాలు పెడితే పీజీ చేసే వరకు వెనుదిరిగి చూసుకునే అవసరం ఉండదు. ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ను పరిగణనలోకి తీసుకున్నా.. వాటికి మూలం మ్యాథమెటిక్స్, సైన్స్ నుంచే ఉంటుంది. వీటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే విధంగా సంబంధిత నైపుణ్యాలు ఉన్న విద్యార్థులే ఇంజనీరింగ్లో రాణించగలుగుతున్నారు. అంతేకాకుండా ఇంజనీరింగ్ ఔత్సాహిక విద్యార్థులకు ఇచ్చే ముఖ్యమైన సలహా.. ఆసక్తి ఉంటేనే ఇంజనీరింగ్లో చేరాలి. లేకుంటే విలువైన సమయం వృథా అవుతుంది. ప్రస్తుతం సైన్సెస్లోనూ ఎన్నో అవకాశాలున్నాయి. ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, బయొ సైన్సెస్ రంగాల్లో కొత్త ఆవిష్కరణల దిశగా పరిశోధనలు చేసే అర్హతలున్న అభ్యర్థులకు మంచి డిమాండ్ ఉంది. – డాక్టర్ డి.ఎన్.రెడ్డి, డైరెక్టర్, ఈఎస్సీఐ–హైదరాబాద్. ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు మిగిలిపోవడాన్ని.. ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తి తగ్గుతోందని చెప్పడానికి కారణంగా పేర్కొనడం సరికాదు. జోసా విధానంలో ఆన్లైన్ ద్వారా చేపడుతున్న కౌన్సెలింగ్పై విద్యార్థులకు అవగాహన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ర్యాంకు ఆధారంగా ప్రాథమ్యాల ఎంపికలో సరిగా వ్యవహరిస్తే నచ్చేlబ్రాంచ్లో సీటు రావడం ఖాయం. గత ఏడాది సీట్లు మిగలడానికి ప్రధాన కారణం ఇదే. – ప్రొఫెసర్ కె.వి.కృష్ణ, జోసా–2016 ఆర్గనైజింగ్ చైర్మన్. -
రాజ్యాంగ పరిషత్లో మొత్తం సభ్యులు?
భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని (వ్యాపారంపై) ఏ చట్టం ద్వారా తొలగించారు? – 1813 చార్టర్ చట్టం భారత్లో మత మార్పిళ్లకు అవకాశం కల్పించిన చట్టం? – 1813 చార్టర్ చట్టం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులైన తొలి వ్యక్తి? – విలియం బెంటింగ్ లా కమిషన్ చైర్మన్గా నియమితులైన తొలి వ్యక్తి? – లార్డ్ మెకాలే భారత్లో కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా ఏ చట్టాన్ని అభివర్ణిస్తారు? – 1833 చట్టం భారత్లో మొట్టమొదటి వైశ్రాయ్గా నియమితులైన వ్యక్తి? – లార్డ్ కానింగ్ భారతదేశ వ్యవహారాల కార్యదర్శిగా నియమితులైన తొలి వ్యక్తి? – ఎడ్వర్డ్ స్టాన్లీ పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టినవారు? – లార్డ్ కానింగ్ ఏ చట్టం ద్వారా భారత శాసన వ్యవస్థలో రాజులు, జమీందారులకు ప్రాతినిధ్యం కల్పించారు? – 1861 కౌన్సిల్ చట్టం ఏ చట్టం ఆధారంగా భారత్లో హైకోర్టులు ఏర్పాటు చేశారు? – 1861 కౌన్సిల్ చట్టం భారత్లో మొదటి హైకోర్టును ఏర్పాటు చేసిన సంవత్సరం? – 1862, మే 14 భారత్లో కేంద్ర శాసన మండలి సభ్యుల సంఖ్య 10కి తగ్గకుండా 16కి మించకుండా ఉండాలని ఏ చట్టం ద్వారా నిర్ణయించారు? – 1892 చట్టం ఏ చట్టం ద్వారా భారత్లో గవర్నర్ జనరల్ అధికారాలను... శాసన, కార్యనిర్వాహక అధికారాలుగా విభజించారు? – 1853 చార్టర్ భారత ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాల మాగ్నా కార్టాగా ఎవరి ప్రకటనను పేర్కొంటారు? – విక్టోరియా మహారాణి ప్రకటన భారత్లో తొలిసారిగా పరోక్ష ఎన్నికల విధానాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? – 1892 చట్టం మత నియోజకవర్గాల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? – లార్డ్ మింటో గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి సభ్యత్వం పొందిన తొలి భారతీయుడు? – సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఏ చట్టం ద్వారా భారతదేశంలో కేంద్ర శాసన సభ సభ్యుల సంఖ్యను 16 నుంచి 60కు పెంచారు? – 1909 చట్టం ‘‘1909 చట్టం హిందూ–ముస్లింల మధ్య వేర్పాటు బీజాలు వేసి అడ్డుగోడలను సృష్టించింది. దేశ విభజనకు కారణమైంది’’ అని పేర్కొన్నవారు? – నెహ్రూ ఎవరి రాక సందర్భంగా భారత్లో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నిర్మించారు? – 5వ జార్జ్, బ్రిటిష్ రాజు కేంద్ర శాసన సభలో మొదటిసారిగా ద్విసభ విధానాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? – 1919 చట్టం 1919 చట్టం ద్వారా కేంద్ర శాసన మండలికి చైర్మన్గా నియమితులైన తొలి వ్యక్తి? – సర్ ఫ్రెడరిక్ నైట్ భారతదేశంలో తొలిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సభాధ్యక్షుడు (స్పీకర్)? – విఠల్ బాయ్ జే పటేల్ ఉద్యోగుల ఎంపిక కోసం ‘సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? – 1926లో ఏ చట్టం ద్వారా ప్రజలకు విచక్షణా పూరిత ఓటు హక్కు కల్పించారు? – 1919 చట్టం సైమన్ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? – 1927 (1919 చట్టం పరిశీలనకు) రాజ్యాంగ రచన చేయాలని 1927లో మద్రాసు కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? – ఇబ్రహీం అలీ అన్సారి సమాఖ్య అనే పదాన్ని తొలిసారి ఉపయోగించింది? – సైమన్ కమిషన్ 1930, 1931, 1932ల్లో లండన్లో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏ నివేదిక గురించి చర్చించడానికి ఏర్పాటు చేశారు? – సైమన్ కమిషన్ నివేదిక కమ్యూనల్ అవార్డును ప్రకటించిన బ్రిటిష్ ప్రధాని? – రామ్సే మెక్డొనాల్డ్ ఏ చట్టం ద్వారా భారత్లో మొదటి అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేశారు? – 1935 షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) అనే పదం ఏ చట్టం ద్వారా ఉపయోగించారు? – 1935 బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో ఆమోదించిన అతిపెద్ద చట్టం? – 1935 భారత ప్రభుత్వ చట్టం ఏ చట్టం ద్వారా భారత్లో తొలిసారిగా మహిళలకు పరిమిత ఓటు హక్కు కల్పించారు? – 1935 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రస్తుత రాజ్యాంగానికి జిరాక్స్ అని పేర్కొన్నవారు? – కె.టి. షా క్యాబినెట్ మిషన్ ప్లాన్కు నేతృత్వం వహించినవారు? – సర్ ఫెడరిక్ లారెన్స్ ఎవరి సూచనల మేరకు రాజ్యాంగ పరిషత్కు పరోక్ష ఎన్నికలు నిర్వహించారు? – క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశ స్వాతంత్య్ర చట్టాన్ని రూపొందించిన చివరి గవర్నర్ జనరల్? – లార్డ్ మౌంట్ బాటన్ బ్రిటిష్ ప్రభుత్వం భారత్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో వ్యవసాయం, ఆహార శాఖలను నిర్వహించినవారు? – బాబూ రాజేంద్ర ప్రసాద్ భారత్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? – 1946, నెహ్రూ అధ్యక్షతన యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా ఏ చట్టాన్ని భావిస్తారు? –1947 స్వాతంత్య్ర చట్టం రాజ్యాంగ పరిషత్ అనే భావనను తొలిసారిగా 1934లో వ్యక్తీకరించినవారు? –ఎం.ఎన్. రాయ్ 1939లో మహాత్మాగాంధీ ఏ పత్రికలో రాజ్యాంగ పరిషత్ గురించి డిమాండ్ చేశారు? – హరిజన పత్రిక రాజ్యాంగ పరిషత్లో మొత్తం సభ్యుల సంఖ్య? –389 బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి రాజ్యాంగ పరిషత్కు ఎంత మంది ఎన్నికయ్యారు? –292 స్వదేశీ సంస్థానాల నుంచి ఎంతమంది నామినేట్ అయ్యారు? –93 దేశ విభజన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య? – 299 రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు నిర్వహించారు? – 1946, డిసెంబర్ 9 రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించినవారు? – సచ్ఛిదానంద సిన్హా రాజ్యాంగ పరిషత్కు 1946 డిసెంబర్ 11న ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు? – బాబూ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్కు సలహాదారు, తత్వవేత్త, మార్గదర్శి, చిత్తు రాజ్యాంగ నిర్మాత అని ఎవరిని పిలుస్తారు? – బి.ఎన్. రావ్ రాజ్యాంగ పరిషత్ సమావేశంలో అఖిల భారత షెడ్యూల్డు కులాలకు ప్రాతినిధ్యం వహించినవారు? – డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ దేశ విభజన కారణంగా రాజ్యాంగ పరిషత్ సభ్యత్వాన్ని కోల్పోయిన ఏకైక కమ్యూనిస్టు సభ్యుడు? – సోమనాథ్ లహరి ఫ్రాన్స్ సంప్రదాయాన్ని అనుసరించి రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్ఛిదానంద సిన్హాను ప్రతిపాదించినవారు? – జె.బి. కృపలానీ రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా పనిచేసినవారు? – ఫ్రాంక్ ఆంటోని రాజ్యాంగ పరిషత్లో అతిపెద్ద కమిటీ సలహా సంఘం. దాని చైర్మన్ ఎవరు? – సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏ రోజున ఏర్పడింది? – 1947 ఆగస్టు 29 డి.పి. ఖైతాన్ మరణించడంతో ఆయన స్థానంలో రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఎవరిని నియమించారు? – టి.టి.కృష్ణమాచారి -
అత్యుత్తమ వర్సిటీగా ఐఐఎస్సీ
జాతీయం దేశంలోనే పొడవైన సొరంగ మార్గం ప్రారంభం దేశంలోనే పొడవైన సొరంగ మార్గ రహదారి ని ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 2న ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని చెనాన్–నష్రి ప్రధాన రహదారి లో భాగంగా 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గ రహదారిని నిర్మించారు. దీని కోసం ప్రభుత్వం రూ.3720 కోట్లను వెచ్చించింది. దీని నిర్మాణంతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండు గంటలు తగ్గడంతోపాటు ఏటా రూ.99 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని అంచనా. బీఎస్–3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు నిషేధం భారత్ స్టేజ్–4 (బీఎస్–4) కర్బన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని అన్ని వాహనాల అమ్మకాలను, రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ మార్చి 29న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బీఎస్–3 ఇంజన్లు కలిగిన వాహనాలు బీఎస్–4 వాహనాలతో పోల్చితే 80 శాతం అధికంగా కాలుష్య కారకాలను గాలిలోకి విడుదల చేస్తాయి. భారత్, మలేసియాల మధ్య 7 ఒప్పందాలు మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ భారత పర్యటనలో భాగంగా ఏప్రిల్ 1న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో మలేసియాను సందర్శించే భారత పర్యాటకులను ప్రోత్సహించేలా వీసా రుసుము రద్దు, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లో అనుమతి, రెండు దేశాల్లోని కోర్సులకు పరస్పరం గుర్తింపు వంటి అంశాలు ఉన్నాయి. అత్యుత్తమ యూనివర్సిటీగా ఐఐఎస్సీ దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థల ర్యాంకులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఏప్రిల్ 3న విడుదల చేశారు. ఈ ర్యాంకింగ్స్లో ఓవరాల్ కేటగిరీలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ప్రథమ స్థానంలో నిలిచింది. తొలి పది స్థానాల్లో ఏడు ఐఐటీలకు చోటు దక్కింది. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్, ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాస్ ప్రథమ స్థానంలో నిలిచాయి. యూనివర్సిటీ విభాగంలో ఐఐఎస్సీ ప్రథమ స్థానంలో నిలవగా, హెచ్సీయూకి 7వ స్థానం, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 23వ స్థానం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 68వ స్థానం, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి 69వ స్థానం దక్కాయి. హైవేలపై మద్యం నిషేధం జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని సుప్రీంకోర్టు మార్చి 31న ఆదేశించింది. 2016, డిసెంబర్ 15కు ముందు లైసెన్సులు తీసుకున్న (తెలంగాణ, ఏపీతో సహా పలు రాష్ట్రాలు) వారికి మాత్రం కొంత గడువు ఇచ్చింది. రాష్ట్రీయం ఇండియన్ ఐడల్గా రేవంత్ తెలుగు గాయకుడు ఎల్వీ రేవంత్ ఇండియన్ ఐడల్ సీజన్–9 ఫైనల్లో విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 2న ముంబైలో ముగిసిన షోలో విజేతగా నిలిచిన రేవంత్కు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇండియన్ ఐడల్ ట్రోఫీ అందించాడు. మరో తెలుగు యువకుడు రోహిత్ సెకండ్ రన్నరప్గా నిలిచాడు. గతంలో శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్–5 సీజన్ టైటిల్ గెలుచుకున్నాడు. ఏపీలో హెచ్సీఎల్ ఏర్పాటుకు ఒప్పందం విజయవాడలో హెచ్సీఎల్.. బీపీవోను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం, హెచ్సీఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయం ప్రపంచంలో 30 కోట్ల మందికి డిప్రెషన్డిప్రెషన్ సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)వెల్లడించింది. 2005 నుంచి 2015 నాటికి ఈ కేసులు ఏకంగా 18 శాతం మేర పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో డిప్రెషన్కు గురవుతున్నవారిలో 50 శాతం మంది చికిత్స తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ ఏప్రిల్ 2న తెలిపారు. వాతావరణ ఒప్పందాలను రద్దు చేసిన ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనా కాలంలో వాతావరణ మార్పులపై రూపొందించిన విధానాలను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై మార్చి 28న సంతకం చేశారు. దీంతో ఇంధన వెలికితీత, బొగ్గు తవ్వకానికి ప్రతిబంధకాలుగా నిలుస్తున్న పాత విధానాలు రద్దయినట్లు ట్రంప్ పేర్కొన్నారు. తాజా కార్యనిర్వాహక ఉత్తర్వులతో అమెరికా ఇంధన రంగంలో ప్రభుత్వ ప్రమేయాన్ని నిలువరించామన్నారు. విద్యుచ్ఛక్తి ఉద్గారాల నియమాలను సమీక్షించాలని, శిలాజ ఇంధనాల వెలికితీతకు ప్రతిబంధకాలుగా ఉన్న నిబంధనలను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలని అధికార యంత్రాంగాన్ని ట్రంప్ ఆదేశించారు. బ్రెగ్జిట్ ఉత్తర్వులపై బ్రిటన్ ప్రధాని సంతకం యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగేందుకు(బ్రెగ్జిట్) ఉద్దేశించిన అధికారిక ఉత్తర్వులపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే మార్చి 29న సంతకం చేశారు. దీని ప్రకారం ఈయూ నుంచి వైదొలిగే ప్రక్రియపై రెండేళ్లపాటు 27 దేశాలతో సంప్రదింపులు జరుగుతాయి. లిస్బన్ ఒప్పందంలోని 50వ అధికరణం ప్రకారం ఈ ఉత్తర్వు జారీ చేసినట్టు బ్రిటన్ ప్రకటించింది. ఈయూలోని బ్రిటన్ రాయబారి సర్ టిమ్ బారో ఉత్తర్వు ప్రతిని లాంఛనంగా యూరోపియన్ మండలి అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్కు అందించారు. ఈ రెండేళ్లలో ఈయూ సభ్య దేశాలతో వాణిజ్య, ఇతర ఒప్పందాలను బ్రిటన్ తెగదెంపులు చేసుకుంటుంది. కాగా, ఈయా దేశాల పౌరులు బ్రిటన్లో నివసించేందుకు అన్ని హక్కులు ఉన్నాయని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు. రిఫరెండం నిర్వహించాలని స్కాట్లాండ్ నిర్ణయం బ్రిటన్ నుంచి విడిపోయే అంశంపై ప్రజాభిప్రాయాన్ని కోరాలని స్కాట్లాండ్ చట్ట సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ఎడిన్బర్గ్లో మార్చి 28న సమావేశమై.. రిఫరెండానికి అనుకూలంగా ఓటేశారు. ఆర్థికం జీఎస్టీకి లోక్సభ ఆమోదం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన నాలుగు అనుబంధ బిల్లులకు లోక్సభ మార్చి 29న ఆమోదం తెలిపింది. సెంట్రల్ జీఎస్టీ బిల్లు–2017, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ బిల్లు–2017, యూనియన్ టెరిటరీ జీఎస్టీ బిల్లు–2017, జీఎస్టీ పరిహార(రాష్ట్రాలకు) బిల్లు–2017లను లోక్సభ ఆమోదించింది. జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఐటీ రిటర్న్స్ దాఖలుకు కొత్తగా ఐటీఆర్ 1 ఫామ్ ఐటీ రిటర్న్స్ను సులభంగా దాఖలు చేసేందుకు వీలుగా ఒకే ఒక్క పేజీతో కూడిన ఐటీఆర్ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చి 31న నోటిఫై చేసింది. ప్రస్తుతం ఉన్న ఏడు పేజీల ఐటీఆర్ పత్రం స్థానంలో ఆదాయపన్ను శాఖ కొత్తగా ఫామ్–1 సహజ్ను తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ జీతం పెంపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్తోపాటు డిప్యూటీ గవర్నర్ల జీతాలను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గవర్నర్, డిప్యూటీ గవర్నర్ల మూల వేతనాలు ఏకంగా 100 శాతం మేర పెరిగాయి. తాజా పెంపుతో ఉర్జిత్ పటేల్.. నెలకు రూ.2.50 లక్షల జీతం అందుకోనుండగా.. డిప్యూటీ గవర్నర్లు రూ.2.25 లక్షలు పొందనున్నారు. అతి పెద్ద బ్యాంక్గా అవతరించిన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఎస్బీఐ ప్రపంచంలోని టాప్–50 బ్యాంకుల్లో ఒకటిగా అవతరించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ఎక్స్.. రాకెట్ పునర్వినియోగ పరీక్ష విజయవంతం అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సేవల ప్రైవేట్ కంపెనీ స్పేస్ఎక్స్.. ఒకసారి ఉపయోగించిన రాకెట్ను మరోసారి విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి మార్చి 30న ఫాల్కాన్–9 అనే పునర్వినియోగ రాకెట్ ద్వారా సమాచార ప్రసార ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. 50 వేల ప్రదక్షిణలు చేసిన వ్యోమనౌక నాసాకు చెందిన మార్స్ రికాన్సెన్స్ ఆర్బిటర్ (ఎంఆర్వో) అంగారకుడి చుట్టూ 50 వేలసార్లు తిరిగింది. దీన్ని 2005లో ప్రయోగించారు. ఇది ఇప్పటికీ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని శాస్త్రవేత్తలు మార్చి 29న తెలిపారు. వార్తల్లో వ్యక్తులు దక్షిణాఫ్రికా ఉద్యమ నేత అహ్మద్ కత్రడా కన్నుమూతయ భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష వ్యతిరేకోద్యమ నేత అహ్మద్ కత్రడా (87) జోహన్నెస్బర్గ్లో మార్చి 27న మరణించారు. ఆయన నెల్సన్ మండేలా అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పేరొందారు. కత్రడా 2005లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం అందుకున్నారు. ఎస్ఐగా నియమితులైన తొలి హిజ్రా తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ప్రీతికా యాషిని దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ సబ్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. ఆమెకు ధర్మపురి (తమిళనాడు)లో పోస్టింగ్ ఖరారు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రీతి పటేల్కు ప్రవాసీ సమ్మాన్ పురస్కారం భారత సంతతికి చెందిన బ్రిటన్ సీనియర్ మంత్రి ప్రీతి పటేల్ మార్చి 27న ప్రవాసీ భారతీయ సమ్మాన్–2017 పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం ఆమె బ్రిటన్ అంతర్జాతీయ వ్యవహారాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. క్రీడలు ఇండియా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న పీవీ సింధు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్ను పీవీ సింధు గెలుచుకుంది. న్యూఢిల్లీలో ఏప్రిల్ 2న జరిగిన ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్)ను సింధు ఓడించింది. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ భారత్ సొంతం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) టెస్ట్ సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. మార్చి 28న ముగిసిన చివరి టెస్ట్ మ్యాచ్ను భారత్ గెలుచుకుంది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ను 2–1 తేడాతో భారత్ నెగ్గింది. రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. మయామి మాస్టర్ టైటిల్ గెలుచుకున్న ఫెడరర్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఫ్లోరిడాలో ఏప్రిల్ 3న జరిగిన ఫైనల్లో రాఫెల్ నాదల్(స్పెయిన్)ను ఓడించాడు. -
Competitive guidance- General English
Directions (Q. 1-10): Read each sentence to find out whether there is any grammatical mistake / error in it. The error, if any, will be in one part of the sentence. Mark the number of that part with error as your answer. If there is 'No error', mark (5) as your answer. 1. A great deal of human invention since the last 400 years (1)/ has been directed to taming the power hidden in nature, (2)/ and to channeling it to study sources of energy (3)/ that can drive machines. (4)/ No error (5) 2. Having spent her childhood in Tamilnadu (1)/ she has developed (2)/ her ability to converse (3)/ in Tamil properly good. (4)/ No error (5) 3. He is too proud (1)/ of his position (2)/ that he looks down upon (3)/ all his subordinates. (4)/ No error (5) 4. We must (1)/ set forth this condition (2)/ in the agreement (3)/ we are. (4)/ No error (5) 5. Half as many people (1)/ were infected this year alone (2)/ than have died (3)/ in the whole epidemic to date. (4)/ No error (5) 6. This herculean task required (1)/ that a large number of consultants (2)/ spent about thirty percent of their time (3)/ on knowledge-building. (4)/ No error (5) 7. This is expected to cause an end to a month (1)/ of political turmoil (2)/ caused by the (3)/ commission's report. (4)/ No error (5) 8. Oil is now so expensive that (1)/ India will have to cut (2)/ subsidies instead face running out (3)/ of funds to import oil. (4)No error. (5) 9. The revised government's (1) /guidelines have reduced (2)/ the number of mergers (3)/ taking place among banks. (4) No error (5) 10. A majority of banks (1)/ today uses technology (2)/ to reach out to those (3)/living in rural areas. (4) No error (5) Directions (Q. 11-15): Rearrange the following six sentences(A), (B), (C), (D), (E) and (F) in a proper sequence to form a meaningful paragraph and then answer the questions given below. A) This reduces attacks like the one's mentioned above, although these methods aren't commercially applicable as costs of implementation are high. B) Between the artifact and the real biological target and gain access to sensitive data/materials. C) This reduces their real world application and hence makes biometrics insecure until these methods are commercially viable. D) Biometric spoofing is a method of fooling a biometric identification management system, where a counterfeit mold is presented in front of the biometric scanner. E) Using the principle of pulse oximetry the liveliness of the test subject is taken into account by measure of blood oxygenation and the heart rate. F) This counterfeit mold emulates the unique biometric attributes of an individual so as to confuse the system. 11. What is the FIRST sentence after rearrangement? 1) A 2) B 3) C 4) D 5) F 12. What is the SECOND sentence after rearrangement? 1) A 2) B 3) C 4) D 5) F 13. What is the THIRD sentence after rearrangement? 1) A 2) B 3) D 4) E 5) F 14. What is the FOURTH sentence after rearrangement? 1) A 2) B 3) C 4) D 5) E 15. What is the LAST sentence after rearrangement? 1) A 2) B 3) C 4) D 5) E Directions (Q. 16-20): Each question below has a blank / two blanks, each blank indicating that something has been omitted. Choose the word/ set of words from the five options for each blank that best fits the meaning of the sentence as a whole. 16. A solution may not yet be in ----------, but the important thing was to get a --------- between them started. 1) Future … conflict 2) Near … debate 3) Sight … dialogue 4) Seeing … conversation 5) Vision … discussion 17. His attitude to his boss was so ------------ that it caused a ------------ deal of repulsion. 1) Arrogant … better 2) Floppy … shaky 3) Sycophantic … good 4) Hybrid … reserved 5) Superior … preserved 18. The influence of the environment on man is revealed by the ------------ study. 1) Ecological 2)Anthropology 3) Epigraphic 4) Endemic 5) Numismatic 19. She had a terrible night caused by a(n) ----------- during her sleep. 1) Debility 2) Delusion 3) Obsession 4)Possession 5) Incubus Key 1) 1 2) 4 3) 5 4) 5 5) 3 6) 3 7) 1 8) 3 9) 1 10) 2 11) 4 12) 5 13) 2 14) 5 15) 3 16) 3 17) 3 18) 1 19) 5 -
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి ఎవరు?
1.2017, అక్టోబర్ 28న ఫిఫా అండర్–17 ప్రపంచకప్ ఫుట్బాల్ ఫైనల్ పోటీని ఎక్కడ నిర్వహిస్తారు? – కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియంలో 2.2017, మార్చి 18న ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? త్రివేంద్ర సింగ్ రావత్ 3.2017 జనవరిలో మారిషస్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? – ప్రవింద్ జగన్నాథ్ 4. 2017, జనవరి 17న యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? – ఆంటోనియో టజానీ (ఇటలీ) 5. 2017, జనవరి 7న ఘనా అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? – నానా అకుఫో అడ్డో 6. జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) చైర్మన్గా 2016 డిసెంబర్లో ఎవరు నియమితులయ్యారు? – వి.కె.శర్మ 7. భారత్, రష్యా నౌకాదళాల సంయుక్త విన్యాసం పేరు? – ఇంద్ర నేవీ 8. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)–2016 విజేత? – సింగపూర్ స్లామర్స్ 9. ఆంథోనీ లేక్ ఏ అంతర్జాతీయ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్? – అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) 10. పౌలో జెంటిలోని ఏ దేశానికి ప్రధానమంత్రి? –ఇటలీ 11. ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడిగా మూడోసారి ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? – ప్రఫుల్ పటేల్ 12. బిల్ ఇంగ్లిష్ ఇటీవల ఏ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు? – న్యూజిలాండ్ 13. 2016, డిసెంబర్ 14న ఉజ్బెకిస్తాన్ రెండో అధ్యక్షుడిగా ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టారు? – షవ్కత్ మిర్జియోయేవ్ 14. పాకిస్తాన్ ప్రస్తుత సైన్యాధిపతి ఎవరు? – ఖమర్ జావేద్ బజ్వా 15. 2016 సంవత్సరానికి మూర్తీదేవి పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు? – ఎం.పి.వీరేంద్రకుమార్ 16. 2016 సంవత్సరానికి ప్రపంచ సంస్కృత అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? – జార్జి కార్డోనా (అమెరికా) 17. 2016, డిసెంబర్ 13న మరణించినlథామస్ షెల్లింగ్ ఏ దేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త? – అమెరికా 18. ఇటీవల మరణించిన హాఫ్డన్ మాహ్లర్ 1973 నుంచి 1988 వరకు ఏ సంస్థకు డైరెక్టర్ జనరల్గా పనిచేశారు? – ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్వో) 19. 2016 సంవత్సరానికి ఐసీసీ మహిళా ఓడీఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది? – సుడీ బేట్స్ (న్యూజిలాండ్) 20. 2016, డిసెంబర్ 31న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? – అనిల్ బైజాల్ 21. 2017, జనవరి 25న పద్మశ్రీ పురస్కారాలను ఎంతమందికి ప్రకటించారు? – 75 22. 2017 సంవత్సరానికి మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం పొందిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి? – సుందర్లాల్ పట్వా 23. 2017 జనవరిలో నలంద విశ్వవిద్యాలయం నూతన ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? – విజయ్ భట్కర్ 24. భారత విదేశాంగ కార్యదర్శిగా మరో ఏడాదిపాటు ఎవరు కొనసాగనున్నారు? – ఎస్. జైశంకర్ 25. 2017 జనవరిలో చెన్నై ఓపెన్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? – రాబర్టో బతిస్తా అగత్ (స్పెయిన్) 26. చెన్నై ఓపెన్ టెన్నిస్ పురుషుల డబుల్స్ టైటిల్ విజేతలు? – రోహన్ బొపన్న, జీవన్ నెడుంచెజియన్ 27. 2017 జనవరిలో బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ మహిళల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? – సానియా మీర్జా (భారత్), బెథాని మాటెక్ శాండ్స్ (అమెరికా) 28. 2016 డిసెంబర్లో బెయిటన్ కప్ హాకీ టోర్నమెంటును గెలుచుకున్న జట్టు? – ఇండియన్ ఆయిల్ 29. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన బ్రాడ్లే విగ్గిన్స్ ఏ క్రీడలో ఐదు ఒలింపిక్ బంగారు పతకాలు సాధించాడు? – సైక్లింగ్ 30. ఇటీవల టెన్నిస్ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించిన అనా ఇవనోవిచ్ ఏ దేశ క్రీడాకారిణి? – సెర్బియా 31. తిరుపతిలో తొలిసారి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఏ సంవత్సరంలో జరిగాయి? – 1983 32. 2016, డిసెంబర్ 27న మరణించిన శ్రీలంక మాజీ ప్రధానమంత్రి ఎవరు? – రత్నసిరి విక్రమనాయకే 33. థాయ్లాండ్ ప్రస్తుత రాజు ఎవరు? – మహా వజ్రలాంగ్కార్న్ 34. స్ట్రెయిట్స్ టైమ్స్ పత్రిక ‘2016 ఏషియన్ ఆఫ్ ది ఇయర్’గా ఎవరిని ఎంపిక చేసింది? – ఫ్లిప్కార్ట్ సంస్థ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ 35. మెర్కోసర్ కూటమి 2016, డిసెంబర్ 1న ఏ దేశాన్ని బహిష్కరించింది? – వెనెజువెలా 36. మెర్కోసర్ కూటమిలోని ప్రస్తుత నాలుగు సభ్యదేశాలేవి? – అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వే 37. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) 2016 సంవత్సరానికి ఉత్తమ పురుష అథ్లెట్గా ఎవరిని ప్రకటించింది? – ఉసేన్ బోల్ట్ (జమైకా) 38. ఐఏఏఎఫ్ ఉత్తమ మహిళా అథ్లెట్ అల్మాజ్ అయనా ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి? – ఇథియోపియా 39. 2016 రియో ఒలింపిక్స్లో అల్మాజ్ అయనా ఏ క్రీడాంశంలో బంగారు పతకం సాధించింది? – మహిళల 10,000 మీటర్ల పరుగు పందెంలో. 40. ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రి ఎవరు? – బెర్నార్డ్ కజెనేవ్ 41. 2016 సంవత్సరానికి అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి విజేత ఎవరు? – కెకాషన్ బసు 42. 2016 ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ విజేత? –అట్లెటికో డి కోల్కతా 43. 2016 డిసెంబర్లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో 199 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగిన భారత బ్యాట్స్మన్? – కె.ఎల్.రాహుల్ 44. ప్రస్తుత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్ ఎవరు? – రాజీవ్ జైన్ 45. ఇటీవల భారత్లో పర్యటించిన తజకిస్తాన్ దేశాధ్యక్షుడు ఎవరు? – ఎమోమలి రహమాన్ 46. ‘మిస్ వరల్డ్ 2016’ విజేత? – స్టెఫాని డెల్ వాలె (పోర్టోరికో) 47. ప్రియాంక చోప్రా ఇటీవల ఏ రాష్ట్ర పర్యాటక ప్రచారకర్తగా ఎంపికయ్యారు? – అసోం 48. భారత్ ఏ దేశంతో కలిసి సంయుక్తంగా ‘ఎకువెరిన్’ సైనిక విన్యాసం నిర్వహించింది? – మాల్దీవులు 49. ‘లెజెండ్’ పురస్కారాన్ని పొందిన భారత మహిళా బాక్సర్? – మేరీకోమ్ 50. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ బ్యాట్స్మన్? – కరుణ్ నాయర్ 51. 2016 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పాపినేని శివశంకర్కు ఏ పుస్తకానికి లభించింది? – రజనీ గంధ 52. 2016 లండన్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్ విజేత? – వెస్లీ సో (అమెరికా) 53. 2016 జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత? – శంఖ ఘోష్ 54. నాగళ్ల గురుప్రసాదరావుకు ఇటీవల ఏ అవార్డు లభించింది? – భాషా సమ్మాన్ పురస్కారం 55. 2016 సంవత్సరానికి ‘బాలన్ డి ఓర్’ అవార్డు గెలుచుకున్న ఫుట్బాల్ క్రీడాకారుడు? – క్రిస్టియానో రొనాల్డో -
జాబ్ పాయింట్
తెలుగు రాష్ట్రాల్లో తపాలా పోస్టులు : ఆంధ్రప్రదేశ్లో-1126 తెలంగాణలో -645 తెలుగు రాష్ట్రాల్లో 1771 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు పోస్టల్ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్లోని వివిధ తపాలా సర్కిళ్లలో 1126, తెలంగాణలోని వివిధ సర్కిళ్లలో 645 ఉన్నాయి. పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్ (ప్యాకర్/బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (బీపీఎం)/ఎండీ/ఎంసీ) పోస్టుల సంఖ్య: 1771 (ఆంధ్రప్రదేశ్లో 1126, తెలంగాణలో 645) ► సర్కిళ్ల వారీ పోస్టుల సంఖ్య: ఆంధ్రప్రదేశ్లో... అనంతపురం –24, చిత్తూరు –10, వైఎస్సార్ కడప –65, హిందూపురం –42, కర్నూలు –68, నంద్యాల –42, ప్రొద్దుటూరు –32, తిరుపతి –57, భీమవరం –54, ఏలూరు–35, గుడివాడ –42, గూడూరు –23, గుంటూరు –16, మచిలీపట్నం –24, నరసరావుపేట –33, నెల్లూరు– 63, ప్రకాశం– 128, తాడేపల్లిగూడెం –22, తెనాలి–30, విజయవాడ–46, అమలాపురం –26, అనకాపల్లి –77, కాకినాడ –20, పార్వతీపురం –32, రాజమండ్రి –22, శ్రీకాకుళం –54, విశాఖపట్నం –3, విజయనగరం –36. వీటిలో అన్రిజర్వుడు –625, ఓబీసీ –284, ఎస్సీ –126, ఎస్టీ –91. తెలంగాణలో .. ఆదిలాబాద్ –48, హన్మకొండ –13, కరీంనగర్ –29, ఖమ్మం –97, మహబూబ్నగర్ –40, నల్గొండ –25, నిజామాబాద్ –67, పెద్దపల్లి –27, ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ –26, సూర్యాపేట –39, వనపర్తి –27, వరంగల్ –17, హైదరాబాద్ సిటీ –29, హైదరాబాద్ సార్టింగ్ డివిజన్ –66, హైదరాబాద్ సౌత్ఈస్ట్ –17, మెదక్ –20, సంగారెడ్డి –21, సికింద్రాబాద్ –37. వీటిలో అన్రిజర్వుడ్ 356, ఓబీసీ 151, ఎస్సీ –86, ఎస్టీ –52. అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఉన్నత విద్య చదివినప్పటికీ దానికి ప్రత్యేక మార్కులేమీ ఉండవు. సైకిల్ వచ్చి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థలో కంప్యూటర్ కోర్సు చదివి ధ్రువపత్రం పొంది ఉండాలి. అభ్యర్థులు ఏ బ్రాంచ్ పరిధిలో పోస్టుకు ఎంపికవుతారో ఆ బ్రాంచ్ పరిధిలోని గ్రామంలోనే నెల వ్యవధిలోపు నివాసం ఏర్పాటు చేసుకోవాలి. బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (బీపీఎం) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.25 వేలకు, రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు రూ.10 వేలకు ఫెడిలిటీ గ్యారంటీ బాండ్ ఇవ్వాలి. ఉద్యోగానుభవాన్ని ఎంపికలో పరిగణించరు. వయోపరిమితి: 18–40 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేర వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.100. అభ్యర్థులు ఏదేనీ పోస్టాఫీజులో ఫీజు చెల్లించి రసీదు నెంబర్ను పీఓ కౌంటర్లో తెలియజేయాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: అభ్యర్థులు www.indiapost.gov.in (or) www.appost.in/gdsonline వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: పదో తరగతి మార్కుల శాతాన్ని అనుసరించి మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ప్రారంభం: మార్చి 18, 2017. చివరితేదీ: ఏప్రిల్ 19, 2017. వెబ్సైట్స్: www.indiapost.gov.in (or) www.appost.in/gdsonline ► ఎస్బీఐలో 255ఉద్యోగాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన పరిధిలోని వేర్వేరు శాఖల విభాగాల్లో 255 స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. పోస్టుల పేరు – ఖాళీలు: స్పెషలిస్ట్ హెడ్ –1, ప్రోడక్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రీసెర్చ్ హెడ్ –1, ఆపరేషన్స్ హెడ్ –1, మేనేజర్ (బిజినెస్ డెవలప్మెంట్) –1, మేనేజర్ (బిజినెస్ ప్రాసెస్) –1, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ –4, అక్వైజిషన్ రిలేషన్షిప్ మేనేజర్ –21, రిలేషన్ షిప్ మేనేజర్ –120, రిలేషన్షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) –15, ఇన్వెస్ట్మెంట్ కౌన్సిలర్ –25, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ –65. వీటిలో కొన్ని విభాగాల్లోని పోస్టులను రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. వయోపరిమితి: మార్చి 1, 2017 నాటికి స్పెషలిస్ట్ హెడ్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రీసెర్చ్ హెడ్ అభ్యర్థులకు 40–52 ఏళ్లు, ఆపరేషన్స్ హెడ్ అభ్యర్థులకు 35–45, మేనేజర్ (బిజినెస్ డెవలప్మెంట్), మేనేజర్ (బిజినెస్ ప్రాసెస్), సెంట్రల్ రీసెర్చ్ టీమ్ అభ్యర్థులకు 30–40, అక్వైజిషన్ రిలేషన్షిప్ మేనేజర్ అభ్యర్థులకు 22–35, రిలేషన్షిప్ మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ కౌన్సిలర్ అభ్యర్థులకు 23–35, రిలేషన్ షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) అభ్యర్థులకు 25–40, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు 20–35 ఏళ్లు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. అర్హతలు: అభ్యర్థులు ఆయా విభాగాల పోస్టు లను అనుసరించి ఎంబీఏ/పీజీడీఎం/డిగ్రీ/ పీజీ చేసి ఉండాలి. దీంతోపాటు నిబంధనల మేర ఉద్యోగానుభవం తప్పనిసరి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100. ఫీజు ఆన్లైన్ ద్వారా (డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్) మాత్రమే చెల్లించాలి. దరఖాస్తు విధానం: అభ్యర్థులు www.sbi.co.in/careers వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు నింపాలి. దానిని ప్రింటవుట్ తీసుకొని సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు , ఫీజు రిసీప్ట్ను జతచేసి ఒక ఎన్వలప్ కవర్లో ఉంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్, థర్డ్ ఫ్లోర్, అట్లాంటా బిల్డింగ్, నారీమన్ పాయింట్, ముంబై – 400021 చిరునామాకు గడువులోగా పంపాలి. దరఖాస్తు చేసే పోస్టు పేరును విధిగా కవర్ పైన రాయాలి. ఎంపిక విధానం: మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ వేతనం: అభ్యర్థుల విద్యార్హతలు, ఉద్యోగానుభవం అనుసరించి వేతనం నిర్ణయిస్తారు. దరఖాస్తుల ప్రారంభం: మార్చి 24, 2017. ఆన్లైన్లో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసుకోవడానికి: ఏప్రిల్ 10, 2017. పోస్టు ద్వారా హార్డ్ కాపీలు పంపడానికి: ఏప్రిల్ 13, 2017. మరిన్ని వివరాలకు వెబ్సైట్: www.sbi.co.in ► ఎన్ఐసీఎల్లో 205 ఉద్యోగాలు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. స్కేల్–1 ఆఫీసర్స్ కేడర్లో 205 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఏవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 205 (అన్ రిజర్వుడ్ – 113, ఎస్సీ –31, ఎస్టీ–16, ఓబీసీ – 45) వేతన శ్రేణి: ప్రారంభంలో బేసిక్ పే రూ.32,975 (రూ,32795–1610 (14)–రూ.55335–1745 (4)–రూ.62315) ఉంటుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు దాదాపు రూ.51,000 వేతనం అందుతుంది. అర్హతలు: ఏప్రిల్ 20, 2017 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం) మార్కులతో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. వయోపరిమితి: మార్చి 1, 2017 నాటికి కనీసం 21 ఏళ్లు ఉండి 30 ఏళ్లు మించరాదు. అభ్యర్థులు మార్చి 2, 1987 కంటే ముందు, మార్చి 1, 1996 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ విధానంలో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్స్ టెస్టులు, ఇంటర్వ్యూ ఆధారంగా. మొదటి దశ... ప్రిలిమినరీ ఎగ్జామ్: దీన్ని 100 మార్కులకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. గంట (60 నిమిషాలు) వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. మూడు విబాగాల నుంచి ప్రశ్నలడుగుతారు. అవి.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ (35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 మార్కులు). మెయిన్ ఎగ్జామినేషన్: ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున కేటగిరీలవారీగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇది మొత్తం 230 మార్కులకు ఉంటుంది. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 30 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. రెండు టెస్ట్లనూ ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్లో భాగంగా రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ల నుంచి 40 ప్రశ్నల చొప్పున అడుగుతారు. డిస్క్రిప్టివ్ టెస్ట్లో భాగంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ (ఎస్సే, ప్రెసిస్ అండ్ కాంప్రహెన్షన్) నుంచి మూడు ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ టెస్ట్లో అభ్యర్థులు ప్రతి సెక్షన్లోనూ నిర్దేశిత మార్కులు సాధించాలి. వీరిని మాత్రమే డిస్క్రిప్టివ్ టెస్ట్కు అనుమతిస్తారు. చివరి ఎంపిక ఇలా: ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ విభాగాలు), ఇంటర్వూ్యలకు 80:20 లెక్కన వెయిటేజీ ఇస్తారు. వీటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.600 (ఇంటిమేషన్ ఛార్జీలు కలిపి) నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.100 ఇంటిమేషన్ ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/రంగారెడ్డి, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు. ► ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: మార్చి 30, 2017 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 20, 2017 దరఖాస్తు ఫీజుల చెల్లింపు: మార్చి 30 – ఏప్రిల్ 20 వరకు మొదటి దశ ఆన్లైన్ పరీక్ష: జూన్ 3, 4, 2017 రెండో దశ ఆన్లైన్ పరీక్ష: జూలై 2, 2017 వెబ్సైట్: www.nationalinsuranceindia.com ► డీజీసీఏలో 24 పోస్టులు భారత పౌర విమానయాన శాఖలోని డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) 24 పైలెట్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 24 పోస్టులు: ఏరోప్లేన్ విభాగంలో.. డిప్యూటీ చీఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ –1, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్స్–8, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్స్–14, హెలీకాఫ్టర్ విభాగంలో.. ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ –1 వయోపరిమితి: డిప్యూటీ చీఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ – 55 ఏళ్లు, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్– 50 ఏళ్లు, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ (ఏరోప్లేన్/హెలీకాఫ్టర్)–40 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేర వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హతలు: డీజీసీఏ జారీ చేసిన ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలెట్ లైసెన్స్, నిబంధనల మేర ఉద్యోగానుభవం. వేతనం: ఆయా విభాగాల పోస్టులను అనుసరించి రూ.1,74,250 – 5,99,330 దరఖాస్తు విధానం: అభ్యర్థులు www.dgca.nic.in వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నింపి ఓ కవర్లో ఉంచి రిక్రూట్మెంట్ సెల్, బి–బ్లాక్, రూమ్ నెం. బి–12, ఆపోజిట్ సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్, అరబిందోమార్గ్, న్యూఢిల్లీ– 110003 చిరునామాకు గడువులోగా చేరేలా పంపాలి. దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 11, 2017. వెబ్సైట్: www.dgca.nic.in ► రైట్స్ లిమిటెడ్లో 16 పోస్టులు మినీ రత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లోని ఆర్ఐటీఈఎస్ (రైట్స్) కాంట్రాక్ట్ పద్ధతిలో 16 ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టు పేరు: ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ మొత్తం పోస్టులు: 16 విభాగాల వారీ ఖాళీలు: ఇంజనీర్ (సివిల్)–4, టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) –3, క్యాడ్ ఆపరేటర్ (సివిల్)–9. వయోపరిమితి: మార్చి 1, 2017 నాటికి 32 ఏళ్లు. అర్హతలు: డిగ్రీ/డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్), ఎంటెక్ (సాయిల్ మెకానిక్స్). జనరల్ అభ్యర్థులు ఫస్ట్క్లాస్లో పాసై ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు మార్కుల శాతంలో సడలింపు ఉంటుంది. దీంతోపాటు ఆయా పోస్టులను బట్టి నిబంధనల మేరకు ఉద్యోగానుభవం తప్పనిసరి. వేతనం: ఇంజనీర్ (సివిల్) రూ.16,974, టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) రూ.11,670, క్యాడ్ ఆపరేటర్ రూ.10,344 దరఖాస్తు ఫీజు: లేదు దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా టజ్టీ్ఛటl్టఛీ.ఛిౌఝలో అప్లికేషన్ను పూర్తిచేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి. దానికి అభ్యర్థుల విద్యార్హతలు, తదితర ధ్రువపత్రాల నకళ్లను అటెస్టేషన్ చేయించి జత చేయాలి. వీటిని అసిస్టెంట్ మేనేజర్ (పీ) /ఆర్ఈసీటీటీ, రైట్స్ లిమిటెడ్, రైట్స్ భవన్, ప్లాట్ నెం.1, సెక్షన్ –29, గుర్గావ్ –122001, హరియాణా చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి. ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికైన అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 9, 2017. పోస్టు ద్వారా హార్డ్ కాపీలు పంపడానికి: ఏప్రిల్ 20, 2017. వెబ్సైట్: ritesltd.com -
‘ఎగ్జిట్ పోల్’ అంటే?...
విశ్వాస తీర్మానం: రాజ్యాంగంలో, పార్లమెంటరీ నియమ నిబంధనల్లో ఎక్కడా దీని గురించి ప్రస్తావించలేదు. కొన్ని కారణాల వల్ల అధికార పార్టీ మెజారిటీ కోల్పోతే.. మెజారిటీని నిరూపించుకో వాల్సిందిగా ప్రధానమంత్రిని రాష్ట్రపతి కోరతారు. అప్పుడు మంత్రిమండలిపై విశ్వాసం ప్రకటించాల్సిందిగా ప్రధాని సభను కోరతారు. మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది విశ్వాసం ప్రకటిస్తే ప్రభుత్వం నిలబడుతుంది. మొదటిసారి లోక్సభలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధాని చౌదరి చరణ్సింగ్. అయితే తీర్మానం ఓటింగ్కి రాకముందే ఆయన రాజీనామా చేశారు. 16వ లోక్సభ వరకు విశ్వాస తీర్మానాలను 12 సార్లు ప్రవేశపెట్టారు. అందులో మూడు మాత్రమే నెగ్గాయి. విశ్వాస తీర్మానం ద్వారా అధికారం కోల్పోయిన మొదటి ప్రధాని వి.పి.సింగ్ (1990) కాగా, రెండో ప్రధాని దేవెగౌడ (1997), మూడో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. అభిశంసన తీర్మానం: ఈ తీర్మానాన్ని ఉభయ సభల్లో ఎందులోనైనా ప్రవేశపెట్టవచ్చు. దీన్ని కేవలం ఒక మంత్రి లేదా మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టవచ్చు. నిర్దిష్ట అంశంపై ప్రభుత్వాన్ని విమర్శించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. మంత్రులపై తీవ్ర అభియోగాలు వచ్చినçప్పుడు, బాధ్యతల పట్ల ఉదాసీనంగా వ్యవహరించినప్పుడు వారిని హెచ్చరించేందుకు ఈ తీర్మానాన్ని ఉపయోగిస్తారు. దీనికి సంబంధించి ప్రత్యేక నియమావళి లేదు. పాయింట్ ఆఫ్ ఆర్డర్: ఇది ఒక అసాధారణ పద్ధతి. స్పీకర్ దీన్ని అనుమతించిన పక్షంలో అప్పటి వరకు జరుగుతున్న సభా కార్యక్రమాలన్నింటినీ పక్కనపెట్టి సంబంధిత అంశాన్ని చర్చిస్తారు. ఇంకా పేర్కొన ని తీర్మానం: సభాధ్యక్షుడి అనుమతి పొందిన తీర్మాన ప్రవేశానికి ఒక నిర్దిష్ట సమయం కేటాయించకుంటే.. దాన్ని ‘ఇంకా పేర్కొనని తీర్మానం’ అంటారు. రూల్ 377 కింద ప్రస్తావన (లేదా) ప్రత్యేక ప్రస్తావన: ఏవైనా అంశాలను మిగిలిన ప్రక్రియల ద్వారా సభలో ప్రస్తావించేందుకు వీలు కానప్పుడు వాటిని రూల్ 377 కింద సభ దృష్టికి తీసుకురావచ్చు. రాజ్యసభలో ఈ విధానాన్ని స్పెషల్ మెన్షన్ అంటారు. దీని కోసం సభ సెక్రటరీ జనరల్ను లిఖితపూర్వకంగా అభ్యర్థించాలి. లేమ్ డక్ సెషన్: లోక్సభకు ఎన్నికలు జరిగిన తర్వాత, రద్దయిన లోక్సభలో సభ్యులుగా ఉండి.. ప్రస్తుత లోక్సభకు ఎన్నికకాని సభ్యులు, కొత్తగా ఎన్నికైన సభ్యులతో కలిపి చిట్టచివర ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. దీన్నే లేమ్ డక్ సెషన్ అంటారు. ఇది భారతదేశంలో అమల్లో లేదు. ఫిలిబస్టరింగ్: శాసనసభ కార్యక్రమాలు జరగకుండా, అలాగే ఒక బిల్లు ఆమోదం పొందకుండా చేసేందుకు సభ్యులు ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలిక ఉపన్యాసం, ఇతరత్రా చర్యలకు దిగి నిర్ణీత గడువు ముగిసేలా చేస్తుంటారు. దీన్నే ఫిలిబస్టరింగ్ అంటారు. గెర్రిమాండరిం : ఒక అభ్యర్థి తన విజయావకాశాలను మెరుగుపర్చుకునేలా నియోజకవర్గ సరిహద్దులను మార్చే పద్ధతిని గెర్రిమాండరింగ్ అంటారు. గ్యాలప్ పోల్ : అమెరికాకు చెందిన హెన్రీ గ్యాలప్ అనే ఎన్నికల విశ్లేషకుడు ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. అందువల్ల దీన్ని గ్యాలప్పోల్ అంటారు. ఇది ఎన్నికలకుæ ముందు నిర్వహించే సర్వే లాంటిది. ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసే అంశాలను, రాబోయే ఎన్నికల ఫలితాలను గ్యాలప్పోల్ ద్వారా అంచనా వేయొచ్చు. ఎగ్జిట్పోల్: ఎన్నికల సమయంలో ఓటు వేసినవారి అభిప్రాయాన్ని తెలుసుకునే పద్ధతిని ఎగ్జిట్పోల్ అంటారు. తద్వారా ఎన్నికల ఫలితాలను అంచనా వేయొచ్చు. ఫ్లోర్ క్రాసింగ్: ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అధికార పక్షంలోకి మారడాన్ని ఫ్లోర్ క్రాసింగ్ అంటారు. కార్పెట్ క్రాసింగ్: అధికార పక్షానికి చెందిన సభ్యులు ప్రతిపక్ష పార్టీలోకి మారడాన్ని కార్పెట్ క్రాసింగ్ అంటారు. ప్రతిపాదనలు: సభ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొచ్చేందుకు ఎంచుకునే ప్రక్రియనే ప్రతిపాదన అంటారు. సభ అభిప్రాయం కోరడం దీని ముఖ్య ఉద్దేశం.భారతదేశంలో మూడు రకాల ప్రతిపాదనలున్నాయి. నిర్దిష్ట ప్రతిపాదనలు: ఇదొక నిర్దిష్ట, స్వచ్ఛంద ప్రతిపాదన. సభ నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా దీన్ని ప్రతిపాదిస్తారు. ఇందులో మరొక ప్రతిపాదన ఉండదు. ఉదా: వాయిదా, అవిశ్వాస తీర్మానాలు. ప్రత్యామ్నాయ ప్రతిపాదన: మార్పు చెందిన విధానాలు, పరిస్థితులకు సంబంధించి అసలు ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా చేసే ప్రతిపాదన. ఇది ఆమోదం పొందితే దీన్ని అసలు ప్రతిపాదనగానే పరిగణిస్తారు. సహాయ ప్రతిపాదన: ఇంతకు ముందు ప్రవేశపెట్టిన ప్రతిపాదన స్థితిగతులను విచారించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. అసలు ప్రతిపాదనతోపాటు సహాయ ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతుంది. కానీ, ఓటింగ్ మాత్రం సహాయక ప్రతిపాదనపైనే ఉంటుంది. దీన్ని మూడు ఉప ప్రతిపాదనలుగా విభజించవచ్చు. ఆనుషంగిక ప్రతిపాదన: వివిధ రకాల సభా వ్యవహారాలను కొనసాగించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఉదా: బిల్లులను నిర్దేశిత కమిటీ లేదా సంయుక్త కమిటీ పరిశీలనకు పంపడం. అధిక్రమణ ప్రతిపాదన: ఏదైనా ఒక విషయాన్ని అక్కడితో వదిలివేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. సంబంధిత అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు దీన్ని ప్రతిపాదిస్తారు. స్పాయిల్ సిస్టం: ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను కూడా మార్చుకునే పద్ధతి. ఇది అమెరికాలో పాక్షికంగా అమల్లో ఉంది. అమెరికా నూతన అధ్యక్షుడు తన అధికార నివాసమైన వైట్హౌస్లో పని చేసే ఉద్యోగులను తన విచక్షణ మేరకు నియమించుకోవచ్చు. సాధారణంగా గత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులను తొలగిస్తారు. తీర్మానాలు: సభ దృష్టిని ్రçపజాసంబంధ వ్యవహారాలవైపు మళ్లించేందుకు ఉన్న అనేక విధానాల్లో ఇదొకటి. నిజానికి ఇది ఒక నిర్ధారిత ప్రతిపాదన. కానీ, తీర్మానం ఒక అభిప్రాయం లేదా సూచన రూపంలో ఉంటుంది. వీటిని వ్యక్తిగత, ప్రభుత్వ, రాజ్యాంగ తీర్మానాలుగా వర్గీకరించవచ్చు. హంగ్ పార్లమెంట్: లోక్సభ సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాని పరిస్థితిని హంగ్ పార్లమెంట్ అంటారు. ఇప్పటి వరకు 7 హంగ్ పార్లమెంట్లు ఏర్పడ్డాయి. (1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009) ఆపద్ధర్మ ప్రభుత్వం: అధికారంలో ఉన్న ప్రభుత్వం వైదొలిగినప్పుడు.. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడే వరకు పాలనా బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా ఆ ప్రభుత్వమే అధికారంలో కొనసాగాల్సిందిగా రాష్ట్రపతి లేదా గవర్నర్ కోరతారు. దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి ఏర్పాటు లేదు. అయితే ఈ సమయంలో ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు: పార్లమెంట్లో వివిధ అంశాలపై చక్కగా మాట్లాడినవారికి, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నియోజకవర్గ ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన వారికి, గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రదర్శించిన సభ్యులకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందిస్తారు. 1993 నుంచి ఏటా ఒక పార్లమెంట్ సభ్యుడికి ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు. దీన్ని ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఈ పురస్కారాల కమిటీకి చైర్మన్గా స్పీకర్ వ్యవహరిస్తారు. మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును 1993లో ఇంద్రజిత్ గుప్తాకు ఇచ్చారు. యూత్ పార్లమెంట్: ప్రజాస్వామ్య పద్ధతులు, పార్లమెంట్ విధానాలను కొత్త తరాలకు తెలియజేసేం దుకు ఈ కార్యక్రమాన్ని నాలుగో అఖిల భారత విప్ సమావేశ సూచన మేరకు ప్రారంభించారు. సంకీర్ణ ప్రభుత్వం: రెండు లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు కలిసి కేంద్ర లేదా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. భారతదేశంలో మొదటిసారి కేరళలో 1967లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. విప్: అంటే ఆదేశం లేదా అధిపతి అని అర్థం. దీని గురించి రాజ్యాంగం, పార్లమెంటరీ నియమ నిబంధనల్లో ఎక్కడా పేర్కొనలేదు. రాజకీయ పార్టీలు తమ శాసనసభ్యులను నియంత్రించేందుకు, అలాగే సభలో పార్టీ సభా నాయకుడికి సహాయపడేందుకు వీరిని నియమిస్తాయి. పార్టీ విప్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత పార్టీకి చెందిన శాసన సభ్యులు ప్రవర్తించాలి. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో దీని గురించి ప్రస్తావించారు. పార్టీ విప్నకు వ్యతిరేకంగా ఓటు వేసినవారు తమ శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. బి. కృష్ణారెడ్డి, డైరెక్టర్, క్లాస్–వన్ స్టడీ సర్కిల్ -
పార్లమెంటరీ పద్ధతులు – పదజాలం
పార్లమెంటు సమావేశమైనప్పుడు సభలో వివిధ చర్చలు, తీర్మానాలు, ఓటింగ్ వంటి ప్రక్రియలు ఉంటాయి. పార్లమెంటులో ఉపయోగించే పదాలకు ప్రత్యేక అర్థాలు ఉంటాయి. పార్లమెంటరీ ప్రక్రియలో అధిక భాగాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి∙గ్రహించారు. సమావేశ కాలం (Session): పార్లమెంటు కార్యక్రమాలు ప్రారంభమైన తొలి రోజు నుంచి చివరి రోజు వరకు మధ్య ఉన్న కాలాన్ని సమావేశకాలం అంటారు. ఈ మధ్య కాలంలో సభ ప్రతిరోజూ సమావేశమవుతుంది. సభా వ్యవహారాలు కొనసాగుతూ, సమయం ప్రకారం వాయిదా పడుతూ, మళ్లీ కొనసాగుతుంటాయి. కోరమ్ (నిర్దిష్ట పూర్వక సంఖ్య): పార్లమెంటు సమావేశమయ్యేందుకు ఉండాల్సిన సభ్యుల కనిష్ట హాజరు(సంఖ్య)ను కోరమ్ అంటారు. ఇది సంబంధిత సభలోని మొత్తం సభ్యుల్లో (సభాధ్యక్షునితో కలిపి) 1/10వ వంతుకు సమానం. కోరమ్ కంటే తక్కువ సభ్యులు హాజరైతే సభాధ్యక్షుడు కార్యక్రమాలను కొంతసేపు వాయిదా వేయాలి. కోరమ్ ఉందా లేదా అని నిర్ణయించే అధికారం సభాధ్యక్షునికే ఉంటుంది. ప్రçస్తుతం లోక్సభలో కోరమ్ 55 మంది కాగా, రాజ్యసభలో 25 మంది సభ్యులు. అజెండా: సభలో చర్చించాల్సిన కార్యక్రమాల పట్టికను అజెండా అంటారు. దీన్ని సభా వ్యవహారాల సలహా కమిటీ రూపొందిస్తుంది. సభా కార్యక్రమాలు దీని ప్రకారమే జరుగుతాయి. డిజల్యూషన్ (రద్దు)– ప్రభావం: లోక్సభ పదవీకాలం పూర్తయిన తర్వాత లేదా రాజకీయ అనిశ్చితి తలెత్తినప్పుడు ప్రకరణ 85 ప్రకారం సభను రాష్ట్రపతి రద్దు చేస్తారు. కొత్త లోక్సభ కోసం ఎన్నికలు జరుగుతాయి. లోక్సభ రద్దు – బిల్లులపై ప్రభావం: లోక్సభ పరిశీలనలో ఉన్న బిల్లులు (లోక్సభ లోనే ప్రవేశపెట్టినవైనా లేదా రాజ్యసభ నుంచి లోక్సభ ఆమోదానికి వచ్చినవైనా) రద్దవుతాయి. లోక్సభ ఆమోదం పొంది రాజ్యసభ పరిశీలనలో ఉన్న బిల్లులు కూడా రద్దవుతాయి. రాజ్యసభ పరిశీలనలో ఉన్న బిల్లులు లోక్సభ ఆమోదానికి రానట్లయితే అవి రద్దుకావు. ఉభయ సభల ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదముద్రకు పంపిన బిల్లులు రద్దుకావు. ఉభయ సభల ఆమోదం పొంది రాష్ట్రపతి అనుమతికి పంపిన బిల్లులను ఆయన తిరిగి పార్లమెంటు పునఃపరిశీలనకు పంపిన సమయంలో లోక్సభ రద్దయినా సంబంధిత బిల్లులు రద్దు కావు. ఒక బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశానికి నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే సంబంధిత బిల్లులు కూడా రద్దుకావు. వాయిదా సమావేశకాలం మధ్యలో సభా కార్యక్రమా లను తాత్కాలికంగా నిర్ణీత వ్యవధి వరకు నిలిపివేసి, ఆ తర్వాత కొనసాగించడాన్ని వాయిదా అంటారు. ఉదా: సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు, భోజన విరామం, సెలవులు తదితర సమయాల్లో సభాధ్యక్షుడు సభా కార్యక్రమాలను నిలిపేస్తారు. నిరవధిక వాయిదా: కాలపరిమితి పేర్కొనకుండా సభా సమావేశా లను వాయిదా వేయడాన్ని నిరవ«ధిక వాయిదా అంటారు. సభలను నిరవధికంగా వాయిదా వేసే అధికారం సభాధ్యక్షుడికి ఉంటుంది. దీర్ఘకాలిక వాయిదా సభా సమావేశాలు పరిసమాప్తం కావడం/ ముగియడాన్ని దీర్ఘకాలిక వాయిదా అంటారు. దీన్ని రాష్ట్రపతి లేదా గవర్నర్ లాంఛన ప్రాయంగా ప్రకటిస్తారు. ఈ సందర్భంలో బిల్లులపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ, నోటీసులు రద్దవుతాయి. ప్రశ్నోత్తరాల సమయం: పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిరోజూ మొదటి గంటను ప్రశ్నోత్తరాలకు కేటాయిస్తారు. సభాధ్యక్షులకు సభ్యులు నోటీసు ఇచ్చి, వివిధ అంశాలపై ప్రశ్నలు అడగొచ్చు. సంబంధిత మంత్రులు వాటికి సమాధానం చెబుతారు. ఈ ప్రశ్నలు మూడు రకాలు. అవి.. నక్షత్ర గుర్తు గల ప్రశ్నలు: ఈ ప్రశ్నలకు సమాధానాన్ని సంబంధిత మంత్రి మౌఖికంగా ఇస్తారు. అందువల్ల ఒకటి, రెండు అనుబంధ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలు: ఈ తరహా ప్రశ్నలకు సంబంధిత మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇస్తారు. అందువల్ల అనుబంధ ప్రశ్నలకు అవకాశం ఉండదు. స్వల్ప వ్యవధి ప్రశ్నలు: అత్యవసర, ప్రజా ప్రాముఖ్యమున్న అంశాలపై మౌఖికంగా అడిగే ప్రశ్నలను స్వల్ప వ్యవధి ప్రశ్నలు అంటారు. సాధారణంగా ఈ ప్రశ్నల కు 10 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. జీరో అవర్: ఈ పదాన్ని పార్లమెంటరీ నియమాలు, పద్ధతుల్లో పేర్కొనలేదు. ఇది పత్రికలు సృష్టించిన పదం. భారత పార్లమెంటరీ ప్రక్రియలో స్వతహాగా ఏర్పాటు చేసుకున్న పద్ధతి. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, ఇతర సభా కార్యక్రమాల ప్రారంభానికి ముందున్న కొద్ది కాలాన్ని జీరో అవర్ అంటారు. ఇది సభాధ్యక్షుడి విచక్షణ మేరకు అమలవుతుంది. దీనికి నిర్ణీత గడువు ఉండదు. ఈ సమయంలో ముందస్తు నోటీసు ఇవ్వకుండానే సభ్యులు ప్రశ్నలు అడగొచ్చు. కానీ, సమాధానానికి పట్టుపట్టకూడదు. ఈ పద్ధతిని 1962 నుంచి పాటిస్తున్నారు. అర్ధ గంట చర్చ: సభలో అంతకుముందు లేవనెత్తిన అంశం నుంచి ఉద్భవించే కొన్ని ప్రశ్నలపై జరిగే చిన్నపాటి చర్చను అర్ధ గంట చర్చ అంటారు. సాధారణంగా లోక్సభలో వారంలో మూడు రోజుల పాటు చివరి అర్ధ గంట చర్చ జరుగు తుంది. రాజ్యసభలో రోజూ సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల మధ్య చర్చ జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలు జరుగుతు న్నప్పుడు కూడా ఈ చర్చను చేపట్టవచ్చు. ఒక సభ్యుడు ఏదైనా ఒక సమస్యపై చర్చ లేవనెత్తాలనుకుంటే.. ఆ మేరకు సభ సెక్రటరీ జనరల్కు లిఖితపూర్వకంగా తెలియజేయాలి. స్వల్ప వ్యవధి చర్చ: ముఖ్య ప్రజా సంబంధ అంశాలపై సభ్యులు స్వల్ప వ్యవధి చర్చను లేవనెత్తవచ్చు. ఇందులో ఓటింగ్ ఉండదు. సభా కార్యక్రమాల చివరి సమయంలో స్పీకర్ దీన్ని అనుమతిస్తారు. సావధాన తీర్మానం: ఇది కూడా స్వతహాగా ఏర్పాటు చేసుకున్న ప్రక్రియ. 1954 నుంచి అమలుచేస్తున్నారు. దీన్ని పార్లమెంటరీ నియమాల్లో పేర్కొన్నారు. సభాధ్యక్షుడి అనుమతితో అత్యంత ముఖ్యమైన, ప్రజా సంబంధ అంశంపై ప్రభుత్వం నుంచి అధికారపూర్వక సమాధానాన్ని రాబట్టేందుకు సభ్యలు ఈ తీర్మానాన్ని వినియోగిస్తారు. సంబంధిత మంత్రి ఆ నిర్దిష్ట అంశంపై ఒక ప్రకటన చేస్తారు. ఈ తీర్మానంలో చర్చ, ఓటింగ్, ప్రభుత్వంపై విమర్శ ఉండవు. ఒక సభ్యుడు ఒక సమావేశంలో రెండు కంటే ఎక్కువ నోటీసులు ఇవ్వకూడదు. వాయిదా తీర్మానం: ఇది అత్యంత శక్తిమంత తీర్మానం. దీన్ని లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. వాయిదా తీర్మానం కోరుతూ కనీసం 50 మంది సభ్యులు సంతకాలు చేసి స్పీకర్/సెక్రటరీ జనరల్కు లిఖితపూర్వకంగా ఆ రోజు ఉదయం 10 గంటలలోపు నోటీసు ఇవ్వాలి. దాన్ని స్పీకర్ అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అత్యంత మఖ్య సమకాలీన ప్రజా సమస్యలవైపు సభ దృష్టిని మరల్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు. వాయిదా తీర్మానంలో చర్చ, ఓటింగ్ ఉంటాయి. ఓటింగ్ నెగ్గితే ప్రభుత్వం అభిశంసనకు గురవుతుంది. కానీ, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా చర్చ ముగిసే వరకు సభను వాయిదా వేయరు. అవిశ్వాస తీర్మానం: దీన్ని అంతిమ తీర్మానం అని కూడా అంటారు. ప్రకరణ 75 ప్రకారం మంత్రులు సంయుక్తం గా లోక్సభకు బాధ్యత వహిస్తారు. అంటే లోక్సభలో మెజారిటీ సభ్యుల విశ్వాసం ఉన్నంత వరకే మంత్రిమండలి అధికారంలో కొనసాగు తుంది. అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. దీని కోసం 50 మంది సభ్యులు సంతకాలు చేసిన నోటీసును స్పీకర్కు ఇవ్వాలి. అలాగే సభలో 50 మంది సభ్యులకు తగ్గకుండా ఆ తీర్మానానికి మద్దతు ప్రకటించాలి. ఈ తీర్మానాన్ని అనుమతించిన తర్వాత.. పది రోజుల వ్యవధిలో స్పీకర్‡ నిర్ణయించిన తేదీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరుగుతాయి. అప్పుడు సభకు హాజరై ఓటు వేసిన వారిలో మెజారిటీ సభ్యులు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే ప్రభుత్వం పడిపోతుంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు ప్రత్యేక కారణాన్ని∙సూచించాల్సిన అవసరం లేదు. ఈ తీర్మానం గురించి రాజ్యాంగంలో ప్రత్యక్షంగా పేర్కొనలేదు. ఎన్ని పర్యాయాలైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అయితే సాధారణంగా ఆరు నెలల్లో రెండు కంటే ఎక్కువ అవిశ్వాస తీర్మానాలను అనుమతిం చరు. ఇప్పటి వరకు లోక్సభలో 26 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మొదటిసారి 1962లో నెహ్రూ ప్రభుత్వంపై ప్రవేశపెట్టారు. కానీ, చర్చకు రాలేదు. రెండోసారి 1963లో నెహ్రూ ప్రభుత్వంపై (జె.బి.కృపలానీ) ప్రవేశపెట్టారు. కానీ, అది వీగిపోయింది. అవిశ్వాస తీర్మానాన్ని అత్యధి కంగా ఇందిరాగాంధీ ప్రభుత్వంపై 15సార్లు ప్రవేశపెట్టారు. తర్వాత పీవీ నరసింహారావు ప్రభుత్వంపై 3 సార్లు, లాల్బహదూర్ శాస్త్రిపై మూడు పర్యాయాలు ప్రవేశపెట్టారు. -
లోక్సభలో మొదటి ప్రతిపక్ష నాయకుడు?
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకరణ 89 ప్రకారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని ఏర్పరచారు. ఈయన పదవీకాలం ఆరేళ్లు. డిప్యూటీ చైర్మన్గా ఎన్నిక కావాలంటే రాజ్యసభలో సభ్యుడై ఉండాలి. రాజ్యసభ సభ్యులే మెజార్టీ ప్రాతిపదికపై ప్రత్యక్షంగా డిప్యూటీ ౖచైర్మన్ను ఎన్నుకుంటారు. అలాగే రాజ్యసభ సభ్యులే ఒక తీర్మానం ద్వారా ఈయనను తొలగించవచ్చు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్కు అందిస్తారు. రాజ్యసభ చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు, అలాగే ఉప రాష్ట్రపతి.. రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు డిప్యూటీ చైర్మన్ రాజ్యసభకు అధ్యక్షత వహిస్తారు. పార్లమెంటు సచివాలయం: ప్రకరణ 98 ప్రకారం, పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభలకు ప్రత్యేక సచివాలయ సిబ్బంది ఉంటారు. లోక్సభ కార్యదర్శిని లోక్సభ సెక్రటరీ జనరల్ అని, రాజ్యసభ కార్యదర్శిని రాజ్యసభ సెక్రటరీ జనరల్ అని అంటారు. సభా నాయకుడు సాధారణంగా ప్రధానమంత్రి లోక్సభ సభానాయకుడిగా వ్యవహరిస్తారు. అయితే, ప్రధానమంత్రికి లోక్సభలో సభ్యత్వం లేనప్పుడు, లోక్సభలో సభ్యత్వం కలిగిన మంత్రిని సభా నాయకుడిగా నియమిస్తారు. అలాగే రాజ్యసభలో కూడా ఆ సభలో సభ్యత్వం ఉన్న మంత్రి ఒకరు సభా నాయకుడిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు – ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడి ప్రస్తావన రాజ్యాంగంలో లేదు. అయితే లోక్సభ మొదటి స్పీకర్ జి.వి. మౌలాంకర్ రూపొందించిన నియమావళి ప్రకారం లోక్సభలో కనీసం 1/10వ వంతు సభ్యులు కలిగిన, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి హోదా పొందుతారు. రాజ్యసభలోనూ ఇదే విధానం వర్తిస్తుంది. ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ హోదా ఉంటుంది. గమనిక: 1977లో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం ప్రకారం లోక్సభ లేదా రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు అనే హోదాకు మొదటిసారిగా చట్టబద్ధత కల్పించారు.ప్రత్యేక సమాచారం: ఈ చట్టం ప్రకారం గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష నేత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు చెందిన వై.బి. చవాన్ (6వ లోక్సభ). రాజ్యసభలో గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష నాయకుడు కమలాపతి త్రిపాఠీ.మొదటి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లేరు. అలాగే రెండో, మూడో, ఐదో, ఏడో లోక్సభలు కూడా ప్రతిపక్ష నాయకుడు లేకుండానే ముగిశాయి. కారణం నిర్ణీత సంఖ్యలో సభ్యులు లేకపోవడమే. శాసన నిర్మాణ ప్రక్రియ– బిల్లులు– రకాలు బిల్లు అంటే చట్టం చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదన లేదా ముసాయిదా. చట్టం మొదటి దశే బిల్లు. శాసన నిర్మాణ ప్రక్రియను బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఉభయ సభల్లో అనేక దశలు ఎదుర్కోవాలి. ప్రవేశపెట్టే వారి ఆధారంగా బిల్లులను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి.. 1. ప్రభుత్వ బిల్లు 2. ప్రైవేటు మెంబర్ బిల్లు ఒక బిల్లును మంత్రి ప్రవేశపెడితే దాన్ని ప్రభుత్వ బిల్లు అంటారు. ప్రతిపక్ష సభ్యులతో సహా మంత్రి కాని ఏ సభ్యుడైనా బిల్లును ప్రతిపాదిస్తే దాన్ని ప్రైవేటు మెంబర్ బిల్లు అంటారు. ప్రత్యేక సమాచారం: పదహారో లోక్సభ వరకు (2015) పార్లమెంటులో 14 ప్రైవేట్ మెంబర్ బిల్లులు ఆమోదం పొందాయి. 1956లో ఆరు ప్రైవేటు బిల్లులను ఆమోదించారు. 15వ లోక్సభలో 264 ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. కానీ ఏ ఒక్కటీ ఆమోదం పొందలేదు. బిల్లులోని అంశాలు, ప్రక్రియల ఆధారంగా బిల్లును కింది రకాలుగా వర్గీకరిస్తారు రాజ్యాంగంలో ప్రకరణ 107 నుంచి 122 వరకు శాసన నిర్మాణంలో అనుసరించాల్సిన ప్రక్రియను పొందుపర్చారు. బిల్లులను కింది విధంగా వర్గీకరించవచ్చు. 1.సాధారణ బిల్లు (ప్రకరణ 107) 2.ఆర్థిక బిల్లు (ప్రకరణ 117) 3.ద్రవ్య బిల్లు (ప్రకరణ 110) 4.రాజ్యాంగ సవరణ బిల్లు (ప్రకరణ 368) సాధారణ బిల్లులు – ప్రక్రియ సాధారణ బిల్లుకు ప్రత్యేక నిర్వచనం లేదు. ప్రకరణ 107 ప్రకారం – ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు కానిది సాధారణ బిల్లు. సాధారణ బిల్లును ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ బిల్లును ప్రవేశపెట్టదలచుకున్న సభ్యుడు ఒక నెల ముందుగా నోటీసుతో తన సంకల్పాన్ని లిఖితపూర్వకంగా ఆయా సభాధ్యక్షులకు తెలపాలి. సభ్యుడి విజ్ఞాపన అందగానే సభాపతి ఒక తేదీ నిర్ణయిస్తారు. ఏ సభ్యుడైనా బిల్లు ప్రవేశాన్ని వ్యతిరేకిస్తే అతడి అభిప్రాయాలను వినిపించేందుకు అనుమతిస్తారు. సాధారణ బిల్లులో కింది దశలుంటాయి. 1. ప్రవేశ దశ (మొదటి పఠనం) 2. రెండో పఠనం (పరిశీలన దశ) 3. మూడో పఠనంలేదా ఆమోద పరిశీలన దశ 4. రెండో సభలోకి బిల్లు పంపడం 5. రాష్ట్రపతి ఆమోదం ప్రవేశ దశ (మొదటి పఠనం) ఒక బిల్లును సభలో ప్రవేశపెడుతున్న సభ్యుడు, ఆ బిల్లు పేరును, ఆవశ్యకతను ప్రాధాన్యతను వివరిస్తాడు. ఈ దశలో ఎలాంటి చర్చ జరగదు.రెండో పఠనం: బిల్లు మొదటి దశ పూర్తయ్యాక ముద్రించిన బిల్లుల ప్రతులను సభ్యులకు అందిస్తారు. ఈ దశలో బిల్లుపై విస్తృత చర్చ జరుగుతుంది. ఈ దశలో కింది ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. బిల్లును చర్చించి, వెంటనే ఆమోదించాలని అడగవచ్చు. బిల్లును సెలక్ట్ కమిటీకి లేదా రెండో సభ అంగీకారంతో సంయుక్త సెలక్ట్ కమిటీకి నివేదించవచ్చు.బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని అడగవచ్చు. అంటే బిల్లుకు విస్తృత ప్రచారాన్ని కల్పించాలని కోరడం.కమిటీ దశ–వివరణ: అత్యంత ప్రాముఖ్యమైన లేదా వివాదాస్పద, రాజ్యాంగ పరమైన వ్యాఖ్య అవసరమున్న బిల్లులను సెలక్ట్ కమిటీ అభిప్రాయానికి పంపుతారు. సెలక్ట్ కమిటీ సభ్యులను ఆయా సభాధ్యక్షులు నియమిస్తారు. సాధారణంగా వీరి సంఖ్య 20 నుంచి 30 వరకు ఉంటుంది. ఉభయ సభల సభ్యులతో కలిపి ఏర్పాటు చేస్తే జాయింట్ సెలక్ట్ కమిటీ అంటారు. ఈ కమిటీ సూచించిన సవరణ, ప్రతిపాదనలను సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.మూడో పఠనం లేదా ఆమోద పరిశీలన దశ: ఇది కేవలం ఆమోద దశ మాత్రమే. ఇందులో బిల్లుపై పరిమిత చర్చకు సభ్యులకు అనుమతి లభిస్తుంది. బిల్లును అంగీకరించడం/నిరాకరించడానికి మాత్రమే చర్చ పరిమితం అవుతుంది. హాజరైన వారిలో మెజారిటీ సభ్యులు అంగీకరిస్తే ఆ బిల్లును సభ ఆమోదించినట్లు సభాపతి ప్రకటిస్తారు. దీంతో ప్రవేశపెట్టిన సభలో బిల్లు ప్రక్రియ పూర్తవుతుంది.రెండో సభలోకి బిల్లు వెళ్లడం: బిల్లు శాసనంగా మారాలంటే ఉభయ సభలు ఆమోదం తెలపాలి. ప్రవేశపెట్టిన సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రెండో సభ ఆమోదానికి పంపుతారు. ఇందులోనూ మూడు దశలుంటాయి. బిల్లును రెండో సభ పూర్తిగా తిరస్కరించవచ్చు. బిల్లులో కొన్ని సవరణలు ప్రతిపాదించి, ప్రవేశపెట్టిన సభ పునఃపరిశీలనకు పంపవచ్చు. ఒకవేళ రెండో సభ చేసిన సవరణను మొదటి సభ అంగీకరిస్తే ఆ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందినట్లు అవుతుంది. రెండో సభ సవరణను మొదటి సభ వ్యతిరేకిస్తే ఆ బిల్లు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. -
మహిళా సాధికారత
ఆర్థిక సాధికారత: సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు కలిగి ఉండాలి. అప్పుడే వారు ఆర్థికంగా పురుషులపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కూడా కీలకమవుతుంది. లైంగిక వివక్షతో వృత్తులను నిరాకరించకూడదు. విద్యా సాధికారత: విద్య ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా నైపుణ్యం, నైపుణ్యం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అందువల్ల స్త్రీలకు సమాన విద్యావకాశాలు ఉండాలి. చైతన్యవంతమైన మహిళ సమాజ, కుటుంబ స్థితిగతులనూ మార్చగలదు. ఇది సమాజాభివృద్ధికి అనివార్యం. రాజకీయ సాధికారత: పరిపాలనలో, రాజకీయ అధికారంలో స్త్రీలకు సమాన అవకాశాలు ఉండాలి. తద్వారా రాజకీయ నిర్ణయీకరణ అంశాల్లో వారి పాత్రకు గుర్తింపు లభిస్తుంది. తద్వారా వారు తమ సమస్యలను ప్రస్ఫుటంగా వ్యక్తీకరించడానికి అవకాశం కలుగుతుంది. రాజకీయ సాధికారత లభిస్తే ఇతర సాధికారతలపైనా గణనీయ ప్రభావం ఉంటుంది. చట్టపర సాధికారత: సమాజంలో ప్రభావవంతమైన, చట్టపరమైన నిర్మితి ఉండాలి. చట్టపరంగా ఎలాంటి వివక్షలూ ఉండకూడదు. చట్టంలో పేర్కొన్నదానికి వాస్తవంగా జరుగుతున్నదానికి మధ్య తేడా ఉండరాదు. సాధికారత సాధన – రాజ్యాంగ, చట్టపర అంశాలు ప్రకరణ 14 ప్రకారం.. చట్టం ముందు అందరూ సమానులే. ప్రకరణ 15 ప్రకారం.. స్త్రీ, పురుష వివక్ష చూపరాదు. ప్రకరణ 15(3) ప్రకారం.. మహిళలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలి. ప్రకరణ 16 ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో లింగ వివక్ష చూపరాదు. ప్రకరణ 23 ప్రకారం.. స్త్రీలను అసభ్య, అశ్లీల, అవినీతి కార్యకలాపాలకు వినియోగించకూడదు. lప్రకరణ 39(ఎ) ప్రకారం.. మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు కల్పించాలి. ప్రకరణ 39(డి) ప్రకారం.. స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. lప్రకరణ 42 ప్రకారం.. మహిళలకు ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి. ప్రకరణ 47 ప్రకారం.. జీవన ప్రమాణాలు పెంచాలి. పౌష్టికాహారం అందించాలి. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలి ప్రకరణ 51–ఎ(ఇ) ప్రకారం.. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతులను విడనాడాలి. ప్రకరణ 243(డి) ప్రకారం.. పంచాయతీ సంస్థల్లో మహిళలకు 1/3 వంతు స్థానాలను రిజర్వు చేయాలి. lప్రకరణ 243(టి) ప్రకారం.. మునిసిపాలిటీల్లో మహిళలకు 1/3 వంతు స్థానాలను రిజర్వు చేయాలి. మహిళా హక్కులు, చట్ట రక్షణలు మహిళలను పలు రకాల హింసల నుంచి రక్షించడానికి పార్లమెంట్ అనేక చట్టాలు రూపొందించింది. అవి.. సతీసహగమన నిషేధ చట్టం – 1829 వితంతు పునర్వివాహ చట్టం – 1856 బాల్య వివాహ నిరోధక చట్టం – 1952 హిందూ వివాహ చట్టం – 1955 హిందూ వారసత్వ చట్టం – 1956 అశ్లీల, అవినీతి వ్యాపార నిరోధక చట్టం – 1956 వరకట్న నిషేధ చట్టం – 1961 మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ – 1971 మెటర్నిటీ రిలీఫ్ చట్టం – 1976 సమాన వేతన చట్టం – 1976 ల ప్రదర్శన నిషేధ చట్టం – 1986 మహిళా సాధికారత ఉద్యమాలు – 1990 జాతీయ మహిళా కమిషన్ చట్టం – 1991 గృహ హింస నిరోధక చట్టం – 2005 పని ప్రదేశాల్లో వేధింపులకు వ్యతిరేకంగా రక్షణ చట్టం – 2013 నిర్భయ చట్టం (క్రిమినల్ ప్రొసీజర్స్ సవరణ) – 2013 చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు (108 రాజ్యాంగ సవరణ ప్రతిపాదిత బిల్లు) మహిళా సాధికారత – పథకాలు ఇందిరా మహిళా యోజన దీన్ని 1975, ఆగస్టు 20న ప్రారంభించారు. ఇది మహిళల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన పథకం. ఇందులో భాగంగా వివిధ పథకాల సమన్వయానికి సమగ్ర యంత్రాంగాన్ని ఏర్పాటుచేస్తారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీం– ఐసీడీఎస్) 1975, అక్టోబర్ 2 ప్రారంభించారు. గర్భిణిలు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలు ఈ పథకం లబ్ధిదారులు. గ్రామీణ ప్రాంత మహిళా, శిశు అభివృద్ధి పథకం (ఈగిఅఇఖఅ–ఈ్ఛఠ్ఛిlౌpఝ్ఛn్ట ౌజ గిౌఝ్ఛn ్చnఛీ ఇజిజీlఛీట్ఛn జీn ఖuట్చ∙అట్ఛ్చ) 1982 సెప్టెంబర్లో ప్రారంభించారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం మహిళా సమృద్ధి యోజన(ఎంఎస్వై)–1993 గ్రామీణ మహిళల్లో పొదుపును పెంచి, ఆర్థిక భద్రతను కల్పించడం ద్వారా వారిని అభివృద్ధి పరిచేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రీయ మహిళా కోష్–1993 1993లో పేద మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రారంభించారు. బాలికా సమృద్ధి యోజన(బీఎస్వై)–1997 స్త్రీ, శిశు జననం పట్ల సమాజ దృక్పథంలో మార్పు తెచ్చేందుకు ప్రారంభించారు. దీపం(1999, అక్టోబర్ 2) గ్రామీణ ప్రాంత మహిళలు కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగను పీల్చి ఉబ్బసం, ఆస్తమా వ్యాధుల బారినపడకుండా వారికి గ్యాస్ సిలిండర్లు అందించడానికి, తద్వారా ఆయా వ్యాధుల నివారణకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. స్వశక్తి(1999 అక్టోబర్) స్వయం సహాయక సంఘాలకు సూక్ష్మ రుణాలు అందజేస్తూ మహిళలకు సాధికారతను సాధించడం. కిశోర శక్తి యోజన(1997, జనవరి 1) బాలికల్లో బాల్య వివాహాలను అరికట్టి సామాజిక దృక్పథాల్లో మార్పు తేవడం, నూటికి నూరు శాతం బాలికలకు ప్రాథమిక విద్య అందేట్లు చేయడం ఈ పథకం ఉద్దేశం. స్వధార్ (Sగిఅఈఏఅఖ) 2001–02 స్త్రీలకు ఆలోచన, క్రియాత్మక జీవన విధానం కల్పించడం. పావలా వడ్డీ (2004–05) స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాలపై పావలా వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. జననీ సురక్ష యోజన(2005–06) ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో కాన్పులు జరిగేట్లు గర్భిణులను ప్రోత్సహించి ప్రసూతి, శిశుమరణాల రేటును తగ్గించడం . మాతా ఆరోగ్య రక్షణ సేవలు (ఏఎస్హెచ్ఏ–ఆశ: అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్: 2005–06) ఈ పథకంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల్లో 70,700 మంది కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి; గ్రామీణ, పట్టణ గిరిజన ప్రాంతాల్లో నియమించి; స్త్రీ, శిశు ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించారు. 24/7 మహిళల హెల్ప్లైన్ (181) రాష్ట్రంలో మహిళల భద్రతకు, వారి సమస్యల పరిష్కారానికి రోజుకు 24 గంటలు పనిచేసే హెల్ప్లైన్ డెస్క్ (181) ఏర్పాటుచేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. షీ టీమ్స్ మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ తొలిసారిగా హైదరాబాద్లో షీ టీమ్స్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన–2010 మాతాశిశు ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి, నల్గొండ జిల్లాల్లో ప్రారంభించారు. సబల(-2-0-11, (RGSEAG &-Rajiv Gandhi Scheme for Empowerment of Adolescent Girls) 11–18 ఏళ్ల బాలికలకు పౌష్టికాహార, ఆరోగ్య స్థాయిని మెరుగుపరచడం ఈ పథకం ఉద్దేశం. స్త్రీనిధి పథకం (2011, సెప్టెంబర్ 15) బ్యాంకింగ్ రంగం నుంచి పేదలకు పరపతి లభించే రాయితీ వడ్డీ పథకం. దీనికి రూ.వేయి కోట్లు కేటాయించారు. భారతీయ మహిళా బ్యాంక్–2013 దేశంలోని మహిళల ఆర్థికాభివృద్ధికి, అభ్యున్నతికి కేంద్రం ప్రత్యేకంగా మహిళా బ్యాంకులను స్థాపించింది. వీటి నిర్వహణను పూర్తిగా మహిళలకే అప్పగించి, హక్కులు ప్రకటించారు. దీని నినాదం మహిళా సాధికారతే భారతదేశ సాధికారత. -
స్మార్ట్గా చదవండి..బెస్ట్గా నిలవండి!
పరీక్షల కాలం మొదలైంది. ఏడాదిపాటు పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాలు.. వాటి ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు, మంచి మార్కులు సొంతం చేసుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో ఎంత కాదనుకున్నా ఒత్తిడికి గురవడం సహజం. క్లాస్రూంలో అద్భుతంగా రాణించిన విద్యార్థులు సైతం.. ఒత్తిడికి చిత్తయి వార్షిక పరీక్షల్లో డీలా పడిన సందర్భాలెన్నో. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చు. పరీక్ష రోజు వరకు నిశ్చింతగా, ఉల్లాసంగా ఉండొచ్చు. కావల్సిందల్లా.. స్మార్ట్గా వ్యవహరించడమే. పదో తరగతి మొదలు ప్రొఫెషనల్ డిగ్రీ విద్యార్థుల వరకు సహజంగా ఎదురయ్యే సమస్య.. ఒత్తిడి! ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థుల్లో ఈ సమస్య కొంత ఎక్కువ. ఈ సమస్య పరిష్కారం అనేది విద్యార్థుల చేతుల్లోనే ఉందంటున్నారు నిపుణులు. దీనికి చేయాల్సింది.. దినచర్య ప్రారంభం నుంచి.. నిద్రించే వరకు ‘స్మార్ట్’గా కదలడమే అంటున్నారు. ఆరోగ్యం.. ప్రథమం ఇప్పుడు విద్యార్థులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం. పరీక్షల భయంతో ఒత్తిడి, ఆందోళనలను మనసులోకి వచ్చేలా వ్యవహరిస్తే ఆరోగ్యం పాడవుతుంది. అది పూర్తిగా చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ముందుగా ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. నూనె ఎక్కువగా ఉన్న, కొవ్వు పదార్థాలు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్స్కు కొద్ది రోజులు ఫుల్స్టాప్ పెట్టాలి. వేసవి కాలం వచ్చేసింది కాబట్టి పరిమితంగా ఘనాహారం తీసుకుంటూనే, ద్రవాహారం (జ్యూస్లు, మజ్జిగ వంటివి) తీసుకోవాలి. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. ఎలా చదవాలి ఏడాదిపాటు తరగతి గదుల్లో పుస్తకాలను ఔపోసన పట్టి.. ఫార్మేటివ్ అసైన్మెంట్స్, స్లిప్ టెస్ట్ల్లో రాణించిన విద్యార్థులు సైతం ఆఖరి నిమిషంలో ఎలా చదవాలి.. ఎప్పుడు చదవాలి? అంటూ ఆందోళన చెందుతుంటారు. ఎలా చదవాలి? అనే విషయంలో విద్యార్థులకు పనికొచ్చే సూత్రం చదువుకుంటూనే ఆ అంశాలను రాసుకోవడం. అదే విధంగా ఒక పుస్తకంలో చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను అండర్లైన్, మార్కింగ్ చేసుకోవడం వంటివి చేయాలి. దీనివల్ల పరీక్షలకు కొద్ది రోజుల ముందు పునశ్చరణ పరంగా మేలు కలుగుతుంది. ఎప్పుడు చదవాలి? ఈ ప్రశ్నకు సమాధానం విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తి, సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి వేకువజామున లేచి చదవడం అలవాటు. మరికొంత మందికి రాత్రి వేళల్లో చదవడం అనుకూలం. ఈ విషయంలో ఎలాంటి విద్యార్థులైనా.. తమకు అలవాటుగా ఉన్న సమయంలో చదవడం ప్రారంభించినప్పుడు.. ముందుగా ఇష్టమైన సబ్జెక్టుతో మొదలు పెట్టాలి. తర్వాత నెమ్మదిగా ఇతర సబ్జెక్టులపై దృష్టిసారించాలి. బోర్ కొడితే.. రిలాక్స్ చదువుతున్న సమయంలో ఒక టాపిక్ కష్టంగా ఉన్నా.. లేదా బోర్గా అనిపించినా.. వెంటనే దానికి విరామం ఇవ్వాలి. పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇష్టమైన వ్యాపకంతో రిలాక్స్ కావాలి. అంతే తప్ప కష్టంగా అనిపించినా, బోర్గా ఫీల్ అయినా చదవాల్సిందే అనే ధోరణితో సాగితే మొదటికే ప్రమాదం. ఎంతసేపు చదివాం అనే దానికంటే చదివిన అంశాలు గుర్తుండేలా చదవడం ముఖ్యమని గుర్తించాలి. గంటలకొద్దీ చదువుతూ కూర్చున్నా మెదడుకు ఎక్కని అంశాలు ఒత్తిడికి గురి చేస్తాయి. దశల వారీగా.. రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రకు కేటాయిస్తే మిగిలిన సమయాన్ని చదవడం కోసం విడతల వారీగా విభజించుకోవాలి. ఉదయాన్నే చదవడం వల్ల బాగా గుర్తుంటాయనేది వాస్తవమే. దీన్ని తప్పనిసరిగా ఆచరించడం వల్ల మెరుగైన ఫలితాలు ఆశించొచ్చు. ఈ సమయంలో తేలికైన ఆహారం తీసుకోవాలి. ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడికి గురవుతున్నారనడానికి ముందుగానే సంకేతాలు కనిపిస్తాయి. చెమట పట్టడం; చేతులు, కాళ్లలో వణుకు, తలనొప్పి వంటివి వీటిలో ముఖ్యమైనవి. ఈ సంకేతాలు కనిపించగానే కొంత సమయాన్ని ఇష్టమైన పనులు చేయడానికి కేటాయించాలి.ఆ తర్వాత తిరిగి చదువుపై దృష్టిసారించాలి. చేతి రాత మెరుగుపర్చుకోండి చేతి రాత అందంగా ఉండేలా చూసుకోవాలి. పరీక్షలో ఇది ఎంతో కీలకం. చేతి రాత.. మూల్యాంకన చేసే వారికి ఆహ్లాదకరంగా కనిపించాలి. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయి. అలా కాకుండా సమయం సరిపోదనో లేదా చేతి రాత మార్చుకోలేకనో.. గజిబిజిగా రాస్తే.. సమాధానంలో విలువైన సమాచారం ఉన్నప్పటికీ మార్కులకు గండి పడే ప్రమాదం ఉంది. అందువల్ల రోజూ కొంత సమయాన్ని రైటింగ్ ప్రాక్టీస్కు కేటాయించాలి. ఏకాగ్రతకు భంగం లేకుండా పిల్లల ఏకాగ్రతకు భంగం కలగకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలి. వారికి ప్రత్యేకంగా ఒక గది కేటాయించాలి. ఈ అవకాశం లేని వారు.. విద్యార్థులు చదువుకునే సమయంలో టీవీ చూడటం, లేదా ఇతరులతో మాట్లాడటం వంటివి చేయకుండా ప్రశాంత వాతావరణం కల్పించాలి. ఎన్ని చిట్కాలు పాటించినా పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే భరోసా అత్యంత ప్రభావం చూపుతుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రిపరేషన్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించాలి. వారికి మానసికంగా భరోసా ఇవ్వాలి. పరీక్ష ముందు రోజు ప్రశాంతంగా ఉండాలి. పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమకు కేటాయించిన సెంటర్లను ముందుగానే చూసుకోవాలి. హాల్ టికెట్, పెన్, ప్యాడ్ వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి. పరీక్ష హాల్లో పరీక్ష హాల్లో తొలుత 10–15 నిమిషాల పాటు ప్రశ్నపత్రాన్ని ఆసాంతం చదవాలి. ఆ తర్వాత బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ క్రమంలో ముఖ్యమైన పాయింట్లు ఉంటే వాటిని అండర్లైన్ చేయడం, సబ్ హెడింగ్స్ పెట్టడం వంటివి మార్కుల సాధన పరంగా ఉపయోగపడే అంశాలు. అదే విధంగా పరీక్ష ముగిసే సమయానికి పది నిమిషాల ముందుగానే సమాధానాలు రాయడాన్ని పూర్తిచేయాలి. మిగిలిన పది నిమిషాల్లో అప్పటికే రాసిన సమాధానాలను ఒకసారి సరిచూసుకోవాలి. ప్రస్తుతం పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఇతరులతో ముఖ్యంగా స్నేహితులతో పోల్చుకోవడం మానుకోవాలి. ముఖ్యంగా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు దీన్ని కచ్చితంగా పాటించాలి. లేకుంటే మానసిక ఒత్తిడికి గురై, అది శారీరక అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది. – డాక్టర్ సి.హెచ్.వెంకట్, క్లినికల్ సైకాలజిస్ట్ విద్యార్థులు పరీక్షల కాలాన్ని సానుకూల దృక్పథంతో ఆస్వాదించాలి. ఏడాది పాటు చదివిన అంశాలను పొందుపర్చి మంచి మార్కులు సాధించేందుకు ఉపకరణాలుగా పరీక్షలను భావించాలి. దీనికి విరుద్ధంగా పరీక్షలంటే ముందుగానే మానసిక ఒత్తిడికి గురవడం వల్ల పలు రకాల సమస్యలు ఎదురవుతాయి. ఇక పిల్లల సంసిద్ధత దిశగా తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో కీలకంగా నిలుస్తుంది. ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం కొంత సమయం కేటాయించడం వల్ల వారికి మనోధైర్యం లభిస్తుంది. – డాక్టర్ ఎం.ఎస్.రెడ్డి, సైకియాట్రిస్ట్. -
Historical Background of Indian Constitution
Constitution: Constitution of a country is the legal document which provides the basic structure of the political system and defines the powers of main organs of the State and demarcates their responsibilities and jurisdictions. CONSTITUTIONAL DEVELOPMENTS It was in 1934 when the idea of Constituent Assembly for India was put forward for the first time by M.N.Roy. In 1935, the Indian National Congress (INC) demanded a Constituent Assembly to frame the Constitution. In 1938 Jawaharlal Nehru, On behalf of INC declared that the Constitution of Free India must be framed without outside interference, by a Constituent Assembly elected on the basis of Adult Franchise. The demand was accepted by British Government during August Offer 1940. In 1942, Sir Stafford Cripps, a member of the cabinet came to India with draft proposal of Independent Constitution, to be adopted after the World War-II. The Cripps proposal was rejected by the Muslim League which wanted India to be divided into two autonomous States with two Separate Constituent Assemblies. Finally, the Constituent Assembly was constituted in November, 1946 under the scheme formulated by the cabinet Mission Plan. LANDMARKS IN THE DEVELOPMENT OF THE CONSTITUTION Regulating Act, 1773 It made a provision of Supreme Court at Fort William, Calcutta comprising one Chief Justice and three other judges. It prohibited the servants of the company from engaging in any private trade of accepting presents or bribes from the natives. Pitt's India Act, 1784 It made a provision of separation in company's commercial and political activities. It created a new body called Board of Control to manage the political affairs while Court of Directors were allowed to manage the commercial affairs. The Company's territories in India were for the First time called British possessions in India Charter Act, 1793 Salaries of the members of the board to be drawn from the Indian exchequer. Charter Act, 1813 Company's monopoly over trade was abolished in India but its monopoly over trade with China and for trade in tea retained. Constitutional position of the British territories in India was explicitly defined for the first time. This act asked Company to spend one lakh rupees every year on the education of Indians. Christian missionaries were permitted to preach their religion in India. Charter Act, 1833 Company lost its monopoly over trade with China also and it was asked to close the commercial business. The Company became a purely administrative body. It made the Governor General of Bengal as the Governor General of India. This act asked government to abolish slavery in India. Charter Act, 1853 Separation of executive and legislative functions of the Governor General's Council. It provided for addition of six new members called legislative Councilors to the Council. It was known as Indian (Central) Legislative Council. An open competition system of selection and recruitment of civil servants was introduced. For the first time local representation in the Indian (Central) Legislative Council was allowed. Government of India Act, 1858 It brought an end to the Company's rule and transferred power to the British crown. It changed the designation of Governor General of India to that of Viceroy of India and he was appointed as the direct representative of British Crown in India. Dual Government introduced by pitt's Act was abolished by this act. This act proposed highly centralized administration. A new office of Secretary of State for India was created and he was vested with complete authority and control over Indian administration. The secretary of state was a member of the British Cabinet and was responsible ultimately to the British Parliament. -
పంచాయతీరాజ్ వ్యవస్థ–పరిణామక్రమం
1. స్థానిక సంస్థల ప్రధాన ఉద్దేశం? 1) ప్రజాస్వామ్య వికేంద్రీకరణ 2) అభివృద్ధిలో భాగస్వామ్యం 3) సామాజిక నాయకత్వాన్ని పెంపొందించడం 4) పైవన్నీ 2. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం కేరళ. రెండో రాష్ట్రం? 1) తెలంగాణ 2) అసోం 3) రాజస్థాన్ 4) ఆంధ్రప్రదేశ్ 3. పంచాయతీ వ్యవస్థ అనేది ఏ రకమైన విభజన? 1) విధుల పరమైన 2) పరిపాలనా పరమైన 3) భౌగోళిక పరమైన 4) పైవేవీ కావు 4. రాజకీయ పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవచ్చని చెప్పిన కమిటీ? 1) అశోక్ మెహతా కమిటీ 2) వెంగళరావు కమిటీ 3) చొక్కారావు కమిటీ 4) పైవేవీ కాదు 5. జిల్లా పరిషత్కు ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలని సిఫార్సు చేసిన కమిటీ? 1) బల్వంత్రాయ్ మెహతా కమిటీ 2) అశోక్ మెహతా కమిటీ 3) నరసింహం కమిటీ 4) వెంగళరావు కమిటీ 6. గ్రామ పంచాయతీ సభ్యుల ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? 1) జిల్లా కలెక్టర్ 2) జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి 3) జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 4) జిల్లా మున్సిఫ్ కోర్టు 7. మన రాష్ట్రంలో అమల్లో ఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ? 1) గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ 2) గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా ప్రజా పరిషత్ 3) గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, మున్సిపాలిటీ 4) పైవేవీ కావు 8. మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉండి ఓటుహక్కు లేని వారు? 1) ఎన్నికైన సభ్యులు 2) కోఆప్ట్ సభ్యులు 3) మండలంలోని రాజ్యసభ సభ్యులు 4) మండలంలోని సర్పంచ్లు 9. మండల పరిషత్ అధ్యక్షుణ్ని ఎవరు ఎన్నుకుంటారు? 1) ఓటర్లు 2) మండల పరిషత్ సభ్యులు 3) మండల పరిషత్తులో ఎన్నికైన సభ్యులు 4) మండలంలోని సర్పంచ్లు 10. కింది వాటిలో సరైనది? 1) గ్రామసభలో ఎన్నికైన సభ్యులుండరు 2) వార్డు కమిటీల ఏర్పాటుకు కనీస జనాభా 3 లక్షలు ఉండాలి 3) జిల్లా పరిషత్లో ఏడు స్థాయీ సంఘాలు ఉంటాయి 4) పైవన్నీ 11. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం గ్రామ పంచాయతీల ఏర్పాటుకు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటాయి? 1) ప్రకరణ 39 2) ప్రకరణ 41 3) ప్రకరణ 40 4) ప్రకరణ 42 12. పదకొండో షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించిన విధుల సంఖ్య? 1) 9 2) 19 3) 29 4) 39 13. రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? 1) రాష్ట్రపతి 2) గవర్నర్ 3) ప్రధానమంత్రి 4) ఎవరూ కాదు 14. న్యాయ పంచాయతీల ఉద్దేశం? 1) గ్రామ పంచాయతీలను నిర్వహించడం 2) çసర్పంచ్ తీర్పుల్ని కొట్టేయకపోవడం 3) హైకోర్ట్ అప్పీల్కు అనుమతివ్వడం 4) గ్రామీణ ప్రజలకు ఎక్కువ ఖర్చు లేకుండా త్వరగా న్యాయం అందించడం 15. గ్రామీణ సమాజం అత్యధిక అధికారాలు కలిగిన కాలం? 1) చోళులు 2) బ్రిటిష్ 3) పల్లవులు 4) మొఘల్ 16. స్థానిక సంస్థలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ? 1) మానవ వనరుల శాఖ 2) గణాంక శాఖ 3) పట్టణాభివృద్ధి శాఖ 4) గ్రామీణాభివృద్ధి శాఖ 17. గ్రామసభలో ఎవరు సభ్యులుగా ఉంటారు? 1) గ్రామ పంచాయతీలోని వయోజనులు 2) గ్రామ పంచాయతీలోని రిజిస్టర్డ్ ఓటర్లు 3) పై ఇద్దరూ 4) పై ఎవరూ కాదు 18. స్థానిక ప్రభుత్వాలను ఏ జాబితాలో చేర్చారు? 1) కేంద్ర 2) రాష్ట్ర 3) ఉమ్మడి 4) పైవేవీ కావు 19. మన దేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఏ నగరంలో ఏర్పాటుచేశారు? 1) కోల్కతా 2) ముంబై 3) చెన్నై 4) ఢిల్లీ 20. స్థానిక సంస్థలకు సంబంధించిన మొదటి తీర్మానం? 1) రిప్పన్ తీర్మానం 2) వికేంద్రీకరణ కమిషన్ 3) మేయో తీర్మానం 4) పైవేవీ కాదు 21. స్థానిక స్వపరిపాలనను రాష్ట్ర అంశంగా ఏ చట్టంలో ప్రకటించారు? 1) 1909 మింటోమార్లే చట్టం 2) 1919 మాంటెంగ్–చెమ్స్ఫర్డ్ చట్టం 3) భారత ప్రభుత్వ చట్టం 1935 4) భారత స్వాతంత్య్ర చట్టం 1947 22. కింది వివరాలను పరిశీలించండి. ఎ) రాజ్యాంగంలోని 9వ భాగంలో పంచాయితీలకు సంబంధించిన అంశాలున్నాయి. దీన్ని 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చారు బి) రాజ్యాంగంలోని 9–ఎ భాగంలో మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలున్నాయి. ప్రకరణ 243–క్యూ ప్రకారం ప్రతి రాష్ట్రంలో మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ అనే రెండు రకాల మున్సిపాలిటీలు ఉండాలి పై వ్యాఖ్యల్లో ఏది సరైనది 1) ఎ మాత్రమే 2) బి మాత్రమే 3) రెండూ సరైనవి 4) రెండూ సరికాదు 23. స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అన్వయించని రాష్ట్రాలు? 1) గోవా, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి 2) ఢిల్లీ, గోవా, మిజోరం, మేఘాలయ 3) మేఘాలయ, నాగాలాండ్, మిజోరం 4) సిక్కిం, అసోం, మిజోరం 24. ప్రస్తుత పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలం? 1) అశోక్ మెహతా కమిటీ 2) బల్వంత్రాయ్ మెహతా కమిటీ 3) వసంతరావ్ నాయక్ కమిటీ 4) రాజమన్నార్ కమిటీ 25. నూతన పంచాయతీరాజ్ చట్టం–1993లో అనేక కొత్త అంశాలు చోటుచేసుకున్నాయి. అయితే ఆ అంశాల జాబితాలో లేనిది? 1) వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ప్రాథమిక విద్య, సామాజిక అడవులు లాంటి అనేక కొత్త విధులను చేర్చారు 2) నిర్దేశిత సమయంలో అన్ని స్థానాలకు తప్పనిసరిగా ఎన్నికలు జరపాలి 3) పంచాయతీల్లో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయించడం 4) పంచాయతీ సభ్యుల్లో క్రమశిక్షణ, జవాబుదారీ కోసం వారికి వేతనం ఇవ్వడం 26. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు? 1) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2) ప్రధానమంత్రి 3) గవర్నర్ 4) జాతీయ ఆర్థిక సంఘం 27. జతపరచండి. పట్టిక ఐ i) సామాజికాభివృద్ధి పథకం ii) జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం iii) పంచాయతీరాజ్ వ్యవస్థ iv) నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ సమాధానాలు 1) 4 2) 4 3) 3 4) 1 5) 2 6) 4 7) 1 8) 4 9) 3 10) 4 11) 3 12) 3 13) 2 14) 4 15) 1 16) 4 17) 2 18) 2 19) 3 20) 3 21) 3 22) 3 23) 3 24) 2 25) 4 26) 3 27) 2 -
రూల్స్ కమిటీ విధులు ఏమిటి?
పార్లమెంటరీ కమిటీలు సాధారణ కమిటీలు ప్రభుత్వ హామీల కమిటీ ♦ ఈ కమిటీలను ఉభయ సభలకు వేర్వేరుగా ఏర్పాటు చేస్తారు. ♦ లోక్సభలో 15 మంది, రాజ్యసభలో 10 మంది సభ్యులుంటారు. ♦ ప్రశ్నోత్తరాల సమయంలో బిల్లులు, తీర్మానాలపై చర్చలు జరిగేటప్పుడు మంత్రులు అనేక హామీలిస్తుంటారు. వాటి అమలు, తదితర విషయాలను ఇది పరిశీలిస్తుంది. దత్త శాసనాల కమిటీ (నియోజిత శాసనాల కమిటీ) ఇది కూడా ఉభయ సభలకు వేర్వేరుగా ఉంటుంది. వీటి చైర్మన్లను ఆయా సభల అధ్యక్షులు నియమిస్తారు. 15 మంది సభ్యులుంటారు. మంత్రులు ఇందులో సభ్యులుగా ఉండకూడదు. ♦ పార్లమెంటు కార్యనిర్వాహక వర్గానికి దత్తత చేసిన శాసనపరమైన అంశాలను, వాటి నిర్మాణంలో ఉన్న చట్టబద్ధతను పరిశీలించడం, లోగడ రూపొందించిన చట్టాల సవరణకు సంబంధించిన ఉత్తర్వులను సభకు సమర్పించేందుకు తగిన అవకాశాలు ఉండేలా చూడటం ఈ కమిటీ ముఖ్య విధులు. ♦ ఈ కమిటీని జి.వి.మౌలాంకర్ పార్లమెంట్ విధుల రక్షణకర్తగా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ♦ ఇది ఉభయ సభలతో కూడిన సంయుక్త కమిటీ. ♦ ఇందులో మొత్తం 30 మంది సభ్యులుంటారు. 20 మంది లోక్సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ♦ రాజ్యాంగం, చట్టపరంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలకు కల్పించిన రక్షణలు, సౌకర్యాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుతెన్నులను పరిశీలిస్తుంది. ప్రైవేట్ మెంబర్ బిల్లుల కమిటీ ఇది లోక్సభకే ఉద్దేశించిన ప్రత్యేక కమిటీ. రాజ్యసభలో ఉండదు. డిప్యూటీ స్పీకర్ (చైర్మన్గా ఉంటారు)తో కలుపుకొని 15 మంది సభ్యులుంటారు. ఇది ప్రైవేట్ మెంబర్ల బిల్లులను పరిశీలించి సూచనలిస్తుంది. రూల్స్ కమిటీ లోక్సభకు, రాజ్యసభకు వేర్వేరు కమిటీలుంటాయి. లోక్సభలో 15 మంది, రాజ్యసభలో 16 మంది సభ్యులుంటారు. ఆయా సభాధ్యక్షులే హోదా రీత్యా చైర్మన్లుగా ఉంటారు. సభా కార్యక్రమాలకు సంబంధించిన నియమ నిబంధనలపై ఇది తగిన సవరణలను సూచిస్తుంది. జనరల్ పర్పస్ కమిటీ ఉభయ సభలకు వేర్వేరుగా ఈ కమిటీలుంటాయి. ఆయా సభల అధ్యక్షులు వీటికి చైర్మన్లుగా ఉంటారు. వీటిలో ఇతర సభ్యులతోపాటు డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్, స్థాయీ సంఘాల చైర్మన్లు సభ్యులుగా ఉంటారు. ఆయా పార్లమెంటు కమిటీల పరిధిలోకి రాని విషయాలను అవసరాన్ని బట్టి ఈ కమిటీకి నివేదిస్తారు. ఎథిక్స్ కమిటీ ఉభయ సభలకు వేర్వేరుగా ఉంటుంది. రాజ్యసభలో 1997లో, లోక్సభలో 2000లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా సభ్యుల సంఖ్య మారుతుంది. సభలో సభ్యుల ప్రవర్తన, పనితీరు, సభా విలువలు తదితర అంశాలపై సూచనలు చేస్తుంది. మహిళా సాధికారత కమిటీ ఈ కమిటీ ఉభయ సభలకు సంయుక్తంగా ఉంటుంది. 1997లో ఏర్పాటుచేశారు. ఇందులో 30 మంది సభ్యులుంటారు. 20 మంది లోక్సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. జాతీయ మహిళా కమిషన్ నివేదికలను పరిశీలించడం, మహిళా సాధికారత, సమానత్వం కోసం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించడం ఈ కమిటీ విధులు. లైబ్రరీ కమిటీ ఇది సంయుక్త కమిటీ. 9 మంది సభ్యులుంటారు. లోక్సభ నుంచి 6 మంది, రాజ్యసభ నుంచి ముగ్గురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. పార్లమెంటు లైబ్రరీ, అందులోని వసతులు, సేవలకు సంబంధించిన విషయాలను ఇది పరిశీలిస్తుంది. సభ్యుల గైర్హాజరు కమిటీ ఇది లోక్సభకే ప్రత్యేకించిన కమిటీ. ఇందులో 15 మంది సభ్యులుంటారు. సభ్యుల అనుమతి పత్రాలను పరిశీలిస్తుంది. సభ్యుల జీతభత్యాలపై కమిటీ ఇది సంయుక్త కమిటీ. మొత్తం 15 మంది సభ్యులుంటారు. లోక్సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది ప్రాతినిధ్యం వహిస్తారు. సభ్యుల జీతభత్యాలకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందిస్తుంది. లాభదాయక పదవుల కమిటీ ఇది ఉభయ సభల సంయుక్త కమిటీ. మొత్తం 15 మంది సభ్యులుంటారు. 10 మంది లోక్సభ నుంచి, 5 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. లాభదాయక పదవులు, సభ్యుల అనర్హతలు తదితర అంశాలను పరిశీలిస్తుంది. డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలు లోక్సభ రూల్స్ కమిటీ సిఫారసుల మేరకు 1993లో 17 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలను మొట్టమొదటిసారి ఏర్పాటు చేశారు. 2004లో వీటి సంఖ్యను 24కు పెంచారు. ప్రతి కమిటీలో 31 మంది సభ్యులుంటారు. 20 మంది లోక్సభ నుంచి, 11 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ కమిటీ సభ్యులను ఆయా సభల అధ్యక్షులు నామినేట్ చేస్తారు. మంత్రులు సభ్యులుగా ఉండటానికి అనర్హులు. ఈ కమిటీల పదవీ కాలం ఏడాది. మొత్తం 24 కమిటీల్లో 16 కమిటీలు లోక్సభ ఆధ్వర్యంలో, మిగిలిన 8 కమిటీలు రాజ్యసభ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. విధులు: వివిధ మంత్రిత్వ విభాగాలు, శాఖలు సమర్పించిన పద్దులను పరిశీలించడం. వివిధ మంత్రిత్వ శాఖల బిల్లులను పరిశీలించడం, అలాగే వాటి వార్షిక నివేదికలు, మౌలిక విధానాలను పరిశీలించడం. సంప్రదింపుల కమిటీ ప్రతి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉభయ సభలకు చెందిన సభ్యులతో ఈ కమిటీలు ఏర్పాటవుతాయి. లోక్సభ సాధారణ ఎన్నికల తర్వాత ఈ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఇవి ఆయా మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ప్రస్తుతం 32 కమిటీలున్నాయి. మంత్రులు, పార్లమెంటు సభ్యుల మధ్య వివిధ విషయాలపై చర్చలు జరిపించడం, పథకాలను రూపొందించే ప్రక్రియ, వాటి అమల్లో తగిన సూచనలు చేయడం ఈ కమిటీల విధులు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలు (జేపీసీ) సమకాలీన సమస్యలు, ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై విచారణ జరిపేందుకు పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేస్తారు. సంబంధిత విషయాలపై నివేదిక సమర్పించగానే ఇవి రద్దవుతాయి. జేపీసీకి సంబంధించి కూడా రాజ్యాంగ ప్రస్తావన లేదు. పార్లమెంటులో ఆయా శాఖలకు సంబంధించిన శాశ్వత కమిటీలు, ప్రత్యేక అంశాలపై వేసే తాత్కాలిక కమిటీలు ఉంటాయి. జేపీసీలు తాత్కాలిక కమిటీల విభాగంలోకి వస్తాయి. ఉభయ సభల తీర్మానాల ద్వారా లేదా లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ల పరస్పర అవగాహన ద్వారా జేపీసీలను ఏర్పాటు చేయొచ్చు. సుమారు 15–30 మందిని సభ్యులుగా తీసుకోవచ్చు. అధికారపక్ష సభ్యుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీ. ఇప్పటివరకు వేసిన జేపీసీలు – వాటి అంశాలు ♦ బోఫోర్స్ కుంభకోణం (1987, ఆగస్టు 6): అధ్యక్షులు–శంకరానంద (కాంగ్రెస్). 50 సార్లు సమావేశమైంది.1998, ఏప్రిల్ 26న ఇచ్చిన నివేదికను ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి. ♦ స్టాక్ మార్కెట్ కుంభకోణం/హర్షద్ మెహతా కుంభకోణం (1992, ఆగస్టు 6): అధ్యక్షులు– రాంనివాస్ మీర్దా (కాంగ్రెస్). 105 సార్లు సమావేశమైంది. 1993, డిసెంబర్ 21న నివేదిక ఇచ్చింది. దీన్ని ప్రభుత్వం ఆమోదించలేదు, తిరస్కరించలేదు. ♦ కేతన్ పరేఖ్ కుంభకోణం/స్టాక్ మార్కెట్ కుంభకోణం(2001, ఏప్రిల్ 26): అధ్యక్షులు–ప్రకాశ్ మణి త్రిపాఠి (భారతీయ జనతాపార్టీ). 109 సార్లు సమావేశమైంది. మొత్తం సభ్యుల సంఖ్య 30. లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. 2002, డిసెంబర్ 19న నివేదిక సమర్పించింది. స్టాక్ మార్కెట్ల నియంత్రణలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ♦ శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలు (2003, ఆగస్టు 8): అధ్యక్షుడు – శరద్ పవార్ (నేషనలిస్ట్ కాంగ్రెస్). 17 సార్లు సమావేశమైంది. మొత్తం సభ్యుల సంఖ్య 15. లోక్సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది సభ్యులు నియమితులయ్యారు. 2004, ఫిబ్రవరి 4న నివేదిక ఇచ్చింది. శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలు నిజమేనని తేల్చింది. ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ఏర్పడింది. ♦ 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం (2011, మార్చి 1): అధ్యక్షులు – పి.సి.ఛాఖో (కాంగ్రెస్). మొత్తం సభ్యుల సంఖ్య 30. లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు. పార్లమెంటరీ కమిటీలు – ప్రభావం ♦ పార్లమెంటరీ కమిటీలు, భారత రాజకీయ వ్యవస్థను మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును నిరంతరం సమీక్షిస్తూ, పాలన యంత్రాంగం సమర్థంగా పనిచేయడానికి తోడ్పడుతున్నాయి. నిరంతర పర్యవేక్షణ ద్వారా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు పార్లమెంటుకు బాధ్యత వహించేలా చూస్తూ, దుబారా, లంచగొండితనం, పక్షపాత వైఖరి, బాధ్యతారాహిత్య ధోరణులను సాధ్యమైనంతవరకు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. అవి అందించే వార్షిక నివేదికలు సభ్యులకు, ప్రజానీకానికి చాలా ఉపయోగపడుతున్నాయి. ♦ ఇటీవలి కాలంలో ఈ కమిటీలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాయనే ఆరోపణ ఉంది. నానాటికీ క్లిష్టమవుతున్న పాలనా కార్యక్రమాలను సక్రమంగా అవగాహన చేసుకొని నియంత్రించే శక్తి సామర్థ్యాలు, ఉత్సాహం సభ్యుల్లో లేకపోవడం, పార్లమెంటుకు తగిన సమయం ఉండకపోవడం, దత్త శాసనాలు, ఆర్డినెన్సులు, సమర్థ ప్రతిపక్షం లేకపోవడం, బడ్జెట్లో ఇమిడి ఉన్న క్లిష్ట ప్రక్రియ తదితరాలు వీటి పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. ♦ శాసనసభా కమిటీలు ఆధునిక కాలంలో మినీ శాసనసభలుగా అవతరించాయని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయవేత్త ఉడ్రోవిల్సన్ అభిప్రాయపడ్డారు. -
ఏపీపీఎస్సీ..గ్రూప్–2 మెయిన్స్
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్–2 స్క్రీనింగ్ పరీక్ష ముగిసింది. ఇక తదుపరి దశ.. మెయిన్ ఎగ్జామినేషన్. దీనికి అర్హత సాధించేందుకు అవసరమైన కటాఫ్ ఎంత ఉంటుంది? అనే సందేహం అభ్యర్థుల్లో ఉంది.ఈ క్రమంలో కటాఫ్ అంచనాతోపాటు మెయిన్ పరీక్ష సన్నద్ధతకు నిపుణుల సూచనలు.. పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలిసారి నిర్వహించిన గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్ట్కు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. 982 ఉద్యోగాలకు 4,83,321 మంది పోటీపడ్డారు. స్క్రీనింగ్ టెస్ట్లో మెరిట్ ఆధారంగా ఒక్కో ఉద్యోగానికి 50 మంది చొప్పున ఎంపిక చేసి, వారికి మే 20, 21 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ్గ కటాఫ్ 85 – 105: స్క్రీనింగ్ టెస్ట్ కటాఫ్ 85 నుంచి 105 మధ్యలో ఉంటుందని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి పరీక్ష జరిగిన రోజున కటాఫ్ 90 నుంచి 110 మధ్యలో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఏపీపీఎస్సీ... ప్రిలిమినరీ ‘కీ’ ప్రకటించిన తర్వాత కటాఫ్ అంచనాల్లో మార్పు వచ్చింది. 110 మార్కులు పొందే అభ్యర్థుల సంఖ్య 1500 నుంచి 2000 లోపు ఉంటుందని.. వారు కూడా సివిల్స్, గ్రూప్–1 వంటి పరీక్షలకు సన్నద్ధమవుతూ.. గ్రూప్–2కు హాజరైనవారే ఉంటారని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. ్గ ఫ్యాక్ట్స్కు ప్రాధాన్యం: స్క్రీనింగ్ టెస్ట్లోని ప్రశ్నలను పరిశీలిస్తే.. ఊహించిన విధంగానే ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలకు ప్రాధాన్యం లభించింది. 80 శాతం ప్రశ్నలు ఈ కోవకు సంబంధించినవే. గతంలో సబ్జెక్టు నిపుణులు పేర్కొన్నట్లు అభ్యర్థులను వడపోయడమే లక్ష్యంగా ప్రశ్నలు రూపొందించినట్లు తెలుస్తోంది. కరెంట్ అఫైర్స్, పాలిటీలో ఫ్యాక్ట్స్ ఆధారిత ప్రశ్నలు అధికంగా ఉన్నాయి. ఎకానమీలో కూడా గణాంకాలు, కేటాయింపులు, పథకాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఇది డిస్క్రిప్టివ్ అప్రోచ్తో ప్రిపరేషన్ సాగించిన అభ్యర్థులకు కొంత కలిసొచ్చే అంశం. ్గ మెయిన్కు.. డిస్క్రిప్టివ్ విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. మెయిన్లో అడిగే ప్రశ్నలు ఒక అంశంపై సంపూర్ణ అవగాహన, అనువర్తిత నైపుణ్యం అవసరమైన విధంగా ఉండే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ను డిస్క్రిప్టివ్ తరహాలో సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ వరకు ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ చేసి, కటాఫ్ మార్కులు సాధిస్తామనే నమ్మకమున్న అభ్యర్థులు సైతం తమ ప్రిపరేషన్ను డిస్క్రిప్టివ్ తరహాకు మళ్లించాలని చెబుతున్నారు. ్గ పేపర్–1 ప్రిపరేషన్: గ్రూప్–2 మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్–1 జనరల్ స్టడీస్ను పటిష్ట ప్రణాళికతో అధ్యయనం చేయాలి. సిలబస్లో పేర్కొన్న అంశాలను, సమకాలీన పరిణామాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. నాన్–మ్యాథ్స్ అభ్యర్థులు జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ ముమ్మరం చేయాలి. సిలబస్లోని 12 విభాగాల్లో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రెటేషన్, డేటా ఎనాలిసిస్ అంశాలను రెండు విభాగాల్లో పొందుపరిచారు. వీటి నుంచి 10–15 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బేసిక్ మ్యాథ్స్ నుంచి పై–చార్ట్స్, ఫ్లో–చార్ట్స్ వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ్గ పేపర్–2.. చారిత్రకం.. రాజ్యాంగం: పేపర్–2లోని ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి స్వాతంత్య్రోద్యమానికి ముందు రాష్ట్ర స్థాయిలో జరిగిన ఉద్యమాలు.. వాటి ప్రాధాన్యాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఉద్యమాలు, వాటికి నేతృత్వం వహించిన వ్యక్తులు, సాంస్కృతిక ఉద్యమకారుల గురించి తెలుసుకోవాలి. ఆంర«ధ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవాలి. రెండో సెక్షన్లో భారత రాజ్యాంగంలో అధికరణలు, వాటి నేపథ్యాలకు సంబంధించి పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాలి. ్గ పేపర్–3 ఎకానమీ: ఎకానమీ విషయంలో అభ్యర్థులు పంచవర్ష ప్రణాళికల నుంచి నీతి ఆయోగ్ వరకు కాన్సెప్ట్, అప్లికేషన్ ఓరియెంటేషన్ విధానంలో అభ్యసనం సాగించాలి. స్క్రీనింగ్ టెస్ట్లో ప్రణాళికలకు సంబంధించిన ప్రశ్నలను పరిశీలిస్తే.. గరీబీ హటావోను లక్ష్యంగా చేసుకున్న ప్రణాళిక ఏమిటి? వంటి ఫ్యాక్ట్ ఆధారిత ప్రశ్నలు అడిగారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు.. ఫలితాలు, కారణాలు వంటి విభిన్న కోణాల్లో అధ్యయనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి రాష్ట్రంలోని సహజ వనరులు– ఆదాయాభివృద్ధి పథకాలు వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా సంక్షేమ పథకాలు.. వాటి లక్షిత వర్గాలు.. ప్రస్తుతం వాటి తీరుతెన్నులపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆన్లైన్ టెస్ట్పై అవగాహన గ్రూప్–2 మెయిన్ ఎగ్జామినేషన్కు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. ఆన్లైన్ టెస్ట్ విధానంపై అవగాహన పెంపొందించుకోవాలి. ఈ క్రమంలో ఇప్పటి నుంచే కంప్యూటర్ ఆపరేటింగ్కు సంబంధించి బేసిక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. లేదంటే పరీక్ష సమయంలో ఇబ్బందికి గురవుతారు. సమయం సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. టైమ్ మేనేజ్మెంట్ ప్రధానం గ్రూప్–2 మెయిన్ ఎగ్జామినేషన్కు సిద్ధమవుతున్న అభ్యర్థులు టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యమివ్వాలి. సబ్జెక్టుల ప్రిపరేషన్ కోణంలో చూస్తే ఇటీవల కాలంలో కీలకంగా మారిన పర్యావరణ సంబంధిత అంశాలపై దృష్టిసారించాలి. ఒకవైపు ఫ్యాక్ట్స్కు ప్రాధాన్యమిస్తూనే మరోవైపు వాటికి సంబంధించిన నేపథ్యంపై క్షుణ్నంగా అవగాహన పెంపొందించుకోవాలి. – గురజాల శ్రీనివాసరావు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, హైదరాబాద్. గ్రూప్–2 మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్–1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు పేపర్–2 సెక్షన్–1: ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర సెక్షన్–2: భారత రాజ్యాంగం 150 మార్కులు పేపర్–3 ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ 150 మార్కులు -
Ticks and mites are actually?
1. The largest order in the animal kingdom? a) Primates b) Insectar c) Arthropoda d) Mammalia 2. The protozoan parasite which is responsible for causing malaria in humans is? a) Plasmodium b) Entamoeba c) Paramoecium d) Euglena 3. The largest living reptiles are? a) Dinosaurs b) Snakes c) Turtles d) Crocodiles 4. A group of similar individuals which can interbreed among themselves is called? a) Population b) Species c) Family d) Phylum 5. Amoebiasis (Amoebic Dysentery) is caused by? a) Plasmodium Vivax b) Taenia Solium c) Entamoeba Histolytica d) Entamoeba Gingivalis 6. The period between infection and appearance of first malarial symptom is? a) Activation period b) Pre patient period c) Gestation period d) Incubation period 7. Which of the sponges is harmful to the oyster industry? a) Cliona - boling sponge b) Spongilla - Fresh water sponge c) Euspongia - Bath sponge d) Euplectella-Venus flower basket 8. Consider the following statements? 1) Tape worm is a hermaphrodite 2) Round worm has separate sexes 3) Filaria is caused by a nematode 4) Guinea worm is an annelid Which of these is correct? a) 1 and 2 b) 1, 2 and 3 c) 3 and 4 d) 2, 3 and 4 9. Ticks and mites are actually? a) Arachnids b) Crustaceans c) Insects d) Myriapods 10. The poison glands of snakes are homologous to? a) Electric organs of fish b) Stings of rays c) Sebaceous glands of mammals d) Salivary glands of vertebrates 11. A snake has? a) Movable eye lids b) Immovable eye lids c) No eye lids d) Only nictitating membrane 12. Venom of cobra effects? a) Respiratory system b) Nervous system c) Digestive system d) Circulatory system 13. Which one of the following is a non-poisonous snake? a) Sea snake b) Bungarus c)Viper d) Python 14. The structures that are not well suited for flight in bird? a) Breast muscles b) Well developed olfactory lobes c) Well developed optic lobes d) Cerebellum 15. If a bird is transferred from 30°C to 10°C, the body temperature will change to? a)10°C b) 30°C c) Remain unchanged d) 15°C 16. The most important function of diaphragm in mammal is? a) To divide the body cavity in to 2 compartments b) To protect the lung c) To aid in respiration d) To protect the heart 17. In Herbivorous animals, the caecom is considered to be concerned with the digestion of? a) Proteins b) Cellulose c) Fat d) Starch 18. The peculiarity of fish heart is that it has? a) All venous blood b) All arterial blood c) Mixed blood d) No blood 19. The electric organs in electric rays are modified? a) Muscles b) Nerves c) Blood cells d) Scales 20. The chief excretory cells which are found in flatworms are? a) Nephridia b) Nephrona c) Flame cells d) Neurons 21. The largest invertebrate belongs to the animal phylum? a) Arthropoda b) Annelida c) Echinodermata d) Mollusca 22. Twelve pairs of cranial nerves are present in? a) Mammals b) Birds c) Reptiles d) All the above 23. Which of the following is a genetic disease? a) Haemophilia b) Red-Green colour blindness c) Albinism d) All the above 24. The chromosomal disorder in which the human mate has two "X" chromosomes instead of one in 23rd pair? a) Down's syndrome b) Patau's syndrome c) Klinefelter's syndrome d) Edward's syndrome 25. The dreadful malaria is caused by? a) Plasmodium Falciparum b) Plasmodium Vivax c) Plasmodium Malariae d) Plasmodium ovale 26. The mineral ions required for muscle contraction and blood clotting? a) Sodium b) Calcium c) Potassium d) Magnesium 27. The vitamin which is required to be taken by Pregnants for good mental development of children is? a) Folic Acid b) Retinol c) Calciferol d) Nicotinamide 28. Which of the following is/are viral diseases? a) Hepatities b) Yellow fever c) Influenza d) All the above 29. The part of the body effected in elephantiasis? a) Bone Marrow b) Brain c) Blood cells d) Lymphnode 30. The disease caused by a fungus? a) Athelete's Foot b) Ring warm c) Candidiasis d) All the above 31. Paralysis is caused due to damage of? a) Spinal nerve b) Motor nerve c) Muscle d) Bone 32. Which of the following is a warm blooded animal? a) Rabbit b) Snake c) Lizard d) Frog 33. The scientific name of state bird of Telangana? a) Psittacula Krameri b) Coracias Benghalensis c) Apteryx d) Pavo Cristatus 34. The birds with largest wingspan? a) Bat b) Vulture c) Eagle d) Sea Albatross 35. The subcutaneous fat layer present below the skin in aquatic mammals is known as? a) Foam b) Blubber c) Melon d) None of these 36. The type of excretory organs present in insects? a) Nephridia b) Antennary glands c) Malpighian Tubules d) Kidneys 37. The rearing and culturing of honey bees? a) Lac culture b) Apiculture c) Sericulture d) Oleri culture 38. Special organs found in snakes fro olfaction (smell)? a) Keber's organs b) Jacobson's organs c) Thomas organs d) Green glands 39. Which of the following snakes venom effect the circulatory system i.e., haemotxic? a) Coral snake b) Krait c) Cobra d) Viper 40. The only snake that builds nests and is also the largest poisonous snake? a) Cobra b) King cobra c) Python d) Krait 41. Which of the following is a true fish? a) Star fish b) Silver fish c) Jelly fish d) Zebra fish 42. The total number of air sacs present in flying birds? a) 9 b) 7 c) 8 d) 6 43. The largest phylum among the animals? a) Chordata b) Arthropoda c) Mollusca d) Porifera 44. The largest migratory bird that travels a distance of about 40,000 miles every year is? a) Wood cock b) Arctic tern c) Japanese swift d) Indian swift 45. The blood cells suitable for DNA finger printing are? a) WBC b) RBC c) Platelets d) All the above 46. Which of the following statements is not true? a) All hormones are chemically proteins b) Certain RNA molecules act as enzymes c) Artemisinin is an anti malaria drug d) Diclofenac is a endangering vultures in India 47. Which of the flowing is source of alcoholic drink Rum? a) Barley Malt b) Wheat Mash c) Sugar cane Juice d) Potato mast 48. Which of these vitamins is also called yellow enzyme? a) Pyridoxine b) Folic Acid c) Retinal d) Riboflavin 49. The molecular control of programmed cell death is? a) Apoptosis b) Metastasis c) Apolysis d) Autolysis 50. The recipient of Nobel 2016 for Medicine? a) Yoshinori Ohsumi b) Bruce a. Beutler Jules c) John Gurdon, Shinya Yamanaka d) Luc Montagnier, C. Chermann KEY 1) b 2) a 3) d 4) b 5) c 6) d 7) a 8) b 9) a 10) d 11) b 12) b 13) d 14) b 15) c 16) c 17) b 18) c 19) a 20) c 21) d 22) d 23) d 24) c 25) a 26) b 27) a 28) d 29) d 30) a 31) b 32) a 33) b 34) d 35) b 36) c 37) b 38) b 39) d 40) b 41) d 42) a 43) b 44) b 45) a 46) a 47) c 48) d 49) a 50) a -
గంగమ్మను తీసుకువచ్చారు!
విద్య అనేది వివేకాన్ని మాత్రమే కాదు... పోరాడే చైతన్యాన్ని ఇస్తుంది. మన దేశంలోని అనేక మారుమూల గ్రామాలలాగే ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలోని నయాగవ్ కూడా ఒకటి. మిగిలిన సమస్యల మాట ఎలా ఉన్నా ఆ గ్రామానికి తాగునీటి సమస్య అనేది అతి పెద్ద సమస్య. తాగునీటి కోసం మహిళలు ఎన్నో కిలోమీటర్ల దూరం ప్రయాణించేవారు. ‘నీటి సమస్య’ అనేది కేవలం ఆడవాళ్ల సమస్య మాత్రమే అన్నట్లుగా ఉండేవాళ్లు పురుషులు. ఇక అమ్మాయిలను బడికి పంపించడం అనేది అరుదైన విషయం.‘‘మీ అమ్మాయి స్కూలుకు వెళుతుందా?’’ అని కొత్తవాళ్లు ఎవరైనా అడిగితే...‘‘స్కూల్ కా?’’ అనే ప్రశ్నలాంటి సమాధానం ఒకటి వినిపించేది.‘స్కూల్ కా?’ అని ఆశ్చర్యపోవడంలో ఎన్నో అర్థాలు దాగున్నాయి.‘ఆడపిల్లలకు స్కూలుతో పనేమిటి?’ అనేది అందులో ఒకటి. ఒకవేళ అమ్మాయిలు స్కూలు గడప తొక్కినా, మధ్యలోనే చదువును ఆపించడం అనేది సాధారణంగా మారింది. అయితే ‘ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ ‘సెకండ్ ఛాన్స్’ వల్ల ఈ పరిస్థితిలో గణనీయంగా మార్పు వచ్చింది. బడికి వెళ్లని పిల్లలను స్కూల్లో చేర్పించడంతో పాటు చదువును మధ్యలోనే ఆపేíసిన పిల్లలను ‘సెకండ్ ఛాన్స్ ప్రోగ్రాం’లో భాగంగా తిరిగి స్కూల్లో చేర్పించే పనికి ‘ప్రథమ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ స్వీకారం చుట్టింది. దీంతో చాలామంది అమ్మాయిలు పదవతరగతి విజయవంతంగా పూర్తి చేశారు. కొందరు పై చదువులకు వెళ్లారు. కొందరు వృత్తివిద్యా కోర్సులలోకి వెళ్లారు.కొందరు పై చదువులకు వెళ్లి, పార్ట్టైం ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి సహాయంగా నిలిచారు. ఫౌండేషన్ తరపున నిర్వహించిన ‘లైఫ్ స్కిల్స్’ కోర్సు పిల్లలలో ఎంతో మార్పు తీసుకువచ్చింది. సమస్యల పరిష్కారం, నిర్ణయాలలో సరిౖయెన ఎంపిక, విమర్శనాత్మకంగా, సృజనాత్మకంగా ఆలోచించడం... మొదలైన వాటితో పాటు నిజజీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడింది. ‘లైఫ్ స్కిల్స్’ పాఠాలు గది గోడలకే పరిమితం కాలేదు. మద్యపానం, గృహహింస, కచ్చా రోడ్లు, పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడం... మొదలైన వాటితో పాటు నిజజీవితంలో ఎన్నో సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చాయి. దీనికి పెద్ద ఉదాహరణే... ఈ ముగ్గురు అమ్మాయిలు... 1.అహల్య కుమారి. 2.అంజనీ కుమారి. 3.రజనీ కుమారి.ఈ అమ్మాయిలు మొదట తమ గ్రామంలోని తాగునీటి సమస్యపై దృష్టిసారించారు. ఈ సమస్యపై దృష్టి సారించిన వాళ్లలో వీరే ప్రథములు కాదు... అంతకు ముందు చాలామందే దృష్టి సారించారు. అయితే మాత్రం ఏమిటి? ఎలాంటి ఫలితం ఒనగూడలేదు. ఈ ముగ్గురు అమ్మాయిలు మాత్రం ‘ఎలాగైనా సరే, తాగునీటి సమస్యను పరిష్కరించాలి’ అనే దృఢనిశ్చయంతో ముందుకు కదిలారు. ఒకటికి పదిసార్లు గ్రామసర్పంచ్ను కలిసి సమస్య గురించి మాట్లాడారు. గ్రామంలో ఎలాగైనా సరే బోర్వెల్ వేయాలని విన్నవించుకున్నారు. ‘ఆడపిల్లలు ఇల్లు విడిచి బయటికి రావడం ఏమిటి! సమస్యలు అంటూ ఇలా పెద్ద వాళ్ల ఇంటి చుట్టూ తిరగడం ఏమిటి?’ అని గ్రామంలో చాలామంది సన్నాయి నొక్కులు నొక్కారు. చివరికి అహల్య, అంజనీ, రజనీ సోదరులు కూడా... ‘‘మీకు అవసరం లేని పనిలో తలదూర్చుతూ టైం వేస్ట్ చేస్తున్నారు’’ అని విసుక్కున్నారు. విసుగు... కోపం... ఎగతాళి... సూటిపోటి మాటలు... ఇలాంటివేమీ పట్టించుకోలేదు అహల్య, అంజనీ, రజనీ. ‘సమస్య ఉన్న చోట పోరాటం ఉండాలి’ అనే దృక్పథంతో ముందుకు కదిలారు. ఎట్టకేలకు గ్రామంలో బోర్వెల్ వేయించడానికి సర్పంచ్ ఒప్పుకున్నాడు. నెలన్నర రోజులలోనే గ్రామానికి బోర్వెల్ వచ్చింది. ‘‘ఇప్పుడు మా ఊళ్లో తాగు నీటికోసం ఎవరూ వేరే గ్రామాన్ని వెదుక్కుంటూ గంటల తరబడి నడవనక్కర్లేదు’’ అని సంతోషపడి పోతున్నారు అహల్య, అంజనీ, రజనీలు. పిల్లలను బడిలో చేర్పించడం, బడి మధ్యలోనే మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించే పనిలో ఇప్పుడిప్పుడే క్రియాశీలకం అవుతున్నారు అహల్య, అంజనీ, రజనీ.కాస్త ఆలస్యంగానైనా సరే ఈ ముగ్గురిని అభినందనలతో ముంచెత్తారు గ్రామస్తులు. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది. గ్రామంలో బోర్వెల్ వేయించడం అలాంటి అడుగే కావచ్చు. ఇంకా చాలా ప్రయాణమే ఉంది. ఆ ప్రయాణం చేయడానికి ఈ ముగ్గురులాంటి అమ్మాయిలు గ్రామంలో మరింత మంది సిద్ధమవుతున్నారు. -
గురుకుల టీచర్స్ ప్రత్యేకం
Parliamentary Committee means a committee, which is appointed or elected by the House or nominated by the Speaker and which works under the direction of the Speaker and presents its report to the House or to the Speaker and the Secretariat for which is provided by the LokSabha Secretariat. Broadly, the Parliamentary Committees may be classified into the two categories: (i) Ad hoc Committee and (ii) Standing Committee. Ad hoc Committees Ad hoc committees are constituted by the House or by the Presiding Officers, singly or jointly, for a specific purpose and cease to exist when they finish the task assigned to them and submit a report. The usual Ad hoc committees are the select or joint committees on Bills and others like the Railway convention committee, set-up to review the rate of dividend payable by railways to the general revenues, and those constituted to enquire into and report on specific subject. Joint Parliamentary Committees Joint Parliamentary Committee is one type of Ad hoc Parliamentary committees constituted by Parliament. It is mandated to inquire into a specific subject. A JPC (Joint Parliamentary committee) is constituted either through a motion adopted by one House and concurred by the other or through communication between the presiding officers of the two houses. The members are either elected by the Houses or nominated by the presiding officers. The strength of a JPC may vary. The terms of reference of a JPC are decided by the parliament itself. JPC have overarching powers of summoning any authority including the Prime Minister and seeking attendance. Standing Committees Standing committees are those committees, which are either elected by the House or nominated by the Presiding Officer(s) (i.e. the Speaker in the case of the LokSabha and the Chairman in the case of the RajyaSabha) periodically and are permanent in nature. Some important Standing Committees of the LokSabha are as follows: 1. The Business Advisory Committee 2. Committee on Privileges 3. Committee on Government Assurances 4. Estimates Committee 5. Rules Committee 6. Committee on Empowerment of Women 7. Committee on public Undertakings 8. Committee on the Welfare of Scheduled Castes and Scheduled Tribes 9. Public Accounts Committee Financial Committees Committee on Estimates The Estimates committee constituted for the first time in 1950 is a Parliamentary committee consisting of 30 members selected every year by the LokSabha amongst its members in proportion of party strength. It is the largest committee of the Parliament. A minister cannot be elected as a member of the committee. The term of office of the committee is 1 year. Function of Estimate Committee Report what economies, improvements in organization, efficiency of administrative reform, consistent with the policy underlying the estimates may be effected. Suggest alternative policies in order to bring about efficiency and economy in administration. Examine whether the money is well laid out within the limits of the policy implied in the estimates; and Suggest the form in, which the estimates shall be presented to Parliament. The Committee does not exercise its functions in relation to such public undertakings as are allotted to the Committee on Public Undertakings by the Rules of Procedure of LokSabha or by the speaker. Public Accounts Committee It is the oldest committee in existence from 1921. The committee consists of not more than 22 members including 15 members of LokSabha and 7 members of RajyaSabha. The members are elected by their respective Houses. The Chairman is appointed by the Speaker and is usually from the opposition party. Functions of the Committee are as follows: 1. The main function of PAC is to examine the annual audit reports of the CAG, which are laid before the Parliament by the President. The CAG submits three audit report namely Audit report on appropriation accounts, Audit report on finance accounts and audit report on public undertakings. 2. To scrutinise the accounts of the government so that the money dispersed were legally available for and applicable to the purpose to which they have been granted. 3. The expenditure conforms to the authority which governs it. 4. That every re-appropriation has been made in accordance with the provisions made by competence authority. 5. The PAC examines cases involving losses, nugatory expenditure and financial irregularities. It scrutinises the reports of the CAG. Committee on Public Undertakings The Committee on Public Undertaking (CPU) consists of 22 members 15 elected by LokSabha and 7 elected by RajyaSabha. The term of the committee is 1 year. Functions of Committee on Public Undertakings To examine the reports and accounts of public undertakings. To examine the reports of CAG on select PSUs. To ascertain whether that affairs of the public undertaking are being managed in accordance with the sound commercial principles. -
Which statement is true?
Directions (Q. 1-10): Read each sentence to find out whether there is any grammatical mistake/error in it. The error, if any, will be in one part of the sentence. Mark the number of that part with error as your answer. If there is 'No error', mark (5) as your answer. 1.Your father (1)/ wants you become somebody, but you (2)/ take no notice of (3)/what has been said. (4)/ No error (5) 2.The educational systems of the two countries (1)/ is so different (2)/as to provide almost (3)/ no basis for comparison between them. (4)/ No error (5) 3.Such juvenile delinquents are (1)/ too poor that they have (2)/ no choice but become (3)/ school dropouts. (4)/ No error (5) 4.So far in our teaching of languages, (1)/ we have given enough emphasis (2)/ to some common errors, but we have not (3)/lstressed on complicated problems. (4)/ No error (5) 5.Dhanraj, the hero in the novel, (1)/ he grew into a brave man and (2)/ won the friendship of all the people (3)/ in the neighbourhood. (4)/ No error (5) 6.Lalith is such a helpful person (1)/ that (2)/ we are hard (3)/ not to respect him. (4)/ No error (5) 7.Everybody spent a few days (1)/ going over the old notes, but he did it (2)/ in two days or so, and (3)/ the result was marvelous. (4)/ No error (5) 8.The reference book which I bought from one of the (1)/ local English bookstores (2)/ the other day, (3)/ it cost me three hundred dollars. (4)/ No error (5) 9.Although he had been preparing for the championship, (1)/ still (2)/ he had not picked (3)/ when the championship started. (4)/ No error (5) 10.The man was hung as punishment (1)/ for murdering (2)/ his five children (3)/ and his wife. (4)/ No error (5) Directions (Q. 11-15): Rearrange the following six sentences (A), (B), (C), (D), (E) and (F) in a proper sequence to form a meaningful paragraph and then answer the questions given below. A)There might be a few things you have questions about, or you might need to disclose some additional information to make sure you start the job on the right foot. B)This is great news, but now it's time to have another conversation with human resources before signing on the dotted line. C)Either way, you can't ignore these items. D)Make sure you alert a future employer about these things before accepting their offer. E)You've perfected your resume to make it to the job interview, and now you've aced that, too. F)In fact, a company with a new position just made you a job offer. 11. What is the SECOND sentence after rearrangement? 1) A 2) B 3) C 4) E 5) F 12. What is the THIRD sentence after rearrangement? 1) A 2) B 3) C 4) D 5) E 13. What is the FOURTH sentence after rearrangement? 1) A 2) B 3) D 4) E 5) F 14. What is the FIFTH sentence after rearrangement? 1) A 2) B 3) C 4) D 5) F 15. What is the FIRST sentence after rearrangement? 1) A 2) B 3) C 4) D 5) E Directions (Q. 16-20): Each question below has a blank/ two blanks, each blank indicating that something has been omitted. Choose the word/ set of words from the five options for each blank that best fits the meaning of the sentence as a whole. 16. Educational planning should aim at --------- the educational needs of the -------- population of all age groups. 1) Promoting… all 2) meeting… entire 3) understanding … maximum 4) satisfy… full 5) experience… growing 17. Operation flood was ------------ with the primary objective of -------------- rural milk producers with urban milk consumers. 1) Launched … linking 2) devised… making 3) begun… connecting 4) started … planning 5) visualized … joining 18. Once two persons come together, the ----------- of acquaintance and consequently friendship ----------- thus making the world a happy place to live in. 1) Round …widens 2) ball … broadens 3) mirror … increases 4) circle … grows 5) game … narrows 19. Do not imagine that we can effectively deal ---------- the problem of unemployment without technological ------------. 1) About … temper 2) in … understanding 3) off… touch 4) with … progress 5) over … knowledge 20. At the peak of her -------------, she insisted on taking screen tests and refused leads in favour of lesser but more ------------ roles. 1) Freedom … monotonous 2) kingdom … humdrum 3) dukedom … boring 4) famous … similar 5) stardom …challenging Directions (Q. 21-25): Read the following passage carefully and answer the questions given below it. Certain words have been printed in bold to help you locate them while answering some of the questions.The mind of man mirrors the fairest and most interesting properties of nature. The Poet converses with general nature, with affections very much like those, which, through long hours of hard work, the Man of Science has raised up in himself, by conversing with those particular parts of nature which are the objects of his studies. The knowledge acquired by both gives them pleasure. But the knowledge of the Poet brings us closer to a necessary part of our existence, our natural and unalienable inheritance, while the knowledge acquired by the Man of Science is a personal and individual acquisition. It does not naturally create a habitual and direct sympathy connecting us with our fellow-beings. 21. Which statement is true? a) the knowledge acquired by the Man of Science is delicate b) the knowledge acquired by the Man of Science is robust 1) only a 2) only b 3) both a & b 4) neither a nor b 5) either a or b 22. Which statement is false? a) knowledge acquired by the Man of Science fails to connect easily b) The knowledge acquired by Poet and Man of Science gives them pleasure. 1) only a 2) only b 3) both a & b 4) neither a nor b 5) either a or b 23. The synonym of converse is? 1) Speak 2) flatters 3) blurts 4) mimics 5) follows 24. The antonym of acquisition is? 1) Purchase 2) order 3) debt 4) auction 5) failure 25. The antonym of habitual is? 1) Routine 2) customary 3) consistent 4) remarkable 5) reliable Directions: (Q. 26-30): Which of the phrases (1), (2), (3), and (4) given below each sentence should replace the phrase underlined in the sentence to make it grammatically correct? If there is no error mark (5) No correction required as your answer. 26. The man who has committed such a serious crime must get the severely punishment. 1) be getting the most severely 2) has got the most severely 3) get the most severe 4) get the most severely 5) no correction required 27. An artist is always having his own vision of life. 1) always is having 2) always has 3) is having 4) all times has 5) no correction required 28. Having given up smoking, he had no utilize of a lighter. 1) usage of 2) use for 3) utility for 4) utilization 5) no correction required 29. I have been inconsiderate in the past but I will make up to you. 1) make up for you 2) make amends for you 3) make it up to you 4) make you up to it 5) no correction required 30. This program has been adapted to a three year old boy. 1) from a three year old boy 2) for a three year old boy 3) by a three year old boy 4) into a three year old boy 5) no correction required Key 1) 2 2) 2 3) 2 4) 4 5) 3 6) 3 7) 5 8) 4 9) 2 10) 1 11) 2 12) 3 13) 1 14) 3 15) 5 16) 2 17) 1 18) 4 19) 4 20) 5 21) 1 22) 4 23) 1 24) 5 25) 4 26) 3 27) 2 28) 2 29) 3 30) 2 -
The annual report of the UPSC is submitted to?
1. Which of the following Constitutional Amendment Acts was said to be a 'Mini Constitution'? (A) 42nd (B) 44th (C) 46th (D) 50th 2. Where was the first Municipal Corporation in India set up? (A) Bombay (B) Calcutta (C) Delhi (D) Madras 3. Which of the following is not a Panchayati Raj institution? (A) Gram Sabha (B) Gram Panchayat (C) Nyaya Panchayat (D) Gram Co-operative Society 4. Which of the following subjects lies in the Concurrent List? (A) Agriculture (B) Education (C) Police (D) Defence 5. Which one of the following forms the largest share of deficit in Government of India Budget? (A) Primary Deficit (B) Fiscal Deficit (C) Revenue Deficit (D) Budgetary Deficit 6. Five Year Plan in India finally approved by? (A) Union Cabinet (B) President (C) Planning Commission (D) National Development Council 7. The annual report of the UPSC is submitted to? (A) The President (B) The Supreme Court (C) The Prime Minister (D) The Chairman of UPSC 8. A national political party is one which receives 4% of the total votes polled in? (A) Two or more States (B) The Capital City (C) Four or more States (D) In all States 9. Who accords recognition to various political parties in India as National or Regional parties? (A) The Parliament (B) The President (C) The Election Commission (D) The Supreme Court 10. The Election Commission was converted into 'Three Members Commission' in the following year? (A) 1987 (B) 1988 (C) 1989 (D) 1990 11. The provisions related to official language of India can be amended by? (A) Simple majority (B) Minimum 2/3rd majority (C) Minimum 3/4th majority (D) Can not be amended 12. In India, within how much period, was the proclamation of emergency to be approved by both Houses of the Parliament? (A) 14 days (B) 1 month (C) 3 months (D) 6 months 13. How many times has Financial Emergency been declared in India so far? (A) Once (B) 4 times (C) 5 times (D) Never 14. How many times did the President of India declare National Emergency so far? (A) Never (B) Only once (C) Only twice (D) Thrice 15. Which Indian State came under President's rule for maximum number of times? (A) Punjab (B) Himachal Pradesh (C) Kerala (D) Karnataka 16. The method of Constitutional Amendment is provided in? (A) Article 348 (B) Article 358 (C) Article 368 (D) Article 378 Key 1.A 2.D 3.D 4.B 5.B 6.D 7.A 8.C 9.C 10.D 11.A 12.B 13.D 14.D 15.A 16.C -
ఏపీపీఎస్సీ.. గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రశ్నపత్రం, ‘కీ’
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. అభ్యర్థులకు ఉపయోగపడేలా ప్రశ్నపత్రం, సాక్షి నిపుణులు రూపొందించిన ‘కీ’ను అందిస్తున్నాం. కొన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమాధానాలను కూడా పొందుపర్చాం. ఇవి సివిల్స్, గ్రూప్స్, డీఎల్, పంచాయతీ కార్యదర్శి, బ్యాంక్, ఎస్ఎస్సీ తదితర పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఏ గుర్తు ఉన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు. 1. భారతదేశం నుంచి నిష్క్రమించిన తర్వాత విజయ్ మాల్యా ఎక్కడ దాగి ఉన్నాడు? 1) ఇంగ్లిష్ గ్రామం 2) ఫ్రెంచ్ విల్లా 3) క్రూయిజ్ ఓడ 4) అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఒక రిసార్ట్ 2. గణిత శాస్త్రంలో నోబెల్కు సమానమైన పురస్కారంగా దేన్ని భావిస్తారు? 1) ఫీల్డ్స్ మెడల్ 2) న్యూటన్ మెడల్ 3) రామానుజన్ మెడల్ 4) పైథాగరస్ మెడల్ 3. ‘ఒబామా కేర్’ అంటే? 1) సరసమైన ఆరోగ్య సంరక్షణ కోసం చట్టం 2) అందరికీ విద్య కోసం చట్టం 3) జాతి వివక్ష హింస నుంచి రక్షణ కోసం చట్టం 4) ఆశ్రయం లేనివారి సంరక్షణకు చట్టం 4. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్? 1) బాన్కీ మూన్ 2) కోఫీ అన్నన్ 3) ఆంటోనియో గుటెర్రెస్ 4) ఇరినా బొకోవా 5. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? 1) క్రిస్టీన్ లాగార్డ్ 2) జోసెఫ్ స్టిగ్లిట్జ్ 3) క్రిస్టలీనా జార్జీవా 4) జిమ్ యోంగ్ కిమ్ 6. రాజ్యసభ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? 1) పి.జె.కురియన్ 2) అరుణ్ జైట్లీ 3) హమీద్ అన్సారీ 4) షెల్జా కుమారి 7. ‘హాఫ్ లయన్’ అనే పుస్తకాన్ని ఎవరి గురించి రాశారు? 1) సీతారాం కేసరి 2) రాజీవ్ గాంధీ 3) పి.వి.నరసింహారావు 4) మన్మోహన్ సింగ్ 8. భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం? 1) ఇబ్రహీంపూర్ 2) అకోదర 3) ధాసాయి 4) ఖండాలవాడి 9. ఆఏఐM (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) అనే చరవాణిలోని అనువర్తనం కింది దానిపై ఆధారపడి ఉంది? 1) సెంట్రల్ పేమెంట్ ఇంటర్ఫేస్ 2) లోకల్ పేమెంట్ ఇంటర్ఫేస్ 3) యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ 4) వరల్డ్ పేమెంట్ ఇంటర్ఫేస్ 10. భారత నైపుణ్య సంస్థ శంకుస్థాపనను ప్రధానమంత్రి ఏ నగరంలో చేశారు? 1) అలహాబాద్ 2) లక్నో 3) పట్నా 4) కాన్పూర్ 11. ఐదో భారత్ అరబ్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది? 1) దుబాయి 2) మస్కట్ 3) ఖతార్ 4) రియాద్ 12. కేంద్రం ప్రారంభించిన ఉజాలా పథకం ఉద్దే్దశం? 1) అన్ని గృహాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం 2) ఎల్ఈడీ బల్బుల వితరణ ద్వారా సమర్థ వెలుగును అందించడం 3) సౌరశక్తి ఉపకరణాలను ప్రోత్సహించడం 4) విద్యుత్ శక్తి అమ్మకానికి అనియంత్ర ప్రవేశం కల్పించడం 13. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు ఎవరు? 1) ఎస్.క్రిస్టఫర్ 2) ఆర్.చిదంబరం 3) వి.కె.సారస్వత్ 4) జి.సతీష్ రెడ్డి 14. 2012 లండన్ ఒలింపిక్స్లో యోగేశ్వర్ దత్తుకి కాంస్య పతకాన్ని, రజత పతకంగా పై స్థాయికి మార్చడానికి, కింది కుస్తీ యోధుడు నిషేధిత ఉత్ప్రేరకాల పరీక్షలో దోషిగా తేలడం కారణం? 1) తోగ్రుల్ అస్గరోవ్ 2) షరీఫ్ శరిపోవ్ 3) జేక్ వార్నర్ 4) బెసిక్ కుదుఖొవ్ 15. భారతదేశపు కొత్త వాయు సేనాధిపతి ఎవరు? 1) బిపిన్ రావత్ 2) బి.ఎస్.ధనోవా 3) సునిల్ లంబా 4) ఆరూప్ రాహా 16. భారతీయ చరిత్ర కాంగ్రెస్ 77వ సమావేశం ఎక్కడ జరిగింది? 1) చెన్నై 2) బెంగళూరు 3) తిరువనంతపురం 4) కొత్త ఢిల్లీ ఏ 17. 2017, జనవరిలో ఇ– పరిపాలనపై జరిగిన 20వ జాతీయ సమావేశంలో, పౌర కేంద్రీకృత సేవల వితరణలో అత్యద్భుత పనితీరు ప్రదర్శించినందుకు ఆంధ్రప్రదేశ్కి బంగారు పతకం ఏ ప్రాజెక్టు వల్ల లభించింది? 1) ఆధార్తో కూడిన ప్రజా పంపిణీ వ్యవస్థ 2) రుణ మాడ్యూల్ 3) రాష్ట్ర పెన్షన్ పోర్టల్ 4) కోర్ 18. భారత ప్రభుత్వపు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి ఏఖఐఈఅ్గ పథకంలో ఆంధ్రప్రదేశ్లోని ఈ పట్టణం ఉంది? 1) తిరుపతి 2) శ్రీశైలం 3) విజయవాడ 4) అమరావతి 19. బి.సి.సి.ఐ. పనితీరుపై ఏర్పాటు చేసిన లోధా కమిటీ రిపోర్టు? 1) బెట్టింగ్ని నిషేధించాలని సూచించింది 2) బెట్టింగ్ గురించి ఏమీ తెలపలేదు 3) బెట్టింగ్ని న్యాయబద్ధం చేయాలని సూచించింది 4) బెట్టింగ్కి పాల్పడితే జైలుశిక్ష వేయాలని సూచించింది 20. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2016 సంవత్సరానికి ఆటను బాగా మెరుగుపర్చుకొన్న క్రీడాకారులకు ఇచ్చే పురస్కారాన్ని ఎవరికి ఇచ్చింది? 1) పి.వి. సింధు 2) కరోలినా మారిన్ 3) సన్ యూ 4) ఆయకా తాకాహాషీ 21. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? 1) అనిల్ గోయెల్ 2) అనిల్ బైజాల్ 3) విజయ్ గోయెల్ 4) ప్రదీప్ బైజాల్ 22. రాజ్యాంగ అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని ఏ కళాకారుడు చిత్రీకరించారు? 1) నందలాల్ బోస్ 2) దీనానాథ్ భార్గవ 3) జతిన్ దాస్ 4) కాను దేశాయ్ 23. తెలుగులో కవిత్వానికి 2016 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరు గెలుచుకున్నారు? 1) పాపినేని శివశంకర్ 2) కాత్యాయనీ విద్మహే 3) ఆర్. చంద్రశేఖర రెడ్డి 4) వోల్గా 24. చిరహరితే అంటే ఏమిటి? 1) మధ్యప్రదేశ్లో కనుగొన్న ఒక జింక జాతి 2) కర్ణాటకలో కనుగొన్న పొడవైన ఆకుల మొక్క 3) కేరళలో కనుగొన్న చెదల జాతి 4) తమిళనాడులో కనుగొన్న సీతాకోక చిలుకల జాతి 25. కబడ్డీ ప్రపంచ కప్–2016ని ఏ దేశం గెలుచుకొంది? 1) భారతదేశం 2) థాయిలాండ్ 3) ఇరాన్ 4) దక్షిణ కొరియా 26. 2016 సంవత్సరానికి పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కృషి పురస్కారాన్ని జాతీయ స్థాయిలో గెలుచుకొన్న వారు ఎవరు? 1) రూప్ సింగ్ 2) రాజిందర్ సింగ్ 3) కృష్ణయాదవ్ 4) అరుణ రాయ్ 27. సుభాష్ పాలేకర్ ప్రతిపాదించిన వ్యవసాయ పద్ధతి? 1) తక్కువ బడ్జెట్ సేంద్రియ వ్యవసాయం 2) శూన్య బడ్జెట్ ప్రాకృతిక వ్యవసాయం 3) బహుళ అంచెల సేంద్రియ వ్యవసాయం 4) ప్రకృతి మిత్ర సేంద్రియ వ్యవసాయం 28. భారత రాజ్యాంగ ప్రవేశికలో (పీఠికలో) తెలిపిన విధంగా, భారత్ ఒక? 1) సర్వసత్తాక లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం 2) సామ్యవాద సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం 3) లౌకిక సర్వసత్తాక ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్ర రాజ్యం 4) సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం 29. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ లో ఎన్ని ప్రాథమిక విధులను పేర్కొన్నారు? 1) 9 2) 10 3) 11 4) 12 30. భారతదేశంలో ఆస్తిహక్కుకి భంగం కలిగితే ఈ కింది దాన్ని దాఖలు చేయడం ద్వారా సవాలు చేయలేం? 1) రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద రిట్ 2) న్యాయస్థానంలో సివిల్ వ్యాజ్యం 3) రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్ 4) లోక్ అదాలత్లో వ్యాజ్యం 31. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 248 ప్రకారం అవశేషాధికారాలు కింది ఎవరికి కేటాయించారు? 1) పార్లమెంట్ 2) రాష్ట్రాలు 3) కేంద్రం, రాష్ట్రాలు సమష్టిగా 4) రాష్ట్రపతి 32. ఒక వ్యక్తిని భారత రాష్ట్రపతిగా ఎన్ని పర్యాయాలు ఎన్నిక చేయొచ్చు? 1) ఒకసారి 2) పరిమితి లేదు 3) రెండుసార్లు 4) వెంట వెంటనే రెండుసార్లు 33. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మైలురాయి లాంటి తీర్పుని అత్యున్నత న్యాయస్థానం ఏ వ్యాజ్యంలో ఇచ్చింది? 1) గోలక్నాథ్ 2) మేనకా గాంధీ 3) మినర్వా మిల్స్ 4) ఎస్.ఆర్. బొమ్మై 34. ఒక రాష్ట్ర సరిహద్దులను మార్చేందుకు లేదా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు? 1) ప్రభావితమయ్యే రాష్ట్ర విధాన సభ అంగీకారం కావాలి 2) ప్రభావితమయ్యే రాష్ట్ర విధాన సభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి అడగాలి 3) ప్రభావితమయ్యే రాష్ట్ర విధాన సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి 4) ప్రభావితమయ్యే రాష్ట్రం లోక్సభకు సిఫార్సు చేయాలి 35. కింది వాటిలో ఏ రిట్ని ప్రైవేటు వ్యక్తిపై కూడా దాఖలు చేయొచ్చు? 1) కోవారంటో 2) సెర్షియోరరి 3) హెబియస్ కార్పస్ 4) మాండమస్ 36. కింది వాటిలో ఏ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తారు? 1) 26 జనవరి 2) 30 జనవరి 3) 15 ఆగస్టు 4) 26 నవంబర్ 37. కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో ప్రముఖ సమాఖ్య లక్షణాన్ని సూచించడం లేదు? 1) ఆర్థిక వనరుల కేటాయింపు 2) స్వతంత్ర న్యాయ వ్యవస్థ 3) రాజ్యాంగపు ఆధిపత్యం 4) అధికారాల పంపిణీ 38. రాజ్యాంగ నిపుణుడైన కె.సి.వేర్ మాటల్లో, భారత్ ఒక? 1) సహకార సమాఖ్య 2) పాక్షిక సమాఖ్య 3) బలమైన ఏకకేంద్రం 4) సమాఖ్య కాదు 39. ఏ సంవత్సరంలో విద్యాహక్కు ఒక ప్రాథమిక హక్కు కింద అమల్లోకి వచ్చింది? 1) 2001 2) 2002 3) 2009 4) 2010 40. పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు అధ్యక్షత వహించడానికి కారణం? 1) ప్రభుత్వం రూపొందించిన నియమాలు 2) సంప్రదాయం 3) పార్లమెంట్ పద్ధతి నియమాలు 4) రాష్ట్రపతి ఆదేశం 41. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలో లోక్సభ నుంచి, రాజ్యసభ నుంచి (అదే క్రమంలో) ఎంతమంది సభ్యులు ఉంటారు? 1) 15, 15 2) 15, 10 3) 20, 10 4) 10, 10 42. ఎన్నికల ఆదర్శ ప్రవర్తనా నియమావళిని ఎలక్షన్ కమిషన్ ఈ కింది వాటి ప్రకారంగా జారీ చేస్తుంది? 1) రాజ్యాంగంలోని నియమాలు 2) భారతీయ శిక్షాస్మృతిలోని నియమాలు 3) స్వచ్ఛందంగా పాటించేందుకు జారీ చేసినవి 4) ప్రజా ప్రతినిధ్య చట్టంలోని నియమాలు 43. రాజ్యాంగంలోని కింది ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలన విధిస్తారు? 1) ఆర్టికల్ 356 2) ఆర్టికల్ 358 3) ఆర్టికల్ 360 4) ఆర్టికల్ 352 44. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32ని? 1) సాధారణ మెజారిటీతో సవరించవచ్చు 2) సవరించడానికి వీల్లేదు 3) మూడింట రెండు వంతుల మెజారిటీతో సవరించవచ్చు 4) రాష్ట్రాల ఆమోదంతో సవరించవచ్చు 45. కింది వాటిలో ఏ ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి? 1) ఆర్టికల్ 19 కింద హక్కులు 2) ఆర్టికల్ 25 కింద హక్కులు 3) ఆర్టికల్ 21 కింద హక్కులు 4) ఆర్టికల్ 14 కింద హక్కులు 46. రాజ్యాంగంలో ప్రాథమిక విధులు, ఈ కమిటీ సిఫార్సుల వల్ల చేర్చినట్లు భావిస్తారు? 1) స్వరణ్ సింగ్ కమిటీ 2) నరసింహారావు కమిటీ 3) చవాన్ కమిటీ 4) బూటాసింగ్ కమిటీ 47. అంతర్రాష్ట్ర మండలి నిర్ణయాలు కింది ఏ విధంగా తీసుకొంటారు? 1) సర్వ సమ్మతితో 2) హాజరైన సభ్యుల్లో సాధారణ మెజారిటీతో 3) హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో 4) హాజరైన సభ్యుల్లో నాలుగింట మూడు వంతుల మెజారిటీతో 48. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగపు స్ఫూర్తితో చేర్చారు? 1) జర్మనీ 2) యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ 3) ఐర్లాండ్ 4) కెనడా 49. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వేసిన వ్యాజ్యంలో జాతీయ న్యాయ నియామకాల కౌన్సిల్ రాజ్యాంగ చట్టబద్ధతను సమర్థించిన న్యాయమూర్తి ఎవరు? 1) జస్టిస్ జె.ఎస్.ఖేహార్ 2) జస్టిస్ ఎమ్.బి.లోకూర్ 3) జస్టిస్ జె. చలమేశ్వర్ 4) జస్టిస్ కురియన్ జోసెఫ్ 50. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఎం.ఎం. పూంఛీ కమిషన్ సిఫార్సు ప్రకారం, రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం? 1) స్థిరంగా 3 ఏళ్లు ఉండాలి 2) స్థిరంగా ఉండకూడదు 3) రాష్ట్ర విధాన సభ నిర్ణయించాలి 4) స్థిరంగా 5 ఏళ్లు ఉండాలి. 51. కింది వాటిలో ఏది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో లేదు? 1) అంతర్జాతీయ వాణిజ్య పెంపు 2) గోవధపై నిషేధం 3) స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం 4) న్యాయ, పరిపాలనా వ్యవస్థలను వేరు చేయడం 52. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీలను సాధికారం చేయాలని పేర్కొంటుంది? 1) ఆర్టికల్ 38 2) ఆర్టికల్ 39 3) ఆర్టికల్ 40 4) ఆర్టికల్ 41 53. ప్రజా బాహుళ్యం నుంచి అభిప్రాయ సేకరణకు అక్టోబర్ 2016లో ఉమ్మడి పౌర స్మృతిపై ప్రశ్నావళిని ఎవరు పంచారు? 1) న్యాయ మంత్రిత్వ శాఖ 2) జాతీయ అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ 3) జాతీయ మానవ హక్కుల కమిషన్ 4) జాతీయ న్యాయ కమిషన్ 54. రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి కింది వారి అనుజ్ఞపై పదవిలో ఉంటారు? 1) ప్రధానమంత్రి 2) అధికార పార్టీ అధ్యక్షుడు 3) రాష్ట్రపతి 4) సభా నాయకుడు 55. రాజ్యాంగం ప్రకారం, కేంద్ర మంత్రిమండలి ఎవరికి సమష్టి జవాబుదారీగా ఉంటుంది? 1) పార్లమెంటు ఉభయ సభలకు 2) రాష్ట్రపతికి 3) అధికార పార్టీకి 4) లోక్సభకు 56. సచిన్ టెండూల్కర్ను ఏ విభాగంలో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు? 1) సాహిత్యం 2) కళలు 3) విజ్ఞానం 4) సమాజ సేవ 57. ఒక బిల్లు ద్రవ్యబిల్లు అవునా? కాదా? అనే విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది? 1) రాష్ట్రపతి 2) లోక్సభ స్పీకర్ 3) ఆర్థిక మంత్రి 4) అత్యున్నత న్యాయస్థానం 58. కొలీజియమ్ పద్ధతిలో అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల నియామకానికి మంజూరీ, దీని/వీరి నుంచి పొందడమైంది? 1) రాజ్యాంగం 2) ప్రభుత్వపు అంగీకారం 3) అత్యున్నత న్యాయస్థానపు నిర్ణయాలు 4) భారత రాష్ట్రపతి 59. శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఒక బిల్లుని శాసన సభ ఆమోదానికి పంపినప్పుడు, శాసనసభ తిరస్కరిస్తే తర్వాతి మార్గం ఏమిటి? 1) రెండు సభల ఉమ్మడి సమావేశం 2) శాసన మండలి తిరిగి శాసన సభ పునఃపరిశీలనకు పంపడం 3) బిల్లుని గవర్నర్ పరిశీలనకు పంపడం 4) బిల్ పరిసమాప్తి అవుతుంది 60. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలసి మంత్రుల సంఖ్య ఎంత కన్నా తక్కువ ఉండకూడదు? 1) 12 2) 10 3) 15 4) 7 61. అడ్వొకేట్ జనరల్ వేతనం? 1) ఉన్నత న్యాయస్థానపు న్యాయమూర్తి వేతనంతో సమానం 2) గవర్నర్ నిర్ణయిస్తారు 3) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేతనంతో సమానం 4) రాష్ట్ర కేబినెట్ మంత్రి వేతనంతో సమానం 62. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం, కింది వారు గ్రామసభలో సభ్యులుగా ఉంటారు? 1) పంచాయతీ పరిధిలో 18 ఏళ్లు, ఆ పైబడిన వయసు ఉన్న వయోజనులు 2) ఎన్నికల జాబితాలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్లు 3) పంచాయతీ పరిధిలో ఉన్న అందరు పౌరులు 4) గ్రామ పంచాయతీ అనుమతించిన అందరు వ్యక్తులు 63. 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సుల ప్రకారం చట్టబద్ధంగా ఏర్పడిన పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్లో బేసిక్ (ప్రాథమిక) గ్రాంట్, పనితీరు ఆధారిత గ్రాంట్ల నిష్పత్తి కింది విధంగా ఉంది? 1) 70:30 2) 80:20 3) 90:10 4) 75:25 64. కేంద్రం–రాష్ట్రాల మధ్య పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని, ఏ శాతంలో పంపకం చేయాలనే సిఫార్సు ఎవరు చేస్తారు? 1) ఆర్థిక కమిషన్ 2) నీతి ఆయోగ్ 3) అంతర్రాష్ట్ర మండలి 4) జాతీయ అభివృద్ధి మండలి 65. వృత్తి పన్నుపై రాజ్యాంగం విధించిన వార్షిక పరిమితి ఎంత? 1) 5,000 2) 2,500 3) 1,250 4) 2,000 66. కింది ఆర్టికల్స్ని, సంబంధిత రాష్ట్రాలతో జత చేయండి? అ) ఆర్టికల్ 371అ ్క) అస్సాం ఆ) ఆర్టికల్ 371ఆ ఖ) నాగాలాండ్ ఇ) ఆర్టికల్ 371ఇ ఖ) మణిపూర్ ఈ) ఆర్టికల్ 371ఊ S) మిజోరాం ఉ) ఆర్టికల్ 371ఎ ఖీ) సిక్కిం 1) అ్క, ఆఖ, ఇఖ, ఈS, ఉఖీ 2) అ్క, ఆఖీ, ఇఖ, ఈS, ఉఖ 3) అఖ, ఆ్క, ఇఖ, ఈఖీ, ఉS 4) అఖ, ఆఖ, ఇ్క, ఈఖీ, ఉS 67. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఒక రాష్ట్రం ఏర్పాటు చేసే గిరిజన తెగల సలహా మండలిలో ఎంత మంది సభ్యులుండొచ్చు? 1) 10 వరకు 2) 20 వరకు 3) 25 వరకు 4) 50 వరకు 68. ఒక షెడ్యూల్డ్ ప్రాంతంలో శాంతి, సుపరిపాలన కోసం నిబంధనలు ఎవరు జారీ చేస్తారు? 1) రాష్ట్రపతి 2) పార్లమెంట్ 3) విధానసభ 4) గవర్నర్ 69. ఒక షెడ్యూల్డ్ ప్రాంత సరిహద్దులను ఎవరు మార్చగలరు? 1) రాష్ట్రపతి 2) పార్లమెంట్ 3) గవర్నర్ 4) విధానసభ 70. ఒక స్వయం ప్రతిపత్తిగల ప్రాంతం అంటే? 1) స్వయం ప్రతిపత్తిగల జిల్లాల సమాఖ్య 2) ఒక స్వయం ప్రతిపత్తి గత జిల్లాలో స్వయం ప్రతిపత్తి ఉన్న భాగం 3) 3 స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లాల సమితి 4) ఒక స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లా 71. అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఈ కింది హక్కు తాత్కాలికంగా రద్దు కాదు? 1) ఆర్టికల్ 21 కింద హక్కు 2) ఆర్టికల్ 19 కింద హక్కు 3) ఆర్టికల్ 14 కింద హక్కు 4) ఆర్టికల్ 22 కింద హక్కు 72. 2015–2020 కాల వ్యవధిలో పంచాయతీ లకు ఇచ్చే గ్రాంట్–ఇన్–ఎయిడ్ని 14వ ఆర్థిక కమిషన్ ఎంత మొత్తంగా సిఫార్సు చేసింది? 1) రూ.250,292.20 కోట్లు 2) రూ.300,292.20 కోట్లు 3) రూ.200,292.20 కోట్లు 4) రూ.275,292.20 కోట్లు 73. నల్లమందు సాగు ఈ కింది జాబితాలో ఉంది? 1) కేంద్ర జాబితా 2) రాష్ట్ర జాబితా 3) ఉమ్మడి జాబితా 4) అవశేష అంశం 74. రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకి ఉన్న అధికారానికి ఎవరు పరిమితి విధిస్తారు? 1) అత్యున్నత న్యాయస్థానం 2) పౌర సమాజం 3) రాష్ట్రాలు 4) రాజ్యాంగం 75. భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలో అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆదేశిస్తుంది? 1) ఆర్టికల్ 350అ 2) ఆర్టికల్ 300అ 3) ఆర్టికల్ 351అ 4) ఆర్టికల్ 301అ 76. న్యాయ సమీక్షను అత్యున్నత న్యాయ స్థానం రాజ్యాంగంలోని కింది ఆర్టికల్ ద్వారా చేయగలుగుతుంది? 1) ఆర్టికల్ 131 2) ఆర్టికల్ 132 3) ఆర్టికల్ 32 4) ఆర్టికల్ 134 77. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం, కింది రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తప్పనిసరిగా ఉండాలి? 1) మధ్యప్రదేశ్ 2) మహారాష్ట్ర 3) రాజస్థాన్ 4) హిమాచల్ప్రదేశ్ 78. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లక్ష్యం? 1) గ్రామీణ విద్యుదీకరణను మెరుగుపర్చడం 2) ఆడిపిల్లలకు నైపుణ్యాలు అందించడం 3) స్త్రీలలో అక్షరాస్యతను మెరుగుపర్చడం 4) వంట గ్యాస్ కనెక్షన్లను దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇవ్వడం 79. తిరువనంతపురంలో 2016 డిసెంబర్ 28న జరిగిన 27వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? 1) పినరయి విజయన్ 2) రాజనాథ్ సింగ్ 3) అరుణ్ జైట్లీ 4) కిరణ్ బేడీ 80. ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో గెలిచిన మొత్తం పతకాల సంఖ్య ఆధారంగా, దేశాలు అవరోహణ క్రమంలో? 1) అమెరికా సంయుక్త రాష్ట్రాలు, గ్రేట్ బ్రిటన్, చైనా, రష్యా 2) అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చైనా, గ్రేట్ బ్రిటన్, రష్యా 3) అమెరికా సంయుక్త రాష్ట్రాలు, రష్యా, గ్రేట్ బ్రిటన్, చైనా 4) రష్యా, గ్రేట్ బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చైనా 81. ఏ విషయంలో అధ్యయనానికి 2016లో ఎకనామిక్స్ విభాగంలో ఓలివర్ హార్ట్కి నోబెల్ బహుమతి లభించింది? 1) విదేశీ వాణిజ్యపు సిద్ధాంతానికి 2) ఆర్థిక వృద్ధిపై విశ్లేషణకు 3) ద్రవ్యోల్బణంపై అధ్యయనానికి 4) ఒప్పంద సిద్ధాంతంపై పరిశోధనలకు 82. 2016లో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నవారు/అందుకున్నది ఒక?S 1) ప్రభుత్వేతర సంస్థ 2) మిషనరీ 3) దేశాధినేత 4) తిరుగుబాటు పార్టీ నాయకుడు 83. 2016 సంవత్సరానికి వైద్య విభాగంలో నోబెల్ పురస్కారం కింది విషయంపై పరిశోధనలకు దక్కింది? 1) మలేరియా చికిత్సకు 2) పరాన్న జీవుల వల్ల వచ్చే అంటువ్యాధులు 3) వైరస్ల వల్ల వచ్చే అంటువ్యాధులు 4) కణాల స్వయం శోషితకు కారణాలు 84. ఫ్లయిట్ స్టాట్స్ సంస్థ ఇచ్చిన పురస్కారాల ప్రకారం, 2016లో, సకాలంలో విమానాలు నడిపిన సంస్థల్లో మొదటి స్థానం గెలుచుకున్న సంస్థ? 1) సింగపూర్ ఎయిర్ లైన్స్ 2) క్వాంటాస్ 3) కె.ఎల్.ఎం. 4) డెల్టా ఎయిర్ లైన్స్ 85. అల్లావుద్దీన్ ఖిల్జీ... ఆహార పదార్థాలకు స్థిరమైన ధరలను నిర్ణయించడం అనే విపణి విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు? 1) రైతులకు మెరుగైన ఫలసాయాన్ని అందించడానికి 2) వినియోగదారులు రైతుల వద్ద నుంచి నేరుగా కొనడానికి 3) విపణిలోని ధర న్యాయమైన ధరకి సమానంగా ఉండటానికి 4) సైనికులు తక్కువ జీతంతో సుఖంగా ఉండటానికి 86. ఉత్తర భారతదేశంలో 7, 10 శతాబ్దాల మధ్య వ్యాపారం, వాణిజ్యం క్షీణించడానికి ఒక కారణం కింది వాటిలో ఏది? 1) పశ్చిమ రోమన్ సామ్రాజ్య పతనం 2) చైనా సామ్రాజ్య పతనం 3) దక్షిణ, తూర్పు ఆసియా పతనం 4) భారతీయ చేతివృత్తి పనివారి నిపుణత సన్నగిల్లడం 87. కింది సుల్తానుల్లో ఎవరు ప్రజా పనుల విభాగాన్ని నిర్మాణపు కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు? 1) ఫిరోజ్ తుగ్లక్ 2) జలాలుద్దీన్ తుగ్లక్ 3) మహమ్మద్ బిన్ తుగ్లక్ 4) ఘియాసుద్దీన్ తుగ్లక్ 88. శతాబ్దాల పాటు ప్రామాణిక కరెన్సీగా ఉన్న వెండి రూపియాను ఎవరు ప్రవేశపెట్టారు? 1) అక్బర్ 2) షేర్షా సూరి 3) జహంగీర్ 4) హుమాయూన్ 89. రాజా తోడర్మల్ రూపొందించిన ‘దహ్ సాలా’ పద్ధతి కింది విధంగా ఉండేది? 1) పదేళ్లు చెల్లుబడి అయ్యే ఒక ప్రామాణిక రీతిలో భూమిశిస్తు వసూలు చేయడం 2) భూమి శిస్తు లెక్క కోసం పదేళ్లకు ఒకసారి భూమిని కొలిచేవారు 3) ఉత్పత్తి, ధరల పదేళ్ల సగటు ఆధారంగా భూమిశిస్తు వసూలు చేయడం 4) పదేళ్లు రైతు, రాజ్యం మధ్య పంట పంచుకోవడం. 90. మొగల్ కాలంలో పెద్ద పరిమాణంలో వస్తువులను చాలా ఎక్కువ దూరం తీసుకెళ్లి అమ్మే వ్యాపార వర్గాన్ని ఏమని పిలిచేవారు? 1) బేపారులు 2) బనికులు 3) షరాఫ్లు 4) బంజారాలు 91. మొగల్ కాలంలో సుమారు ఎంత శాతం గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్కు వెళ్లేది? 1) 10 శాతం 2) 15 శాతం 3) 20 శాతం 4) 25 శాతం 92. 18వ శతాబ్దపు భారతదేశాన్ని గురించి మాట్లాడుతూ ‘‘భారత్ వాణిజ్యమే ప్రపంచ వాణిజ్యం అనేది మనసులో నిలుపుకోండి’’ అని ఎవరు అన్నారు? 1) పీటర్, ద గ్రేట్ ఆఫ్ రష్యా 2) వాస్కో డ గామా 3) రాబర్ట్ క్లైవ్ 4) ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ డూప్లే 93. అంతర్గత వాణిజ్యంపై అన్ని సుంకాలను ఎత్తేసిన బెంగాల్ నవాబు ఎవరు? 1) మీర్ జాఫర్ 2) సిరాజ్–ఉద్–దౌలా 3) మీర్ ఖాసీం 4) నిజాం–ఉద్–దౌలా 94. బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం వల్ల? 1) భారతదేశం నుంచి ముడి పత్తి ఎగుమతి పెరిగింది 2) భారతదేశం నుంచి వస్త్రాల ఎగుమతి పెరిగింది 3) భారత్ వస్త్ర వ్యాపారంలో సరళీకరణ జరిగింది 4) భారత్ వస్త్ర వ్యాపారంలో ఏ మార్పులేదు 95. 1750లో, ప్రపంచంలో తయారయ్యే వస్తువుల్లో సుమారు ఎంత శాతం భారత్లో తయారయ్యేవి? 1) 24.5% 2) 14.5% 3) 11.5% 4) 9.5% 96. ఏ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల ఆధారిత అభివృద్ధికి ప్రాముఖ్యత ఇచ్చింది? 1) 5వ 2) 4వ 3) 2వ 4) 6వ 97. డబ్బు (కరెన్సీ) నోట్లను చెల్లుబాటు నుంచి తీసివేయడం అనే విషయం ఏ చట్టం పరిధిలో ఉంటుంది? 1) మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 3) బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 4) భారతీయ కాగితపు (పేపర్) కరెన్సీ ఆదేశం 98. కింది వారిలో ఎవరికి భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధంలేదు? 1) సి.సుబ్రమణియం 2) డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ 3) సర్దార్ స్వరణ్ సింగ్ 4) నార్మన్ బోర్లాగ్ 99. లోక్సభలో భారత ప్రభుత్వ బడ్జెట్ను సాయంత్రం 5:30కి ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. ఏ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఉదయం 11:00కు మార్చారు? 1) 1999 2) 2000 3) 2010 4) 2001 100. భారత ప్రభుత్వ కోశపరమైన లోటు కింది దానికి దగ్గరగా ఉంటుంది? 1) రెవెన్యూ జమల కన్నా రెవెన్యూ ఖర్చు ఎంత అధికంగా ఉంటుందో, అంత 2) ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై తీసుకొన్న అప్పులు 3) పన్నుల నుంచి వచ్చే ఆదాయం కన్నా రెవెన్యూ, కాపిటల్ ఖర్చు ఎంత అధికమో, అంత 4) ఆర్థిక సంవత్సరపు అంతానికి పేర్కొన్న ప్రభుత్వ (పబ్లిక్) అప్పులు 101. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత? 1) 42% 2) 36% 3) 32.5% 4) 29.5% 102. హరిత విప్లవం ప్రాథమిక ఉద్దేశం? 1) భూమి పునర్ పంపిణీ ద్వారా ఎక్కువ ఉత్పత్తి సాధించడం 2) ప్రణాళికాబద్ధ ఆహార ధాన్యాల ఎగుమతి 3) వాణిజ్య పంటల సాగు 4) అధిక దిగుబడి వంగడాల ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి 103. 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణల్లో, కింది విధాన చర్యను చేపట్టలేదు? 1) నోట్ల విలువ తగ్గింపు 2) బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఖజానా నుంచి విదేశాలకు తరలించడం 3) నోట్ల రద్దు 4) రూపాయి పాక్షిక పరివర్తనీయత 104. సరళీకరణ, ప్రైవేటీకరణ, విశ్వీకరణలో కింది విధాన చర్య భాగం కాదు? 1) రక్షణ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు 2) కేపిటల్ ఖాతాలో పరివర్తనీయత 3) రిటైల్ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టబడులు 4) పెట్టుబడుల ఉపసంహరణ 105. హరిత విప్లవం వల్ల కింది ఏ పంట ఉత్పత్తిలో అత్యధిక వృద్ధి కనిపించింది? 1) వరి 2) గోధుమ 3) పప్పుధాన్యాలు 4) చిరుధాన్యాలు 106. ఖరీఫ్ 2016–17 కాలానికి, భారత ప్రభుత్వం సాధారణ వరికి క్వింటాల్కి ప్రకటించిన కనీస మద్దతు ధర ఎంత? 1) రూ.1,470 2) రూ.1,510 3) రూ.1,625 4) రూ.1,650 107. జాతీయ వ్యవసాయ విధానం–2000 ప్రకారం, వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు లక్ష్యం కింది దాని కన్నా ఎక్కువ ఉండాలని నిర్ణయించారు? 1) 2% 2) 2.5% 3) 3% 4) 4% 108. ‘గరీబీ హటావో’ను ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు? 1) 4 2) 5 3) 6 4) 3 109. కోశ బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం కింది దాన్ని చేయదు? 1) కోశ, రెవెన్యూ లోటుకు పరిమితి విధించడం 2) బడ్జెట్తో పాటు కొన్ని దృష్టికోణ స్టేట్మెంట్స్ సభ ముందు పెట్టాలని నిబంధన విధించడం 3) లోటులో లక్ష్యాలను సాధించడంలో విఫలం అయితే జరిమానా విధించే నియమాన్ని కలిగి ఉండటం 4) కేంద్ర, రాష్ట్రస్థాయిలో వర్తించడం 110. సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం? 1) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో నడిచే పథకం 2) పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకం 3) పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకం 4) పూర్తిగా బయటి నిధులతో నడిచే పథకం 111. పారిశ్రామిక విధాన తీర్మానం 1977 కింది విషయంపై దృష్టి కేంద్రీకరించింది? 1) భారీ పరిశ్రమలు 2) చిన్నతరహా, గ్రామీణ పరిశ్రమలు 3) ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు 4) ఖనిజ రంగం 112. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన (్కMఖ్గ)ని అమలు చేసే సంస్థ? 1) జాతీయీకరణ చేసిన బ్యాంకులు 2) చిన్నతరహా పరిశ్రమల సేవా సంస్థ 3) జిల్లా పరిశ్రమల కేంద్రం 4) జిల్లా ఉపాధి కల్పనా కేంద్రం 113. ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఏ రంగంలో పూర్తిగా నిషేధించారు? 1) పెట్రోలియం శుద్ధి (రిఫైనింగ్) రంగం 2) కేబుల్ నెట్వర్క్లు 3) వార్తా పత్రికలు 4) చిట్ఫండ్లు 114. ప్రస్తుత విధానం ప్రకారం, బహుళ బ్రాండ్ రిటైల్ వ్యాపార రంగంలో, పెట్టబడి వాటాల్లో ఎంత శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నారు? 1) 51% 2) 49% 3) 26% 4) 100% 115. నవంబర్ 2016 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కింది వాటిలో ఏది భౌగోళిక సూచికల జాబితాలో నమోదు కాలేదు? 1) తిరుపతి లడ్డు 2) ఉప్పాడ జాందానీ చీర 3) గుంటూరు సన్నం మిరపకాయ 4) బందరు లడ్డు 116. జాతీయ తయారీ విధానం, 2011 దృష్టి ప్రకారం, 2022 నాటికి తయారీ రంగంలో ఎన్ని అదనపు ఉద్యోగాలు సృష్టించాలి? 1) 200 మిలియన్లు 2) 100 మిలియన్లు 3) 75 మిలియన్లు 4) 50 మిలియన్లు 117. MఎNఖఉఎఅ (మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎప్లాయ్మెంట్ గ్యారంటీ) పథకం ఆదేశం ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని దినాలు (పని చేయడానికి ముందుకు వచ్చే వారికి) పని ఇవ్వాలని గ్యారంటీ ఉంది? 1) గ్రామంలో ప్రతి వయోజనుడికి 100 దినాలు 2) గ్రామంలో ప్రతి వయోజనుడికి 150 దినాలు 3) గ్రామంలోని ప్రతి ఇంటికి (ఇంట్లోని వయోజనులు మందుకొస్తే) 100 దినాలు 4) గ్రామంలోని ప్రతి ఇంటికి (ఇంట్లోని వయోజనులు మందుకొస్తే) 150 దినాలు 118. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద, ప్రమాదాల నుంచి బీమా భద్రతకు పాలసీదారు ఎంత వార్షిక ప్రీమియం కట్టాలి? 1) సర్వీస్ పన్ను కాకుండా రూ.12 2) సర్వీస్ పన్నుతో కలిపి రూ.12 3) సర్వీస్ పన్ను కాకుండా రూ.330 4) సర్వీస్ పన్నుతో కలిపి రూ.330 119. ఉద్యోగుల భవిష్య నిధి కేంద్ర ధర్మకర్తల మండలి, ఆర్థిక సంవత్సరం 2016–17కి ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు సిఫార్సు చేసింది? 1) 8.8% 2) 8.75% 3) 8.7% 4) 8.65% 120. మాతృత్వ లబ్ధి (సవరణ) బిల్లు–2016లో ఇద్దరికన్నా తక్కువ జీవించి ఉన్న పిల్లలు కల మాతృమూర్తులకు ప్రసూతి సెలవు 12 వారాల నుంచి కింది కాలానికి పెంచాలని ప్రతిపాదించారు? 1) 18 వారాలు 2) 22 వారాలు 3) 26 వారాలు 4) 30 వారాలు 121. ఉద్యోగుల జాతీయ బీమా పథకం కింద ప్రయోజనాలు పొందడానికి, ఒక ఉద్యోగి మాసిక వేతనం గరిష్ట పరిమితి ఎంత? 1) రూ.15,000 2) రూ.21,000 3) రూ.25,000 4) రూ.27,000 122. కార్మిక బ్యూరో 28వ ఖఉS (ఉపాధిలో త్రైమాసిక మార్పులు) రిపోర్ట్ ప్రకారం, 2015లో అత్యధిక ఉపాధి కల్పించిన రంగం? 1) ఐఖీ/ఆ్కౖ రంగం (సమాచార సాంకేతికత/వ్యాపార ప్రక్రియల్లో పొరుగు సేవల రంగం 2) వస్త్ర, దుస్తుల రంగం 3) లోహ రంగం 4) ఆటో మొబైల్ రంగం 123. జనగణన–2011 ప్రకారం షెడ్యూల్డ్ తెగల వారి గృహాల్లో ఎంతశాతం (దగ్గరి పూర్ణ సంఖ్యకు కుదించారు) కాల్చిన ఇటుకలు లేదా కాంక్రీట్తో నిర్మించిన గోడలు కలిగి ఉన్నాయి? 1) 22 శాతం 2) 23 శాతం 3) 24 శాతం 4) 25 శాతం 124. ఇఅ్కఅఖఖీ (కపార్ట్)ని ఏ ఉద్దేశంతో స్థాపించారు? 1) సూపర్ కంప్యూటర్లు తయారు చేయడానికి 2) ఎగుమతులను ప్రోత్సహించడానికి 3) గ్రామీణాభివృద్ధికి 4) కాలుష్య నివారణకు 125. వ్యవసాయ గణన 2010–11 ప్రకారం, 2010–11లో అన్ని వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చేతిలో ఉన్న, వినియోగంతో ఉన్న భూకమతాల సగటు విస్తీర్ణం హెక్టార్లలో వరుస క్రమంలో ఎంత? 1) 1.15; 0.80; 1.52 2) 1.52; 0.15; 0.80 3) 1.52; 0.80; 1.15 4) 1.15; 1.52; 0.80 126. వ్యవసాయ గణన 2010–11 ప్రకారం భారతదేశంలో చిన్న, మధ్య రకం భూకమతాలు మొత్తం భూకమతాల సంఖ్యలో 85% ఉన్నాయి. అయితే ఈ కమతాల చేతిలో ఉన్న వినియోగంలోని విస్తీర్ణం మొత్తం వినియోగంలో ఉన్న విస్తీర్ణంలో ఎంత శాతం? 1) 54.58% 2) 44.58% 3) 34.58% 4) 24.58% 127. NSSౖ (నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ), గృహాల మధ్య ఆర్థిక అసమానతలను కొలిచేందుకు తన సర్వేల్లో కింది సూచికను ఉపయోగిస్తుంది? 1) ఆదాయం 2) వినియోగం 3) ఆస్తి 4) సామాజిక హోదా 128. 2016లో నిర్వహించిన గణతంత్ర దివస్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేశారు? 1) బరాక్ ఒబామా 2) డేవిడ్ కామరూన్ 3) ఫ్రాంకోయిస్ హోలండే 4) షింజో అబే 129. 2014–15 సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో వాస్తవిక వార్షిక వృద్ధి రేటు? 1) 7.3% 2) 7.8.% 3) 7% 4) 7.5% 130. ఇటీవల వార్తల్లో వినిపించిన అలెప్పో అనే ప్రదేశం ఏ దేశంలో ఉంది? 1) ఇజ్రాయెల్ 2) సిరియా 3) ఉక్రైన్ 4) పాలస్తీనా 131. భారతదేశం తర్వాత పెద్దనోట్ల రద్దు కార్యక్రమం చేపట్టి వెనువెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న దేశం? 1) కొలంబియా 2) వెనిజులా 3) బ్రెజిల్ 4) చిలీ 132. సూపర్ వ్యూ–1 అనే జత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ఏదేశం ప్రయోగించింది? 1) అమెరికా సంయుక్త రాష్ట్రాలు 2) రష్యా 3) ఫ్రాన్స్ 4) చైనా 133. డిసెంబర్ 2016లో నిర్వహించిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ముఖ్య అంశం (థీమ్) ఏమిటి? 1) నా స్వరం లెక్కింపదగ్గది 2) మన హక్కులు, మన స్వేచ్ఛలు, ఎల్లప్పడూ 3) ఈ రోజు ఎవరో ఒకరి హక్కుల కోసం నిలుద్దాం 4) # హక్కులు 365 134. హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ నిర్వహిస్తారు? 1) నాగాలాండ్ 2) మిజోరాం 3) మణిపూర్ 4) మేఘాలయ 135. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని మే 11న నిర్వహించడానికి కారణం, ఆ రోజున? 1) పరమ్ సూపర్ కంప్యూటర్ని ప్రారంభించారు 2) భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ తన మొదటి ్కSఔV రాకెట్ను ప్రయోగించింది 3) మొదటి అణు రియాక్టర్ పని ప్రారంభించింది 4) పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు 136. ‘సంతారా’ అనే ఆమరణ ఉపవాస దీక్ష ఏ మతంవారి ఆచారం? 1) బౌద్ధులు 2) జైనులు 3) సూఫీ 4) పార్శీ 137. ప్రపంచ చదరంగ విజేత అయిన మాగ్నస్ కార్ల్సన్ ఏ దేశానికి చెందిన వాడు? 1) స్వీడన్ 2) కెనడా 3) నార్వే 4) గ్రేట్ బ్రిటన్ 138. ఊఐఇN అంటే? 1) ఫారిన్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ నోట్ 2) ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రైమ్స్ నోటీస్డ్ 3) ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్ 4) ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్ కాంటినెంటల్ నేషన్స్ 139. 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా ఎంత శాతం? 1) 4.305% 2) 3.083% 3) 2.503% 4) 5.521% 140. డిసెంబర్ 2015లో పారిస్లో వాతావరణ మార్పుపై నిర్వహించిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఏ విషయంలో అంగీకారం వచ్చింది? 1) కేంద్రీకృతంగా నిర్ణయించిన వాటాలు 2) సామర్థ్యం ఆధారంగా నిర్ణయించిన వాటాలు 3) ఐక్యరాజ్య సమితి ద్వారా నిర్ణయించిన వాటాలు 4) దేశంలో నిర్ణయించిన వాటాలు 141. భారతదేశంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించే ప్రాజెక్ట్ను నడిపే పరిశోధనా సంస్థల సమూహాన్ని కింది ఆంగ్ల సంక్షిప్త నామంతో పిలుస్తారు? 1) ఐnఛీఐఎౖ 2) ఐఔఐఎౖ 3) ఐnఛీఔఐఎౖ 4) ఐnఐఎౖ 142. జాతీయ వాయుమండలీయ పరిశోధన ప్రయోగశాల ఏ నగరానికి దగ్గరగా ఉంది? 1) తిరువనంతపురం 2) చండీగఢ్ 3) తిరుపతి 4) బెంగళూరు 143. ‘సెకండ్ హాండ్ టైమ్’ అనే నోబెల్ పురస్కారం గెలిచిన పుస్తకం విషయం? 1) విజ్ఞాన శాస్త్రంలో సమయ భావన 2) సోవియట్ యూనియన్ సమాజం, రాజకీయాలు 3) సమయ నిర్వహణ 4) వివిధ కాలాల చరిత్ర 144. 104వ భారత విజ్ఞాన కాంగ్రెస్ను ఎక్కడ నిర్వహించారు? 1) చెన్నై 2) తిరుపతి 3) మైసూర్ 4) కోల్కతా 145. కింది గణాంకాన్ని మానవ అభివృద్ధి సూచికలో పరిగణనలోకి తీసుకోరు? 1) తలసరి ఆదాయం 2) పాఠశాలకు వెళ్లిన సంవత్సరాలు 3) ప్రాథమిక ఆస్తులపై యాజమాన్య హక్కులు 4) జీవన కాల ఆశంస స్థాయి 146. టి.ఎం.కృష్ణకు మెగసెసే పురస్కారం 2016లో కింది ఏ కార్యక్రమానికి ఇచ్చారు? 1) సంగీతంలో ప్రతిభకు 2) ప్రజాసేవకు 3) ప్రపంచ శాంతి కోసం కృషికి 4) సామాజిక సమ్మిళిత సంస్కృతి కోసం చేసిన కృషికి 147. కింది వారిలో ‘సఫాయి కర్మచారి ఆందోళన్’ స్థాపకుల్లో ఒకరైన వారు ఎవరు? 1) కైలాష్ సత్యార్థి 2) బెజవాడ విల్సన్ 3) బిందేశ్వర్ పాఠక్ 4) కమలాబెన్ గుర్జర్ 148. దిల్మా రౌసెఫ్ వార్తల్లో ఉండటానికి కారణం? 1) ఆమె రెండో సారి బ్రెజిల్ దేశాధ్యక్షురాలిగా ఎన్నికవడం 2) ఆమెకు అంతర్జాతీయ శాంతి పురస్కారం లభించడం 3) సెనేట్ ద్వారా అభిశంసన జరిగి ఆమెను పదవి నుంచి తొలగించడం 4) తిరుగుబాటు చర్య ద్వారా ఆమెను పదవీచ్యుతురాలిని చేయడం 149. ‘బ్రెగ్జిట్’ ప్రజాభిప్రాయం తర్వాత బ్రిటన్లో కిందిది జరగలేదు? 1) ప్రధాన మంత్రి మారారు 2) ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది 3) కొత్త ప్రధాని ఒక మహిళ 4) హోం సెక్రటరీ కన్జర్వేటివ్ నాయకత్వం చేపట్టారు. 150. 2015, జూన్లో గ్రీస్ దేశంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, కింది ఏ విషయాన్ని నిర్ణయించడానికి జరిగింది? 1) కరెన్సీ విలువను తగ్గించాలా? వొద్దా? 2) పార్లమెంట్ అధికారాలు తగ్గించాలా? వొద్దా? 3) యూరోపియన్ యూనియన్ నుంచి వెళ్లాలా? వొద్దా? 4) ఉద్దీపన కోసం యూరోపియన్ యూనియన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి పెట్టిన షరతులను ఒప్పుకోవాలా? వొద్దా? -
Nathpa Jhakri Dam is located in the State of?
1. India's Mariyappan Thangavelu won a gold medal at the 2016 Rio Paralympics in? 1) Long jump 2) Javelin throw 3) Shot put 4) High jump 2. Who topped the Fortune's list of 51 Most Powerful Women in the World? (It was released in September 2016) 1) Mary Barra 2) Indra Nooyi 3) Marillyn Hewson 4) Ginni Rometty 3. Which Indian-American won the prestigious Lemelson-MIT Prize in September 2016? 1) Ramesh Raskar 2) Subhat Khot 3) Manu Prakash 4) Dinesh Bharadia 4. Where was the BRICS Urbanization Forum Meet held in September 2016? 1) Goa 2) Hyderabad 3) New Delhi 4) Visakhapatnam 5. Ashraf Ghani visited India in September 2016. He is the President of which of the following countries? 1) Iran 2) Maldives 3) Afghanistan 4) Indonesia 6. Mother Teresa was made a Saint by Pope Francis in Vatican City on? 1) September 4, 2016 2) September 5, 2016 3) September 6, 2016 4) September 8, 2016 7. Who was named the brand ambassador of Uttar Pradesh Government's 'Samajwadi Kisan Beema Yojana'? 1) Amitabh Bachchan 2) Nawazuddin Siddiqui 3) Manoj Bajpayee 4) Salman Khan 8. Which city hosted the ASEAN-India Summit in September 2016? 1) Vientiane 2) Kuala Lumpur 3) Jakarta 4) Bandar Seri Begawan 9. 'Prabal Dostyk' is a joint army exercise of India and? 1) Russia 2) Kazakhstan 3) Belarus 4) Azerbaijan 10. Which State Government has launched Biju Kanya Ratna Yojana (BKRY) for the development of girls? 1) Assam 2) Tripura 3) Odisha 4) Jharkhand 11. September 15 is observed by the United Nations as? 1) International Day of Peace 2) International Literacy day 3) International Day of Charity 4) International Day of Democracy 12. Nathpa Jhakri Dam is located in the State of? 1) Punjab 2) Haryana 3) Jammu and Kashmir 4) Himachal Pradesh 13. The 25th World Conservation Congress of the International Union for Conservation of Nature (IUCN) was held in September 2016 in? 1) Jeju - South Korea 2) Nagoya - Japan 3) Hawaii - USA 4) Bogota - Colombia 14. Which of the following was adjudged the best film at the first BRICS film festival in September 2016? 1) Visaranai (Tamil) 2) Thithi (Kannada) 3) Xuan Zang (China) 4) Sultan (Hindi) 15. Lindsay Tuckett passed away on September 5, 2016. He played nine cricket Tests for? 1) New Zealand 2) West Indies 3) England 4) South Africa KEY 1) 4 2) 1 3) 1 4) 4 5) 3 6) 1 7) 2 8) 1 9) 2 10) 3 11) 4 12) 4 13) 3 14) 2 15) 4 -
‘పణ’ అనే పదానికి అర్థం?
మాదిరి ప్రశ్నపత్రం నిన్నటి తరువాయి.. 3. మీ దృష్టిలో ఎలాంటి వారు గురుస్థానీయులు? 4.రైతులు ఆనందంగా జీవించాలంటే వారికి ఏయే సౌకర్యాలు కల్పించాలి? ఆ)కింది వాటిలో ప్రతి భాగం నుంచి ఒక్కో ప్రశ్నకు 10 లేదా 12 వాక్యాల్లో జవాబులు రాయండి. 3ణ6=8 5.‘నగరంలో దారిద్య్రం, సౌభాగ్యం సమాంతర రేఖలు’ అని అన్న అలిశెట్టి ప్రభాకర్ మాటల్ని సమర్థిస్తూ రాయండి. (లేదా) దానం గొప్పతనం గురించి ‘దానశీలం’ పాఠ్యాంశం ఆధారంగా వివరించండి. 6.‘భాగ్యోదయం’ పాఠం ఆధారంగా సమాజ వెనుకబాటుతనానికి గల కారణాలను వివరించండి. (లేదా) ఒక భాష గొప్పతనం ఏయే అంశాల మీద ఆధారపడి ఉంటుందో తెలపండి? 7. రామలక్ష్మణ, భరతుల పాత్రల ఆధారంగా అన్నదమ్ముల అనుబం«ధం గురించి రాయండి.(లేదా) దండకారణ్యం (అరణ్య కాండం)లో జరిగిన ముఖ్య ఘట్టాలు గురించి సంక్షిప్తంగా రాయండి. పార్ట్–బి సూచన: ఈ ప్రశ్నపత్రానికి సంబంధించిన జవాబులను ఇందులోనే పూరించి, ప్రశ్నపత్రాన్ని మీ సమాధాన పత్రంతో జతచేయండి. అ) కింది పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించండి. 2ణ1=2 1. సీమోల్లంఘన 2. నడత ఆ) సరైన జవాబు (ఎ, బి, సి, డి)ను బ్రాకెట్లో రాయండి. 16ణబీ=8 3. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు కొందరు దుర్భర జైలు శిక్షలు అనుభవించారు. గీత గీసిన పదానికి అర్థం? ఎ) గొప్ప బి) కఠినమైన సి) భరింపరాని డి) పెద్ద 4. బిడ్డలు దూరమై, తల్లి ఏకాకిగా బతుకుతోంది. ఏకాకి అంటే? ఎ) కాకి బి) పక్షి సి) ఒంటరి డి) ఒక పక్షి 5. ‘పణ’ అనే పదానికి అర్థం? బి) ధనం బి) నుదురు సి) పడగ డి) పాము 6. ‘ఈవి’ అనే మాటకు తగిన అర్థం? ఎ) దానం బి) ధనం సి) ఈగ డి) యాగం 7. ‘దారి’ అనే మాటకు సమాన అర్థాన్ని ఇచ్చే పదాలు? ఎ) మార్గం, గమనం బి) గమ్యం, తోవ సి) బాట, లక్ష్యం డి) బాట, తోవ 8. కెరటం, తరంగం అనే పర్యాయ పదాలకు తగిన పదం? ఎ) అల బి) కీర్తి సి) సముద్రం డి) సరస్సు 9. ‘పండితుడు’ అనే మాటకు పర్యాయ పదాలు? ఎ) బుధుడు, గురుడు బి) బుధుడు, విద్వాంసుడు సి) విద్వాంసుడు, విధురుడు డి) విధురుడు, విబుధుడు 10. ఉదకం, అంబువు అనే అర్థాన్ని ఇచ్చే పదం? ఎ) తామర బి) మేఘం సి) సముద్రం డి) నీరు 11. ‘కీర్తి’ అనే మాటకు వికృతి పదం? ఎ) కృతి బి) కీరిది సి) కీరితి డి) కర్త 12. ‘శాస్త్రం’కు వికృతి? ఎ) చట్టం బి) శాసనం సి) శాస్త డి) శానము 13. సన్నాసి అనే వికృత పదానికి ఆధారమైన ప్రకృతి పదం? ఎ) సైన్యం బి) సన్యాసి సి) శాస్త్రి డి) సన్యాస్త్రం 14. ‘బాస’ అనే పదానికి ప్రకృతి పదం? ఎ) బాశా బి) భాస సి) బాష డి) భాష 15. పిల్లకు ప్రాయం..పేద తలిదండ్రులకు నరకప్రాయం అయింది. ఈ వాక్యంలో ‘ప్రాయం’ అనే పదానికి నానార్థాలు? ఎ) వయసు, మనసు బి) తగిన, సమానం సి) ప్రాణం, నరకం డి) వయసు, సమానం 16. ‘సభ’ అనే మాటకు గల నానార్థాలు? ఎ) కొలువు, ఉద్యోగం బి) కొలవుకూటం, జూదం సి) జూదం, తాగుడు డి) ఉద్యోగం, ఉపాయం 17. ‘రణం’ అనే మాటకు వ్యుత్పత్యర్థం? ఎ) మరణంతో కూడుకుంది (యుద్ధం) బి) రణ రంగం (యుద్ధం) సి) మళ్లీ మళ్లీ చేసేది (యుద్ధం) డి) రక్తం చూసేది (యుద్ధం) 18. ‘భృగు మహర్షి కుమారుడు’ అనే వ్యుత్పత్తి గల పదం? ఎ) భర్గుడు బి) భార్గవుడు సి) భార్గవరాముడు సి) విశ్వామిత్రుడు మూల్యాంకన సూచికలు (కీ) పార్ట్ – ఎ 1. పాఠ్య పుస్తకాన్ని అనుసరించి రచయిత్రి గతంలో తన అనుభవంలో ఉన్న విషయాలను.. ప్రస్తుతం చూస్తున్న వాటితో పోల్చుకొని.. ప్రధానంగా ఏయే మార్పులను గమనించిందనే విషయాన్ని స్పష్టంగా రాయాలి. విషయం సరిగ్గా రాస్తే – 2 మార్కులు తప్పులు లేకుండా రాస్తే – 1 మార్కు -
రామాయణం (ఉపవాచకం)
అరణ్యకాండం: దండకారణ్యంలోకి ప్రవేశించిన సీతారామలక్ష్మణులు తొలుత మునుల దర్శనం చేసుకున్నారు. తర్వాత రామలక్ష్మణులు విరాధుని భుజాలు నరికి గోతి లో పూడ్చిపెట్టారు. అతని సూచన మేరకు శరభంగం మహర్షిని దర్శించుకున్నారు. శరభంగుడు తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి సమర్పించి సుతీక్ష్ణ మహర్షిని దర్శించుకోవాలని చెబుతాడు. సుతీక్ష్ణుడు కూడా తన తపఃఫలాన్ని రామునికి ధారపోశాడు. మునుల ఆశ్రమాలు దర్శిస్తూ సీతారామలక్ష్మణులు పదేళ్లు గడిపారు. చివరకు అగస్త్య మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అగస్త్యుడు రామునికి అక్షయ తూణీరాలను, అమోఘమైన ఖడ్గాన్ని, దివ్య ధనస్సును ప్రదానం చేసి, పంచవటి అనే ప్రదేశంలో నివసించాలని సూచించాడు. గోదావరి తీరంలోని పంచవటిలో జన సంచారం తక్కువ. కానీ, ఫలాలు, జలాలకు కొదవలేదు. అక్కడే శ్రీరామాదులకు జటాయువు పరిచయమయ్యాడు. అతడు దశరథుని మిత్రుడు. జటాయువుకి రాముడు.. సీత రక్షణ బాధ్యతలు అప్పగిస్తాడు. లక్ష్మణుడు నిర్మించిన అందమైన పర్ణశాలలో ఉండసాగారు. రాముడు ఒకరోజు పురాణ కథా ప్రసంగం చేస్తున్నప్పుడు శూర్పణక అతని అందానికి మురిసిపోయి తనను పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. సీత అడ్డంకిగా ఉందనే అక్కసుతో ఆమెను మింగేయాలని ప్రయత్నిస్తుంది. దీంతో లక్ష్మణుడు శూర్పణక ముక్కు, చెవులు కోసి తరిమేస్తాడు. ఫలితంగా శూర్పణక సోదరులు ఖరదూషణులు 14000 మంది రాక్షసులతో కలిసి వచ్చి రాముణ్ని చంపబోయి వారే హతమవుతారు. అకంపనుడు అనే గూఢచారి ఈ సమాచారాన్ని రావణునికి అందజేస్తాడు. సీతను అపహరిస్తే రాముడు ఆ బాధతో చనిపోతాడని, అందువల్ల సీతాపహరణం చేయాలని సూచిస్తాడు. ఈ సలహాను ఆచరణలో పెట్టాలనుకున్న రావణుడు ఈ మేరకు తనకు సాయం చేయాలని మారీచుణ్ని అడుగుతాడు. అంతకుముందే(విశ్వామిత్రుని సిద్ధాశ్రమంలో) శ్రీరాముని బాణం రుచిచూసిన మారీచుడు రావణుని ఆలోచన మంచిదికాదని వారిస్తాడు. కానీ, శూర్పణక మొరపెట్టుకోవడంతో రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి సిద్ధపడతాడు. తనకు సహకరించకపోతే చంపేస్తానని మారీచుణ్ని హెచ్చరిస్తాడు. రావణుని చేతిలో చావడం కన్నా పుణ్యాత్ముడైన రాముని చేతిలో చావడమే మేలని మారీచుడు రావణునికి సహకరించడానికి అంగీకరిస్తాడు. మారీచుడు బంగారు లేడిగా మారి పంచవటి పరిసరాల్లో తిరుగుతూ సీత దృష్టిని ఆకర్షిస్తాడు. లేడి మాయలో పడ్డ సీత తనకు అది కావాలని కోరుతుంది. అది రాక్షస మాయ అని రాముడు నచ్చజెప్పచూసినా వినలేదు. సీత రక్షణ బాధ్యతను లక్ష్మణునికి అప్పగించి బంగారు లేడిని వెంటాడతాడు. చివరికి అది లేడి కాదని, రాక్షస మాయ అని గ్రహించి బాణం వదులుతాడు. అది తాకి చనిపోయే ముందు మారీచుడు శ్రీరాముని గొంతుతో ‘అయ్యో సీతా! అయ్యో లక్ష్మణా!’ అని అరుస్తూ ప్రాణాలు వదులుతాడు. అది నిజంగా రాముని గొంతేనని భ్రమపడ్డ సీత.. రాముణ్ని కాపాడటానికి లక్ష్మణున్ని వెళ్లమంటుంది. అది అన్నయ్య గొంతుకాదంటూ నచ్చజెప్పాలని చూసినా నిష్టూరాలడుతుంది. ఆ మాటలు భరించలేక లక్ష్మణుడు రాముణ్ని వెతకడానికి వెళతాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న రావణుడు సీతను అపహరించుకుపోతాడు. అడ్డుకోబోయిన జటాయువు రెక్కలు, కాళ్లు నరికేస్తాడు. సీతాదేవి రావణున్ని దూషిస్తూ ఒక పర్వత శిఖరంపై కొంతమంది వానరులు కనిపిస్తే తన ఆభరణాలను మూటగట్టి వాళ్లకు లభించేట్లు వదులుతుంది. రావణుడు సీతను అశోకవనంలో ఉంచి రాక్షస స్త్రీలను కాపలాగా పెడతాడు. సీతకు 12 నెలల గడువు విధిస్తాడు. తనను వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మణుణ్ని చూసి రాముడు ఆశ్చర్యపోతాడు. ఇద్దరూ పర్ణశాలకు చేరి జరిగిన మోసాన్ని గ్రహిస్తారు. జరిగిన సంగతిని చెప్పి జటాయువు ప్రాణాలు విడుస్తాడు. రామ లక్ష్మణులు అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అలవిమాలి న దుఃఖంతో రాముడు తమ్మునితో కలిసి సీతను వెతుకుతుంటాడు. ఎదురైన కబంధుని రెండు భుజాలను రామలక్ష్మణులు నరికేస్తారు. శాపం తీరిన తర్వాత కబంధుడు వాలీసుగ్రీవుల కథ చెప్పి సుగ్రీవుని స్నేహం చేస్తే మేలు జరుగుతుందని చెబుతాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణలో భాగంగా పంపాసరోవర ప్రాంతానికి చేరుకుంటారు. శబరి ఆతిథ్యాన్ని స్వీకరించి రుష్యుముక పర్వతం వైపు వెళ్తూ పంపా సరోవరాన్ని దర్శిస్తారు. అరణ్యకాండం–ఉదాహరణ ప్రశ్నలు 1.రావణుడు సీతాపహరణ చేయడానికి దారితీసిన పరిస్థితులేవి? 2.రాక్షస మాయలో పడ్డ సీత చివరకు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడాన్ని విశ్లేషించండి/వివరించండి. 3.భయం, అనుమానం, భ్రమ ఎంతటి వాళ్లనైనా ఆపదల్లోకి నెట్టేస్తాయని సీతాపహరణ ఘట్టం ఆధారంగా వివరించండి. మాదిరి ప్రశ్నపత్రం (పేపర్ 1) పార్ట్–ఎ (30 మార్కులు) సూచనలు 1.మొదటి 15 నిమిషాలు పశ్నపత్రం చదివి అర్థం చేసుకోండి. 2.తర్వాత 2 గంటలు పార్ట్–ఎ ప్రశ్నలకు జవాబులు రాయండి. 3.చివరి 30 నిమిషాలు పార్ట్–బి పూర్తిచేసి, ప్రధాన సమాధాన పత్రానికి జతచేయండి. ఐ.స్వీయ రచన–సృజనాత్మకత స్వీయ రచన (30 మార్కులు) అ)కింది ప్రశ్నలకు ఐదారు వాక్యాల్లో జవాబులు రాయండి. 4ణ3=12 1.‘కొత్త బాట’ రచయిత్రి పల్లెలో గమనించిన ముఖ్య మార్పులేవి? 2.‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి కవిత్వంలోని ప్రత్యేకతలేవి? -
APPSC GROUP-2 SCREENING TEST MODEL PAPER
1. Who became the Prime Minister of New Zealand in December 2016? 1) John Howard 2) Paula Barnett 3) Rick Perry 4) Bill English 2. India defeated which of the following countries in the final to win the junior men's Hockey world cup in December 2016? 1) South Korea 2) Belgium 3) Pakistan 4) Germany 3. Who is the first Chief Executive Officer of the Board of Control for Cricket in India (BCCI)? 1) Ajay shirke 2) A.P. Shah 3) Rahul Johri 4) Rajiv Shukla 4. Which country became the 189th member of International Monetary Fund? 1) South Sudan 2) Zambia 3) Afghanistan 4) Nauru 5. Prime minister Narendra Modi and French President Francois Hollande laid foundation of the International Solar alliance (ISA) Headquarters at? 1) New Delhi 2) Gurgan 3) Chandigarh 4) Udaipur 6. Tsai Ing-wen is the first female President of which of the following countries? 1) Thailand 2) Vietnam 3) Taiwan 4) South Korea 7. Who among the following is associated with the Asian Infrastructure Investment Bank (AIIB)? 1) Dinesh Sharma 2) Raghuram Rajan 3) Subir Gokarn 4) Kaushik Basu 8. Which of the following is an indigenously built surface to air missile? 1) Prithvi 2) Pinaka 3) Agni 4) Akash 9. Sahyog-kaijin is the joint Coast Guard exercise between India and? 1) Russia 2) China 3) Japan 4) Thailand 10. Abdullah Abdullah visited India recently. He is the Chief Executive of? 1) Afghanistan 2) Maldives 3) Pakistan 4) Iran 11. Which of the following has been declared as the first organic farming state of India? 1) Goa 2) Sikkim 3) Kerala 4) Assam 12. What is India's share in the Asian Infrastructure Investment Bank (AIIB)? 1) 10.12% 2) 8.52% 3) 6.66% 4) 7.73% 13. Who won the best supporting actress award at the 88th edition of Oscar awards? 1) Anne Hathaway 2) Brie Larson 3) Alicia Vikander 4) Ashley Judd 14. "Setu Bharatam" aims at making all National Highways railway level crossing free by? 1) 2018 3) 2019 2) 2020 4) 2021 15. Who is the present Chairperson of National Human Rights Commission? 1) Justice K.G. Bakkrishnan 2) Justice Cyriac Joseph 3) Justice H.L.Dattu 4) Justice P. Sadashivam 16. World Wetlands Day is celebrated every year on? 1) February 2 2) February 11 3) February 13 4) February 17 17. Shakti-2016 is a counter terrorism and counter-insurgency joint excise conducted by India and? 1) Sri Lanka 2) France 3) U.K. 4) U.S.A 18. The shyama Prasad Mukherjee National Rurban Mission was launched in kurubhat village in? 1) Gujarat 2) Jharkhand 3) Chhattisgarh 4) Odisha 19. NFME outlines India's strategy for elimination of Malaria by? 1) 2022 2) 2025 3) 2028 4) 2030 20. Which of the following countries did not participate in the Exercise IBSAMAR? 1) India 2) Australia 3) Brazil 4) South Africa 21. St. Petersburg Ladies Trophy is associated with which of the following sports? 1) Tennis 2) Badminton 3) Archery 4) Hockey 22. Which country will host the South Asian Games in 2018? 1) India 2) Nepal 3) Sri Lanka 4) Bangladesh 23. Where was the 4th Nuclear Security Summit (NSS) held in 2016? 1) The Hague 2) Geneva 3) Washington D.C. 4) New York 24. Under the stand-up India Scheme SC/ST and woman entrepreneurs will be provided loans of between Rs. 10 lakh and? 1) Rs. 20 lakh 2) Rs. 50 lakh 3) Rs. 75 lakh 4) Rs. 1 Crore 25. Nirmal Singh of the Bharatiya Janata Party is the Deputy Chief Minister of? 1) Jammu and Kashmir 2) Odisha 3) Punjab 4) Bihar 26. Prime Minister Narendra Modi was conferred the King Abdulaziz Sash, he highest Civilian honor of? 1) Afghanistan 2) Yemen 3) Saudi Arabia 4) United Arab Emirates 27. ARIES (Arayabhatta Research Institute of Observational Sciences), the largest official Telescope in Asia, is located at Deosthal in? 1) Haryana 2) Uttarakhand 3) Punjab 4) Rajasthan 28. Who is Myanmar's first civilian President in half a century? 1) Aung san suu kyi 2) Myint swe 3) Thein sein 4) Htin kyaw 29. Which of the following schemes of union government has entered into Guinness Book of World Records? 1) MGNREGS 2) Swachh Bharat Abhiyan 3) PMJDY 4) None of these 30. Who is the brand ambassador of health sector of Andhra Pradesh? 1) Ajay Devgan 2) Akshay kumar 3) Amitabh Bachchan 4) Amir kahn 31. National Girl child Day is observed every year on? 1) March 8 2) January 24 3) March 6 4) January 21 32. Who is the 21st Law Commission Chairman? 1) Justice Permod Kohli 2) Justice B.S. Chauhan 3) Justice J.S. Thakur 4) None of these 33. Lloyd shapley of US passed away recently. He won the 2012 Nobel Prize in? 1) Physics 2) Chemistry 3) Economics 4) Medicine 34. Who is the author of the book "Standing Guard -A year in Opposition"? 1) Sharad Pawar 2) Jairam Ramesh 3) Shashi Tharoor 4) P. Chidambaram 35. Which country topped its world Happiness Index 2016? 1) Denmark 2) Singapore 3) Sweden 4) Switzerland 36. India and which of the following countries have signed a memorandum of understanding (MOU) for construction of six nuclear reactors of Jaitapur? 1) Russia 2) Japan 2) France 4) Ukraine 37. Where is Tribhuvan International Airport situated? 1) Thimphu 2) Kathmandu 3) Colombo 4) Bangkok 38. Who among the following is a Rajya Sabha member? 1) Sourav Ganguly 2) Saina Nehwal 3) Geeta Phogat 4) Mary kom 39. Panagarh air base is renamed after formed India Air Force (IAF) Chief Arjan Singh. It is in? 1) Uttarakhand 2) Uttar Pradesh 3) West Bengal 4) Punjab 40. Pradhan Mantri Ujjwala Yojana was launched at Ballia in? 1) Bihar 2) Uttar Pradesh 3) Jharkhand 4) Haryana 41. Where was the first maritime India summit held? 1) Mumbai 2) Kochi 3) Chennai 4) Visakhapatnam 42. Which of the following is the capital of Cambodia? 1) Hanoi 2) Putrajaya 3) Phnom penh 4) Nagoya 43. The headquarters of which of the following organizations is located in lyon, France? 1) Amnesty International 2) Red Cross 3) Interpol 4) IAEA 44. Thongloun Sisoulith is the Prime Minister of? 1) Cambodia 2) Vietnam 3) Brunei 4) Laos 45. Pradhan Mantri Ujjwala Yojana aims to provide how many crore LPG connections to women in Below Poverty Line (BPL) households? 1) 2 crore 2) 3 crore 3) 4 core 4) 5 crore 46. Sushila Karki is the first female Chief Justice of? 1) Bhutan 2) Sri Lanka 3) Nepal 4) Mauritius 47. Which of the following was the partner country for the 2016 Maritime India summit? 1) Japan 2) South Korea 3) China 4) Sri Lanka 48. The world's first sanctuary for white tigers was opened in? 1) Odisha 2) West Bengal 3) Tripura 4) Madhya Pradesh 49. Which country won the 2016 Sultan Azlan Shah Cup hockey tournament? 1) Australia 2) India 3) Pakistan 4) Malaysia 50. Who is the first women secretary General of Commonwealth? 1) Geeta Pasi 2) Christine Lagarde 3) Patricia Scotland 4) Amber Rudd 51. Which of the following court (s) have directed the police to file FIR copies on line on the website of the police station.. a) Supreme court b) Allahabad High court c) Himachal Pradesh High court d) Delhi High court 1) a, b, c, d 2) a, b, c 3) a, b 4) a only 52. Which of the following is an inherent element of article 21, according to the supreme court judgement in the Subramanian Swamy, Rahul Gandhi and Aravind Kejrival case? 1) Right to Life 2) Right to freedom of speech 3) Right to reputation 4) Right to emergency medical care in case of accidents 53. A man who committed 3 murders will be imposed which of the following punishments by a sessions court? a) Death punishment b) life imprisonment c) One or more life imprisonments superimposed over each other d) A life imprisonment of 14 years 1) a, b, d 2) a 3) a, d 4) Any of the above 54. Which of the following are true about the octroi tax? a) It is mentioned in the state list b) It is a tax on the entry of goods into a local area for consumption, use or sale therein. c) It is leviable by the urban local governments d) The Second ARC recommended to repeal it 1) a, b, c, d 2) a, c, d 3) b, c, d 4) a, b, c 55. Under which of the following articles the supreme court can transfer the cases from the jurisdiction of one state to another? 1) 136 2) 142 3) 32 4) All the above 56. Relief under the Domestic violence act 2005 is against? a) Male adult b) Female adult c) Minor male 1) a, b, c 2) a, b 3) a only 4) a, c 57. Access to justice is guaranteed to the citizens under which of the following articles ? 1) Article 14 2) Article 21 3) Both 1 and 2 4) Article 105 58. Which of the following acts can be considered as acts of cruelty? a) A woman forcing her husband to get separated from his parents b) Mental cruelty, "continuous harassment" by wife c) "threat of prosecution" of a husband by his wife 1) a, b, c 2) a, b 3) b, c 4) b only 59. In which of the following cases, the supreme court issued directions to curb the female foeticide under the the Pre-conception and Pre-natal Diagnostic Techniques (Prohibition of Sex Selection) Act, 1994' a) Centre For Enquiry Into Health vs Union Of India b) Voluntary Health Association of Punjab vs Union of India 1) a, b 2) a only 3) b only 4) None 60. Which of the following information is required to be provided under Right To Information act ? a) Information about answer sheets and Marks of a recruitment test conducted by a public service commission. b) Information about the examiners in the recruitment exam 1) a, b 2) a only 3) b only 4) None 61. Which of the following are entitled to the social security in a legal system? a) Senior citizens b) Specially abled c) Legal profession 1) a, b, c 2) a, b 3) a only 4) c only 62. The Supreme Court of India in the Swaraj Abhiyan Vs Union of India case, dated 11/05/2016 issued certain guidelines regarding drought prevailing in many parts of India. Which of the following are the elements of the Disaster Management act 2005? a) Constituting the National Disaster Response Force b) Constituting a National Disaster Mitigation Fund c) Consideration for the vulnerable sections 1) a, b, c 2) a, b 3) a, c 4) b, c 63. People with disabilities also have the Right to Live with Dignity is a fundamental right implied under which of the following articles of the constitution? 1) Article 14 2) article 21 3) Both 1 and 2 4) Article 20 64. Which of the following are wrongly matched? 1) Article 1: Names of the states 2) Article 2: Admission of new states 3) Article 3: Reorganization of states is not a considered as an amendment to constitution 4) None of the above 65. Constitution of India declared India on 1949, November 26th to be - 1) Sovereign, socialist, secular, democratic, republic 2) Sovereign, Secular, socialist, republican democracy 3) Sovereign, democratic, republic, socialist, secular 4) None of the above 66. Which of the following about the Indian constitution are true? a) Constitution of India was signed by members of the constituent assembly on 1949, November 26th b) Constitution of India is a bundle of borrowed material. c) Constituent assembly is a sovereign body d) The members of the constituent assembly were not directly elected by the people. 1) a, b, c, d 2) a, b, c 3) b, c, d 4) a, b, d 67. Secularism in India implies - 1) Dharma nirapekshata 2) Pantha nirapekshata 3) Sarva Dharma sama bhava 4) All the above 68. Which of the following about the socialism are true? a) There are no provisions of the socialism in the constitution except the preamble b) The term socialism is not defined in the constitution 1) a, b 2) a only 3) b only 4) None of the above 69. Indian constitution declares India to be a Republic. Which of the following elements are the proof of it? a) Election of the president b) All the public offices are open for merit 1) a, b 2) a only 3) b only 4) Neither 70. Which of the following about the sovereignty are true? a) In India people are sovereign b) Sovereignty rests with people represented in the parliament c) President is the symbol of sovereignty 1) a, b, c 2) a, b 3) a only 4) b, c 71. The president of India enjoys pocket veto power over the legislative proposals because - 1) India is a parliamentary government and the nominal head is conferred with the pocket veto 2) Indian Constitution does not provide any time limit within which the President is to declare his opinion on a bill 3) The increasing trend of coalition governments has given opportunity to the president to discretionary 4) All the above. 72. Temple entry for the women is a matter of - a. Right to equality b. Right to freedom of religion c. Right to life 1) a, b, c 2) a, b 3) a, c 4) b, c 73. Right to conserve a distinct language, script or culture is a fundamental right guaranteed to - a) Minorities residing in the territory of India b) Any section of citizens residing in the territory of India c) All the persons living in India 1) a only 2) b only 3) a, b, c 4) a, b 74. According to the Child Labor Prohibition and regulation amendment act 2016, which of the following are true? a) A child is the one who is below the age of 14 years and an adolescent is the one who is in the age of 14 to 18 years. b) It allows the children to help the family or family enterprise including the parents' siblings enterprise or in the entertainment industry after the school hours c) Only Mines, inflammable substances and hazardous process are considered as the hazardous industries under the act. d) The punishment for the practice of child labour is - a maximum fine of Rs. 50,000/- and / or a maximum imprisonment of two years 1) a, b, c, d 2) a, b, c 3) a, c, d 4) b, c, d 75. Which of the following are the rights of the minorities with reference to educational institutions? a) Right to establish educational institutions b) Right to manage educational institutions c) Right to Property d) Right against discrimination in getting state aid 1) a, b, c, d 2) a, b, c 3) a, b 4) b, d 76. Which of the following are guaranteed by the article 20? a) Rule of law b) Prohibition of Double jeopardy c) Prohibition of self incriminating evidence 1) a, b, c 2) a, b 3) a, c 4) b, c 77. No person accused of any offence shall be compelled to be a witness against himself. Which of the following are prohibited under this provision? a) Brain mapping b) Lie detector tests c) Polygraphic and narco analysis test d) Brain Electrical Activation Profile 1) a, b, c, d 2) a, b, c 3) b, c, d 4) None 78. Which of the following rights are guaranteed by the Right to Protection against arrest and detention? a) Right to know the reason for the detention b) Right to consult a legal practitioner c) Right to be produced before the nearest magistrate within 24 hours. 1) a, b, c 2) a, b 3) a, c 4) b, c 79. In Which of the following cases the supreme court ended the impunity to the armed forces as provided by the 1958 Armed Forces Special Powers act? 1) Extra Judicial Execution Victim Families Association case, 2016 2) Manipur Vs Union of India case, 2016 3) Irom Sharmila Vs Union of India case, 2016 4) All the above 80. Which of the following makes it mandatory to stand at the time of playing the national anthem? a) Supreme court b) Fundamental duties c) The General Provision of the orders issued by the Government of India on January 5, 2015 d) Prevention of Insults to National Honour Act, 1971 1) a, b, c, d 2) a, b, c 3) a, b 4) a only 81. In which of the following cases the supreme court directed for the first time to formulate a Common Civil Code? 1) Shabano Vs Md. Ahmed case 2) Sarala Mudgal Vs union of India 3) John Mathai Vs Union of Idnia 4) Shayara Bano Case 82. Which of the following statements are true? a) Directive principles are not justiceable b) The courts have never directed the government to implement the directive principles. 1) a, b 2) a only 3) b only 4) None 83. Which high court recently has imposed a ban sale and consumption of liquor in three religious districts? 1) Uttara Pradesh 2) Uttarakhand 3) Kerala 4) Tamil nadu 84. Which of the following are true about The Rights of Persons with Disabilities Bill 2016? a) Disability has been defined based on an evolving and dynamic concept. b) Speech and Language Disability and Specific Learning Disability have been added for the first time. c) The types of disabilities have been increased from existing 7 to 18 1) a, b, c 2) a, b only 3) b, c 4) a, c 85. Fundamental duties are not - a) Performed by all the people b) Justiceable c) Limitations on the fundamental rights d) A warning to the anti national elements 1) a, b, c, d 2) a, b, c 3) a, b 4) c, d 86. Which of the following are not among the fundamental duties? 1) Striving towards excellence 2) Preserving heritage 3) Promoting common brotherhood 4) Duty to Pay taxes 87. Which of the following are both directive principles and fundamental duties? 1) Protecting the environment 2) Protecting the wild life 3) Preserving heritage 4) All the above 88. Special measures for the protection of the Scheduled castes and scheduled tribes is found in - a) Fundamental Rights b) Directive principles c) Part 16 of the constitution 1) a, b, c 2) a, b 3) a, c 4) b, c 89. The president of India is elected by an electoral college. Which of the following implications are derived from it? a) The presidential election is indirect b) The president represents the nation c) The president represents the states d) The president represents the people. 1) a, b, c, d 2) a, b, c 3) a, b, d 4) b, c, d 90. Which of the following are true about Jammu Kashmir article 370 1) Parliamentary legislations 2) Provisions related to article 1 shall be applicable to J&K 3) J&K is a sovereign state 4) People of J&K have citizenship status of the state 91. Which of the following are a part of the oath taken by the president? 1) Faithfully executing the office 2) Preserve, protect and defend the constitution and law 3) Devoting to the service and well being of the people of India. 4) All the above 92. What is not correct about the impeachment of the president of India? 1) The proposal for the impeachment should be notified at least 14 days in advance 2) There will be hardly any investigation in to the allegations leveled against the president for the impeachment 3) The impeachment is in accordance with the principles of natural justice 4) None of the above 93. According to article 78 It shall be the duty of the Prime Minister a) to communicate to the President all decisions of the council of Ministers relating to the administration of the affairs of the union and proposals for legislation; b) to furnish such information relating to the administration of the affairs of the Union and proposals for legislation as the President may call for; and c) if the President so requires, to submit for the consideration of the Council of Ministers any matter on which a decision has been taken by a Minister but which has not been considered by the Council Which of the following conclusions may be drawn from this description - 1) Prime minister can become a dictator 2) President can emerge as a real executive 3) Council of Ministers are more powerful than that president and prime minister 4) A balance of power 94. Which of the following budgetary reforms under taken in the 2017-18 budget? 1) Merger of Railway budget with General budget 2) Merger of plan and non plan expenditure 3) Advancing the date of presenting the budget in parliament. 4) All the above 95. Which of the following are true about the Cabinet secretary ? a) Secretary to the council of ministers b) Head of the central secretariat c) Chief coordinator in the government of India 1) a, b, c 2) a, b 3) b, c 4) c only 96. With reference to the PESA act, 1996, which of the following are true? a) It extends the provisions of Part IX and IX A to the scheduled areas as mentioned in the 5th schedule. b) Andhra Pradesh was the first state to implement the act c) The Samatha judgment of the Supreme Court in 1997 was a landmark judicial intervention in scheduled Areas and PESA. d) Land acquisition is made more stringent in the Scheduled areas under the Land acquisition act 2013 than the PESA act. 1) a, b, c, d 2) b, c, d 3) a, c, d 4) a, b, d 97. Which of the following are true about the gram nyayalaya fact 2008? a) The status of Nyayadhikari is equivalent to first class judicial magistrate b) The Court can function as a mobile court c) The Gram Nyayalayas have both civil and criminal jurisdiction d) They should follow the principles of quick disposal to the cases 1) a, b, c, d 2) a, b, c 3) a, b, d 4) b, c, d 98. In which of the following areas the Rajya sabha enjoys special powers ? a) Resolution to create new all India services b) Passing resolution to legislate on the state list in the national interest c) Removal of the Vice president d) Approval of emergency 1) a, b, c, d 2) a, b, d 3) a, b, c 4) b, c, d 99. Which of the following are the grounds of a member of parliament may be disqualified ? a) As provided under article 102 b) As provided under Schedule X c) as provided under the 1951 Representation of People's Act 1) a, b, c 2) a, c 3) b, c 4) a, b 100. Consider the stages in the enactment of the budget. a) General Discussion b) Scrutiny by the departmental standing committees c) Voting on demands for grants d) Approval of appropriation bill In which among the above Rajya sabha has the power to participate 1) a, b, c, d 2) a, b 3) a only 4) None 101. In the regime of Alauddin Khilji, Sarai-i-adl was a market which was set up for---- 1) Horses 2) Cattles 3) Cloths 4) Food grains. 102. Alauddin Khilji marketing reforms, basic objective is------ 1) Maintain a large and efficient army. 2) Proper revenue collections. 3) Supply of commodities at reasonable prices. 4) None of the above. 103. Match the following. 1) Minimum Wage Act a) 1926. 2) Industrial Disputes b) 1948 Act 3) Contract Labour Act c) 1970 4) Trade Union Act d) 1947 1) 1-b, 2-d, 3-c, 4-a 2) 1-a, 2-b, 3-c,4-d. 3) 1-d, 2-b, 3-c, 4-a 4) 1-b, 2-a, 3-c, 4-d 104. Sher shah suri silver coin rupia consisting of standard weight ------ How many grains 1) 175 grains 2) 178 grains. 3) 180 grains 4) 182 grains 105. Chairman of the 12th Finance Commission was _____ 1) A.M.Khusro 2) K.C.Pant. 3) Pranab Mukherji 4) Rangarajan 106. Since 1982, which one of the following financial institutions has been playing the greatest role in supplying and overseeing rural credit in India? 1) Co-Operative credit societies. 2) Regional rural banks. 3) NABARD. 4) Public sector banks 107. The important cash crop encouraged by the Britishers was _____ 1) Opium 2) Indigo 3) Cotton 4) All of these 108. The Drain Theory was popularized by 1) R.C.Dutt. 2) Singer. 3) W.A.Lewis 4) D.B.Naoroji 109. Socialistic pattern of society comes through 1) Free economy 2) Mixed economy 3) Public sector 4) Private sector 110. The Largest proportion of holdings in India is in _____ 1) Marginal holdings (0-1 hectare) 2) Small holdings (1-4) hectare) 3) Medium holdings (4-10 hectare) 4) Large holdings (more than 10 hectares) 111. It will be true to classify India as 1) a food - deficit economy. 2) a trade - surplus economy. 3) a labour-surplus economy. 4) a capital - surplus economy. 112. The Gadgil - Mukherjee Formula is used to----. 1) Administer tax and non- tax revenue between states. 2) Allocate central assistance to state plans 3) Decide upon Grants- in - aid to states 4) Decide the allocation of centrally sponsored 113. By Deindustrialization, we mean 1) Uprooting of people from agriculture and planting them in industries 2) Movement of workforce from industry to service sector 3) A deliberate effort to compel the existing industries to shut down. 4) A deliberate effort to promote the new industries -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
పోటీ పరీక్షలకు సంబంధించి జాగ్రఫీ అంశాలను ఎలా చదవాలి? – ఎం.విజయ్ కుమార్, హైదరాబాద్. జాగ్రఫీలో పట్టు సాధించాలంటే.. అట్లాస్పై పరిపూర్ణ అవగాహన పొందాలి. ఇది అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ భౌగోళిక అంశాల పరంగా బేసిక్ నైపు ణ్యాన్ని అందిస్తుంది. ఆ తర్వాత సిల బస్ను పరిశీలిస్తూ అందులోని ప్రాధా న్యత జాబితాను రూపొందించుకోవాలి. దాని ఆధారంగా ప్రిపరేషన్ను సాగిం చాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్పై ప్రధా నంగా దృష్టి సారించాలి. విపత్తు నిర్వహణ విధానం, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కార్యకలాపాలు, ఇటీవల కాలంలో జాతీయ, అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపిన ప్రకృతి విపత్తుల గురించి తెలుసుకోవాలి. జాగ్రఫీలోనే అభ్యర్థులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన మరో అంశం.. సహజ వనరులు, అవి నిక్షిప్తమై ఉన్న ప్రాంతాలు, అందుకు కారణాలను అధ్యయనం చేయాలి. అదేవిధంగా కొన్ని పంటలు కొన్ని ప్రాంతాల్లోనే అత్యధికంగా పండుతాయి (ఉదా: ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న ఎక్కువగా పండుతుంది). రాష్ట్రంలోని సహజ వనరులు, వాటి వెలికితీతకు చేపట్టిన చర్యలు గురించి తెలుసుకోవడంతోపాటు ప్రస్తుత పరిస్థితిపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా గ్రూప్–3, గ్రూప్–4 పోస్టులకు పోటీ పడే ఔత్సాహికులు రాష్ట్రంలోని ప్రధాన పంటలు, ప్రాంతాలు, జనాభా, నిష్పత్తి వంటి అంశాలను తప్పనిసరిగా ఔపోసన పట్టాలి. పర్యావరణం, పర్యావరణ కాలుష్యం, కర్బన ఉద్గారాలు, నివారణ చర్యలపైనా పట్టు సాధించాలి. అంతర్జాతీయంగా పర్యావరణ పరిరక్షణ దిశగా పలు దేశాల మధ్య ఒప్పందాలు, ఐక్యరాజ్య సమితి వేదికగా జరిగిన ఒప్పందాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రఫీ, ఎకాలజీలో ప్రశ్న – సమాధానం కోణంలో కాకుండా కొంత వరకు డిస్క్రిప్టివ్ పద్ధతిలో ముందుకు సాగాలి. -
A rolling plan refers to a plan which?
Competitive Guidance Indian Economy 1. Who among the following started the process of liberalization in India? (A) Manmohan Singh (B) A.B. Kumar (C) Narendra Modi (D) P. Chidambaram 2. Who had estimated National Income in India first? (A) R.C.Dutt (B) Dadabhai Naoroji (C) D.R.Gadgil (D) V.K.R.V.Rao 3. In the post -independence period, economic reforms were first introduced in India under? (A) Janata Party Government (1977) (B) Indira Gandhi Government (1980) (C) Rajiv Gandhi Government (1985) (D) P.V.NarasimhaRao Government (1991) 4. Which of the following regulates the working of share market in India? (A) MRTP Act (B) SEBI (C) BIFR (D) FERA 5. Which plan is also called 'Gadgil Yojana'? (A) Third Five Year Plan (B) Fourth Five Year Plan (C) Ninth Five Year Plan (D) Sixth Five Year Plan 6. What was the period of plan holidays? (A) 1951 - 56 (B) 1966 - 69 (C) 1956 - 61 (D) 1961 - 66 7. Planning in India derives its objectives and social premises from which of the following? (A) Fundamental Rights (B) Fundamental duties (C) Public policy (D) Directive Principles of state policy 8. A rolling plan refers to a plan which? (A) Does not change its targets every year (B) Changes its allocations every year (C) Changes its allocations and targets every year (D) Changes only its targets 9. In which five year plan the main objective was the eradication of poverty? (A) Fourth Five Year Plan (B) Fifth Five Year Plan (C) Sixth Five Year Plan (D) Seventh Five Year Plan 10. The rolling plan for backward countries was suggested by? (A) Gunnar Myrdal (B) W.A.Lewis (C) A. Samuelson (D) R.Nurkse 11. Revenue system during Akbar's reign was in the hands of? (A) Bairam khan (B) Birbal (C) Man singh (D) TodarMal 12. During the Mughal rule, the copper coin was known as? (A) Rupee (B) Dam (C) Tanka (D) Shamsi 13. What is 'Jaribana'? (A) Levy on land (B) Fee for land measurement (C) Fees of land revenue collecting officer (D) None of these 14. Which Mughal ruler introduced the system of giving monthly salary to Munsiffs? (A) Akbar (B) Shah Alam (C) Farrukh (D) Shah Jahan 15. Who abolished the tax imposed on marriages? (A) Sri Krishna devaraya (B) Devaraya - I (C) Devaraya - II (D) None of these 16. The first Chairman of disinvestment commission was? (A) G.V. Ramakrishna (B) Madhu Dandavate (C) C.Rangarajan (D) Indira Gandhi 17. The apex body for formulating plans and coordinating research work in agriculture and allied fields is? (A) Indian council of Agricultural Research (B) Regional rural banks (C) State Trading Corporation (D) NABARD 18. What is the main objective of 12th Five Year Plan? (A) Growth with social justice (B) Development of Human Resources (C) Poverty Alleviation (D) Faster, Sustainable and more inclusive growth 19. The central banking functions in India are performed by the? (A) Central Bank (B) State Bank of India (C) Reserve Bank of India (D) both A and B 20. Which bank was earlier called the "Imperial Bank of India"? (A) RBI (B) SBI (C) UBI (D) PNB KEY 1) A 2) B 3) D 4) B 5) A 6) B 7) D 8) C 9) B 10) A 11) D 12) B 13) B 14) D 15) A 16) A 17) A 18) D 19) C 20) B -
టానింగ్కు ఉపయోగపడేది ఏది?
మాదిరి ప్రశ్నలు 1. పారమీషియం, అమీబా వంటి ఏక కణ జీవుల్లో విసర్జక విధానాన్ని తెలపండి. 2. టానిన్, రెజిన్ల గురించి వర్ణించండి. 3. మన శరీరంలో సమతుల్యత ఎలా సాధ్యమవుతుందో వివరించండి. 4.ఎక్కువ నీరు తాగినప్పుడు వాసోప్రెస్సిన్ ఎందుకు ఉత్పత్తి కాదో పేర్కొనండి. (1 మార్కు) జ.శరీరంలో నీరు తగ్గినప్పుడు వాసోప్రెస్సిన్ ఉత్పత్తి అయి నీటి పునఃశోషణను పెంచుతుంది. అందువల్ల మూత్రం గాఢత చెందుతుంది. నీరు అధికంగా తాగినప్పుడు శరీరానికి సరిపడినంత నీరు ఉండటం వల్ల వాసోప్రెస్సిన్ ఉత్పత్తి కాదు. 5.మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణం? (1 మార్కు) జ.యూరోక్రోం అనే వర్ణకం వల్ల మూత్రం పసుపు రంగులో ఉంటుంది. ప్రశ్నించడం, పరికల్పన (2 మార్కులు) 6.మూత్రపిండాల్లో నీటి పునఃశోషణ జరగకపోతే ఏమవుతుంది? జ.నీటి పునఃశోషణ జరగకపోతే మూత్రం ద్వారా అధిక నీరు విసర్జితమవుతుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో జీవనం కష్టమవుతుంది. జీవులు నీటి నష్టాన్ని తగ్గించడానికి నీటి పునఃశోషణ చేస్తాయి. 7.అవయవదానం గురించి మరింత తెలుసుకోవడానికి డాక్టర్ను కలిసే అవకాశం వస్తే ఏ ప్రశ్నలు అడుగుతావు? జ.) అవయవదానం ఎవరు చేయొచ్చు? 2) బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు ఏ అవయవాలను దానం చేయొచ్చు? 3) అవయవదానం కోసం ఎవరిని సంప్రదించాలి? 4) పాము కాటు, విష ప్రయోగాల వల్ల చనిపోయిన వ్యక్తుల అవయవాలు దానం చేయొచ్చా? 5) జీవించి ఉన్న వ్యక్తులు ఏ అవయవాలను దానం చేయొచ్చు? మాదిరి ప్రశ్నలు 1.మూత్రపిండాల అంతర్నిర్మాణం గురించి తెలుసుకోవడానికి నెఫ్రాలజిస్టును ఏయే ప్రశ్నలు అడుగుతావు? ప్రయోగాలు– క్షేత్ర పరిశీలనలు 1.మూత్రపిండ బాహ్య, అంతర లక్షణాలను పరిశీలించడానికి వాటి నిలువు కోత విధానం, పరిశీలనలు రాయండి. జ.ఉద్దేశం: మూత్రపిండం బాహ్య, అంతర లక్షణాలను పరిశీలించడం పరికరాలు: మేక/గొర్రె మూత్రపిండం, పదునైన బ్లేడు, ట్రే, నీరు, ఫోర్సెప్స్. ప్రయోగ విధానం: మేక/గొర్రె మూత్రపిండాన్ని సేకరించి నీటితో శుభ్రంగా కడగాలి. ట్రేలో పెట్టి బాహ్య లక్షణాలను పరిశీలించి నోట్బుక్లో నమోదు చేయాలి. పదునైన బ్లేడుతో మూత్రపిండాన్ని నిలువుగా కోసి అంతర్నిర్మాణాన్ని పరిశీలించాలి. పరిశీలనలు: 1. బాహ్య లక్షణాలు: మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో, ముదురు గోధుమ రంగులో ఉంటాయి. నొక్కు భాగంలో మూడు నాళాలు బయటకు వస్తాయి. దాని పైభాగంలో టోపీ లాంటి నిర్మాణం ఉంటుంది. 2. అంతర లక్షణాలు: వెలుపల ముదురు గోధుమ వర్ణంలో వల్కలం, లోపల లేత వర్ణంలో దవ్వ ఉంటాయి. సమాచార సేకరణ నైపుణ్యాలు (4 మార్కులు) కింది సమాచారాన్ని విశ్లేషించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1.మందుల తయారీకి ఉపయోగపడే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏవి? జ.టానిన్లు, జిగుర్లను మందుల తయారీలో ఉపయోగిస్తారు. 2.పాము కాటు నుంచి రక్షణ పొందేందుకు వాడే రిసర్పిన్ను ఏ మొక్క నుంచి, అందులోని ఏ భాగం నుంచి సేకరిస్తారు? జ.రిసర్పిన్ను సర్పగంధి మొక్కలోని వేరు నుంచి సేకరిస్తారు. 3.టానింగ్కు ఉపయోగపడేది ఏది? జ.తోళ్లను పదునుపెట్టడాన్ని టానింగ్ అంటారు. దీనికి ఉపయోగపడేది టానిన్లు. 4.ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి. జ.మొక్కల సాధారణ పెరుగుదల, అభివృద్ధి మినహా ఇతర విధులకు ఉపయోగపడే వాటిని ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటారు. ఉదా‘‘ టానిన్, రెసిన్, జిగుర్లు, లేటెక్స్, ఆల్కలాయిడ్లు. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
ఉద్యోగ నియామక పరీక్షల కోసం భారతదేశ చరిత్ర విభాగానికి ఎలా సిద్ధమవ్వాలి? – చంద్రశేఖర్, హైదరాబాద్. భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా చదవాలి. అవి.. ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. ఈ మూడు యుగాల్లోని భారతదేశ సంస్కృతిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ప్రాచీన చరిత్రలో భాగంగా ప్రాచీన శిలాయుగం, మధ్య శిలా యుగం, కొత్త రాతియుగ అంశాలను చదవాలి. ఈ క్రమంలో సింధు నాగరికత, ఆర్య నాగరికతలకు సంబంధించిన విషయాలను క్షుణ్నంగా ప్రిపేర్ కావాలి. క్రీ.పూ.6వ శతా బ్దంలో ప్రచారంలోకి వచ్చిన నూతన మతాలు.. జైనం, బౌద్ధంతోపాటు మహావీరుడు, గౌతమ బౌద్ధుడు–వారి బోధనలు, సామాజిక మార్పులకు అవి ఏ విధంగా కారణమయ్యాయో విశ్లేషించుకోవాలి. మగధ, మౌర్య సామ్రాజ్యాలు, పారశీక, గ్రీకు దండయాత్రలు, సంగం యుగం నాటి సాహిత్యం, ఆంధ్ర శాతవాహన రాజ్యాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆనాటి రాజులు, సాహిత్యం, రచయితలు, బిరుదులను వివరంగా అధ్యయనం చేయాలి. కుషాణులు, గుప్తులు, హర్షవర్ధనుడు, పల్లవులు, చోళులు, చాళుక్య రాజులు.. ఆర్థిక, సాంస్కృతిక రంగాలను ఏవిధంగా ప్రభావితం చేశారో తెలుసుకోవాలి. మధ్యయుగ చరిత్రలో సింధు రాజ్యంపై అరబ్బుల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, మొగల్ పాలన సంబంధిత అంశాలను బాగా చదవాలి. ముఖ్యంగా ఆనాటి సాహిత్యం, శిల్ప కళ, వాస్తు అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆధునిక భారత చరిత్రకు సంబంధించి క్రీ.శ.1498లో వాస్కోడిగామా కాలికట్ (కేరళ)లో అడుగుపెట్టిన తర్వాత భారతదేశంలోకి యూరోపియన్ల రాక మొదలైంది. నాటి నుంచి 1947 వరకు నెలకొన్న పరిస్థితులను చదవాలి. ఈ క్రమంలో బ్రిటిష్ పాలన, సిపాయిల తిరుగుబాటు, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్ల–మహారాష్ట్ర యుద్ధాలు, సాంఘిక సంస్కరణోద్యమం సంబంధిత అంశాలపై దృష్టిసారించాలి. -
కాంపిటీటివ్ గైడెన్స్– కరెంట్ అఫైర్స్
PRASAD is a scheme started by the Ministry of? 1. Petrapole Integrated Check Post was jointly inaugurated by the Prime Minister Narendra Modi and? 1) Maithripala Sirisena 2) Sheikh Hasina 3) Tshering Tobgay 4) Prachanda 2. The Maternity Benefit (Amendment) Bill-2016 increased the maternity leave from 12 weeks to? 1) 24 weeks 2) 28 weeks 3) 26 weeks 4) 25 weeks 3. On July 25, 2016 which company announced a deal to buy Yahoo's internet business for $ 4.8 billion? 1) Google 2) Microsoft 3) Salesforce 4) Verizon Communications 4. PRASAD is a scheme started by the Ministry of? 1) Rural Development 2) Tourism 3) Human Resources Development 4) External Affairs 5. Which Tamil actor was selected for the Knight of the Order of Arts and Letters, a French award in August 2016? 1) Rajini Kanth 2) Vishal 3) Kamal Haasan 4) Ajit 6. Which country won its first men's Olympic football gold medal in August 2016? 1) Germany 2) Brazil 3) Argentina 4) Chile 7. Simone Biles won four gold medals and a bronze medal at the 2016 Rio Olympics. She is an American? 1) Gymnast 2) Swimmer 3) Track and field athlete 4) Tennis player 8. S.R. Nathan passed away on August 22, 2016. He was the President of which of the following countries from 1999 to 2011? 1) Indonesia 2) Sri Lanka 3) Singapore 4) Malaysia 9. Sri Lanka has signed an agreement with which of the following countries to construct a Financial City Centre in Colombo? 1) India 2) Thailand 3) China 4) USA KEY 1) 2 2) 3 3) 4 4) 2 5) 3 6) 2 7) 1 8) 3 9) 3 -
Grassroots democracy is related to...
1. Writs are issued by? (A) Supreme Court (B) High Court (C) The President (D) Supreme Court and High Courts 2. Panchayat Raj system is based on the principle of: (A) Centralization (B) Decentralization (C) Both of these (D) None of these 3. The winning candidate in the Election of President of India should secure: (A) Majority number of votes polled (B) Sixty six percent of votes polled (C) Fifty percent of votes polled (D) More than fifty percent and majority of the total votes polled 4. The Supreme Court of India was set up: (A) By the Constitution (B) By a law of Parliament (C) By a Presidential Order (D) By the Act of 1947 5. Which of the following is presided by a non-member? (A) LokSabha (B) RajyaSabha (C) VidhanSabha (D) VidhanParishad 6. Who served as India's first ambassador to the Soviet Union? (A) K.M.Panikkar (B) V.K.Krishna Menon (C) Vijayalakshmi Pandit (D) Prof.Mahalanobis 7. Which of the following parts of the Indian Constitution ensures social and economic democracy? (A) Emergency Provisions (B) Centre-State relations (C) Directive Principles of State policy (D) None of the above 8. The Second Chief Election Commissioner of India was? (A) Sukumar Sen (B) S.P. SenVerma (C) K.V.K. Sundaram (D) T. Swaminathan 9. The Government of India Act-1935 was based on: (A) Simon Commission (B) Lord Curzon Commission (C) Dimitrov Thesis (D) Lord Clive's report 10. Who can impose reasonable restrictions over fundamental rights? (A) Council of Ministers (B) Parliament (C) People (D) Cabinet 11. Which one of the following is issued by the court in case of an illegal detention of a person? (A) Habeas Corpus (B) Mandamus (C) Certiorari (D) Quo Warranto 12. Who was the first to use the term State? (A) Hobbes (B) Plato (C) Aristotle (D) Machiavelli 13. Who presently serving State Chief Minister has been in office continuously for the longest period? (A) Aravind Kejriwal (B) Raghubar Das (C) M.L.Khattar (D) P.K.Chamling 14. Who had Played Key role in the formation of Lokpal bill in India? (A) Vikpin Hazarika (B) Anna Hajare (C) Baba Amte (D) medha patkar 15. The Mandal Commissions Report refers to: (A) The Other Backward Classes (B) The Scheduled Tribes (C) The Minorities (D) The Scheduled castes 16. How many Fundamental Rights were granted initially? (A) Six (B) Seven (C) Four (D) Five 17. Total assembly segments in Delhi are? (A) 50 (B) 60 (C) 70 (D) 40 18. Democratic Centralism is an important feature of a: (A) Communist state (B) Democratic state (C) Totalitarian state (D) Socialist state 19. Shadow Cabinet is the feature of Administrative system of: (A) Britain (B) USA (C) France (D) Japan 20. The concept of "Rule of Law" is a special feature of constitutional system of: (A) Britain (B) U.S.A (C) France (D) Switzerland 21. Comptroller and Auditor General of India acts as a friend, Philosopher and Guide for: (A) Public Accounts Committee (B) Estimates Committee (C) Finance ministry (D) Committee on public undertakings 22. The Ministry sometimes referred to as Green Ministry in India is Ministry of: (A) Agricultural and Rural Development (B) Environment and Forests (C) Surface and Transport (D) Urban Development and Landscaping 23. Special status to Jammu and Kashmir is given by the Indian Constitution under the article: (A) 364 (B) 368 (C) 370 (D) 377 24. The method of amending the Constitution by popular veto is founded in: (A) Britain (B) Switzerland (C) Russia (D) India 25. Grassroots democracy is related to: (A) Devolution of powers (B) Decentralisation of power (C) Panchayati Raj System (D) All of the above 26. Wildlife Protection Act was implemented in India in: (A) 1972 (B) 1986 (C) 1964 (D) 1956 27. Who acts as the channel of communication between the President and the Council Ministers? (A) Chairman, RajyaSabha (B) Speaker of LokSabha (C) Vice-President (D) Prime Minister 28. In India, woman had never been a Chief Minister in the State of: (A) Tamil Nadu (B) Rajasthan (C) Uttar Pradesh (D) Maharashtra 29. The number of subjects incorporated in the Union List is (A) 97 (B) 102 (C) 82 (D) 89 Key 1.D 2.B 3.D 4.A 5.B 6.C 7.C 8.C 9.A 10.B 11.A 12.D 13.D 14.B 15.A 16.B 17.C 18.A 19.A 20.A 21.A 22.B 23.C 24.B 25.D 26.A 27.D 28.D 29.A -
ఏపీపీఎస్సీ.. గ్రూప్–1 (2011) ఇంటర్వ్యూ టిప్స్
సమకాలీన అంశాలపై పట్టు గ్రూప్–1 ఇంటర్వూ్య అభ్యర్థులు సమకాలీన అంశాలపై పట్టు సాధించాలి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్స్పై అవగాహన పెంపొందించుకోవాలి. అభివృద్ధి కారక అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సామాజిక అభివృద్ధితో సంబంధంలేని అంశాలకు అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల్లోని బిడియాన్ని తొలగించేందుకు, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు ఇంటర్వూ్య బోర్డ్ సభ్యులు.. ఇటీవల మీరు చూసిన సినిమా ఏంటి? ఆ సినిమాపై మీ అభిప్రాయం? ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే ఎక్కువగా వీటిపై దృష్టి పెట్టకుండా.. సమకాలీనంగా ముఖ్యమైన పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. పని నేపథ్యం.. ఇప్పుడు ఇంటర్వూ్యలు నిర్వహిస్తున్న గ్రూప్–1 పోస్టులకు సంబంధించి తొలి నోటిఫికేషన్ 2011లోనే వెల్లడైంది. కానీ అనూహ్య కారణాల వల్ల కోర్టు జోక్యం వరకు వెళ్లి ఒక కొలిక్కి రావడానికి ఐదున్నరేళ్లకుపైగానే పట్టింది. తొలి నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అధిక శాతం మంది ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడి ఉంటారు. వీరు ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న విధులపై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అభ్యర్థులు నిర్వహిస్తున్న విధులు, వాటిలో సాధించిన విజయాలు లేదా విధి నిర్వహణలో ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయాలు, వాటి ఫలితాలు తదితరాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అభ్యర్థులు వీటికి అనుగుణంగా సన్నద్ధమై ఇంటర్వూ్యకు వెళ్లాలి. అకడమిక్ నేపథ్యం ఇంటర్వూ్యకు హాజరయ్యే అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ అకడమిక్ నేపథ్యం, తమ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యం, తమ అకడమిక్ నైపుణ్యాలను విధి నిర్వహణలో ఎలా అన్వయిస్తారో సమర్థంగా చెప్పగలిగేలా ఇంటర్వూ్యకు సన్నద్ధమవ్వాలి. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్ అభ్యర్థులు ఈ తరహా ప్రశ్నలకు సిద్ధంగా ఉండాలి. పునర్విభజనపై సమగ్ర అవగాహన గ్రూప్–1(2011) ఇంటర్వూ్యకు ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వూ్యలో రాణించేందుకు ప్రధానంగా ఉపకరించే మరో అంశం.. పునర్విభజన చట్టం. దీనివల్ల రాష్ట్రానికి మేలు జరిగిందా? లేదా? మీ అభిప్రాయం? కొత్త రాష్ట్రంగా ఏర్పాటయ్యాక తలెత్తిన పరిస్థితులపై మీ అభిప్రాయం? లాంటి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది. అందువల్ల పునర్విభజన చట్టం, రాష్ట్ర విభజన తర్వాతి పరిణామాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి. న్యూస్ పేపర్ రీడింగ్ అభ్యర్థులు తప్పనిసరిగా న్యూస్పేపర్ చదవాలి. దినపత్రికల ఎడిటోరియల్స్, ఒక అంశంపై ప్రముఖుల విశ్లేషణలను కేవలం చదవడమే కాకుండా వాటిపై స్వీయ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. ఇంటర్వూ్యలో ఒక అంశం గురించి ప్రశ్నించినప్పుడు కేవలం తాము చదివిన అంశాలనే ప్రస్తావిస్తే.. అభ్యర్థికి స్వీయ అభిప్రాయం లేదని బోర్డ్ సభ్యులు అనుకోవచ్చు. అందువల్ల ప్రతి అంశంపై స్వీయ అభిప్రాయం, విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఇంటర్వూ్యకు హాజరయ్యే రోజున అభ్యర్థులు కనీసం రెండు దినపత్రికలను చదవాలి. గతంలో చాలా సందర్భాల్లో పలువురు అభ్యర్థులను ‘ఈ రోజు న్యూస్ పేపర్లో మీరు ప్రాధాన్యంగా భావించిన న్యూస్ ఏంటి?’, ‘ఈ రోజు ఫలానా వార్తా కథనంలో పేర్కొన్న అంశాలపై మీ అభిప్రాయం ఏంటి?’ లాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. బాడీ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ ఇంటర్వూ్యకు హాజరయ్యే అభ్యర్థులు తమ బాడీ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లైట్ షేడ్ డ్రెస్తోపాటు షూస్ ధరించడం మంచిది. అయితే అలవాటు ఉంటేనే టై ధరించాలి. ఇంటర్వూ్య సమయంలో అభ్యర్థులు తమ హావభావాలను వ్యక్తం చేయడంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా చేతులు, కాళ్లు కదిలించకూడదు. ప్రశ్న.. చర్చగా మారితే? కొన్ని సందర్భాల్లో ఇంటర్వూ్యలో అడిగిన ప్రశ్న నేరుగా జవాబు చెప్పడంతోనే ముగియకుండా.. అనుబంధ ప్రశ్నలు, బోర్డ్ సభ్యుల అభిప్రాయాలతో కలిసి చర్చగా మారొచ్చు. అలాంటప్పుడే కొందరు అభ్యర్థులు ఇబ్బంది పడతారు. సంబంధిత అంశంపై అవగాహన లేకపోతే నిజాయతీగా తమకు ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్పాలి. ఇంటర్వూ్య రోజు ఆహ్లాదంగా ఇంటర్వూ్య రోజున ఆహ్లాదంగా ఉండాలి. ముఖ్యంగా అప్పటికే ఇంటర్వూ్య పూర్తయిన అభ్యర్థులతో బోర్డ్ సభ్యులు అడిగిన ప్రశ్నల గురించి చర్చించొద్దు. వ్యవధి ఉంటే మీతోపాటు వేచి చూస్తున్న వారితో ఆ రోజు న్యూస్ పేపర్లోని అంశాల గురించి చర్చించొచ్చు. హుందాగా.. ఇంటర్వూ్య రూమ్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి బయటికి వచ్చే వరకు హుందాగా, వినమ్రంగా వ్యవహరించాలి. ముందుగా డోర్ నాక్ చేసి బోర్డ్ సభ్యుల అనుమతి తీసుకున్నాకే గదిలోకి వెళ్లాలి. అందరినీ చూస్తూ విష్ చేయడం మరవొద్దు. తర్వాత బోర్డ్ సభ్యులు చెప్పే వరకు సీటులో కూర్చోవద్దు. సీట్లో కూర్చునే శైలి కూడా హుందాగా ఉండేలా చూసుకోవాలి. నిటారుగా కూర్చోవాలి. ఇందులోనే సగం ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఎదురుగా ఉన్న టేబుల్పై చేతులు పెట్టడం వంటివి చేయకూడదు. ఇంటర్వూ్య ముగిసిన తర్వాత కూడా అందరికీ ఆపాదించేలా ‘థ్యాంక్యూ సర్, థ్యాంక్యూ మేడమ్’ అంటూ బయటికి రావాలి. ‘ఐ’ కాంటాక్ట్.. మోస్ట్ ఇంపార్టెంట్: సివిల్స్, గ్రూప్–1 ఇలా ఇంటర్వూ్య ఏదైనా బోర్డ్ సభ్యులందరితో ఐ కాంటాక్ట్ అభ్యర్థులకు ప్రధాన అంశం. ప్రశ్న అడిగిన సభ్యుడి వైపు దృష్టిపెడుతూనే... సమాధానం చెప్పేటప్పుడు బోర్డ్లోని ఇతర సభ్యులను చూస్తూ చెప్పాలి. వివాదాస్పద అంశాలపై ప్రశ్నలు వచ్చినప్పుడు బ్యాలెన్స్డ్ అప్రోచ్తో వ్యవహరించాలి. ఏకపక్ష ధోరణి సరికాదని గుర్తించాలి. – వి. గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ గ్రూప్–1 (2011) ఇంటర్వూ్య సన్నాహకాలు సంబంధిత సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలి. అటెస్టేషన్ అవసరమైన పత్రాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు అందుకు సంబంధించిన సర్టిఫికెట్ల నమూనాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నిర్దేశిత అధికారుల నుంచి ధ్రువీకరణ పొందాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీని తెలుసుకొని, దానికి ఒకరోజు ముందుగానే అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. హైదరాబాద్లో ఇంటర్వూ్యలు నిర్వహించనున్నందున దూర ప్రాంతాల అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీకి ఒక రోజు ముందుగానే చేరుకోవడం మేలు. వీటిపై అవగాహన.. హెచ్–1బి వీసాల్లో కోత– భారత్పై ప్రభావం డీమానిటైజేషన్, నల్లధనాన్ని అరికట్టేందుకు ఉన్న అవకాశాలు రాష్ట్రస్థాయిలో అమలవుతున్న కొత్త పథకాలు ఫిబ్రవరి 13 నాటికి కేంద్ర బడ్జెట్ (2017–18) ప్రకటిస్తారు. కొత్త బడ్జెట్లో ముఖ్యాంశాలు, ప్రధానంగా రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులు, పథకాల గురించి తెలుసుకోవడం మేలు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ పేరుతో లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనపై అభిప్రాయం. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తుంటే సంబంధిత శాఖలో అమలవుతున్న కొత్త పథకాలపై పూర్తి అవగాహన ఉండాలి. ప్రవేశాలు ఇప్లూలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇప్లూ), హైదరాబాద్ వివిధ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: అండర్ గ్రాడ్యుయేట్కు 10+2 లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. పోస్ట్ గ్రాడ్యుయేట్కు ఏదేని డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ: 2017, ఫిబ్రవరి 8 వెబ్సైట్: www.efluniversity.ac.in బిట్స్, పిలానీలో ఎంబీఏ కోర్సులు బిట్స్, పిలానీ.. ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా ఏదైనా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: క్యాట్– 2016 /జీమ్యాట్ స్కోర్. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేది: 2017, ఫిబ్రవరి 15 వెబ్సైట్: www.bitsadmission.com -
కామన్వెల్త్, ఆసియా క్రీడలు
కామన్వెల్త్ క్రీడల్లో కామన్వెల్త్ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారు. ఈ క్రీడలు తొలిసారిగా 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో జరిగాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడలను నిర్వహిస్తారు. ప్రపంచ యుద్ధాల కారణంగా 1942, 1946 సంవత్సరాల్లో వీటిని నిర్వహించలేదు. 1930–50 కాలంలో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్గా, 1954–66 మధ్య బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్గా, 1970–74 కాలంలో బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్గా ఈ క్రీడలను పిలిచారు. 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్గా పిలుస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, వేల్స్ దేశాలు (ఆరు) ఇప్పటి వరకు జరిగిన అన్ని కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నాయి. ఈ క్రీడలను ఆస్ట్రేలియా, కెనడాలు అత్యధికంగా చెరో నాలుగుసార్లు నిర్వహించాయి. భారతదేశం 2010 లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. 20వ కామన్వెల్త్ క్రీడలు 20వ కామన్వెల్త్ క్రీడలు 2014, జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగాయి. ఈ క్రీడల్లో 71 దేశాలకు చెందిన 4,947 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 17 క్రీడల్లో 261 ఈవెంట్లు జరిగాయి. ఇంగ్లండ్ అత్యధికంగా 58 స్వర్ణ, 59 రజత, 57 కాంస్య పతకాలను సాధించింది. ఈ క్రీడల్లో మొత్తం 174 పతకాలను కైవసం చేసుకుని ఇంగ్లండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, కెనడా, స్కాట్లాండ్లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్కు 15 స్వర్ణ, 30 రజత, 19 కాంస్య పతకాలు కలిపి మొత్తం 64 పతకాలు లభించాయి. ఆరంభ వేడుకల్లో భారత్ తరపున షూటర్ విజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని చేబూని భారత క్రీడా బృందానికి ముందు నడిచాడు. ముగింపు వేడుకల్లో సీమా పూనియా (డిస్కస్ త్రో) జాతీయ పతాకధారిగా నిలిచింది. భారత స్వర్ణపతక విజేతలు సంజిత కుముక్చామ్ మహిళల వెయిట్ లిఫ్టింగ్ సుఖేన్ డే పురుషుల వెయిట్ లిఫ్టింగ్ అభినవ్ బింద్రా షూటింగ్ అపూర్వి చందేల మహిళల షూటింగ్ రాహి సర్నోబత్ మహిళల షూటింగ్ సతీష్ శివలింగం వెయిట్ లిఫ్టింగ్ జీతూ రాయ్ షూటింగ్ అమిత్ కుమార్ రెజ్లింగ్ వినేష్ ఫోగత్ మహిళల రెజ్లింగ్ సుశీల్ కుమార్ రెజ్లింగ్ బబిత కుమారి మహిళల రెజ్లింగ్ యోగేశ్వర్ దత్ రెజ్లింగ్ వికాస్ గౌడ డిస్కస్ త్రో దీపికా పల్లికల్ జ్యోత్స్న చిన్నప్ప స్క్వాష్ (మహిళల డబుల్స్) పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్ కామన్వెల్త్ క్రీడలు– వేదికలు ఇప్పటివరకు 20 కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. కొన్నింటి వివరాలు. సంవత్సరం నగరం దేశం 1930 హామిల్టన్ కెనడా 1934 లండన్ ఇంగ్లండ్ 1938 సిడ్నీ ఆస్ట్రేలియా 1950 అక్లాండ్ న్యూజిలాండ్ 1954 వాంకోవర్ కెనడా 1998 కౌలాలంపూర్ మలేసియా 2002 మాంచెస్టర్ ఇంగ్లండ్ 2006 మెల్బోర్న్ ఆస్ట్రేలియా 2010 న్యూఢిల్లీ ఇండియా 2014 గ్లాస్గో స్కాట్లాండ్ ఆసియా క్రీడలు ఆసియా క్రీడలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఒలంపిక్స్ తర్వాత ప్రపంచంలో అతి పెద్ద క్రీడా సంబరంగా వీటిని పేర్కొంటారు. ఈ క్రీడలు తొలిసారి 1951లో (న్యూఢిల్లీ) జరిగాయి. భారత్, ఇండోనేసియా, జపాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్ (ఏడు) దేశాలు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆసియా క్రీడల్లో పాల్గొన్నాయి. 17వ ఆసియా క్రీడలు 17వ ఆసియా క్రీడలు 2014లో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగాయి. వీటికి దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరం ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రీడల్లో 45 దేశాలకు చెందిన 9,501 క్రీడాకారులు పాల్గొన్నారు. 36 క్రీడల్లో 439 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. చైనా 151 స్వర్ణపతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వీటితో పాటు 108 రజత, 83 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 342 పతకాలను చైనా సొంతం చేసుకుంది. దక్షిణ కొరియా, జపాన్, కజకిస్థాన్, ఇరాన్, థాయిలాండ్, ఉత్తర కొరియా దేశాలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ 57 పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో 11 స్వర్ణ, 10 రజత, 36 కాంస్య పతకాలను భారత క్రీడాకారులు సాధించారు. జపాన్ స్విమ్మర్ హగినో కొసుకే నాలుగు స్వర్ణాలతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించి ‘శాంసంగ్ అత్యంత విలువైన క్రీడాకారుడు’ అవార్డును గెలుచుకున్నాడు. -
బులెటిన్ బోర్డ్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఫ్యాకల్టీ పోస్టులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద.. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రొఫెసర్: (శాలక్య తంత్ర, పంచకర్మ, మౌలిక్ సిద్ధాంత, రోగ నిదాన్ అండ్ వికృతి విగ్యాన్, ప్రసూతి తంత్ర అండ్ స్త్రీ రోగ, శరీర రచన, శరీర క్రియ, అగద్ తంత్ర). ఖాళీలు: 8 అసోసియేట్ ప్రొఫెసర్: (కౌమార్ భృత్య, ప్రసూతి తంత్ర అండ్ స్త్రీ రోగ, స్వస్థ వృత్త, శరీర క్రియ, కాయ చికిత్స, ద్రవ్య గుణ, అగద్ తంత్ర, పంచకర్మ) ఖాళీలు: 8 లెక్చరర్: (ప్రసూతి తంత్ర అండ్ స్త్రీ రోగ, ద్రవ్య గుణ, కాయ చికిత్స, పంచకర్మ, రస శాస్త్ర అండ్ బైసాజ్య కల్పన, అగద్ తంత్ర, రోగ నిదాన్ అండ్ వికృతి విగ్యాన్, శల్య తంత్ర, శాలక్య తంత్ర) ఖాళీలు: 9 దరఖాస్తు విధానం: నిర్దేశిత విధానంలో పూర్తిచేసిన దరఖాస్తుతోపాటు సర్టిఫికెట్లను డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, జోరావర్ సింగ్ గేట్, అమీర్ రోడ్, జైపూర్ – 302002కు పంపాలి. దరఖాస్తులకు చివరి తేది: మార్చి 1, 2017 వెబ్సైట్: http://nia.nic.in -
VOCABULARY AND GRAMMAR
In Paper-II Section-B: Vocabulary and Grammar contains 4 passages. The first one is re-writing the sentences as directed. This will be on Direct-indirect speech, Active-passive voice, Clauses. Look at the March 2016 example: (Q.No. 16-18) Read the following passage focusing on the parts that are underlined and numbered. (3x1=3 m) One day, fisherman caught a big fish and took it the king's palace. (16) The king saw the fish. He felt very happy. After his cooks had cooked it and he had eaten it. (17) He said to the fisherman "what do you want for the fish?" "I want you to beat me twenty times with a rod", said the fisherman. The king was surprised, and argued with the fisherman, but in the end he said, 'I promised to give you whatever you wanted, and I suppose that I must keep my promise'. After the king had hit him ten times, the fisherman jumped away and said, "that is enough for me. I promised the other ten to your minister". The king understood everything. (18) He gave the minister the ten hits with the rod and removed him from the service. Now, complete the following sentences and write them in your answer booklet. 16.When the king saw …………… 17. He asked..…………………….. 18. The king not only .…………… Answers: 16. When the king saw the fish, he felt very happy. 17. He asked the fisherman what he wanted for the fish. 18. The king not only gave the minister the ten hits with the rod, but also removed him from the service. Remember there is no fixed pattern for this passage. They may not follow the same clause for the next. So we should be ready to face Speech, Voice and Clauses of any type. Direct speech and Reported speech Direct speech: When the exact words of the speakers are given within inverted commas, it is said to be Direct speech. In this speech the words are quoted or repeated as they are said by the speaker. Ex:-She said, "My mother is very happy" Rosy said, "I like Telugu novels." Reported speech: When the substance of the actual words of the speaker is given, it is said to be a Reported speech or an indirect speech. In this speech the meaning of the spoken words is given in our own words. Ex: - She said that her mother was very happy. Rosy said that she liked Telugu novels. Rules for changing Direct speech into Indirect speech: 1.The reporting verb is changed to some extent according to the nature of the reported speech, but the tense of the reporting verb is never changed. 2.Inverted commas are removed. 3.Question marks and exclamatory marks are removed they are changed into Assertive sentences. 4.If the reporting verb in the present tense or future tense the tense of the direct speech is not changed. 5.Present simple changes to past simple. 6.Present continuous changes to past continuous. 7.Present perfect changes to past perfect. 8.resent perfect continuous changes to past perfect continuous. 9.Past simple some times remains unchanged when D.S. contains historical events, conditional tense and "had" as principal verb. In all other cases past simple changes to past perfect. 10.Past continuous changes to past perfect continuous. 11.Past perfect remains unchanged. 12.Past perfect continuous remains unchanged. 13.Future simple changes to probable conditional. 14.uture continuous changes to probable conditional. 15.Tense of habitual actions and universal truths is not changed. 16.'If' or 'whether' is used in reported speech for 'yes or no' questions. 17.In the reported speech the following reporting verbs can be used according to the nature of the direct speech. reporting verbs: tell, told, asked, requested, ordered, commanded, suggested, exclaimed, questioned etc. -
భారతదేశం– భౌగోళిక స్వరూపాలు
ఇందిరా పాయింట్, నికోబార్ దీవుల , Indira Point , Nicobar Islands ,Bhavitha ఇందిరా పాయింట్: భారతదేశ దక్షిణ చివరి సరిహద్దును ‘ఇందిరా పాయింట్’గా పిలుస్తారు. ఇది నికోబార్ దీవుల దక్షిణ చివరన ఉంది. అంతర్వేది(Doab): రెండు నదుల మధ్య ఉండే మైదాన ప్రాంతం. ఇది చాలా సారవంతమైన భూభాగం. పూర్వం ఈ ప్రాంతంపై అధికారాన్ని చెలాయించేందుకు రాజుల మధ్య అనేక యుద్దాలు జరిగాయి. 4 మార్కుల ప్రశ్నలు – సమాధానాలు కింది పేరాగ్రాఫ్ను చదివి భారతదేశ శీతోష్ణస్ధితి, హిమాలయాల గురించి వ్యాఖ్యానించండి. (విద్యా ప్రమాణం: ఇచ్చిన పాఠ్యాంశాన్ని అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం) హిమాలయాల వల్ల శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితమవుతుంది. ఇవి భారతదేశ ఉత్తర సరిహద్దున రక్షణ కవచాలుగా ఉండి చలికాలంలో మధ్య ఆసియా నుంచి వచ్చే తీవ్ర చలిగాలులను అడ్డుకుంటాయి. వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ఉన్న ప్రాంతంలో రుతుపవన శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. ఇవి లేకపోతే దేశ ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది. సమాధానం: ఒక ప్రాంతంలో దీర్ఘకాలికంగా ఒక క్రమ పద్ధతిలో ఉండే వాతావరణ పరిస్థితులను శీతోష్ణస్థితిగా పిలుస్తారు. ఉష్ణోగ్రత, వర్షపా తం, పీడనం, పవనాలు, ఆర్ధ్రత మొదలైన భౌతికాంశాల సగటు స్థితి శీతోష్ణస్థితిని వివరిస్తుంది. భారతదేశ శీతోష్ణస్థితిని స్థూలంగా ‘ఉష్ణ మండల రుతుపవన శీతోష్ణస్థితి’గా పేర్కొంటారు. వివిధ ప్రదేశాల్లోని శీతోష్ణస్థితి లక్షణాల్లో తేడాలను నిర్ణయించడంలో దేÔ¶ వైశాల్యం, వివిధ భౌగోళిక స్వరూపాలు ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి హిమాలయ పర్వతాలు. హిమాలయాలు జమ్ముకాశ్మీర్ నుంచి అరుణాచల్ప్రదేశ్ వరకు దేశ ఉత్తర సరిహద్దుగా సుమారు 2400 కి.మీ. పొడవున వ్యాపించి ఉన్నాయి. ఇవి శీతాకాలంలో మధ్య ఆసియా నుంచి వీచే అతిశీతల పవనాలను ఉత్తర మైదానంలోకి ప్రవేశించకుండా అడ్డగించి ఉత్తర భారతదేశాన్ని చలి నుంచిlకాపాడుతున్నాయి. వేసవి కాలంలో మైదానాల్లో వర్షపాతానికి; పశ్చిమ కనుమల తూర్పు, ఈశాన్య భాగాల్లో రుతుపవన శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. రుతుపవన శీతోష్ణస్థితి లేనట్లయితే భారతదేశం ఉష్ణమండల ఎడారిగా మారి ఉండేది. అంతేకాకుండా హిమాలయాల్లోని హిమనీ నదాల నుంచి ప్రవహించే జీవనదుల వల్ల ఉత్తర మైదానాలు సారవంతంగా మారి ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ విధంగా హిమాలయాల వల్ల భారతదేశ శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితమవుతోంది. భారతదేశ ప్రధాన భౌగోళిక విభజనలు ఏవి? హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితులతో ద్వీపకల్ప పీఠభూమిని పోల్చండి? (విద్యా ప్రమాణం: విషయావగాహన) సమాధానం: భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని ఆరు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అవి.. హిమాలయాలు, గంగా–సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీరప్రాంత మైదానాలు, ఎడారులు, దీవులు. హిమాలయ ప్రాంతానికి, ద్వీపకల్ప పీఠభూమికి మధ్య పోలికలు, తేడాలు: ఉత్తర భారతదేశ ఉత్తర భాగంలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 5 లక్షల చ.కి.మీ. దేశ ఉత్తర ‡మైదానానికి దక్షిణంగా ఉన్న విశాల పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమిగా పిలుస్తారు. ఇది 16 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి, దేశంలో అతి పెద్ద నైసర్గిక స్వరూపంగా గుర్తింపు పొందింది. మాలయాలు సముద్ర మట్టానికి సరాసరి 600 నుంచి 6100 మీటర్ల ఎత్తులో ఉండగా, ద్వీపకల్ప పీఠభూమి 600 నుంచి 900 మీటర్ల సాధారణ ఎత్తుతో క్రమరహితంగా ఉంది. హిమాలయాల్లో జన్మించిన గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉప నదులు నిరంతరం ప్రవహిస్తూ ఉత్తర భారతదేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. గోదావరి, కృష్ణా, మహానది, కావేరి, నర్మద, తపతి వంటి నదులు ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహిస్తూ ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. హిమాలయాల దక్షిణ భాగంలో గంగా–సింధు మైదానం ఉంది. ఇక్కడి సారవంతమైన నేల పలు పంటలు పండటానికి అనుకూలంగా ఉంది. ద్వీపకల్ప పీఠభూమిని ఆనుకొని పశ్చిమ, తూర్పు భాగాల్లో తీర మైదానాలు ఉన్నాయి. వీటిలోని సాగుభూమి వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లోని భౌగోళిక నిమ్నోన్నతాలు ఆయా ప్రదేశాల్లో రుతుపవన వర్షపాతానికి దోహదపడుతున్నాయి. హిమాలయ ప్రాంతంలో దాల్, ఊలార్, కుమావున్, సోమర్ వంటి ప్రముఖ సరస్సులు ఉన్నాయి. చిల్కా, పులికాట్, కొల్లేరు, అష్టముడి వంటి సరస్సులు ద్వీపకల్ప పీఠభూమిలో ప్రధానమైనవి. ఈ రెండు ప్రధాన భౌగోళిక స్వరూపాలు వివిధ రూపాల్లో దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నాయి. 2 మార్కుల ప్రశ్నలు ప్రపంచపటాన్ని పరిశీలించి భారతదేశ ఉనికి గురించి క్లుప్తంగా రాయండి. (విద్యా ప్రమాణం: పట నైపుణ్యాలు) భారతదేశ ఉనికి: భారతదేశం ఆసియా ఖండంలోని దక్షిణ భాగంలో ఉంది. భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న భారతదేశం ఉత్తరార్ధ, పూర్వార్ధ గోళాల్లో విస్తరించి ఉంది. భారతదేశం భౌగోళికంగా 8041 – 37061 ఉత్తర అక్షాంశాలు, 68071 – 970 251 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశానికి మూడు వైపులా సముద్రం ఉండి, ఒక వైపు భూభాగ సరిహద్దు ఉంది. అందుకే మన దేశాన్ని ద్వీపకల్పంగా పరిగణిస్తారు. ఇది అక్షాంశాల పరంగా ఉత్తర, దక్షిణాలుగా 30 డిగ్రీల పొడవున, రేఖాంశాల పరంగా తూర్పు పడమరలుగా 30 డిగ్రీల వెడల్పున వ్యాపించి ఉంది. భారతదేశ భూభాగాలైన అండమాన్ నికోబార్, లక్ష దీవులు ప్రధాన భూభాగానికి దూరంగా విసిరేసినట్లు ఉన్నాయి. -
ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంక్?
బియ్యాన్ని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం? – పశ్చిమ బెంగాల్ దేశంలో పంటలకు మద్దతు ధరలను రూపొందించేది? – వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ను మంజూరు చేసేది? – ఐఎంఎఫ్ (M) భారత్లో మొదటి రైలు ప్రయాణం ప్రారంభమైన ప్రాంతం? – ముంబై నుంచి థానే వరకు ఏ రేటు వద్ద ఎగుమతులకు బదులు దిగుమతులు ప్రత్యామ్నాయమవుతాయో వాటిని ఏమంటారు? – వర్తక నిబంధనలు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో అధిక కోటా గల దేశం? – అమెరికా అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? – ఎడ్విన్ కానన్ జనాభా స్థిరీకరణను ఏ సంవత్సరం నాటికి సాధించాలని జనాభా విధానం–2000 లక్ష్యంగా పేర్కొంది? – 2045 భారత్లోని నిరుద్యోగాన్ని ఏమని వర్ణించొచ్చు? – నిర్మాణాత్మక నిరుద్యోగం కర్జన్ బహుళార్థక సాధక నీటి ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? – గుజరాత్ ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? – జెనీవా భారతీయ యాజమాన్యంలో 1881లో ఆగ్రాలో స్థాపించిన బ్యాంక్? – ఔ«ద్ కమర్షియల్ బ్యాంక్ ప్రపంచం మొదటి కేంద్ర బ్యాంక్?– రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ హరిత విప్లవం ఏ రాష్ట్రాల్లో ప్రధానంగా చోటు చేసుకుంది? – పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎంత శాతం కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం ఉంది? – 30.7 శాతం 2011 సెన్సెస్కు సంబంధించి సెన్సెస్ కమిషనర్? సి. చంద్రమౌళి మానవాభివృద్ధి సూచీని జిల్లాల వారీగా రూపొందించిన మొదటి రాష్ట్రం? – మధ్యప్రదేశ్ బ్రిటిష్ పాలనలో భారత్లో జాతీయాదాయ వృద్ధి రేటు? – 1.2 శాతం 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంత శాతం కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం ఉంది? – 55.3 శాతం అల్ప ఉద్యోగిత అంటే? – తన సామర్థ్యం కంటే తక్కువ స్థాయి పని చేస్తుండటం ఖాయిలా పడిన పరిశ్రమల చట్టాన్ని ఏ కమిటీ సూచన మేరకు రూపొందించారు? – తివారి కమిటీ పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం? – 1996 ఆగస్టు చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి రిజర్వేషన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని సిఫార్సు చేసిన కమిటీ? – అబిద్ హుస్సేన్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించిన తేది? – 2005, సెప్టెంబర్ 5 భారత ఆర్థిక రాజ్యాంగంగా పిలిచే పారిశ్రామిక తీర్మానం? – 1956 పారిశ్రామిక తీర్మానం జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు? – 1977 దేశంలో పరపతిని సృష్టించేవి? – వాణిజ్య బ్యాంకులు ప్రపంచంలో మొదటగా హరిత విప్లవం ఏ దేశంలో వచ్చింది? – మెక్సికో ఆక్ట్రాయ్ పన్నును విధించేది? – స్థానిక సంస్థలు పన్నుల సంస్కరణలపై 2002లో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ అధ్యక్షుడు? – విజయ్ కేల్కర్ భూతలింగం కమిటీ దేనికి సంబంధించింది? – పన్నుల ఎగవేత జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ను ఎప్పట్నుంచి ప్రారంభించారు? – 2005, ఏప్రిల్ 12 షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే? – 1934 ఆర్బీఐ చట్టంలోని షెడ్యూల్–2లో నమోదైన బ్యాంకులు వ్యవసాయ ఆదాయంపై పన్నును సిఫార్సు చేసిన కమిటీ? – కె.ఎన్. రాజ్ ఉఇఈ దేశాల ప్రధాన కేంద్రం? – పారిస్ జీడీపీ, జీఎన్పీ భావనలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఆర్థిక శాస్త్రవేత్త? – సైమన్ కుజ్నిట్స్ గినీ సూచీ ద్వారా దేన్ని అంచనా వేయొచ్చు? – సాపేక్ష పేదరికం ప్రభుత్వ వ్యయ సంస్కరణలకు సంబంధించి ఏర్పాటైన కమిటీ? – గీతాకృష్ణన్ భారత్లో ఒక రూపాయి.. ప్రామాణిక ద్రవ్యంగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? – 1835 భారత్లోని నిరుద్యోగ స్వభావం? – దీర్ఘకాలికం మన దేశంలో పేదరికాన్ని అంచనా వేయడంలో విశేష కృషి చేసినవారు? – దండేకర్, రథ్ దేశంలో సిమెంట్ ఉత్పత్తి మొదటగా ఎక్కడ ప్రారంభమైంది? – మద్రాస్తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ -
ఐటీ నియామకాలు..తాజా సరళి
ట్రెడిషనల్ నుంచి టెక్నికల్ డిగ్రీ ఔత్సాహికుల వరకు దాదాపు 80 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగ సాధన దిశగా తొలి గమ్యం.. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు. వీరంతా ప్రస్తుతం, భవిష్యత్తులో ఐటీ రంగంలో నియామకాలు ఎలా ఉండనున్నాయనే దానిపైనే దృష్టిసారిస్తారు. అయితే రానున్న రోజుల్లో ఐటీ నియామకాలు తగ్గుతాయని కొన్ని వర్గాలు పేర్కొంటుంటే.. మరికొన్ని వర్గాలు ఇందుకు భిన్నంగా మాట్లాడుతున్నాయి. క్యూ–2 ఫలితాలు: 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల క్యూ–2 (రెండో త్రైమాసిక) ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిని పరిశీలిస్తే కొన్ని కంపెనీల ఫలితాల్లో వృద్ధి కనిపించినా.. నికర లాభాల పరంగా గతేడాదితో పోల్చితే నమోదైన వృద్ధి తక్కువే. ఈ ధోరణి నియామకాలపై ప్రభావం చూపుతుందని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. అంచనాలు మారే పరిస్థితి: నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్).. 2016–17లో ఐటీ రంగంలో 2.75 లక్షల నియామకాలు జరుగుతాయని గతంలో అంచనా వేసింది. కానీ, ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత తొలి త్రైమాసికంలోనే ఈ అంచనాలు మారే అవకాశం ఉందని, భావించిన దానికంటే 20 శాతం మేర నియామకాలు తక్కువగా జరుగుతాయని పేర్కొంది. అంతేకాకుండా దేశంలో సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థలుగా పేరొందిన కొన్ని సంస్థల్లో (ఇన్ఫోసిస్, ఐబీఎం, టీసీఎస్ తదితర) నియామకాలు 2015–16తో పోల్చితే కొంత తక్కువగా నమోదయ్యాయి. ఇదే సరళి రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందని పరిశ్రమ వర్గాల అభిప్రాయం. అంతర్జాతీయ, జాతీయ పరిణామాల ప్రభావం: ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రధానంగా అమెరికా, యూకేల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి. 2014–15లో అమెరికాకు భారత ఐటీ ఎగుమతుల విలువ 80 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే అక్కడ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడం, ఆయన విధానాలపై మరింత స్పష్టత వచ్చే వరకు కార్యకలాపాల విస్తరణ లేదా కొనసాగింపుపై దృష్టిసారించే అవకాశాలు కనిపించడం లేదు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ కావడం(బ్రెగ్జిట్)తో యూకేలో భారత ఐటీ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని స్వయంగా నాస్కామ్ పేర్కొంది. మరోవైపు దేశీయంగా కంపెనీలు ముఖ్యంగా ఆటోమేషన్ విధానాలపై మొగ్గు చూపడం వల్ల ట్రెడిషనల్ హైరింగ్స్పై సమీప భవిష్యత్తులో 10–15 శాతం ప్రభావం పడనున్నట్లు ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థకు చెందిన ఉన్నత ఉద్యోగి తెలిపారు. వాస్తవ నియామక అవసరాలు: దేశంలో 3.7 మిలియన్ల మందికి ఐటీ, ఐటీ అనుబంధ రంగం ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగంలో వాస్తవ నియామక అవసరాలకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే ప్రస్తుతం ఐటీ, బీపీవో రంగాల్లో 1.2 మిలియన్ల నుంచి 2 మిలియన్ల వరకు మానవ వనరుల అవసరం ఉంది. అయితే ఆటోమేషన్, అంతర్జాతీయ పరిణామాలు, కంపెనీల వృద్ధి ఫలితాల నేపథ్యంలో 20 శాతం మేర తగ్గుదల కనిపించే పరిస్థితి ఏర్పడింది. ఐఐటీల్లో ఆశాజనకంగా: ఐఐటీల్లో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇటీవల ఐఐటీల్లో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ డ్రైవ్స్లో 25 నుంచి 30 శాతం మేరకు వృద్ధి నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే ఐటీ దిగ్గజాలుగా పేరొందిన సంస్థలతోపాటు మిడిల్ లెవల్ ఐటీ కంపెనీలు దాదాపు 100 వరకు తాము నిర్వహించే ప్లేస్మెంట్ సెషన్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపినట్లు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఐటీ ప్లేస్మెంట్ సెల్ హెడ్ తెలిపారు. అయితే ఐఐటీల్లో క్యాంపస్ హైరింగ్స్లో పాల్గొనడం అనేది .. ఇండస్ట్రీ ట్రెండ్తో సంబంధం లేని విషయమని, ఈసారి పే ప్యాకేజీల్లో కొంత తగ్గుదల మాత్రం ఖాయమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అట్రిషన్ లేకపోవడం ఐటీ కంపెనీల్లో కొత్త నియామకాల పరంగా కొంత తగ్గుదల కనిపించడానికి.. ఇటీవల కాలంలో అట్రిషన్ (కంపెనీలు మారడం) రేటు తక్కువగా ఉండటం కూడా కారణంగా కనిపిస్తోంది. ఎంట్రీ లెవల్లో సైతం ఉద్యోగులు స్థిరత్వం దిశగా ఒక కంపెనీలోనే కనీసం మూడు, నాలుగేళ్లయినా పని చేయాలనే దృక్పథంతో వ్యవహరిస్తున్నారు. హైరింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నప్పటికీ కంపెనీలు ఎంట్రీ లెవల్, మిడ్ లెవల్ ఉద్యోగ నియామకాల పరంగా అభ్యర్థుల్లో ఐటీ రంగంలోని అప్డేటెడ్ స్కిల్స్పై దృష్టిసారిస్తున్నాయి. అలాంటి వారికి అవకాశం కల్పించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. – ప్రొఫెసర్ వి.ఉమామహేశ్వర్, ప్లేస్మెంట్ ఆఫీసర్, ఓయూసీఈ -
పర్యావరణ పరిరక్షణ చట్టాలు
వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972): ఈ చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా వన్యప్రాణి సంస్థ అనుమతి లేకుండా పార్కులు, వన్యప్రాణి కేంద్రాలకు సంబంధించి హద్దులను మార్చకూడదు. దీనికి 2002లో సవరణలు చేశారు. భూమి, సహజ వనరుల హక్కు సంరక్షణ చట్టం (1972): స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో పర్యావరణంపై జరిగిన యూఎన్ఓ సదస్సులో భూమి, సహజ వనరులను రక్షించేందుకు ప్రతి దేశం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (1974): నీటి కాలుష్య నివారణ చట్టం ప్రకారం 1974 లో కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటు చేశారు. 1981లో చేసిన వాయు కాలుష్య నివారణ చట్టంలోని అధికారాలను కూడా ఈ సంస్థకే అప్పగించారు. అడవుల సంరక్షణ చట్టం (1980): ఈ చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా కేంద్రం అనుమతి లేకుండా అటవీ భూములను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించరాదు. అటవీ భూముల్లో ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపడితే ముందుగా సంబంధిత శాఖల నుంచి అనుమతి పొందాలి. అటవీ, పర్యావరణ శాఖ (1985): కేంద్ర ప్రభుత్వం 1985లో పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. పర్యావరణం, అడవులకు సంబంధించి కార్యక్రమాల అమలుకు అటవీ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఎకోమార్క్ (1991): దీన్ని భారత ప్రమాణాల సంస్థ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) జారీ చేస్తుంది. 1991లో దీన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులకు ఎకోమార్క్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. పర్యావరణంపై ప్రభావం చూపే ఉత్పత్తులను అంగీకరించదు. పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం (1995): పర్యావరణానికి నష్టం కలిగించే అంశాలపై, ప్రమాదకర పదార్థాల తయారీపై, వ్యక్తులు, ఆస్తులకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ఈ చట్టం చేశారు. జీవ వైవిధ్య చట్టం (2002): 1992 జూన్ 5న యూఎన్ఓ ఆధ్వర్యంలో బ్రెజిల్లోని రియోడిజెనీరోలో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో 172 సభ్య దేశాలు పాల్గొన్నాయి. జీవ వైవిధ్య సంరక్షణకు అంతర్జాతీయ స్థాయిలో సంతకాలు జరిగాయి. ఇక్కడ జరిగిన ఒప్పందం ప్రకారం 2002లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఈ చట్టాన్ని తెచ్చింది. పర్యావరణ ఉద్యమాలు బిష్ణోయి ఉద్యమం: ఇది దేశంలో తొలి పర్యావరణ ఉద్యమంగా పేరుగాంచింది. రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లా ఖేజర్లీ గ్రామానికి చెందిన అమృతాదేవి నాయకత్వంలో ఈ ఉద్యమం జరిగింది. 1730లో ఖేజ్రి వృక్షాలను రక్షించేందుకు 363 మంది ఉద్యమం చేసి ప్రాణాలు కోల్పోయారు. సైలెంట్ వ్యాలీ ఉద్యమం: కేరళలోని పాలక్కడ్ జిల్లాలోని ఉష్ణమండల అటవీ ప్రాంతాన్ని సైలెంట్ వ్యాలీ అంటారు. పెరియార్ నదికి ఉప నది అయిన కుధిపుజ నదిపై జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల అడవులు, జంతువులు, జీవరాసులు అంతరించిపోతున్నాయని ఆందోళన చేస్తూ 1973లో ఉద్యమం ప్రారంభమైంది. తర్వాత 1985లో ఈ ప్రాంతాన్ని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్గా మార్చారు. జంగిల్ బచావో ఆందోళన్: బిహార్ ప్రభుత్వం అటవీ ప్రాంతంలో ఉన్న సాల్ చెట్లను నరికి, వాటి స్థానంలో టేకు వృక్షాలు పెంచాలని ప్రయత్నించడంతో 1980లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. సింగ్భం జిల్లా గిరిజన వాసులు సాల్ వృక్షాలను హత్తుకొని నిరసన వ్యక్తం చేశారు. చిప్కో ఉద్యమం: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా 1973లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. చిప్కో అంటే ‘హత్తుకొను’ అని అర్థం. చిప్కో ఉద్యమకారులు చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ వాటిని హత్తుకొని ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. సుందర్లాల్ బహుగుణ, గౌరీ దేవి, చండీప్రసాద్ భట్ మొదలైనవారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. నవధాన్య ఉద్యమం: జీవ రాశులు అంతరిస్తున్నాయనే ఉద్దేశంతో జీవవైవిధ్య సంరక్షణకు, సేంద్రీయ వ్యవసాయానికి రక్షణ కల్పించేందుకు 1984లో వందనా శివ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం జరిగింది. అప్పికో ఉద్యమం: చిప్కో ఉద్యమం తరహాలోనే అడవుల సంరక్షణ కోసం 1983 సెప్టెంబర్లో కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లాలోని సల్కాని ప్రాంతంలో ఉద్యమం ప్రారంభమైంది. పాండురంగ హెగ్డే నాయకత్వంలో ఉద్యమం జరిగింది. కన్నడంలో అప్పికో అంటే ‘కౌగిలించుకొను’ అని అర్థం. ర్మదా బచావో ఆందోళన్: మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో నర్మదా నది ప్రవహిస్తోంది. పర్యావరణానికి హాని కలిగిస్తూ ఈ నదిపై చేపట్టే ప్రాజెక్ట్లకు వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ముఖ్యంగా గుజరాత్లోని సర్దార్ సరోవర్ డ్యాంకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమాన్ని 1989లో మేధా పాట్కర్ ప్రారంభించారు. బాబా ఆమ్టే, అరుంధతి రాయ్లాంటి వారు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. గంగా పరిరక్షణ ఉద్యమం గంగా నది దేశంలో అతిపెద్దది. స్వచ్ఛమైన గంగా నది కోసం, కాలుష్య నివారణ కోసం శ్రీమతి రమారౌట ఆధ్వర్యంలో 1988న కాన్పూర్లో ఒక సెమినార్ జరిగింది. అదే ఉద్యమంగా మొదలైంది. అనేక స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, వైజ్ఞానిక సంస్థలు ఈ ఉద్యమానికి ప్రోత్సాహాన్ని అందించాయి. మాదిరి ప్రశ్నలు 1. 2012లో జీవవైవిధ్య సదస్సు ఏ నగరంలో జరిగింది? 1) వాషింగ్టన్ 2) హైదరాబాద్ 3) పారిస్ 4) న్యూయార్క్ 2. క్యోటో ప్రోటోకాల్ జరిగిన సంవత్సరం? 1) 2016 2) 2014 3) 1988 4) 1997 3. దేశంలో తొలి పర్యావరణ ఉద్యమం? 1) సైలెంట్ వ్యాలీ 2) చిప్కో ఉద్యమం 3) నర్మదా బచావో 4) బిష్ణోయి ఉద్యమం 4. నర్మదా బచావో ఉద్యమాన్ని ఎవరు నిర్వహించారు? 1) మేధా పాట్కర్ 2) బహుగుణ 3) రామకృష్ణ హెగ్డే 4) అన్నా హజారే 5. నీటి కాలుష్య నివారణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? 1) 1981 2) 1986 3) 1974 4) 1999 6. చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? 1) గుజరాత్ 2) బిహార్ 3) ఉత్తరాఖండ్ 4) రాజస్థాన్ 7. ప్రపంచ మొదటి జీరో కార్బన్ పట్టణం? 1) బీజింగ్ 2) మస్డర్ 3) ఢిల్లీ 4) దోహా 8. సైలెంట్ వ్యాలీ రక్షణ ఉద్యమం ఏ సంవత్సరంలో మొదలైంది? 1) 1973 2) 1986 3) 1989 4) 1983 సమాధానాలు 1) 2 2) 4 3) 4 4) 1 5) 3 6) 3 7) 2 8) 1 ఠి క్యోటో ప్రోటోకాల్: వివిధ కారణాల వల్ల భూగోళం వేడెక్కుతోంది. ముఖ్యంగా కార్బన్డైయాక్సైడ్ కారణంగా గ్రీన్ హúస్ ఎఫెక్ట్ జరిగి భూగోళం వేడెక్కుతోందనే ఉద్దేశంతో 1997, డిసెంబర్ 11న జపాన్లోని క్యోటో నగరంలో ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఇందుకు 192 దేశాలు అంగీకరించాయి. 2005, ఫిబ్రవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం గ్రీన్హúస్ వాయువుల ప్రభావాన్ని 5 శాతానికి తగ్గించాలి. 2012లో కెనడా ఈ ఒప్పందం నుంచి తప్పుకుంది. కార్టెజినా ప్రోటోకాల్: జీవరాశుల భద్రత కోసం 1999లో కొలంబియాలోని కార్టెజినాలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో చర్చ జరిగింది. 2003 సెప్టెంబర్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2015 నాటికి 170 దేశాలు ఇందుకు అంగీకరించాయి. ఈ ఒప్పందాన్ని ‘బయోసేఫ్టీ ప్రోటోకాల్’ అంటారు మొక్కల సంరక్షణ సదస్సు: ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1999లో అమెరికాలో మిస్సోరిలోని సెయింట్ లూయీస్ నగరంలో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో అంతరించి పోతున్న మొక్కలను కాపాడాలని నిర్ణయించారు. 2020 నాటికి లక్ష్యాన్ని పూర్తిచేయాలని ప్రతినబూనారు. రియోడిజెనీరో – ధరిత్రీ సదస్సు: 1992, జూన్ 5న బ్రెజిల్లోని రియోడిజెనీరోలో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో సంతకాలు జరిగాయి. 1993, డిసెంబర్ 29న అమల్లోకి వచ్చింది. ఈ సదస్సులో జీవ వైవిధ్య సంరక్షణను మానవజాతి సమస్యగా గుర్తించారు. నగోయా ప్రోటోకాల్: జపాన్లోని నగోయాలో 2010 అక్టోబర్లో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ఇది 1992లో రియోడిజెనీరోలో జరిగిన సదస్సుకు అనుబంధంగా జరిగిన రెండో ఒప్పందం. 2014, అక్టోబర్ 12 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. మాంట్రియల్ ఒప్పందం: సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా రక్షించే ఓజోన్ పొరకు జరుగుతున్న హానిని అరికట్టేందుకు 1987, సెప్టెంబర్ 16న కెనడాలోని మాంట్రియల్లో ప్రపంచ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఓజోన్ పొరకు నష్టాన్ని కల్గించే పదార్థాల ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇది 1989 జనవరిలో అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం అమలు ద్వారా అంటార్కిటికా ఖండం వద్ద ఓజోన్ పొరకు కలిగిన విఘాతాన్ని తగ్గిస్తున్నారు. 2050 నాటికి ఓజోన్ పొర యథాస్థితికి వస్తుందని భావిస్తున్నారు. హైదరాబాద్ జీవవైవిధ్య సదస్సు: ఐక్యరాజ్య సమితి జీవవైవిధ్య సదస్సు హైదరాబాద్లో 2012, అక్టోబర్ 1 నుంచి 9 వరకు జరిగింది. 194 సభ్యదేశాలకు చెందిన పర్యావరణ, అటవీశాఖ మంత్రులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థలు కూడా పాల్గొన్నాయి. ఈ సదస్సులో జీవవైవిధ్యం, జీవరాసుల సంరక్షణపై చర్చ జరిగింది. పారిస్ ఒప్పందం: వాతావరణ మార్పులపై పారిస్లో 2015, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు పర్యావరణ సదస్సు జరిగింది. 196 సభ్యదేశాలు హాజరయ్యాయి. 2016, ఏప్రిల్ నాటికి 174 దేశాలు సంతకాలు చేశాయి. భూగోళం వేడెక్కడంలో 2నిఇ ఉష్ణోగ్రతను తగ్గించాలని ఈ సదస్సులో నిర్ణయించారు. ఎకో సిటీ/ జీరో కార్బన్ సిటీ: ఎకో సిటీæ అనే భావనను 1975లో కాలిఫోర్నియాలో బెర్కలీ రిచర్డ్ ప్రతిపాదించారు. కాలుష్యం లేకుండా ఉండేందుకు ప్రతి నగరంలో వివిధ చర్యలు చేపట్టాలి. పునరుత్పాదక శక్తివనరుల వాడకం పెంచాలి. పేదరికం తగ్గి, ఆర్థిక వృద్ధి పెరిగితే కాలుష్య నివారణ జరుగుతుంది. భారతదేశంలో ఎకోసిటీ కాన్ఫరెన్స్ బెంగళూరులో జరిగింది. ప్రపంచంలో జీరో కార్బన్ పట్టణం – మస్డర్(అబుదాబి). కె. వెంకటరెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ -
పీఎస్ఎల్వీ–సీ 36 ప్రయోగం విజయవంతం
జాతీయం అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం భారత్లోనే అతి పెద్ద చమురు శుద్ధి (రిఫైనరీ) కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)లు న్యూఢిల్లీలో జరిగిన పెట్రోటెక్ సదస్సులో డిసెంబర్ 7న సంతకాలు చేశాయి. ఈ రిఫైనరీని ఐఓసీ నాయకత్వంలోని కన్సార్షియం పశ్చిమ తీరంలో (మహారాష్ట్ర) 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) వ్యయంతో, 60 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నిర్మిస్తోంది. ఇందులో ఐవోసీ వాటా 50 శాతం. కాగా.. బీపీసీఎల్, హెచ్పీసీఎల్ చెరో 25 శాతం వాటాలను కలిగున్నాయి. భారత్, వియత్నాం మధ్య కుదిరిన అణు ఒప్పందం వియత్నాం జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు ఎన్గాయోన్ దచిన్గాన్ భారత్lపర్యటన సందర్భంగా న్యూఢిల్లీలో డిసెంబర్ 9న పౌర అణు సహకార ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. దీంతోపాటు వైమానిక సంబంధాల్ని పెంచుకోవడం, ఇంధన రంగంలో ఉమ్మడి కృషి, పార్లమెంటరీ సహకారానికి సంబంధించి మరో మూడు ఇతర ఒప్పందాలపైనా సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భారత్ తరఫున లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పాల్గొన్నారు. ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో భారత్కు 7వ స్థానం ఆస్ట్రేలియాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (ఐఈపీ) 2015 సంవత్సరానికి ఉగ్రవాద ప్రభావిత దేశాల సూచీని డిసెంబర్ 8న విడుదల చేసింది. ఇందులో ఇరాక్ మొదటి స్థానంలో నిలవగా, భారత్ 7వ స్థానంలో ఉంది. ఉగ్రవాదానికి అత్యధికంగా ప్రభావితం అవుతున్న మొదటి 10 దేశాల్లో ఆరు దేశాలు ఆసియాకు చెందినవే. ప్రపంచంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 20 శాతం ఇరాక్లోనే జరగ్గా, భారత్లో 7 శాతం, అఫ్గానిస్తాన్లో 14 శాతం, పాకిస్థాన్లో 8 శాతం దాడులు జరిగాయి. ఇండోనేసియా అధ్యక్షుడి భారత్ పర్యటన ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో భారత్ పర్యటనలో భాగంగా డిసెంబర్ 12న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. చర్చల్లో భాగంగా రక్షణ, భద్రతా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అంతర్జాతీయం అమెరికాకు పెద్ద రక్షణ భాగస్వామిగా భారత్ భారత్ను అమెరికాకు పెద్ద రక్షణ భాగస్వామిగా గుర్తించే బిల్లుకు ఆ దేశ సెనేట్ ఆమోదం లభించింది. సెనేట్లో డిసెంబర్ 8న జరిగిన ఓటింగ్లో 92–7 తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా దీనిపై సంతకం చేస్తే ఒప్పందం అధికారికంగా కార్యరూపం దాల్చుతుంది. వెనెజువెలాలో పెద్ద నోట్ల రద్దు వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో ఆ దేశంలో పెద్ద కరెన్సీ నోట్ అయిన 100 బొలివర్ను రద్దు చేస్తూ డిసెంబర్ 12న అత్యవసర జారీ చేశారు. అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షురాలు దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గియోన్ హై అభిశంసనకు గురయ్యారు. దీంతో ఆమె తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పార్క్పై విపక్షాలు డిసెంబర్ 9న ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ లభించింది. ఆ దేశ పార్లమెంటులో 300 స్థానాలుండగా.. 234 మంది అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్ష స్థానాన్ని చేపట్టిన తొలి మహిళ పార్క్. భూకంపంతో ఇండోనేసియాలో 100 మందికి పైగా మృతి ఇండోనేసియాలోని అసె ప్రావిన్స్ (ఉత్తర సుమత్రా దీవులు)లో డిసెంబర్ 7న భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మృతి చెందగా, మరో 200 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.4గా నమోదైంది. భూకంపం ధాటికి ఇళ్లు, మసీదులు, దుకాణాలు కూలిపోయాయి. వాహనాలు ఒకదాని కింద ఒకటి ఇరుక్కుపోయాయి. 33 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం దాదాపు 836 కిలోమీటర్ల పరిధిలో ప్రభావం చూపించింది. కఫాలాను రద్దు చేసిన ఖతార్ ఆధునిక బానిసత్వంగా భావించే కఫాలా పని వ్యవస్థను సమూలంగా రద్దు చేయాలని ఖతార్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని డిసెంబర్ 13 నుంచి అమల్లోకి తేనున్నట్లు ఖతార్ కార్మిక శాఖ మంత్రి ఇసా బిన్ సాద్ అల్ జఫాలి ప్రకటించారు. వార్తల్లో వ్యక్తులు నూతన సీజేఐగా జస్టిస్ జగదీష్సింగ్ ఖేహర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్ జగదీష్సింగ్ ఖేహర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పదవీకాలం 2017, జనవరి 3తో ముగియనుంది. 2017, జనవరి 4నlజస్టిస్ ఖేహర్ 44వ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ఈ పదవిలో దాదాపు 8 నెలల పాటు (ఆగస్టు 27, 2017 వరకు) కొనసాగుతారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న తొలి సిక్కు వ్యక్తి జస్టిస్ ఖేహర్. సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు చో రామస్వామి కన్నుమూత ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి (82) డిసెంబర్ 6న చెన్నైలో మరణించారు. ఆయన తుగ్లక్ నాటకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. తుగ్లక్ పత్రికకు సంపాదకుడిగా, 1999–2005 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. రామస్వామి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితుడు. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా బెర్నార్డ్ కజెనెవ్: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి బెర్నార్డ్ కజెనెవ్ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాని మాన్యుయెల్ వాల్స్ రాజీనామా చేయడంతో.. బెర్నార్డ్ను ఆ పదవిలో నియమిస్తున్నట్లు దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ డిసెంబర్ 6న ప్రకటించారు. రెండున్నరేళ్లపాటు ఫ్రాన్స్ ప్రధానిగా కొనసాగిన వాల్స్.. వచ్చే ఏడాది సోషలిస్ట్ పార్టీ తరఫున దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ డొనాల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ను డిసెంబర్ 7న టైమ్ మ్యాగజీన్ 2016 పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది. ఇందులో తొలి రన్నరప్గా హిల్లరీ క్లింటన్, రెండో రన్నరప్గా ఆన్లైన్ హ్యాకర్లు నిలిచారు. ఈ గౌరవానికి సంబంధించి బరిలో నిలిచిన తుది 11 మందిలో భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉన్నారు. ఇటలీ ప్రధానిగా జెంటిలోని: డెమోక్రటిక్ పార్టీ నేత పాలో జెంటిలోని నేతృత్వంలో డిసెంబర్ 11న ఇటలీలో నూతన మంత్రివర్గం ఏర్పాటైంది. ప్రధాని పదవికి మతియో రెంజి రాజీనామా చేయడంతో జెంటిలోని కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు. n న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్ ఇంగ్లిష్: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్ ఇంగ్లిష్ డిసెంబర్ 12న వెల్లింగ్టన్లో ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న జాన్ కీ రాజీనామా చేయడంతో బిల్ ప్రధానిగా ఎన్నికయ్యారు. అమెరికా వ్యోమగామి జాన్ గ్లెన్ మృతి: భూమిని చుట్టి వచ్చిన తొలి అమెరికన్గా, అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వృద్ధుడిగా రికార్డు సృష్టించిన ప్రముఖ వ్యోమగామి సెన్ జాన్ గ్లెన్ (95) ఓహాయోలో డిసెంబర్ 8న మరణించారు. ఐరాస సెక్రటరీ జనరల్గా గ్యుటెరస్ ప్రమాణస్వీకారం ఐక్యరాజ్యసమితి నూతన సెక్రటరీ జనరల్గా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గ్యుటెరస్ డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పదవీ కాలం డిసెంబర్ 31తో ముగియనుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పీఎస్ఎల్వీ–సీ 36 ప్రయోగం విజయవంతం∙ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి డిసెంబర్ 7న చేపట్టిన పీఎస్ఎల్వీ సీ–36 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం రిసోర్స్శాట్–2ఏను కక్ష్యలోకి పంపారు. మన దేశం ప్రయోగించిన రిసోర్స్శాట్ ఉపగ్రహాల్లో ఇది మూడోది. రిసోర్స్శాట్–2 జీవిత కాలం ముగుస్తుండటంతో దాని స్థానంలో 1235 కిలోల బరువు గల రిసోర్స్శాట్–2ఏను ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం పంటల విస్తీర్ణం, దిగుబడులు, తెగుళ్లు, కరువు ప్రభావాలపై సమాచారం అందిస్తుంది. జల వనరులు, పట్టణ ప్రణాళిక, రక్షణ రంగాలకు కూడా తోడ్పడుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఈ ఉపగ్రహం జీవితకాలం ఐదేళ్లు. పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 38వ ప్రయోగం. పీఎస్ఎల్వీ ఎత్తు 44.4 మీటర్లు. బరువు 321 టన్నులు. ఇస్రో 1994 నుంచి 2016 వరకు పీఎస్ఎల్వీ వాహక నౌక ద్వారా 121 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో మన దేశానికి చెందినవి 42 కాగా, విదేశాలకు చెందినవి 79 ఉన్నాయి. వాతావరణ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా వాతావరణ ఉపగ్రహం ఫెంగ్యున్–4ను చైనా డిసెంబర్ 10న విజయవంతంగా ప్రయోగించింది. దీన్ని లాంగ్ మార్చ్–3బీ రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం ద్వారా ఆ దేశ వాతావరణ పరిశీలనల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. క్రీడలు కెప్టెన్గా అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన కోహ్లి: భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్గా అత్యధిక వ్యక్తిగత పరుగులు (235) చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. తాజాగా ముంబైలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు ధోనీ ఆస్ట్రేలియాపై 2013లో 224 పరుగులు, 1999లో సచిన్ న్యూజిలాండ్పై 217 పరుగులు, 1978లో సునీల్ గవాస్కర్ వెస్టిండీస్పై 205 పరుగులు చేశారు. సింగపూర్ స్లామర్స్కు ఐపీటీఎల్– 2016 టైటిల్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)– 2016 టైటిల్ను డిఫెండింగ్ చాంపియన్ సింగపూర్ స్లామర్స్ నిలబెట్టుకుంది. హైదరాబాద్లో డిసెంబర్ 11న జరిగిన ఫైనల్లో ఇండియన్ ఏసెస్ జట్టును ఓడించింది. n పంకజ్ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్: భారత్కు చెందిన పంకజ్ అద్వానీ క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో 16వ ప్రపంచ టైటిల్ను గెలుచుకున్నాడు. బెంగళూరులో డిసెంబర్ 12న జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ 150 అప్ ఫార్మాట్ ఫైనల్లో పీటర్ గిల్క్రిస్ట్ (సింగపూర్)పై గెలుపొందాడు. -
ప్రవేశిక - తాత్విక పునాదులు
పోటీ పరీక్షల ప్రత్యేకం ప్రతి ప్రజాస్వామ్య రాజ్యాంగం సాధారణంగా ప్రవేశికతో ప్రారంభమవుతుంది. భారతదేశ రాజ్యాంగం కూడా ప్రవేశికతోనే మొదలవుతుంది. ప్రవేశికకు పీఠిక, అవతారిక, ముందుమాట, ఉపోద్ఘాతం లాంటి పర్యాయపదాలున్నాయి. ప్రవేశికను ఆంగ్లంలో ‘Preambl్ఛ* అంటారు. రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలు, మూల తత్వాన్ని ప్రవేశిక సూచనప్రాయంగా తెలియజేస్తుంది. ఏ ఉన్నత ఆశయాలతో రాజ్యాంగాన్ని రచించారు? ఏ తరహా ప్రభుత్వాన్ని, ఎలాంటి సమాజాన్ని నిర్మించదలచారు? తదితర అంశాలను ప్రవేశిక స్పష్టం చేస్తుంది. ప్రవేశిక - ఆధారం ప్రపంచంలో ప్రవేశిక కలిగిన మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. ప్రవేశిక భావాన్ని అమెరికా నుంచి గ్రహించారు. అయితే రాజ్యాంగ పరిషత్లో 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించిన ‘ఆశయాల’ తీర్మానమే దీనికి ప్రధాన ప్రాతిపదిక. ఫ్రెంచి రాజ్యాంగం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్రం అనే అంశాలను గ్రహించారు. ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ప్రవేశిక కూడా ఆధారమని చెప్పొచ్చు. ప్రవేశిక - పాఠ్యాంశం భారత ప్రజలమైన మేము భారతదేశానికి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని; ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వా తంత్య్రాన్నీ; అంతస్తుల్లో, అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఈ 1949 నవంబర్ 26న మా రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ప్రవేశిక - పదజాలం, భావాలు, అర్థ వివరణ ప్రవేశికలో గొప్ప భావజాలాన్ని ప్రయోగించారు. ప్రతి పదానికి, భావానికి ఒక విశిష్ట అర్థాన్ని, పరమార్థాన్ని ఆపాదించవచ్చు. ‘భారత ప్రజలమైన మేము’ అని ప్రవేశిక ప్రారంభమవుతుంది. ప్రజలే రాజకీయాధికారానికి మూలం. ప్రజలే రాజ్యాంగాన్ని రచించుకున్నారని దీని అర్థంగా చెప్పొచ్చు. రాజకీయ స్వభావాన్ని తెలియజేసే పదాలు భారతదేశం ఏ తరహా రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందో, దాని స్వభావం ఏమిటో స్పష్టంగా పేర్కొన్నారు. సార్వభౌమత్వం (Sovereignty): అంటే సర్వోన్నత అధికారం అని అర్థం. భారతదేశం అంతర్గతంగా సర్వోన్నత అధికారం, బాహ్యంగా ((External Independence and Internal Supremacy)) విదేశీ దౌత్య విధానాల్లో స్వేచ్ఛను కలిగి ఉంటుంది. ఏ బాహ్య శక్తీ మన విదేశాంగ విధానాన్ని నియంత్రించలేదు. సామ్యవాదం(Socialist): ఈ పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. సామ్యవాదం అంటే సమ సమాజ స్థాపన. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను క్రమేణా తగ్గించడం. ఉత్పత్తి శక్తులను (ఔ్చఛీ, ఔ్చఛౌఠట ్చఛీ ఇ్చఞజ్ట్చీ) ప్రభుత్వం నియంత్రించడం ద్వారా సంపద కొద్ది మంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం కాకుండా, సాధ్యమైనంత వరకు జాతీయం చేస్తారు. తద్వారా ప్రజలకు సమాన అవకాశాలతోపాటు వాటిని అందిపుచ్చుకోవడానికి తోడ్పాటును అందిస్తారు. ఠి సామ్యవాదానికి వివిధ రూపాలున్నాయి. కమ్యూనిజం, మావోయిజం, సిండికాలిజం, గిల్డ్ సోషలిజం, ఫెబియనిజం, స్టేట్ సోషలిజం మొదలైన రూపాలు వివిధ దేశాల్లో అమల్లో ఉన్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యవాదం (Democratic Socialism) అమల్లో ఉంది. దీన్నే పరిమాణాత్మక లేదా రాజ్యాంగ సామ్యవాదం అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలో చట్టపరంగా నిర్దిష్ట పద్ధతిలో మార్పులు చేపడతారు. మన సామ్యవాదం గాంధీయిజం+మార్క్సిజంల మేలు కలయిక. కానీ గాంధీతత్వం వైపు కొంత మొగ్గు కనిపిస్తుంది. ప్రపంచీకరణ, ఆర్థిక ఉదారవాదం, ప్రైవేటీకరణ నేపథ్యంలో సామ్యవాద తత్వం మసకబారుతోందని చెప్పొచ్చు. లౌకికతత్వం (్ఛఛిఠ్చట): ఈ పదాన్ని కూడా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం. లౌకిక దేశాల్లో అధికార మతం, మత వివక్ష ఉండవు. మతం విషయంలో పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం ఉంటాయి. మతపరంగా ఎవరికీ ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం లేదా నష్టం వాటిల్లదు. అధికార మతం ఉన్న రాజ్యాలను మతస్వామ్య రాజ్యం (Theocratic State) అంటారు. ఉదా: పాకిస్తాన్, బంగ్లాదేశ్. ప్రజాస్వామ్యం (Democracy)): ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో, ప్రజల కోసం, ప్రజల వల్ల ఏర్పాటైన ప్రభుత్వం. అంటే ప్రజలే పాలితులు, పాలకులని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నిర్వచించారు. భారత్లో పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. ఎలాంటి వివక్షకు తావు లేకుండా కేవలం నిర్ణీత వయసున్న పౌరులందరికీ ఓటు హక్కు, ప్రభుత్వ పదవులకు పోటీ చేసే హక్కును కల్పించారు. పాలన చట్టపరంగా (Rule of law) జరుగుతుంది. చట్టబద్ధత లేకుండా ఏ చర్యా చెల్లుబాటు కాదు. సాధారణంగా ఏ వ్యక్తికీ ప్రత్యేక హోదా లేదా మినlహాయింపు ఉండదు. గణతంత్ర (Republic): ‘గణం’ అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన. ఇది ప్రజాపాలన. వారసత్వ లేదా అధికార హోదాలు ఉండవు. భారత రాష్ర్టపతి, ఇతర ప్రజా పదవుల్లోని వ్యక్తులను నిర్ణీత కాలానికి ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు, లేదా పరోక్షంగా ఎన్నికవుతారు. బ్రిటిష్ రాణి/రాజు తరహాలో వారసత్వ అధికారం ఉండదు. సామాజిక ఆశయాలు (Social Objectives): ప్రవేశికలో కొన్ని ఉదాత్తమైన ఆశయాలను పొందుపర్చారు. రాజ్యాంగం ద్వారా వాటిని సాకారం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. న్యాయం: న్యాయం అంటే ఒక సర్వోన్నత సమ తా భావన. అసమానత లు, వివక్షలు లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం. రాజ్యాంగంలో మూడు రకాల న్యాయాలను ప్రస్తావించారు. అవి.. 1) రాజకీయ న్యాయం (Political Justice): రాజ్య కార్యకలాపాల్లో పౌరులంతా ఎలాంటి వివక్ష లేకుండా పాల్గొనడమే రాజకీయ న్యాయం. సార్వజనీన ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, విజ్ఞాపన హక్కు మొదలైన వాటిని రాజకీయ న్యాయ సాధనకు ప్రాతిపదికలుగా పేర్కొనొచ్చు. 2) సామాజిక న్యాయం (Social Justice): సమాజంలో పౌరులంతా సమానులే. జాతి, మత, కుల, లింగ, పుట్టుక అనే తేడాలు లేకుండా అందరికీ సమాన హోదా, గౌరవాన్ని కల్పించడం, అన్ని రకాల సామాజిక వివక్షలను రద్దు చేయడం, సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, తెగల అభ్యున్నతికి కృషి చేయడం. 3) ఆర్థిక న్యాయం (Economic Justice): ఆర్థిక అంతరాలను తగ్గించడం, సంపద ఉత్పత్తి, పంపిణీ, వృత్తి, ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు, పేదరిక నిర్మూలన, ఆకలి నుంచి విముక్తులను చేయడం. జీవించేందుకు అనువుగా జీవితాన్ని మార్చడం. ఉన్నత ఆదర్శాలు స్వేచ్ఛ (Liberty): నిజమైన ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, ఉదాత్త నాగరిక, సామాజిక జీవనానికి స్వేచ్ఛాయుత వాతావరణం అవసరం. స్వేచ్ఛ అంటే నిర్హేతుకమైన పరిమితులు, నిర్భంధాలు లేకుండా వ్యక్తి పరిపూర్ణ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో ప్రతి పౌరుడికీ స్వేచ్ఛ ఉండి తీరాలి. ఉదా: మత స్వేచ్ఛ అనేది లౌకిక రాజ్యస్థాపనకు పునాది. సమానత్వం : ప్రజాస్వామ్యంలో అతి ముఖ్య ఆదర్శం సమానత్వం. అంటే అన్ని రకాల అసమానతలు, వివక్షలను రద్దు చేసి, ప్రతి వ్యక్తి వికాసానికి అవసరమైన అవకాశాలు కల్పించడం. ఠి సౌభ్రాతృత్వం (Fraternity): అంటే సోదర భావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర గౌరవం ఉండాలి. అసమానతలు, వివక్షలు లేనప్పుడు పౌరుల మధ్య సోదరభావం వర్ధిల్లుతుంది. సార్వజనీన సోదర భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో సౌభ్రాతృత్వం అనే భావనను ప్రవేశికలో పొందుపర్చాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రతిపాదించారు. ఠి ఐక్యత, సమగ్రత (Unity & integrity): దేశ ప్రజలు కలిసి ఉండేందుకు ఐక్యతా భావం తోడ్పడుతుంది. ఇది ఒక మానసిక ఉద్వేగం (Psychological Emotion). మతం, కులం, ప్రాంతం లాంటి సంకుచిత ఆలోచనలకు అతీతమైన ఆదర్శం. సమగ్రత అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సమగ్రత ప్రజల్లో జాతీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. సమగ్రతను చేర్చాల్సిన ఆవశ్యకత: 1970 తర్వాత దేశంలో చాలా చోట్ల ప్రాంతీయవాద, వేర్పాటువాద సమస్యలు తలెత్తాయి. దేశ సమగ్రతను దెబ్బతీసేలా మిలిటెంట్ పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సమగ్రత అనే పదాన్ని చేర్చాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ప్రవేశిక సవరణకు అతీతం కాదు ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంట్కు ప్రకరణ 368ని అనుసరించి ఉందని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనం కిందికి వస్తుంది కాబట్టి దాని సారాంశం మార్చకుండా, ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేసేలా నిర్మాణాత్మకంగా సవరణలు చేయొచ్చని స్పష్టం చేసింది. అందువల్ల స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత అనే పదాలను చేర్చారు. ఇది ప్రవేశికకు మొట్టమొదటి సవరణ, చిట్టచివరిది కూడా. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా? వివాదాలు సుప్రీంకోర్టు తీర్పులు: రాజ్యాంగ సారాంశం మొత్తం ప్రవేశికలో నిక్షిప్తమై ఉంటుంది. అయితే, ఇది రాజ్యాంగంలో అంతర్భాగమా? కాదా? అనే అంశంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పులు వెలువరించింది. 1960లో బెరుబారి యూనియన్ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ 1973లో కేశవానంద భారతి వివాదంలో తీర్పునిస్తూ.. దీనికి పూర్తి భిన్నంగా, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని వ్యాఖ్యానించింది. 1995లో ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసులోనూ అత్యున్నత ధర్మాసనం ఇదే అభిప్రాయాన్ని పునరుద్ఘాటించింది. ఠి రాజ్యాంగ పరిషత్లో ప్రవేశికను ఓటింగ్కు పెట్టినప్పుడు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని డాక్టర్ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్థిరీకరించింది. ప్రవేశిక ప్రయోజనం - ప్రాముఖ్యత - విమర్శ ఠి ప్రవేశిక రాజ్యాంగ ఆత్మ, హృదయం. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను తెలుసుకోవడానికి ఆధారం. ఇది రాజ్యాంగానికి సూక్ష్మరూపం (Constitution in Miniature). ఇందులో రాజ్యాంగ తాత్విక పునాదులున్నాయి. ఠి ప్రయోజనాలు: రాజ్యాంగ ఆధారాలను ప్రవేశిక వివరిస్తుంది. రాజ్యాంగ ఆమోద తేదీని తెలుపుతుంది. రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు చట్టపర సహాయకారిగా ఉపయోగపడుతుంది. ఠి విమర్శ: ప్రవేశికకు న్యాయ సంరక్షణ (Non-Justiciable) లేదు. ఇందులో పేర్కొన్న ఆశయాలను అమలుపర్చకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ఇందులో పేర్కొన్న భావజాలానికి నిర్దిష్ట నిర్వచనాలు లేవు. హక్కుల ప్రస్తావన లేదు. శాసనాధికారాలకు ఇది ఆధారం కాదు. సమకాలీన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ప్రవేశికలోని కొన్ని ఆదర్శాలు అమలుకు నోచుకోవట్లేదని చెప్పొచ్చు. బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-వన్ స్టడీ సర్కిల్ -
సౌర కుటుంబంలో పెద్ద ఉపగ్రహం?
గ్రహాలన్నీ పశ్చిమం నుంచి తూర్పునకు తిరుగుతాయి. కానీ శుక్రుడు, యురేనస్ తూర్పు నుంచి పశ్చిమానికి తిరుగుతాయి. అంతర గ్రహాలు: బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు. ఇవి చిన్న స్థాయి రాతి లోహాలతో ఏర్పడ్డాయి. వీటిని ‘టెరిస్ట్రియల్’ గ్రహాలంటారు. బాహ్య గ్రహాలు: గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్లు. ఇవి హైడ్రోజన్, హీలియం సమ్మేళనంతో ఉంటాయి. వీటిని ‘జోవియన్’ గ్రహాలు అని కూడా అంటారు. సౌర కుటుంబంలో ప్రస్తుతం 8 గ్రహాలున్నాయి. నిమ్న గ్రహాలు: బుధుడు, శుక్రుడు, భూమి ఉన్నత గ్రహాలు: కుజుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. బుధుడు (మెర్క్యురీ) అతి చిన్న గ్రహం. సూర్యుడికి సమీపంలో ఉంటుంది. అత్యంత వేడి గల రెండో గ్రహం. దీనిలో +350నిఇ ఉష్ణోగ్రత ఉంటుంది. దీనిపై వాతావరణం లేదు. దీనికి ఉపగ్రహాలు లేవు. బుధ గ్రహాన్ని యూరప్ ఖండంలో ‘అపోలో’ అంటారు. దీని భ్రమణ కాలం 58 రోజులు. పరిభ్రమణ కాలం 88 రోజులు. ఇది తక్కువ పరిభ్రమణ కాలం గల గ్రహం. బుధ గ్రహంపైకి పంపిన ఉపగ్రహాలు - మెరైనర్-10, మెసెంజర్ భూమికి, సూర్యుడికి మధ్యలో బుధుడు వచ్చినప్పుడు నల్లటి మచ్చలాగ కనిపిస్తుంది. దీన్నిTransitఅంటారు. శుక్రుడు (వీనస్) పసుపు పచ్చ రంగులో ఉంటుంది. దీన్ని అంటారు. భూమికి దగ్గరగా ఉంటుంది. భూమికి కవల గ్రహం. ప్రకాశవంతమైంది. గ్రీకులు ఈ గ్రహాన్ని అందమైన దేవతగా భావిస్తారు. తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. దీన్ని ‘వేగు చుక్క’ అంటారు. దీనికి ఉపగ్రహాలు లేవు. 90% ఇై2 కలిగి అత్యంత విషపూరితంగా ఉంటుంది. అందుకే దీన్ని క్రూర గ్రహం అంటారు. సౌర కుటుంబంలో అత్యంత వేడి గల గ్రహం (+475నిఇ) శుక్ర గ్రహంలో రోజు కంటే సంవత్సరం తక్కువగా ఉంటుంది. దీని భ్రమణ కాలం 243 రోజులు (1 రోజు) పరిభ్రమణ కాలం 225 రోజులు (1 ఏడాది) భూమి సూర్యుడి నుంచి దూరంలో మూడోది. పరిమాణంలో ఐదోది. దీన్ని నీలి గ్రహం, జలయుత గ్రహం అంటారు. అత్యధిక సాంద్రత గల గ్రహం (5.5 గ్రా॥ భూమి ఉత్తర, దక్షణాల మధ్య వ్యాసం -12,714 కి.మీ. తూర్పు-పడమరల మధ్య వ్యాసం -12,756 కి.మీ. భూమి చుట్టుకొలత, భూమధ్య రేఖ చుట్టూ -40,075 కి.మీ. ధృవాల వద్ద -40,008 కి.మీ. భూమి సుమారు 4,600 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. భూమికి సమానమైన గ్రహం నాసా 2014, ఏప్రిల్లో కనుగొన్న కెప్లర్ 186ఊ భూమికి గల ఏకైక ఉపగ్రహం-చంద్రుడు. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం -సూర్యుడు. భూమి ఆకారం - ‘జియాయిడ్’ (దీర్ఘగోళం). సూర్యుడు, భూమికి మధ్య దూరాన్ని ‘ఆస్ట్ర నామికల్ యూనిట్’ అంటారు. భూ ఉపరితలంపై సగటు ఉష్ణోగ్రత 13నిఇ భూమి, చంద్రుడి మధ్య దూరం - 3,84,365 కి.మీ భూమ్యాకర్షణ శక్తిలో చంద్రుడి ఆకర్షణ శక్తి 1/6వ వంతు ఉంటుంది. చంద్రుడిపై మొదటగా నీల్ ఆర్మస్ట్రాంగ్, ఎడ్వి న్ ఆల్డ్రిన్, మైఖేల్ కోలిన్సలు కాలుమోపారు. రష్యా 1959లో తొలిసారి చంద్రుడిపైకి లూనార్-1, లూనార్-2 ఉపగ్రహాలను పంపింది. అమెరికా పంపిన అపోలో-2 చంద్రుడిపై దిగిన సంవత్సరం -1969 జూలై 21. అంగారకుడు (కుజుడు/మార్స) దీన్ని ఈఠట్ట ఞ్చ్ఛ్ట అంటారు. అగ్ని పర్వత విస్ఫోటనాలు ఎక్కువగా సంభవిస్తాయి. ఈ గ్రహ భ్ర మణ కాలం - 24 గం॥37 ని॥ పరిభ్రమణ కాలం - 687 రోజులు. భూమితో సన్నిహిత పోలికలు గల గ్రహం. అమెరికా ఈ గ్రహంపైకి వైకింగ్-1, వైకింగ్-2 ఉపగ్రహాలను ప్రయోగించింది. 1997లో అంగారకుడిపైకి పాత్ఫైండర్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 2011, నవంబర్లో దీనిపైకి అమెరికా క్యూరియాసిటీ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది 2012, ఆగస్టు 6న గాబిక్రేటర్ అనే ప్రదేశంలో దిగింది. 2013, నవంబర్ 5న భారతదేశం మంగళయాన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది 2014, సెప్టెంబర్ 24న అంగారకుడిపై దిగింది. దీనికి 2 ఉపగ్రహాలున్నాయి. అవి.. ఫోబోస్, డియోస్. దీన్ని రెడ్ ప్లానెట్ అంటారు. విశ్వంలో ఎత్తై శిఖరం ఒలంపన్ మాన్స ఈ గ్రహంపై ఉంది. దీని ఎత్తు 27,000 మీ. గురుడు/బృహస్పతి (జూపిటర్) భూమి కంటే 11 రెట్లు పెద్దది. దీని బరువు భూమి కంటే 300 రెట్లు ఎక్కువ. దీని భ్రమణ కాలం 9 గం॥50 ని॥ఇది వేగంగా తిరిగే గ్రహం. పరిభ్రమణ కాలం 12 ఏళ్లు. ఈ గ్రహం తెల్లగా కనిపిస్తుంది. దీన్ని సుపీరియర్ ప్లానెట్ అంటారు. ఈ గ్రహంపై హైడ్రోజన్, హీలియం వాయువులు ఎక్కువగా ఉంటాయి.దీనికి గల మొత్తం ఉపగ్రహాలు 65. వీటిలో అతి పెద్దది ‘గనిమెడ్’. ఇది సౌర కుటుంబంలో పెద్ద ఉపగ్రహం. ఇతర ఉపగ్రహాలు-యురోఫా, కాలిస్ట్రా, ఐవో, హిమాలయాలిడా మొదలైనవి. అత్యధిక ద్రవ్యరాశి గల ఉపగ్రహం-ఐవో. ఈ గ్రహంపైకి వాయేజర్, గెలీలియో, ఉపగ్రహాలను ప్రయోగించారు. 1994, జూలైలో షూమేకర్ లెవీ-9 అనే తోక చుక్క ఈ గ్రహాన్ని ఢీకొట్టింది. శని (సాటర్న) గ్రహాల్లో రెండో పెద్ద గ్రహం. ఇది 3 వలయా లుగా ఉంటుంది. అందమైన గ్రహం. భూమి కంటే 9 రెట్లు పెద్దది. 1997లో అమెరికా దీనిపైకి ‘కేసిని’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీనికి 62 ఉపగ్రహాలున్నాయి. వీటిలో పెద్దది టైటాన్. ఇది ఉపగ్రహాల్లో రెండో పెద్దది. వాతావరణం గలది. దీన్ని హైగెన్స కనుగొన్నాడు. ఇతర ఉపగ్రహాలు -టైపీరియర్, టెథిస్, మియాన్, ఫోబి తదితరాలు. శని గ్రహం భ్రమణ కాలం -10గం॥39 ని॥ పరిభ్రమణ కాలం-29 సం॥46 రోజులు. అత్యల్ప సాంద్రత గల గ్రహం శని. దీని సాంద్రత 0.69 గ్రా/ఘ.సెం.మీ. దీన్ని నీటిలో తేలియాడే గ్రహం అని కూడా అంటారు. -
స్వాతంత్య్రానికి పూర్వం భారత ఆర్థిక వ్యవస్థ
భారతదేశంపై ఆంగ్లేయులు రెండు శతాబ్దాల పాటు తిరుగులేని సామ్రాజ్యాధికారాన్ని చెలాయించారు. ఈ కాలంలో దేశ సంపదను కొల్లగొట్టి, ఆర్థిక వ్యవస్థను పీల్చి పిప్పిచేశారు. బ్రిటిష్ పాలనలో భారతదేశ ముడి పదార్థాలను ఎగుమతి చేస్తూ వారి పారిశ్రామిక వస్తువులను దిగుమతి చేసేవారు. దీంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా నష్టపోయింది. బ్రిటిష్వారికి రాజ్యాధికారం ఉండటం వల్ల ఆర్థికపరమైన విధాన నిర్ణయాలన్నీ వారికి అనుకూలంగా(లాభదాయకంగా ఉండేలా) తీసుకున్నారేతప్ప భారతదేశ ప్రగతి దృష్ట్యా గానీ, ప్రజా సంక్షేమం దృష్ట్యా గానీ తీసుకోలేదు. బ్రిటిష్ పాలనా కాలంలో ఈ రకమైన దోపిడీ మూడు రూపాల్లో కొనసాగింది. అవి.. 1.వ్యాపార దోపిడీ (మర్చెంట్ క్యాపిటల్ అండ్ ది ఎక్స్ప్లాయిటేషన్): వ్యాపార ముసుగులో దోపిడీ భూమి శిస్తు రూపంలో రైతాంగం నుంచి దోపిడీ లంచగొండి, అవినీతి అధికారుల దోపిడీ 2.పారిశ్రామిక దోపిడీ (ఇండస్ట్రియల్ క్యాపిటల్ అండ్ ది ఎక్స్ప్లాయిటేషన్): భారతదేశం నుంచి ముడి సరుకుల ఎగుమతి భారతదేశానికి పారిశ్రామిక వస్తువుల దిగుమతి బ్రిటిష్ ప్రయోజనాలకు అనుగుణంగా జనపనార పరిశ్రమ అభివృద్ధి బ్రిటిష్ ప్రభుత్వం.. వారికి అనుకూలమైన రాబడి, వ్యయ విధానాలను అవలంబించడం 3. విత్త దోపిడీ (ఫైనాన్స క్యాపిటల్ అండ్ ది ఎక్స్ప్లాయిటేషన్): రైల్వేల్లో పెట్టుబడి రబ్బర్, గనులు, పేపర్, బ్యాంకింగ్ మొదలైన అనేక రంగాల్లో పెట్టుబడులు జాతీయ ఆదాయ అంచనాలు స్వాతంత్య్రానికి పూర్వం మన దేశంలో జాతీయ ఆదాయానికి సంబంధించిన అధికారిక లెక్కలు లేనప్పటికీ దాదాభాయ్ నౌరోజీ తన గ్రంథం(పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా)లో 1867-68 సంవత్సర జాతీయ ఆదాయాన్ని రూ.340 కోట్లుగా అంచనా వేశారు. అప్పటి జనాభా సుమారు 17 కోట్లు ఉండటం వల్ల తలసరి ఆదాయాన్ని రూ.20గా పేర్కొన్నారు. పేదరిక స్వభావం బ్రిటిష్ పాలనలో పేదరికానికి సంబంధించి మొదటి వంద ఏళ్లలో ఏవిధమైన గణాంకాలు లేవు. అయితే నాటి రచనలను, ఇతర డాక్యుమెంట్లను పరిశీలిస్తే బ్రిటిష్ పాలనకు ముందు ప్రజలు మెరుగైన జీవనాన్ని గడిపినట్లు తెలుస్తోంది. దాదాభాయ్ నౌరోజీ తన గ్రంథంలో మన దేశ పేదరికం గురించి కూడా ప్రస్తావించారు. భారతదేశం అనేక విధాలుగా సతమతమవుతూ పేదరికంలో మగ్గిపోతోందని పేర్కొన్నారు. 19వ శతాబ్దం చివర్లో భారత గ్రామీణ ప్రజల జీవనం అమెరికాలోని కట్టు బానిసల కన్నా హీనంగా ఉందని తెలిపారు. బానిసల బాగోగులను చూడటానికి వారి యజమానులైనా ఉన్నారు కానీ వీరికి కనీసం ఆ దిక్కు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ప్రభుత్వ స్టాటిస్టిక్స్ డెరైక్టర్ జనరల్ డబ్ల్యూ హంటర్ తన రచన(ఇంగ్లండ్స వర్క ఇన్ ఇండియా)లో భారత్లో 40 మిలియన్ల మంది ఆహారలేమితో జీవిస్తున్నారని పేర్కొన్నారు. నిజ వేతన ధోరణలు ఒక దేశ ఆర్థికాభివృద్ధిని తెలుసుకోవడానికి ఆ దేశ ‘నిజ వేతనంలో పెరుగుదల ధోరణులు’ మేలైన సూచిక. కానీ బ్రిటిష్ కాలంలోని నిజ వేతనాలకు సంబంధించిన సరైన గణాంకాలు లభించట్లేదు. అయితే యునెటైడ్ ప్రావిన్సెస్ (ఉత్తరప్రదేశ్) నిజ వేతన సూచీ(1600వ సంవత్సరం నుంచి 1938 వరకు)ని డాక్టర్ రాధాకమల్ ముఖర్జీ రూపొందించారు. ఇతని ప్రకారం 1928లో నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని శ్రామికుల నిజ వేతనం.. 1807లో ఉన్న నిజ వేతనంలో సగం (50 శాతం) మాత్రమేనని లెక్కించారు. దీన్ని బట్టి అప్పటి శ్రామికుల జీవన స్థితిగతులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జనాభా వృత్తుల వారీ వర్గీకరణ మన దేశంలో జనాభా లెక్కలు 1881లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి వృత్తుల వారీ వర్గీకరణకు సంబంధించిన గణాంకాలు లభిస్తున్నాయి. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారు 1881లో 61 శాతం ఉండగా 1921 నాటికి 73 శాతం పెరిగింది. వ్యవసాయ ఆధారిత ప్రజానీకం ఎక్కువ ఉండటం వెనకబాటుతనానికి సూచిక. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు బ్రిటిష్ పాలనలో వ్యవసాయ, సేద్య పద్ధతుల్లో ఎలాంటి నూతన పోకడలు చోటుచేసుకోలేదు. వ్యవసాయం సంప్రదాయ పద్ధతుల్లోనే కొనసాగింది. చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వాణిజ్య దృష్టితోకాక జీవనోపాధిగానే కొనసాగించారు. భారత రైతాంగానికి అవసరమైన నీటిపారుదల సౌకర్యాలను కల్పించకుండా ఇంగ్లండ్ వారికి లాభదాయకంగా ఉండే రైల్వే మార్గాల నిర్మాణాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. బలహీన పారిశ్రామిక స్వరూపం బ్రిటిష్ పాలనకు ముందు మన దేశం కళాత్మక చేతివృత్తులకు పెట్టింది పేరు. బ్రిటన్లో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల మన దేశంలోని చేనేత, కళాత్మక చేతివృత్తుల పనివారు ఉపాధి కోల్పోయి వ్యవసాయంపైనే ఆధారపడాల్సి వచ్చింది. అయితే అప్పట్లో కొన్ని పెద్ద పరిశ్రమల స్థాపన జరిగినప్పటికీ అవి శీఘ్ర పారిశ్రామికీకరణకు దోహదపడలేదు. బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు- ఆర్థిక వెనుకబాటుతనం మన దేశం బ్రిటిష్ పాలన కాలంలో అభివృద్ధి చెందకపోవడానికి అధిక జనాభా, మత విశ్వాసాలు, సామాజిక స్వరూపం, మూలధన, సాంకేతిక పరిజ్ఞాన కొరత మొదలైనవి కారణాలని వలస సామ్రాజ్యవాదాన్ని సమర్థించే ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దాదాభాయ్ నౌరోజీ, రమేశ్ దత్ మొదలైనవారు ఈ అభిప్రాయంతో ఏకీభవించక మన దేశ వెనుకబాటుతనానికి బ్రిటిష్ ప్రభుత్వం అవలంబించిన విధానాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. 1. భూస్వామ్య పద్ధతులు 1793లో కారన్ వాలీస్ ప్రవేశపెట్టిన జమీందారీ పద్ధతి.. రైతుల స్థితిగతులను అగాథంలోకి నెట్టేసింది. జమీందారులు ప్రభుత్వానికి చెల్లించే శిస్తు పరిమాణంలో మార్పు లేకపోయినప్పటికీ వారు రైతుల నుంచి ఎప్పటికప్పుడు అధికంగా వసూలు చేసేవారు. ఈ క్రమంలో రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసేవారు. పైగా రైతాంగం బాగోగులను పట్టించుకోకుండా విలాసాల్లో మునిగి తేలేవారు. గ్రామీణ ప్రాంతాల్లో బలమైన పట్టున్న జమీందారీ వర్గం బ్రిటిష్ ప్రభుత్వ విధానాలకు వత్తాసు పలకటం వల్ల రైతాంగం గోడును పట్టించుకునేవారు కరువయ్యారు. ఫలితంగా వ్యవసాయ రంగం పురోభివృద్ధిలేక స్థబ్దతకు గురైంది. 2. పారిశ్రామిక, వాణిజ్య విధానాలు బ్రిటిష్ ప్రభుత్వం భారత్లో అవలంబించిన పారిశ్రామిక, వాణిజ్య విధానాల ముఖ్యోద్దేశం మన దేశాన్ని ఇంగ్లండ్కు పూరక దేశంగా మార్చడం. ఈ దిశగా వారు తమ పారిశ్రామిక వస్తువులను అమ్ముకోవడానికి మన దేశాన్ని మార్కెట్గా ఉపయోగించుకున్నారు. వారి పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాలను సరఫరా చేయడానికి వీలుగా మన దేశాన్ని వ్యవసాయంపై ఆధారపడే విధంగా చేశారు. భారత్ ఎగుమతులపై అనేక ఆంక్షలు విధించి మన దేశ పరిశ్రమలను కోలుకోని రీతిలో దెబ్బతీశారు. 3. ఆర్థిక దోపిడీ దాదాభాయ్ నౌరోజీ అంచనా ప్రకారం 1835-1872 మధ్య కాలంలో మన దేశం నుంచి 50 కోట్ల పౌండ్లు హోం చార్జీలు, కంపెనీ చెల్లించాల్సిన వడ్డీల రూపంలో ఇంగ్లండ్కు తరలిపోయాయి. దీన్నే ఆయన ఆర్థిక దోపిడీ(డ్రెయిన్ ఆఫ్ వెల్త్ లేదా డ్రెయిన్ థియరీ)గా పేర్కొన్నారు. అప్పట్లో మన దేశ ఎగుమతుల విలువ ఎక్కువగా, దిగుమతుల విలువ తక్కువగా ఉండటంతో విదేశీ మిగులు ఉండేది. ఆ మిగులును మన దేశాభివృద్ధికి బదులు ఇంగ్లండ్ అభివృద్ధికి ఉపయోగించారు. 4. హోం చార్జీలు 1829-1865 మధ్య కాలంలో 10 కోట్ల పౌండ్లు కేవలం హోం చార్జీలకే తరలించారని దాదాభాయ్ నౌరోజీ అంచనా వేశారు. హోం చార్జీల్లో ఉండే అంశాలు.. ఈస్టిండియా కంపెనీ తన షేర్ హోల్డర్లకు చెల్లించాల్సిన డివిడెండ్లు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఇంగ్లండ్లో తీసుకున్న అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలు భారతదేశంలో ఉన్న ఇంగ్లండ్ మిలటరీకి అయ్యే ఖర్చు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో పనిచేసి రిటైర్డ అయిన ఉద్యోగుల పెన్షన్లు బ్రిటిష్ ఇండియా అధికారులు సెలవుపై ఇంగ్లండ్కు వెళ్లినప్పుడు వారి ప్రయాణాలకయ్యే ఖర్చు మన దేశంలో బ్రిటిష్వారు కొనసాగించిన యుద్ధాలకైన ఖర్చు భారతదేశాన్ని అనేక మంది స్వదేశీ, విదేశీ రాజులు చాలా ఏళ్లపాటు పాలించినప్పటికీ దేశ, ప్రజా శ్రేయస్సు పట్ల కొంత మొగ్గు చూపారు. అయితే ఇంగ్లండ్వారి రెండు శతాబ్దాల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ అన్ని విధాలుగా కుదేలై ంది. ‘‘మనకు కావాల్సింది భారతదేశ సంపదను ఎట్లా తరలించుకుపోవాలన్నదే కానీ భారతదేశాన్ని ఎట్లా బాగుచేయాలన్నది కాదు’’ అన్న శాలిస్ ప్రభువు మాటలు బ్రిటిష్ పాలకుల మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. -
స్టడీ అబ్రాడ్ ఆశలపై నీళ్లు!
3,50,000.. భారత్ నుంచి గతేడాది (2015-16) అంతర్జాతీయంగా పలు దేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య! 3,60,000.. రానున్న సంవత్సరం (2017) చివరికి భారత్ నుంచి విదేశాలకు వెళ్లనున్న విద్యార్థుల సంఖ్య అని అంచనా!!ప్రస్తుతం ఈ విదేశీ విద్య ఔత్సాహికులను పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆందోళనకు గురి చేస్తోంది. నోట్ల రద్దు సమయంలో పేర్కొన్న పన్ను నిబంధనలు, ఆర్థిక లావాదేవీలపై పరిమితులు విద్యార్థుల స్టడీ అబ్రాడ్ ఆశలపై ఒకరకంగా నీళ్లు చల్లాయంటున్నారు నిపుణులు. విద్యార్థుల విదేశీ విద్య ప్రయత్నాలపై నోట్ల రద్దు ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం.. బ్యాంకు బ్యాలెన్స్ తప్పనిసరి విదేశీ యూనివర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజులు వేల డాలర్లలో ఉంటున్నాయి. వాటిని మన కరెన్సీలోకి లెక్కిస్తే రూ.పది లక్షల నుంచి రూ.15 లక్షల మధ్యలో ఉంటుంది. దీనికి అదనంగా కోర్సు సమయంలో నివాస, జీవన వ్యయా లను భరించే స్థోమత అభ్యర్థికి ఉందని తెలిపే బ్యాంక్ బ్యాలెన్స్ను తప్పనిసరిగా చూపాలి. అమెరికా, బ్రిటన్ నుంచి ఐర్లాండ్, సింగపూర్ వంటి అప్కమింగ్ డెస్టినేషన్స్గా మారుతున్న దేశాల వరకు.. అన్ని దేశాల్లోని వర్సిటీలు, ఇమిగ్రేషన్ శాఖలు ఈ నిబంధనలను విధిస్తున్నాయి. ఇప్పుడు దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లు - పరిమితులు, పరిమితి దాటిన డిపాజిట్లు, బ్యాలెన్స్లపై ఆర్థిక శాఖ నిబంధనలు కఠినతరం చేసింది. అంటే... ఒకవైపు విదేశీ విద్యకు వెళ్లాలంటే... వర్సిటీలకు లక్షల్లో ఫీజులు చెల్లించాలి, లక్షల్లో బ్యాంక్ బ్యాలెన్స చూపాలి. మరోవైపు రూ.2.5 లక్షల పరిమితి దాటిన డిపాజిట్లపై నిఘా ఉంటుందని మన ఆర్థిక శాఖ ప్రకటించడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. స్ప్రింగ్ సెషన్.. హైటెన్షన్ ఆయా దేశాల్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రారంభమయ్యే స్ప్రింగ్ సెషన్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులను పెద్ద నోట్ల రద్దు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. ఇప్పటికే ఫీజులు, ఇతర రుసుములు చెల్లించినా.. భవిష్యత్తులో అయ్యే వ్యయాలకు సరిపడా కరెన్సీ చేతిలో లేకపోవడం సమస్యగా మారింది. విమాన ప్రయాణ ఖర్చులు మొదలు తమ గమ్యస్థానం చేరుకున్నాక అయ్యే వ్యయాలను సమీకరించుకునేందుకు, సమీకరించుకున్నా.. వాటికి సంబంధించి చూపాల్సిన సోర్సెస్ ఆఫ్ ఇన్కం, వాటిపై ట్యాక్స్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఫాల్ సెషన్.. అప్లికేషన్ నుంచే... సెప్టెంబర్/అక్టోబర్ నుంచి ఫాల్ సెషన్ పేరుతో ప్రారంభమయ్యే అడ్మిషన్సకు అప్లికేషన్ దశ నుంచే కరెన్సీ రద్దు ప్రతికూలంగా మారింది. దరఖాస్తు, స్టాండర్డ్ టెస్ట్స్ రిజిస్ట్రేషన్ ఫీజులు అన్నీ కలిపితే మన కరెన్సీలో రూ.లక్ష వరకు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్లను తమ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేసినా.. వాటికి సరిపడా కొత్త కరెన్సీ లభించడం లేదు. అంతేకాకుండా విత్డ్రా మొత్తాలపైనా ఆంక్షలు అమలవుతున్నాయి. అప్లికేషన్ ఫీజులు, స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్కు సంబంధించిన ఫీజులు ఆన్లైన్లో చెల్లించినా.. టెస్ట్స్ సెంటర్స్కు చేరుకొని పరీక్ష రాసేందుకు అయ్యే ప్రయాణ చార్జీలకు సరిపడా కొత్త నగదు కూడా లభించడంలేదంటున్నారు. ఫారెన్ ఎక్స్ఛేంజ్ ప్రభావం ఇప్పటికే ఆయా దేశాల్లో అడుగు పెట్టి కోర్సులు అభ్యసిస్తున్నవారిని సైతం కరెన్సీ రద్దు ప్రభావం వెంటాడుతోంది. కొత్త నోట్లు సరిపడా లభించకపోవడంతో.. అధిక శాతం మంది ఆధారపడుతున్న మనీ ఫారెన్ ఎక్స్ఛేంజ్ విధానం కూడా కుంటుపడింది. ఇప్పటివరకు చాలామంది తల్లిదండ్రులు విదేశాల్లోని తమ పిల్లలకు నగదు పంపేందుకు ఫారెన్ ఎక్స్ఛేంజ్ విధానం వెసులుబాటుగా ఉండేది. కానీ ఇప్పుడు సదరు ఫారెన్ ఎక్స్ఛేంజ్ ఏజెన్సీలు పాత నోట్లను అంగీకరించకపోవడం సమస్యగా మారింది. థర్డ్ పార్టీ హామీ దొరక్క విదేశీ విద్యకు వెళుతున్న అభ్యర్థులు ఆర్థిక నిధుల రుజువులు, ధ్రువీకరణలకు సంబంధించి థర్డ్పార్టీ(తల్లిదండ్రులు కాకుండా ఇతరులు) హామీ పొందేవారు. కానీ నోట్ల రద్దు నేపథ్యంలో థర్డ్పార్టీ హామీ ఇచ్చే వారు సైతం వెనుకంజ వేస్తున్నారు. తమ పిల్లల చదువుకు సంబంధించి నిధులు చూపించే స్థోమత ఉన్న తల్లిదండ్రుల్లో సైతం కొత్త నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తమ పిల్లల అకౌంట్లలో నగదు జమ చేయడం, దానికి సోర్స్ ఆఫ్ ఇన్కం చూపించాల్సి రావడం, లేదంటే భారీ ఎత్తున పన్నులు ఎదుర్కోవాల్సి వస్తుందని మదనపడుతున్నారు. ‘ప్రైవేట్’ రుణాలు దొరకని పరిస్థితి విదేశాల్లో ఉన్నత చదువులకు అయ్యే వ్యయాల కోసం ఔత్సాహికులు ఎక్కువగా ఆధారపడేది ప్రైవేట్ రుణాలపైనే. అయితే నోట్ల రద్దుతో చెల్లింపులన్నీ చెక్కులు లేదా నగదు రూపంలో ఉండాలనే నిబంధన, దానికి అనుబంధంగా రుణం ఇచ్చిన వ్యక్తికి ఆ మొత్తం ఎలా లభించిందో నిరూపించే సోర్స్ ఆఫ్ ఇన్కంను కూడా చూపాల్సి ఉంటుంది. దాంతో ప్రైవేట్ రుణ దాతలు ఇప్పుడు విదేశీ విద్య ఔత్సాహికులకు రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. పెరుగుతున్న డాలర్ విలువ ఇవన్నీ ఒక ఎత్తయితే.. మన రూపాయితో పోల్చితే డాలర్ విలువ పెరుగుతుండటం విద్యార్థులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెలరోజులుగా ఒక డాలర్ మారకం విలువ రూ.67 నుంచి రూ. 69 వరకు కూడా వెళ్ల్లింది. దీని వల్ల ఫీజులకు ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి రావడంతోపాటు చూపించాల్సిన ఆర్థిక వనరుల మొత్తాలు పెరుగుతాయి. ఇది విదేశీ విద్య ఔత్సాహికులను నిరాశకు గురిచేస్తుంది. స్టడీ అబ్రాడ్ విద్యార్థులకు ఆర్థిక నిధుల పరంగా ఆయా యూనివర్సిటీలు అమలు చేస్తున్న నిబంధనలను పరిగణనలోకి తీసుకుని.. వారికి ఉపశమనం కలిగించేలా ఆర్థిక శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తే బాగుంటుందని ఓ ప్రముఖ బ్యాంక్కు చెందిన జీఎం తెలిపారు. ఎడ్యుకేషన్ లోన్ ద్వారా ఆర్థిక వనరులను సమీకరించుకుని వాటిని బ్యాంక్ అకౌంట్లో జమచేసి హామీగా చూపించుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవని.. ఇతర మార్గాల ద్వారా సమీకరించుకునే వారిపై నిఘా ఉంటుందని ఆయన అంటున్నారు. సోర్స్ ఆఫ్ ఇన్కం తప్పనిసరి ప్రస్తుత పరిస్థితుల్లో రూ.2.5 లక్షలకు మించి నగదు లావాదేవీలు నిర్వహించే ప్రతి ఒక్కరూ సోర్స్ ఆఫ్ ఇన్కం చూపించాల్సిందే. అది ఆదాయపు పన్ను శాఖ నిబంధనలకు సరితూగేలా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లేకపోతే నిబంధనల ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. స్టడీ అబ్రాబ్ ఔత్సాహికుల విషయంలో ఇప్పటి వరకు ప్రత్యేక మార్గదర్శకాలు ఏమీ లేవు. కానీ వీరికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. - కె.రఘురాం, ఐటీఓ, హైదరాబాద్ -
యాప్స్ వరల్డ్
మనకు స్మార్ట్ఫోన్ లేకుండా క్షణం గడవదు. సమయం చూసుకోవడం నుంచి రిమైండర్లు, ఫొటోలు, వీడియోలు అన్నీ ఫోన్లోనే. ఇవే కాకుండా కాంటాక్ట్ నెంబర్ల నుంచి డేటా వరకు ఎంతో విలువైన సమాచారాన్ని కూడా ఫోన్లోనే భద్రపరుస్తాం. అయితే ఈ డేటానుసంరక్షించుకోవడం, ఫోన్ పోతే డేటాను రికవరీ చేసుకోవడం, అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని ఎవరూచూడకుండా రహస్యంగా దాచుకోవడం, బ్యాకప్ తీసుకోవడం వంటివి కూడా అంతే ముఖ్యం. అయితే ఇవన్నీ మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేకుండా వీటి కోసం ప్రత్యేకమైన యాప్లున్నాయి. అవేంటో చూద్దాం.. ఫోన్ నెంబర్స్ బ్యాకప్: నేటి సాంకేతిక యుగంలో తోటి ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు ఇలా కొన్ని వందల ఫోన్ నెంబర్లు మన ఫోన్లో సేవ్ చేసి ఉంటాం. అయితే పొరపాటున ఎప్పుడైనా ఫోన్ పోయినా, సాఫ్ట్వేర్ కరెప్ట్ అయినా అన్ని ఫోన్ నెంబర్లు పోతాయి. అయితే ప్రింట్ మై కాంటాక్ట్స్, కాంటాక్ట్స్ టు పీడీఎఫ్, కాంటాక్ట్స్ బ్యాకప్ అండ్ ఎక్స్పోర్ట్ వంటి కొన్ని యాప్ల సాయంతో ఫోన్ కాంటాక్ట్స్ను బ్యాకప్ తీసుకోవడం, పీడీఎఫ్, టెక్ట్స్ఫైల్స్గా మార్చుకొని మెయిల్కి పంపుకోవడం చాలా సులభం. ఇలా చేయడం వల్ల అందరి కాంటాక్ట్ నెంబర్లు భద్రంగా ఉంటాయి. వైఫై రిమోట్ యాప్స్: ష్యూర్ యూనివర్సల్ రిమోట్, వైఫై టీవీ రిమోట్, ఎనీమోట్ యూనివర్సల్ రిమోట్ ప్లస్ వైఫై, ఆండ్రాయిడ్ టీవీ రిమోట్ కంట్రోల్ వంటి యాప్ల సాయంతో వైఫై నెట్వర్క్ ఆధారంగా స్మార్ట్ఫోన్ను రిమోట్ కంట్రోల్లా వినియోగించుకోవచ్చు. అయితే వైఫై రిమోట్ యాప్స్ కేవలం నెట్వర్క్ ఆధారిత స్మార్ట్టీవీల వంటి పరికరాలకు మాత్రమే పనిచేస్తాయి. జీపీఎస్ సిగ్నల్స్ కోసం..!: మనం ఎక్కడికి వెళ్లాలన్నా జీపీఎస్ ఎంతగానో సహకరిస్తుంది. ల్యాండ్మార్క్ తెలుసుంటే చాలు జీపీఎస్ సాయంతో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. కానీ కొన్నిసార్లు జీపీఎస్ సరిగా పనిచేయదు. అలాంటి సమయంలో ‘జీపీఎస్ స్టేటస్, జీపీఎస్ టెస్ట్’ వంటి యాప్ల సాయంతో జీపీఎస్ సిగ్నల్స్ను పొందొచ్చు. బయటి వాతావరణంలో ఉన్నప్పుడు ఈ యాప్లను ఓపెన్ చేసి వాటిని బ్యాక్గ్రౌండ్లో కాసేపు రన్ చేయడం వల్ల సిగ్నల్స్ మరింతగా మెరుగుపడతాయి. మెసేజ్ బ్యాకప్: రోజూ ఎన్నో టెక్ట్స్ మెసేజ్లు వస్తుంటాయి. వాటిని స్టోర్ చేసి పెట్టుకోవాలన్నా, ఫోన్ పాడైనా మెసేజ్లు పోకుండా ఉండాలన్నా.. ఎస్ఎంఎస్ బ్యాకప్ ప్లస్, ఎస్ఎంఎస్ బ్యాకప్ అండ్ రీస్టోర్, సీఎం ఈజీ బ్యాకప్ అండ్ రీస్టోర్, సూపర్ బ్యాకప్, ఎస్ఎంఎస్ అండ్ కాల్ లాగ్ బ్యాకప్ వంటి సాఫ్ట్వేర్లు ఉపయోగపడతాయి. వీటి సాయంతో ఎస్ఎంఎస్లను భద్రపరుచుకోవచ్చు. వీటితోపాటు ప్రైవేట్ ఎస్ఎంఎస్ బాక్స్లో ఎస్ఎంఎస్ల బ్యాకప్తోపాటు ఫోన్ నంబర్లను ప్రత్యేకంగా యాడ్ చేసుకునే సదుపాయం ఉంది. ఇలా యాడ్ చేసుకున్న కాంటాక్ట్ నెంబర్ల నుంచి వచ్చే ఎస్ఎంఎస్లు కనిపించవు. వీటిని ప్రైవేట్ ఎస్ఎంఎస్ బాక్స్ ఓపెన్ చేసి చూసుకోవాలి. దీనికి పాస్వర్డ్ పెట్టుకునే సదుపాయం కూడా ఉంది. ఎస్ఎంఎస్ టు టెక్ట్స్ యాప్ ద్వారా మన ఇన్బాక్స్లోని ఎస్ఎంఎస్లను టెక్ట్స్ ఫైల్స్ రూపంలో భద్రపరుచుకోవచ్చు. లాకింగ్ యాప్లు: మన ఫోన్లోని రహస్యాలను ఇతరులు చూడకుండా ఉండేందుకు యాప్ లాక్, స్మార్ట్ లాక్ యాప్, ఈఎస్ యాప్ లాకర్, క్లీన్ మాస్టర్, యాప్స్ లాక్ అండ్ గ్యాలరీ హైడర్, యాప్ లాక్ ప్యాటర్న్, పర్ఫెక్ట్ యాప్ లాక్, లియో ప్రైవసీ గార్డ్ వంటి కొన్ని లాకింగ్ యాప్లు దోహదపడతాయి. వీటి సాయంతో ఫోన్ మొత్తాన్ని లాక్ చేయడం కాకుండా.. మనకు కావల్సిన వాటిని మాత్రమే లాక్ చేసుకోవచ్చు. ఈ యాప్లలో కొన్ని ఉచితంగా లభిస్తుండగా, మరికొన్నింటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. స్కానింగ్ యాప్లు: ఇవి ప్రతి స్మార్ట్ఫోన్లో తప్పక ఉండాల్సిన యాప్లు. సాధారణంగా మనం ఏదైనా డాక్యుమెంట్ను ఫొటో తీసి ప్రింట్ తీసుకుంటే నల్లగా, డల్గా వస్తాయి. కానీ టినీ స్కానర్, కామ్ స్కానర్, జీనియస్ స్కాన్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్, స్కాన్ బోట్, మొబైల్ డాక్ స్కానర్, హ్యాండీ స్కానర్, టర్బో స్కాన్ వంటి స్కానింగ్ యాప్లను వినియోగించడం వల్ల మెరుగ్గా వస్తాయి. మనకు కావాల్సిన ఐడీ కార్డులు, ప్రూఫ్ల వంటి వాటిని నాణ్యతతో స్కానింగ్ చేసుకోవడానికి ఈ యాప్లు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ యాప్ల సాయంతో అవసరాన్ని బట్టి లైట్గా, డార్క్గా మార్చుకోవచ్చు. -
వాలెట్ వాడుతుంటే!
ప్రస్తుతం దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అష్టకష్టాలు పడుతూ బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. పాల ప్యాకెట్ల మొదలు పప్పు దినుసుల వరకు.. మంచి నీళ్లు మొదలు.. మెడికల్ షాపు, ఆసుపత్రుల వరకు.. ఎక్కడికెళ్లినా అందరిదీ ఒకటే సమస్య. అందరూ నగదు కోసం తిరుగుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో.. డిజిటల్ వాలెట్/మొబైల్ వాలెట్/ఈ-వాలెట్ కంపెనీలు మాత్రం పండగ చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. పనిలో పనిగా వినియోగదారులను ఆకర్షించడానికి విన్నూతమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ వాలెట్ లావాదేవీల గురించి తెలుసుకుందాం... సర్వం జేబులో..! డబ్బులు పాకెట్లో కాకుండా మొబైల్ వాలెట్లో ఉంచుకోవడం నేటి ట్రెండ్. ఆన్లైన్ షాపింగ్ చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, హోటల్ బిల్లులు కట్టడానికి డిజిటల్ వాలెట్లు ఒక సులభమైన మార్గం. మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉంటే చాలు.. పేటీఎం, మొబిక్విక్ లాంటి మొబైల్ వాలెట్స్, ఎయిర్టెల్ వంటి టెలికాం బేస్డ్ మొబైల్ వాలెట్లలో నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీ అకౌంట్లోని అమౌంట్ని మొబైల్ వాలెట్స్ ద్వారా వేర్వేరు అవసరాలకు వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా యువత షాపింగ్, హోటల్స్, సినిమాలు, క్యాబ్ బుకింగ్ ఇలా అన్నీ వాలెట్స్ నుంచే కానిచ్చేస్తున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి మొబైల్ వాలెట్లోకి సులభంగా నగదు బదిలీ చేసుకునే సదుపాయం ఉండటం కూడా ఇందుకు ప్రధాన కారణం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వాలెట్లు మూడు రకాలు 1. CLOSED క్లోజ్డ్ వాలెట్స్ అంటే.. కంపెనీలు సొంతంగా అందించేవి. బిగ్ బాస్కెట్, ఓలా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఉబర్ వంటి చాలా ఆన్లైన్ సంస్థలు సొంత వాలెట్లను అందిస్తున్నాయి. వీటిలో డబ్బు వేసుకుని సదరు సంస్థ అందించే సేవలు, ఉత్పత్తులను మాత్రమే కొనాలి/వినియోగించాలి. ఇవి పూర్తిగా ఆయా సంస్థల పరిధిలో ఉంటాయి కాబట్టి వీటికి ఆర్బీఐ అనుమతి అవసరం లేదు. ఆయా సంస్థలు తమ వాలెట్ల ద్వారా జరిపే లావాదేవీలకు అత్యధిక డిస్కౌంట్ ఇస్తుంటాయి. వీటిలో వేసుకునే డబ్బుకు పరిమితి ఉండదు. ఎంతైనా వేసుకోవచ్చు. ఒకసారి డిపాజిట్ చేసిన డబ్బును విత్ డ్రా చేయడానికి వీలుండదు. దీనిపై ఎలాంటి వడ్డీ రాదు. 2. SEMI CLOSED ఈ వాలెట్లలో డబ్బులు వేస్తే ఇతర ఆన్లైన్ సైట్లలోనూ వినియోగించవచ్చు. అయితే ఈ వాలెట్ నిర్వహిస్తున్న కంపెనీకి ఏయే సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయో వాటిలో మాత్రమే లావాదేవీలు జరపాలి. పేటీఎం, మొబిక్విక్, పేయూ, సిట్రస్ క్యాష్, ఫ్రీచార్జ్ తదితర వాలెట్లన్నీ ఈ కోవకు చెందినవే. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఈ వాలెట్ల ద్వారా అత్యవసర చెల్లింపులు చేయొచ్చు. అయితే ఈ వాలెట్లలో బిల్లు చెల్లింపులు, డిపాజిట్ల పరిమితి గరిష్టంగా పది వేలు మాత్రమే. పదివేలకు మించి లావాదేవీలు వీటి ద్వారా నిర్వహించలేం. వీటిలోనూ ఒకసారి డిపాజిట్ చేస్తే తిరిగి తీసుకోలేం. వీటిపై ఎలాంటి వడ్డీ రాదు. 3. OPEN VALLETS ఇవి ఓ రకంగా బ్యాంక్ ఖాతాల్లాంటివే. వీటి ద్వారా డబ్బుల డిపాజిట్, విత్ డ్రా, చెల్లింపులు చేయొచ్చు. వీటిలో డిపాజిట్ చేసిన సొమ్మును ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. వీటిని బ్యాంకులు మాత్రమే జారీ చేస్తాయి. ఉదాహరణకు వోడాఫోన్ ఎంపైసా. దీన్ని ఐసీఐసీఐ బ్యాంక్తో కలిసి వోడాఫోన్ నిర్వహిస్తోంది. ఎయిర్టెల్ మనీ, టాటా టెలీ ఎం రూపీ కూడా బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నవే. అయితే వీటి ద్వారా నిర్వహించే లావాదేవీల విలువ రూ.50 వేలకు మించకూడదు. -
భారత జాతీయోద్యమ కాలంలో సాహిత్యాభివృద్ధి
19వ శతాబ్దం రెండో సగంలో భారతదేశంలో జాతీయ, రాజకీయ చైతన్యం పరవళ్లు తొక్కింది. సుసంఘటితమైన జాతీయోద్యమం రెక్కవిప్పింది. 1885 డిసెంబర్లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది. విదేశీ పాలన నుంచి విముక్తి కోసం కాంగ్రెస్ నాయకత్వంలో భారత ప్రజలు సుదీర్ఘ పోరాటం సాగించారు. దీని ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది. బ్రిటిష్ పాలన సృష్టించిన పరిస్థితులే భారతీయుల్లో జాతీయవాద వ్యాప్తికి దారి తీశాయి. బ్రిటిష్ పాలన, దాని ప్రత్యక్ష, పరోక్ష ఫలితాలు దేశంలో జాతీయోద్యమ స్ఫూర్తికి, జాతీయవాద సాహిత్యాభివృద్ధికి నైతిక, భౌతిక పరిస్థితులు కల్పించాయి. పాశ్చాత్య విద్యా ప్రభావం 19వ శతాబ్దంలో ఆధునిక పాశ్చాత్య విద్య వ్యాప్తి ఫలితంగా ప్రజల్లో చాలామంది ఒక నూతన హేతువాద, లౌకిక, ప్రజాస్వామిక, జాతీయవాద, రాజకీయ దృక్పథాన్ని అలవర్చుకున్నారు. ఐరోపా దేశాల్లోని సమకాలీన జాతీయోద్యమాల్ని అధ్యయనం చేసి వాటి నుంచి ఉత్తేజం పొందారు. రూసో, పేస్, జాన్స్టువార్ట మిల్ తదితర పాశ్చాత్య తత్వవేత్తల నుంచి స్ఫూర్తి పొందారు. మాజిని, గారిబాల్డీ, ఐరిష్ జాతీయోద్యమ నేతలు భారతీయులను ప్రభావితం చేశారు. దాదాభాయ్ నౌరోజీ, సయ్యద్ అహ్మద్ ఖాన్, రనడే, తిలక్, గాంధీ వంటి నాయకులు విద్యావ్యవస్థలో భారతీయ భాషలకు పెద్దపీట వేయాలని ఆందోళన చేశారు. ఆంగ్లేయ విద్యా విధానంతో జాతీయవాద సాహిత్యం బలపడింది. 1835లో మెకాలే ఆంగ్ల భాషను అధికార మాధ్యమంగా ప్రకటించడంతో భారతీయ సాహిత్యంలో నూతన పంథా ప్రారంభమైంది. హేతువాదం, మానవతావాదం, కాల్పనికవాదం వంటి భావాలు సమాజంలో చొచ్చుకొని వచ్చాయి. రచనా సంప్రదాయాల్ని ప్రభావితం చేశాయి. ఇందులో భాగంగానే సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లను ప్రశ్నించే ధోరణులు, అభ్యుదయ భావాలు సాహిత్యంలో చోటుచేసుకున్నాయి. సాహిత్యం - పత్రికల పాత్ర జాతీయవాదుల దేశభక్తి సందేశాన్ని ప్రజల్లో ప్రచారం చేయడానికి, ఆధునిక ఆర్థిక, సామాజిక, రాజకీయ భావాలను ప్రజల్లో వ్యాప్తి చేయడానికి, జాతీయ చైతన్యాన్ని కలిగించడానికి పత్రికలు ప్రధాన సాధనంగా ఉపయోగపడ్డాయి. 19వ శతాబ్దం రెండో సగంలో జాతీయ భావాలను ప్రచారం చేసే పత్రికలు చాలా వెలువడ్డాయి. అవి బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించాయి. భారతీయ దృక్పథాన్ని వివరించాయి. జాతీయ శ్రేయస్సు కోసం ప్రజలందరూ సమైక్యం కావాలని పిలుపునిచ్చాయి. స్వపరిపాలన, ప్రజాస్వామ్యం, పారిశ్రామికీకరణ లాంటి విషయాలను ప్రజల్లో ప్రచారం చేశాయి. బెంగాల్లో ది హిందూ పేట్రియట్, అమృత బజార్, ఇండియన్ మిర్రర్, ది బెంగాలీ; బొంబాయిలో ది నేటివ్ ఒపీనియన్, ఇందుప్రకాశ్, మరాఠా, కేసరి; మద్రాసు రాష్ర్టంలో ది హిందూ, స్వదేశమిత్రన్, ఆంధ్ర ప్రకాశిక, కేరళ పత్రిక; ఉత్తరప్రదేశ్లో అడ్వకేట్, హిందూస్తానీ, ఆజాద్; పంజాబ్లో ట్రిబ్యూన్, అక్బర్-ఇ-యామ్, కోహినూర్ ఆనాటి ప్రముఖ వార్తాపత్రికలు. నవల, వ్యాసం, దేశభక్తి గేయాల రూపంలో జాతీయ సాహిత్యం ప్రజల్లో జాతీయాభిమానాన్ని, చైతన్యాన్ని రేకెత్తించింది. బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర ఛటర్జీ, శరత్ చంద్ర ఛటర్జీ; అస్సాంలో లక్ష్మీనాథ్ బెజ్బారువా; మహారాష్ర్టలో విష్ణుశాస్త్రి చిప్లంకర్; తమిళనాడులో సుబ్రమణ్య భారతి; ఉర్దూలో ఇక్బాల్, అల్తాఫ్ హుస్సేన్ హోలి; ఆంధ్ర దేశంలో కందుకూరి వీరేశలింగం, గురజాడ, చిలకమర్తి లాంటివారు ఆనాటి ప్రముఖ జాతీయ కవులు, రచయితలు. జాతీయ కాంగ్రెస్కు సంబంధించిన కార్యకలాపాలు చాలావరకు పత్రికా రంగం ద్వారానే సాగేవి. కాంగ్రెస్ తీర్మానాలు మొదలైనవన్నీ పత్రికా ముఖంగానే వెలువడేవి. అప్పట్లో శక్తిమంతులు, ధీశాలురైన పాత్రికేయుల సారథ్యంలో వార్తాపత్రికలు వెలువడ్డాయి. జి. సుబ్రమణ్య అయ్యర్ సంపాదకత్వంలో ది హిందూ, స్వదేశమిత్రన్; బాలగంగాధర్ తిలక్ సంపాదకత్వంలో కేసరి, మరాఠా; సురేంద్రనాథ్ బెనర్జీ సంపాదకత్వంలో అమృతబజార్ పత్రిక; గోపాలకృష్ణ గోఖలే సంపాదకత్వంలో సుధాకర్; ఎన్ఎన్ సేన్ సంపాదకత్వంలో ఇండియన్ మిర్రర్; దాదాభాయ్ నౌరోజీ సంపాదకత్వంలో వాయిస్ ఆఫ్ ఇండియా; జీపీ వర్మ సంపాదకత్వంలో హిందూస్తానీ, అడ్వకేట్ పత్రికలు; పంజాబ్ నుంచి ట్రిబ్యూన్, అక్బర్-ఇ-యామ్ పత్రికలు; బొంబాయి నుంచి ఇందు ప్రకాశ్, ధ్యాన్ ప్రకాశ్, కల్, బంగ నివాసి, సాధారణి వెలువడేవి. హేతువాద సాహిత్యం సామాజిక, రాజకీయ వ్యవస్థలను ప్రశ్నించే ధోరణితో కూడిన హేతువాద సాహిత్యం రాజా రామ్మోహన్రాయ్తో ప్రారంభమైంది. సంబంధ్ కౌముది అనే పత్రిక ద్వారా సతీ సహగమన దురాచారాన్ని వ్యతిరేకించారు. యువ బెంగాల్ ఉద్యమకర్త అయిన హెన్రీ వివియన్ డిరోజియో సామాజిక, ఆర్థిక సమస్యలపై కరపత్రాలు ప్రచురించారు. తత్వబోధిని పత్రిక సంపాదకుడిగా అక్షయకుమార్ దత్తు..హేతువాదాన్ని ప్రచారం చేశారు. బెంగాల్లో బ్రిటిష్ వలస ప్రభుత్వ విధానాలను, నీలిమందు రైతాంగ సమస్యలను ప్రతిబింబిస్తూ ‘నీల్ దర్పణ్’ అనే నాటకాన్ని దీనబంధు మిత్ర రచించారు.మహారాష్ర్టలో బాలశాస్త్రి జాంబేకర్.. దర్పణ్, దిగ్ దర్పణ్ వంటి పత్రికల్లో హేతువాదాన్ని ప్రచారం చేశాడు. కులవ్యవస్థలోని దురాచారాలను ముఖ్యంగా బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ లోకహితవాది అనే కలం పేరుతో గోపాల్ హరిదేశ్ముఖ్ రచనలు చేశారు. మరాఠీలో చిప్లుంకర్, జ్యోతిబా పూలేలు తమ రచనల ద్వారా ప్రజల్లో హేతువాద దృక్పథాన్ని ప్రచారం చేశారు. జాతీయ భావాలను పెంపొందించారు. ఊహాజనిత వాదం (భావుకతా వాదం) భావుకతావాదం కూడా జాతీయవాద సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. బంకించంద్ర ఛటర్జీ రచించిన దుర్గేశనందిని, ఆనంద్మఠ్లను ఆధునిక సాహిత్యంలో మొట్టమొదటి నవలలుగా పేర్కొనవచ్చు. మహారాష్ర్టలో ఆర్.సి.దత్ రచించిన మహారాష్ర్ట జీవన ప్రభాత్, రాజపుత్ర జీవన సంజ లాంటి రచనలు వలస ప్రభుత్వ విధానంలో చోటుచేసుకున్న సామాజిక నిస్పృహను ప్రతిబింబించాయి.రవీంద్రనాథ్ ఠాగూర్ తన గీతాంజలిలో భావుకతావాదాన్ని చక్కగా ప్రతిబింబించారు. తమిళ సాహిత్యంలో సుబ్రమణ్య భారతి దేశభక్తి గీతాలు, భక్తి పాటలతో సమకాలీన సామాజిక సమస్యలను ప్రచారం చేశారు. మహాభారతం ఆధారంగా పాంచాలీ శపథం రాశారు. కలిప్పట్టు, కన్నన్ పట్టు, కుయిల్ పట్టు 1921లో రచించారు. పూర్తి సంస్కరణ వాదంతో కూడిన రచనలు జాతీయవాద సాహిత్యాన్ని ప్రభావితం చేశాయి. ఇంద్రమీనన్ - ఇందులేఖ; సి.వి. రామన్ పిళ్లై - మార్తాండవర్మ; మైఖేల్ మధుసూదన్ దత్తు - శర్మిష్టి రచనలు సంస్కరణ వాదాన్ని ప్రతిబింబించాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గోరా నవల సంస్కరణ వాదాన్ని ప్రతిబింబించింది. అదేవిధంగా తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కరణ, హేతువాద రచనలతో తన పత్రికలైన వివేకవర్ధిని, సతీహిత బోధిని, హాస్య సంజీవని ద్వారా జాతీయ స్ఫూర్తిని పెంపొందించారు. జాతీయవాద సాహిత్య దృక్పథం మహమ్మదీయుల రచనల్లో కూడా చోటుచేసుకుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్.. అల్-హిలాల్ పత్రిక ద్వారా సంస్కరణవాదంతోపాటు జాతీయ భావాలను ప్రకటించారు. మహ్మద్ ఇక్బాల్ (పంజాబ్) రచించిన సారే జహాసె అచ్ఛా.. జాతీయోద్యంపై గొప్ప ప్రభావం చూపింది. అతివాద యుగంలో తిలక్ నడిపిన కేసరి, మరాఠా పత్రికలు, లాలాలజపతిరాయ్ అన్ హ్యాపీ ఇండియా, బిపిన్ చంద్రపాల్ నడిపిన బెంగాల్ ఒపీనియన్, న్యూ ఇండియా భారత స్వాతంత్య్రోద్యమంపై ప్రభావం చూపాయి. 1916 నాటి హోంరూల్ ఉద్యమ కాలంలో అనీబిసెంట్ నడిపిన కామన్వీల్, న్యూ ఇండియా పత్రికలు స్వయం పరిపాలన, విద్య ప్రాధాన్యతను ప్రచారం చేశాయి. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన హిందూ స్వరాజ్ పత్రిక, భారత్లో ఆయన నడిపిన యంగ్ ఇండియా, హరిజన్ పత్రికలు జాతీయోద్యమానికి స్ఫూర్తినిచ్చాయి. విప్లవ హింసావాదం బ్రిటిష్ ప్రభుత్వ దమన నీతి, రాజకీయ పోరాటాల వైఫల్యం వల్ల ఆవరించిన నిస్పృహ అంతిమంగా విప్లవ హింసావాదంగా పరిణమించింది. 1905 తర్వాత అనేక పత్రికలు విప్లవ హింసావాదాన్ని ప్రచారం చేశాయి. బెంగాల్లో సంధ్య, యుగంతర్; పూనాలో కాల్ పత్రికలు విప్లవ ఉగ్రవాదాన్ని ప్రచారం చేశాయి. విప్లవవాదులు విదేశాల్లో కూడా తమ కేంద్రాలను ప్రారంభించారు. శ్యామ్జీ కృష్ణవర్మ.. ఇండియన్ సోషియాలజిస్టు, మేడమ్ కామా.. వందేమాతరం; మిస్ కాథరిన్ మాయో.. మదర్ ఇండియా ద్వారా విప్లవ భావాలతో కూడిన జాతీయ వాదాన్ని ప్రబోధించారు. తొలినాటి భారతీయ ఆంగ్ల రచయితలు భారత్లో ఆంగ్ల రచనలకు రాజా రామ్మోహన్రాయ్ ఆద్యుడు. 19వ శతాబ్దంలో హెన్రీ డిరోజియో, మైఖేల్ మధుసూదన్ దత్.. రామ్మోహన్రాయ్ని అనుసరించారు. తోరుదత్ ఆంగ్లంలో ‘ఏన్సియంట్ బలాడ్స’, లెజెండ్స ఆఫ్ హిందూస్తాన్’ లాంటి నవలలు రచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలికి 1913లో నోబెల్ బహుమతి లభించింది. సరోజినీ నాయుడు 1905లో గోల్డెన్ త్రెషోల్డ్, 1917లో ది బ్రోకెన్ వింగ్స వంటి రచనలు చేశారు. కవి, తాత్వికుడు, రుషి అయిన అరవింద్ ఘోష్ రచించిన దీర్ఘ కవిత సావిత్రి, ది డివైన్ లైఫ్.. ఆంగ్ల సాహిత్యంలో విశిష్ట రచనలు. నిరాద్ సి.చౌధురి (1897-1999) ప్రఖ్యాత రచయిత. ది ఆటో బయోగ్రఫీ ఆఫ్ యాన్ అన్నోన్ ఇండియన్ అనే రచనతో అంతర్జాతీయంగా కీర్తి పొందారు. జీవిత చరిత్ర రెండో భాగం దై హ్యాండ్, గ్రేట్ అనార్కను 90వ ఏట రాశారు. ది ప్యాసేజ్ టు ఇంగ్లండ్ అనేది మరో రచన. ఇవి కాకుండా ఆయన ఇతర రచనలు ‘ది కాంటినెంట్ ఆఫ్ సిర్స, టు లివ్ ఆర్ నాట్ టు లివ్, క్లైవ్ ఆఫ్ ఇండియా, స్కాలర్ ఎక్స్ట్రార్డినరీ, త్రీ హార్సమెన్ ఆఫ్ ది న్యూ అపోకలిప్స్. ముల్క్రాజ్ ఆనంద్ సామాజిక సమస్యలపై అన్టచ్బుల్ (1935), కూలీ (1936), టూ లీవ్స అండ్ ఎ బడ్ (1937), ది విలేజ్ (1939), ది బిగ్ హార్ట (1945) మొదలైన నవలలు ఆంగ్లంలో రచించారు. ది ప్రైవేట్ లైఫ్ ఆఫ్ యాన్ ఇండియన్ ప్రిన్స నవలను 1953లో రచించారు. ది లాస్ట్ చైల్డ్ కథా రచయితగా ప్రసిద్ధులు. ఆర్.కె.నారాయణ్ భారతదేశ ఆంగ్ల కల్పనా సాహిత్య పితామహుడిగా పేరొందారు. స్వామి అండ్ ఫ్రెండ్స ఆయన మొదటి నవల. గైడ్ అనే నవలతో సహా 34 నవలలు రచించారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స, ది ప్రింటర్ ఆఫ్ మాల్గుడి, ది మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి, ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట, వెయిటింగ్ ఆఫ్ ది మహాత్మా, ది వెండర్ ఆఫ్ స్వీట్స్, రిలక్టంట్ గురు, ది పెయింటర్ ఆఫ్ సైన్స, ది టైగర్ ఆఫ్ మాల్గుడి వంటి నవలలు రచించారు. ముల్క్రాజ్ ఆనంద్, ఆర్.కె.నారాయణ్, రాజారావు ఆంగ్ల నవలాకారుల త్రయంగా ప్రసిద్ధి చెందారు. రాజారావు 1938లో కాంతాపుర, ది సర్పెంట్ అండ్ ది రోప్ (1960), ది కేట్ అండ్ షేక్స్పియర్ (1965) వంటి నవలలు రచించారు. ఆయన నవల ‘ది సర్పెంట్ అండ్ ది రోప్కి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ది చెస్ మాస్టర్ అండ్ హిజ్ మూవ్స నవలకు ప్రతిష్టాత్మక న్యూస్టాడ్ ఇంటర్నేషనల్ బహుమతి పొందారు. 1947లో ది కౌ ఆఫ్ బారికేడ్స, 1977లో ది పోలీస్మ్యాన్ అండ్ ద రోజ్.. రాజారావు ప్రఖ్యాత కథా సంకలనాలు. కుష్వంత్ సింగ్ ప్రముఖ నవలాకారుడు, కథా రచయిత, ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా సంపాదకుడిగా ప్రఖ్యాతి పొందారు. ట్రెయిన్ టు పాకిస్తాన్, ఢిల్లీ, ఐ షల్ నాట్ హియిర్ ది నైటింగేల్ నవలలు రచించారు. నిసిమ్ ఎజెకీల్ భారతదేశ ఆంగ్ల కవుల్లో ఆధునికుడు. టైమ్ టు ఛేంజ్ (1952), సిక్స్టీ పొయెమ్స్ (1953), ది థర్డ (1959), ది అన్ఫినిష్డ్ మ్యాన్ (1960), ది ఎగ్జాక్ట్ నేమ్ (1965), హిమ్న్స్ ఇన్ డార్కనెస్ (1976), లేటర్-డే సామ్స్ (1982), కలెక్టెడ్ పొయెమ్స్ (1989) వంటి ఆంగ్ల రచనలు చేశారు. -
యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నై ప్రారంభం
గోవాలో 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) గోవాలో నవంబర్ 20న ప్రారంభమైంది. ఇందులో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 88 దేశాలకు చెందిన 194 చిత్రాలు: గోవాలో న వంబర్ 20న ప్రారంభమైన ఈ చిత్రోత్సవం ఈ నెల 28 వరకు జరుగుతుంది. ఇందులో 88 దేశాలకు చెందిన 194 చలనచిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రఖ్యాత చిత్రం ఆఫ్టర్ ఇమేజ్ ప్రదర్శనతో చిత్రోత్సవం ప్రారంభమైంది. పురస్కారాలు ప్రదానం: ఈ వేడుకలో దక్షిణ కొరియా దిగ్గజ దర్శకుడు ఇమ్ క్వొన్ టిక్కు జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు శత వసంత భారతీయ చలన చిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు రుయ్వెన్ రివ్లిన్ భారత్ పర్యటనఇజ్రాయెల్ అధ్యక్షుడు రుయ్వెన్ రివ్లిన్ నవంబర్ 15న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, నీటి వనరులు, విద్య, పరిశోధనలపై చర్చించారు. రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని, ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు దేశాలు వ్యవసాయం, నీటి నిర్వహణలో సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కరువు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ వినియోగిస్తున్న సూక్ష్మ నీటిపారుదల పరిజ్ఞానాన్ని ప్రధాని కొనియాడారు. ఆ టెక్నాలజీని భారత్లోని నీటి నిర్వహణ, పరిరక్షణ, శాస్త్రీయ పరిశోధన రంగాల్లో వినియోగించడంపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. నక్సల్స్పై పోరుకు సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలు జార్ఖండ్లో నక్సల్స్పై పోరాడేందుకు తొలిసారిగా మహిళా కమాండోలను సీఆర్పీఎఫ్ వినియోగిస్తోంది. 135 మంది మహిళా కమాండోలు రాంచీ సమీపంలోని ఖూంటి ప్రాంతంలో జరుగుతున్న నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. వాయు కాలుష్యంతో భారత్లో రోజుకు 3,283 మంది మృతి వాయు కాలుష్యం వల్ల 2015లో భారత్లో రోజుకు 3,283 మంది మరణించినట్లు గ్రీన్ పీస్ సంస్థ నవంబర్ 16న ప్రకటించిన నివేదికలో పేర్కొంది. అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా చైనాను భారత్ అధిగమించినట్టు వెల్లడైంది. చైనాలో రోజుకు 3,233 మంది మరణించారు. పర్యావరణ మార్పుల పనితీరు సూచీలో భారత్కు 20వ ర్యాంకు పర్యావరణ మార్పుల పనితీరు సూచీ (సీసీపీఐ)లో భారత్ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 20వ ర్యాంక్కు చేరింది. జర్మన్ వాచ్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ యూరప్ సంస్థ ఈ ఏడాది (2016)కి 58 దేశాలకు నవంబర్ 17న ర్యాంకులు ప్రకటించింది. ఇందులో వర్ధమాన దేశాలు.. పారిశ్రామిక దేశాల విధానాలను అనుకరించకుండా సొంత పర్యావరణ హిత మార్గాలను పాటించాలని సూచించింది. ఉద్గారాల విషయంలో భారత్ పనితీరు బాగుందని, పునరుత్పాదక ఇంధన వినియోగంలో మెరుగుపడిందని పేర్కొంది. సంతోషానికి కేరాఫ్ డెన్మార్క్ ప్రజలు అత్యంత సంతోషంగా జీవిస్తున్న దేశాల జాబితాలో 2016కు డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. ‘వర్డ్ హ్యాపీనెస్ లెవల్స్’ నవంబర్ 16న విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2015లో మూడో స్థానంలో ఉన్న డెన్మార్క్.. ఈ ఏడాది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తర్వాత స్థానాల్లో స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్లు నిలిచాయి. భారత్కు ఈ జాబితాలో 118వ స్థానం దక్కింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో ప్రజల సగటు ఆదాయాన్ని, వారి ఆరోగ్య ఆయుర్దాయాన్ని, తదితర అంశాల ఆధారంగా 156 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. అవినీతి ఆరోపణలపై రష్యా ఆర్థిక మంత్రి అరెస్ట్ రష్యా ఆర్థిక మంత్రి అలెక్సీ ఉల్యుకేవ్ను అవినీతి ఆరోపణలపై ఆ దేశ అధికారులు నవంబర్ 13న అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆయిల్ రిఫైనరీ రాస్నెట్.. మరో కంపెనీ బాష్నెట్ను కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చినందుకు రెండు మిలియన్ డాలర్లను లంచంగా తీసుకున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఉల్యుకేవ్ దోషిగా తేలితే 15 ఏళ్ల వరకు జైలుశిక్ష పడొచ్చు. సౌర కూటమి ముసాయిదా ఒప్పందం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపాదించిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఐ) ముసాయిదా ఒప్పందంపై 20కి పైగా దేశాలు మారకేష్ (మొరాకో)లో నవంబర్ 15న సంతకాలు చేశాయి. ఇది ఆమోదం పొందితే ఐఎస్ఏ ఒక ప్రధాన అంతర్జాతీయ సంస్థగా ఏర్పడుతుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే తెలిపారు. ఐఎస్ఐ భారత్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా పోస్ట్-ట్రూత్ ఇంటర్నేషనల్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ‘పోస్ట్-ట్రూత్’ పదాన్ని నవంబర్ 16న ప్రకటించింది. పోస్ట్-ట్రూత్.. ఆల్ట్-రైట్, బ్రెక్సిటీర్ పదాలను అధిగమించి తొలి స్థానంలో నిలిచింది. ఈ పదాన్ని 2015తో పోల్చితే 2016లో ఎక్కువగా వాడారని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలిపింది. ప్రజాభిప్రాయ నిర్ణయంలో వాస్తవాల కంటే భావోద్వేగం, వ్యక్తిగత నమ్మకాలే అధికంగా ప్రభావితం చూపడాన్ని పోస్ట్-ట్రూత్గా పేర్కొంటున్నారు. పారిస్ ఒప్పందం అమలుకు తుది గడువు 2018 పర్యావరణ మార్పులపై పోరాటానికి ఉన్నత స్థాయి రాజకీయ నిబద్ధత కావాలని మారకేష్లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో 200 దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈ సందర్భంగా నవంబర్ 18న 196 దేశాలు, ఐరోపా సమాజం సహా అన్ని పక్షాలు అంగీకారం తెలిపిన మారకేష్ చర్యల ప్రకటనను విడుదల చేశారు. పారిస్ ఒప్పందం అమలుకు సంబంధించిన నిబంధనలకు తుది రూపం ఇచ్చేందుకు 2018ను గడువుగా నిర్ణయించారు. 2015, డిసెంబర్లో తీసుకువచ్చిన పారిస్ ఒప్పందం అమలు కోసం ఆచరణాత్మక చర్యల ముసాయిదా రూపకల్పనకు మారకేష్ సదస్సు జరిగింది. పారిస్ ఒప్పందానికి ఇప్పటి వరకు 111 దేశాలు అంగీకారం తెలిపాయి. అక్టోబర్లో తగ్గిన టోకు ధరల ద్రవ్యోల్బణం అక్టోబర్లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) 3.39 శాతంగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం వరుసగా రెండో నెల్లోనూ డబ్ల్యూపీఐ తగ్గుముఖం పట్టింది. ఇది సెప్టెంబర్లో 3.57 శాతంగా నమోదైంది. కూరగాయలతోపాటు పలు ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గింది. ఇది 2015, అక్టోబర్లో -3.70 శాతంగా నమోదైంది. రైతు నెలసరి సగటు ఆదాయం రూ.6,426 దేశంలో ఒక వ్యవసాయ కుటుంబానికి నెలకు సగటున రూ.6,426 ఆదాయం వస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ నవంబర్ 18న లోక్సభకు తెలిపారు. 2012-13 వ్యవసాయ లెక్కల ప్రకారం ఇది ఏపీలో రూ.5,979, తెలంగాణలో రూ.6,311 ఉన్నట్లు వెల్లడించారు. పంజాబ్లోని వ్యవసాయ కుటుంబాలు దేశంలోనే అత్యధికంగా ప్రతి నెలా రూ.18,059 ఆదాయం పొందుతున్నాయి. ఇది పశ్చిమ బెంగాల్లో అత్యల్పంగా రూ.3,980 ఉంది. 2012 జూలై నుంచి 2013 జూన్ వరకు నిర్వహించిన జాతీయ నమూనా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. యూఏవీ రుస్తుం-2 తొలి పరీక్షలు విజయవంతం: దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ) రుస్తుం-2 (తపస్-201) తొలి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ పరీక్షలను నవంబర్ 16న కర్నాటకలోని చిత్రదుర్గ వైమానిక పరీక్ష వేదిక (ఏటీఆర్) నుంచి నిర్వహించినట్లు డీఆర్డీవో వెల్లడించింది. రెండు టన్నుల బరువు ఉండే రుస్తోం మధ్యస్థ స్థాయి ఎత్తుల్లోని లక్ష్యాలపై దాడి చేయగలదు. దీన్ని నిఘాకు కూడా వినియోగించవచ్చు. డీఆర్డీవో (బెంగళూరు), హెచ్ఏఎల్-బీఈఎల్లు సంయుక్తంగా రుస్తోంను అభివృద్ధి చేశాయి. చైనా షెంజావు-11 యాత్ర విజయవంతం సొంత అంతరిక్ష కేంద్రం కోసం చైనా అక్టోబర్ 17న ప్రయోగించిన షెంజావు-11 వ్యోమనౌక నవంబర్ 18న భూమికి చేరుకుంది. చైనా వ్యోమగాములు జింగ్ హయ్పెంగ్, చెన్డాంగ్లను అంతరిక్షానికి తీసుకెళ్లిన ఈ నౌక మంగోలియాలో దిగింది. చర్మ వైవిధ్యానికి ప్రత్యేక జన్యువులే కారణం మన దేశంలో మనుషుల చర్మ రంగు వైవిధ్యానికి ప్రత్యేక జన్యువులే కారణమని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధనలో తేలింది. సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్ నేతృత్వంలో వేర్వేరు దేశాల్లో ఐదు ఇతర సంస్థలతో కలిసి దీనిపై చేసిన తాజా పరిశోధన పత్రం.. ది జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ ఆన్లైన్ ఎడిషన్లో ఈ నెల 17న ప్రచురితమైంది. ఆఫ్రికా దేశాల్లో నలుపు, ఐరోపా దేశాల్లో తెల్ల వాళ్లు ఎక్కువగా ఉంటే భారత్లో నలుపు, తెలుపు, ఎరుపు ఇలా వేర్వేరు వర్ణాల్లో ఉన్నారు. మన దేశంలో వేర్వేరు చర్మ రంగులు ఉండటానికి ప్రత్యేక జన్యువు ఆర్ఎస్2470102 కారణమని పరిశోధకులు తెలిపారు. విజయవంతమైన పృథ్వీ-2 పరీక్ష: దేశీయంగా రూపొందించిన అణ్వాయుధ సామర్థ్యం గల పృథ్వీ-2 క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి నవంబర్ 21న ఆర్మీ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయాణించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. 500, 1000 కిలోల వార్హెడ్స్ను మోసుకెళ్తుంది. యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నై ప్రారంభం: కోల్కతా తరగతికి చెందిన క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నైని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నవంబర్ 21న ముంబైలో ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ నౌక పొడవు 164 మీటర్లు, బరువు 7,500 టన్నులు. దీనిపై సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులు, బరాక్-8 దీర్ఘ శ్రేణి క్షిపణులను మోహరించొచ్చు. -
వందేమాతర ఉద్యమం
1905లో పాలనా సౌలభ్యం కోసం అనే కారణంతో బెంగాల్ను తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్గా లార్డ కర్జన్ విభజించాడు. హిందూ, ముస్లింల ఐక్యతను దెబ్బతీసేందుకే ఈ చర్య తీసుకున్నట్లు పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. తూర్పు బెంగాల్లోని ప్రధాన ప్రాంతాలు.. అస్సాం, చిట్టగాంగ్, ఢాకా, రాజాషాహీ, తిప్పెరా. దీని రాజధాని ఢాకా. ఉప రాజధాని చిట్టగాంగ్. పుల్లర్ను బెంగాల్కు లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించి కర్జన్ ఇండియా వదిలి బ్రిటన్కు వెళ్లిపోయాడు. 1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది. 1905 ఆగస్టు 7న కలకత్తాలో స్వదేశీ ఉద్యమం (లేదా) వందేమాతర ఉద్యమం (లేదా) బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం ప్రారంభమైంది. వందేమాతరం అని నినదిస్తూ ప్రజలు కుల, మత, లింగ భేదాలకు అతీతంగా బ్రిటిష్ వారి విభజన చర్యను వ్యతిరేకించారు. జాతీయ కాంగ్రెస్ నాయకులు.. మితవాదులు, అతివాదులుగా విడిపోవడానికి బెంగాల్ విభజన ఒక కారణం. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమాన్ని బెంగాల్కి పరిమితం చేసి పోరాటం సాగించాలని మితవాదులు, దేశవ్యాప్తంగా ఉద్యమం సాగించాలని అతివాదులు విరుద్ధ భావాలతో ఉండటంతో 1907 సూరత్ జాతీయ కాంగ్రెస్లో వారు అతివాదులు, మితవాదులుగా విడిపోయారు. ఏది ఏమైనా వారి అంతిమ లక్ష్యం బెంగాల్ విభజన రద్దు. ఈ స్వదేశీ ఉద్యమం మనలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, స్వయంపోషకత్వం, నిస్వార్థ త్యాగాలను పెంపొందించింది. వందేమాతర ఉద్యమం జరుగుతున్న కాలంలోనే ముస్లింలీగ్ ఆవిర్భవించింది. ఢాకా నవాబు సలీముల్లా దీని ఆవిర్భావ కారకుల్లో ఒకరు. భారతీయుల్లోని సంఘీభావాన్ని, మత సమైక్యతను దెబ్బతీసేందుకు బ్రిటిష్ వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వందేమాతరం, సంధ్య, యుగాంతర్ వంటి పత్రికలను మూసివేశారు. ప్రధాన జాతీయ నాయకులను అరెస్ట్ చేసి, వారిపై అభియోగాలు మోపి జైలు శిక్షలు విధించారు. బ్రిటిష్ వారు ఈ చర్యల ద్వారా వారికి తెలియకుండానే భారతీయుల్లో స్వాతంత్య్ర కాంక్షకు పునాదులు వేశారు. ఉద్యమం సమసిపోతుండటంతో భారతీయ యువకులు సాయుధ పోరాటాన్ని అనుసరించారు. వందేమాతర ఉద్యమం - సంస్థల స్థాపన వందేమాతర ఉద్యమ సమయంలో స్వదేశీ సంస్థలు, విద్యాలయాలు, పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించారు. విదేశీ వస్తు బహిష్కరణ జరిగింది. బెంగాల్ జాతీయ కళాశాలను అరవింద్ ఘోష్ ఏర్పాటు చేశారు. 1906లో జాతీయ విద్యా మండలిని స్థాపించారు. భారతీయ యువకులు పారిశ్రామిక శిక్షణ కోసం జపాన్ వెళ్లారు. అహ్మదాబాద్లో దేశీయ ఉత్పాదిత వస్తు సంరక్షణ సమితి ఏర్పడింది. బారిసాల్లో అశ్వనీ కుమార్ దత్.. స్వదేశ బోధన సమితి స్థాపించారు. బెంగాల్ కెమికల్స్ ఫ్యాక్టరీని పి.సి. రాయ్ (ప్రఫుల్ల చంద్రరాయ్) స్థాపించారు. స్వదేశీ ఉద్యమ కాలంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కాశీం బజార్ వాసి.. మునీంద్ర నంది ధన సహాయం చేశారు. వందేమాతర ఉద్యమ కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గేయం - అమర్ సోనార్ బంగ్లా 1906లో జాతీయ శిక్షా పరిషత్ స్థాపించారు. భారతీయ ఉద్యమకారులపై సానుభూతి ప్రకటించిన బ్రిటిష్ అధికారి- సర్ హెన్రీ కాటన్ వందేమాతర ఉద్యమం - ప్రముఖులు - ప్రాధాన్యత బంకించంద్ర ఛటర్జీ: 1882లో ఆనంద్మఠ్ రాశారు. ఈ గ్రంథంలో వందేమాతరం గేయాన్ని రచించారు. సర్ సలీముల్లా: బెంగాల్ విభజనను పాశవిక చర్య అని వ్యాఖ్యానించారు. రవీంద్రనాథ్ ఠాగూర్: విశ్వకవి. రక్షాబంధన్ సంప్రదాయం పాటించాలని సూచించారు. శ్రీ కృష్ణకుమార్ మిత్ర: సంజీవని వార్తా పత్రిక ఎడిటర్. లివర్పూల్ ఉప్పు, మాంచెస్టర్ వస్త్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రజనీకాంత్ సేన్: వాణి, కల్యాణి, అమృత గ్రంథాలు రాసిన బెంగాలీ కవి. స్వదేశీ ఉద్యమంలో కవితావేశం ప్రదర్శించారు. ద్విజేంద్రలాల్ రాయ్: బంగా అమర్ జననీ అమర్ గేయం రాశారు. స్వదేశీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సయ్యద్ అబూ మహ ్మద్: స్వదేశీ ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన ప్రముఖ మేధావి. ముకుంద దాస్: పల్లిసేవా, బ్రహ్మచారిణి మొదలైన రచనల ద్వారా స్వదేశీ ఉద్యమానికి జీవం పోశారు. సురేంద్రనాథ్ బెనర్జీ: సిల్వర్ టంగ్డ ఆరేటర్గా ప్రసిద్ధి చెందారు. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బెంగాలీ యువకులను ఉద్దేశించి అనర్గళ ఉపన్యాసాలిచ్చారు. గోపాల్ హరిదేశ్ముఖ్: పూనాకు చెందినవారు. లోక్హితవాదిగా ఖ్యాతి పొందారు. గ్రామాల్లో కుటీర పరిశ్రమలు ఉండాలని ప్రబోధించారు. గణేశ్ వాసుదేవ్ జోషి: స్వదేశీ ఉత్పత్తుల వాడకాన్ని వందేమాతర ఉద్యమానికి ముందే ప్రచారం చేశారు. ప్రతిరోజూ రాట్నంపై దారం తీసేవారు. అంబాలాల్ సకర్లాల్, ప్రేమాబాయి, మణిబాయి, జిష్బాయి, రంచోడ్లాలా, హిమాబాయిలు వందేమాతర ఉద్యమాన్ని విస్తృతపర్చారు. సుబ్రహ్మణ్యభారతి: తమిళ పద్యాలను ఆలపిస్తూ మద్రాస్ బీచ్ సమావేశంలో స్వదేశీ భావాన్ని ప్రచారం చేశారు. గోపాలకృష్ణ గోఖలే: ప్రముఖ మితవాది. గాంధీజీకి రాజకీయ గురువు. ఖాజీ సైఫుద్దీన్: హైదరాబాద్లో ప్రసంగిస్తూ అన్ని మతాల ప్రజలు దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. బాలగంగాధర తిలక్: కేసరి, మరాఠీ పత్రికల స్థాపకులు. గణపతి ఉత్సవాలు, శివాజీ జయంతిని ప్రారంభించారు. లోకమాన్య బిరుదాంకితులు. తహల్ రామ్ గంగారామ్: ఆర్య సమాజ సభ్యుడు. విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో కీలకపాత్ర పోషించారు. అరవిందఘోష్: బెంగాల్ జాతీయ కళాశాలను స్థాపించారు. 1906లో జాతీయ విద్యా మండలి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పాండిచ్చేరిలో స్థిరపడ్డారు. బిపిన్ చంద్రపాల్: వందేమాతర ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేశారు. ముట్నూరి కృష్ణారావు ఆహ్వానంపై ఆంధ్రాలో పర్యటించారు. భారత జాతీయవాదం, జాతీయతా సామ్రాజ్యం అ లాలాలజపతిరాయ్: పంజాబ్ కేసరి బిరుదాంకితులు. అతివాది. అన్హ్యాపీ ఇండియా అనే గ్రంథం రాశారు. భగత్ సింగ్కు గురువు. అజిత్ సింగ్ : సర్దార్ బిరుదాంకితులు. పంజాబ్ ప్రాంత వాసి. మాండలే జైల్లో లాలా లజపతిరాయ్తో కలిసి శిక్ష అనుభవించారు. లార్డ మింటో: 1905 వందేమాతర ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న కాలంలో భారతదేశ బ్రిటిష్ వైస్రాయ్గా పనిచేశారు. మార్లే: వందేమాతర ఉద్యమ కాలం నాటి భారతదేశ రాజ్య వ్యవహారాల కార్యదర్శి. సయ్యద్ హైదర్ రాజా: ఢిల్లీలో స్వదేశీ ఉద్యమానికి నాయకత్వం వహించారు. చిదంబరం పిళ్లై: మద్రాస్లో స్వదేశీ ఉద్యమానికి నాయకుడిగా ఉన్నారు. ట్యుటికోరిన్ ఓడరేవులో స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని స్థాపించారు. ఐదో జార్జి: బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నట్లు 1911 డిసెంబర్ 11న ఢిల్లీలో ప్రకటించారు. ఈయన ఆనాటి బ్రిటిష్ సార్వభౌముడు. లార్డ హార్డింజ్: 1911 బెంగాల్ విభజన రద్దు సమయంలో ఆనాటి భారతదేశ బ్రిటిష్ వైస్రాయ్. జి. సుబ్రహ్మణ్య అయ్యర్: మద్రాసు బీచ్ సమావేశం (1905 సెప్టెంబర్) అధ్యక్షులుగా వ్యవహరించారు. స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. సుబోధ్చంద్ర మల్లిక్: బెంగాల్లో జాతీయ విద్యాభివృద్ధికి 1905లో రూ.లక్ష విరాళంగా అందజేశారు. కోటహరియప్ప: కడపలో స్వదేశీ వస్త్రాల స్టోర్ను ప్రారంభించారు. బి. వెంకటేశ్వరరావు దానికి సహాయ సహకారాలు అందించారు. కౌతా శ్రీరామమూర్తి: వందేమాతర గేయాన్ని ఆలపించడంలో ప్రసిద్ధి చెందారు. మార్క హంటర్: ఆంధ్రాలో రాజమండ్రి కళాశాల సంఘటన కాలం నాటి రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స కళాశాల, ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ప్రిన్సిపల్. మాదిరి ప్రశ్నలు 1. స్వదేశీ ఉద్యమం (లేదా) వందేమాతర ఉద్యమం సందర్భంగా ఉరిశిక్షకు గురైనవారు? 1) చిన్నపరెడ్డి 2) ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 3) కన్నెగంటి హనుమంతు 4) గాడిచర్ల హరిసర్వోత్తమరావు 2. బెంగాల్ విభజన ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1) 1905 అక్టోబర్ 2 2) 1906 అక్టోబర్ 16 3) 1905 అక్టోబర్ 16 4) 1907 ఏప్రిల్ 24 3. కింది వాటిలో సరైన జత? 1) రక్షాబంధన్ - రవీంద్రనాథ్ ఠాగూర్ 2) లోక్హితవాది- గోపాల్ హరిదేశ్ముఖ్ 3) 1911 డిసెంబర్ 11 - బెంగాల్ విభజన రద్దు 4) పైవన్నీ 4. కింది వాటిలో సరికాని జత? 1) బెంగాల్ విభజన - కర్జన్ 2) బెంగాల్ విభజన రద్దు - జార్జి 5 3) వందేమాతరం - బంకించంద్ర ఛటర్జీ 4) అమర్సోనార్ బంగ్లా - విష్ణు దిగంబర పలుస్కార్ 5. వందేమాతర ఉద్యమాన్ని ఏ పేరుతో కూడా వ్యవహరిస్తారు? 1) స్వరాజ్య ఉద్యమం 2) ఆగస్ట్ ఉద్యమం 3) అసహాయ ఉద్యమం 4) స్వదేశీ ఉద్యమం 6. బెంగాల్ జాతీయ కళాశాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించినవారు? 1) బాలగంగాధర్ తిలక్ 2) అరవిందఘోష్ 3) ముట్నూరి కృష్ణారావు 4) షేక్ చాంద్ 7. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? 1) వందేమాతర గేయకర్త - బంకించంద్ర ఛటర్జీ 2) వందేమాతరం పత్రిక నిర్వాహకులు - మేడం కామా 3) కోటప్పకొండ సంఘటన స్వదేశీ ఉద్యమం నాటిది 4) పైవన్నీ సమాధానాలు 1) 1; 2) 3; 3) 4; 4) 4; 5) 4; 6) 2; 7) 4. ముఖ్యాంశాలు 1907లో మహిళా భారతి సంఘం ఎక్కడ ఏర్పాటైంది? - విశాఖపట్నంలో స్వామి వివేకానంద బోధనలతో ప్రభావితమై ఏర్పడిన సంస్థ? - అనుశీలన్ సమితి అనుశీలన్ సమితి స్థాపకులు? - సతీష్ చంద్ర బసు ఆనంద్మఠ్ నవల రాసినవారు? -బంకించంద్ర ఛటర్జీ అనుశీలన్ సమితి అధ్యక్షులు? - పి. మిత్ర స్వదేశీ నేత కంపెనీని ఎక్కడ స్థాపించారు? - పూనా 1905 డిసెంబర్లో మొట్టమొదటి భారత పరిశ్రమల సమావేశం ఎక్కడ జరిగింది? - బెనారస్లో మొట్టమొదటి భారత పరిశ్రమల సమావేశానికి అధ్యక్షులు ఎవరు? - రమేష్ చంద్ర దత్ వందేమాతర ఉద్యమానికి ఉపకరించిన గ్రంథాలు.. మోడర్న ఎక్ట్సోజివ్స (ఏస్లర్ రాశారు) మోడర్న వెపన్స అండ్ మోడర్న వార్ (బ్లాచ్ రాశారు) ది సోర్డ్సమన్ (ఆల్ఫ్రెడ్ హటన్ రాశారు). -
రాజ్యాంగంలో 17వ నిబంధన దేని గురించి వివరిస్తుంది?
ఒక రాజ్యం లక్షణం గాని, స్వభావం గాని, అది పౌరులకు కల్పించే హక్కులపై ఆధారపడి ఉంటుంది అని పేర్కొన్నవారు ఎవరు? -హెచ్.జె. లాస్కీ హక్కు అనగా.. -కలిగి ఉండుట పపంచంలో అతిపెద్ద హక్కుల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? -క్రీ.శ. 1215 అతిపెద్ద హక్కుల ఒప్పందాన్ని ఏమని పిలుస్తారు? - మాగ్నాకార్టా {పపంచంలో మొదటిసారిగా బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో లిఖితపూర్వకంగా హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపర్చుకున్న దేశం ఏది? - అమెరికా భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో మొదటిసారిగా భారతీయులకు హక్కులు కావాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వ్యక్తి? - బాలగంగాధర తిలక్ బాలగంగాధర తిలక్ స్వరాజ్య బిల్లుని ఏ సంవత్సరంలో పొందుపరిచారు? - 1895 1921 నాటి ఐరిష్ ఫ్రీ స్టేట్ రాజ్యాంగంలో పేర్కొన్న హక్కులు భారతీయులకు కూడా అవసరమని, వాటిని అమలు చేయాలని కోరుతూ ‘కామన్వెల్త్ ఆఫ్ బిల్ ఆఫ్ రైట్స్’ను ఎవరు ప్రతిపాదించారు? - అనిబిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడ జరిగిన సమావేశంలో భారతీయులు రూపొందించుకోబోయే రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులే ముఖ్యమైన ప్రాతిపదిక కావాలని ప్రకటించింది? -మద్రాసు సమావేశం (1927) 1928లో మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడిన తాత్కాలిక రాజ్యాంగ కమిటీ భారతీయులకు ఎన్ని రకాల హక్కులు కావాలని సూచించింది? - 19 రకాలు భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించింది? - కరాచీ సమావేశం (1931) అల్పసంఖ్యాక వర్గాలకు తగిన రక్షణ, హామీలను చట్టబద్ధంగా కల్పించడానికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచాలని ఎవరు పేర్కొన్నారు? - తేజ్ బహదూర్ సప్రు ప్రాథమిక హక్కుల ఉప సంఘానికి చైర్మన్ ఎవరు? - జె.బి. కృపలానీ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? -అమెరికా ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు? -3వ భాగం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని రకాల ప్రాథమిక హక్కులను పొందుపరిచారు? - 7 ప్రాథమిక హక్కుల గురించి రాజ్యాంగంలో ఏ నిబంధనల్లో పొందుపరిచారు? - 12-35 నిబంధనలు ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులున్నాయి? - 6 ప్రాథమిక హక్కుల నుంచితొలగించిన హక్కు ఏది? - ఆస్తి హక్కు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిహక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు? - 1978లో 44వ రాజ్యాంగ సవరణ ప్రస్తుతం ఆస్తిహక్కు రాజ్యాంగంలో ఏ నిబంధనలో పొందుపరిచారు? ఏ హక్కుగా కొనసాగుతోంది? - 300 ఏ, చట్టబద్ధ హక్కుగా సమానత్వపు హక్కు గురించి రాజ్యాంగంలో ఏ నిబంధనల్లో పొందుపరిచారు? -14 నుంచి 18 వరకు చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే అంశం గురించి రాజ్యాంగంలో ఏ నిబంధన పేర్కొంటుంది? - 14వ నిబంధన చట్టం అందరికీ సమాన రక్షణ కల్పించాలని రాజ్యాంగంలో 14వ నిబంధన పేర్కొంటుంది. రక్షణ అనే పదం ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? -అమెరికా రాజ్యాంగంలోని 14వ నిబంధన పరిధిలోకి రాని వారు? - రాష్ర్టపతి, గవర్నర్ తదితరులు ప్రాథమిక హక్కులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? - 2 రకాలు అవి 1. సహకారాత్మక హక్కులు 2. నకారాత్మక హక్కులు రూల్ ఆఫ్ లా ఆధారంగా ఏ నిబంధనను పొందుపరిచారు. -14వ నిబంధన రాజ్యాంగంలో ప్రజల మధ్య 5 రకాల వివక్షలు పాటించరాదని ఏ అధికరణ పేర్కొంటుంది? -15వ అధికరణ 5 రకాల వివక్షలు అనగా? - కులం, మతం, జాతి, లింగ, ప్రాంతం మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించవచ్చని రాజ్యాంగంలో ఏ అధికరణ పేర్కొంటుంది? - 15(3) రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొంటుంది? -16వ నిబంధన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి సరైన ప్రాతినిధ్యం లేకపోతే రిజర్వేషన్లు కల్పించవచ్చని రాజ్యాంగంలో ఏ నిబంధన పేర్కొంటుంది? - 16(4) నిబంధన అస్పృశ్యత మహాపాపం అని ఇది హిందూ సమాజాన్ని తినే విషక్రిమి వంటిది అని తెలిపిన వ్యక్తి ఎవరు? - మహాత్మాగాంధీ రాజ్యాంగంలో 17వ నిబంధన దేని గురించి వివరిస్తుంది? - అస్పృశ్యత నివారణ అస్పృశ్యత నివారణ చట్టాన్ని పార్లమెంటు ఏ సంవత్సరంలో రూపొందించింది? - 1955 అస్పృశ్యత అనే పదం ఉపయోగించడం వల్ల వారి మనోభావాలు దెబ్బతింటాయని ఆ పదం ఉపయోగించరాదని ఏ కోర్టు వ్యాఖ్యానించింది? - మైసూరు హైకోర్టు(కర్ణాటక హైకోర్టు), 1974లో అస్పృశ్యత నివారణ చట్టాన్ని పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా ఏ సంవత్సరంలో మార్చారు? -1976 గౌరవ బిరుదులు స్వీకరించరాదని, బిరుదులు ప్రజల మధ్య సాంఘిక వ్యత్యాసాలకు కారణం అవుతాయని ఏ నిబంధన పేర్కొంటుంది? -18వ నిబంధన ఏ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ బిరుదులను ప్రవేశపెట్టింది? -1954 బిరుదులు రాజ్యాంగ విరుద్ధమని 1977లో ఏ రాష్ర్ట హైకోర్టు తీర్పు చెప్పింది? - మధ్యప్రదేశ్ హైకోర్టు భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీ తదితర బిరుదులు కావని కేవలం ‘పురస్కారాలు’ అని వాటిని భారతీయులకు 18వ నిబంధన ప్రకారం ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? - బాలాజీ రాఘవన్ గట యూనియన్ ఆఫ్ ఇండియా 1996. మండల్ కమిషన్ను ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఎవరు? - మొరార్జీ దేశాయ్ ఉఆఇ వర్గాల వారికి ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని ఏ కమిటీ సిఫారసు చేసింది? - జస్టిస్ జీవన్రెడ్డి కమిటీ ఇందిరా సహాని గట యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ైఆఇలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో 27% రిజర్వేషన్లు కల్పించడం, సమంజసమేనని తీర్పును ప్రకటించిన నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? - జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య స్వేచ్ఛా-స్వాతంత్య్రపు హక్కు గురించి రాజ్యాంగంలో ఏ నిబంధనల్లో పొందుపరిచారు? - 19 నుంచి 22 వరకు స్వాతంత్య్ర హక్కు రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని ఎవరు పేర్కొన్నారు? - జస్టిస్ సిక్రీ ప్రస్తుతం రాజ్యాంగంలో 19వ నిబంధన ఎన్ని రకాల స్వేచ్ఛా, స్వాతంత్య్రాల గురించి తెలియజేస్తుంది? - 6 రకాలు అవి.. 1. 19 1 (అ) వాక్ స్వాతంత్య్రం-భావ ప్రకటనా స్వేచ్ఛ 2. 19 1 (ఆ) ఆయుధాలు లేకుండా సభలు, సమావేశాల ఏర్పాటు స్వేచ్ఛ 3. 19 1 (ఇ) సంఘాలు - సంస్థలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ 4. 19 1 (ఈ) దేశంలో ఎక్కడైనా పర్యటించే స్వేచ్ఛ 5. 19 1 (ఉ) దే శంలో ఏ ప్రాంతంలోనైనా స్థిర నివాసం ఏర్పాటు స్వేచ్ఛ 6. 19 1 (ఎ) ఇష్టమైన వృత్తి, వ్యాపారాలు చేపట్టే స్వేచ్ఛ 19 1 (ఊ)ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. పత్రికా స్వాతంత్య్రం రాజ్యాంగంలో ఏ నిబంధనలో అంతర్భాగంగా ఉంది? - 19 1(అ)లో వాక్ స్వాతంత్య్రం - భావ ప్రకటనా స్వేచ్ఛ జాతీయ జెండాను ఎగురవేయడం భావప్రకటన స్వాతంత్య్రంలో అంతర్భాగమే అని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? - నవీన్ జిందాల్ కేసు ఏ కేసులో బంద్లు రాజ్యాంగ విరుద్ధం అని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది? - భరత్ కుమార్ కేసులో భారత రాజ్యాంగం ప్రకారం భారత ప్రభుత్వం ఏయే రంగాల్లో బిరుదులు ఇవ్వవచ్చు? -విద్యా, వైజ్ఞానిక సంబంధ బిరుదులు రాజ్యాంగంలో ఏ నిబంధన.. నేరం నుంచి రక్షణ పొందే అవకాశం కల్పిస్తుంది? - 20వ నిబంధన ఒక వ్యక్తిని ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు శిక్ష విధించరాదు. దీన్ని న్యాయ పరిభాషలో ఏమంటారు? - డబుల్ జియోపార్డీ 20(3) నిబంధన ప్రకారం ఒక వ్యక్తి తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయరాదు. దీన్ని న్యాయ పరిభాషలో ఏమంటారు? -సెల్ఫ్ ఇంక్రిమిషన్ రాజ్యాంగంలో జీవించే హక్కు లేదా ప్రాణ రక్షణ హక్కు గురించి ఏ నిబంధన వివరిస్తుంది? - 21వ నిబంధన రాజ్యాంగంలో 21ఏ అనే నిబంధనను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు? - 86వ రాజ్యాంగ సవరణ 2002లో ప్రాథమిక హక్కుల్లో 6-14 ఏళ్ల లోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును అందించాలని ఏ నిబంధన పేర్కొంటుంది? - 21ఏ నిబంధన రాజీవ్ గాంధీ ప్రభుత్వం ‘నూతన విద్యా విధానం’ ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? -1986 ఏ కమిటీ సూచన మేరకు విద్యను రాష్ర్ట జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి చేర్చారు? - స్వరణ్ సింగ్ కమిటీ రాజ్యాంగంలోని ఏ నిబంధన వ్యక్తిని నిర్బంధం నుంచిరక్షణ పొందే అవకాశం కల్పిస్తుంది? - 22వ నిబంధన నిరోధక నిర్బంధం అంటే ఏమిటి? - ఒక వ్యక్తి నేరం చేయకపోయినప్పటికి నేరం చేస్తాడేమో అనే అనుమానంతో ముందుగానే నిర్బంధంలోకి తీసుకోవడం దేశ సమగ్రత, సార్వభౌమాధికారం వ్యక్తి స్వేచ్ఛ కంటే గొప్పవి అని పేర్కొంటూ నిర్బంధ నిరోధక చట్టాన్ని సమర్థించినవారు? - బి.ఆర్.అంబేద్కర్ పనిటివ్ చట్టాలు అంటే ఏమిటి? - ముద్దాయి నేరం నిరూపితమై న్యాయస్థానం విధించిన శిక్షలను అమలు చేయడం కోసం నిర్బంధిస్తారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనవసరమైన చట్టాలను రద్దు చేసి అవసరమైన చట్టాలను రూపొందించడం కోసం నియమించిన కమిటీ? - రామానుజన్ కమిటీ పీడనాన్ని నిరోధించే హక్కు గురించి రాజ్యాంగంలో ఏ నిబంధనలు వివరిస్తున్నాయి? -23, 24 నిబంధనలు వెట్టిచాకిరి, వేశ్యా వృత్తి, బానిసత్వాలను రాజ్యాంగం ఏ నిబంధనల ప్రకారం నిషేధించింది? - 23వ నిబంధన రాజ్యం ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజలతో నిర్బంధంగా పనిచేయించడం ఏ నిబంధనకు వ్యతిరేకం కాదు? - 23వ నిబంధన వెట్టిచాకిరి నిర్మూలన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో రూపొందించింది? -1976 బాల కార్మిక వ్యవస్థ నిషేధం, 14 ఏళ్ల లోపు పిల్లలను కర్మాగారాల్లో పనిచేయించరాదని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? - 24వ నిబంధన బాల కార్మిక నిషేధ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రూపొందించింది? - 1986 ఏ నిబంధన భారతదేశంలో చట్టాల రూపాలు, న్యాయ సమీక్ష గురించి తెలియజేస్తుంది? - 13వ నిబంధన రాజ్యాంగం 12వ నిబంధన ప్రకారం రాజ్యం అంటే? - కేంద్ర ప్రభుత్వం, రాష్ర్ట, స్థానిక ఫ్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు రాజ్యం పరిధిలోకి వస్తాయి. మత స్వాతంత్య్ర హక్కు గురించి రాజ్యాంగం ఏ నిబంధనల్లో పొందుపరిచారు? - 25-28 వరకు భారతదేశం లౌకిక రాజ్యం అని అనడానికి అవకాశం కల్పించే ప్రాథమిక హక్కు ఏది? - మత స్వాతంత్య్ర హక్కు భారతదేశ పౌరులకే కాకుండా విదేశీయులకు కూడా వర్తించే హక్కు? - మత స్వాతంత్య్ర హక్కు వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధానుసారం ఏ మతాన్నైనా స్వీకరించి ప్రచారం చేసుకొనే స్వేచ్ఛను రాజ్యాంగంలోని ఏ నిబంధన కల్పిస్తుంది? - 25వ నిబంధన మత అభివృద్ధి కోసం మతపరమైన సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించే రాజ్యాంగ నిబంధన? - 26వ నిబంధన మత అభివృద్ధి కోసం మతపరమైన పన్నులు విధించరాదని ఏ రాజ్యాంగ నిబంధన తెలియజేస్తుంది? -27వ నిబంధన వి. కొండల్ ప్రభుత్వ కళాశాల లెక్చరర్, నల్లగొండ -
GENERAL ENGLISH
Directions (Q. 1-5): Read each sentence to find out whether there is any grammatical mistake/error in it. The error, if any, will be in one part of the sentence. Mark the number of that part with error as your answer. If there is 'No error', mark (5) as your answer. 1. The winter session of the Rajya Sabha began on a stormy note on Wednesday (1)/ with a united opposition demanding the constitution (2)/ of a joint parliamentary committee in probing the alleged leak (3)/ of the news of the government's demonetization move. (4)/ No error (5) 2. The town woke up to a normal morning (1)/ on Saturday as businesses (2)/ lifted shutters and educational institutions (3)/ re-opened to starting their next session.(4)/ No error (5) 3. After the death of her first husband at a rather young age, (1)/ and a young daughter to care for, (2)/ she decided to marry with Martin (3)/, an old businessman and father to a son, from his own previous marriage. (4)/ No error (5) 4. Forgetting the pain and violence Raghav suffered (1)/ is not going to be easy for him, (2)/but with counselling,(3)/ he is slowly recovering and daring to dream of a brighter future.(4)/ No error (5) 5. Anthony tried to give the clients directions orally, (1)/ but they couldn't understand him,(2)/so he pointed out of (3)/ the turning they were supposed to take.(4)/ No error (5) Directions: (Questions 6 - 10) Which of the phrases (1), (2), (3), and (4) given below each sentence should replace the phrase underlined in the sentence to make it grammatically correct? If there is no error mark (5) No correction required as your answer. 6. Owing to sub zero temperatures, drivers of the public transport vehicles started their day early. 1) Despite 2) Inspiring 3) In spite to 4) According to 5) No correction required 7. By and large, migrants in South Asia have been tolerated if not actually welcomed. 1) Has tolerated 2) Are tolerated 3) Tolerating 4) Always tolerated 5) No correction required 8. Internet services of pre-paid users remained barred in all the sensitive areas. 1) Remains 2) Remain 3) Remaining 4) Remain to 5) No correction required 9. One of the great boon of bringing such archives to light would be to spur discussions over their stories. 1) Boon off 2) Boon at 3) Boons of 4) Boons to 5) No correction required 10. It took them two days to put off place a makeshift system to deal with changed needs. 1) Put down 2) Put up 3) Put in 4) Put of 5) No correction required Directions (Q. 11-15): Rearrange the following six sentences (A), (B), (C), (D), (E) and (F) in a proper sequence to form a meaningful paragraph and then answer the questions given below. A) The axial tilt of Earth and gyroscopic effects of its daily rotation mean that the two opposite points in the sky to which the Earth's axis of rotation points change very slowly making a complete circle approximately every 26,000 years. B) This is because the two hemispheres face opposite directions along Earth's axis, and so as one polar hemisphere experiences winter, the other experiences summer. C) The winter solstice is considered by some to mark the end of autumn and the start of winter. D) In the Northern Hemisphere this is the December solstice and in the Southern Hemisphere this is the June solstice. E) Winter solstice is an astronomical phenomenon marking the shortest day and the longest night of the year. F) As the Earth follows its orbit around the Sun, the polar hemisphere that faced away from the Sun, experiencing winter, will, in half a year, face towards the Sun and experience summer. 11. What is the FOURTH sentence after rearrangement? 1) A 2) B 3) C 4) D 5) F 12. What is the THIRD sentence after rearrangement? 1) A 2) B 3) C 4) F 5) E 13. What is the SECOND sentence after rearrangement? 1) A 2) B 3) D 4) E 5) F 14. What is the FIRST sentence after rearrangement? 1) B 2) A 3) C 4) D 5) E 15. What is the FIFTH sentence after rearrangement? 1) A 2) B 3) C 4) D 5) F Directions (Q. 16-20): Each question below has a blank/ two blanks, each blank indicating that something has been omitted. Choose the word/ set of words from the five options for each blank that best fits the meaning of the sentence as a whole. 16. Nothing is so --------- to a nation as an extreme of self partiality, and the total want of ------ of what others will naturally hope or fear. 1) Detrimental … concern 2) Repugnant … sense 3) Harmful… discussion 4) Unethical … discretion 5) Fatal … consideration 17. Let us ---------- with due ---------- that ancient India was more civilized than modern India with its satellites in space. 1) admit, humility 2) adopt, certainty 3) suppose, timidness 4) oblige… humble 5) presume, meekness 18. The workers were not ------------ with their low wages and non-payment of wages for last three months ---------- fuel to the fire. 1) Satisfied …. Added 2) Paid… joined 3) Overwhelmed… bounced 4) Jubilant … justified 5) Renounced … impressed 19. There are attempts being made to try to ------------ languages through specific ------------ but the result is that some tongues become conserved as if they were a museum piece. 1) Conserve …. Systems 2) Preserve … measures 3) Generate … attempts 4) Protect … symbols 5) Maintain … defend 20. The educational ------------- of our people is far below what is necessary for effective individual living or for the --------------- of society. 1) Procurement… upliftment 2) Advancement…upkeep 3) Maintenance… attainment 4) Achievement…advancement 5) Accomplishment…regeneration Directions (Q.21-25) Read the following passage carefully and answer the questions given below it. Certain words have been printed in bold to help you locate them while answering some of the questions. We hunted during a couple of hours, not because the old straw hat was valuable but out of curiosity to find out how such a thing could manage to conceal itself in open ground where there was nothing left for it to hide behind. When one is reading in bed and lays his paper-knife down, he cannot find it again if it is smaller than a saber. That hat was as stubborn as any paper-knife could have been, and we finally had to give it up, but we found a fragment that had once belonged to an opera-glass, and by digging around and turning over the rocks we gradually collected all the lenses and the cylinders and the various odds and ends that go to making up a complete opera-glass. We afterward had the thing reconstructed, and the owner can have his adventurous lost property by submitting proofs and paying costs of rehabilitation. 21. Why would someone have a paper-knife in bed? 1) It is as useful as a weapon 2) it is difficult to move around without it 3) to cut the uncut pages of books 4) to search for a lost object 22. Why would someone have an opera-glass in the mountains? 1) it is a precious item of great value 2) it helps to find way out 3) an opera-glass is a type of binoculars 4) it is used for reconstruction 23. Is Twain serious about returning the opera-glass to its owner? How do we know? 1) if proofs are submitted reveals the truth 2) he wants documentary evidence 3) serious - as he looks forward for anyone who claims it 4) Not serious. No one would be able to submit proofs 24. Why is "rehabilitation" a funny word in this context? 1) nothing related to the seriousness of the lost property 2) it is used for reconstruction 3) it refers to living beings or their affairs 4) it doesn't help in reconstruction 25. The synonym of stubborn is? 1) bolshie 2) floppy 3) flaccid 4) droopy KEY 1) 3 2) 4 3) 3 4) 5 5) 3 6) 1 7) 5 8) 2 9) 3 10) 3 11) 5 12) 1 13) 3 14) 5 15) 2 16) 1 17) 1 18) 1 19) 3 20) 1 21) 3 22) 3 23) 4 24) 3 25) 1 -
క్యాంపస్ ప్లేస్మెంట్స్.. గెలుపు మంత్రం!
ఏ కంపెనీ అయినా ముందుగా వందల మంది విద్యార్థుల నుంచి అనర్హులను వడపోయడానికి మొదట స్క్రీనింగ్ టెస్ట్/ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఇందులో ప్రతిభ ఆధారంగా ఆయా కంపెనీలు తమకు అవసరమున్న ఖాళీల సంఖ్యకు 1:5 లేదా 1:6 నిష్పత్తిలో విద్యార్థులను తదుపరి దశల్లోకి అనుమతిస్తాయి. ప్రాంగణ నియామకాలైనా, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయినా.. చాలామంది వివిధ కారణాల వల్ల మొదటి దశ ఆప్టిట్యూడ్ టెస్ట్ను అధిగమించలేక పోతున్నారు. కాబట్టి ఇందులో రాణించాలంటే ఏయే అంశాలపై దృష్టి సారించాలి? ఏయే అంశాలపై ప్రశ్నలుంటాయో తెలుసుకుందాం.. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులకు ఆయా విద్యా సంస్థలు ప్రస్తుతం ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నాయి. గత మూడేళ్ల నుంచి చదివిన చదువుకూ, నేర్చుకున్న స్కిల్స్కు ఫలితం తేలే సమయం. ఇన్ని రోజులు కుస్తీపట్టిన పుస్తకాలు, అలవర్చుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్తో కొలువుదీరే అవకాశం కల్పిస్తున్నాయి ప్రాంగణ నియమాకాలు. కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో భాగంగా ఆప్టిట్యూడ్ టెస్ట్/టెక్నికల్ ఇంటర్వ్యూ/హెచ్ఆర్ ఇంటర్వ్యూ/సిస్టమ్ టెస్ట్లు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని కంపెనీల ప్లేస్మెంట్స్ ప్రక్రియలో బృంద చర్చలు, జామ్ (జస్ట్ ఎ మినిట్) సెషన్స్ కూడా ఉంటున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) లాంటి కంపెనీలైతే మరో అడుగు ముందుకేసి మేనేజీరియల్ రౌండ్ కూడా నిర్వహిస్తున్నాయి. కొన్ని సంస్థలు టెక్నికల్ దశలోనే రెండు మూడు రౌండ్లు జరుపుతున్నాయి. సాధారణంగా ఆప్టిట్యూడ్ టెస్ట్ 45 నిమిషాలు లేదా గంట పాటు నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ విభాగంలో టైమ్ అండ్ వర్క్, ప్రాబబిలిటీ, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, సగటు, నంబర్ సిస్టమ్స్, నిష్పత్తులు, లాభనష్టాలు, ట్రైన్స్, లాగారిథమ్, కసాగు, గసాభా మొదలైన అంశాలపై ఎక్కువ శాతం ప్రశ్నలు అడుగుతున్నారు. వీటితోపాటుగా వడ్డీలపై ప్రశ్నలు, భాగస్వామ్యం, ఎత్తు - దూరం తదితర అంశాలపై ప్రశ్నలడిగే అవకాశం ఉంది. వీటితోపాటు డేటా ఇంటర్ప్రిటేషన్కు సంబంధించి బార్గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై చార్టులు, నెట్ డయాగ్రమ్స్, ట్యాబులర్ డేటా ఇచ్చి సమస్యలు పరిష్కరించమని కోరుతున్నారు. లాజికల్ రీజనింగ్ ఈ విభాగం నుంచి కోడింగ్ డీకోడింగ్, డెరైక్షన్స్, క్లాక్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, లాజికల్ ప్రాబ్లమ్స్, క్యాలెండర్స్, క్యూబ్స్, వెన్ డయాగ్రమ్స్, అనాలజీస్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెర్బల్ తదితర విభాగాల్లో విద్యార్థుల ప్రతిభ పరీక్షిస్తారు. వెర్బల్ ఎబిలిటీ వోకాబులరీ, సినానిమ్స్, యాంటానిమ్స్, అనాలజీస్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ కరెక్షన్, గ్రామర్ కాన్సెప్ట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఆప్టిట్యూడ్ టెస్ట్లో విజయానికి.. ప్రాంగణ నియామకాల్లో విజయం సాధించాలంటే విద్యార్థులు సదరు కంపెనీలు గతంలో నిర్వహించిన ప్రశ్నపత్రాలను సేకరించుకొని ప్రాక్టీస్ చేయాలి. వివిధ వెబ్సైట్లల్లో గత సంస్థలు నిర్వహించిన ప్రశ్నపత్రాలను పొందొచ్చు. పరీక్ష విధానం, దానికి కేటాయించే సమయం కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తాము హాజరు కాబోయే కంపెనీ అనుసరించే పరీక్ష విధానాన్ని ముందుగానే తెలుసుకోవాలి. థర్డ్ ఇయర్లో ఉన్న విద్యార్థులు ఇప్పటి నుంచే ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. సమస్యను సాధించడం, పజిల్ టెస్టులకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాలేజీలో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ (సీఆర్టీ) తరగతులకు తప్పనిసరిగా హాజరవ్వాలి. సందేహాలు వస్తే ఫ్యాకల్టీని అడిగి నివృత్తి చేసుకోవాలి. సమయపరిమితిని నిర్దేశించుకుని ప్రాక్టీస్ చేయాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్ల నుంచి సమాధానాలు గుర్తించడం సులువనేది నిపుణుల సూచన. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లను జాగ్రత్తగా పరిశీలిస్తే సమాధానాన్ని గుర్తించవచ్చు. రిఫరెన్స్ బుక్స్ ఆర్.ఎస్.అగర్వాల్ (వెర్బల్ ఎబిలిటీ, నాన్ వెర్బల్), వొకాబులరీ కోసం వర్డ్ పవర్ మేడ్ ఈజీ - నార్మన్ లూయీస్, జీఆర్ఈ బారోన్స్ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి. -
మెకానికల్లో సర్టిఫికేషన్స్ ఇవే..
ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్న/ఉత్తీర్ణులైన విద్యార్థులు మంచి ఉద్యోగం సాధించాలంటే అకడమిక్ సర్టిఫికెట్లతోపాటు ఆయా బ్రాంచ్ల్లో సర్టిఫికేషన్ కోర్సులు కూడా పూర్తి చేయాల్సిందే. అప్పుడే కోరుకున్న ఉద్యోగం దక్కుతుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కొన్ని సర్టిఫికేషన్ కోర్సుల గురించి తెలుసుకుందాం.. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అతి పురాతన, సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సు. మెకానికల్లో డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఇన్స్టాలేషన్ తదితర విభాగాల్లో ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక మార్పులు వస్తున్నాయి. ఇందులో రాణించాలంటే తాజా నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. వీటి కోసం ప్రత్యేక సర్టిఫికేషన్ కోర్సులు ఉన్నాయి. అవి.. స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ ట్రైనింగ్ కోర్సులు: ఈ కోర్సులు గణాంక పద్ధతుల ద్వారా ఒక ఉత్పత్తిని నాణ్యతతో రూపొందించడానికి ఉపయోగపడతాయి. ఉత్పత్తి, పర్యవేక్షణ, నియంత్రణ, నాణ్యతా ప్రమాణాలు పెంపొందించడానికి సంబంధించిన నైపుణ్యాలను పొందేలా కోర్సులు ఉంటాయి. ఎన్డీటీ కోర్సులు: ఉత్పత్తుల ప్రామాణికతను, నాణ్యతను పరీక్షించడానికి ఉపకరించేది ఎన్డీటీ (నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్) సర్టిఫికేషన్స్. ఉత్పత్తి, ప్రాసెసింగ్, హీట్ ట్రీట్మెంట్, ఆటోమొబైల్ లాంటి విభాగాల్లో ఎన్డీటీ ఇన్స్ట్రక్టర్ అవసరం ఉంటుంది. చాలావరకు ఎన్డీటీ సర్టిఫికేషన్ ప్రోగ్రాములు మూడు స్థాయిలో లెవల్- 1, లెవల్-2, లెవల్-3గా ఉంటాయి. లెవల్-1 సర్టిఫికేషన్ చేసినవారు ఒక ప్రొడక్ట్ తయారీ క్రమంలో అనుసరించాల్సిన పలు టెస్టింగ్ అంశాలను తెలుసుకుంటారు. వీరు లెవల్-2, -3 పూర్తిచేసినవారి పర్యవేక్షణలో పనిచేస్తారు. లెవల్-2లో స్వయంగా నిర్వహించాల్సిన టెస్టింగ్ అంశాలు ఉంటాయి. లెవల్-3 సర్టిఫికేషన్ చేసినవారు అభివృద్ధి, వివిధ విధానాలకు ఆమోదం తెలపడం వంటి విధులు నిర్వర్తించవచ్చు. మూడు దశల సర్టిఫికేషన్ చేస్తే తయారీ ప్రక్రియ నుంచి తుది రూపం వచ్చే వరకు అవసరమైన అన్ని అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. ఆటోక్యాడ్ డిజైన్ సర్టిఫికేషన్: సాఫ్ట్వేర్ వినియోగం పెరిగిన క్రమంలో ఆటోక్యాడ్ డ్రాఫ్టింగ్ అండ్ డిజైన్లో సర్టిఫికేషన్ చేసిన వారికి నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. దీన్ని ఉపయోగించి 2డి డిజైన్, 3డి డిజైన్ మోడలింగ్ల్లో ప్రావీణ్యం పొందొచ్చు. కోర్సు పూర్తి చేసినవారు నిర్మాణం, ఆర్కిటెక్చరల్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, మెకానికల్ డిజైన్, యానిమేషన్ల్లో రాణించొచ్చు. మెకట్రానిక్స్ అండ్ రోబోటిక్స్: ఇది మెకానికల్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, కంట్రోల్ సిస్టమ్స్ స్కిల్స్ మేళవింపు. ఇందులో మెకట్రానిక్స్-రోబోటిక్స్కు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అంశాలపై స్కిల్స్ నేర్పిస్తారు. రోబోటిక్స్ కోర్సులు: ప్రొడక్ట్ను రిమోట్ కంట్రోల్ సహాయంతో లేదా కంప్యూటర్ సూచనల మేరకు పనిచేసే విధంగా రూపొందించడంతోపాటు ఆ ప్రొడక్ట్ సరిగా పనిచేసేలా స్కిల్స్ బోధిస్తారు. -
జేఈఈలో విజయానికి ఐఐటీల కోచింగ్
ఎన్ఐటీలు, ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్, ఐదేళ్ల డ్యుయెల్ డిగ్రీ (బీటెక్+ఎంటెక్) కోర్సుల్లో ప్రవేశానికినిర్వహించే పరీక్షలు.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్సడ్. ఇవి జాతీయ స్థాయిలోలక్షల మంది పోటీపడే పరీక్షలు. ఇంటర్మీడియెట్ ఎంపీసీలో చేరిన తొలి రోజు నుంచే జేఈఈలోవిజయం దిశగా చాలామంది శిక్షణ తీసుకుంటారు. అయితే వీరిలో కొంతమందికి మాత్రమేసీటు ఖరారవుతుంది. మిగిలినవారికి నిరాశే మిగులుతుంది. ఈ పరిస్థితికి పరిష్కారం చూపేదిశగా ఐఐటీలే స్వయంగా కదులుతున్నాయి. జేఈఈ విద్యార్థుల కోసం నిపుణులైన ప్రొఫెసర్లతోశిక్షణనిప్పించేందుకు శ్రీకారం చుట్టాయి. దూరదర్శన్ చానల్తోపాటుమరో ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పాఠాలు అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసంప్రత్యేకంగా ఐఐటీ-పాల్ (PAL - Professor AssistedLearning) పేరుతో ఈ ప్రోగ్రామ్ను అమలు చేయనున్నాయి.వచ్చే ఏడాది (2017) జనవరి నుంచి అమల్లోకిరానున్న ఈ పథకం విధివిధానాలపై విశ్లేషణ.. జేఈఈలో విజయం సాధించాలంటే కోచింగ్ తప్పనిసరి. శిక్షణ లేకుంటే పరీక్షలో ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేమనేది చాలా మంది అభిప్రాయం. దీంతో ఉన్నత వర్గాలు, ఎగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలు లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్నారు. అంత ఖర్చు చేసినా, కంటి మీద కునుకులేకుండా కష్టపడినా ఐఐటీల్లో సీట్లు లభించేది కొందరికే. ఐఐటీ జేఈఈ కోచింగ్ సౌకర్యాలు పట్టణ ప్రాంతాలకే పరిమితం. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సైతం ఇవి అందేలా చేయాలి. ముఖ్యంగా లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకునే సామర్థ్యం లేని వర్గాలు, సుదూర ప్రాంతాలకు వెళ్లలేని గ్రామీణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పరిష్కారం చూపాలనేది వివిధ వర్గాల అభిప్రాయం. ఐఐటీ పాల్ అంటే జాతీయ స్థాయిలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. జేఈఈ. దీన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశ జేఈఈ మెయిన్.. రెండో దశ.. జేఈఈ అడ్వాన్సడ్. మెయిన్ ర్యాంకుతో 31 ఎన్ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశం పొందొచ్చు. అడ్వాన్సడ్ ద్వారా 22 ఐఐటీల్లో చేరొచ్చు. జేఈఈకి దేశవ్యాప్తంగా లక్షల మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. కానీ సీట్లు ఐఐటీల్లో పదకొండు వేల లోపు, ఎన్ఐటీల్లో 30 వేల లోపు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంత పోటీ ఉన్న పరీక్షలో విజయం దిశగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వం తరఫున ఐఐటీలు చేపడుతున్న కొత్త కార్యక్రమమే ఐఐటీ - పాల్ (ప్రొఫెసర్ అసిస్టెడ్ లెర్నింగ్). జనవరి, 2017 నుంచి అమలు కానున్న ఈ ప్రోగ్రామ్ ద్వారా దేశంలోని నలుమూలల ఉన్న జేఈఈ ఔత్సాహిక విద్యార్థులకు ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్ల పాఠాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రోగ్రామ్కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సైతం ఆమోదం తెలిపింది. ఐఐటీ - పాల్ తీరుతెన్నులను పరిశీలిస్తే.. ఐఐటీ ఢిల్లీ ఈ ప్రోగ్రామ్ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనుంది. దీంతోపాటు పాత ఐఐటీలుగా పిలిచే కాన్పూర్, ఖరగ్పూర్, చెన్నై, బాంబే, గువహటిలు ఐఐటీ-పాల్లో భాగస్వాములుగా నిలవనున్నాయి. 4.. 40.. 200.. ఐఐటీ- పాల్ నిర్వహణ ఇలా ఐఐటీ - పాల్ ప్రోగ్రామ్లో భాగంగా పదకొండు, పన్నెండు (ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్, సెకండియర్) తరగతుల విద్యార్థులకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో శిక్షణ లభించనుంది. ఇందుకోసం ఆయా ఐఐటీలకు చెందిన 40 మంది ప్రొఫెసర్ల బృందం ఏర్పాటు కానుంది. ఒక్కో సబ్జెక్ట్లో 200 గంటల చొప్పున లెక్చర్చ్ అందుబాటులో ఉంటాయి. ఈ రెండు వందల గంటల వ్యవధిలో అందించే లెక్చర్స్లోనే +2 స్థాయి సిలబస్, జేఈఈ సిలబస్కు సంబంధించి పాఠాలు మొత్తం లభించేలా ఏర్పాట్లు చేయనున్నారు. నిపుణులైన ప్రొఫెసర్లతోపాటు ఎన్సీఈఆర్టీ, కేంద్రీయ విద్యాలయాలకు చెందిన అధ్యాపకులు సైతం ఈ ప్రోగ్రామ్కు సంబంధించి శిక్షణ తరగతులు బోధించనున్నారు. అన్ని ప్రాంతాల విద్యార్థులకు చేరే మార్గంఐఐటీ-పాల్ ప్రోగ్రామ్ ద్వారా జేఈఈ శిక్షణ తరగతులు దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకు చేరడం ఎలా? అంటే.. ఇందుకు ప్రధానంగా రెండు మార్గాలను ఐఐటీలు ఎంపిక చేసుకున్నాయి. అవి.. జనవరి 2017 నుంచి దూరదర్శన్ చానల్ ద్వారా నిర్దేశిత సమయంలో నిర్దిష్ట కాల వ్యవధిలో క్రమం తప్పకుండా ప్రసారం చేయనున్నాయి. దూరదర్శన్ చానల్కు అన్ని ప్రాంతాల్లో కనెక్టివిటీ ఉండటంతోపాటు ప్రసారాల పరంగా ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో దీన్ని ఎంచుకున్నాయి. దీనివల్ల గ్రామీణ విద్యార్థులకు సైతం ఇది చేరుతుంది. ఇక.. రెండో మార్గం.. ఒక ప్రత్యేక వెబ్పోర్టల్ రూపొందించడం. అందులోనూ ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ను పొందుపర్చడం. అయితే ఈ విధానం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంత విద్యార్థులకు కొంత ఎక్కువ అనుకూలం అని చెప్పొచ్చు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం, బ్రాడ్బ్యాండ్ సదుపాయాలు ఉన్నా అవి పరిమితంగా ఉండటమే దీనికి కారణం. మూస శిక్షణకు భిన్నంగా ఐఐటీ-పాల్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం.. జేఈఈకి హాజరయ్యే విద్యార్థులను మూస పద్ధతిలో అనుసరిస్తున్న కోచింగ్ విధానం నుంచి విముక్తి కల్పించడం. ప్రస్తుతం వివిధ శిక్షణ కేంద్రాల్లో కోచింగ్తీసుకుంటున్న విద్యార్థులను పరిశీలిస్తే.. కేవలం సిలబస్ ఆధారంగా ఆన్సర్ టు కొశ్చన్ మాదిరిగా బట్టీ విధానంలో శిక్షణనిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. విద్యార్థులు సైతం జేఈఈలో ర్యాంకులే లక్ష్యంగా సబ్జెక్ట్కు సంబంధించిన బేసిక్ నైపుణ్యాల సాధనను విస్మరిస్తున్నారు. దీని కారణంగానే ఐఐటీల్లో ప్రవేశించాక అక్కడ భిన్నంగా ఉండే బోధన విధానాల్లో ఇమడలేకపోతున్నారు. కొన్నిసార్లు ఒత్తిడికి లోనై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీటన్నిటికీ పరిష్కారం చూపేలా, విభిన్నంగా, వినూత్నంగా ఐఐటీ-పాల్లో లెక్చర్స్ లభించనున్నాయి. వీటి ద్వారా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ప్రాథమిక భావనలు, వాటిని అన్వయించే విధానం, సమస్యలను పరిష్కరించే క్రమంలో అనుసరించాల్సిన పద్ధతులు, వాటికి సబ్జెక్ట్ పరంగా ఉన్న మూలాల గురించి బోధిస్తారు. దీనివల్ల ప్రశ్న ఎలా అడిగినా సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది. గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు ఐఐటీ-పాల్.. ప్రధానంగా గ్రామీణ విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరంగా ఉండనుంది. అదేవిధంగా శిక్షణ కోసం రూ. లక్షలు వెచ్చించలేని పేద, మధ్య తరగతి వర్గాలకు సైతం ఇది ఉపయుక్తంగా మారనుంది. 2014లో ఐఐటీల్లో మొత్తం 9784 సీట్లు అందుబాటులో ఉండగా.. గ్రామీణ నేపథ్యం, కుటుంబ వార్షికాదాయం రూ. లక్ష లోపు ఉన్న విద్యార్థుల సంఖ్య రెండు వేల లోపుగా నమోదైంది. 2015లో అందుబాటులో ఉన్న 9974 సీట్లలో 25 శాతం సీట్లు గ్రామీణ విద్యార్థులు సొంతం చేసుకోగా, వారిలో కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉన్న వారి సంఖ్య 1600 వరకు ఉంది. ఈ గణాంకాలను విశ్లేషిస్తే.. ఐఐటీ-పాల్తో శిక్షణనందించడం ద్వారా మరింత మంది గ్రామీణ విద్యార్థులకు మేలు చేయొచ్చు. ప్రైవేట్ కోచింగ్కు డబ్బులు చెల్లించలేని వారికి లబ్ధి చేకూర్చవచ్చని ఐఐటీ వర్గాలు భావిస్తున్నాయి. ఆహ్వానించదగ్గ పరిణామం ఐఐటీ పాల్.. మరో ప్రధాన ఉద్దేశం రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఏటా రూ. వందల కోట్ల స్థాయికి చేరిన శిక్షణకు స్వస్తి పలకడం. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రాథమిక భావనలు, అన్వయ సామర్థ్యం పెరిగేలా బోధన చేయాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని నిపుణులు అంటున్నారు. అయితే ఈ విధానంలో స్టూడెంట్- ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ లేకపోవడం లోపంగా పలువురు పేర్కొంటున్నారు. అందుకు పరిష్కారంగా సంబంధిత టాపిక్కు సంబంధించి లోతైన ప్రశ్నల సాధన దిశగా రెగ్యులర్ మెంటారింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు.. ఐఐటీ - పాల్కు సంబంధించి మరో వారం రోజుల్లో పూర్తి విధి విధానాలు ఖరారు కానున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సహజమే. కానీ మేం కొన్ని నెలలపాటు కసరత్తు చేసిన తర్వాతే ఈ ప్రోగ్రామ్ అమలుకు చర్యలు చేపట్టాం. మా ప్రణాళికల ప్రకారం ఇది కచ్చితంగా గ్రామీణ విద్యార్థులకు, శిక్షణ తరగతులకు వెళ్లలేని వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జేఈఈ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఉపయోగపడుతుంది. - వి. రామ్గోపాలరావు, డెరైక్టర్, ఐఐటీ - ఢిల్లీ ఇన్క్లూజివ్ గ్రోత్ పెరిగే అవకాశం ఐఐటీ-పాల్ కచ్చితంగా మేలు చేస్తుంది. దీనివల్ల ఐఐటీల్లో అన్ని వర్గాల విద్యార్థుల ప్రాతినిధ్యం పెరుగుతుంది. అదేవిధంగా ఎన్రోల్మెంట్ పరంగా ఇన్క్లూజివ్ గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా ఉండేలా ఐఐటీ - పాల్ ద్వారా శిక్షణ అందిస్తాం. మెరుగైన బోధన పద్ధతులు అనుసరిస్తాం. ఇందులో స్టూడెంట్- ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఉండదనే అభిప్రాయం వాస్తవమే. అయితే ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ను రూపొందించేటప్పుడే ప్రొఫెసర్లు ఒక టాపిక్ను భిన్న కోణాల్లో బోధిస్తారు. సందేహ నివృత్తి చేసే విధంగా లెక్చర్స ఉంటాయి. - ప్రొఫెసర్ ఆర్.వి.రాజ్కుమార్ డెరైక్టర్, ఐఐటీ-భువనేశ్వర్ -
ఆసక్తే ఆవిష్కరణలకు పునాది
‘వినూత్న ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలకు పునాది సహజమైన ఆసక్తి. అది ఉంటే ఏ రంగంలోనైనా ఇన్నోవేటర్స్గా, ఎంటర్ప్రెన్యూర్స్గా దూసుకెళ్లొచ్చు. తమ ఆవిష్కరణలు సామాజిక ప్రగతికి దోహదం చేసేలా యువత ఆలోచించాలి. అప్పుడే కెరీర్ పరంగా, సామాజికంగా గుర్తింపు లభిస్తుంది’ అంటున్నారు అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మీడియా ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ రమేశ్ రస్కర్. ఫెమ్టో ఫొటోగ్రఫీ పేరుతో ఒక నిర్దిష్ట వస్తువును లేదా ప్రదేశాన్ని కాంతి వేగంతో కెమెరాలో బంధించగలిగే ఆవిష్కరణ చేసినందుకు 2016 సంవత్సరానికి ఐదు లక్షల డాలర్ల ఫెలోషిప్ (ది లెమన్సన్ ఎంఐటీ) విజేతగా నిలిచిన రమేశ్ రస్కర్తో ఈ వారం గెస్ట్ కాలమ్.. గెస్ట్కాలమ్ చిన్నప్పటి నుంచే: చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటి పనితీరుపై ఆసక్తి ఉండేది. దీంతో బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ను ఎంచుకున్నాను. పుణె ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 1991లో బీటెక్ పూర్తిచేశాక కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ కోసం యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా వెళ్లాను. నూతన ఆవిష్కరణల దిశగా ముందుండాలనే తపనతో కృషిచేశాను. ఫలితంగా పీహెచ్డీ పూర్తయిన తర్వాత (2003లోనే) గ్లోబల్ ఇండస్ టెక్నోవేటర్ అవార్డ్ లభించింది. అప్పటి నుంచి పలు అవార్డులు, పేటెంట్లు లభించాయి. కానీ ఇప్పుడు లభించిన ఫెలోషిప్ మరింత ఉత్సాహాన్నిస్తోంది. దీని ద్వారా లభించిన డబ్బుతో రీసెర్చ్, ఇన్నోవేషన్ కార్యకలాపాలను విస్తృతం చేయాలనుకుంటున్నాను. ఈటీఎం నుంచి ఐ కేర్ వైపు..: బీటెక్, పీహెచ్డీల్లో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ద్వారా పొందిన పరిజ్ఞానంతో సామాజిక సమస్యలకు పరిష్కారం కనుగొనాలనే ఆలోచన మెదిలింది. అదే సమయంలో డబ్ల్యూహెచ్ఓ తన నివేదికలో ప్రపంచంలో నేత్ర సంబంధ వ్యాధుల బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని పేర్కొంది. దీంతో కంటి సమస్యలకు పరిష్కారం కనుగొనాలని నేత్ర సంరక్షణ పరికరాలు, నేత్ర సంబంధ వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే ఇంతకుముందు కంటికి సంబంధించి రిఫ్రాక్టివ్ ఎర్రర్ సమస్యను పరిష్కరించే పరికరాన్ని రూపొందించాను. పరిశోధనల పట్ల ఆసక్తి పెరగాలి: భారతదేశ యువతలో పరిశోధనల పట్ల ఇంకా ఆసక్తి పెరగాల్సి ఉంది. తమ ఆవిష్కరణలు కంపెనీలుగా రూపొందేందుకు గల అవకాశాలను ముందుగానే పరిశీలించుకోవాలి. లేదంటే మంచి ఆవిష్కరణలు చేసినా వాటిని అమలు చేసే అవకాశం లభించదు. తమ ఆవిష్కరణల ప్రాధాన్యాన్ని వెంచర్ క్యాపిటలిస్ట్లను మెప్పించేలా వివరించడం కూడా ఇప్పుడు ఎంతో కీలకంగా మారింది. ఇన్నోవేటర్ నుంచి ఎంటర్ప్రెన్యూర్గా మారగలిగినప్పుడే అసలైన ఫలితాలు లభిస్తాయి. వ్యక్తిగతంగా సంతృప్తి లభిస్తుంది. ఇన్స్టిట్యూట్ స్థాయిలో ప్రోత్సాహం: పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఇన్స్టిట్యూట్ స్థాయిలో ప్రోత్సాహం ఇవ్వాలి. నేను పీహెచ్డీ కోసం చేరిన యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలోని ఫ్యాకల్టీ, ఇండివిడ్యువల్ రీసెర్చ్ ఫ్యాకల్టీ తమ విద్యార్థులు కూడా రీసెర్చ్ యాక్టివిటీస్లో పాల్పంచుకునేలా సహకారం అందించారు. ఇది ఎంతో కలిసొచ్చింది. ముఖ్యంగా నాకు ఇష్టమైన రోబోటిక్స్, ఇమేజింగ్ విభాగాల్లో అప్పట్లో చక్కటి ప్రోత్సాహం లభించింది. ఇలాంటి వాతావరణమే భారత ఇన్స్టిట్యూట్లలోనూ కల్పించాలి. సద్వినియోగం చేసుకుంటేనే భవిష్యత్తు యువతకు ఇప్పుడు అకడమిక్, కెరీర్, పరిశోధనల పరంగా ఎన్నో వేదికలు అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి ఉన్న వారు బ్యాచిలర్ స్థాయి నుంచే తమను తాము సైంటిస్ట్లుగా భావించుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ఈ విషయంలో తమను తామ తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఆసక్తి చూపే విద్యార్థులను ప్రోత్సహించేందుకు మెంటార్లు సైతం ముందుకు వస్తారు. అలాగే ఇన్నోవేషన్స్ పరంగా ‘గివింగ్ బ్యాక్ టు సొసైటీ’ అనే దృక్పథం ఎంతో అవసరం!! -
బిగ్ డేటా ఫర్ బ్రైట్ ఫ్యూచర్
విశ్లేషణ సామర్థ్యం ఆధునిక యుగంలో అత్యాధునిక ఉద్యోగం.. ఆకర్షణీయమైన వేతనం. డిగ్రీ ఏదైనా ఫర్వాలేదు.. మ్యాథమెటికల్ నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యం ఉంటే చాలు.. కళకళలాడే కెరీర్కు మార్గం వేస్తోంది.. బిగ్ డేటా. ఇ-కామర్స్ సంస్థల నుంచి మల్టీ నేషనల్ ఐటీ సంస్థల వరకు.. సాఫ్ట్వేర్ నుంచి కోర్ ప్రొడక్షన్ సంస్థల వరకు.. బెస్ట్ ఫ్యూచర్కు బిగ్ డేటా మార్గంగా నిలుస్తోంది. బిగ్ డేటా అనలిటిక్స్ ప్రధాన ఉద్దేశం విస్తృతంగా ఉండే డేటాను క్రమపద్ధతిలో అమర్చడం, విశ్లేషించడం.. దాని ఆధారంగా వినియోగదారులు కోరుకుంటున్న సేవలు, వస్తువుల గురించి నివేదికలు రూపొందించి సంస్థలోని ప్రొడక్ట్ డెవలప్మెంట్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ విభాగాలకు అందించడం. ఈ విధులు నిర్వహించడానికి సాంకేతిక నైపుణ్యాలు అవసరం. కంప్యుటేషనల్, మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్న వారు ఈ రంగంలో అడుగుపెట్టేందుకు అవకాశం ఉంటుంది. మ్యాథ్స్, సైన్స్తో మెరుగ్గా బిగ్ డేటా అనలిటిక్స్ విభాగంలో మ్యాథ్స్, సైన్స్ విభాగాల విద్యార్థులకు ఇతర విద్యార్థులతో పోల్చితే అవకాశాలు కాస్త మెరుగ్గా ఉంటాయని నిపుణుల అభిప్రాయం. ఈ రంగంలో సైన్స్ విధ్యార్థుల హవా సాగుతోందని ఇటీవలే అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ కేర్ రేటింగ్ ఏజెన్సీ సైతం స్పష్టం చేసింది. బిగ్ డేటా రంగంలో అత్యంత కీలకమైనవి అంకెలు, గణాంకాల విశ్లేషణ. అందుకే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్లో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు సైతం కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. ఎందుకంటే వీరికి ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అకడమిక్ స్థాయిలోనే డేటా అనాలిసిస్, డేటా మేనేజ్మెంట్ తదితర అంశాల్లో నైపుణ్యం లభిస్తుందనే అభిప్రాయం. అమెరికా తర్వాత స్థానం భారత్దే బిగ్ డేటా అనాలిసిస్, మేనేజ్మెంట్ పరంగా అమెరికా తర్వాత భారత్ నిలుస్తోంది. 2016లో బిగ్ డేటా నిర్వహణకు భారత సంస్థలు వెచ్చించే మొత్తం 46 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అదే విధంగా 2019 నాటికి బిగ్ డేటా మార్కెట్ విలువ 60 నుంచి 65 బిలియన్ డాలర్ల మేరకు చేరనుంది. బిగ్ డేటా మార్కెట్ పరంగా ప్రపంచంలో భారత్ రెండో స్థానంలో ఉంది. అంతే స్థాయిలో నిపుణులైన మానవ వనరుల అవసరం కూడా శరవేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా స్టార్టప్ సంస్థలు, ఇ-కామర్స్ కంపెనీలు, సాఫ్ట్వేర్ సర్వీసెస్ సంస్థలు సైతం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో భాగంగా తమ సేవలను ఆటోమేషన్లోకి మార్చడం వంటి కారణాలతో బిగ్ డేటా నిపుణుల అవసరం ఎంట్రీ లెవల్ నుంచి టాప్ లెవల్ వరకు లక్షల్లోనే ఉంది. రాండ్ స్టాండ్ ఇండియా నివేదిక ప్రకారం రానున్న రెండేళ్లలో ఐటీ నిపుణుల కంటే 50 శాతం అధికంగా బిగ్ డేటా అనలిటిక్స్ నిపుణుల అవసరం ఏర్పడనుంది. 2018 నాటికి దాదాపు 1.8 లక్షల ఉద్యోగావకాశాలు ఈ విభాగంలో పలు హోదాల్లో లభించనున్నాయి. ప్రత్యేక కోర్సులు బిగ్ డేటా విభాగంలో రాణించడానికి ప్రాథమికంగా మ్యాథ్స్, సైన్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ నేపథ్యం అవసరమైనప్పటికీ ఈ విభాగంలో మరింత మెరుగైన నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి ప్రత్యేక కోర్సులు సైతం ఆవిష్కృతమవుతున్నాయి. ముఖ్యంగా స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్ స్ట్రక్చర్డ్ పేరిట ఉండే డేటా విశ్లేషణలో భాగంగా ఈ ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. వీటి కోసం ప్రత్యేక కోర్సులు రూపొందుతున్నాయి. అవి.. హడూప్ టెక్నాలజీ, జావా, పైథాన్, అ, రూబీ డెవలపర్. యూనివర్సిటీల స్థాయిలోనూ ప్రత్యేక సబ్జెక్ట్లుగా ప్రస్తుతం బిగ్డేటాకు సంబంధించి నిపుణుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకున్న యూనివర్సిటీలు ఇటీవల కాలంలో బీటెక్, ఇతర సైన్స్, మ్యాథ్స్ సంబంధిత డిగ్రీల్లో బిగ్ డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్మెంట్ కోర్సులను ప్రత్యేక సబ్జెక్ట్లుగా రూపొందిస్తున్నాయి. జేఎన్టీయూ-హైదరాబాద్, అనంతపురంలలో డేటా అనలిటిక్స్ను కోర్సులో భాగంగా చేర్చాయి. ఐఐఎం, ఇతర జాతీయ స్థాయిలోని ఉన్నత విద్యా సంస్థల్లో బిగ్ డేటా అనలిటిక్స్కు సంబంధించి ప్రత్యేక కోర్సుల రూపకల్పన జరిగింది. ఐఎస్బీ-హైదరాబాద్: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఐఐఎం-లక్నో: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఐఐఎం-బెంగళూరు: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఎన్ఎంఐఎంఎస్: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ పలు ఐఐటీలు సైతం పీజీ స్థాయిలో డేటా సైన్స్ పేరుతో ప్రత్యేకంగా ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. లభించే హోదాలు డేటా సైంటిస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ డేటా ఇంజనీర్ స్టాటిస్టిషియన్ గ్రిడ్ కంప్యూటింగ్ ఇంజనీర్స్ వేతనాలు.. ఆకర్షణీయం బిగ్ డేటా ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో నైపుణ్యాలు ఉన్న వారికి, కొలువులను సొంతం చేసుకున్న వారికి వేతనాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఎంట్రీ లెవల్లో కనీసం తొమ్మిది లక్షల రూపాయల వేతనం ఖాయం. తర్వాత అనుభవం, పనితీరు ప్రాతిపదికగా ఈ మొత్తం రూ.25 లక్షల నుంచి ముప్పై లక్షలకు చేరుకునే అవకాశాలు ఖాయం. ఈ స్కిల్స్మరింత మెరుగ్గా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ క్వాంటిటేటివ్ రీజనింగ్ ఎస్పీఎస్ఎస్, ఎస్ఏఎస్పోగ్రామింగ్ లాంగ్వేజెస్ (జావా, సి, సి++) అత్యంత ఆకర్షణీయంగా, శరవేగంగా వృద్ధి చెందుతున్న బిగ్ డేటా విభాగంలో కెరీర్ అన్వేషణకు ఇదే సరైన సమయం. రానున్న రెండేళ్లలో దేశంలో బిగ్ డేటా నిపుణుల అవసరం మరింత పెరగనుంది. ప్రస్తుతం ఆయా కోర్సుల చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు ఈ దిశగా దృష్టి పెట్టి ఇందులో హడూప్, పైథాన్, రూబీ తదితర సంస్థలు అందిస్తున్న షార్ట్టర్మ్ కోర్సులను పూర్తి చేస్తే ఉద్యోగ సాధనలో ముందంజలో నిలవొచ్చు. ఔత్సాహికులకు ఇచ్చే సలహా ఏంటంటే కేవలం క్రేజ్తో ఈ విభాగంలో అడుగుపెట్టాలనుకునే దృక్పథం సరికాదు. ఆసక్తితోనే ఇందులో ప్రవేశించాలి. ఎందుకంటే ప్రస్తుతం బిగ్ డేటా విభాగంలోని సిబ్బంది ఇచ్చే సమాచారంపైనే సంస్థలు తమ కార్యకలాపాల దిశగా మార్పు, చేర్పులకు శ్రీకారం చుడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అపారమైన డేటాను ఓపిగ్గా విశ్లేషించే నైపుణ్యం, సహనం వంటివి ఉంటేనే ఈ రంగంలో రాణించగలరు. - ప్రొఫెసర్ గీత, సీఎస్ఈ, బిట్స్ పిలానీ - హైదరాబాద్ క్యాంపస్ పూర్తి స్థాయి కోర్సులో మరింత ఉన్నతంగా బిగ్ డేటాలో కెరీర్ కోరుకునే అభ్యర్థులు పూర్తి స్థాయి కోర్సుల దిశగా దృష్టి సారిస్తే బాగుంటుంది. ఇప్పటికే పలు ప్రముఖ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు ఎంటెక్ స్థాయిలో డేటా మేనేజ్మెంట్, డేటా సైన్స్ వంటి పేర్లతో ప్రోగ్రామ్లను అందిస్తున్నాయి. బిగ్ డేటా రంగంలో నిపుణుల అవసరం దీర్ఘ కాలంలోనూ పెరగనుంది. అందువల్ల విద్యార్థులు పూర్తి స్థాయి కోర్సులు అభ్యసిస్తే మరిన్ని నైపుణ్యాలు లభించి మరింత మెరుగైన కెరీర్ను అందుకునే అవకాశం లభిస్తుంది. - ప్రొఫెసర్ కృష్ణమోహన్, సీఎస్ఈ-ఐఐటీ హైదరాబాద్ -
గ్రూప్-2 పేపర్-3 గ్రాండ్ టెస్ట్
మార్కులు: 150 సమయం: 2గం॥30 ని॥ 1. మన దేశంలో జాతీయాదాయాన్ని మొదట శాస్త్రీయంగా లెక్కించినవారు? 1) దాదాభాయ్ నౌరోజీ 2) వి.కె.ఆర్.వి. రావు 3) మహలనోబిస్ 4) షిర్రాస్ 2. 2014-15లో స్థిర ధరల్లో (2011-12) జీడీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా ఎంత? 1) 16.7 శాతం 2) 17.6 శాతం 3) 18.7 శాతం 4) 19.6 శాతం 3. ఏ కాలంలో భారత్లో తలసరి ఆదాయం వృద్ధి ఎక్కువగా ఉంది? 1) 1960-61 నుంచి 1970-71 2) 1970-71 నుంచి 1980-81 3) 1990-91 నుంచి 2000-01 4) 2004-05 నుంచి 2010-11 4. 2014-15లో ప్రస్తుత ధరల్లో నికర జాతీయాదాయం ఎంత? 1) రూ.112,17,079 కోట్లు 2) రూ.113,37,085 కోట్లు 3) రూ.114,18,079 కోట్లు 4) రూ.116,17,011 కోట్లు 5. వాస్తవ జాతీయాదాయంగా దేన్ని పరిగణిస్తారు? 1) స్థూల జాతీయోత్పత్తి 2) ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం 3) నికర జాతీయోత్పత్తి 4) నికర దేశీయోత్పత్తి 6. ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’తో సంబంధం ఉన్న వ్యక్తి? 1) రాజా చెల్లయ్య 2) కాల్డార్ 3) గౌతమ్ మాథూర్ 4) ప్రొ. రాజ్కృష్ణ 7. ఎవరి జన్మదినాన్ని మన దేశ జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకుంటున్నాం? 1) మహలనోబిస్ 2) వి.కె.ఆర్.వి. రావు 3) దాదాభాయ్ నౌరోజీ 4) సి. రంగరాజన్ 8. కింది వాటిలో కార్లమార్క్సతో సంబంధం ఉన్నవి? ఎ) మిగులు విలువ బి) శ్రమ దోపిడి సి) ఆర్గానిక్ కాంపోజిషన్ ఆఫ్ కాపిటల్ సి) నవ కల్పనలు 1) ఎ, బి 2) ఎ, సి, డి 3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి 9. విస్తరణ ప్రభావాల (ఞట్ఛ్చఛీ ఉజజ్ఛఛ్టిట)ను తెలియజేసిన ఆర్థిక వేత్త? 1) గున్నార్ మిర్థాల్ 2) షుంపీటర్ 3) హరడ్-డోమర్ 4) రాగ్నార్ నర్క్స 10. ఏ కోవకు చెందిన దేశాలను రెండో ప్రపంచ దేశాలుగా పేర్కొంటారు? 1) సామ్యవాద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు 2) పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు 3) అంతర్జాతీయంగా రుణాల ఊబిలో ఉన్న దేశాలు 4) రాజరిక వ్యవస్థలున్న దేశాలు 11. 2013-14లో స్థూల దేశీయ పొదుపులో ప్రభుత్వ రంగ వాటా? 1) జీడీపీలో 2% 2) జీడీపీలో 2.5% 3) జీడీపీలో 1.5% 4) జీడీపీలో 1% 12. మూలధనాన్ని, ఎంపిక చేసిన రంగాల్లో పెట్టుబడులుగా పెట్టాలనేది ఏ రకమైన వృద్ధి వ్యూహం? 1) శ్రమ సాంద్రత వ్యూహం 2) సంతులిత వృద్ధి వ్యూహం 3) అసంతులిత వృద్ధి వ్యూహం 4) మూలధన సాంద్రత వృద్ధి వ్యూహం 13. కింది వాటిలో భిన్నమైంది? 1) భారతీయ పారిశ్రామికాభివృద్ధి బ్యాంక్ 2) సహకార బ్యాంకులు 3) వ్యవసాయ పరోక్ష సహాయ సంస్థ 4) నాబార్డ 14. {పస్తుతం మన దేశానికి అధికంగా గ్రాంట్ ఇస్తున్న దేశం? 1) జపాన్ 2) జర్మనీ 3) ఇంగ్లండ్ 4) అమెరికా 15. ప్రాంతాల్లో పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు నూతన ప్రాతిపదిక రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది? 1) సురేష్ టెండూల్కర్ 2) ఎన్.సి. సక్సేనా 3) రంగరాజన్ 4) కేల్కర్ 16. పట్టణ ప్రాంతాల్లో పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు నూతన ప్రాతిపదిక రూపొందించడానికి ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది? 1) రంగరాజన్ 2) ఎస్.ఆర్. హసీమ్ 3) కేల్కర్ 4) వై.వి. రెడ్డి 17. మన దేశంలో అంత్యోదయ అన్నయోజన కార్యక్రమం ప్రతిపాదనకు ఏ భావన మూలం? 1) ఆర్థిక అసమానతలను తొలగించడం 2) అతిపేదవారిని ఆదుకోవడం 3) భూపంపిణీలో అసమానతలను తొలగించడం 4) ఆర్థిక శక్తి కేంద్రీకరణను తగ్గించడం 18. 14వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా? 1) 12% 2) 22% 3) 32% 4) 42% 19. మన దేశంలో సహకార ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం? 1) 1900 2) 1902 3) 1904 4) 1906 20. 2011 లెక్కల ప్రకారం భారత్లో ఆయుఃప్రమాణం ఎంత? 1) 64.1 సం॥ 2) 65.1 సం॥ 3) 66.1 సం॥ 4) 67.1 సం॥ 21. 1956 (రెండో) పారిశ్రామిక విధాన తీర్మానంలో ‘బి’ జాబితాలో ఉన్న పరిశ్రమలు ఎన్ని? 1) 15 2) 16 3) 17 4) 12 22. కింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది? 1) వినోదం పన్ను 2) ఆదాయపు పన్ను 3) సంపద పన్ను 4) ఎస్టేట్ సుంకం 23. మన దేశంలో స్టాక్ ఎక్స్ఛేంజ్లను నియంత్రించే సంస్థ? 1) రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2) సెబీ 3) ఆర్థిక మంత్రిత్వ శాఖ 4) నీతి ఆయోగ్ 24. ‘ప్లాన్డ ఎకానమీ ఫర్ ఇండియా’ అనే గ్రంథం రాసినవారు? 1) మహలనోబిస్ 2) మోక్షగుండం విశ్వేశ్వరయ్య 3) జాన్ మతాయ్ 4) దాదాభాయ్ నౌరోజీ 25. సూక్ష్మవిత్తం ప్రాతిపదిక ఏది? 1) పేదవారితో బ్యాంకింగ్ 2) రుణ వ్యయం తగ్గించడం 3) రుణాన్ని సమర్థంగా వసూలు చేయడం 4) పైవన్నీ 26. 1970లో ‘ఆపరేషన్ ఫ్లడ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏది? 1) నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ 2) నీటిపారుదల మంత్రిత్వ శాఖ 3) వ్యవసాయ మంత్రిత్వ శాఖ 4) ప్లానింగ్ కమిషన్ 27. ‘భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఒక అభివృద్ధి కారకం’ అన్నదెవరు? 1) ఆడం స్మిత్ 2) ఎడ్విన్ కెనాన్ 3) మార్షల్ 4) టి.ఆర్. మాల్థస్ 28. సరైన జత కానిది? 1) పసుపు విప్లవం - పసుపు 2) నీలి విప్లవం - చేపలు 3) శ్వేత విప్లవం - పాలు 4) సిల్వర్ విప్లవం - గుడ్లు 29. 2016-17లో భారత ఆర్థిక వృద్ధి రేటును ఆర్బీఐ ఎంతగా అంచనా వేసింది? 1) 7.1% 2) 7.2% 3) 7.6% 4) 7.8% 30. శ్వేత విప్లవ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? 1) స్వామినాథన్ 2) నార్మన్ బోర్లాగ్ 3) వర్గీస్ కురియన్ 4) హరిహరన్ 31. ఏ ప్రణాళికను ‘ప్లాన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రాన్సపోర్ట’ అంటారు? 1) 1వ 2) 2వ 3) 3వ 4) 4వ 32. కింది వాటిని జతపర్చండి? పెరంబూర్ జీజీ) సింద్రీ విశాఖపట్నం జీఠి) బొకారో హిందుస్థాన్ షిప్ యార్డ ఇనుము - ఉక్కు కర్మాగారం రైలుపెట్టెల కర్మాగారం ఎరువుల కర్మాగారం 1) i-b, ii-c, iii-d, iv-a 2) i-c, ii-d, iii-a, iv-b 3) i-d, ii-c, iii-b, iv-a 4) i-a, ii-b, iii-c, iv-d 33. కింది వాటిలో ఆర్థికాభివృద్ధిలో భాగం కాని అంశం? 1) సంకుచిత, పరిమాణాత్మక భావన 2) అభివృద్ధికి తోడ్పడే నిర్మాణాత్మక మార్పులు 3) మార్పులతో కూడిన వృద్ధి 4) సంస్థాగత, సాంకేతిక మార్పులు 34. కింది వాటిని జతపర్చండి? రెండో ప్రణాళిక నాలుగో ప్రణాళిక ఆరో ప్రణాళిక పదో ప్రణాళిక a 2002-07 b1980-85 c 1969-74 d 1956-61 1) i-b, ii-c, iii-d, iv-a 2) i-c, ii-d, iii-a, iv-b 3) i-d, ii-c, iii-b, iv-a 4) i-a, ii-b, iii-c, iv-d 35. హరిత విప్లవంతో సంబంధం లేనిది? 1) పనికి ఆహార పథకం 2) మెక్సికో గోధుమలు 3) మేలు రకమైన వంగడాలు 4) నార్మన్ బోర్లాగ్ 36. కింది వాటిలో ఒక దేశంలో మూలధన కల్పనకు సంబంధించి మూడు దశలేవి? ఎ) వాస్తవిక స్వదేశీ పొదుపు కల్పన బి) పొదుపు సమీకరణ సి) సమీకరించిన పొదుపును ఉత్పాదక పెట్టుబడిగా మార్చడం డి) సాంకేతిక పరిజ్ఞానం 1) ఎ, సి, డి 2) బి, సి, డి 3) ఎ, బి, డి 4) ఎ, బి, సి 37. దేశంలో నల్లధనం వల్ల కలిగే దుష్ఫలితాలు? ఎ) అధిక ద్రవ్యోల్బణం బి) ఆర్థిక అసమానతలు తగ్గడం సి) ఆర్థిక స్థోమత కేంద్రీకరణ డి) అనుత్పాదక వ్యయం పెరగడం 1) ఎ, బి 2) ఎ, బి, డి 3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి 38. కింది వాటిని జతపర్చండి? జీ) రూర్కెలా జీజీ) భిలాయ్ జీజీజీ) దుర్గాపూర్ జీఠి) బొకారో పశ్చిమబెంగాల్ జార్ఖండ్ ఒడిశా ఛత్తీస్గఢ్ 1) i-b, ii-c, iii-d, iv-a 2) i-c, ii-d, iii-a, iv-b 3) i-d, ii-c, iii-b, iv-a 4) i-a, ii-b, iii-c, iv-d 39. ‘ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఒకటి రెండు కాదు.. 40 కోట్లు’ అని 1950లో జనాభాను ఉద్దేశించి అన్నవారు? 1) జయప్రకాశ్ నారాయణ్ 2) గుల్జారీలాల్ నందా 3) బాబూ రాజేంద్రప్రసాద్ 4) జవహర్లాల్ నెహ్రూ 40. రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? 1) మౌంట్బాటన్ 2) కారన్వాలీస్ 3) విలియం బెంటిక్ 4) థామస్ మన్రో 41. కింది వాటిలో సరైనవి? ఎ) 2వ ప్రణాళికలో రవాణా, సమాచార రంగాలకు అధిక కేటాయింపులు చేశారు. బి) 5వ ప్రణాళికలో రవాణా, సమాచార రంగాలకు తక్కువ కేటాయింపులు చేశారు. సి) 9వ ప్రణాళికలో రవాణా, సమాచార రంగాలకు అధిక కేటాయింపులు చేశారు. 1) ఎ, బి 2) ఎ, బి, సి 3) ఎ, సి 4) బి, సి 42. కింది వాటిలో చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి సరైనవి? ఎ) రుణాలు అందించడం కోసం ఎస్ఐడీబీఐని ఏర్పర్చారు బి) పరపతి పర్యవేక్షణకు 1991లో నాయక్ కమిటీని నియమించారు సి) పెట్టుబడుల పర్యవేక్షణకు అబిద్ హుస్సేన్ కమిటీ సూచించింది 1) ఎ, సి 2) ఎ, బి, సి 3) బి, సి 4) ఎ, బి 43. కింది వాటిలో సరైనవి? ఎ) మొదటి ప్రణాళికలో వ్యవసాయానికి అధిక కేటాయింపులు చేశారు. బి) రెండో ప్రణాళికలో రవాణా, సమాచార రంగాలకు అధిక కేటాయింపులు చేశారు. సి) ఐదో ప్రణాళికలో పరిశ్రమలకు అధిక కేటాయింపులు చేశారు. 1) ఎ 2) ఎ, బి 3) ఎ, బి, సి 4) బి, సి 44. కింది వాటిలో సరికానిది? ఎ) 3వ ప్రణాళికలో ప్రాధాన్య అంశం స్వావలంబన, స్వయం సమృద్ధి బి) 4వ ప్రణాళికలో ప్రాధాన్య అంశం పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన సి) 11వ ప్రణాళికలో ప్రాధాన్య అంశం సమ్మిళిత, వేగవంతమైన ఆర్థికాభివృద్ధి 1) ఎ, బి 2) సి 3) బి 4) సి, డి 45. కింది వాటిలో 8వ ప్రణాళికతో సంబంధం లేని అంశాలు? ఎ) ఈ ప్రణాళికలో ప్రైవేట్ పెట్టుబడులు ప్రభుత్వం కంటే పెరిగాయి. బి) దీన్ని ఆదేశాత్మక ప్రణాళికగా రూపొందించారు. సి) ఈ ప్రణాళికలో విదేశీ మారక నిల్వలు పెంచడానికి కృషి చేశారు. డి) ఈ ప్రణాళికలో రూపాయి మూల్య హీనీకరణ చేశారు. 1) ఎ, బి, సి 2) బి, డి 3) ఎ, డి 4) డి 46. 6వ ప్రణాళికకు సంబంధించిన అంశాలు? ఎ) ప్రణాళికకు ప్రభుత్వ అంచనా వ్యయం రూ.97,500 కోట్లు బి) ప్రణాళిక వాస్తవిక వ్యయం రూ.1,09,292 కోట్లు సి) ప్రణాళిక ప్రైవేట్ రంగ వ్యయం రూ.74,710 కోట్లు 1) ఎ, బి 2) ఎ, బి, సి 3) బి, సి 4) సి 47. 9వ ప్రణాళికకు సంబంధించిన అంశాలు? ఎ) సాంఘిక న్యాయంతో కూడిన సత్వర అభివృద్ధి బి) ఈ ప్రణాళిక ప్రైవేట్ పెట్టుబడులను పెంచింది సి) ఈ ప్రణాళిక కాలంలో ప్రైవేట్ బీమా సంస్థల స్థాపనకు అవకాశం ఇచ్చారు డి) ఈ ప్రణాళికలో, ముందటి ప్రణాళికల కంటే తలసరి ఆదాయం పెరిగింది 1) ఎ, బి 2) ఎ, బి, సి 3) బి, సి, డి 4) పైవన్నీ 48. 11వ ప్రణాళికతో సంబంధం లేని అంశం? ఎ) ఈ ప్రణాళిక ప్రారంభంలో వృద్ధిరేటు లక్ష్యం 9% బి) ఈ ప్రణాళిక సమీక్షించదగిన ప్రత్యేక లక్ష్యాలు 27 సి) ఈ ప్రణాళిక, శక్తికి అధిక కేటాయింపులు చేసింది డి) ఈ ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు 1) ఎ, బి 2) బి 3) సి 4) బి 49. కింది వాటిలో 3వ ప్రణాళికతో సంబంధం లేని అంశాలు? ఎ) రైతుల కోసం ఏఆర్డీసీని ఏర్పర్చారు బి) వ్యవసాయ అభివృద్ధికి నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సి) రూపాయి మూల్యహీనీకరణ చేశారు డి) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు 1) ఎ 2) సి 3) సి, డి 4) బి 50. దేశంలో ఎన్ని ప్రణాళికల వరకు ట్రికిల్ డౌన్ సిద్ధాంతాన్ని అనుసరించారు? 1) 1, 2 ప్రణాళికలు 2) 1, 2, 3 ప్రణాళికలు 3) 1, 2, 3, 4 ప్రణాళికలు 4) 1, 2, 3, 4, 5 ప్రణాళికలు 51. జతపర్చండి? {పాజెక్ట్ జీ) జూరాల - పాకాల జీజీ) దేవాదుల జీజీజీ) ఎల్లంపల్లి జీఠి) శ్రీరాంసాగర్ లబ్ధిపొందే జిల్లాలు నల్లగొండ, వరంగల్, ఖమ్మం నల్లగొండ, వరంగల్ కరీంనగర్, ఆదిలాబాద్ ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం 1) i-a, ii-b, iii-c, iv-d 2) i-a, ii-c, iii-b, iv-d 3) i-a, ii-c, iii-d, iv-b 4) i-a, ii-d, iii-b, iv-c 52. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి? ఎ) 1 నుంచి 2 ఎకరాల భూ కమతాన్ని చిన్న కమతంగా పరిగణిస్తారు బి) 4 నుంచి 10 ఎకరాల భూ కమతాన్ని మధ్యతరహా కమతంగా పరిగణిస్తారు 1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీ కాదు 53. జతపర్చండి? కడెం దిగువ మానేరు నక్కలగండి నిజాంసాగర్ ఆదిలాబాద్ ఛ) కరీంనగర్ నల్లగొండ నిజామాబాద్ 1) i-a, ii-b, iii-c, iv-d 2) i-a, ii-c, iii-b, iv-d 3) i-a, ii-c, iii-d, iv-b 4) i-a, ii-d, iii-b, iv-c 54. సరైన దాన్ని గుర్తించండి? ఎ) చెరువులు అత్యధికంగా ఉన్న జిల్లా వరంగల్ కాగా, అత్యల్పంగా ఉన్న జిల్లా ఆదిలాబాద్ బి) కాలువల ద్వారా అత్యధికంగా నల్లగొండ జిల్లా లబ్ధి పొందుతుండగా, అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా లబ్ధి పొందుతోంది. 1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీ కాదు 55. ఖీగిఅఔఖీఅ అంటే? 1) తెలంగాణ వెదర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 2) తెలంగాణ వెల్త్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 3) తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ టెంపరేచర్ యాక్ట్ 4) తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 56. కింది వాటిలో సరి కానివి? ఎ) ప్రస్తుతం దేశంలో, తెలంగాణ రాష్ర్టంలో అత్యధికంగా గ్రామీణ పరపతిని అందించేవి వాణిజ్య బ్యాంకులు బి) దేశంలో గ్రామీణ పరపతిని అందించడంలో ఆర్ఆర్బీలు చివరి స్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ర్టం రెండో స్థానంలో ఉంది 1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీ కాదు 57. కింది వాటిలో మల్చింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు? ఎ) నేల కోతను అరికడుతుంది బి) నీటి సంరక్షణకు తోడ్పడుతుంది సి) మెట్ట వ్యవసాయ ప్రాంతంలో ప్రయోజనం అధికంగా ఉంటుంది డి) ప్రవాహ నీటిలో ఒండ్రు మట్టిని, మురికిని తగ్గిస్తుంది 1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి 3) ఎ, డి, సి 4) బి, సి 58. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై లక్షిత ప్రజానీకానికి అవగాహన కల్పించడం కోసం 2015లో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం? 1) మన తెలంగాణ - మన వ్యవసాయం 2) మన వ్యవసాయం - మన తెలంగాణ 3) మన తెలంగాణ - మన రైతు 4) మన ఊరు - మన వ్యవసాయం 59. 2014-15లో ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ర్ట తలసరి ఆదాయం? 1) రూ.1,27,112 2) రూ.1,31,185 3) రూ.1,29,182 4) రూ.1,35,140 60. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల్లో మన రాష్ట్రానికి లభించిన వాటా? 1) 1.44% 2) 2.44% 3) 2.95% 4) 3.25% 61. జతపర్చండి? జీ) పాయిగా జమియత్ జీజీ) జాత్ జీజీజీ) మశ్రుతి జీఠి) ఆల్తమ్గా ్చ) బేషరత్ భూములు ఛ) అశ్విక దళాల పోషణార్థం ఇచ్చే భూములు ఛి) వంశపారంపర్య భూములు ఛీ) మత, సైనిక, పౌర సంబంధ సేవలకు గుర్తింపుగా ఇచ్చే భూములు 1) i-b, ii-a, iii-d, iv-c 2) i-b, ii-c, iii-a, iv-d 3) i-d, ii-a, iii-b, iv-c 4) i-b, ii-a, iii-d, iv-c 62. నిజాం సొంత ఖర్చుల కోసం ఉద్దేశించిన భూములను ఏమని పిలిచేవారు? 1) ఖల్సా భూములు 2) మథర్ మాష్ 3) ఆల్తమ్గా 4) సర్ఫ-ఎ-ఖాస్ 63. భూదాన ఉద్యమానికి సంబంధించి సరైనవి? ఎ) భూదాన ఉద్యమాన్ని వినోబా భావే ప్రారంభించారు. బి) భూదాన ఉద్యమం నల్లగొండ జిల్లా పోచంపల్లిలో ప్రారంభమైంది సి) భూదాన ఉద్యమం, కమతాల గరిష్ట పరిమితిని నిర్ణయించింది డి) భూదాన ఉద్యమం 1952లో ప్రారంభమైంది 1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి 3) ఎ, బి, డి 4) బి, సి, డి 64. భూ సంస్కరణల తాత్విక నేపథ్యం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో కన్పిస్తుంది? 1) ఆర్టికల్ 39 2) ఆర్టికల్ 39 (బి) 3) ఆర్టికల్ 39 (సి) 4) ఆర్టికల్ 39 (ఎ) 65. కింది వాటిలో సరైనవి? ఎ) నిజాం తన ముద్ర ద్వారా ఇచ్చే జాగీరు భూములను ఆల్తమ్గాగా పేర్కొనేవారు బి) నిజాం ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా శిస్తు వసూలు చేసే భూములను దివాని భూములు అనేవారు సి) ఏ హక్కులు లేని కౌలుదారులను షక్మీదార్ అనేవారు డి) చట్టపరమైన హక్కులు కలిగి భూమిని సేద్యం చేసే వారిని పట్టాదార్ అనేవారు 1) ఎ, బి, సి 2) బి, సి, డి 3) ఎ, బి, డి 4) ఎ, సి, డి 66. హైదరాబాద్ రాష్ర్టంలో భూ సంస్కరణల్లో భాగంగా మొదట ఏ రకమైన భూములను రైత్వారీ భూములుగా ప్రకటించారు? 1) ఖల్సా దివాని 2) సర్ఫ-ఎ-ఖాస్ 3) జమీందారీ 4) జాగీర్దారీ 67. కృష్ణా నదిలో లభ్యమయ్యే నికర జలాలను ఎన్ని టీఎంసీలుగా బచావత్ ట్రిబ్యునల్ నిర్ధారించింది? 1) 1900 టీఎంసీలు 2) 1960 టీఎంసీలు 3) 2060 టీఎంసీలు 4) 2100 టీఎంసీలు 68. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ర్ట జనాభాకు సంబంధించి సరికానిది? 1) ప్రతి 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలు ఉన్నారు. 2) రాష్ర్ట జనాభా 3,50,03,674 3) పట్టణ జనాభా 28.88% 4) భారతదేశంలోని పెద్ద రాష్ట్రాల్లో 12వ స్థానం 69. కింది వాటిలో సరైంది? ఎ) జమీందారీ పద్ధతిని లార్డ కారన్ వాలీస్ ప్రవేశపెట్టారు బి) మహల్వారీ విధానంలో రైతు ప్రభుత్వానికి నేరుగా శిస్తు చెల్లిస్తాడు సి) రైత్వారీ పద్ధతిని థామస్ మన్రో ప్రవేశపెట్టారు డి) రైత్వారీ పద్ధతిలో, రైతు ప్రభుత్వానికి నేరుగా శిస్తు చెల్లిస్తాడు 1) ఎ, సి, డి 2) ఎ, బి, సి 3) ఎ, బి, డి 4) బి, సి, డి 70. కింది వాటిలో సరైంది? ఎ) 2015-16 అంచనాల ప్రకారం 2011-12 స్థిర ధరల్లో తెలంగాణ రాష్ర్ట వృద్ధి రేటు 9.24% బి) తెలంగాణ రాష్ర్ట స్థూల సమకూరిన విలువ ప్రాథమిక రంగ వాటా 17% సి) తెలంగాణ రాష్ర్టంలో గ్రామీణ జనాభా 61.12% డి) తెలంగాణ రాష్ర్టంలో పట్టణ జనాభా 18.88% 1) ఎ, బి, సి 2) బి, సి, డి 3) ఎ, బి, డి 4) ఎ, సి, డి 71. మన రాష్ర్టంలో అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న జిల్లా? 1) మహబూబ్నగర్ 2) నిజామాబాద్ 3) కరీంనగర్ 4) ఆదిలాబాద్ 72. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానది నికర, మిగులు జలాల కేటాయింపులో సరైంది? 1) మహారాష్ర్ట 585 టీఎంసీలు 2) కర్ణాటక 734 టీఎంసీలు 3) ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీలు 4) పైవన్నీ 73. కుమార్ లలిత్ కమిటీ ప్రకారం తెలంగాణ ప్రాంత రెవెన్యూ మిగులు? 1) 53.93 కోట్లు 2) 63.93 కోట్లు 3) 73.93 కోట్లు 4) 83.93 కోట్లు 74. టి-ప్రైడ్ పథకం దేనికోసం ఉద్దేశించింది? 1) ఐటీ కంపెనీలను ప్రోత్సహించడం 2) విదేశీ కంపెనీలను ప్రోత్సహించడం 3) యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం 4) ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం 75. టి-ఐడియా పథకానికి సంబంధించి సరికానిది? 1) భూమి కొనుగోలు లేదా లీజులపై 100% స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లింపు 2) భూమి ఖరీదులో 25% రాయితీ (రూ.10 లక్షలకు పరిమితి) 3) విద్యుత్ ఖర్చుల్లో 5 ఏళ్ల వరకు యూనిట్కు రూ.1 చొప్పున రాయితీ 4) ఉత్పత్తులను 100% ప్రభుత్వం కొనుగోలు చేయడం 76. జెనోమ్ వ్యాలీ ప్రాజెక్ట్ సముదాయం దేని అభివృద్ధికి సంబంధించింది? 1) బయోటెక్నాలజీ 2) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3) పారిశ్రామికోత్పత్తి 4) కమ్యూనికేషన్ 77. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్ట్ స్థాపన వ్యయం ఎంతగా అంచనా వేశారు? 1) 10,200 కోట్లు 2) 13,064 కోట్లు 3) 13,700 కోట్లు 4) 14,600 కోట్లు 78. తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి ఏ జిల్లాలో ఎక్కువ? 1) ఖమ్మం 2) కరీంనగర్ 3) ఆదిలాబాద్ 4) వరంగల్ 79. గోదావరి పుష్కరాలు 2015లో ఎప్పుడు జరిగాయి? 1) జూలై 14 నుంచి 25 వరకు 2) జూలై 16 నుంచి 27 వరకు 3) జూలై 18 నుంచి 29 వరకు 4) జూలై 20 నుంచి 31 వరకు 80. తెలంగాణలో అతి తక్కువ షెడ్యూల్డ్ బ్యాంకులున్న జిల్లా? 1) నిజామాబాద్ 2) ఖమ్మం 3) ఆదిలాబాద్ 4) మెదక్ 81. 2011-12లో మానవాభివృద్ధి సూచికలో భారతదేశంలో తెలంగాణ స్థానం? 1) 10 2) 11 3) 12 4) 13 82. 2015-16లో మానవాభివృద్ధి సూచికలో తెలంగాణ రాష్ర్టంలో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా? 1) హైదరాబాద్ 2) రంగారెడ్డి 3) వరంగల్ 4) నిజామాబాద్ 83. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి సరైంది? ఎ) ఈ పథకాన్ని 2014, అక్టోబర్ 2న ప్రారంభించారు బి) అర్హులైన అవివాహిత యువతులకు రూ.51,000 సహాయం అందిస్తారు. సి) ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారి తల్లిదండ్రుల ఆదాయ పరిమితి రూ.4 లక్షలు డి) ఈ పథకాన్ని బీసీ అవివాహిత యువతులకు 2016 ఏప్రిల్ 1 నుంచి వర్తింపజేశారు 1) ఎ, సి, డి 2) ఎ, బి, సి 3) ఎ, బి, డి 4) బి, సి, డి 84. ఆసరా పింఛన్ పథకానికి సంబంధించి నిజం కానిది? ఎ) దీన్ని షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూర్ గ్రామంలో ప్రారంభించారు బి) 2014 నవంబర్ 8న ప్రారంభించారు సి) ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.4,700 కోట్లు ఖర్చు చేస్తుంది డి) ఈ పథకాన్ని మొదటగా హరీశ్రావు ప్రారంభించారు 1) ఎ, సి, డి 2) ఎ, బి, సి 3) ఎ, బి, డి 4) బి, సి, డి 85. కింది అంశాల్లో సరైంది? ఎ) తెలంగాణకు సంబంధించి మొదటి రైలు మార్గం సికింద్రాబాద్ - వాడి బి) సికింద్రాబాద్ - విజయవాడకు రైలు మార్గం 1886లో ఏర్పాటు చేశారు సి) నిజాం స్టేట్ రైల్వేస్ను 1952లో దేశ రైల్వేలో విలీనం చేశారు డి) తెలంగాణకు సంబంధించి మొట్టమొదటి విద్యుత్ రైలు మార్గం - 1962 1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి 3) బి, సి, డి 4) బి, సి 86. టీఎస్టీడీసీ వల్ల ఏవి అభివృద్ధి చెందాయి? ఎ) రవాణా బి) ఆహారోత్పత్తులు సి) సమాచారం డి) హస్తకళలు 1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి 3) సి, డి 4) ఎ, బి 87. తెలంగాణ ప్రభుత్వం శిల్పారామం లాంటి హస్తకళల ప్రదేశాలను ఏ జిల్లాల్లో విస్తరించాలని భావిస్తోంది? 1) మెదక్ - నల్లగొండ 2) మెదక్ - రంగారెడ్డి 3) మెదక్ - వరంగల్ 4) మెదక్ - ఖమ్మం 88. కింది ఏ జిల్లాల ఆదాయంలో సగానికంటే ఎక్కువ వాటా సేవా రంగం నుంచి లభిస్తోంది? ఎ) హైదరాబాద్ బి) రంగారెడ్డి సి) వరంగల్ డి) నిజామాబాద్ 1) ఎ, బి, 2) ఎ, బి, సి 3) సి, డి 4) ఎ, బి, సి, డి 89. తెలంగాణ సేవా రంగ ఉప రంగాల్లో అధిక వాటా కలిగిన రెండో ఉప రంగం? 1) రియల్ ఎస్టేట్, బిజినెస్ 2) ప్రజా పరిపాలన, రక్షణ రంగం 3) బ్యాంకింగ్, బీమా రంగం 4) వర్తకం, హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం 90. దేశంలో పి.పి.పి. పద్ధతిలో నిర్మించిన మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు? 1) శంషాబాద్ 2) కొచ్చిన్ 3) ముంబై 4) చెన్నై 91. వరంగల్ - మమ్నూరు ఎయిర్పోర్టకు సంబంధించి సరైంది? ఎ) దీన్ని 1875 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు బి) దీని రన్వే 6.6 కి.మీ. సి) 1981లో దీని సేవలు రద్దయ్యాయి డి) అప్పట్లో ఈ విమానాశ్రయం దేశంలో అతిపెద్దది 1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి 3) బి, సి, డి 4) ఎ, సి, డి 92. 2014-15 అంచనాల ప్రకారం తెలంగాణలో రహదారులకు సంబంధించి సరి కానిది? 1) జాతీయ రహదారులు - 2592 కి.మీ. 2) రాష్ర్ట రహదారులు - 3152 కి.మీ 3) జాతీయ రహదారులు 2 లైన్స పొడవు-964 కి.మీ. 4) పంచాయతీరాజ్ రోడ్ల పొడవు - 64,046 కి.మీ 93. 2014లో విదేశీ పర్యాటకులు అసలు సందర్శించని జిల్లాలు? ఎ) నల్లగొండ బి) మెదక్ సి) కరీంనగర్ డి) ఖమ్మం 1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి 3) సి, డి 4) బి, సి, డి 94. కింది వాటిలో సరికానిది (పి.పి.పి. రోడ్ల నిర్మాణం పరంగా)? 1) హైదరాబాద్ - బీజాపూర్ - 36.4 కి.మీ. 2) సూర్యాపేట - జనగాం - 84.4 కి.మీ 3) మహబూబ్నగర్ - నల్లగొండ - 163.2 కి.మీ 4) జనగాం - చేర్యాల - దుద్దెడ - 48.4 కి.మీ -
భారత నౌకాదళ ప్రధానాధికారి?
ఎవరి జయంతిని జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటారు? - సర్దార్ వల్లభాయ్ పటేల్ (అక్టోబర్ 31) ఇటీవల ఏ కంపెనీ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించారు? - టాటా గ్రూప్ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) కమిటీకి చైర్మన్? - పట్నా హైకోర్ట మాజీ చీఫ్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆసియాలోకెల్లా అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్ను ఏర్పాటు చేసిన ఆర్యభట్ట రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఫర్ అబ్జర్వేషనల్ సెన్సైస్ (అఖఐఉ) ఎక్కడ ఉంది? - నైనిటాల్, ఉత్తరాఖండ్ నాలుగో అణు భద్రతా సదస్సు 2016, మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో ఎక్కడ జరిగింది? - వాషింగ్టన్ డి.సి, అమెరికా బరాక్ ఒబామా 2016, మార్చిలో క్యూబాలో పర్యటించారు. ఒబామా కంటే ముందు 1928లో క్యూబాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడెవరు? - కాల్విన్ కూలిడ్జ ప్రపంచంలోనే అత్యంత ఆనందమయ దేశంగా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో అగ్రస్థానంలో నిలిచిన దేశం? - డెన్మార్క. భారత్ 118వ స్థానంలో నిలిచింది. జమ్మూకశ్మీర్ రాష్ర్ట తొలి మహిళా ముఖ్యమంత్రి? - మెహబూబా ముఫ్తీ. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు 2016, మేలో ఏబెల్ ప్రైజ్ గెలుచుకున్న బ్రిటిష్ గణితవేత్త? - సర్ ఆండ్రూ వైల్స్ 2016-17 సంవత్సరానికి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నూతన అధ్యక్షుడు? - నౌషద్ ఫోర్బ్స 2016-17కి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) చైర్మన్ ? - సి.పి.గుర్నానీ (టెక్ మహీంద్రా సీఈఓ) 2016 సంవత్సరానికి ఫెమినా మిస్ ఇండియాగా ఎవరు ఎంపికయ్యారు? - ప్రియదర్శినీ ఛటర్జీ ప్రపంచంలోని 50 మంది అత్యుత్తమ నేతలతో రూపొందించిన ఫార్చ్యూన్ జాబితాలో మనదేశం నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక వ్యక్తి? - అరవింద్ కేజ్రీవాల్ (42వ స్థానం దక్కింది). అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు. 2015 సంవత్సరానికి సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? - పద్మ సచ్దేవ్. ఈమె డోగ్రి భాషలో రాసిన ‘చిట్-చెటె’ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. ప్రపంచంలోనే తొలి తెల్ల పులుల సఫారీని 2016, ఏప్రిల్లో ఎక్కడ ప్రారంభించారు? - మధ్యప్రదేశ్లోని ముకుంద్పూర్ జంతు ప్రదర్శనశాలలో 2016, ఏప్రిల్లో మారిటైమ్ ఇండియా సమ్మిట్ను ఎక్కడ నిర్వహించారు? - ముంబై. ఈ సదస్సుకు దక్షిణ కొరియా భాగస్వామ్య దేశంగా వ్యవహరించింది. పనాఘర్ ఎయిర్ బేస్ పేరును అర్జున్ సింగ్ ఎయిర్ఫోర్స స్టేషన్గా మార్చారు. ఇది ఏ రాష్ర్టంలో ఉంది? - పశ్చిమ బెంగాల్ ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ కార్యక్రమాన్ని 2016, ఏప్రిల్ 14న భారత ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడ ప్రారంభించారు? - మహు (మధ్యప్రదేశ్). ఇది బీఆర్ అంబేద్కర్ జన్మస్థలం. 2016, ఏప్రిల్లో భారత్లో పర్యటించిన అబ్దుల్లా యమీన్ ఏ దేశాధ్యక్షుడు? - మాల్దీవులు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారి మయన్మార్ దేశానికి పౌర అధ్యక్షుడిగా ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టారు? - తిన్ క్వా మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ఆంగ్సాన్ సూచీ కోసం సృష్టించిన కొత్త పోస్టు? - స్టేట్ కౌన్సిలర్ 2016, ఏప్రిల్ నుంచి ఏ రాష్ర్టంలో సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి వచ్చింది? - బిహార్ ఆఫ్రికా దేశం చాద్లో అమెరికా రాయబారిగా బరాక్ ఒబామా ఎవరిని నామినేట్ చేశారు? - గీతా పాసి. ఈమె భారత సంతతికి చెందిన మహిళ భారత నౌకాదళ ప్రధానాధికారి? - అడ్మిరల్ సునీల్ లాంబా 2016 సంవత్సరానికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఎవరికి లభించింది? - ‘ద వెజిటేరియన్’ అనే నవలకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్కు దక్కింది. ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ను 2016, మే 1న భారత ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడ ప్రారంభించారు? - బలియా, ఉత్తరప్రదేశ్. రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 5 కోట్ల మంది మహిళలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. రియో ఒలింపిక్స్కు గుడ్విల్ అంబాసిడర్స? - సల్మాన్ఖాన్, అభినవ్ బింద్రా, సచిన్ టెండూల్కర్, ఏ.ఆర్.రెహ్మాన్ 2016, మే7న సాదిక్ఖాన్ ఏ నగర మేయర్గా బాధ్యతలు స్వీకరించారు? - లండన్ 2016, మేలో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)ను తొలిసారి గెలుచుకున్న ఫుట్బాల్ జట్టు? - లీసెస్టర్ సిటీ ‘మంచి దేశం - 2015’ సూచీలో భారత్ స్థానం? - 70. ఈ సూచీని 163 దేశాలతో రూపొందించారు. స్వీడన్ అగ్రస్థానంలో నిలిచింది. వంద మిలియన్ డాలర్ల ప్రైజ్మనీ గెలుచుకున్న తొలి టెన్నిస్ క్రీడాకారుడు? - నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 2016 ఏప్రిల్, మే నెలల్లో ఏ నగరంలో కుంభమేళాను నిర్వహించారు? - ఉజ్జయిని (మధ్యప్రదేశ్) 2015-సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో దేశంలో ప్రథమస్థానంలో నిలిచిన మహిళ? - టీనా దాబి హరీష్ రావత్ ఏ రాష్ర్ట ముఖ్యమంత్రి? - ఉత్తరాఖండ్ దేశంలోని అన్ని అత్యవసర సేవల వినియోగానికి సంబంధించి అందుబాటులోకి రానున్న ఏకైక ఎమర్జెన్సీ నంబర్? - 112 ఫిఫా పరిపాలనా కమిటీ డిప్యూటీ చైర్మన్గా నియమితులైన భారతీయ న్యాయమూర్తి ఎవరు? - జస్టిస్ ముకుల్ ముద్గల్ ఇటీవల భారత్లో పర్యటించిన థాయ్లాండ్ ప్రధాని ? - ప్రయాత్ చాన్ ఓచా ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ (ఐఏఏఫ్) హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు? - యు.ఆర్.రావు (ఇస్రో మాజీ చైర్మన్) కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి ? - పినరయి విజయన్ భారత్లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ పురుషుల టైటిల్ను గెలుచుకున్న జట్టు? - వెస్టిండీస్. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్సలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ను వెస్టిండీస్ ఓడించింది ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్ను ఏ జట్టు కైవసం చేసుకుంది? - వెస్టిండీస్. 2016, ఏప్రిల్ 3న కోల్కతాలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. సెయింట్ లూసియానాలోని బ్యుసేజర్ క్రికెట్ స్టేడియానికి ఏ వెస్టిండీస్ క్రికెటర్ పేరు పెట్టారు? - డారెన్ సామీ బీసీసీఐ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? - రాహుల్ జోహ్రి ఏప్రిల్లో జరిగిన సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్-2016ను ఏ దేశం గెలుచుకుంది? - ఆస్ట్రేలియా. ఫైనల్లో భారత్ను ఓడించింది ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయి? - త్రిపుర భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవిత చరిత్ర పేరు? - ఏస్ ఎగెనెస్ట్ ఆడ్స అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలి స్వతంత్ర చైర్మన్? - శశాంక్ మనోహర్ 2016, జూన్లో నిర్వహించిన కోపా అమెరికా సెంటెనరీ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేత? - చిలీ. ఫైనల్లో అర్జెంటీనాను ఓడించింది. ఈ టోర్నమెంట్ అమెరికాలో జరిగింది. 2016, ఆగస్టులో జరిగిన రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత పతాకధారి ? - అభినవ్ బింద్రా 36వ పురుషుల చాంపియన్స ట్రోఫీ హాకీని 2016, జూన్లో ఎక్కడ నిర్వహించారు? - లండన్ ఫార్ములావన్ విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కుడు? - మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స) ఉబెర్కప్ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ను ఏ దేశం గెలుచుకుంది? - చైనా నీతి ఆయోగ్లోని సామాజిక విభాగానికి సలహాదారుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? - రతన్ వతల్ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్? - అనిల్ కుంబ్లే కేంద్ర ఆర్థిక శాఖ ప్రస్తుత కార్యదర్శి ? - అశోక్ లవాసా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ? - కిరణ్ బేడి యూరోపియన్ యూనియన్లో కొనసాగడంపై ఇటీవల ఏ దేశం రిఫరెండం నిర్వహించింది? - బ్రిటన్ 2016-సియట్ క్రికెట్ అవార్డుల్లో ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ను ఏ మాజీ క్రికెటర్కు అందజేశారు? - దిలీప్ వెంగ్సర్కార్ N. Vijayender Reddy General Awareness Faculty, Hyderabad -
నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్లో 265 పోస్టులు
కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్.. జూనియర్ ఓవర్మ్యాన్ (జేవో), మైనింగ్ సిర్దార్ (ఎంఎస్) ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు 265 (జేవో-197, ఎంఎస్-68) రిజర్వేషన్ల వారీగా జేవో వేకెన్సీ: ఓసీ-100; ఎస్సీ-29; ఎస్టీ-39; ఓబీసీ (నాన్ క్రిమిలేయర్ -ఎన్సీఎల్)-29 రిజర్వేషన్ల వారీగా ఎంఎస్ వేకెన్సీ: ఓసీ-35; ఎస్సీ-10; ఎస్టీ-13; ఓబీసీ (ఎన్సీఎల్)-10 వేతనం: నెలకు రూ.19,035 చెల్లిస్తారు. విద్యార్హత: 1.జేవో: మైనింగ్ ఇంజనీరింగ్లో మూడేళ్ల డిప్లొమా, ఓవర్మ్యాన్స్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్. 2.ఎంఎస్: పదో తరగతి, మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్. వయోపరిమితి: 2016 అక్టోబర్ 19 నాటికి కనీసం 18 ఏళ్లు; గరిష్టం 35 ఏళ్లు (ఓసీలకు), 40 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీలకు), 38 ఏళ్లు (ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు). దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులకు గెజిటెడ్ ఆఫీసర్ అటెస్ట్ చేసిన విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాల నకళ్లను జత చేసి కింది అడ్రస్కు పోస్టులో మాత్రమే పంపాలి. గమనిక: ఒక అభ్యర్థి ఒక పోస్టు(జేఓ/ఎంఎస్)కు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు పరీక్ష: గంటన్నర (90 నిమిషాల) వ్యవధిలో 100 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి.. టెక్నికల్ పార్ట్. రెండు.. జనరల్ పార్ట్. టెక్నికల్ పార్ట్లో 70 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 70 మార్కులు, జనరల్ పార్ట్లో 30 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 30 మార్కులు కేటాయించారు. జనరల్ పార్ట్లో మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ అండ్ రీజనింగ్ స్కిల్స్పై ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో అర్హత సాధించేందుకు ఓసీలు ఒక్కో పార్ట్లో కనీసం 20 శాతం, ఓవరాల్గా 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ(ఎన్సీఎల్)లు ఒక్కో పార్ట్లో కనీసం 20 శాతం, ఓవరాల్గా 40 శాతం మార్కులు పొందాలి. దరఖాస్తు రుసుం: ఓసీ, ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులు నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సింగ్రౌలి పేరిట రూ.500ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మాత్రమే డీడీ తీయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు మినహాయింపు ఇచ్చారు. చిరునామా: జనరల్ మేనేజర్ (పీ/ఎంపీ అండ్ ఆర్), రూమ్ నంబర్-15, పర్సనల్ డిపార్ట్మెంట్, ఎన్సీఎల్ హెడ్ క్వార్టర్స్, సింగ్రౌలీ, మధ్యప్రదేశ్, 486889. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 26 వెబ్సైట్: www.nclcil.in -
ఇండియన్ ఆర్మీ
ఇండియన్ ఆర్మీ.. 125వ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కోర్సులో ప్రవేశాలకుఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ (పురుషులు) నుంచి దరఖాస్తులుఆహ్వానిస్తోంది. విజేతలుగా నిలిచినవారిని ఇండియన్ మిలిటరీ అకాడమీ (డె హ్రాడూన్)లో శిక్షణనిచ్చి ఇండియన్ ఆర్మీలో పర్మనెంట్కమిషన్కు ఎంపిక చేస్తారు. మొత్తం ఖాళీలు: 40 విభాగాలవారీగా ఖాళీలు సివిల్ - 11 మెకానికల్ - 4 ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ - 5 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఇన్ఫోటెక్/ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) - 6 ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/శాటిలైట్ కమ్యూనికేషన్ - 7 ఎలక్ట్రానిక్స్ - 2 ఠి మెట్లర్జికల్ - 2 ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ఇన్స్ట్రుమెంటేషన్ - 2 మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్ - 1 అర్హత భారతీయ పౌరులై ఉండాలి. సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఇన్ఫోటెక్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/శాటిలైట్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్/మెట్లర్జికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ఇన్స్ట్రుమెంటేషన్/మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్ బ్రాంచ్ల్లో బీటెక్/బీఈ/ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత. ఫైనలియర్ చదివేవారూ అర్హులే. వివాహిత/అవాహిత పురుషులు మాత్రమే అర్హులు. వయోపరిమితి జూలై 1, 2017 నాటికి 20 - 27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. శారీరక ప్రమాణాలు ఎత్తు 157.5 సెం.మీ ఉండాలి. ఎలాంటి దృష్టి దోషాలు ఉండరాదు. ఎంపిక ఇంజనీరింగ్లో సాధించిన మార్కుల ఆధారంగా సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇది ఐదు రోజులపాటు ఉంటుంది. ఇందులో విజయం సాధించినవారికి వెద్య పరీక్షలు నిర్వహిస్తారు. శిక్షణ అన్ని దశలను విజయవంతంగా ముగించుకున్నవారికి ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.21,000 స్టైఫండ్ అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు. నెలకు రూ.15,600-రూ.39,100 (గ్రేడ్ పే రూ.5400) వేతన శ్రేణి ఉంటుంది. వీటితోపాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 8, 2016 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 7, 2016 ఇంటర్వ్యూలు: జనవరి, ఫిబ్రవరి 2017 వెబ్సైట్: www.joinindianarmy.nic.in -
ఎయిర్ ఇండియాలో 170 పోస్టులు
ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్..క్యాబిన్ క్రూ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కాంట్రాక్ట్ కాల పరిమితి ఐదేళ్లు. సంస్థ అవసరం, అభ్యర్థి పనితీరు ఆధారంగా పొడిగించేఅవకాశం ఉంది. ఈ కొలువులకు అవివాహితులు మాత్రమే అర్హులు. ఖాళీల వివరాలు మొత్తం పోస్టులు: 170 (ఎస్సీ-28, ఎస్టీ-12, ఓబీసీ-43, ఓసీ-87) వేతనం శిక్షణా కాలంలో నెలకు రూ.10,000 స్టైఫండ్ చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత రూ.31,880 ఇస్తారు. విద్యార్హత ఇంటర్/10+2 ఉత్తీర్ణత. హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీలో మూడేళ్ల డిగ్రీ/డిప్లొమా, ఫస్ట్ ఎయిడ్ కోర్సు ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఇస్తారు. వయోపరిమితి కనీసం 18 ఏళ్లు; గరిష్టం 22 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఇతర ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూగా చేసినవారికీ సడలింపు ఇస్తారు. అయితే వీరికి ఈ సడలింపుతో కలుపుకొని గరిష్ట వయసు 28 ఏళ్లు మించకూడదు. శారీరక ప్రమాణాలు ఎ. ఎత్తు: పురుషులు 165 సెం.మీ (5 అడుగుల 5 అంగుళాలు); స్త్రీలు 157.5 సెం.మీ (5 అ॥2 అ॥ఎస్సీ, ఎస్టీలకు 2.5 సెం.మీ. (ఒక అంగుళం) సడలింపు ఉంటుంది. బి. బరువు: సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. సి. కంటి చూపు: నియర్ విజన్ ఎన్/5 లేదా ఎన్/6; డిస్టెంట్ విజన్ (ఒక కంటికి) 6/6, (మరో కంటికి) 6/9 ఉండాలి. కళ్లద్దాలను అనుమతించరు. కాంటాక్ట్ లెన్స్ ‘+2డి’ స్థాయి వరకు ఉండొచ్చు. కలర్ విజన్.. ఇషిహర చార్ట్పై నార్మల్గా ఉండాలి. డి. ఆహార్యం: ముఖంపై ఎలాంటి మచ్చలు (కనీసం పుట్టు మచ్చలు కూడా) ఉండకూడదు. పలు వరుస బాగుండాలి. మాట తీరు స్పష్టంగా మాట్లాడాలి. నత్తి ఉండకూడదు. భాషా నైపుణ్యం హిందీ, ఇంగ్లిష్ స్పష్టంగా రాయాలి. మాట్లాడాలి. విదేశీ భాషలు వచ్చినవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపిక విధానం గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు/గత అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. వైద్య పరీక్షల వ్యయాన్ని (రూ.500 నుంచి రూ.1000 వరకు) అభ్యర్థులే చెల్లించాలి. గ్రూప్ డిస్కషన్కు మహిళలు చీర ధరించి, పురుషులు సాధారణ దుస్తులు వేసుకొని రావాలి. వైద్య పరీక్షలకు హాజరయ్యే నాటికి అభ్యర్థులకు పాస్పోర్ట్ ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుం ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్ పేరిట రూ.500 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీయాలి. ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఇచ్చారు. డీడీ వివరాలను ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియలో పొందుపరచాలి. ఒరిజినల్ డీడీనీ గ్రూప్ డిస్కషన్ సమయంలో సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 11 వెబ్సైట్: www.airindiaexpress.in -
సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు
సెంట్రల్ రైల్వే.. వివిధ వర్క్షాప్స్, యూనిట్ల పరిధిలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ముంబై క్లస్టర్ (క్యారేజ్ అండ్ వ్యాగన్ (కోచింగ్) వాడి బందర్, ముంబై ఫిట్టర్ = 182 వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 6 కార్పెంటర్ = 28 పెయింటర్ (జనరల్) = 24 టైలర్ (జనరల్) = 18 కల్యాణ్ డీజిల్ షెడ్ 1. ఎలక్ట్రీషియన్ = 11 2. మెషినిస్ట్ = 1 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 1 4. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ = 4 5. మెకానికల్ డీజిల్ = 33 6. లేబొరేటరీ అసిస్టెంట్ (సీపీ) = 3 కుర్లా డీజిల్ షెడ్ 1. ఎలక్ట్రీషియన్ = 24 2. మెకానికల్ డీజిల్ = 36 ఎస్ఆర్.డీఈఈ (టీఆర్ఎస్) కల్యాణ్ 1. ఫిట్టర్ = 62 2. టర్నర్ = 10 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 10 4. ఎలక్ట్రీషియన్ = 62 5. మెషినిస్ట్ = 5 6. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ = 5 7. లేబొరేటరీ అసిస్టెంట్ (సీపీ) = 5 8. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ = 20 ముంబై క్లస్టర్ ఎస్ఆర్ (డీఈఈ) (టీఆర్ఎస్) కుర్లా 1. ఫిట్టర్ = 90 2. టర్నర్ = 6 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 3 4. ఎలక్ట్రీషియన్ = 93 పారెల్ వర్క్షాప్ 1. ఫిట్టర్ = 6 2. మెషినిస్ట్ = 9 3. షీట్ మెటల్ వర్కర్ = 9 4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 6 5. ఎలక్ట్రీషియన్ = 11 6. విండర్ (ఆర్మేచర్) = 5 7. మెకానిక్ మెషిన్ టూల్స్ = 24 8. టూల్ అండ్ డై మేకర్ = 68 9.మెకానిక్ (మోటార్ వెహికల్) = 4 10. మెకానిక్ డీజిల్ = 74 మాతుంగ వర్క్షాప్ 1. మెషినిస్ట్ = 26 2. మెకానిక్ మెషిన్టూల్ మెయింటెనెన్స్= 48 3. ఫిట్టర్ = 197 4. కార్పెంటర్ = 126 5. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 55 6. పెయింటర్ = 37 7. ఎలక్ట్రీషియన్ = 90 ముంబై క్లస్టర్ ఎస్ అండ్ టీ వర్క్షాప్, బైకుల్లా 1. ఫిట్టర్ = 25 2. టర్నర్ = 6 3. మెషినిస్ట్ = 5 4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 8 5. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ = 6 6. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ = 2 7. ఎలక్ట్రీషియన్ = 3 8. పెయింటర్ (జనరల్) = 4 భుసావల్ క్లస్టర్ గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ 1. ఫిట్టర్ = 107 2. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 12 3. మెషినిస్ట్ = 3 ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్ 1. ఫిట్టర్ = 38 2. ఎలక్ట్రీషియన్ = 38 3. వెల్టర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 4 ఎలక్ట్రిక్ లోకోమోటి వ్ వర్క్షాప్, భుసావల్ 1. ఎలక్ట్రీషియన్ = 56 2. ఫిట్టర్ = 53 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 7 4. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ = 2 భుసావల్ క్లస్టర్ మన్మాడ్ వర్క్షాప్ 1. ఫిట్టర్ = 27 2. టర్నర్ = 3 3. మెషినిస్ట్ = 7 4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 7 5. మెకానిక్ (మెటార్ వెహికల్) = 1 6. మెకానిక్ డీజిల్ = 4 7. పెయింటర్ (జనరల్) = 2 టీఎండబ్ల్యు నాసిక్ రోడ్ 1. ఫిట్టర్ = 10 2. మెషినిస్ట్ = 4 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 6 4. ఎలక్ట్రీషియన్ = 26 5. కార్పెంటర్ = 2 6. మెకానిక్ డీజిల్ = 2 పుణె క్లస్టర్ గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ 1. ఫిట్టర్ = 20 2. మెషినిస్ట్ = 3 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 3 4. పెయింటర్ (జనరల్) = 2 డీజిల్ లోకోషెడ్ 1. మెకానిక్ డీజిల్ = 9 2. ఎలక్ట్రీషియన్ = 30 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 8 4. మెషినిస్ట్ = 2 5. పెయింటర్ (జనరల్) = 1 నాగపూర్ క్లస్టర్ ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్ని 1. ఎలక్ట్రీషియన్ = 33 2. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ = 15 గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో 1. ఫిట్టర్ = 51 2. పెయింటర్ (జనరల్) = 1 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 5 4. కార్పెంటర్ = 2 షోలాపూర్ క్లస్టర్ గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ 1. ఫిట్టర్ = 72 2. కార్పెంటర్ = 7 3. మెషినిస్ట్ = 8 4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 11 5. పెయింటర్ (జనరల్) =3 6. మెకానిక్ డీజిల్ = 2 కుర్దువాడీ వర్క్షాప్ 1. ఫిట్టర్ = 7 2. మెషినిస్ట్ = 5 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 4 4. కార్పెంటర్ = 2 5. పెయింటర్ (జనరల్) = 3 అర్హత: 50 శాతం మార్కులతో పదో తరగతి (10+2 విధానంలో) ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత. వయోపరిమితి: నవంబర్ 1, 2016 నాటికి 15 ఏళ్లు నిండి 24 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. వీరికి వైద్య పరీక్షలు ఉంటాయి. అంతేకాకుండా నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ ఐటీఐ ట్రేడ్ ఆధారంగా ఏదో ఒక క్లస్టర్కు మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రింటవుట్ దరఖాస్తు పంపాల్సిన అవసరం లేదు. దరఖాస్తు రుసుం: డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్/ఎస్బీఐ చలాన్ ద్వారా రూ.100 దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగులకు, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 1, 2016 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 30, 2016 వెబ్సైట్: https://www.rrccr.com/ -
భూకంపాలు - స్కేళ్లు
రోసీ ఫారల్ స్కేలు: దీన్ని ఫ్రాన్సలో అభివృద్ధి చేశారు. షిండే స్కేలు: దీన్ని జపాన్లో అభివృద్ధి చేశారు. దీనిలో 1 నుంచి 7 విభాగాలు ఉంటాయి. భూకంప తీవ్రత స్కేలుపై 6 -7 మధ్య ఉంటే నష్ట తీవ్రత అధికంగా ఉంటుంది. మెర్కిలీ స్కేలు: ఇటలీకి చెందిన మెర్కిలీ దీన్ని రూపొందించారు. దీనిలో ఐ నుంచి గీఐఐ వరకు విభాగాలుంటాయి. ఈ స్కేల్లోని విభాగాలను రోమన్ అంకెల్లో గుర్తించారు. భూకంప తీవ్రత గీఐ, గీఐఐ ఉంటే కట్టడాలు కూలతాయి. నదీ ప్రవాహ మార్గాలు మారతాయి. జన జీవనం అతలాకుతలం అవుతుంది. రిక్టర్ స్కేలు: భూతల ప్రకంపనలను నిరంతరం లెక్కించే రిక్టర్ స్కేలును అమెరికా శాస్త్రవేత్త చార్లెస్ రిక్టర్ 1935లో రూపొందించారు. దీనిలో 0 నుంచి 9 విభాగాలున్నాయి. మొత్తం 10 విభాగాలు. ‘ట్రైనైట్రోటోలిన్’ అనే రసాయనిక పదార్థం ద్వారా విడుదలయ్యే శక్తితో భూకంపన శక్తిని పోలుస్తూ రిక్టర్ ఈ విభజన చేశారు. స్కేలుపై ఉన్న ప్రతి ఏకాంకం, కిందటి ఏకాకం కంటే 30 రెట్లు అధిక శక్తిని సూచిస్తుంది. ఇప్పటి వరకు రిక్టర్ స్కేలుపై నమోదైన పెద్ద భూకంపం- 1960 చిలీ భూకంపం (తీవ్రత 9.2). -
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
కంటికి కనిపించని అతి సూక్ష్మ పదార్థమే పరమాణువు. కానీ, దీని నిర్మాణ ఆవిష్కరణ ఆధునిక విజ్ఞానశాస్త్ర అధ్యయనాన్ని కొత్త పుంతలు తొక్కించింది. నేటి ఆధునిక జీవనానికి అవసరమైన ఎన్నో ఉపకరణాలను రూపొందించడంలో కీలక భూమికను పోషించింది. పరమాణువు నిర్మాణ ఆవిష్కరణకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే.. క్రీ.పూ. 2600 ఏళ్ల కిందట కణాదుడు అనే భారతీయ రుషి తన వైశేషిక సూత్ర అనే గ్రంథంలో అణువును ప్రస్తావించాడు. అతని ప్రకారం పదార్థం అణువులు అనే అతి చిన్న కణాలతో నిర్మితమవుతుంది. ఈ అణువులు పరమాణువులుగా పిలిచే మరింత చిన్న కణాలతో రూపొందుతాయి. అభ్యర్థులు పరమాణు నిర్మాణానికి సంబంధించి డాల్టన్, థామ్సన్, రూథర్ఫర్డ్, బోర్ నమూనాలపై అవగాహన పెంపొందించుకోవాలి. విద్యుదయస్కాంత తరంగం, మాక్స్ప్లాంక్ ప్రతిపాదన; సోమర్ఫెల్డ్, క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాల గురించి తెలుసు కోవాలి. ఉదా: రూథర్ ఫర్డ.. ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం ద్వారా దేనిని ప్రతిపాదించాడు? 1) ఎలక్ట్రాన్ 2) ప్రోటాన్ 3) న్యూట్రాన్ 4) కేంద్రకం సమాధానం: 4 కల్యాణలక్ష్మి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? - 2014, అక్టోబర్ 2 కల్యాణలక్ష్మి పథకంలో 18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ యువతులకు వివాహ సమయంలో అందించే ఆర్థిక సహాయం? - రూ. 51,000 కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ యువతులకు కూడా వివాహ సమయంలో ఆర్థిక సహాయాన్ని ఎప్పటి నుంచి అందిస్తున్నారు? - 2016 ఏప్రిల్ 1 కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలంటే సంబంధిత యువతుల తల్లిదండ్రుల వార్షికాదాయం ఎంతకు మించరాదు? - రూ.2 లక్షలు షాదీ ముబారక్ పథకం ఉద్దేశం? - పేద ముస్లిం యువతులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించడం ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? - మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామంలో ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2014, నవంబర్ 8 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? - తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ‘ఆసరా’ పింఛన్ పథకం కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసింది? - రూ.4,700 కోట్లు తెలంగాణలో ‘ఆసరా’ పింఛన్ పథకం కింద ఎంత మంది లబ్ధి పొందుతున్నారు? - 37,65,304 మంది వృద్ధులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? - రక్షణ వితంతువులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? - జీవనాధారం చేనేత కార్మికులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? - చేయూత కల్లుగీత కార్మికులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? - ఆలంబన ఎయిడ్స బాధితులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? - భరోసా వికలాంగులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? - భద్రత ‘ఆసరా’ పింఛన్ పథకంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స బాధితులు ప్రతి నెలా ఎంత మొత్తం పొందుతున్నారు? - రూ.1000 వికలాంగులకు ప్రతి నెలా ఇచ్చే ‘ఆసరా’ పింఛన్ ఎంత? - రూ.1500 ప్రస్తుతం ‘ఆరోగ్య లక్ష్మి’గా పేర్కొంటున్న పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు? - ఇందిరమ్మ అమృత హస్తం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, జనవరి 1 ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఏ కేంద్రాల ద్వారా అమలుచేస్తున్నారు? - అంగన్వాడీ కేంద్రాలు బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు సంపూర్ణ పోషకాహారం అందించేందుకు ఉద్దేశిం చిన పథకం? - ఆరోగ్యలక్ష్మి గ్రామజ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, ఆగస్టు 17 గ్రామజ్యోతి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? - గంగదేవిపల్లి (వరంగల్ జిల్లా) మన ఊరు-మన ప్రణాళికకు కొనసాగింపుగా రూపకల్పన చేసిన పథకం? - గ్రామజ్యోతి గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు ప్రతి గ్రామంలో ఎన్ని గ్రామీణాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తారు? - 7 కమిటీలు. అవి.. పారిశుద్ధ్యం-తాగునీరు కమిటీ; ఆరోగ్యం-పోషకాహారం కమిటీ; విద్యా కమిటీ; సామాజిక, పేదరిక నిర్మూలనా కమిటీ; మౌలిక సదుపాయాల కల్పన కమిటీ; సహజ వనరుల నిర్వహణ కమిటీ; వ్యవసాయ కమిటీ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆర్థిక సాయంతో హరే రామ హరే కృష్ట ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు? - సద్దిమూట, భోజనామృతం సద్దిమూట పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2014, అక్టోబర్ 13 సద్దిమూట పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? - సిద్దిపేట మార్కెట్ యార్డ సద్దిమూట పథకం ఉద్దేశం? - మార్కెట్ యార్డులో రైతులు, హమాలీలకు రూ.5కే భోజనం అందించడం భోజనామృతం కార్యక్రమ ఉద్దేశం? - మాతా శిశు సంరక్షణ, ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం అందించడం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ).. పేదలకు, భిక్షాటన చేసుకునే వారికి, అడ్డా కూలీలకు ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని ఎప్పుడు ప్రారంభిం చింది? - 2014, జూలై 17 ఎవరి సాయంతో జీహెచ్ఎంసీ ఈ భోజన పథకాన్ని ప్రారంభించింది? - అక్షయపాత్ర ఫౌండే షన్ ఆహార భద్రత పథకం లబ్ధిదారులను ఏ సర్వే ఆధారంగా గుర్తించారు? - సమగ్ర కుటుంబ సర్వే ఆహార భద్రత పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, జనవరి 1 ఆహార భద్రత పథకం కింద కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు? - రూ.1కి కిలో చొప్పున 6 కిలోలు నిరుపేద విద్యార్థులకు సన్న బియ్యం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, జనవరి 1 ‘మన ఊరు-మన చెరువు’ నినాదంతో రూపకల్పన చేసినకార్యక్రమం? - మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ పైలాన్ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎక్కడ ఆవిష్కరించారు? - నిజామాబాద్ జిల్లా సదాశివ నగర్ మండలం పాతచెరువు మిషన్ కాకతీయ ప్రధానోద్దేశం? - రాష్ర్టంలోని 46,000 చెరువుల పునరుద్ధరణ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, మార్చి 12 మహిళలకు రక్షణ అందించేందుకు, ఈవ్టీజింగ్ను అరికట్టేందుకు ప్రారంభించిన బృందాలు? - షీ టీమ్స్ షీ టీమ్స్ను ఎప్పుడు ప్రారంభించారు? - 2014, అక్టోబర్ 24 హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో అటవీ ప్రాంతాన్ని ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? - 33% మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, జూలై మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? - చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద (రంగారెడ్డి జిల్లా) తొలి విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? - 40 కోట్ల మొక్కలు రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2016, జూలై 8 రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? - గుండ్రాంపల్లి (నల్గొండ జిల్లా) రెండో విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? - 46 కోట్ల మొక్కలు వాటర్గ్రిడ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, జూన్ 8 వాటర్గ్రిడ్ పథకం ముఖ్యోద్దేశం? - ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచి నీటిని అందించడం వాటర్గ్రిడ్ పథకం పేరు? - మిషన్ భగీరథ (2015 డిసెంబర్ 4) ‘పల్లె వాకిట్లో పౌర సేవలు’ నినాదంతో రూపుదిద్దుకున్న కార్యక్రమం? - పల్లె సమగ్ర సేవా కేంద్రం పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, అక్టోబర్ 2 పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?- బీబీనగర్ గ్రామం, దోమకొండ మండలం, నిజామాబాద్ జిల్లా ఏ పథకంలో భాగంగా వాటర్గ్రిడ్ పైపులతో పాటు ఆప్టికల్ ఫైబర్ను వేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు? - డిజిటల్ తెలంగాణ డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, జూలై 1 తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? - కౌడిపల్లి (మెదక్ జిల్లా) అక్కెనపల్లి మీనయ్య ఎకనామిక్స్ (హెచ్వోడీ)- రిటైర్డ్ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్లగొండ -
జాబ్ @ సర్టిఫికేషన్స్
సర్టిఫికేషన్స్.. ఉద్యోగాన్వేషణలో అకడమిక్ డిగ్రీలతోపాటు ఉపయోగపడే ముఖ్య సాధనాలు. వీటి ద్వారా ఆయా రంగాల్లో కంపెనీల అవసరాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. మూడు నెలల నుంచి ఆర్నెల్ల వ్యవధిలో ఉండే ఈ సర్టిఫికేషన్స్ జాబ్ మార్కెట్లో అభ్యర్థులను ముందు నిలుపుతాయి. ఈ క్రమంలో ఇంజనీరింగ్లో సర్టిఫికేషన్స్ వివరాలు.. సీఎస్ఈ శాప్ రోబోటిక్స్ టెస్టింగ్ ఒరాకిల్, ఎస్క్యూఎల్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ లైనక్స్ మెయిన్ ఫ్రేమ్స్ ఇన్మర్మేషన్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ సీ, సీ++, జావా, హెచ్టీఎంఎల్, డాట్నెట్ రెడ్ హ్యాట్ ఈసీఈ సిస్కో సీసీఎన్ఏ, సీసీటీపీ వీఎల్ఎస్ఐ టెక్నాలజీ పీసీబీ (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ డిజైన్) క్యాడ్, క్యామ్, మైక్రోవేవ్ ఆటో క్యాడ్ టెక్నికల్ డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ బిల్డింగ్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ స్ట్రక్చరల్ అనాలసిస్ అండ్ డిజైనింగ్ 3డీ ప్రింటింగ్ జియో ఇన్ఫర్మేటిక్ సిస్టమ్స్ ఈఈఈ సర్క్యూట్ అనాలసిస్ పవర్ సిస్టమ్ అనాలసిస్ లీనియర్ సిస్టమ్ అనాలసిస్ పీఎల్సీ టెక్నీషియన్ డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్ -
క్లౌడ్ కంప్యూటింగ్..
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. వినియోగదారులకు తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనాలు అందించే విధంగా టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమే ‘క్లౌడ్ కంప్యూటింగ్’. దీన్ని ఉపయోగించుకుంటున్న ఐటీ, ఐటీ ఆధారిత సేవల సంస్థల సంఖ్య బాగా పెరుగుతోంది. దీంతో క్లౌడ్ కంప్యూటింగ్ రంగం విస్తృత ఉద్యోగ అవకాశాలకు కేరాఫ్గా మారుతుంది. ఫ్రెషర్స్ మొదలు, అత్యున్నత అనుభవజ్ఞుల వరకు వివిధ స్థాయిల్లోని ఐటీ ఉద్యోగులు ‘క్లౌడ్’పై మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో క్లౌడ్ కంప్యూటింగ్పై స్పెషల్ ఫోకస్.. ఐటీ సంస్థలు వివిధ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల సహాయంతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. ఈ క్రమంలో భారీ స్థాయిలో డేటా సమకూరుతుంది. దీని నిర్వహణ, స్టోరేజ్.. కంపెనీలకు ఆర్థిక భారంతో కూడుకుంది. దీనికి పరిష్కారంగా వచ్చిన టెక్నాలజీ క్లౌడ్ కంప్యూటింగ్. భౌతికంగా ఎలాంటి డేటా స్టోరేజ్ పరికరాలు లేకుండానే ఇంటర్నెట్ ఆధారంగా క్లౌడ్తో సేవలందించొచ్చు. కేవలం డేటా స్టోరేజ్కే పరిమితం కాకుండా.. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫాం యాజ్ ఏ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లను కూడా క్లౌడ్ కంప్యూటింగ్ అందిస్తోంది. ఉదాహరణకు సాధారణంగా ప్రతి సంస్థలో ఒక్కో ఉద్యోగికి ఒక సిస్టమ్, అందులో సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, డేటా ఉంటుంది. వీటిని కలుపుతూ సర్వర్లు ఉంటాయి. కానీ, క్లౌడ్ కంప్యూటింగ్లో డేటా, సాఫ్ట్వేర్ అప్లికేషన్లు అన్నీ సర్వర్లలోనే ఉంటాయి. ఈ డేటాను యూజర్లు ఏ డివైజ్ నుంచైనా, ఏ ప్రదేశం నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సర్వర్లో క్లయింట్స్కు అవసరమైన అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని యూజర్లు ఇంటర్నెట్ ఆధారంగా యాక్సెస్ చేస్తూ డేటా స్టోర్ చేసుకుంటారు. యూజర్లు పొందుపర్చే డేటాను క్లయింట్స్ నేరుగా యాక్సెస్ చేసుకోవచ్చు. అవకాశాలు అపారం క్లౌడ్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న టాప్ 3 దేశాల్లో భారత్ ఒకటి. 75 లక్షలతో చైనా మొదటి స్థానంలో నిలిచింది. 40 లక్షలతో అమెరికా, 22 లక్షలతో భారత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. భవిష్యత్లో భారీగా క్లౌడ్ ఉద్యోగాల సృష్టి జరగనున్నట్లు వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం 2020 నాటికి క్లౌడ్ కంప్యూటింగ్ 241 బిలియన్ డాలర్ల మేర విలువైన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించనుంది. అదే స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరగనున్నట్లు జాబ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జాబ్ ప్రొఫైల్స్ సర్టిఫికేషన్ కోర్సులు లేదా ఐటీ కంపెనీల సొంత శిక్షణ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ లో నైపుణ్యాలు పొందిన వారికి వివిధ జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాజెక్ట్ మేనేజర్ బిజినెస్ అనలిస్ట్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ క్లౌడ్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్.. క్లౌడ్లో రాణించాలంటే.. క్లౌడ్ కంప్యూటింగ్లో రాణించేందుకు లైనక్స్, జావా, డాట్నెట్, వర్చువలైజేషన్ టెక్నాలజీస్, డేటా మేనేజ్మెంట్, డేటా మైనింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, బిగ్ డేటా, గకఠ్చీట్ఛ తదితర టెక్నాలజీలు ఉపయోగ పడతాయి. క్లౌడ్ కంప్యూటింగ్కు సంబంధించి అకడమిక్ స్థాయిలో పూర్తిస్థాయి కోర్సులు అందుబాటులో లేనప్పటికీ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకొని, సొంతంగా క్లౌడ్ కంప్యూటింగ్ లో శిక్షణ ఇస్తున్నాయి. సీడాక్, ఐఐఐటీ, జేఎన్టీయూ తదితర సంస్థలు సాఫ్ట్వేర్ కోర్సుల కరిక్యులంలో క్లౌడ్ను చేర్చుతున్నాయి. కొన్ని ఐఐటీలు, ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు క్లౌడ్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికోసం ప్రత్యేక ప్రవేశ ప్రక్రియల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. క్లౌడ్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, వివిధ సంస్థలు సర్టిఫికేషన్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. ఐబీఎం, సిస్కో, హెచ్పీ టెక్నాలజీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా కోర్సులు అందిస్తున్నాయి. క్లౌడ్ క్రెడెన్షియల్ కౌన్సిల్ (సీసీసీ), ఈఎంసీ, వీఎంవేర్ ఇన్స్టిట్యూట్లు సర్టిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నాయి. -
వేడి చేసినప్పుడు సంకోచించే లోహం?
ఘన, ద్రవ, వాయు స్థితులతోపాటు పదార్థ నాలుగో స్థితి ప్లాస్మా. సిల్వర్, హైడ్రోజన్, నైట్రోజన్ వంటి వాటిలో ఒకే రకమైన పరమాణువులుంటాయి. అవి మూలకాలు. నీరు, గ్లూకోజ్, సుక్రోజ్ (చక్కెర), టేబుల్ సాల్ట్ (సోడియం క్లోరైడ్) వంటివి సమ్మేళనాలు. వీటిలో ఒకటి కంటే ఎక్కువ మూలకాల పరమాణువులుంటాయి. గాలి (ప్రధానంగా నైట్రోజన్ (78%), ఆక్సిజన్ (20%), కార్బన్ డై ఆక్సైడ్, ఆర్గాన్), బంగారు ఆభరణాలు, చక్కెర ద్రావణం వంటివి మిశ్రమాలు. వీటిలోని అనుఘటకాలను సులభంగా వేరుచేయొచ్చు. అయోడిన్, గ్రాఫైట్, డైమండ్లు అలోహాలైనా లోహాల్లా మెరుస్తాయి. అయోడిన్, కాంఫర్లు ఉత్పతనం చెందుతాయి. అంటే ఘన స్థితి నుంచి నేరుగా వాయువుగా మారతాయి. సాధారణంగా లోహాలు ఘన పదార్థాలు. కానీ మెర్క్యురీ, గాలియం, సీసియం, ఫ్రాన్షియంలు కూడా దాదాపు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవాలుగా ఉంటాయి. ఫాస్ఫరస్ పొడి గాలిలో మండుతుంది. అందువల్ల దీన్ని నీటిలో నిల్వ చేస్తారు. రీచార్జబుల్ బ్యాటరీల్లో లిథియంను, మానసిక చికిత్సలకు లిథియం కార్బొనేట్ను ఉపయోగిస్తారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా (మెగ్నీషియం హైడ్రాక్సైడ్) ఆమ్ల విరోధిగా, విరేచనకారిగా పనిచేస్తుంది. పాలను చీజ్గా మార్చడంలో, రక్తం గడ్డకట్టడంలో కాల్షియం తోడ్పడుతుంది. శరీరంలో 99% కాల్షియం ఎముకలు, దంతాల్లో ఉంటుంది. ఎముకల్లో కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో, దంత ఎనామిల్లో హైడ్రాక్సీ ఎపటైట్ రూపంలో ఉంటుంది. కిడ్నీలో ఏర్పడిన రాళ్లలో ప్రధానంగా ఉండేది కాల్షియం ఆక్సలేట్. కాల్షియం శోషణకు సూర్యరశ్మి ఆధారిత విటమిన్-డి చాలా అవసరం. క్లోరోఫిల్లో మెగ్నీషియం; రక్తంలోని హిమోగ్లోబిన్లో ఐరన్; సయనోకోబాలమిన్ (విటమిన్ ఆ12)లో కోబాల్ట్ లోహ అయాన్లు ఉంటాయి. జీర్ణవ్యవస్థ ఎక్స్ కిరణ ఇమేజింగ్లో బేరియం మీల్గా, బేరియం సల్ఫేట్ను ఉపయోగిస్తారు. ఫుల్లరీన్.. సాకర్ బాల్ నిర్మాణంలో ఉంటుంది. సహజ రబ్బరుకు గట్టిదనం కోసం సల్ఫర్ను కలిపి వేడిచేసే ప్రక్రియను వల్కనైజేషన్ అంటారు. నూనెలను నికెల్ లోహం ఉత్ప్రేరక సమక్షంలో హైడ్రోజన్ వాయువుతో క్షయకరణం (హైడ్రోజనీకరణం) చేసి వనస్పతి (డాల్టా)గా మార్చుతారు. ఇనుము వంటి లోహాలు తుప్పుపట్టకుండా జింక్ లోహంతో పూత పూసే ప్రక్రియ గాల్వనైజేషన్. ఇనుము తుప్పు పట్టినప్పుడు ఆక్సీకరణం చెంది బరువు పెరుగుతూ ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది. భూ పటలంలో సమృద్ధిగా లభించే లోహం అల్యూమినియం. ఆ తర్వాతి స్థానం ఇనుముది. లేత పసుపు వర్ణ వీధి దీపాల్లో సోడియం ఆవిరి, సాధారణ ట్యూబ్లైట్లలో మెర్క్యురీ ఆవిరి ఉంటాయి. సున్నపురాయి, పాలరాయి (మార్బుల్), ముత్యంలో కాల్షియం కార్బొనేట్ (ఇ్చఇై3) ఉంటుంది. కెంపులో అల్యూమినియం ఆక్సైడ్తోపాటు మలినంగా క్రోమియం ఉంటుంది. ఎమరాల్డ్లో బెరీలియం ఉంటుంది. కఠిన జలంలో కాల్షియం, మెగ్నీషియం లోహ (అయాన్ల) కార్బొనేట్లు, క్లోరైడ్లు, సల్ఫేట్లు ఉంటాయి. సముద్ర జలం (కఠినజలం) నుంచి స్వాదుజలాన్ని పొందడానికి అనువైన ప్రక్రియ తిరోగామి ద్రవాభిసరణం (Reverse Osmosis - R.O). గాగుల్స్కు ఉపయోగించే రంగు అద్దాల్లో ఫై ఆక్సైడ్ ఉంటుంది. సాధారణంగా అయానిక పదార్థాలు స్ఫటికాకృతిని కలిగి ఉంటాయి. కానీ డైమండ్, ఐస్లు సమయోజనీయ స్ఫటికాలు. బాగా సాగే గుణం ఉన్న లోహం బంగారం. ఇనుముకు తుప్పు పట్టే గుణం అధికం. స్టీలు (ఉక్కు)గా మార్చాక తుప్పు పట్టకపోవడానికి కారణం అందులో ఉండే క్రోమియం. ఆరోగ్యవంతమైన దంతాల కోసం కాల్షియంతోపాటు ఫాస్ఫరస్, ఫ్లోరైడ్ కూడా అవసరమే. టూత్పేస్ట్లలో కాల్షియం కార్బొనేట్, మెగ్నీషియం కార్బొనేట్లను ఉపయోగిస్తారు. మంటలను ఆర్పే సాధనాల్లో సోడియం కార్బొనేట్, పొటాషియం కార్బొనేట్లు ఉంటాయి. ఇవి ఆమ్లంతో కలిసినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తాయి. బేకింగ్ సోడా యాంటిసెప్టిక్గా, ఆమ్ల విరోధిగా కూడా పనిచేస్తుంది. వాటర్ గ్లాస్ అనేది - సోడియం సిలికేట్ జిప్సం (కాల్షియం సల్ఫేట్ డై హైడ్రేట్- నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్తయారు చేస్తారు. రేడియోధార్మిక పదార్థాలు ఆల్ఫాబీటా (ఛ), గామా (జ) కిరణాలను ఉద్గారం చేస్తాయి. కోబాల్ట్-60 ఐసోటోప్ ఆధారిత గామా కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ చికిత్సలో రేడియోథెరపీ చేస్తారు. అణు బాంబులోని సూత్రం కేంద్రక విచ్ఛిత్తి. యురేనియం-235 వంటి అస్థిర కేంద్రకాన్ని న్యూట్రాన్లతో తాడనం చెందిస్తే కేంద్రకం విఘటనం చెందడంతోపాటు అపారశక్తి విడుదలవుతుంది. ఈ ‘శృంఖల కేంద్రక విచ్ఛిత్తి చర్య’ను నియంత్రించి న్యూక్లియర్ రియాక్టర్లలో అణు విద్యుచ్ఛక్తిని పొందుతారు. ఇంధనాలుగావాడతారు న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి మితకారిగా భారజలం (ఈ2ై)ను వాడతారు. న్యూట్రాన్ల సంఖ్యను నియంత్రించేందుకు బోరాన్, కాడ్మియం కడ్డీలను వాడతారు. హైడ్రోజన్ బాంబు, సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో శక్తికి మూలాధారం కేంద్రక సంలీనం. భూపొరల్లో సమృద్ధిగా లభించే మూలకాలు వరుసగా ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం. ఘన కార్బన్ డై ఆక్సైడ్ను పొడి మంచు (ఈటడ ఐఛ్ఛి) అంటారు. అల్యూమినియం పొడి, అమోనియం నైట్రేట్ల మిశ్రమాన్ని అమ్మోనాల్ అంటారు. ఇది పేలుడు పదార్థం. డైమండ్.. ఉష్ణ, విద్యుత్ వాహకం కాదు. బంగారం, ప్లాటినంల చర్యాశీలత తక్కువ. ఇవి నోబుల్ మెటల్స్. ప్రకృతిలో సహజ స్థితిలో లభిస్తాయి. లోహాల్లో వెండి (సిల్వర్ - అజ) మంచి విద్యుద్వాహకం. అల్యూమినియం ఆక్సైడ్ రూపంలోని ధాతువు బాక్సైట్. దీన్నుంచే అల్యూమినియాన్ని వ్యాపార సరళిలో సంగ్రహిస్తారు. రాగి సల్ఫైడ్ రూపంలోని ఖనిజం కాపర్ పైరటీస్. రేడియోధార్మిక యురేనియం ఖనిజం పిచ్బ్లెండ్. భారతదేశంలో విరివిగా లభించే మోనజైట్ ఇసుక నుంచి రేడియోధార్మిక థోరియం లభిస్తుంది. సీసం ఖనిజం - గెలీనా; మెగ్నీషియం- డోలమైట్, మాగ్నసైట్; ఐరన్- హెమటైట్, మాగ్నటైట్. ఇనుము సంగ్రహణలో ఉపయోగించే బ్లాస్ట్ కొలిమిలో ఐరన్ ఆక్సైడ్, ఐరన్గా క్షయకరణం చెందడానికి కార్బన్ మోనాక్సైడ్ ఉపయోగపడుతుంది. బ్లాస్ట్ కొలిమిలో, మొదట 750నిఇ వద్ద లభించే గుల్లబారిన ఘన స్థితిలోని ఐరన్ను స్పాంజ్ ఐరన్ అంటారు. 1500నిఇ వద్ద కొలిమి అడుగున ద్రవ స్థితిలో ఉండే ఐరన్ను దుక్క ఇనుము లేదా పోత ఇనుము అంటారు. కార్బన్ శాతం గరిష్టంగా (34%) ఉన్నది దుక్క ఇనుము. కార్బన్ శాతం అతి తక్కువ (0.5% కంటే స్వల్పం) ఉన్న శుద్ధమైన ఇనుము.. చేత ఇనుము. ఇనుములో కార్బన్ శాతం పెరిగితే పెళుసుదనం ఎక్కువవుతుంది. స్టీల్ అనేది ఐరన్తో కూడిన మిశ్ర లోహం. కార్బన్ తప్పనిసరిగా 0.11.5% వరకు ఉంటుంది. స్టీల్కు స్థితిస్థాపకత ఎక్కువ. ఇనుము, నికెల్, క్రోమియం, మాంగనీస్ కలిసి ఉన్న మిశ్ర లోహం నిక్రోమ్. దీన్ని హీటర్ల ఫిలమెంట్ తయారీలో ఉపయోగిస్తారు. ాపర్, జింక్, నికెల్ల మిశ్ర లోహం జర్మన్ సిల్వర్ (సిల్వర్ ఉండదు). దీన్ని పాత్రలు, నిరోధక చుట్టల తయారీలో వాడతారు. ఇమిటేషన్ జ్యుయలరీలో ఉపయోగిస్తారు. ఫ్యూజ్వైర్ల తయారీకి టిన్+లెడ్ ఉపయోగిస్తారు. ఢిల్లీలోని ఐరన్ పిల్లర్ నేటికీ తుప్పు పట్టకపోవడానికి కారణం అందులోని అధిక ఫాస్ఫరస్ శాతం. ఇత్తడి - కాపర్, జింక్; కంచు - కాపర్, టిన్ల మిశ్ర లోహాలు. ప్రపంచంలో తయారు చేసిన మొదటి మిశ్ర లోహం కంచు (బ్రాంజ్). మానవుడు ఉపయోగించిన తొలి లోహం - రాగి (కాపర్) సిల్వర్ పెయింట్లో ఉండే లోహం- అల్యూమినియం. సోల్డర్ మెటల్లోని లోహాలు - తగరం (టిన్), సీసం (లెడ్). రేడియోధార్మికత నుంచి రక్షణకు లెడ్ ఉపయోగపడుతుంది. వేడి చేసినప్పుడు సంకోచించే లోహం - జిర్కోనియం. అరటి పండు నుంచి లభించి రక్తపోటును నియంత్రించే క్షార లోహం పొటాషియం. రక్తం ప్లాస్మాలో కాల్షియం అయాన్లు ఉంటాయి. బంగారు నగల తయారీలో గట్టిదనం కోసం కాపర్ కలుపుతారు. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లు. ఒక క్యారెట్ 100/24 శాతానికి సమానం. 22 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం 91.7. దంతాల్లోని రంధ్రాలను ఫిల్లింగ్ చేయడానికి సిల్వర్, టిన్, మెర్క్యురీ, జింక్ల మిశ్రమాన్ని వాడతారు. మిర్రర్ల కళాయి పూతలో ఉపయోగించే లోహం సిల్వర్. హెల్మెట్ల తయారీలో మాంగనీస్ స్టీల్ను ఉపయోగిస్తారు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు యురేనియం-238ని ఉపయోగించుకొని, ప్లుటోనియం-239ని ఉత్పత్తి చేస్తాయి. చెట్లు, శిలాజాల వయసును కార్బన్-14 ఐసోటోప్ ఆధారిత రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా నిర్ధారిస్తారు. థైరాయిడ్, గాయిటర్ చికిత్సతోపాటు మెదడులోని కణుతులను గుర్తించడానికి అయోడిన్-131 ఐసోటోప్ను ఉపయోగిస్తారు. బయోగ్యాస్, సహజ వాయువు, గోబర్ గ్యాస్లో ప్రధాన హైడ్రోకార్బన్ మీథేన్. బొగ్గు గనుల్లో అగ్ని ప్రమాదాలకు కారణం మీథేన్ (ఫైర్డ్యాంప్). మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్ అనేవి పరమాణు భారం పెరిగే క్రమంలో (వరుసగా) మొదటి నాలుగు హైడ్రోకార్బన్లు. సీఎన్జీలో సంపీడనం చెందించిన మీథేన్ ఉంటుంది. ఎల్పీజీ, సిగరెట్ లైటర్లో బ్యూటేన్ ఉంటుంది. ఇథిలీన్కు కాయలను త్వరగా పక్వం చెందించే గుణం ఉంటుంది. కాల్షియం కార్బైడ్ తేమ సమక్షంలో ఎసిటలీన్ విడుదల అవుతుంది. ఇది కూడా కాయలను పక్వం చెందిస్తుంది. కానీ ఇది హానికరం. ఎసిటలీన్ను వెల్డింగ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఎసిటికామ్ల విలీన ద్రావణమే వెనిగర్. మాంసం త్వరగా కుళ్లకుండా వెనిగర్ వాడతారు. చీమ, తేనెటీగ కుట్టినప్పుడు ఫార్మికామ్లం విడుదలవుతుంది. ఇథనాల్ను ధర్మామీటర్లలో, రాకెట్ ప్రొపెల్లెంట్లుగా కూడా ఉపయోగిస్తారు. ఉడ్ స్పిరిట్ అంటే మిథైల్ ఆల్కహాల్. దీన్ని సేవిస్తే కంటిచూపు పోవడం, మరణం సంభవిస్తాయి. ఆల్కహాల్ ఎక్కువగా సేవిస్తే లివర్ దెబ్బతిని సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఘనీభవన స్థానం తక్కువ కారణంగా ఇథిలీన్ గ్లైకాల్ను వాహనాల రేడియేటర్లలో (నీరు గడ్డకట్టకుండా) యాంటీ ఫ్రీజ్గా వాడతారు. మాయిశ్చరైజింగ్ సబ్బుల్లో ఉండేది గ్లిజరాల్. ఫార్మలిన్ (ఫార్మాల్డిహైడ్ విలీన ద్రావణం) ను స్పెసిమెన్స (మృత కళేబరాలు, భాగాల)ను భద్రపర్చడానికి వాడతారు. -
ఏపీపీఎస్సీ గ్రూప్-2 ‘స్క్రీనింగ్’తో అదనపు ఒత్తిడి!
ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. అయితే తొలిసారిగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించారు. దీని నుంచి ప్రధాన పరీక్షకు 1:12 - 1:15 మధ్య అభ్యర్థులను ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన జీవో కోసం కమిషన్ ఎదురుచూస్తోంది. అయితే అభ్యర్థులు ఈ పరీక్షతో మరింత ఒత్తిడికి గురవుతామని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు స్క్రీనింగ్ టెస్ట్ అవసరం ఉందా? అభ్యర్థులు, పోటీ పరీక్షల నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 మినహా ఇతర ఏ పరీక్షకూ స్క్రీనింగ్ టెస్ట్ లేదు. సంస్కరణలు, ఈ-గవర్నెన్స్, నియామకాల్లో పారదర్శకత పేరుతో గ్రూప్-2కు కూడా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించడం నిరుద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఐదేళ్లుగా గ్రూప్-1, గ్రూప్-2 స్థాయిలో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ నుంచి ప్రకటన వస్తే దరఖాస్తుల సంఖ్య పది లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఇంతమందికి పరీక్ష నిర్వహణ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. నాన్-సీరియస్ అభ్యర్థులను వడపోసి.. సీరియస్ అభ్యర్థులను గుర్తించేందుకు కమిషన్.. స్క్రీనింగ్ టెస్ట్ను సాధనంగా చేసుకుంది. సిలబస్ అదే.. మరి ‘స్క్రీనింగ్’ ఎందుకు? పరీక్ష.. పేపర్-పెన్ విధానంలో ఉంటుంది. మూడు సెక్షన్లకు 50 చొప్పున 150 మార్కులు ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్లోని అంశాలు.. దాదాపు ప్రధాన పరీక్ష సిలబస్ నుంచే ఉన్నాయని.. అలాంటప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ ఎందుకని అభ్యర్థులు, పోటీపరీక్షల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ రెండు పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నందున అభ్యర్థులపై అదనపు భారం తప్ప మరే ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. నాన్-సీరియస్ అభ్యర్థుల వడపోతకు, ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహణకు అవకాశముంటుందనే భావనతో ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అంటున్నారు. స్క్రీనింగ్ టు మెయిన్.. 1:12 -1:15 కొద్ది రోజుల్లో 750 ఉద్యోగాలతో గ్రూప్-2 నోటిఫికేషన్ను విడుదల చేస్తామని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్లో ప్రతిభ ఆధారంగా సామాజిక వర్గాల వారీగా ప్రధాన పరీక్షకు 1:12 - 1:15 మధ్య అభ్యర్థులను ఎంపిక చేయడానికి సంబంధించిన ప్రభుత్వ జీవో కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రిపరేషన్పై ప్రభావం ఏపీపీఎస్సీ పేర్కొన్న ప్రకారం దరఖాస్తు గడువు తేదీ నుంచి ప్రధాన పరీక్షకు మధ్యలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే అప్లికేషన్ గడువు తేదీకి, మెయిన్ టెస్ట్కు మధ్య వ్యవధి స్వల్పంగా ఉంటే స్క్రీనింగ్ టెస్ట్ తేదీ కూడా మరింత ముందుకు జరుగుతుందని, ఇది తమ ప్రిపరేషన్పై ప్రభావం చూపుతుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మారథాన్’ అభ్యర్థుల్లో మరింత ఆందోళన స్క్రీనింగ్ టెస్ట్ విషయంలో మరింత ఆందోళన చెందుతున్న వర్గం.. మారథాన్ పరుగు పందెం తరహాలో ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు. మారథాన్లో పోటీదారులు తొలుత నెమ్మదిగా పరుగు ప్రారంభించి తర్వాత వేగం పుంజుకుంటారు. పోటీ పరీక్షల ప్రిపరేషన్లోనూ ఇలాంటి అభ్యర్థులు ఉంటారు. వీరు ప్రిపరేషన్ను నెమ్మదిగా ప్రారంభించి తర్వాత వేగం పెంచుతారు. ఈ అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్లో మెరుగైన ప్రదర్శన చూపడంలో ఇబ్బందికి గురవుతారని ఒక ప్రముఖ శిక్షణ కేంద్రం నిపుణుడు పేర్కొన్నారు. స్క్రీనింగ్ సిలబస్లోని అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించడం కష్టమని అభిప్రాయపడ్డారు. గ్రామీణ విద్యార్థులకు మరింత ఇబ్బంది ప్రధాన పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలన్న కమిషన్ నిర్ణయంతో గ్రామీణ ప్రాంత అభ్యర్థులు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్, కంప్యూటర్ సర్వీస్లు అందుబాటులో లేని పరిస్థితి. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసినా, కంప్యూటర్ వినియోగంపై చాలామందికి సరైన అవగాహన లేదు. దీంతో దరఖాస్తుదారుల్లో దాదాపు సగం మందిపై ఆన్లైన్ టెస్ట్ విధానం ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. సహజంగానే ఇంజనీరింగ్, అర్బన్ నేపథ్యం ఉన్నవారికి సానుకూలంగా మారే అవకాశముంటుందని పేర్కొంటున్నారు. ఆప్టిట్యూడ్ను పరీక్షించేలా ఉంటే మంచిది అభ్యర్థుల పరిపాలనా దక్షతను పరిశీలించే విధంగా ఆప్టిట్యూడ్ను పరీక్షించేలా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తే బాగుంటుంది. ప్రధాన పరీక్షకు నిర్దేశించిన సిలబస్లోని అంశాల నుంచే ప్రశ్నలు అడగడం వల్ల ప్రయోజనం ఉండదు. అభ్యర్థులు అనవసరంగా ఒత్తిడికి గురవుతారు. - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. -
టాప్ గేర్లో...ట్యాక్సేషన్!
ప్రస్తుతం ట్యాక్సేషన్, రిటర్న్స్ ఫైలింగ్పై అందరిలో అవగాహన పెరిగింది. అదే సమయంలో వీటికి సంబంధించిన నిబంధనలు కఠినంగా అమలవుతున్న కారణంగా రిటర్న్స్ దాఖలు చేయడానికి, పన్ను భారం నుంచి వీలైనంత మినహాయింపు పొందడానికి అందరూ ట్యాక్సేషన్ నిపుణులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో విస్తృత అవకాశాలకు వేదికగా నిలుస్తున్న ట్యాక్సేషన్ విభాగంలో వివిధ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా రెండు విభాగాలు ట్యాక్సేషన్లో ప్రధానంగా రెండు విభాగాలున్నాయి. అవి.. డెరైక్ట్ ట్యాక్సేషన్, ఇన్-డెరైక్ట్ ట్యాక్సేషన్. వ్యక్తిగత స్థాయిలో ఉద్యోగం, ఇతర మార్గాల ద్వారా ఆదాయం పొందేవారు చెల్లించే ఇన్కం ట్యాక్స్.. డెరైక్ట్ ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది. సంస్థల స్థాయిలో ఎక్సైజ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వంటివి ఇన్డెరైక్ట్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఈ రెండు విభాగాల్లో నిపుణుల అవసరం పెరుగుతోంది. డిగ్రీ, పీజీ స్థాయిలో.. ట్యాక్సేషన్ విభాగంలో నైపుణ్యాలు పొందేందుకు సంప్రదాయ డిగ్రీ నుంచే బాటలు వేసుకోవచ్చు. బీకాం స్థాయిలో గ్రూప్ సబ్జెక్టుల కాంబినేషన్లో ట్యాక్సేషన్ ఒక ప్రధాన సబ్జెక్టుగా ఉంటోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు సేల్స్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కం ట్యాక్స్, ఫైనాన్స్ అండ్ ట్యాక్సేషన్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ వంటి సబ్జెక్టులను స్పెషలైజేషన్లుగా అందిస్తున్నాయి. స్పెషలైజ్డ్ కోర్సులు కూడా.. ఇటీవలి కాలంలో ట్యాక్సేషన్ రంగంలో ఏర్పడుతున్న మానవ వనరుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని, సంస్థలు ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో డిప్లొమా ఇన్ ట్యాక్సేషన్, పీజీ డిప్లొమా ఇన్ ట్యాక్సేషన్/ట్యాక్స్ ‘లా’స్ పేరుతో కోర్సులు అందిస్తున్నాయి. ట్యాక్సేషన్లో ప్రస్తుతం ఆన్లైన్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ట్యాక్స్ స్టడీస్ (చెన్నై), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ (ఢిల్లీ) వంటి కొన్ని ప్రముఖ ఇన్స్టిట్యూట్లు మూడు నెలల నుంచి ఆరు నెలల వ్యవధిలో ఉండే సర్టిఫికెట్ కోర్సులను ఆన్లైన్ విధానంలో కరస్పాండెన్స్ పద్ధతిలో ఆఫర్ చేస్తున్నాయి. దూర విద్యావిధానంలో.. ట్యాక్సేషన్ నిపుణుల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని, యూనివర్సిటీలు సైతం దూరవిద్యా విధానంలో పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, ఐఎంటీ - ఘజియాబాద్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ వంటి ప్రముఖ యూనివర్సిటీలు ఫైనాన్షియల్ ట్యాక్స్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. సాఫ్ట్వేర్ కోర్సులు కూడా.. ట్యాక్సేషన్ రంగంలో ఇటీవల సాఫ్ట్వేర్ కోర్సులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈఆర్పీ సొల్యూషన్స్గా పేర్కొనే శాప్-ఫికోలో ట్యాక్సేషన్ ఒక సబ్జెక్టుగా ఉంటోంది. అదేవిధంగా అకౌంటింగ్ ప్యాకేజ్లుగా పేర్కొనే ట్యాలీ, వింగ్స్, పీచ్ ట్రీ కోర్సుల్లోనూ డెరైక్ట్ ట్యాక్సెస్, ఇన్డెరైక్ట్ ట్యాక్సెస్కు సంబంధించి నైపుణ్యాలు అందించే విధంగా కోర్సు స్వరూపం ఉంటోంది. పలు హోదాల్లో.. ట్యాక్సేషన్ విభాగంలో డిగ్రీ, డిప్లొమా, పీజీ కోర్సులు పూర్తిచేసిన వారికి అర్హతలకు తగిన విధంగా వివిధ సంస్థల్లో, ట్యాక్స్ కన్సల్టింగ్ కంపెనీల్లో పలు హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అవి.. ట్యాక్స్ అకౌంటెంట్, ట్యాక్స్ అనలిస్ట్, ట్యాక్స్ అడ్వైజర్, ట్యాక్స్ ఎగ్జామినర్, ట్యాక్స్ మేనేజర్, బిజినెస్ ట్యాక్స్ అడ్వైజర్, ఇన్కం ట్యాక్స్ అడ్వైజర్. ఆకర్షణీయ వేతనాలు ఎంట్రీ లెవల్లో ట్యాక్స్ అకౌంటెంట్గా కనిష్టంగా రూ.15 వేలతో కెరీర్ ప్రారంభించొచ్చు. ప్రాపర్టీ ట్యాక్స్ అడ్వైజర్/మేనేజర్ స్థాయిలో గరిష్టంగా నెలకు రూ.40 నుంచి రూ.45 వేల వరకు వేతనం లభించే అవకాశం ఉంది. స్వయం ఉపాధి.. ట్యాక్సేషన్ విభాగంలో స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సొంతంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి క్లయింట్లకు ఔట్సోర్సింగ్ విధానంలో సేవలందించొచ్చు. అయితే ఈ విషయంలో అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ నెట్వర్క్ బాగా ఉంటేనే క్లయింట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఆ మూడు సంస్థల్లో స్పెషలైజ్డ్ కోర్సులు కామర్స్ కెరీర్స్ అనగానే గుర్తొచ్చే మూడు ఇన్స్టిట్యూట్లు.. ఐసీఏఐ (ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా), ఐసీడబ్ల్యూఏఐ (ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా), ఐసీఎస్ఐ (ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా). ఇప్పుడు ఇవి కూడా సర్వీస్ ట్యాక్స్, వెల్త్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్డెరైక్ట్ ట్యాక్సెస్లో సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నాయి. ప్రస్తుతం ట్యాక్స్ ఫైలింగ్, రిటర్న్స్ దాఖలు విషయాల్లో ఈ-ఫైలింగ్ విధానం అందుబాటులోకి వచ్చినా ట్యాక్సేషన్ నిపుణులకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ వంటి రూపాల్లో ముందుగానే పన్ను చెల్లింపులు చేసిన వ్యక్తులు, సంస్థలు ఆర్థిక సంవత్సరం చివరలో దాఖలు చేసే రిటర్న్స్ సమయంలో మినహాయింపులు ఆశించడం. ఇందుకోసం ట్యాక్సేషన్ నిపుణులను సంప్రదిస్తున్నారు. చిన్న పట్టణాల నుంచి మెట్రో సిటీల వరకు బహుళ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. - ఆర్. చెంగల్ రెడ్డి, ఐసీఏఐ హైదరాబాద్ బ్రాంచ్ వైస్ చైర్మన్. -
నీట్ - పీజీ
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్).. జాతీయ స్థాయిలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్ష. ఇప్పటికే నీట్యూజీ ద్వారా2016 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. తాజాగా నీట్-పీజీ 2017 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పరీక్ష విధివిధానాలు.. నీట్ పీజీ ఉద్దేశం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్-పీజీ నిర్వహిస్తారు. ఇందులో ర్యాంకు ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. నీట్-పీజీ అర్హత వివరాలు ఎంబీబీఎస్, ఎంసీఐ ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. 2017, మార్చి 31 లోపు రొటేటరీ ఇంటర్న్షిప్ పూర్తిచేయాలి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 2017, ఏప్రిల్ 15 లోపు రొటేటరీ ఇంటర్న్షిప్ పూర్తిచేసి ఉండాలి. ఆ ఆరు మినహా.. దేశంలోని ఆరు ఇన్స్టిట్యూట్లు నీట్ పీజీ పరిధిలోకి రాకుండా మినహాయింపు ఇచ్చారు. అవి.. ఎయిమ్స్-న్యూఢిల్లీ; పీజీఐఎంఈఆర్-చండీగఢ్, జిప్మర్ -పుదుచ్చేరి, ఎస్జీపీజీఐఎంఎస్-లక్నో, నిమ్హాన్స్-బెంగళూరు, శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ- తిరువనంతపురం. ఈ ఇన్స్టిట్యూట్లు తమ పరిధిలోని సీట్ల భర్తీకి వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తాయి. అభ్యర్థులు సైతం వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఇలా నీట్ పీజీ పరీక్షను 300 మార్కులకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కులుండవు. మొత్తం 300 ప్రశ్నలు ఉండే పరీక్షలో ఎంబీబీఎస్ స్థాయిలోని 15 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అవి.. ఫోరెన్సిక్ మెడిసిన్, ఆప్తాల్మాలజీ, సైకియాట్రిక్స్ ఒక్కో విభాగం నుంచి పది ప్రశ్నలు ఠి అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పీడియాట్రిక్స్ ఒక్కో విభాగం నుంచి 15 ప్రశ్నలు ఠి పాథాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఆబ్స్ట్రెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు ఠి మెడిసిన్, డెర్మటాలజీ, వెరనాలజీ విభాగాల నుంచి 37 ప్రశ్నలు ఠి సర్జరీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్స్, అనస్థీషియా విభాగాల నుంచి 46 ప్రశ్నలు ఠి రేడియో డయాగ్నసిస్, రేడియో థెరపీ విభాగాల నుంచి 12 ప్రశ్నలు ఠి ఫార్మకాలజీ, మైక్రో బయాలజీ ఒక్కో విభాగంలో 20 ప్రశ్నలు. కనీస అర్హత మార్కులు సాధిస్తేనే నీట్ -పీజీలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 40 శాతం కనీస మార్కులు సాధించాలి. వీరిని మాత్రమే కౌన్సెలింగ్కు పిలుస్తారు. కౌన్సెలింగ్ ఇలా.. ఠి ఆల్ ఇండియా కోటాలో 50 శాతం: దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ప్రవేశానికి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు. వీరు ఆన్లైన్ విధానంలో సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 50 శాతం మేరకు అందుబాటులో ఉండే సీట్లకు ఐదింతలు ఎక్కువగా మాత్రమే అభ్యర్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. అంటే ఒక్కో సీటుకు ఐదుగురు చొప్పున కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. స్టేట్ కోటాలో 50 శాతం: ఆల్ ఇండియా కోటాకు 50 శాతం సీట్లు పోగా మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల పరిధిలో ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. ఏపీ, టీఎస్లకు వర్తించని ఆల్ ఇండియా కోటా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు ఆల్ ఇండియా కోటా సీట్లకు పోటీ పడే అర్హత లేదు. వీరు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని కళాశాలలకు మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31, 2016. ఆన్లైన్ పరీక్ష తేదీలు: డిసెంబర్ 5 నుంచి 13 వరకు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఉమ్మడి పరీక్ష ప్రయోజనకరం పీజీ స్థాయిలో నీట్ పేరుతో జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడం విద్యార్థులకు ప్రయోజనకరం. మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో పోటీ పడే అవకాశం లేకపోయినా.. బహుళ ఎంట్రెన్సులు రాయాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశించాలంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించే ఏపీపీజీమెట్, నిమ్స్ నిర్వహించే పీజీ మెట్లు రాయాల్సి ఉండేది. ఎంబీబీఎస్ స్థాయిలో బేసిక్స్, ప్రివెంటివ్ మెడిసిన్పై అవగాహన ఉన్నవారు మెరుగైన మార్కులు సొంతం చేసుకోవచ్చు. - డాక్టర్. నంద కిశోర్, ఎంసీఐ సభ్యులు -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
గ్రూప్స్, పోలీస్ కానిస్టేబుల్స్ తది తర పరీక్షల్లో నదులు, వాటి అనుబంధ అంశాలకు ఎలా par సిద్ధమవ్వాలి?ఙ- ఎస్.ప్రవీణ్ కుమార్, ఖమ్మం. ఉద్యోగ నియామక పరీక్షల కోణంలో చూస్తే ‘భారతదేశం-నదీ వ్యవస్థ’ విభాగం కీలకమైంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే వీటి నుంచి రెండు, మూడు పశ్నలు వస్తున్నట్లు గమనించవచ్చు. తూర్పు, పశ్చిమం, దక్షిణం వైపునకు ప్రవహించే నదులు, వాటి జన్మస్థానాలు, వేర్వేరు ప్రాంతాల్లో వాటి పేర్లు, ఉప నదులు, పరీవాహక ప్రాంతాలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వివిధ నదులపై నిర్మించిన ప్రాజెక్టుల గురించి కూడా తెలుసుకోవాలి. అంతర్ భూభాగ నదీ వ్యవస్థపైనా అవగాహన అవసరం. గతంలో జరిగిన ఒక పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్లో ఏ నదిని దక్షిణ గంగ అని పిలుస్తారు? అనే ప్రశ్న వచ్చింది. దీనికి సరైన సమాధానం ‘గోదావరి’. భారతదేశంలో పొడవైన నది గంగా. దక్షిణ భారతదేశంలో పొడవైన నది గోదావరి. ఒక నది గురించి చదువుతున్నప్పుడు ఇలాంటి అంశాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. అప్పుడు ఏ అంశం నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా కచ్చితమైన సమాధానం గుర్తించవచ్చు. కొన్నిసార్లు ఇలాంటి సులభతరమైన ప్రశ్నలే అడిగినా.. పెరుగుతున్న పోటీ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వీటిపై ఇంకాస్త కఠినమైన ప్రశ్నలూ ఇవ్వొచ్చు. అందువల్ల నదులు, వాటి పొడవు, అవి ప్రవహించే రాష్ట్రాలు, వాటిపై ఉన్న ప్రాజెక్టులు తదితర అంశాలను పట్టిక రూపంలో రూపొందించుకుని రివిజన్ చేయాలి. ఇలా చేయడం వల్ల చదివిన విషయాలు మరచిపోవడానికి అవకాశం ఉండదు. దీంతోపాటు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను సాధన చేయాలి. అప్పుడే సబ్జెక్టుపై పట్టు లభిస్తుంది. -
1857 తిరుగుబాటు ప్రారంభమైన రోజు?
డల్హౌసీ విద్యా సంస్కరణలకు సహకరించిన అధికారి? - చార్లెస్ ఉడ్ మాగ్నాకార్టాగా పేర్కొనే విద్యా ప్రణాళిక? - చార్లెస్ ఉడ్ ప్రణాళిక భారత్లో తొలి ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించినవారు? - డల్హౌసీ భారతీయ మగ్గాలపై ఆంగ్లేయులు విధించిన పన్ను? - మోతుర్పా ఐసీఎస్కు ఎన్నికైన తొలిభారతీయుడు?ఙ- సత్యేంద్రనాథ్ ఠాగూర్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని తొలి న్యాయశాఖ సభ్యుడు ఎవరు? - మెకాలే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరం? - 1835 హంటర్ కమిషన్ను 1882లో నియమించిన వైస్రాయ్? - లార్డ రిప్పన్ కిత్తురు రుగుబాటుకు నాయకత్వం వహించిన స్త్రీ? - రాణీ చెన్నమ్మ 1857 తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా పేర్కొన్నవారు? - వి.డి.సావర్కర్ వి.డి. సావర్కర్ 1857 తిరుగుబాటుపై రచించిన గ్రంథం? - ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స క్రైస్తవ మత ప్రచారానికి అవకాశం కల్పించిన చట్టం? - 1813 చట్టం మొట్టమొదటి సిపాయి తిరుగుబాటు జరిగిన సంవత్సరం? - 1806 (వేలూరు) 1857 తిరుగుబాటు ప్రారంభమైన ప్రాంతం? - మీరట్ (ఉత్తరప్రదేశ్) 1857 తిరుగుబాటు ప్రారంభమైన రోజు?- 1857 మే 10 తాంతియాతోపే అసలు పేరు- రామచంద్ర పాండురంగ లక్ష్మీబాయి అసలు పేరు? - మణికర్ణిక (మనూబాయి) ఝాన్సీ లక్ష్మీబాయి భర్త, ఝాన్సీ పాలకుడు? - గంగాధర్రావు ఝాన్సీ లక్ష్మీబాయిని ఓడించిన ఆంగ్ల సేనాని? - సర్ హ్యూగ్ రోజ్ ఈస్టిండియా కంపెనీ పాలన అంతరించిన సంవత్సరం? - 1858 హత్యకు గురైన ఏకైక వైస్రాయ్? - మేయో ముస్లింలీగ్ పార్టీ కాంగ్రెస్తో చేసుకున్న ఒడంబడిక? - లక్నో ఒడంబడిక హోంరూల్ ఉద్యమాన్ని మొట్టమొదట ప్రారంభించినవారు? - బాల గంగాధర్ తిలక్ 1916 ఏప్రిల్లో బాలగంగాధర్ తిలక్ హోంరూల్ ఉద్యమాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారు? - పూనా నుంచి హోంరూల్ ఉద్యమ కాలంలో తిలక్ ఇచ్చిన నినాదం? - స్వరాజ్యం నా జన్మహక్కు హోంరూల్ ఉద్యమ కాలంలో తిలక్కు ఇచ్చిన బిరుదు? - లోకమాన్య హోంరూల్ ఉద్యమ కాలం నాటి వైస్రాయ్?ఙ- ఛేమ్స్ఫర్డ నాసిక్ కుట్ర కేసులో ఎవరికి ఉరి శిక్ష విధించారు? - అనంత లక్ష్మణ్ అరవింద ఘోష్ సోదరుడు? - బదీంద్ర ఘోష్ అలీపూర్ బాంబ్ కేసులో ప్రధాన ముద్దాయి? - అరవింద్ ఘోష్ లండన్లో ఇండియన్ సోషియాలజిస్ట్ అనే పత్రిక ద్వారా విప్లవాన్ని ప్రచారం చేసినవారు? - శ్యాంజీ కృష్ణవర్మ గదర్ పార్టీ ఏర్పడిన సంవత్సరం? - 1913 గదర్ అంటే అర్థం? - తిరుగుబాటు మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ జన్మదినం? - 1869 అక్టోబర్ 2 (గుజరాత్లోని పోరుబందర్లో) దక్షిణాఫ్రికాలో గాంధీజీ నడిపిన పత్రిక - ఇండియన్ ఒపీనియన్ భారత్లో బిపిన్ చంద్రపాల్ నడిపిన పత్రిక? - న్యూ ఇండియా తిలక్ జన్మించిన ప్రదేశం? - పూనా 1906లో కలకత్తాలో శివాజీ ఉత్సవాలను ప్రారంభించినవారు? - బాల గంగాధర్ తిలక్ ఆనంద్మఠ్ గ్రంథం రచించినవారు?ఙ- బకిం చంద్ర ఛటర్జీ (1882) బెంగాల్ కెమికల్ కర్మాగారాన్ని స్థాపించినవారు? - ప్రఫుల్ల చంద్రరాయ్ స్లింలీగ్ పార్టీని స్థాపించిన సంవత్సరం? - 1906 సాధుజన పరిపాలనా సంఘం స్థాపకులు? - అయ్యంకాళి సూరత్ కాంగ్రెస్ సమావేశంలో అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన మితవాద నాయకుడు? - రాస్ బిహారీ ఘోష్ తిలక్ నాయకత్వంలో అతివాదులు ఏర్పరచుకున్న పార్టీ? - నేషనల్ పార్టీ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పరచిన చట్టం? - 1909 చట్టం 1909 లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు? - మదన్ మోహన్ మాలవ్య హోంరూల్ ఉద్యమ నాయకులు? - బాలగంగాధర తిలక్, అనీబిసెంట్ తిలక్.. మాండలే జైల్లో ఉన్న కాలం? - 19081914 బెంగాల్ గెజిట్ను స్థాపించినవారు?ఙ- జేమ్స్ అగస్టస్ హిక్కీ కేశవ చంద్రసేన్ స్థాపించిన ఆంగ్ల పత్రిక? - ఇండియన్ మిర్రర్ (ఆంగ్లంలో తొలి దినపత్రిక) తెలుగులో తొలి పత్రిక? - సత్యదూత (బళ్లారి క్రైస్తవ సంఘం స్థాపించిన ఈ పత్రిక 1835లో వెలువడింది) జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తొలి ముస్లిం? - బద్రుద్దీన్ త్యాబ్జీ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు, తొలి విదేశీయుడు, తొలి క్రైస్తవుడు? - జార్జి యూల్ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పనిచేసిన తొలి ఆంధ్రుడు? - పి. ఆనందాచార్యులు గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక కాంగ్రెస్ సమావేశం? - బెల్గాం (1924) జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ? - సరోజినీ నాయుడు కాంగ్రెస్ చరిత్రను రచించినవారు? - భోగరాజు పట్టాభి సీతారామయ్య కాంగ్రెస్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. నా పదవీ కాలంలో అది సులభంగా చనిపోయేందుకు సాయపడటమే నాకున్న పెద్ద కోరిక అని ప్రకటించిన వైస్రాయ్? - కర్జన్ బెంగాల్ను విభజించిన వైస్రాయ్కర్జన్ (1905, జూలై 20న) బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన r తేదీ?- 1905, అక్టోబర్ 16 లాలా లజపతిరాయ్ బిరుదు?- పంజాబ్ కేసరి 1926లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశంలో par పాల్గొన్నవారు?ఙ- లాలా లజపతిరాయ్ లాలా లజపతిరాయ్ నడిపిన పత్రికలు? - 1. వందేమాతరం (ఉర్దూ) 2. పీపుల్ (ఇంగ్లిష్) జ్యోతిరావు పూలే నాకు స్ఫూర్తిప్రదాత అని ప్రకటించిన మేధావి? - బి.ఆర్. అంబేద్కర్ ఆర్యసమాజ స్థాపకుడు?ఙ- స్వామి దయానంద సరస్వతి (1875లో) ఆర్యసమాజానికి ప్రామాణిక గ్రంథం?ఙ- సత్యార్థ ప్రకాశిక స్వామి దయానంద సరస్వతి తొలి సందేశాన్ని వినిపించిన par ప్రాంతం?ఙ- హరిద్వార్ స్వామి వివేకానంద అసలు పేరు? - నరేంద్రనాథ్ దత్తా భారతదేశం నా స్వర్గం, భారతదేశ శ్రేయస్సే నా శ్రేయస్సు, భారతీయుడనని గర్వించు, ప్రతి భారతీయుడు నా సోదరుడే అని సగర్వంగా ప్రకటించు.. అని జాతీయతను par ప్రబోధించినవారు?ఙ- స్వామి వివేకానంద భారత్లో దివ్యజ్ఞాన సమాజ తొలి శాఖ ఏర్పడిన ప్రాంతం? - బొంబాయి (1879)్యూయార్క నుంచి దివ్యజ్ఞాన సమాజ ప్రధాన కార్యాలయాన్ని మార్చిన ప్రాంతం? - అడయార్ (తమిళనాడు) బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించిన సంవత్సరం? - 1916 అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు?ఙ- సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఏర్పడిన సంవత్సరం? - 1920 గాంధీజీ వద్దకు రాయబారిగా వైస్రాయ్ హార్డింజ్ ఏ మితవాద నాయకుడిని పంపించారు? - గోపాలకృష్ణ గోఖలే గాంధీజీ గురువు? - గోపాలకృష్ణ గోఖలే గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చిన సంవత్సరం? - 1915 (జనవరి 9) జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన రోజు? - 1919, ఏప్రిల్ 13 (వైశాఖ పౌర్ణమి రోజున) జలియన్ వాలాబాగ్ సంఘటనపై విచారణ జరపడానికి నియమించిన కమిషన్? - హంటర్ జలియన్ వాలాబాగ్ సంఘటనకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడు? - సర్ శంకరన్ నాయర్ జలియన్ వాలాబాగ్ సంఘటన అనంతరం పంజాబ్లో సైనిక శాసనాన్ని అమలు చేసి, అనేక మందికి మరణ శిక్షలు విధించిన పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్? - మైకేల్-ఓ-డయ్యర్ మైకేల్-ఓ-డయ్యర్ను లండన్లో కాల్చి చంపిన యువకుడు? - ఉద్దంసింగ్ సహాయ నిరాకరణోద్యమ కాలంలో గాంధీ వదులుకున్న par బిరుదు?ఙ- కైజర్-ఎ- హింద్ చౌరీ చౌరా సంఘటన జరిగిన , ఫిబ్రవరి 5 విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ఆమోదించిన జాతీయ జెండా రూపకర్త? - పింగళి వెంకయ్య -
తెలంగాణ హిస్టరీ
శాతవాహన వంశ స్థాపకుడు? - శ్రీముఖ శాతకర్ణి మౌర్య సామ్రాజ్య పతనానంతరం, శ్రీముఖుని నాయకత్వంలో శాతవాహనులు స్వతంత్రించారు అని తెలిపినవారు? - వి.ఎ. స్మిత్ శ్రీముఖ శాతకర్ణి ఆంధ్ర జాతీయుడు అని పేర్కొన్న పురాణం? - మత్స్య పురాణం శాతవాహనులు - ఆంధ్రులు ఒక్కరే అన్నవారు? - ఆర్.జి.భండార్కర్, వి.ఎ. స్మిత్, రాప్సన్ శాతవాహనుల జన్మస్థలం మహారాష్ర్ట అని పేర్కొన్నవారు? - పి.టి. శ్రీనివాస అయ్యంగార్ శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని వాదించినవారు? - వి.వి.మిరాశి శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని పేర్కొన్నవారు? -సూక్తాంకర్ శాతవాహనుల తొలి రాజధాని? - కోటిలింగాల ఏ శాతవాహన రాజుకు చెందిన నాణేలు పూనా సమీపంలో లభించాయి? -మొదటి శాతకర్ణి నానాఘాట్ శాసన కర్త? - నాగానిక సాంచీ స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించిన రాజు? - రెండో శాతకర్ణి రెండో శాతకర్ణి.. శుంగుల రెండో రాజధాని విదిశను జయించాడని పేర్కొనే గ్రంథం? - గార్గి సంహిత తన పేరు మీద తొలిసారిగా శాసనాలు వేయించిన శాతవాహన రాజు? - మొదటి పులోమావి ఏ రాజు కాలంలో గౌతమీ బాలశ్రీ.. నాసిక్ శాసనం వేయించింది? - వాశీష్టపుత్ర పులోమావి నహపాణుడి పునర్ముద్రిత నాణేలు ఎక్కడ లభించాయి? - జోగల్తంబి ఆంధ్ర రాజులు సుశర్మను చంపి మగధను ఆక్రమించినట్లు పేర్కొనే పురాణం? - మత్స్య పురాణం కామర్థకవంశ చష్టానుడు.. వాశీష్ఠపుత్ర పులోమావి సమకాలీనుడు అని తెలిపిన విదేశీ రచయిత? - టాలమీ రాజు పేరు ముందు తల్లి నామం పెట్టుకునే ఆచారం ఏ రాజుతో ప్రారంభమైంది? - గౌతమీపుత్ర శాతకర్ణి శ్రీముఖుడు మొదట ఆదరించిన మతం? - జైన మతం ‘కవి వత్సల’ అనే బిరుదున్న రాజు? - హాలుడు శాతవాహన వంశంలో అతి గొప్ప రాజు? - గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏ పేరుతో పిలిచేవారు? - ఆహారము భారత్లో తొలిసారిగా బ్రాహ్మణులకు భూ దానాలు ప్రారంభించిన రాజ వంశం? - శాతవాహనులు నిగమ సభల గురించి వివరిస్తున్న శాసనం? - భట్టిప్రోలు శాతవాహనుల కాలంలో గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉన్నాయని తెలిపే గ్రంథం? - గాథాసప్తశతి అమరావతి స్థూపాన్ని విస్తృతపరిచి, మహాచైత్య వలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి? - యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు? - భూమి శిస్తు శాతవాహనుల కాలంలో శ్రేణులు అంటే? - వృత్తి సంఘాలు శాతవాహనుల కాలంలో నౌకా వాణిజ్యాన్ని ప్రోత్సహించారని పేర్కొన్న శాసనం? - గుంటుపల్లి శాతవాహనుల రాజ భాష? - ప్రాకృతం సంస్కృతాన్ని రాజభాషగా చేసుకున్న రాజు? - కుంతల శాతకర్ణి నాణేలపై ఉజ్జయిని చిహ్నాన్ని ముద్రించిన రాజు? - మొదటి శాతకర్ణి సోమదేవసూరి రచించిన కథాసరిత్సాగరం ప్రకారం శాతవాహనుల మూలపురుషుడు? - శాతవాహనుడు శాతవాహనుల కాలంలో జనపదాలు అంటే? - సామంత రాజ్యాలు శాతవాహనుల శాసనాలు అన్నీ ఏ భాషలో, ఏ లిపిలో ఉన్నాయి? - ప్రాకృత భాషలో, బ్రాహ్మి లిపిలో శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన కుంద కుందనాచార్యుడు ఏ మతానికి చెందినవాడు? - జైనం నాసిక్, కన్హేరి గుహలను బౌద్ధ మతస్తులకు దానం చేసిన శాతవాహన రాజు? - కృష్ణుడు కార్లే గుహలను మహాసాంఘిక బౌద్ధశాఖకు దానం చేసిన రాజు? - రెండో పులోమావి అజంతా గుహల్లోని 9, 10 గుహలు ఏ యుగానికి చెందినవి? - శాతవాహనులు గాథాసప్తశతిని పోలిన గ్రంథం ‘వజ్జలగ్గ’ను రచించింది? - జయవల్లభ శాతవాహనుల కాలంలో రాతిలో తొలిచిన చైత్యం ఎక్కడ ఉంది? - గుంటుపల్లి శ్రీ పర్వతం వద్ద శైల మండపాలు నిర్మించిన రాజు? - యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనుల కాలంలో బౌద్ధ స్థూపాలను వేటితో నిర్మించారు? - ఇటుకలు ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విలసిల్లిన శాతవాహనుల రేవు పట్టణం? - ఘంటసాల శాతవాహనుల కాలంలో విదేశీ వాణిజ్యాన్ని నిర్వహించిన వర్తకులు? - స్థారవాహులు శాతవాహనుల కాలానికి సంబంధించిన రోమ్ దేశ నాణేలు ఏ ప్రాంతంలో లభించాయి? - కొండాపూర్ బృహత్కథను గుణాఢ్యుడు ఏ భాషలో రచించాడు? - పైశాచీ భాష శాతవాహనుల కాలంలో ఒక సువర్ణ (బంగారు) నాణేనికి ఎన్ని కార్షపణాలు (వెండి)? - 1:35 (ఒక బంగారు నాణేనికి 35 కార్షపణాలు) శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు? - 12 శాతం శాతవాహనుల కాలంలో వృత్తి పన్ను? - కారుకర ఏ శాతవాహన రాజు కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశానికి విస్తరించింది? - మొదటి కృష్ణుడు ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు? - సుహృల్లేఖ, ఆరోగ్య మంజరి, ప్రజ్ఞా పారమిత, మాధ్యమిక కారిక బౌద్ధ మతస్తుల కోసం నాగానిక తొలిపించిన గుహలు? - నానాఘాట్ ‘బెణకటకస్వామి’ అని బిరుదు గల శాతవాహన రాజు? - గౌతమీపుత్ర శాతకర్ణి గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు? - శకారి, ఆగమనిలయ, క్షహరాట వంశ నిషేశకర, త్రిసముద్రతోయ పీతవాహన క్రీ.శ. 78లో శాలివాహన శకాన్ని ప్రారంభించింది? - గౌతమీపుత్ర శాతకర్ణి గ్రూప్- 2 ప్రత్యేకం శాసనాల ప్రకారం ఇక్ష్వాకు వంశ మూల పురుషుడు? - వాశీష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు ఏ రాజును ఓడించి ఇక్ష్వాకులు విజయపురిలో అధికారాన్ని స్థాపించారు? - మూడో పులోమావి ఇక్ష్వాకులు స్థానికులు అని వాదించిన చరిత్రకారుడు? - కాల్డ్వెల్ ఇక్ష్వాకులు కర్ణాటక ప్రాంతం నుంచి ఆంధ్రకు వలస వచ్చారని పేర్కొన్నవారు? - వోగేల్ శ్రీశాంతమూలుడు ఏ మతాన్ని ఆదరించాడు? - వైదిక మతం ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని పేర్కొనే పురాణం? - విష్ణు పురాణం రెంటాల, దాచేపల్లి, కెసానపల్లి శాసనాలు వేయించిన ఇక్ష్వాక par రాజు?ఙ- శ్రీశాంతమూలుడు శతసహస్రహలక, మహాదానపతి బిరుదులు కలిగిన ఇక్ష్వాక par రాజు?ఙ- శ్రీశాంతమూలుడు ఇక్ష్వాకుల చరిత్రకు మూలాధారాలైన శాసనాలు? - నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి వీరపురుష దత్తుడి కాలంలో మహాచైత్య నిర్మాణానికి ఆయక స్తంభాన్ని ప్రతిష్టించింది ఎవరు? - అడవి శాంతిశ్రీ నాగార్జునకొండ వద్ద చుళ్లదర్మగిరిపై చైత్యగృహాన్ని నిర్మించింది? - ఉపాసిక బోధిశ్రీ మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం ఏ రాజు కాలంలో ప్రారంభమైంది? - వీరపురుష దత్తుడు ఏ రాజు కాలాన్ని ఆంధ్రలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు? వీరపురుషదత్తుడు అశ్వమేథయాగం చేసిన ఇక్ష్వాక రాజు? - శ్రీశాంతమూలుడు ఇక్ష్వాకుల రాజభాష? - ప్రాకృతంఙఞ్చటరాజు.. శివలింగాన్ని కాలితో తొక్కుతూ, బౌద్ధులకు అభయం ఇస్తున్న శిల్పం ఏ ప్రాంతంలో లభించింది? - నాగార్జునకొండ ఇక్ష్వాకుల రాజ చిహ్నం? - సింహం భారతదేశంలో తొలి వైదిక (హిందూ) దేవాలయాలు నిర్మించిన రాజులు? - ఇక్ష్వాకులు ఏ ఇక్ష్వాక రాజు కాలంలో శ్రీ పర్వతం మహాయాన మతానికి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లింది? - వీరపురుషదత్తుడు దక్షిణ భారతదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించిన రాజు? - ఎహుబల శాంతమూలుడు ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన వృత్తి? - వ్యవసాయం హారతి అంటే? - చిన్న పిల్లలను రక్షించే దేవత వీరగల్ అంటే? - యుద్ధంలో మరణించిన వీరుల స్మారక చిహ్నాలు ఇక్ష్వాకుల కాలం నాటి వృత్తి పన్నుల గురించి వివరిస్తున్న శాసనం? - విషవట్టి శాసనం ఇక్ష్వాకుల కాలంలో ప్రముఖ వర్తక శ్రేణులు? - పర్నిక శ్రేణి, పుసిన శ్రేణి మొదటిసారిగా ఆయా నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కే సంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైంది? - ఇక్ష్వాకులు విష్ణుకుండినులు విష్ణుకుండిన వంశ స్థాపకుడు? - ఇంద్ర వర్మ ప్రముఖ చరిత్రకారుడు పి.వి. పరబ్రహ్మశాస్త్రి ప్రకారం విష్ణుకుండినుల రాజధాని? - ఇంద్రపాల నగరం ప్రముఖ చరిత్రకారుడు పి.వి.కృష్ణశాస్త్రి ప్రకారం విష్ణుకుండినుల రాజధాని? - కీసర పి.వి.పరబహ్మ్రశాస్త్రి ప్రకారం స్వతంత్ర విష్ణుకుండిన రాజ్య స్థాపకుడు? - మొదటి గోవింద వర్మ విష్ణుకుండినుల రాజ లాంఛనం? - సింహం చైతన్యపురి వద్ద విహారాన్ని నిర్మించిన విష్ణుకుండిన రాజు? - గోవింద వర్మ విష్ణుకుండినుల రాజభాష? - సంస్కృతం విష్ణుకుండినుల ఆరాధ్య దైవం? - శ్రీపర్వత స్వామి రెండో మాధవవర్మ కాలంలో అమరావతి స్థూపం.. అమరేశ్వరాలయంగా మారిందని పేర్కొన్న చైనా యాత్రికుడు? - హ్యుయాన్త్సాంగ్ మాధవవర్మకు ‘త్రివర నగర భువన యువతి ప్రియ’ అనే బిరుదు ఉన్నట్లు తెలిపే శాసనం? - పొలమూరు శాసనం జనాశ్రయ అనే బిరుదు కలిగిన విష్ణుకుండిన రాజు? - మాధవ వర్మ-3 కుమారుడికి మరణశిక్ష విధించిన విష్ణుకుండిన రాజు? - మూడో మాధవ వర్మ ఘటికలు అంటే? - బ్రాహ్మణ విద్యాకేంద్రాలు తెలంగాణలో లభిస్తున్న తొలి ప్రాకృత శాసనం? - చైతన్యపురి శాసనం తెలంగాణలో తొలి లక్షణ గ్రంథం? - జనాశ్రయచ్ఛందోవిచ్ఛిత్తి న్యాయపాలన ప్రస్తావన ఉన్న విష్ణుకుండినుల శాసనం? - పొలమూరు గుల్మిక అంటే? - సరిహద్దు రాష్ట్రాల సైనిక రాజ ప్రతినిధి భారతదేశంలో మొదటి హిందూ గుహాలయాలు నిర్మించిన రాజవంశం? - విష్ణుకుండినులు విష్ణుకుండినులు ముద్రించిన నాణేలు? - ఇనుప నాణేలు ఉత్పత్తి పిడుగు అంటే? - శిల్పుల శ్రేణి ఉండవల్లి గుహల్లో ఉన్న ఏ విగ్రహాన్ని పడుకుని ఉన్న అనంత పద్మనాభస్వామి విగ్రహంగా మార్చారు? - నిల్చున్న బుద్ధుడి విగ్రహం విష్ణుకుండినుల నాణేలపైముద్రించిన ముద్రలు? - సింహం, శంఖువు కొప్పు నరేష్ సబ్జెక్టు నిపుణులు -
భారతదేశ చరిత్ర
ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రధానమంత్రిని ఏమని పిలిచేవారు? - వజీర్ ఢిల్లీ సుల్తానుల పాలనలో సైనిక మంత్రిని ఏమని పిలిచేవారు? - దివాన్ - ఇ - అరీజ్ ఇస్లాం చట్టాలను ఏ పేరుతో పిలుస్తారు? - షరియత్ ‘సుల్తానుల కిరీటంలోని ప్రతి ముత్యం పేద రైతుల కన్నీటి నుంచి ఘనీభవించిందే’ అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? - అమీర్ ఖుస్రూ ఢిల్లీ సుల్తానుల కాలంలో హిందువులను ఏమని పిలిచేవారు? - జిమ్మీలు భారతదేశంలో చిస్తీ శాఖను ఎవరు స్థాపించారు? - షేక్ అబ్దుల్లా చిస్తీ అక్బర్ గౌరవాన్ని స్వీకరించిన సూఫీ సాధువు ఎవరు? - షేక్ సలీం చిస్తీ భారతదేశంలో ఖాద్రీ శాఖను ఎవరు ప్రవేశపెట్టారు? - షేక్ జిలానీ ఖాద్రీ ఖాద్రీ శాఖకు చెందిన మొగల్ వంశ రాకుమారుడు ఎవరు? - దారాషుకో సూఫీల వల్ల అభివృద్ధి చెందిన భాష ఏది? - ఉర్దూ విజయనగర సామ్రాజ్యానికి తొలి రాజధాని ఏది? - అనెగొంది తుంగభద్ర నదీ తీరంలో ఏడు కొండల మధ్య ఉన్న రాజధాని ఏది? - విజయనగర విద్యానగరం మధురా విజయం గ్రంథకర్త ఎవరు? - గంగాంబ (గంగాదేవి) మహాబలిపురంలో నిర్మించిన దేవాలయం ఏది? - తీర దేవాలయం పల్లవుల కాలంలో రాజభాష ఏది? - సంస్కృతం పల్లవులు స్థాపించిన సంస్కృత విద్యా సంస్థలను ఏమని పిలిచేవారు? - ఘటికలు మొదటి నరసింహవర్మ ఆస్థాన కవి? - భారవి భారవి రచించిన సంస్కృత గ్రంథం ఏది? - కిరాతార్జునీయం నయనార్లు అంటే? - శైవ మత గురువులు కంచిలో కైలాసనాథ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? - రెండో నరసింహ వర్మ గంగావతరణానికి మరో పేరు? - అర్జునుడి తపస్సు చోళుల రాజధాని నగరం ఏది? - తంజావూరు చోళుల రాజచిహ్నం ఏది? - పులి తంజావూర్ బృహదీశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు? - మొదటి రాజరాజు బృహదీశ్వరాలయానికి అసలు పేరు ఏది? - రాజరాజేశ్వర ఆలయం బృహదీశ్వరాలయ నిర్మాణం ఏ సంవత్సరంలో పూర్తయింది? - క్రీ.శ. 1009 రాజేంద్రుడి చేతిలో ఓటమి పాలైన శ్రీ విజయ రాజు ఎవరు? - విజయోత్తుంగ మారవర్మ అమ్మంగదేవిని వివాహం చేసుకున్న తూర్పు చాళుక్య రాజు ఎవరు? - రాజరాజ నరేంద్రుడు చోళుల కాలంలో గ్రామ సభలు ఏవి? - ఉర్, సభ, నగరం భూస్వాములు సభ్యులుగా ఉన్న సభ? - ఉర్ బ్రాహ్మణులు సభ్యులుగా ఉన్న సభ? - సభ వర్తకులు సభ్యులుగా ఉన్న సభ ? - నగరం చోళ రాజ్యంలో నిర్మించిన ప్రధాన రహదారులను ఏ పేరుతో పిలిచేవారు? - పేరూవాలీలు చైనా చక్రవర్తికి రాయబారాలు పంపిన చోళ పాలకుడు ఎవరు? - మొదటి కులోత్తుంగుడు తమిళ సాహిత్యంలో ‘కవి చక్రవర్తి’గా ప్రసిద్ధి చెందిన పండితుడు ఎవరు? - కంబన్ ంబన్ రచించిన ప్రముఖ తమిళ గ్రంథం ఏది? - తమిళ రామాయణం ‘పెరియ పురాణం’ గ్రంథకర్త ఎవరు? - శెక్కిలార్ కేశవస్వామి రచించిన సంస్కృత నిఘంటువు ఏది? - నానార్థ నవ సంక్షేమం చోళ యుగం కాలంలో పోతపోసిన విగ్రహాల్లో విశిష్టమైనవి ఏవి? - నటరాజ విగ్రహాలు నాలుగు చేతులు కలిగిన నటరాజస్వామి విగ్రహం ఉన్న ప్రధాన క్షేత్రం ఏది? - చిదంబర దేవాలయం రాజపుత్రుల చరిత్రపై విస్తృతమైన పరిశోధన చేసిన ఆంగ్లేయుడు? - కల్నట్ టాడ్ కల్నట్ టాడ్ రచించిన గ్రంథం ఏది? - రాజస్థాన్ కథావళి ‘పృథ్వీరాజ్ రాసో’ గ్రంథ రచయిత? - చాంద్ బర్దాయ్ మిహిర భోజుడి ఆస్థానాన్ని సందర్శించిన అరబ్ యాత్రికుడు ఎవరు? - సులేమాన్ ముస్లిం దాడులను ఎదుర్కోవడానికి ‘తురకదండు’ అనే పేరుతో పన్ను వసూలు చేసిన రాజపుత్ర వంశం ఏది? - గహద్వాలులు జయచంద్రుడి కూతురు రాణి సంయుక్తను వివాహం చేసుకున్న చౌహాన్ వంశ పాలకుడెవరు? - పృథ్వీరాజ్ చౌహాన్ ‘హిందూ జాతీయ వీరుడు’ అని ప్రశంసలందుకున్న చక్రవర్తి? -పృథ్వీరాజ్ చౌహాన్ ఢిల్లీ ప్రాంతాన్ని పాలించిన తొలి రాజవంశం ఏది? - తోమార చందేల రాజుల రాజధాని నగరం ఏది?- ఖజురహో (మధ్యప్రదేశ్) చందేల రాజుల్లో గొప్పవాడు ఎవరు? - విద్యాధరుడు ఖజురహోలో ప్రసిద్ధి చెందిన దేవాలయం? - కాందరీయ మహా దేవాలయం వజ్రయాన బౌద్ధాన్ని టిబెట్లో ప్రచారం చేసినవారు? - అతిశ దీపాంకరుడు లక్ష్మణసేనుని ఆస్థానకవులకు మరో పేరు? - పంచరత్నాలు పంచరత్నాల్లో ప్రముఖ కవి?- జయదేవుడు నలంద విశ్వవిద్యాలయాన్ని ఏ ముస్లిం సేనాని ధ్వంసం చేశాడు? - భక్తియార్ ఖిల్జీ కోణార్కలో ‘సూర్య దేవాలయం’ను ఎవరు నిర్మించారు? - నరసింహ దేవుడు రామానుజచార్యులు ఎక్కడ జన్మించారు? - తమిళనాడులోని పెరంబదూర్ రామానుజాచార్యులు స్థాపించిన మతం? - శ్రీ వైష్ణవం ద్వైత, అద్వైత సిద్ధాంతాలకు సమన్వయం సాధిస్తూ భేదాభేద సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు? - నింబార్కుడు క్షేమేంద్రుడు రచించిన గ్రంథం ఏది? - బృహత్ కథామంజరి రాజపుత్రుల కాలంలో కశ్మీర్ రాజుల చరిత్రను వివరించే గ్రంథం ఏది? - రాజతరంగిణి రాజతరంగిణి గ్రంథకర్త ఎవరు? - కల్హణుడు అరబ్బులు సింధూ ప్రాంతాన్ని ఎప్పుడు ఆక్రమించారు? - క్రీ.శ. 712 ు్ట్బలకు నష్టపరిహారం చెల్లించడానికి నిరాకరించిన సింధు రాజు? - దాహిర్ సంధ్ను ఆక్రమించిన అరబ్ సైన్యానికి నాయకుడు ఎవరు? - మహమ్మద్ బిన్ కాశీం అరబ్బుల దండయాత్రను ‘సత్ఫలితాలు ఇవ్వని ఘనవిజయం’గా వర్ణించిన చరిత్రకారుడు? - లేన్పూల్ అరబ్బులు ‘బంగారు నగరం’ అని దేన్ని పిలిచేవారు? - ముల్తాన్ బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి అనుమతి ఇచ్చిన ఇంగ్లండ్ రాణి? -మొదటి ఎలిజబెత్ బ్రిటిషర్లు మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు? - 1611 మచిలీపట్నానికి చేరిన ఆంగ్లేయ నౌక? - గ్లోబ్ మద్రాసు స్థావరాన్ని ఏర్పాటు చేసిన బ్రిటిష్ ఉద్యోగి ఎవరు? - ఫ్రాన్సిస్ డే మద్రాసు స్థావరాన్ని ఆంగ్లేయులకు ఇచ్చిన చంద్రగిరి పాలకుడు ఎవరు? - మూడో వెంకటపతి రాయలు (విజయనగర రాజు) ఆంగ్లేయులు, మూడో వెంకటపతి రాయలకు మధ్యవర్తిగా వ్యవహరించిన శ్రీకాళహస్తి వాస్తవ్యుడు ఎవరు? - దామెర్ల వెంకటాద్రి నాయుడు మద్రాసులో ఆంగ్లేయులు నిర్మించిన కోట? - సెయింట్ జార్జికోట కలకత్తా స్థావరాన్ని ఏర్పాటు చేసిన బ్రిటిష్ ఉద్యోగి? - జాబ్ చార్నాక్ జాబ్ చార్నాక్ కలకత్తా స్థావరాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం? - 1690 ఆంగ్లేయులకు బంగారు ఫర్మానా ఇచ్చిన గోల్కొండ సుల్తాన్? - అబ్దుల్లా కుతుబ్షా అబ్దుల్లా కుతుబ్షా బంగారు ఫర్మానాను జారీ చేసిన సంవత్సరం? - 1632 భారతదేశంలో ఫ్రెంచి వారి ప్రధాన స్థావరం ఏది? - పాండిచ్చేరి (పుదుచ్చేరి) రాబర్ట క్లైవ్ బిరుదు? - ఆర్కాట్ వీరుడు ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? - 1757 జూన్ 23 కలకత్తా చీకటి గది ఉదంతం జరిగిన సంవత్సరం? - 1756 కలకత్తా చీకటి గది ఉదంతాన్ని ప్రస్తావించిన ఆంగ్లేయుడు? - హాల్వెబ్ సిరాజుద్దౌలా కలకత్తాను ఆక్రమించి ఆ నగరానికి ఏ పేరు పెట్టాడు? - అలీ నగర్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం? - ప్లాసీ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసినవారు? - రాబర్ట క్లైవ్ బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? - 1764 అక్టోబర్ బక్సార్ యుద్ధం సమయంలో బెంగాల్ గవర్నర్ ఎవరు? - వాన్ సిట్టార్ ఎం.వెంకటరమణ రావు అసిస్టెంట్ ప్రొఫెసర్, నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్లగొండ. -
ఐఎఫ్ఎస్ ఎగ్జామ్..మెయిన్స్లో మెరుపులకు..
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్.. సివిల్ సర్వీసెస్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన పరీక్ష. అటవీ శాఖలో డివిజనల్ స్థాయి అధికారి హోదాతో కెరీర్ ప్రారంభించేందుకు మార్గం. ఇటీవల ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమినరీ ఫలితాలు వెల్లడయ్యాయి. మెయిన్ పరీక్షలు నవంబర్ 12 నుంచి జరగనున్నాయి.ఈ క్రమంలో మెయిన్లో విజయం సాధించి, తుదిదశ ఇంటర్వ్యూకు చేరుకునేందుకు వ్యూహాలు.. ప్రస్తుతం ఐఎఫ్ఎస్ మెయిన్ ఎగ్జామినేషన్లో రెండు ఆప్షనల్ సబ్జెక్టులకు సంబంధించిన నాలుగు పేపర్లు (ఒక్కో సబ్జెక్ట్లో రెండు పేపర్లు) రాయాల్సి ఉంటుంది. సాధారణంగా ఔత్సాహిక అభ్యర్థులు ఒక ఆప్షనల్ను తమ అకడమిక్ నేపథ్యం నుంచి ఎంపిక చేసుకుంటారు. మరో ఆప్షనల్ పూర్తిగా కొత్త సబ్జెక్టు. యూపీఎస్సీ నిబంధన కూడా ఇదే రీతిలో ఉంది. ఒకే స్వరూపం ఉండే సబ్జెక్ట్లనే రెండు ఆప్షనల్స్గా తీసుకోకూడదని నిబంధన విధించింది. ఉదాహరణకు అగ్రికల్చర్ సబ్జెక్ట్ను ఆప్షనల్గా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు రెండో ఆప్షనల్గా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ను ఎంపిక చేసుకునేందుకు వీల్లేదు. అదే విధంగా బీటెక్ అర్హతతో పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు రెండు ఆప్షనల్స్ను ఇంజనీరింగ్ నేపథ్యం సబ్జెక్టుల నుంచి ఎంపిక చేసుకోకూడదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థులు ముందుగా తమ అకడమిక్ నేపథ్యానికి సంబంధంలేని, కొత్తగా ఎంపిక చేసుకున్న సబ్జెక్టుతో మెయిన్స్ ప్రిపరేషన్ ప్రారంభించాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్తో.. అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో అప్లికేషన్ ఓరియెంటేషన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. సబ్జెక్టుకు సంబంధించిన బేసిక్స్, కాన్సెప్టులపై పట్టు సాధిస్తూనే వాటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే విధంగా నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా జియాలజీ, సివిల్ ఇంజనీరింగ్, జువాలజీ సబ్జెక్టులను ఆప్షనల్స్గా ఎంపిక చేసుకున్న వారికి ఇది అత్యంత ఆవశ్యకం. ఆయా రంగాల్లో తాజా పరిణామాల గురించి తెలుసుకుంటూ వాటికి సబ్జెక్టు నేపథ్యాన్ని అన్వయించే నైపుణ్యంతో ముందుకు సాగాలి. ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్, డయాగ్రమ్స్... ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు తాము చదివే అంశాలను ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్, డయాగ్రమ్స్ రూపంలో షార్ట్కట్ మెథడ్లో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, జువాలజీ, బోటనీ సబ్జెక్టులకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. రివిజన్ పరంగా సమయం ఆదా అవుతుంది. జీకే.. జనరల్గా... ఐఎఫ్ఎస్ మెయిన్ ఎగ్జామినేషన్లో అభ్యర్థులు బాగా దృష్టిసారించాల్సిన పేపర్ జనరల్ నాలెడ్జ్. ఇందులో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర కోర్ సబ్జెక్టుల నుంచి కాంటెంపరరీ అంశాల వరకు అన్నింటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ఆయా సబ్జెక్టులకు సంబంధించి బేసిక్స్పై అవగాహన ఏర్పరచుకుంటూ.. ప్రస్తుతం సంబంధిత విభాగాల్లో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. రైటింగ్ ప్రాక్టీస్.. ప్రిపరేషన్ పరంగా అనుసరించాల్సిన మరో వ్యూహం రైటింగ్ ప్రాక్టీస్. అభ్యర్థులు ప్రతిరోజూ ఒక సబ్జెక్ట్కు సంబంధించి ఒక అంశాన్ని చదవడం పూర్తిచేశాక.. దాన్ని ‘ప్రశ్న - సమాధానం’ కోణంలో స్వయంగా విశ్లేషిస్తూ రాయాలి. దీనివల్ల తాము ఆ అంశానికి సంబంధించి ఏ స్థాయిలో ప్రిపరేషన్ సాగించామో తెలుస్తుంది. అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించేలా... ప్రిపరేషన్ సమయంలో అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించేలా టైం టేబుల్ రూపొందించుకోవాలి. కనీసం రోజుకు పది గంటలు చదవాలి. అక్టోబర్ చివరి వారం నాటికి సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ పూర్తి చేసుకుని.. తర్వాత రివిజన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. సివిల్స్ మెయిన్స్కు కూడా అర్హత లభిస్తే... సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ రెండింటికీ ప్రిలిమ్స్ పరీక్ష ఒకటే ఉంటుంది. ఈ క్రమంలో అధిక శాతం మంది అభ్యర్థులు ఐఎఫ్ఎస్తోపాటు సివిల్స్ వైపు కూడా దృష్టి పెడుతున్నారు. ఐఎఫ్ఎస్తోపాటు సివిల్స్ మెయిన్స్కు సైతం అర్హత సాధించిన అభ్యర్థులు.. ప్రస్తుత సమయాన్ని పూర్తిగా ఐఎఫ్ఎస్ ప్రిపరేషన్కే కేటాయించాలి. ఆప్షనల్ పరంగా రెండు పరీక్షలకు ఒకే సబ్జెక్ట్ను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. రెండు పరీక్షల సిలబస్ను బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగిస్తే ఫలవంతంగా ఉంటుంది. -
నప్పే కొలువు.. నచ్చే కంపెనీ..
నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యాలున్న వారికి అవకాశాలు అపారం.మరి ఆ అవకాశాల్లో దేన్ని ఎంపిక చేసుకోవాలో తెలియని సందిగ్ధత. మరోవైపు రూ.లక్షల ప్యాకేజీతో ఉద్యోగంలో చేరినా.. కొద్దిరోజుల్లోనే నిరాసక్తతకు గురవుతున్న పరిస్థితి. ఈ క్రమంలో అన్ని విధాలా సరితూగే కొలువును ఎంపిక చేసుకోవాలన్నది నిపుణుల సూచన. క్యాంపస్ ప్లేస్మెంట్స్ సీజన్ ఊపందుకుంటున్న తరుణంలో సరైన కొలువు ఎంపికకు నిపుణుల సూచనలు.. ఆసక్తికి ప్రాధాన్యం ఉద్యోగ ఎంపికలో అభ్యర్థులు మొదట తమ వ్యక్తిగత ఆసక్తికి ప్రాధాన్యమివ్వాలి. ఉదాహరణకు ఫైనాన్స్ స్పెషలైజేషన్తో ఎంబీఏ చేసిన విద్యార్థులకు అకౌంటింగ్, ఆడిటింగ్ నుంచి పోర్ట్ ఫోలియో మేనేజ్మెంట్ వరకు జాబ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. వీటిలో తాము ఇష్టంగా పనిచేస్తూ, నైపుణ్యాలు పెంపొందించుకుంటూ మెరుగైన పనితీరుతో కెరీర్లో దూసుకెళ్లేందుకు దోహదపడే కొలువులో చేరడం మేలు. దీంతోపాటు జాబ్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో ప్రధానాంశం వ్యక్తిగత సామర్థ్యం. ఆయా జాబ్ ప్రొఫైల్స్ పరంగా విధుల్లో మంచి పనితీరు కనబరిచే సామర్థ్యం ఉందా? అనే దానిపైనా స్పష్టత అవసరం. సీనియర్లను సంప్రదించి.. మంచి ఉద్యోగం ఎంపిక విషయంలో అభ్యర్థులు అప్పటికే ఆయా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్లు లేదా ఆయా రంగాల నిపుణులను సంప్రదించాలి. తమ ఆసక్తి, అకడమిక్ నైపుణ్యాలను తెలియజేసి, సరైన గెడైన్స్ తీసుకోవాలి. అవసరమైతే కెరీర్ కౌన్సిలర్లను సంప్రదించాలి. ప్రస్తుతం సరైన ఉద్యోగం ఎంపికకు అందుబాటులోకి వచ్చిన ముఖ్యమైన సాధనం.. సైకోమెట్రిక్ టెస్ట్లు. వివిధ జాబ్సెర్చ్ పోర్టల్స్, కెరీర్ కన్సల్టెన్సీలు సైకో మెట్రిక్ టెస్ట్లను నిర్వహిస్తున్నాయి. వీటిలో అభ్యర్థుల ప్రదర్శన ఆధారంగా ఆయా డొమైన్ ఏరియాలో సరితూగే ప్రొఫైల్స్ను సూచిస్తున్నాయి. వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. స్వీయ విశ్లేషణ అభ్యర్థులు తమ ప్రాక్టికల్ నైపుణ్యాలకు సంబంధించి స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్, లా తదితర విభాగాలకు చెందిన జాబ్ ప్రొఫైల్స్కు క్షేత్ర నైపుణ్యాలు అవసరం. ఒకవేళ సరైన స్థాయిలో ప్రాక్టికల్ స్కిల్స్ లేవనుకుంటే.. నిర్వహణ పరమైన ప్రొఫైల్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు న్యాయశాస్త్ర పట్టభద్రులను పరిగణనలోకి తీసుకుంటే.. న్యాయవాద వృత్తిలో రాణించే నైపుణ్యాలు లేవని భావిస్తే.. కంపెనీల లీగల్ విభాగాల్లో లీగల్ అడ్వయిజర్స్, లీగల్ మేనేజర్స్ తదితర ఉద్యోగాల్లో చేరొచ్చు. కొన్ని ఉద్యోగాలకు రెగ్యులర్ అప్డేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా టెక్నికల్, సాఫ్ట్వేర్, మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాల్లో కొత్త మార్పులు, టెక్నాలజీపై అవగాహన పెంచుకుంటేనే కెరీర్లో ముందంజలో నిలిచేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త అంశాలు నేర్చుకునే ఆసక్తి ఉంటేనే అలాంటి జాబ్ ప్రొఫైల్స్ను ఎంపిక చేసుకోవాలి. పని సంస్కృతి వ్యక్తిగత ఆసక్తి, ప్రాక్టికల్ సామర్థ్యం, రెగ్యులర్ అప్డేషన్ తదితర అంశాల్లో మెరుగ్గా ఉన్నా.. కొన్ని సందర్భాల్లో సంస్థల విధివిధానాలు, పని సంస్కృతి కూడా కెరీర్పై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఒక సంస్థకు దరఖాస్తు చేసుకునే ముందు ఆయా కంపెనీల పని సంస్కృతి గురించి తెలుసుకోవాలి. అది తమ వ్యక్తిగత, మానసిక స్థితికి అనుకూలంగా ఉంటేనే ముందడుగు వేయాలి. ప్రస్తుతం సంస్థకున్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా రాజీపడి ఆఫర్ను అంగీకరిస్తే.. భవిష్యత్తులో సంస్థలో ఇమడలేక వెనుదిరగాల్సి వస్తుంది. ప్లేస్మెంట్స్ ఆఫర్ ప్రస్తుతం యువతకు కొలువుకు తొలి మార్గం క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఇందులో పాల్గొనడానికి ముందు అభ్యర్థులు తమకు సరితూగే జాబ్ ప్రొఫైల్పై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఈ క్రమంలో క్యాంపస్ ప్లేస్మెంట్ సెల్స్ను వీలైనంత ముందుగా సంప్రదించి.. డ్రైవ్స్ నిర్వహించనున్న సంస్థలు, వాటి విధానాలు, అవి ఆఫర్ చేయనున్న జాబ్స్, ప్రొఫైల్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే క్యాంపస్ డ్రైవ్స్లో పాల్గొనే సంస్థలు రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ఆ ప్రక్రియను ముగిస్తాయి. ఈ స్వల్ప వ్యవధిలో సదరు సంస్థ తమకు సరితూగుతుందనే అంచనాకు రావడం ఉద్యోగార్థులకు అంత సులభం కాదు. ప్యాకేజీల మాయలో పడొద్దు.. ప్రతి వ్యక్తికి కెరీర్ పరంగా నిర్దిష్టంగా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. వాస్తవానికి సంస్థలు కూడా ఉద్యోగ ఇంటర్వ్యూల సమయంలో ‘మీ ఫ్యూచర్ గోల్ ఏమిటి?’ అని ప్రశ్నించడం రివాజుగా మారింది. ఒక ఉద్యోగాన్ని ఎంపిక చేసుకునేముందు తాము అప్పటికే ఏర్పరచుకున్న భవిష్యత్తు లక్ష్యం సాధించేందుకు ఆయా సంస్థల్లో అవకాశాలు ఎంతవరకు ఉంటాయో విశ్లేషించుకోవాలి. ఇటీవల కాలంలో యువత చేస్తున్న ప్రధాన పొరపాటు.. అధిక ప్యాకేజీలకు ఆకర్షితులై సంస్థలు ఇచ్చే ఆఫర్స్ను వెంటనే అంగీకరించడం. కానీ, తర్వాత కొద్దిరోజులకే సంస్థ వాతావరణంలో ఇమడలేక కెరీర్ మార్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. కాబట్టి ప్యాకేజీకే ప్రాధాన్యం అనే ధోరణి వీడి.. వ్యక్తిగత ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు వ్యక్తిగత ఆసక్తి సంస్థల విధివిధానాలు సంస్థలో అంతర్గత పని సంస్కృతి ఆఫర్ చేసిన జాబ్ ప్రొఫైల్, జాబ్ రోల్ కెరీర్ వృద్ధి అవకాశాలు విధుల పరంగా లభించే ప్రాధాన్యం నైపుణ్యాల ప్రదర్శనకు లభించే అవకాశం డెసిషన్ మేకింగ్లో లభించే ప్రాధాన్యం ప్రస్తుతం నైపుణ్యాలున్న యువతకు అవకాశాలు అనేకం. వాటిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మంచి సంస్థను అన్వేషించే క్రమంలో అప్రమత్తంగా ఉండాలి. జాబ్ సెర్చ్ పోర్టల్స్, కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగాన్వేషణ చేస్తున్న అభ్యర్థులు ముందుగానే తమ ‘ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్’ను పేర్కొనడం మేలు. దీనివల్ల వారికి వచ్చే జాబ్ అలెర్ట్స్ సంబంధిత రంగాలకు సంబంధించినవే ఉంటాయి. క్యాంపస్ హైరింగ్స్ అయినా.. ఓపెన్ జాబ్ మార్కెట్లో అయినా.. ఉద్యోగం ఎంపిక పరంగా వ్యక్తిగత ఆసక్తికి తొలి ప్రాధాన్య మివ్వాలి. - ఎం.రామకృష్ణ, ఎండీ, జెడ్సీఎస్ కన్సల్టింగ్ లిమిటెడ్. -
ప్రపంచ పోటీతత్వ సూచీ
వృద్ధి రేటు క్షీణత, కొనసాగుతున్న ప్రాంతీయ రాజకీయ సంక్షోభం (Geopolitical turmoi), విత్త మార్కెట్లో అనిశ్చితి, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అధిక రుణ స్థాయి తదితర పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ పోటీతత్వ నివేదిక (2016-17) వెలువడింది. ప్రపంచ జీడీపీ వృద్ధి 2010లో 4.4 శాతం కాగా 2015లో 2.5 శాతానికి తగ్గింది. గత రెండేళ్ల కాలంలో వృద్ధి రేటులో క్షీణత... ఉత్పాదకతలో తగ్గుదలను, పెట్టుబడి రేటులో దీర్ఘకాలిక తగ్గుదలను స్పష్టపరుస్తుంది. భవిష్యత్తు వృద్ధి పురోగతిని దీర్ఘకాలిక ధోరణులు ఆటంకపరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలు ఉత్పాదక వృద్ధిలో క్షీణత, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కోశ విధానం రాజకీయ, సైద్ధాంతిక అవరోధాలను ఎదుర్కొంది. దీంతో దీర్ఘకాల స్తబ్ధత నెలకొంది. పురోగతి సాధించే క్రమంలో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలకు ద్రవ్య విధానం ముఖ్య సాధనంగా నిలిచింది. స్వల్ప కాలంలో వృద్ధి స్థిరత్వాన్ని సాధించే విషయంలో ద్రవ్య విధానం విజయం సాధించింది. భవిష్యత్తులో అధిక వృద్ధి సాధనకు పంపిణీ వైపు సంస్కరణలు ఉండాలని నివేదిక పేర్కొంది. ఉత్పాదక రంగాలను పటిష్టపరచడానికి ఆయా రంగాలపై పెట్టుబడులను పెంచి పోటీతత్వాన్ని పెంపొందించాలని కూడా సూచించింది. ప్రపంచ పోటీ తత్వ సూచికలు ఎ) సాధారణ అవసరాల ఉప సూచికలు సంస్థలు అవస్థాపనా సౌకర్యాలు స్థూల ఆర్థిక వాతావరణం ఆరోగ్యం, ప్రాథమిక విద్య బి) సామర్థ్యాన్ని పెంపొందించే ఉప సూచికలు ఉన్నత విద్య, శిక్షణ వస్తు మార్కెట్ సామర్థ్యం శ్రామిక మార్కెట్ సామర్థ్యం విత్త మార్కెట్ అభివృద్ధి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు మార్కెట్ పరిమాణం సి) నవకల్పన, ఆధునికీకరణ కారకాల ఉప సూచికలు వ్యాపార ఆధునికీకరణ నవకల్పనలు భారతదేశంలో గత పదేళ్లలో పోటీతత్వం భారతదేశ తలసరి స్థూల దేశీయోత్పత్తి (పి.పి.పి. రూపంలో) 2007, 2016 మధ్య రెట్టింపైందని నివేదిక పేర్కొంది. ఈ కాలంలో తలసరి స్థూల దేశీయోత్పత్తి 3587 డాలర్ల నుంచి 6599 డాలర్లకు పెరిగింది. 2008 సంక్షోభం తర్వాత వృద్ధిరేటు తగ్గి, 2012-13లో అధిక క్షీణత ఏర్పడింది. ఈ అనుభవాల నేపథ్యంలో భారతదేశం తన విధానాలను పునఃపరిశీలించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతోపాటు పోటీతత్వాన్ని పెంపొందించుకోవడానికి వివిధ రంగాల్లో అవసరమైన సంస్కరణలను అమలు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో 2014లో వృద్ధి పురోగమించి, 2015లో చైనా వృద్ధిరేటును భారత్ అధిగమించింది. తద్వారా భారత్ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా రూపుదిద్దుకుంది. 2007-14 మధ్య భారత పోటీతత్వ స్కోరులో స్తంభన ఏర్పడింది. 2007-08లో పోటీతత్వ సూచీలో 48వ స్థానంలో ఉన్న భారత్ 2016-17లో 39వ స్థానం పొందింది. పోటీతత్వ సూచీలో భారత్ మెరుగవడానికి గల కారణాలను నివేదిక కింది విధంగా విశ్లేషించింది. గత శతాబ్ద కాలంలో ఆరోగ్యం, ప్రాథమిక విద్య మెరుగవడం. గత దశాబ్దంలో అధిక కాలం అవస్థాపనా సౌకర్యాల మెరుగుదల తక్కువగా ఉన్నా 2014 తర్వాత పరిస్థితి మారింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరిగాయి. ప్రైవేటు వనరులను ఆకర్షించడానికి అనుమతులను వేగవంతం చేయడం తదితరాల వల్ల అవస్థాపనా సౌకర్యాలు మెరుగయ్యాయి. అధిక పాలన కుంభకోణాల (జౌఠ్ఛిట్చఛ్ఛి టఛ్చిఛ్చీట) కారణంగా 2014 వరకు సంస్థాగత వాతావరణం క్షీణించింది. ప్రభుత్వం, ప్రభుత్వ పాలనపై వ్యాపారవేత్తల్లో నమ్మకం సన్నగిల్లింది. కానీ, 2014 తర్వాత ఈ ధోరణిలో మార్పు వచ్చింది. స్థూల ఆర్థిక చలాంకాల్లో 2014 తర్వాత ప్రగతి అధికంగా ఉండటం. వస్తుధరల్లో తగ్గుదల కారణంగా ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి పరిమితం చేయడం. 2007-2016 మధ్య భారత్ పోటీతత్వ స్కోరు 0.19 పాయింట్లు పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. అవస్థాపనా సౌకర్యాలు, ఆరోగ్యం, ప్రాథమిక విద్యలో ప్రగతి అధికమవడమే. ఆయుఃప్రమాణం పదేళ్ల క్రితం 62 సంవత్సరాలు కాగా ప్రస్తుతం 68కి పెరిగింది. ప్రాథమిక విద్యను అందుకున్నవారి శాతం 88.8 నుంచి 93.1కు పెరిగింది. స్థూల ఆర్థిక వాతావరణంలో భారత్ అధిక ప్రగతిని (+0.34) నమోదు చేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కృషి కారణంగా భారత విత్త మార్కెట్లో పారదర్శకత పెరిగింది. భారతీయ బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లలో వెల్లడించని, అధిక మొత్తంలో ఉన్న రికవరీకాని రుణాలపై ఆర్బీఐ దృష్టి సారించింది. అయితే ఉన్నత విద్య, శిక్షణలో ప్రగతి లేదు. భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు (Technological Readiness). డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలు రానున్న కాలంలో అధిక ప్రగతికి కారణమవుతాయి. ఆయుఃప్రమాణం భారత్లో పెరిగినా ప్రపంచ ప్రమాణాలతో పోల్చితే తక్కువగా ఉంది. ప్రపంచంలో ఆయుఃప్రమాణం పరంగా భారత్ స్థానం 106. వస్తు, సేవల పన్నుకు సంబంధించి దీర్ఘకాల సమస్య అయిన పన్ను రేట్ల వ్యత్యాసాలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగా వస్తు మార్కెట్ సమర్థత క్షీణించింది. ప్రపంచ పోటీతత్వ సూచీలో మెరుగైన ఫలితాలను సాధించిన ఆర్థిక వ్యవస్థలుగా భారత్, అల్బేనియా, జమైకాలు నిలిచాయి. ఈ సూచీకి సంబంధించి 2015-16లో భారత్ స్థానం 55 కాగా 2016-17లో 39గా నమోదు కావడం ఆర్థిక వ్యవస్థలో మెరుగుపడిన పోటీతత్వాన్ని సూచిస్తుంది. ఇదే కాలానికి సంబంధించి అల్బేనియా తన స్థానాన్ని 93 నుంచి 80కు, జమైకా 86 నుంచి 75కు మెరుగుపరచుకున్నాయి. భారత్లో వ్యాపార నిర్వహణ (డూయింగ్ బిజినెస్) విషయంలో ఎదురవుతున్న మొదటి ఐదు సమస్యాత్మక కారకాలను నివేదిక కింది విధంగా పేర్కొంది. అవి... పన్ను నియంత్రణ అవినీతి పన్నురేట్లు దయనీయ ప్రజారోగ్య పరిస్థితులు (Poor Public Health) ద్రవ్యోల్బణం కొన్ని ఉప రంగాల్లో భారత్ స్థానం ఉప రంగం స్థానం మార్కెట్ పరిమాణం 3 నవ కల్పనలు 29 వ్యాపార ఆధునికీకరణ 35 విత్త మార్కెట్ అభివృద్ధి 38 సంస్థలు 42 జీ-20 దేశాల్లో అధిక జీడీపీ వృద్ధిని భారత్ కలిగి ఉందని, అభిలషణీయ ద్రవ్య, కోశ విధానాలు, అదేవిధంగా అల్ప చమురు ధరల కారణంగా భారత్లో జీడీపీ వృద్ధి వేగవంతమై ఆర్థిక వ్యవస్థ స్థితి మెరుగవుతుందని నివేదిక పేర్కొంది. ఇటీవలి సంస్కరణలు.. ప్రభుత్వ రంగ సంస్థలను మెరుగుపరచడం, విదేశీ పెట్టుబడులు, విదేశీ వాణిజ్యాన్ని సరళతరం చేయడం, విత్త వ్యవస్థలో పారదర్శకత పెంపుపై దృష్టి కేంద్రీకరించాయని నివేదిక అభిప్రాయపడింది. శ్రామిక మార్కెట్పై భారత్ దృష్టి కేంద్రీకరించాల్సిన ఆవశ్యకతను నివేదిక వెలిబుచ్చింది. శ్రామిక మార్కెట్లో కఠిన నియంత్రణలు, కేంద్రీకృత వేతన నిర్ణయం, మిలియన్ల మంది భద్రత లేని అసంఘటిత రంగంలో శ్రామికులుగా ఉండటం లాంటి అంశాలపై, ముఖ్యంగా తయారీ రంగానికి సంబంధించిన శ్రామిక మార్కెట్ సంబంధిత అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని నివేదిక పేర్కొంది. భారత్లో విత్త నియంత్రణలు, విలువ ఆధారిత పన్ను రేట్లలో వ్యత్యాసం కారణంగా స్వదేశీ మార్కెట్లో సమర్థత కొరవడింది. విత్త రంగ, ప్రభుత్వ రంగ సంస్థల్లో రికవరీ కాని రుణాలు పెరుగుతున్నందువల్ల స్వదేశీ మార్కెట్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని నివేదిక పేర్కొంది. అవస్థాపనా సౌకర్యాల కొరత, ఐసీటీ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను నివారించాలి. ఈ క్రమంలో అవస్థాపనా సౌకర్యాల కల్పన, ఐసీటీపై పెట్టుబడులు పెంచాల్సిన ఆవశ్యకతను నివేదిక వెలిబుచ్చింది. దక్షిణాసియాలో ఆర్థిక వృద్ధి దక్షిణాసియా ప్రాంతంలోని అనేక ఆర్థిక వ్యవస్థల్లో పోటీతత్వం మెరుగుపడింది. దక్షిణాసియా ధనాత్మక ఆర్థికవృద్ధిని నమోదు చేసుకోవడంతోపాటు గత 20 ఏళ్ల కాలంలో మొదటిసారిగా 2016లో చైనాను అధిగమించి అధిక వృద్ధి సాధించే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. గత దశాబ్ద కాలంగా ఆరోగ్యం, ప్రాథమిక విద్య, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిపై ఉప ఖండం దృష్టిసారించింది. ఆరోగ్యం, ప్రాథమిక విద్య; అవస్థాపనా సౌకర్యాలకు సంబంధించి దక్షిణాసియా సగటు స్కోరు వరుసగా 0.5, 0.3 పెరిగింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లతోపాటు ఇరుగు పొరుగున ఉన్న చిన్న దేశాలైన నేపాల్, భూటాన్, శ్రీలంకలు ఈ ఉప ఖండంలో ఉన్నాయి. 2007 తర్వాతి కాలంలో పోటీతత్వం పెంపునకు అవసరమైన కారకాల విషయంలో ఈ ప్రాంతంలో అధిక, అత్యల్ప ప్రగతి పథంలో ఉన్న దేశాల మధ్య వ్యత్యాసం పెరిగింది. పాకిస్థాన్లో దిగజారుతున్న పరిస్థితులు దీనికి కారణం. అవస్థాపనా సౌకర్యాల నాణ్యత ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో మెరుగుపడగా నేపాల్లో నిలకడగా ఉండి, పాకిస్థాన్లో క్షీణించింది. ఉప ఖండంలోని ఆర్థిక వ్యవస్థల్లో పాకిస్థాన్ మాత్రమే స్థూల ఆర్థిక వాతావరణం, ఆరోగ్యం, ప్రాథమిక విద్య స్థాయిలో తన స్థితిని మెరుగుపరచుకోవడంలో విఫలమైందని నివేదిక పేర్కొంది. దక్షిణాసియా ప్రాంతం మొత్తంలో విత్త మార్కెట్లో ప్రగతి చాలా తక్కువగా ఉంది. బంగ్లాదేశ్, శ్రీలంకల్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటుకు సంబంధించి పరిస్థితి మెరుగుపడింది. -
ఐరాస ప్రధాన కార్యదర్శులు
ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ)... ఆ సంస్థ నాయకుడిగా వ్యవహరిస్తారు. వీరి పదవీ కాలం ఐదేళ్లు. ఐరాస నూతన ప్రధాన కార్యదర్శిగా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గ్యుటెరస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఐరాస ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఎనిమిది మంది వివరాలు.. ట్రిగ్వెలీ నార్వేకు చెందిన ట్రిగ్వెలీ 1946, ఫిబ్రవరి 2 నుంచి 1952, నవంబర్ 10 వరకు ఐరాస తొలి ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. పదవీ కాలంలో ఇజ్రాయెల్కు పూర్తి మద్దతిచ్చారు. కొరియా యుద్ధం (1950-1953)లో ఐరాస సైనిక జోక్యాన్ని సమర్థించారు. అయితే దాన్ని సోవియట్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించడంతో 1952లో రాజీనామా చేశారు. ఈయన రచించిన ‘ఇన్ ది కాజ్ ఆఫ్ పీస్’ పుస్తకం 1954లో ప్రచురితమైంది. టిగ్వెలీ 1968, డిసెంబర్ 30న మరణించారు. డ్యాగ్ హామ్మర్సజోల్డ్ స్వీడన్కు చెందిన ఈయన 1953, ఏప్రిల్ 10 నుంచి 1961, సెప్టెంబర్ 18 వరకు ఐరాస రెండో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1961లో కాంగో వెళ్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక వ్యక్తి ఈయనే. ఆమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ.. ఈ శతాబ్దపు అతి గొప్ప రాజనీతిజ్ఞుడని హామ్మర్సజోల్డ్ను అభివర్ణించారు. 1961లో మరణానంతరం జోల్డ్కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. యునెటైడ్ నేషన్స లైబ్రరీని డ్యాగ్ హామ్మర్సజోల్డ్ లైబ్రరీగా పిలుస్తున్నారు. 1997లో ఐరాసలోని భద్రతామండలి డ్యాగ్ హామ్మర్సజోల్డ్ మెడల్ను ఏర్పాటు చేసింది. ఐరాస శాంతి స్థాపన కార్యకలాపాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి దీన్ని అందిస్తారు. ఈ అవార్డును 1998లో తొలిసారి ముగ్గురికి మరణానంతరం ప్రదానం చేయగా అందులో జోల్డ్ కూడా ఉండటం విశేషం. యు థాంట్ ఈయన బర్మాకు చెందిన దౌత్యవేత్త. 1961, నవంబర్ 30 నుంచి1971, డిసెంబర్ 31 వరకు ఐరాస మూడో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ పదవిని నిర్వహించిన తొలి ఐరోపాయేతర వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1962లో క్యూబాక్షిపణి సంక్షోభ సమయంలో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ, సోవియట్ యూనియన్ ప్రధాని నికితా కృశ్చేవ్ల మధ్య చర్చలకు కృషి చేసి మరో యుద్ధం రాకుండా నివారించగలిగారు. 1966లో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యాక వియత్నాం యుద్ధంలో అమెరికా చర్యలను తీవ్రంగా విమర్శించారు. 1974, నవంబర్ 25న యు థాంట్ కన్నుమూశారు. ఈయనకు అంతర్జాతీయ అవగాహనకు ఇచ్చే జవహర్లాల్ నెహ్రూ అవార్డు (1965), గాంధీ శాంతి బహుమతి (1972) లభించాయి. కుర్ట వాల్దీమ్ ఆస్ట్రియాకు చెందిన వాల్దీమ్ 1972, జనవరి 1 నుంచి1981, డిసెంబర్ 31 వరకు ఐరాస నాలుగో ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఉత్తర కొరియాలో (1979) పర్యటించిన తొలి ప్రధాన కార్యదర్శిగా గుర్తింపు పొందారు. ఐరాస ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ పొందిన తర్వాత 1986 నుంచి 1992 వరకు ఆస్ట్రియా అధ్యక్షుడిగా పనిచేశారు. 2007, జూన్ 14న కన్నుమూశారు. జేవియర్ పెరెజ్ డి కుల్లర్ పెరూకి చెందిన కుల్లర్ 1982, జనవరి 1 నుంచి 1991, డిసెంబర్ 31 వరకు ఐరాస ఐదో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. బ్రిటన్, అర్జెంటీనాల మధ్య జరిగిన ఫాక్ల్యాండ్స యుద్ధానంతరం.. ఆ రెండు దేశాల మధ్య శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించారు. నమీబియా స్వాతంత్య్రం పొందడంలో ప్రధాన భూమిక వహించారు. 1988లో ఇరాన్-ఇరాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరిపారు. ఐరాస ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణానంతరం 2000 నవంబర్ 22 నుంచి 2001, జూలై 28 వరకు పెరూ ప్రధానిగా పనిచేశారు. బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ ఈయన ఈజిప్ట్కు చెందిన రాజకీయ నాయకుడు, దౌత్యవేత్త. 1992, జనవరి 1 నుంచి1996, డిసెంబర్ 31 వరకు ఐరాస ఆరో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అమెరికా తిరస్కరించడంతో ఘలీ రెండోసారి ఎన్నిక కాలేకపోయారు. ఫలితంగా ఇప్పటివరకు ఐరాస ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఎన్నిక కాని వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1994లో రువాండాలో జరిగిన నరమేధాన్ని నివారించలేకపోయారనే విమర్శలకు గురయ్యారు. ఇందులో పది లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. యుగోస్లేవియా విచ్ఛిన్నం తర్వాత జరిగిన యుద్ధాల్లో కూడా ఘలీ ప్రభావవంతంగా వ్యవహరించలేదనే విమర్శలున్నాయి. ఘలీ 2016, ఫిబ్రవరి 16న కైరోలో మరణించారు. కోఫీ అన్నన్ ఘనా దేశస్తుడైన కోఫీ అన్నన్ 1997, జనవరి 1 నుంచి 2006, డిసెంబర్ 31 వరకు ఐరాస ఏడో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001లో కోఫీ అన్నన్కు, ఐక్యరాజ్యసమితికి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఐక్యరాజ్యసమితిని శక్తిమంతంగా తీర్చిదిద్దడం, ఆఫ్రికాలో ఎయిడ్స వ్యాధిని నియంత్రించడం, మానవ హక్కుల పరిరక్షణకు కృషిచేయడం వంటి అంశాల్లో అన్నన్కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈయన జెనీవాలో కోఫీ అన్నన్ ఫౌండేషన్ను (2007) స్థాపించారు. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ప్రపంచ శాంతి, ఉత్తమ పాలన కోసం కృషి చేస్తుంది. కోఫీ అన్నన్ 2007 నుంచి నెల్సన్ మండేలా స్థాపించిన ‘ది ఎల్డర్స’ (లండన్) అనే ప్రభుత్వేతర సంస్థకు చైర్మన్గా కొనసాగుతున్నారు. వాతావరణ మార్పులు, ఎయిడ్స, పేదరికం వంటి ప్రపంచ సమస్యలపై ఇది పోరాటం చేస్తుంది. బాన్ కీ మూన్ దక్షిణ కొరియాకు చెందిన బాన్ కీ మూన్ 2007, జనవరిలో ఐరాస ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2012లో రెండోసారి ఎన్నికయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. వాతావరణ మార్పులు, భూతాపం వంటి సమస్యలపై కృషిచేస్తున్నారు. ఆంటోనియో గ్యుటెరస్ ఇటీవల భద్రతామండలి నిర్వహించిన ఓటింగ్లో పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గ్యుటెరస్ ఐరాస తొమ్మిదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్వ ప్రతినిధి సభ గ్యుటెరస్ పేరును ఖరారు చేయాల్సి ఉంది. పోర్చుగల్ రాజధాని లిస్బన్లో 1949, ఏప్రిల్ 30న జన్మించిన గ్యుటెరస్ 1995 నుంచి 2002 వరకు ఆ దేశానికి ప్రధానిగా పనిచేశారు. 2005, జూన్ నుంచి 2015, డిసెంబర్ వరకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్గా విధులు నిర్వర్తించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి పదవి కోసం గ్యుటెరస్తో పోటీపడిన వారిలో ఇరీనా బకోవా (యునెస్కో డెరైక్టర్ జనరల్), హెలెన్ క్లార్క (యూఎన్డీపీ అడ్మినిస్ట్రేటర్) వంటి ప్రపంచ మహిళా నేతలున్నారు. -
యూఎస్ v/s ఆస్ట్రేలియా
ఎంబీఏకు ఏది బెస్ట్ స్టడీ అబ్రాడ్ ఔత్సాహికుల్లో అత్యధిక మంది లక్ష్యం.. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)! దీని కోసం యూఎస్, ఆస్ట్రేలియా దిశగా అడుగులేస్తుంటారు. ఈ క్రమంలో కొంత సందిగ్ధత! ఎక్కడ చదివితే బాగుంటుంది? కోర్సు పూర్తై వెంటనే ఉద్యోగావకాశాల పరంగా ఏ దేశం బెస్ట్? ఇలా ఎన్నో సందేహాలు.. ఫాల్ సెషన్ ప్రవేశాలు నడుస్తున్న నేపథ్యంలో యూఎస్, ఆస్ట్రేలియాల్లో ఎంబీఏ కోర్సు విధివిధానాలపై ప్రత్యేక కథనం.. విదేశాల్లో చదువులకు..ఆర్థిక చిట్కాలు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని వివిధ యూనివర్సిటీల్లో చేరేందుకు ప్రస్తుతం స్టడీ అబ్రాడ్ ఔత్సాహికులు ప్రయత్నిస్తున్నారు. విదేశీయానానికి, అక్కడ విద్యాభ్యాసానికి ఆర్థికంగా సంసిద్ధులవుతున్నారు. ఈ క్రమంలో విదేశాల్లో ఆర్థిక నిర్వహణ పరంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సలహాలు... విదేశాలకు వెళ్లే విద్యార్థి పేరిట భారత్లో బ్యాంకు ఖాతా ప్రారంభించాలి. కాలేజీ/ట్యూ షన్ ఫీజులు భారీ మొత్తంలో ఉంటాయి. వాటిని తల్లిదండ్రులు భారత్ నుంచి నేరుగా ఆయా సంస్థలకు బదిలీ చేస్తారు. రోజువారీ ఖర్చులకు డబ్బు మాత్రం విద్యార్థులే చేతి నుంచి చెల్లించాల్సి ఉంటుంది. జీవన వ్యయం.. బడ్జెట్కు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. సంబంధిత దేశంలో బ్యాంకులో అకౌంట్కు, డెబిట్ కార్డు పొందడానికి రెండు మూడు వారాలు పడుతుంది. అప్పటివరకు ఖర్చుల కోసం కొంత నగదును, ఫారెక్స్ కార్డును తీసుకెళ్లాలి. స్థానిక ప్రయాణాలు, భోజనం, వసతి దొరికే వరకు నగదును ఉంచుకోవాలి. నెల రోజులకు సరిపడా డబ్బులు చేతిలో ఉంటే మంచిది. క్యాంపస్ హాస్టల్లో చేరాలన్నా, ఆఫ్ క్యాంపస్ వసతి పొందాలన్నా ముందస్తు ప్రణాళిక అవసరం. ప్రీపెయిడ్ పేమెంట్ చేయాలి. అన్ని ఖర్చులకూ అవసరమైన డబ్బులో 25-33 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని చేతిలో ఉంచుకోవడం మంచిది కాదు. సాధ్యమైనంత త్వరగా బ్యాంక్ అకౌంట్ తెరిచి డిపాజిట్ చేయాలి. విదేశాల్లో అడుగుపెట్టిన తర్వాత సంబంధిత యూనివర్సిటీలో రిపోర్ట్ చేయాలి. పెండింగ్ పేపర్ వర్క్ ఏమైనా ఉంటే పూర్తిచేయాలి. తర్వాత కోర్సు కోఆర్డినేటర్ను కలిసి.. బ్యాంక్ అకౌంట్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలి. పార్ట్టైమ్ జాబ్ చేయాలనుకుంటే నియమనిబంధనల గురించి తెలుసుకునేందుకు వర్సిటీ అధికారులను సంప్రదించాలి. స్టైఫండ్ కోసం ప్రొఫెసర్కు అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్గానో ఆన్ క్యాంపస్ వర్క్ చేయాలనుకుంటున్నట్లు ఉన్నతాధికారులకు మెయిల్స్ ద్వారా తెలియజేయొచ్చు. తద్వారా తాత్కాలిక నియామకాల్లో అవకాశాలు పొందొచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్య సంరక్షణ ఖరీదుగా మారిన నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీపై జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సిటీ కల్పించే సాధారణ ఆరోగ్య బీమాతోపాటు ప్రత్యేక వైద్య చికిత్స కోసం అదనపు ప్యాకేజీలు తీసుకుంటే మంచిది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న కోర్సు ఎంబీఏ. అందుకే బ్యాచిలర్ డిగ్రీ తర్వాత అధిక శాతం మంది ఈ కోర్సు వైపు మొగ్గుచూపుతారు. విదేశాల్లో చదవాలనుకునే వారిలో దాదాపు 40 శాతం మంది ఎంబీఏలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరికి టాప్ గమ్యాలుగా అమెరికా, ఆస్ట్రేలియా నిలుస్తున్నాయి. ఈ దేశాల్లోని విద్యా సంస్థలు అందించే సర్టిఫికెట్లకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉండటమే ఇందుకు కారణం. కంపెనీలు సైతం అమెరికా, ఆస్ట్రేలియా చదివిన ఎంబీఏ ఉత్తీర్ణులకు పెద్దపీట వేస్తున్నాయి. ఒకవేళ రెండు దేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశం ఖరారైతే ఎటు వెళ్లాలి? అనే సందిగ్ధత ఉంటే విద్యా సంస్థ, కోర్సు తీరుతెన్నులను క్షుణ్నంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవాలంటే 10+2+4 విధానంలో 16 ఏళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి. అదేవిధంగా గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్)లో కనీసం 700 స్కోర్ సాధించాలి. ఇవి ఉంటేనే ప్రవేశం లభించే అవకాశాలుంటాయి. కొన్ని ప్రముఖ యూనివర్సిటీలు జీమ్యాట్ స్కోర్తోపాటు పని అనుభవం కూడా అడుగుతున్నాయి. యూనివర్సిటీల్లో ఎంబీఏ కోర్సు దరఖాస్తుకు 10+2 తర్వాత మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ అర్హత సరిపోతుంది. అయితే యూనివర్సిటీలు ఔత్సాహికుల పని అనుభవంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి. కనీసం 2-4 ఏళ్ల వర్క ఎక్స్పీరియన్స ఉన్న వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యమిస్తున్నాయి. ఆస్ట్రేలియా పరంగా విద్యార్థులకు కలిసొచ్చే అంశం.. జీమ్యాట్ స్కోర్ నిబంధన నుంచి మినహాయింపు. 70 శాతం యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు జీమ్యాట్ స్కోర్ లేకపోయినా అకడమిక్ రికార్డ్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు జీమ్యాట్ స్కోర్ను తప్పనిచేరి చేసినా, స్కోర్ 600-650 ఉంటే సరిపోతుంది. అమెరికా: కోర్సు వ్యవధి కొంత ఎక్కువ ఉంటుంది. ఎక్కువ విశ్వవిద్యాలయాల్లో దాదాపు రెండేళ్లు ఉంటోంది. కొన్ని యూనివర్సిటీలు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ పేరుతో ఏడాది వ్యవధితో మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లను అందిస్తున్నాయి. అయితే అవి పూర్తిగా పని అనుభవం ఉన్నవారికే పరిమితమవుతున్నాయి. ఆస్ట్రేలియా: అధిక శాతం యూనివర్సిటీల్లో ఏడాది నుంచి ఏడాదిన్నర వ్యవధిలో ఎంబీఏ కోర్సు పూర్తిచేసే అవకాశం ఉంది. ఎక్కువ మందికి సుపరిచితమైన మెల్బోర్న్ యూనివర్సిటీలో సైతం ఏడాది వ్యవధిలో ఎంబీఏను పూర్తిచేయొచ్చు. ఇది విద్యార్థులను ఆర్థిక భారం నుంచి తప్పిస్తోంది. అమెరికా: విదేశీ విద్య పరంగా కోర్సు ఏదైనప్పటికీ విద్యార్థుల దృష్టిలో మరో ప్రధాన అంశం కోర్సు ఫీజు. అమెరికాలో ఫీజులు కొంత ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ సగటున ఎంబీఏ ప్రోగ్రామ్ ఫీజు 65 వేల నుంచి 68 వేల డాలర్లు ఉంటోంది. ఆస్ట్రేలియా: ఫీజుల పరంగా ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీలు విద్యార్థులకు కొంత ఉపశమనం కల్పిస్తున్నాయి. సగటున 60 వేల లోపు డాలర్లతో కోర్సు పూర్తి చేసుకునే అవకాశం ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంది. అమెరికా: విదేశీ విద్య - ఆర్థిక వ్యయానికి సంబంధించి మరో ప్రధాన అంశం నివాస ఖర్చులు. ఈ విషయంలో ఆస్ట్రేలియాతో పోల్చితే అమెరికాలో ఒక విద్యార్థికి ఏడాదికి అయ్యే నివాస ఖర్చులు కొంత తక్కువగా ఉంటున్నాయి. అమెరికాలో ఏడాదికి దాదాపు 11 వేల డాలర్లు సరిపోతాయి. ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో మాత్రం ఏడాదికి సగటు జీవన వ్యయం 18 వేల డాలర్లుగా ఉంటోంది. అమెరికా: బోధన విధానం సరళంగా ఉంటుంది. కోర్సులో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు మైనర్ కోర్సులుగా ఇతర విభాగాలకు సంబంధించిన అంశాలను నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. థియరీ, ప్రాక్టికల్ పరిజ్ఞానానికి సమ ప్రాధాన్యం ఉంటుంది. ఆస్ట్రేలియా: థియరీ కంటే ప్రాక్టికాలిటీకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ కారణంగానే ప్రవేశ సమయంలో వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్కు ప్రాధాన్యమిస్తారు. అన్ని ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీల్లో ఇండస్ట్రీ ఇంటరాక్షన్ కార్యక్రమం విస్తృతంగా అమలవుతోంది. అభ్యర్థులు అన్ని స్పెషలైజేషన్లలో రాణించేలా కోర్సు విధానం ఉంటోంది. రెండు దేశాల్లో కోర్సు పూర్తిచేసిన వారికి విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. వార్షిక వేతనాల పరంగానూ ఆకర్షణీయమైన ప్యాకేజ్లు అందుతున్నాయి. అయితే అమెరికా నుంచి పట్టా పొందిన వారితో పోల్చితే, ఆస్ట్రేలియాలో కోర్సు పూర్తిచేసిన వారికి లభించే వేతనాలు కొంత తక్కువగా ఉంటున్నాయి. అమెరికాలో టాప్ యూనివర్సిటీల నుంచి ఎంబీఏ పట్టాతో సగటున 1.30 లక్షల డాలర్ల నుంచి 1.5 లక్షల డాలర్ల మేర వార్షిక వేతనం లభిస్తోంది. ఆస్ట్రేలియాలో సగటున 90 వేల డాలర్ల నుంచి 1.20 డాలర్ల మధ్యలో ఉంటుంది. విద్యార్థులు.. కోర్సు పూర్తి చేసిన దేశంలోనే ఉద్యోగం కోరుకోవడం సహజం. ఈ విషయంలో అమెరికా, ఆస్ట్రేలియాలకు సంబంధించిన నిబంధనలు.. అమెరికా: అమెరికాలో కోర్సు పూర్తిచేశాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పేరుతో 12 నెలలు పనిచేసే అవకాశం ఉంది. ఈ సమయంలో సంబంధిత సంస్థ.. అభ్యర్థిని పూర్తిస్థాయి ఉద్యోగిగా నియమించుకునేందుకు అంగీకరిస్తే.. సంస్థ.. హెచ్-1బీ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా: కోర్సు పూర్తయ్యాక టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకొని అక్కడే ఉద్యోగం చేయొచ్చు. అయితే వీసాకు దరఖాస్తు చేసుకునే ముందే అభ్యర్థి నియామకాన్ని ఖరారు చేస్తున్నట్లు సంబంధిత సంస్థ.. స్పాన్సర్షిప్ లెటర్ (ఎంప్లాయ్మెంట్ ఆఫర్) చేతిలో ఉండాలి. -
Sequential model puzzle test
As the name of the puzzle suggests, the questions are based on the sequence of happenings that take place on successive days or dates. This model also includes the questions on the identification of the people living on different floors in an apartment/building. Though there is no much difference in the variation that we come across among the questions. Let us divide them into sub models for clarity and better understanding. n Following are the sub models that are normally asked in the bank exams: 1. Order- denoting puzzles These puzzles are asked to find out the events/ happenings taking place on the successive days/dates. Let us discuss with the help of an example. n Example: Seven subjects Sociology, Psychology, English, Geography, History, Economics and Hindi are taught on the days from Monday to Friday by five persons A, B, C, D and E. n Each person teaches at least one subject. At least one subject is taught every day. No person teaches two subjects on the same day. B teaches Sociology on Wednesday. History is taught by E but not on Monday or Thursday. English is taught on Monday by A. Geography and Economics are taught on Monday and Tuesday respectively. D teaches only one subject Psychology on Tuesday. Geography is not taught by E or B. The person who teaches English or Hindi does not teach Economy. E does not teach Economy. Point to remember: Generally we will be giving preference to the order of persons while solving the puzzles. But, in sequential model we have to always give importan ce to the sequence of the events/ things that is discussed in the puzzle. This is the best way to solve any sequential model puzzle test. Now, let us identify & discuss the key points given in the question. n English is taught on Monday by A n History is taught by E but not on Monday or Thursday. n Geography and Economics are taught on Monday and Tuesday respectively. ® Geography is taught on Monday and Economy is taught on Tuesday. n D teaches only one subject Psychology on Tuesday. n B teaches Sociology on Wednesday. So, the basic data can be tabulated as follows: n Each person teaches at least one subject. ® So, Hindi and History must have taught either on Thursday or Friday. E does not teach on Monday and Thursday. So, it can be safely concluded that E taught History on Friday, and C taught Hindi on Thursday. n Geography is not taught by E or B. D teaches only one subject. A cannot teach two subjects on the same day. Hence, Geography is taught by C. Hence, the complete solution is given as under: 2. Destination - denoting puzzles n These puzzles ask us to track the passengers travelling to various destinations. Example: A, B, C, D, E, F and G are seven persons who travel to office everyday by a particular train which stops at five stations I, II, III, IV and V respectively after it leaves base station. n Three among them get in the train at the base station. n D gets down at the next station at which F gets down n B does not get down either with A or E. n G alone gets in at station III and gets down with C after having passed one station. n A travels between only two stati- ons and gets down at station V. n None of them gets in at station II. n C gets in with F but does not get in with either B or D. n E gets in with two others and gets down alone after D. n B and D work in the same office and they get down together at station III. n None of them gets down at station I. n F gets in at the next station at which B gets in. Now, let us pick up the definite points and tabulate it. n B and D work in the same office and they get down together at station III. n D gets down at the next station at which F gets down ® So, F gets down at station II. n E gets in with two others and gets down alone after D ® E gets down at station IV n A travels between only two stations and gets down at station V. ® So, A travels from station IV and V. n G alone gets in at station III and gets down with C after having passed one station. ® G and C get down at station V. Hence, the data are tabulated as follows: n F gets in at the next station at which B gets in. n C gets in with F but does not get in with either B or D. n Three among them get in the train at the base station. n E gets in with two others. n As three get in the train at the base station, they must be E, B and D. n F and C get in at the station I. n So, the complete solution is as follows: Station Getting into the Getting down train the train Base station E, B, D I C, F II F III G B, D IV A E V G, C, A -
గాడ్జెట్స్.. ఫ్లాప్స్
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్.. సాంకేతిక విప్లవంలో సరికొత్త ఒరవడిని సృష్టించాయి. ముఖ్యంగా యువతకు వీటిపై ఉండే మక్కువను మాటల్లో చెప్పలేం. అందుకే యువతను ఆకర్షించేలా నిత్యం ఏదో ఒక కొత్త గాడ్జెట్ అందుబాటులోకి వస్తోంది. దిగ్గజ కంపెనీలు కూడా మార్కెట్లో పోటీని తట్టుకునే విధంగా సరికొత్త గాడ్జెట్లను రూపొందిస్తున్నాయి. అవి క్లిక్ అయితే అందరికీ చేరువవుతాయి. కానీ ప్రపంచంలోనే టాప్ కంపెనీలు బెస్ట్ అని భావించి, ఎన్నో కొత్త ఫీచర్స్తో తెచ్చిన గాడ్జెట్స్ సైతం వినియోగదారులను ఆకట్టుకోలేక తెరమరుగైన సందర్భాలెన్నో! అలా మార్కెట్లో ఫెయిల్ అయిన గాడ్జెట్లు సెగ్వే పీటీ, గూగుల్ గ్లాస్ గురించి తెలుసుకుందాం.. సెగ్వే పీటీ (పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్) ఐఫోన్ తర్వాత అంతే స్థాయి అంచనాలతో మార్కెట్లోకి వచ్చిన ఆవిష్కరణ.. ది సెగ్వే పీటీ (పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్). ఇది రెండు చక్రాలుండే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బ్యాటరీ ఎలక్ట్రానిక్ వెహికల్. దీన్ని 2001లో అమెరికాకు చెందిన డీన్ కామెన్ రూపొందించారు. దీన్ని ఇండియాలో బర్డ్ సెగ్వే పేరుతో బర్డ్ గ్రూప్ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. సెగ్వేను నడపడం చాలా సులువు. ఇది మోషన్ సెన్సార్ల ఆధారంగా రైడర్ కదలికలను బట్టి ముందుకు వెనక్కి, కుడి, ఎడమ వైపులకు కదులుతుంది. సెగ్వే పీటీలను కేవలం సాధారణ ప్రయాణాలకు మాత్రమే కాకుండా.. విమానాశ్రయాలు, పెద్ద పెద్ద పరిశ్రమలు, టూరిజంలో ఎక్కువగా వినియోగిస్తారు. దీని గరిష్ట వేగం గంటకు 20 కి.మీ. చాలా అంచనాలతో ఈ వెహికల్ను లాంచ్ చేశారు. స్టీవ్ జాబ్స్ సైతం పర్సనల్ కంప్యూటర్ లాగే సెగ్వే కూడా ట్రాన్స్పోర్టేషన్ రంగంలో ఒక కొత్త ఆవిష్కరణగా గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు. దీంతో ప్రజల్లో దీని పట్ల చాలా ఆసక్తి పెరిగింది. కానీ ఇది లాంచ్ అయిన తర్వాత అంచనాలను అందుకోకపోవడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం ఉన్నత వర్గాలకే పరిమితమైంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో పోలీస్ పెట్రోలింగ్, పోస్టల్ డిపార్ట్మెంట్, పర్యాటక రంగాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. గూగుల్ గ్లాస్.. సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నుంచి మరో అద్భుత టెక్నాలజీగా భావించిన ప్రొడక్ట్.. గూగుల్ గ్లాస్. కీబోర్డులు, టచ్ స్క్రీన్ల అవసరం లేకుండా మాటలతోనే గారడీ చేయడానికి కళ్ల జోడు రూపంలో అందుబాటులోకి వచ్చిన సరికొత్త గాడ్జెట్ గూగుల్ గ్లాస్. ఇది కళ్లజోడు ఆకారంలో ఉండే ఆప్టికల్ హెడ్ మౌంటెడ్ డిస్ప్లే. ఈ గ్లాస్ ఆధారంగా వీడియో చాటింగ్, మెసేజింగ్, వెబ్ బ్రౌజింగ్ వంటివి చేయొచ్చు. క్లిక్ ఎ పిక్చర్ అంటే వెంటనే ఎదురుగా ఉన్న దృశ్యాన్ని ఫొటో తీస్తుంది. రికార్డ్ అంటే వీడియో తీస్తుంది. అంతేకాదు దీని ద్వారా తీసిన ఫొటోలు, వీడియోలను ఫేస్బుక్లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అప్లోడ్ చేసుకోవచ్చు. గమ్యం తెలియని చోట దారి చూపుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. గూగుల్ గ్లాస్ ధరిస్తే ఒక చిన్న కంప్యూటర్ కళ్ల ముందు ఉన్నట్టే. ఇన్ని సదుపాయాలతో మార్కెట్లోకి వచ్చిన గూగుల్ గ్లాస్ మొదట్లో ఎక్కువ మందిని ఆకర్షించింది. కానీ దీనికి సరైన మార్కెటింగ్ లభించలేదని నిపుణుల అభిప్రాయం. దీనికి తోడు గూగుల్ గ్లాస్ సాయంతో ఎదుటివారికి తెలియకుండా ఫొటో లు, వీడియోలు తీసే అవకాశం ఉండటంతో ప్రైవసీ, పైరసీ లాంటి వివాదాలు తలెత్తాయి. అప్పట్లో ఇంగ్లండ్లోని రెస్టారెంట్లు, థియేటర్లు, ఆసుపత్రుల్లాంటి ప్రదేశాల్లో గూగుల్ గ్లాస్ వాడకంపై నిషేధం విధించారు. గొప్ప టెక్నాలజీ ఇన్నోవేషన్గా, పెద్ద హంగామాతో ఎంతో ఆసక్తి రేపుతూ జనం ముందుకు వచ్చిన గూగుల్ గ్లాస్ చివరకు ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేక తెరమరుగైంది. -
జీపీఎస్ టెక్నాలజీ
గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్).. సమాచార, ప్రసార రంగాల్లో అద్భుత సాంకేతిక విప్లవం. ప్రపంచ మార్గదర్శిగా పేరుగాంచిన ఆవిష్కరణ. ఎక్కడికైనా వెళ్లాలంటే.. దారి తెలియదన్న బాధ లేదు.. ఎలా వెళ్లాలి? అనే టెన్షన్ అవసరం లేదు. ఏ వీధికి ఎలా వెళ్లాలో.. ఎక్కడ ఏ మలుపు తిరగాలో అన్నీ అదే చూపెడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ స్మార్ట్ఫోన్ నుంచి మిలిటరీ వరకూ.. అన్ని విభాగాల్లో విరివిగా వాడుకలో ఉంది. అసలు జీపీఎస్ టెక్నాలజీ ఏంటి? ఎలా పనిచేస్తుంది? మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.. Global Positioning System జీపీఎస్ అంటే ఒక ప్రదేశానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం, దూరాన్ని అంచనా వేయడం, గమ్యాన్ని గుర్తించడం, సమయాన్ని లెక్కించడం, మ్యాపింగ్ వంటి విషయాల్లో జీపీఎస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం మొబైల్, వాహన, రక్షణ రంగాలతోపాటు వ్యవసాయం, సినిమా, రవాణా, ఐటీ రంగాల్లో జీపీఎస్ టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నారు. జీపీఎస్ వ్యవస్థను తొలిసారి 1978లో అమెరికా రక్షణ విభాగం.. నవ్స్టార్ పేరిట ప్రారంభించింది. 1994లో 24 శాటిలైట్లతో పూర్తిస్థాయి నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం చాలా దేశాలు అమెరికా జీపీఎస్ టెక్నాలజీనే వినియోగించుకుంటున్నాయి. పనితీరు మొదట భూమిపై ఉండే సమాచారాన్ని జీపీఎస్ సర్వర్ల ద్వారా ఉపగ్రహాలు స్వీకరిస్తాయి. అంటే.. సమాచారం భూమి నుంచి అంతరిక్షానికి చేరుతుంది. అక్కడ నుంచి వినియోగదారుల అభ్యర్థన మేరకు ఆ సమాచారం యూజర్కు చేరుతుంది. తర్వాత యూజర్ నుంచి గమ్యానికి చేరుతుంది. ఇలా త్రికోణమితి (ట్రయాంగిల్) విధానంలో సిగ్నల్స్ నిరంతరం ప్రసారమవుతూ ఉంటాయి. 2డీ పొజిషన్ (అక్షాంశ, రేఖాంశాల) ఆధారంగా కనీసం మూడు శాటిలైట్లు రేడియో సిగ్నల్స్ ద్వారా కదలికలను ట్రాక్ చేస్తాయి. ఒకసారి యూజర్ పొజిషన్ను గుర్తించిన తర్వాత.. వేగం, ట్రాకింగ్, ఒక స్థానం నుంచి మరో స్థానానికి మధ్య ఉన్న దూరం, ప్రయాణ దూరం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి అంశాలను జీపీఎస్ సర్వర్లు పరిగణలోకి తీసుకుంటాయి. భూమి నుంచి 12 వేల మైళ్ల దూరంలోని కక్ష్యలో ఉన్న జీపీఎస్ వ్యవస్థలో శాటిలైట్లు రోజంతా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి సుమారు గంటకు 7 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. జీపీఎస్ ఉపయోగాలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే కాకుండా మానవుడి దైనందిన జీవితంలో కూడాజీపీఎస్ సేవలు ఎలా ఉపయోగపడు తున్నాయో చూద్దాం.. పిల్లలు, మహిళలు, ఇతర కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇంట్లో నుంచే వాహన కదలికలను గమనించవచ్చు. దొంగతనానికి గురైన వాహనాలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పట్టుకోవడానికి వినియోగిస్తారు. భూ, వాయు, జల మార్గాల్లో వాహన చోదకులకు (డ్రైవర్లు, పైలట్లు) దిశానిర్దేశం చేయొచ్చు. సర్వేలు, మ్యాపింగ్ అవసరాలకు ఉపయోగపడుతుంది. కేసుల విచారణ సమయంలో పోలీసులు ఎక్కువగా జీపీఎస్పై ఆధారపడతారు. వాతావరణ పరిస్థితులను, ప్రకృతి వైపరీత్యాలను జీపీఎస్ ద్వారానే అంచనా వేస్తారు. వాహనాలకు జీపీఎస్ టెక్నాలజీని అమర్చడం ద్వారా అక్రమ రవాణాలను, చోరీలను సులభంగా గుర్తించవచ్చు, నియత్రించవచ్చు. అడవులు, వన్య మృగాల పర్యవేక్షణలో అటవీ శాఖ జీపీఎస్ టెక్నాలజీపైనే ఆధారపడుతోంది. జీపీఎస్ బేస్డ్ మెషీన్ గెడైన్స్ సిస్టం ద్వారా నిర్మాణ రంగం, మైనింగ్ వంటి విభాగాల్లో భారీ పరికరాలను ఆపరేట్ చేస్తారు. వ్యవసాయ రంగంలో పంట పొలాలను పరిశీలించడం, పర్యవేక్షణ, మందులను పిచికారీ, పంట కోయడం వంటి పనులకు వాడే కొన్ని పరికరాల్లో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో, బైకులు, కార్ రేసింగ్లలో ఈ టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి, సముద్రం లోపల దిశానిర్దేశం చేయడానికి, విపత్కర పరిస్థితుల్లో ఆచూకీ తెలపడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఠ రక్షణ రంగంలో ఎక్కువగా ఈ జీపీఎస్ టెక్నాలజీని వినియోగిస్తారు. యుద్ధ సమయాల్లో శత్రువుల ఆచూకీ, సమయం తెలుసుకోవడానికి, సైనికులకు దిశానిర్దేశం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. కొన్ని జీపీఎస్ ఆధారిత యాప్లు Explore Around You మీరు ఒక ప్రదేశానికి వెళ్లాలనుకున్నారు. అక్కడికి ఎలా వెళ్లాలో మీకు తెలుసు. కానీ అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? హోటల్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? వంటి సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. ఇందులో ఉండే అప్షన్లలో ప్రధానమైంది ‘డిస్టెన్స్ రేడియస్’. దీని ద్వారా మీరున్న చోటుకి నిర్ణీత దూరంలో ఉన్న వాటిని తెలుసుకోవచ్చు. అలాగే ‘టైం ఆఫ్ డే’ ఆప్షన్ నిర్ణీత సమయంలో అందుబాటులో ఉన్నవాటిని మాత్రమే చూపుతుంది. ఉదాహరణకు మీరో కాఫీ షాప్ని సెలెక్ట్ చేశారనుకోండి.. అది మీరున్న చోటుకి ఎంత దూరంలో ఉంది? అందులో ధరలు, ఫోన్ నంబర్లు, అడ్రస్, కాఫీ షాపు ఫొటోలు వంటి వివరాలను మీ కళ్ల ముందుంచుతుంది. నెట్ లేకుంటే జీపీఎస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు. . MAPS.MEలాంటి ఆఫ్లైన్లో పనిచేసే యాప్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు... జీపీఎస్ డేటా మొబైల్లోకి డౌన్లోడ్ అయి పనిచేస్తుంది. ఈ యాప్ డౌన్లోడ్ కోసం http://goo.gl/XIqbZr ఛోట లింక్ని చూడండి. రెండింటిలోనూ.. స్మార్ట్ఫోన్, టాబ్లెట్ రెండింటిలోనూ జీపీఎస్ నేవిగేషన్ సేవల్ని వినియోగించుకోవాలనుకుంటున్నారా..? అయితే MapFactor GPS Navigation యాప్ని ఇన్స్టాల్ని చేసుకోండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేయగానే ఆఫ్లైన్లో వాడుకునేందుకు వీలుగా మ్యాప్ డేటా మొత్తం ఎస్డీ కార్డ్లో సేవ్ అవుతుంది. వివిధ భాషల్లో నేవిగేషన్ని పొందగలిగే ఈ యాప్ అప్డేట్స్ని ప్రతినెలా ఉచితంగా పొందొచ్చు. 2డీ, 3డీ రూపాల్లో మ్యాప్ డిస్ప్లే కనిపించడం ఈ యాప్ ప్రత్యేకత. అడుగు దూరంలో మన జీపీఎస్ అగ్రరాజ్యం అమెరికా విసిరిన సవాలుకు దీటుగా జవాబు చెప్పేందుకు ఇస్రో చేపట్టిన బృహత్తర కార్యమే.. ఐఆర్ఎన్ఎస్ఎస్ (Indian Regional Navigation Satellite System).ఈ శాటిలైట్ వ్యవస్థ ద్వారా స్వదేశీ జీపీఎస్ వ్యవస్థ కల సాకారం కానుంది. ఇప్పటివరకు అమెరికా ఆధీనంలో ఉన్న జీపీఎస్ సేవల్నే చాలా దేశాలు వినియోగించుకుంటున్నాయి. క్లిష్ట సమయాల్లో సేవలు అందించడంలో మెలికపెడుతూ అమెరికా నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తోంది. కార్గిల్ యుద్ధ సమయంలో జీపీఎస్ సేవల వినియోగం, సమాచార సేకరణలో అమెరికా నుంచి మన దేశానికి ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా స్వదేశీ జీపీఎస్ వ్యవస్థను రూపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం, ఇస్రో పనిచేస్తున్నాయి. ఈ సేవలు అందుబాటులో వస్తే మిలిటరీ, పౌర, వాణిజ్య సేవల సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. రెండు రకాల సేవలందించే ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్లో మొదటిది స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్(ఎస్పీఎస్). ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. రెండోది రిస్ట్రిక్టెడ్ సర్వీస్(ఆర్ఎస్). ఇది మిలిటరీ లాంటి కొన్ని విభాగాలకు అందుబాటులో ఉండబోతోంది. -
జీవ ఆవిర్భావం... లక్షణాలు...
సౌర వ్యవస్థ, భూమి 4.5 - 5 బిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించాయి. భూమి ఉద్భవించిన తర్వాత 1 - 1.5 బిలియన్ ఏళ్ల పాటు నిర్జీవంగానే ఉంది. 3.5 బిలియన్ ఏళ్ల క్రితమే భూమిపై జీవం ఆవిర్భవించినట్లు పలు నిదర్శనాలు ఉన్నాయి. భూమిపై జీవ ఆవిర్భావాన్ని వివరించే వాటిలో ముఖ్యమైనవి పాన్స్పెర్మియా, జీవ ఆవిర్భావ సిద్ధాంతాలు. ‘‘భూమిపై జీవం ఆవిర్భవించ లేదు.. దానికి ఆవల నుంచి భూమిపైకి జీవం వచ్చి చేరిందని..’’ పాన్స్పెర్మియా సిద్ధాంతం వివరిస్తుంది. మొదటిసారిగా పాన్స్పెర్మియా సిద్ధాంతాన్ని ఎస్.అర్హీనియస్ 1908లో ప్రతిపాదించాడు. తర్వాతి కాలంలో ఈ సిద్ధాంతాన్ని వివిధ రకాలుగా వర్గీకరించారు. గ్రహ శకలాలు, ఉల్కలు భూమిని ఢీకొనడం ద్వారా వాటిలోని సూక్ష్మజీవులు భూమికి చేరాయని కొంతమంది వివరిస్తే.. గ్రహాంతర వాసులు ఉద్దేశపూర్వకంగానే భూమిపై జీవులను ప్రవేశపెట్టారని మరికొందరు భావిస్తున్నారు. Theory of origin of life అధిక నిదర్శనాలతో భూమిపై జీవ ఆవిర్భావాన్ని వివరించే సిద్ధాంతం Theory of origin of life. రష్యాకు చెందిన ఎ.ఒ.ఒపారిన్ బ్రిటన్కు చెందిన జె.బి.ఎస్.హాల్డైన్ ఈ సిద్ధాంతాన్ని స్వతంత్రంగా ప్రతిపాదించారు. దీని ప్రకారం.. మొదట భూమిపై జీవ రసాయనాలు (ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు, డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వంటి కేంద్రకామ్లాలు) ఆవిర్భవించాయి. వీటి తర్వాత మాత్రమే జీవుల ఆవిర్భావం జరిగింది. పూర్వ భూమి వాతావరణం.. క్షయకరణ వాతావరణం (Reducing). స్వేచ్ఛా ఆక్సిజన్ ఉండేది కాదు. నీరు, నీటి ఆవిరి ఉన్నప్పటికీ.. స్వేచ్ఛా ఆక్సిజన్ అవసరం ఉండేది కాదు. వాతావరణ ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండేవి. ఇలాంటి వాతావరణం రసాయన చర్యలను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుత వాతావరణం.. ఆక్సీకరణ వాతావరణం (Oxidising). ఇలాంటి వాతావరణంలో రసాయన చర్యలు జరగడం కష్టం. పూర్వ భూమిలోని సముద్ర నీరు పూర్తిగా స్వాదు జలం. కోట్ల సంవత్సరాల పాటు నేల క్రమక్షయం చెంది, ఖనిజాలు సముద్ర నీటిలోకి ప్రవేశించడంతో ప్రస్తుత లవణీయత (3.5 శాతం) సంభవించింది. పూర్వ భూమి వాతావరణమంతా హైడ్రోజన్, కార్బన్, నత్రజని, నీటి ఆవిరి మిశ్రమంగా ఉండేది. అధిక ఉష్ణోగ్రతల ఫలితంగా వీటి మధ్య చర్యలు జరిగి అమ్మోనియా, మీథేన్, హైడ్రోజన్ సయనైడ్ వంటి సరళ అణువులు ఏర్పడ్డాయి. తర్వాత వీటి మధ్య చర్యల ఫలితంగా తొలుత అమైనో ఆమ్లాలు, నత్రజని, క్షారాలు, చక్కెర, కొవ్వు ఆమ్లాలు వంటి సరళ జీవ రసాయనాలు ఏర్పడ్డాయి. వీటి మధ్య సముద్ర నీటిలో జరిగిన చర్యల ద్వారా పెప్టైడ్లు, న్యూక్లియోటైడ్లు, ఒలిగోశాఖరైడ్లు, కొవ్వులు ఆ తర్వాత ఆర్ఎన్ఏ, డీఎన్ఏ వంటి రసాయనాలు ఏర్పడ్డాయి. పిండి పదార్థాలు, కొవ్వుల మధ్య చర్యల ఫలితంగా జీవ పొరలు ఏర్పడి పూర్వ కణం వంటి నిర్మాణాలు సంభవించాయి. వీటికి ఒపారిన్.. కొయసర్వేట్ అనే పేరుపెట్టారు. ఇవి క్రమంగా పూర్తిస్థాయి కణాలుగా ఆవిర్భవించాయి. తొలుత అవాయు జీవులు భూమిపై ఆవిర్భవించిన పూర్వ జీవులన్నీ తొలుత అవాయు జీవులు. ఆ తర్వాత వీటిలో కొన్ని హైడ్రోజన్ కోసం నీటి అణువును విచ్ఛిన్నం చేసి.. వాతావరణంలోకి స్వేచ్ఛా ఆక్సిజన్ విడుదలను ప్రారంభించాయి. భూమిపై ప్రస్తుతం ఉన్న 21 శాతం ఆక్సిజన్కు మూలం మొక్కల్లోని కిరణజన్య సంయోగక్రియ. ఆక్సిజన్ వెలువడే కొద్దీ ఆక్సిజన్ను వినియోగించి మనుగడ సాగించే ఏరోబిక్ జీవులు పరిణామం చెందాయి. భూమిపై ఆవిర్భవించిన తొలి జీవుల్లో ఆర్ఎన్ఏ ప్రధాన జన్యు పదార్థంగా ఉండేది. ఆర్ఎన్ఏ పెద్దగా స్థిరమైంది కాదు. వేగంగా ఉత్పరివర్తనాలకు లోనవుతుంది. దాంతో క్రమంగా ఆర్ఎన్ఏ స్థానంలో డీఎన్ఏ జన్యు పదార్థంగా వ్యవహరించడం ప్రారంభమైంది. కాబట్టి భూమిపై ఉన్న సమస్త జీవులన్నింటిలో ప్రస్తుతం డీఎన్ఏ ప్రధాన జన్యు పదార్థం. హరోల్డ్ యూరే, స్టాన్లీ మిల్లర్ 1953లో చేసిన పరిశోధనలో ఒపారిన్, హాల్డేన్ల సిద్ధాంతాన్ని నిరూపించారు. జీవ లక్షణాలు భూమిపై ప్రస్తుతం ఉన్న జీవులన్నిటిలో.. కొన్ని సమాన జీవ లక్షణాలను ప్రదర్శిస్తాయి. వీటిలో ప్రధానమైనవి, ఇతర లక్షణాలను కూడా వివరించేవి.. పెరుగుదల, చలనం, జీవక్రియ, క్షోభ్యత, ప్రత్యుత్పత్తి. జీవి పుట్టిన నాటి నుంచి మరణించే వరకు ప్రదర్శించే పురోగమన, తిరోగమన మార్పులన్నింటినీ పెరుగుదల అంటారు. పెరుగుదల నిర్మాణాత్మకంగా, క్రియాశీలంగా ఉంటుంది. పుట్టక ముందే తల్లి గర్భంలో కూడా శిశువు పెరుగుదలను ప్రదర్శిస్తుంది. నవ శిశువు, బాల్యం, యుక్త వయసు, నడి వయసు, వృద్ధాప్యం వంటి దశలన్నీ ఈ పెరుగుదలలో భాగాలే. జీవులన్నింటిలో పెరుగుదల రేటు ఒకే విధంగా ఉండదు. కొన్ని జీవుల్లో వేగంగా ఉంటే.. మరి కొన్ని జీవుల్లో నెమ్మదిగా ఉంటుంది. కొన్నింటి జీవిత కాలం తక్కువ. మరికొన్నింటి జీవిత కాలం ఎక్కువ (ఉదాహరణ-వేగంగా పెరిగే మొక్క వెదురు, అధిక జీవిత కాలం ఉన్న జంతువు-తాబేలు). మొక్కలు, జంతువుల్లో పెరుగుదలను నియంత్రించే పలు నియంత్రకాలు ఉంటాయి. ఉన్నత జంతువుల్లో హార్మోన్లు పెరుగుదలను నియంత్రిస్తాయి. మొక్కల్లో ఆక్సిన్లు, జిబ్బరిల్లిన్లు, సైటోకైనిన్లు పెరుగుదలను ప్రేరేపించే రసాయనాలు. ఇలాంటి కారకాల లోపం లేదా అధిక స్రావం ద్వారా పెరుగుదలలో వైపరీత్యాలు సంభవిస్తాయి. ఉదాహరణ-చిన్నారుల్లో పెరుగుదల లోపం ద్వారా మరుగుజ్జుతనం సంభవిస్తుంది. అధిక స్రావం ద్వారా పెద్దల్లో ఆక్రోమేగలీ వైపరీత్యం సంభవిస్తుంది. ముఖ్య లక్షణం చలనం జంతువులు, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల్లో కనిపించే మరో ముఖ్య లక్షణం చలనం. ఆహారం, రక్షణ, సంయోగం కోసం జంతువులు ప్రధానంగా చలనం అనే గుణాన్ని ఉపయోగించుకుంటాయి. ఇందుకోసం తమ ఆవాసాలకు అనుగుణంగా వివిధ అనుకూలతను కూడా జంతువులు ప్రదర్శిస్తాయి. ఈ క్రమంలో కొన్ని ఎగిరే (Volant), మరి కొన్ని వేగంగా పరిగెత్తే (Cursorial), మరికొన్ని చెట్లలో నివసించే వంటి అనుకూలతలను ప్రదర్శిస్తాయి. కొన్ని జంతువులు రుతువులకనుగుణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి తిరిగి మొదటి ప్రాంతానికి చేరే క్రమ చలనం, వలస అనే ప్రత్యక్ష లక్షణాలను కలిగి ఉంటాయి. సాధారణంగా వలస పక్షులు శీతాకాలంలో ధ్రువాలు, సమ శీతోష్ణస్థితి మండల ప్రాంతాల నుంచి భూమధ్య రేఖ ఉష్ణ మండల ప్రాంతాలకు ఆహారం, విశ్రాంతి కోసం వలస వస్తాయి. తిరిగి వేసవిలో ప్రత్యుత్పత్తి (గుడ్లు పెట్టి పిల్ల పక్షులకు జన్మనివ్వటం) కోసం ధ్రువ ప్రాంతాలకు తిరిగి వెళ్తాయి. అదే విధంగా సముద్ర చేపలు కొన్ని నదుల్లోకి వచ్చి గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వలస పోతాయి. ఈ రకమైన చేపలు, అనాడ్రోమస్ చేపలు. ఉదాహరణ-పొలస చేప, సాల్మన్. జీవక్రియ రెండు రకాలు ఒక జీవిలో లేదా ఏదైనా జీవకణంలో జరిగే రసాయనిక చర్యలన్నింటినీ కలిపి జీవక్రియ అంటారు. పెరుగుదల, శ్వాసక్రియ, ప్రత్యుత్పత్తి ఇలా ఏ జీవ లక్షణం తీసుకున్నా అన్నీ రసాయనిక చర్యల ఆధారంగానే జరుగుతాయి. జీవక్రియ రెండు రకాలు. అవి.. నిర్మాణ క్రియ (Anabolism), విచ్ఛిన్న క్రియ (Catabolism). ఒక ప్రధాన పదార్థం ఏర్పడటానికి జరిగే రసాయనిక చర్యలను కలిపి నిర్మాణ క్రియ అంటారు. ఉదాహరణ అనేక రసాయనిక చర్యలు క్రమపద్ధతిలో జరిగితేనే కిరణజన్య సంయోగక్రియలో పిండి పదార్థం ఏర్పడుతుంది. ఒక ప్రధాన పదార్థం పూర్తిగా విచ్ఛిన్నమవడానికి జరిగే రసాయనిక చర్యలన్నింటినీ కలిపి విచ్ఛిన్న క్రియ అంటారు. ఉదాహరణ-శ్వాసక్రియ. ఆహార అణువుల నుంచి శక్తి విడుదలయ్యే ప్రక్రియ శ్వాసక్రియ. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ రక్తంలోకి చేరి, రక్తం ద్వారా కణాల్లోకి ప్రవేశించి ఆహార అణువుల ఆక్సీకరణాన్ని నిర్వహిస్తుంది. ఫలితంగా శక్తి విడుదలవుతుంది. -
లోక్పాల్ లోకాయుక్త
అత్యధిక అధికారం.. అత్యధిక అవినీతికి దారితీస్తుందనే లార్డ ఆక్టన్ వ్యాఖ్య.. సమకాలీన భారత సమాజంలో పేరుకుపోయిన అవినీతికి అద్దం పడుతోంది. మన దేశంలో ఉన్నత స్థాయిలో జరిగే అవినీతిని అంతం చేసే ఉద్దేశంతో ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం- 1952, సెంట్రల్ విజిలెన్స కమిషన్ -1964, అవినీతి నిరోధక చట్టం-1988 వంటి చట్టాలను తీసుకొచ్చారు. అయితే రాజకీయ జోక్యం కారణంగా ఆ చట్టాలేవీ అవినీతిని కట్టడి చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన అత్యంత శక్తిమంతమైన వ్యవస్థలే లోక్పాల్, లోకాయుక్తలు. ఉన్నత స్థాయిలో జరిగే అవినీతిని అరికట్టేందుకు కేంద్ర స్థాయిలో లోక్పాల్, రాష్ర్ట స్థాయిలో లోకాయుక్తను ఏర్పాటు చేయాలనే డిమాండ్ 1959 నుంచే ఉంది. స్కాండినేవియా దేశాలైన స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క, నార్వేల్లో ‘అంబుడ్సమన్’ వ్యవస్థ విజయవంతంగా కొనసాగుతోంది. స్వీడన్లో అంబుడ్సమన్ వ్యవస్థ 1809 నుంచి అవినీతి నిరోధానికి పనిచేస్తోంది. ‘అంబుడ్సమన్’ అంటే సమస్యలను నివారించే వ్యక్తి అని అర్థం. దీని స్ఫూర్తిగానే భారతదేశంలో 2014, జనవరి 1 నుంచి లోక్పాల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. లోక్పాల్ నేపథ్యం కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి సి.డి.దేశ్ముఖ్ 1959లో తొలిసారి ఈ తరహా వ్యవస్థ కోసం డిమాండ్ చేశారు. ఎల్.ఎం.సింఘ్వి మొదటిసారి లోక్పాల్ అనే పదాన్ని పార్లమెంటులో వాడారు. 1968లో పరిపాలనా సంస్కరణల కమిషన్(తొలిసారి) తన మధ్యంతర నివేదికలో లోక్పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1968లో తొలిసారి లోక్పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే బిల్లు లోక్సభ ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో వీగిపోయింది. తర్వాత కాలంలో లోక్పాల్ బిల్లును పదిసార్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో 2013, డిసెంబర్ 18న లోక్పాల్, లోకాయుక్త బిల్లు-2011ను పార్లమెంటు ఆమోదించింది. అనంతరం రాష్ర్టపతి ఆమోదంతో 2014, జనవరి 1 నుంచి లోక్పాల్ చట్టం అమల్లోకి వచ్చింది. చట్టంలో ముఖ్యాంశాలు నిర్మాణం: లోక్పాల్లో ఒక చైర్పర్సన్, గరిష్టంగా 8 మంది సభ్యులు ఉంటారు. అర్హతలు: చైర్పర్సన్గా నియమితులయ్యే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రస్తుత/మాజీ ప్రధాన న్యాయమూర్తయి ఉండాలి లేదా భారతరాష్ర్టపతి దృష్టిలో ప్రముఖ న్యాయకోవిదుడై ఉండాలి. లోక్పాల్ సభ్యుల్లో సగం మంది న్యాయ వ్యవస్థకు సంబంధించిన వారై ఉండాలి. వీరికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయి అర్హతలుండాలి. సభ్యుల్లో సగం మంది షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండాలి. వీరిలో ఒక మహిళా సభ్యురాలు తప్పనిసరి. పదవీ కాలం: లోక్పాల్ చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం 5 ఏళ్లు/70 ఏళ్ల వరకు. పదవీ కాలానికి సంబంధించి రెండింటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. చైర్పర్సన్, సభ్యుల కనీస వయసు 45 సంవత్సరాలు. ఒకసారి లోక్పాల్ సభ్యులుగా కొనసాగినవారు పునర్నియామకానికి అనర్హులు. జీతభత్యాలు: లోక్పాల్ చైర్పర్సన్కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా జీతం లభిస్తుంది. దర్యాప్తు: లోక్పాల్కు సొంత దర్యాప్తు - విచారణ విభాగాలు ఉంటాయి. నియామకం: లోక్పాల్ చైర్పర్సన్, సభ్యులను భారత రాష్ర్టపతి నియమిస్తారు. వీరి ఎంపికలో ఐదుగురు సభ్యుల కమిటీ రాష్ర్టపతికి సలహా ఇస్తుంది. కమిటీలోని సభ్యులు.. 1. ప్రధానమంత్రి 2. లోక్సభ స్పీకర్, 3. లోక్సభలో ప్రతిపక్ష నేత 4. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 5. ప్రముఖ న్యాయ కోవిదుడు తొలగింపు: లోక్పాల్ చైర్పర్సన్, సభ్యులకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై కనీసం 100 మంది పార్లమెంటు సభ్యులు రాష్ర్టపతికి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఆయా సభ్యులపై రాష్ర్టపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి అవినీతి నిరూపితమైతే వారిని తొలగిస్తారు. అధికార పరిధి అవినీతి ఆరోపణలకు సంబంధించిన అంశాలను విచారిస్తుంది. ప్రధానమంత్రితోపాటు కేంద్ర మంత్రులంతా దీని పరిధిలోకి వస్తారు. ప్రధానమంత్రిపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారించాలంటే లోక్పాల్లో మెజారిటీ సభ్యుల ఆమోదం తప్పనిసరి. దేశ భద్రత, అణుశక్తి, అంతరిక్షం, అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాల్లో ప్రధానికి మినహాయింపు ఉంటుంది. లోక్పాల్కు న్యాయవ్యవస్థపై విచారణాధికారం లేదు. దర్యాప్తును 60 రోజుల్లో, విచారణను 6 నెలల్లో పూర్తి చేయాలి. వివిధ కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసుకోవచ్చు. దోషులకు గరిష్టంగా పదేళ్ల పాటు జైలు శిక్ష విధించవచ్చు. లోక్పాల్కు అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. లోక్పాల్ ద్వారా నిర్దేశితమైన కేసులకు సంబంధించి సీబీఐతో సహా అన్ని దర్యాప్తు సంస్థలపై పర్యవేక్షణాధికారం ఉంటుంది. కొన్ని కేసుల్లో లోక్పాల్కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. ప్రభుత్వ నిధులు పొందుతున్న సంఘాలు, విదేశాల నుంచి రూ.10 లక్షలకు మించి నిధులు అందుకునే సంస్థలన్నీ లోక్పాల్ పరిధిలోకి వస్తాయి. లోక్పాల్ చట్టం కింద నమోదైన కేసుల విషయంలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయమని ఆదేశించొచ్చు. ప్రత్యేక కోర్టులు.. ఈ కేసులను సంవత్సరం లోపు విచారించి తీర్పు చెప్పాల్సి ఉంటుంది. తగిన కారణం చూపి ఈ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించొచ్చు. ఈ విధంగా గరిష్టంగా రెండేళ్ల వరకు కొనసాగించొచ్చు. లోకాయుక్త రాష్ర్ట స్థాయిలో ఉన్నత పదవుల్లో ఉన్నవారిపై వచ్చే అవినీతి ఆరోపణలను లోకాయుక్త విచారిస్తుంది. మొదటి పరిపాలనసంస్కరణల కమిషన్1968లో తన మధ్యంతర నివేదికలో రాష్ర్ట స్థాయిలో లోకాయుక్తను ఏర్పాటు చేయాలని సూచించింది. లోక్పాల్, లోకాయుక్త చట్టం-2013 ప్రకారం.. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపు అన్ని రాష్ట్రాలు లోకాయుక్తను ఏర్పాటు చేయాలి. ఈ చట్టం కంటే ముందే 1970లో ఒడిశా లోకాయుక్త చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ, ఆ చట్టం ఒడిశాలో 1983 నుంచి మాత్రమే అమల్లోకి వచ్చింది. దాంతో లోకాయుక్తను అమలు చేసిన తొలి రాష్ర్టంగా మహారాష్ర్ట (1971) గుర్తింపు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983, నవంబర్ 1న ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లోకాయుక్తను ఏర్పాటు చేశారు. నిర్మాణం: రాష్ర్టంలో లోకాయుక్త, ఉప లోకాయుక్తలు ఉంటారు. నియామకం: లోకాయుక్త, ఉప లోకాయుక్తలను రాష్ర్ట గవర్నర్ నియమిస్తారు. వీరి నియామకంలో గవర్నర్కు ముఖ్యమంత్రి నేతృత్వంలోని హైపవర్ కమిటీ సలహా ఇస్తుంది. ఈ కమిటీలో రాష్ర్ట ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు తదితరులుంటారు. అర్హతలు: లోకాయుక్తగా నియమితులయ్యేవారు హైకోర్టు ప్రస్తుత లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తయి ఉండాలి. ఉప లోకాయుక్తకు జిల్లా న్యాయమూర్తి అర్హతలుండాలి. పదవీ కాలం: వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు/65 సంవత్సరాల వయసు వచ్చే వరకు. ఈ రెండింటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది. వీరు పునర్నియామకానికి అనర్హులు. తొలగింపు: లోకాయుక్త, ఉప లోకాయుక్తలపై వచ్చే అవినీతి ఆరోపణలపై రాష్ర్టపతి.. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి, దాని ఆధారంగా వారిని తొలగిస్తారు. అధికార పరిధి: ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని విచారిస్తుంది. కొన్ని కేసుల్లో తనంత తానుగా జోక్యం చేసుకొని (సుమోటో) విచారణ చేస్తుంది. ఆరేళ్ల లోపు కేసులను మాత్రమే విచారిస్తుంది. ఫిర్యాదు చేసే బాధితుడు ఫిర్యాదుతోపాటు రూ.150 డీడీని జతచేయాలి. లోకాయుక్త విచారణ సందర్భంగా రాష్ర్ట దర్యాప్తు సంఘాల సహకారం తీసుకుంటుంది. లోకాయుక్త సిఫార్సులు కేవలం సలహా పూర్వకమే. -
బులెటిన్ బోర్డు
మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో వివిధ పోస్టులు ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసెస్కి చెందిన హైదరాబాద్లోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కార్యాలయం వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: జూనియర్ అసిస్టెంట్ (17), టైపిస్ట్ (13), డ్రైవర్ (2), కాపీస్ట్ (3), ఫీల్డ్ అసిస్టెంట్ (3), ఎగ్జామినర్ (3), స్టెనోగ్రాఫర్ గ్రేడ్- ఐఐఐ (3). వయోపరిమితి: జూలై 1, 2016 నాటికి 18 నుంచి 34 ఏళ్లకు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. అర్హత: సంబంధిత విభాగంలో తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 24 వివరాలకు: www.ecourts.gov.in/ap టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియాలో స్పెషల్ రిక్రూట్మెంట్ న్యూఢిల్లీలోని టెలీకమ్యూనికేషన్స కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెచ్ఆర్), ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్. ఖాళీలు: 4 వయోపరిమితి: సెప్టెంబర్ 1, 2016 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 18 వివరాలకు: www.tcil-india.com నార్తఈస్టర్న స్పేస్ అప్లికేషన్స్ సెంటర్లో సైంటిస్ట్/ ఇంజనీర్ పోస్టులు మేఘాలయలోని నార్తఈస్టర్న స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎన్ఈఎస్ఏసీ)... వివిధ విభాగాల్లో సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: సైంటిస్ట్/ఇంజనీర్ విభాగాలు: స్పేస్ అండ్ అటామిక్ సైన్స్, జియోసైన్స్, జియోఇన్ఫర్మాటిక్స్ అప్లికేషన్స్, అర్బన్ ప్లానింగ్ ఖాళీలు: 4. అర్హత: సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ/ఎంటెక్/మాస్టర్ ఆఫ్ ప్లానింగ్/తత్సమాన విద్యార్హత ఉండాలి. వయోపరిమితి: అక్టోబర్ 25, 2016 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 25. వివరాలకు: www.nesac.gov.in -
సంక్షేమ రాజ్య నిర్మాణానికి తోడ్పడేవి?
ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏ చట్టం ద్వారా కేటాయించారు? 1909 మింటోమార్లే సంస్కరణల చట్టం రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? 26-11-1949 ఉమ్మడి జాబితాను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఠ ఆస్ట్రేలియా రాజ్యాంగ పీఠికలో 42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా చేర్చిన పదాలు? సామ్యవాద, లౌకిక, సమగ్రత ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ సంస్థ తన విధిని నిర్వర్తించాలంటూ జారీచేసే ఆజ్ఞ ఏది? మాండమస్ సంక్షేమ రాజ్య నిర్మాణానికి తోడ్పడేవి ఏవి? నిర్దేశక నియమాలు ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి తోడ్పడిన అధికరణం? ఠి అధికరణం-48 ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న విధుల సంఖ్య? ఠి 11 రాష్ట్రపతి రాజీనామా లేఖను ఎవరికి పంపిస్తారు? ఠి ఉప రాష్ట్రపతికి రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన గురించి తెలిపే ఆర్టికల్? 356 ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఎన్నో ఉప రాష్ట్రపతి? 12వ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి ప్రధాని ఎవరు? మొరార్జీ దేశాయ్ భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి? అటార్నీజనరల్ కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య? లోక్సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదు మంత్రి మండలి సమష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? లోక్సభకు లోక్సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఎన్ని స్థానాలు కేటాయించారు? 84, 47 పార్లమెంటు ఉమ్మడి సభ సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవ రు? స్పీకర్ సభలో సభ్యత్వం లేకపోయినా నిర్ణాయక ఓటు హక్కు ఎవరికి ఉంటుంది? రాజ్యసభ చైర్మన్ పార్లమెంటులో అతి ప్రాచీన కమిటీ ఏది? ప్రభుత్వ ఖాతాల సంఘం రాష్ట్రపతితో ఎంత మంది సభ్యులు రాజ్యసభకు ఎంపికవుతారు? ఠి 12 రాజ్యసభ ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఎవరు? పీజే కురియన్ న్యాయ శాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కారణాలు? రాజ్యాంగ ఆధిక్యత పరిరక్షణ, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం న్యాయ సమీక్ష విధానాన్ని ఎక్కడి నుంచి గ్రహించారు? ఠి అమెరికా భారత సుప్రీంకోర్టు స్థాపించినప్పుడు న్యాయమూర్తుల సంఖ్య ఎంత? ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత? 5 ఏళ్లు ఏ అధికరణం ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ పరమైన సమస్య ఎదురైనప్పుడు సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు? 143 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను అవసరాన్ని బట్టి పెంచే అధికారం ఎవరికి ఉంది? ఠి పార్లమెంటు న్యాయ సమీక్ష ద్వారా? ప్రాథమిక హక్కులను కాపాడవచ్చు, రాజ్యాంగ ఆధిక్యతను పరిరక్షించవచ్చు, శాసన, కార్యనిర్వాహక శాఖల ఆధిపత్యాన్ని నియంత్రించవచ్చు గవర్నర్ పదవీ కాలం ఎంత? రాష్ర్టపతి విశ్వాసం ఉన్నంత వరకు గవర్నర్గా నియమించేందుకు ఉండాల్సిన కనీస వయసు ఎంత? 35 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి మహిళ ఎవరు? సుచేతా కృపలాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు? కె.వి.రంగారెడ్డి మోడల్ ప్రశ్నలు 1. సరైనది ఏది? 1) రాజ్యాంగ రచనా సంఘం-బి.ఆర్ అంబేద్కర్ 2) ప్రాథమిక హక్కుల సంఘం -సర్దార్ పటేల్ 3) కేంద్ర వ్యవహారాల సంఘం-నెహ్రూ 4) పైవన్నీ 2. సరికానిది ఏది? 1) ప్రకరణ-17: అంటరానితనం నిషేధం 2) ప్రకరణ-24: బాలకార్మిక వ్యవస్థ నిషేధం 3) ప్రకరణ-25: మత స్వేచ్ఛ 4) ప్రకరణ-22: వెట్టి చాకిరి నిషేధం 3. కింది వారిలో ఎవరిని రాష్ట్రపతి నియమించరు? 1) రాష్ట్ర గవర్నర్లు 2) త్రివిధ దళాధిపతులు 3) ఎన్నికల కమిషనర్లు 4) భారతదేశంలో పనిచేసే విదేశీ రాయబారులు 4. సరికానిది ఏది? 1) సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి -హెచ్.జె కానియా 2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తెలుగు వ్యక్తి- కె.సుబ్బారావు 3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పని చేసిన వారు-నాగేంద్ర సింగ్ 4) సుప్రీంకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి-ఫాతిమా సమాధానాలు: 1) 4 2) 4 3) 4 4) 4 -
డార్వినిజం ప్రకృతి వరణ సిద్ధాంతం
ప్రకృతిలో పరిణామం సంభవించిన తీరు, కొత్త జాతులు ఆవిర్భవించిన విధానాన్ని డార్విన్ ప్రకృతి వరణ సిద్ధాంతం వివరిస్తుంది. డార్విన్ ప్రకారం.. జీవ పరిణామం అనేది హఠాత్తుగా జరగదు. ఇది క్రమేణా సంభవించే జీవ ప్రక్రియ. డార్విన్ ప్రకృతి వరణ సిద్ధాంతం ప్రకారం... ప్రకృతి, వైవిధ్యాలను కలిగించదు. ఉపయోగకరమైన వైవిధ్యాలతో ఉన్న జీవులను మాత్రం ప్రకృతి ఎన్నుకుంటుంది (నేచురల్ సెలక్షన్). చార్లెస్ రాబర్ట డార్విన్ (బ్రిటన్ ప్రకృతి శాస్త్రవేత్త. 1809, ఫిబ్రవరి 12న ఇంగ్లండ్లోని ష్రూస్బరిలో జన్మించాడు. డార్విన్ తన 22వ ఏట ఐదు సంవత్సరాల (1831-1835) పాటు హెచ్.ఎం.ఎస్. బీగల్ అనే బ్రిటిష్ నౌకపై ప్రయాణిస్తూ అట్లాంటిక్, దక్షిణ అమెరికా, దక్షిణ పసిఫిక్ మహాసముద్ర ద్వీపాల్లో గలవృక్ష-జంతు జాలాన్ని పరిశీలించాడు. దక్షిణ పసిఫిక్లోని గాలపాగోస్ ద్వీపంలోగల ఫించ్ పక్షుల ముక్కుల నిర్మాణంలో స్వల్ప వైవిధ్యాలను గమనించాడు. ఫించ్ పక్షులపై అధ్యయనం చేసి, వైవిధ్యాల ఆధారంగా జీవజాతులు శాశ్వతమైనవి కావని, అవి ఎల్లప్పుడూ మార్పులకు లోనవుతాయని తెలిపాడు. థామస్ మాల్థూస్, చార్లెస్ లయల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు రాసిన ప్రఖ్యాత రచనలు.. డార్విన్కు గొప్ప జీవ పరిణామ శాస్త్రవేత్తగా గుర్తింపు తీసుకొచ్చాయి. థామస్ మాల్థూస్ జనాభాల మీద రాసిన వ్యాసం - యాన్ ఎస్సే ఆన్ ది ప్రిన్సపల్ ఆఫ్ పాపులేషన్. ఈ వ్యాసం ప్రకారం జనాభా గుణ శ్రేణి (జ్యామితీయ రీతి)లో పెరుగుతుంటే (1, 2, 4, 8, 16....), వాటి ఆహార అవసరాలు అంకశ్రేఢిలో పెరుగుతాయి (1, 2, 3, 4, .....). అంటే ఆహారం, నివాసం పెరగవని అర్థం. చార్లెస్ లయల్ రచించిన గ్రంథం.. ‘ప్రిన్సపల్స్ ఆఫ్ జియాలజీ’లో భౌగోళిక మార్పులు నెమ్మదిగా, క్రమబద్ధంగా జరుగుతాయని ప్రతిపాదించాడు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలిసారి శాస్త్రీయంగా, సరైన ఆధారాలతో ప్రతిపాదించింది - చార్లెస్ డార్విన్. అందువల్లే డార్విన్ను జీవ పరిణామ పితామహుడు (ఫాదర్ ఆఫ్ ది ఎవల్యూషన్)గా పేర్కొంటారు. ఇదే కాలంలో ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్.. మలయా ఆర్చిపెలాగోలోని జంతు, వృక్ష జాతులను పరిశీలించి, డార్విన్లాగే స్వతంత్రంగా ప్రకృతి వరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి.. తన పరిశీలనలను డార్విన్కు పంపాడు. కాబట్టి వాస్తవంగా ప్రకృతి వరణాన్ని వాలెస్, డార్విన్లు ప్రతిపాదించారని చెప్పవచ్చు. అయితే వాలెస్ కంటే ఎక్కువ నిరూపణలను లండన్ లిన్నేయస్ సొసైటీకి అందించిన కారణంగా ఆ గొప్పతనమంతా డార్విన్కే దక్కింది. డార్విన్ 1859లో జాతుల ఉత్పత్తి అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఇది 19వ శతాబ్దపు ప్రత్యేక గ్రంథం. ఈ పుస్తకం పూర్తి పేరు.. On The origin of Species by means of Natural Selection (or) The preservation of favoured races in the struggle for life.. డార్విన్ ఇతర పుస్తకాలు 1. The structure and distribution of coral reefs 2. Geological Observations on South America 3. Fertilization of Orchids. 4. The variation of animals and plants under domestication 5. The Descent of Man 6. The Expression of the Emotions in Man and Animals 7. Insectivorous plants 8. The Effects of Cross and Self Fertilisation in the Vegetable Kingdom. 9. Different forms of Flowers on Plants of the Same Species. 10. The Power of Movement in Plants. 11. Selection in Relation to Sex. డార్విన్ తన పరిశీలనలను ప్రకృతి వరణ సిద్ధాంతంగా పేర్కొన్నాడు. డార్విన్ ప్రతిపాదించినందువల్ల దీన్ని డార్వినిజం అని కూడా అంటారు. డార్వినిజం లేదా ప్రకృతి వరణ సిద్ధాంతంలోని ముఖ్య ప్రతిపాదనలు... 1. ప్రత్యుత్పత్తి 2. జనాభాల నిర్ణీత సంఖ్య 3. మనుగడ కోసం పోరాటం 4. వైవిధ్యాలు 5. ప్రకృతి వరణం 6. అనువంశికత 7. కృత్రిమ ఎన్నిక 8. లైంగిక ఎన్నిక 9. పాన్జెనెసిస్ సిద్ధాంతం అత్యధిక సంఖ్యలో.. ప్రతి జీవి తన సంతానాన్ని అత్యధిక సంఖ్యలో ఉత్పత్తి చేయగలదనే సత్యాన్ని డార్విన్ గమనించాడు. ఉదా: పారమీషియం రోజుకు మూడు లేదా నాలుగు సార్లు ప్రత్యుత్పత్తి జరుపుతుంది. పిల్ల జీవులు ఏ విధమైన అవాంతరం లేకుండా అదే నిష్పత్తిలో సంతానాన్ని ఉత్పత్తి చేస్తే 5 ఏళ్లలో మొత్తం పారమీషియాల ఘనపరిమాణం భూమి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. జనాభాల నిర్ణీత సంఖ్య సంతానం అధికంగా ఉత్పత్తి అయినా జీవుల మధ్య ఆహారం, ఆవాసం కోసం పోరాటం జరగడం వల్లచాలా జీవులు సంతానోత్పత్తి దశకు చేరకముందే చనిపోతున్నాయి. ఫలితంగా జీవుల సంఖ్య స్థిరంగా ఉంటుంది. ఇది డార్విన్ గుర్తించిన రెండో సత్యం. మనుగడ కోసం పోరాటం ఆహారం పరిమితంగా ఉండటం వల్ల జీవుల మధ్య తీవ్ర పోటీ ఏర్పడుతుంది. దీన్నే డార్విన్ మనుగడ కోసం పోరాటం (స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స) అని వర్ణించాడు. ఇది 3 రకాలు. ఎ. సజాతి సంఘర్షణ: ఒకే జాతికి చెందిన జీవుల మధ్య పోరాటం. ఉదా: మానవుడు - మానవుడు, కుక్క - కుక్క, పిల్లి- పిల్లి మధ్య జరిగే పోరాటం. బి. విజాతి సంఘర్షణ: భిన్న జాతుల మధ్య జరిగే పోరాటం. ఉదా: శాకాహారులు, మాంసాహారుల మధ్య పోరాటం, ఎలుక - పిల్లి, పాము - ముంగిస మధ్య పోరాటం. సి. భౌతిక శక్తులతో సంఘర్షణ: తుపానులు, వరదలు, భూకంపాలు, సునామీలతో జీవులు జరిపే పోరాటం. కాబట్టి పోరాటం వల్ల జనాభా సంఖ్య పెరగకుండా స్థిరంగా ఉంటుంది. వైవిధ్యాలు జీవుల మధ్య కనిపించే తేడాలనే వైవిధ్యం అంటారు. వైవిధ్యాలు ఉపయోగకరంగా లేదా హానికరంగా ఉండొచ్చు. ఉపయోగకరమైన వైవిధ్యం గల జీవులు.. ఆ విధమైన వైవిధ్యం లేని జీవుల కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించే అవకాశాలుంటాయని డార్విన్ గుర్తించాడు. ఉదా: దేహంపై దట్టంగా రోమాలు గల గొర్రె.. చలి బారి నుంచి రక్షణ పొందుతుంది. ప్రకృతి వరణం ఉపయోగకరమైన వైవిధ్యాలు, అధిక ప్రత్యుత్పత్తి జరిపే శక్తిగల జీవులను ప్రకృతి ఎన్నుకొంటుంది. దీన్నే ప్రకృతి వరణం అంటారు. డార్విన్ ప్రకృతి వరణాన్ని యోగ్యతాల సార్థక జీవనం (సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్) అని హెర్బర్ట స్పెన్సర్ పేర్కొన్నాడు. మనుగడ కోసం జరిగే పోరాటంలో ఉపయుక్త వైవిధ్యాలు లేని జీవులు శత్రువుల బారిన పడి నశిస్తాయి. అనువంశికత ఉపయుక్త వైవిధ్యాలు తరతరానికి అభివృద్ధి చెందుతూ సంతానానికి సంక్రమించడాన్నే అనువంశికత అంటారు. కొన్ని వేల తరాల తర్వాత ఆ వైవిధ్యాల సంచిత ప్రభావం వల్ల ఆ జీవి మొదటి పూర్వీకులకంటే భిన్నంగా ఉంటుంది. అదే కొత్త జాతి జీవి. కృత్రిమ ఎన్నిక ఇందులో మానవుడు ప్రజనన కర్త. మానవుడు రెండు జీవులను ఎన్నుకొని, వాటి మధ్య సంపర్కం జరిపి, మేలైన రకాలను ఉత్పత్తి చేస్తాడు. ఉదా: కోళ్లు, పందులు, పశువులు. లైంగిక ఎన్నిక ఇది కూడా డార్వినిజానికి అనుబంధమే. స్త్రీ జీవి.. ఆకర్షణీయమైన రంగు, ఆకృతి, అందం గల పురుష జీవినే ఎన్నుకుంటుంది. పాన్జెనెసిస్ సిద్ధాంతం ప్రతి జీవిలో పాన్ జన్యువులుంటాయి. ఇవి రక్త ప్రవాహం ద్వారా బీజకోశాలను చేరి, అక్కడి నుంచి బీజకణాల ద్వారా సంతానానికి చేరతాయి. డార్వినిజంపై ప్రధాన అభ్యంతరాలు డార్వినిజంలో లోపాలున్నట్లు పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అవి... జీవుల్లో ఉండే వైవిధ్యాల పుట్టుకను డార్విన్ వివరించలేదు (కారణం జన్యువుల గురించి డార్విన్కు తెలియదు). అవశేషావయవాలను గురించి ఎలాంటి వివరాలు డార్వినిజంలో లేవు. అనువంశికత, అనువంశికత రహిత వైవిధ్యాల మధ్య తేడాను డార్విన్ వివరించలేదు. ఐరిస్ జింకలో కొమ్ములు అవసరానికి మించి పెరిగాయి. అలాగే జెపర్ సన్స మమాత్ (ఏనుగు)లో దంతాలు అవసరానికి మించి పెరిగాయి. అందువల్లే ఆ రెండు జీవులు నశించాయి. అయితే అవసరానికి మించి అవయవాల అభివృద్ధి ఎందుకు జరిగిందో డార్విన్ పేర్కొనలేదు. డార్వినిజంలోని లోపాలను సరిదిద్ది డివ్రీస్, హర్డీ, వీన్బెర్గ, సీవెలరైట్లు నియోడార్వినిజాన్ని ప్రతిపాదించారు. మోడల్ ప్రశ్నలు 1. The Origin of Species గ్రంథ కర్త ఎవరు ? 1) హెర్బర్ట స్పెన్సర్ 2) చార్లెస్ డార్విన్ 3) డీవ్రీస్ 4) జె.బి.లామార్క 2. జీవ పరిణామ సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా, సరైన ఆధారాలతో తొలిసారి ప్రతిపాదించింది? 1) లామార్క 2) డార్విన్ 3) డీవ్రీస్ 4) మెండల్ 3. జాతుల ఉత్పత్తి అనే గ్రంథాన్ని డార్విన్ ఎప్పుడు ప్రచురించాడు? 1) 1809 2) 1859 3) 1885 4) 1871 4. డార్విన్ ప్రకృతి వరణం ముఖ్య ఉద్దేశాలు? 1) ఉపయుక్త - నిరుపయుక్త సూత్రం 2) అత్యుత్పత్తి, పోరాటం, యోగ్యతాల సార్థక జీవనం 3) ఆర్జిత గుణాల అనువంశికత 4) యాదృచ్ఛిక మార్పు 5. ‘యోగ్యతాల సార్థక జీవనం’ అన్న శాస్త్రవేత్త? 1) డార్విన్ 2) హెర్బర్ట స్పెన్సర్ 3) మాల్థూస్ 4) లామార్క 6. జీవ పరిణామ శాస్త్ర పితామహుడు? 1) లామార్క 2) మెండల్ 3) స్పెన్సర్ 4) చార్లెస్ డార్విన్ 7. డార్విన్ పరిశీలించిన ద్వీపం? 1) గాలపాగోస్ 2) ఫిజి 3) మడగాస్కర్ 4) నికోబార్ 8. పరిణామానికి ముఖ్యకారణం? 1) ఉత్పరివర్తనం 2) ఆర్జిత లక్షణం 3) ప్రకృతి వరణం 4) లైంగిక ప్రత్యుత్పత్తి సమాధానాలు 1) 2 2) 2 3) 2 4) 2 5) 2 6) 4 7) 1 8) 3 -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
పోటీపరీక్షల కోణంలో కెమిస్ట్రీకి సంబంధించి జీవాణువులు, పాలిమర్లు, ఔషధాలు తదితర అంశాలను ఎలా అధ్యయనం చేయాలి? - జి.ప్రసాద్, హైదరాబాద్. జీవ వ్యవస్థ నిర్మాణం, పని చేయడంలో వివిధ పదార్థాలు పాల్గొంటాయి. వాటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, లిపిడ్లు, హార్మోన్లు, విటమిన్లు ముఖ్యమైనవి. వీటిపై ప్రత్యేక దృష్టిసారించాలి. అవసరమైతే జీవశాస్త్రంతో అన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. రబ్బర్, సెల్యూలోజ్ ఉత్పన్నాలు, పీవీసీ, టెఫ్లాన్, బేకలైట్ వంటి పాలిమర్ల అనువర్తనాలను వివరంగా చదవాలి. యాంటీపెరైటిక్స్, అనాల్జెసిక్లు, యాంటీబయాటిక్స్, సెడెటివ్స్, యాంటాసిడ్స్ వంటి సాధారణ ఔషధాలపై అవగాహన పెంపొందించుకోవాలి. టీ, సిగరెట్, గంజాయి, శీతలపానీయాల్లో ఉండే పదార్థాలను కూడా తెలుసుకోవాలి. మన ఉదరంలో బలమైన హైడ్రోక్లోరికామ్లం ఉంటుంది. తినే సోడా, తమలపాకుపై పూసే సున్నపు తేట క్షార ధర్మం కలిగి ఉంటుంది. వెనిగర్, నిమ్మ ఉప్పు అన్నీ ఆమ్లాలే. ఆమ్లాలు-క్షారాలు కలిసి తటస్థీకరణం జరిగితే ఏర్పడేది లవణం. వివిధ ఆమ్లాలు, క్షారాలు, లవణాలపై సమాచారాన్ని సేకరించాలి. ముఖ్యంగా నిత్య జీవితంలో ఆయా అంశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనే అంశాలను తెలుసుకోవాలి. -
NATURAL VEGETATION OF INDIA
Natural Vegetation refers to the plant cover that has not been disturbed over a long time, so as to allow its individual species to adjust themselves fully to the climate and soil conditions. v Thus, grasses, shrubs and trees, which grow on their own without any interference, constitute the natural vegetation of an area. However, there is a difference between flora, vegetation and forest. v Flora refers to plants of a particular region or period, listed as species and considered as a group. v Vegetation, on the other hand, refers to the assemblage of plant species living in association with each other in a given environmental set-up. For example, the redwood forests, coastal mangroves, roadside weed patches, cultivated gardens and lawns, etc., all are encompassed by the term vegetation. v The major vegetation types of the world are grouped as forests, grasslands, scrubs and tundra. v Finally, the word 'forest' refers to a large tract of land covered by trees and shrubs. TYPES OF VEGETATION India has a variety of forests and natural vegetation which varies from region to region due to the variations in climatic conditions, soil types and relief features. v The Western Ghats and the Andaman Nicobar Islands are marked with tropical rain forests; the Himalayas have temperate vegetation; the desert and semi-desert regions of Rajasthan have a wide variety of bushes and thorny vegetation; and the Delta regions have tropical forests and mangroves. The country can be divided into five major vegetation regions which are: 1. Tropical Evergreen Forests 2. Tropical Deciduous Forests 3. Tropical Desert Forests 4. Littoral Forests and 5. Mountain Forests TROPICAL EVERGREEN FORESTS (a) Climatic Conditions: These forests are found in the areas where the quantumamount of annual rainfall is more than 250 cm. (b) Distribution: These forests are chiefly distributed in the western slopes of the Western Ghats, hills of North-Eastern region and the Andaman and Nicobar Islands. (c) Characteristic Features: These forests are dense, multi-layered and have many types of trees and shrubs. In these forests, trees reach great heights of more 45 m or above. v The carpet layer of herbs and grasses cannot grow because of the dense canopy of trees which do not allow enough sun light to reach the ground. TROPICAL DECIDUOUS FORESTS These forests are also known as the monsoon forests. They are the most widespread forests in India, Based on the availability of water, these forests are further categorised into two types: (i) The moist deciduous forests and (ii) The dry deciduous forests. The Moist Deciduous Forests (a) Climate Conditions: Such forests are found in areas with moderate or low annual rainfall of 100 cm to 200 cm and humidity percentage of 60 to 80. (b) Distribution: These forests occur in the North-Eastern States along the foothills of Himalayas eastern slopes of the Western Ghats and Orissa. They occupy a bigger area than the evergreen forests. (c) Characteristic Features: The trees in these forests shed their leaves from six to eight weeks during spring and early summer when the storage of water is acute. Further, the sub-soil water is not enough for the trees to keep their leaves all the year around. Dry Deciduous Forests (a) Climatic Conditions: These forests are found in areas having an annual rainfall between 70 cm to 100 cm and humidity between 51 to 58 per cent. (b) Distribution: These forests are found over a wide area, especially in an irregular strip running north-south from the foothills of the Himalayas to Kanyakumari. They occupy a sizeable area in Uttar Pradesh, Maharashtra, Karnataka and Tamil Nadu. (c) Characteristic Features: These forests thrive between moist deciduous (in the East) and tropical thorn forests (in the West). On the wetter margins, these forests have a transition into moist deciduous, while on the drier margins they degrade into thorn forests TROPICAL DESERT FORESTS These are known as Tropical Thorn Forests. (a) Climatic Conditions: These forests are found in the areas which receive annual rainfall less than 50cms and humidity below 47 per cent. (b) Distribution: These forests are chiefly distributed in South-Western Punjab, Haryana, Uttar Pradesh, Central and Eastern Rajasthan, Madhya Pradesh and Gujarat. (c) Characteristic Features: Due to paucity of rainfall, the trees are stunted with large patches of coarse grasses. In these forests, plants remain leafless for most part of the year and look like scrub vegetation. N.D.Nagesh Sr. Faculty, Ganesh IAS Academy, Chennai. -
టైమ్స్ వరల్డ్ ర్యాంకింగ్స్
పపంచ ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) సంస్థ వెల్లడించే వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అంతర్జాతీయంగా వివిధ విద్యాసంస్థల్లోని ప్రమాణాలకు అద్దం పడుతున్నాయి. ఉన్నత విద్యాభ్యాసానికిసరితూగే ఇన్స్టిట్యూట్ల అన్వేషణకు ఈ ర్యాంకులను పరిగణనలోకి తీసుకునేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటోంది.ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో మన దేశం నుంచి 31 సంస్థలు చోటు సంపాదించగా,వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి 4 వర్సిటీలు ఉన్నాయి. ఈ క్రమంలో ‘టైమ్స్’ ర్యాంకింగ్స్పై ఫోకస్.. జాతీయ స్థాయిలో 31 ఇన్స్టిట్యూట్లు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల్లో భారత్ నుంచి 31 విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎస్సీ.. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు.. ఇలా అన్ని స్థాయిల ఇన్స్టిట్యూట్లు నిలిచాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డీ) ఏప్రిల్లో విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో లేని విద్యాసంస్థలు, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో చోటు దక్కని విశ్వవిద్యాలయాలు సైతం ‘టైమ్స్’ ర్యాంకుల లిస్టులో ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల నుంచి 4 వర్సిటీలు ‘టైమ్స్’ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 4 యూనివర్సిటీలు చోటు సంపాదించాయి. ప్రపంచ వ్యాప్తంగా 978 వర్సిటీలకు, ఇన్స్టిట్యూట్లకు ర్యాంకులు కేటాయించగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వర్సిటీలు 601 నుంచి 801+ శ్రేణిలో నిలిచాయి. వాటి వివరాలు.. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) 601-800 శ్రేణిలో; ఆచార్య నాగార్జున, ఆంధ్రా, ఉస్మానియా వర్సిటీ (ఓయూ) 801+ శ్రేణిలో నిలిచాయి (వీటిలో ఎస్వీయూ, ఓయూ.. ఎంహెచ్ఆర్డీ ర్యాంకులను కూడా పొందాయి). జాతీయ స్థాయిలో ఐఐఎస్సీ టాప్ ‘టైమ్స్’ ర్యాంకులు పొందిన భారతీయ విద్యాసంస్థల్లో బెంగళూరులోని ఐఐఎస్సీ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం ర్యాంకుల జాబితాలో ఈ సంస్థ 201-250 శ్రేణిలో నిలిచింది. ఈ లిస్ట్లోని టాప్-10 ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ .. ఐఐఎస్సీ బెంగళూరు (201-250); ఐఐటీ ముంబై (351-400); ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ చెన్నై (401-500), ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ రూర్కీ, జాదవ్పూర్ వర్సిటీ (501-600), అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బిట్స్ పిలాని (601-800). ఈ జాబితాలోని ఐఐటీలను మినహాయిస్తే మరో రెండు ఐఐటీలు (రూర్కెలా, గువహటి) మాత్రమే ‘టైమ్స్’ ర్యాంకుల్లో 601-800 ర్యాంకు శ్రేణిలో చోటు దక్కించుకోవడం గమనార్హం. ర్యాంకుల నిర్ధారణకు ప్రమాణాలు ర్యాంకుల నిర్ధారణకు టైమ్స్ సంస్థ ఐదు ప్రమాణాలను పాటించింది. ఒక్కో పారామీటర్కు నిర్దిష్టంగా కొన్ని పాయింట్లు కేటాయించింది. అవి.. 1. టీచింగ్-30 2. రీసెర్చ్-30 3. సైటేషన్స్-30, 4. ఇంటర్నేషనల్ ఔట్లుక్-7.5, 5. ఇండస్ట్రీ ఇన్కమ్-2.5 ఒక్కో పారామీటర్లో కొన్ని ఉప విభాగాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా సదరు ఇన్స్టిట్యూట్లకు స్కోర్లు ఇస్తారు. వివరాలు.. 1.టీచింగ్: ఫ్యాకల్టీ పరంగా గుర్తింపు-15 శాతం; ఫ్యాకల్టీ-స్టూడెంట్ నిష్పత్తి-4.5 శాతం; పీహెచ్డీ-బ్యాచిలర్ విద్యార్థుల నిష్పత్తి-2.25 శాతం; డాక్టరేట్ ఫ్యాకల్టీ నిష్పత్తి-6 శాతం; ఇన్స్టిట్యూషనల్ ఇన్కమ్-2.25 శాతం 2.రీసెర్చ్: రీసెర్చ్ రెప్యుటేషన్-18 శాతం; రీసెర్చ్ ఇన్కమ్-6 శాతం; రీసెర్చ్ ఫలితాలు-6 శాతం 3.సైటేషన్స్: ఆయా విభాగాల్లో డాక్టోరల్ అభ్యర్థులు, ఫ్యాకల్టీ సభ్యులు రీసెర్చ్ జర్నల్స్లో ప్రచురించిన సైటేషన్స్కు నిర్దేశించిన పారామీటర్ ఇది. గత ఐదేళ్ల కాలంలో స్కోపస్ డేటాబేస్లో నిక్షిప్తమైన 23 వేల అకడమిక్ జర్నల్స్, ఎల్సెవియర్ డేటా, ప్రపంచ వ్యాప్తంగా 56 మిలియన్ల సైటేషన్ల ఆధారంగా ఈ పారామీటర్లో ఇన్స్టిట్యూట్కు గరిష్ట స్కోర్ కేటాయించారు. 4.ఇంటర్నేషనల్ ఔట్లుక్: అంతర్జాతీయ గుర్తింపు, విద్యార్థులు, అధ్యాపకులు, అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో సదరు యూనివర్సిటీల్లో ఉన్న వాస్తవ పరిస్థితి ఆధారంగా ఈ పారామీటర్కు స్కోర్ కేటాయించారు. ఇందులో పరిగణనలోకి తీసుకునే అంశాలు.. అంతర్జాతీయ-జాతీయ విద్యార్థుల నిష్పత్తి-2.5 శాతం; అంతర్జాతీయ-జాతీయ అధ్యాపక నిష్పత్తి-2.5 శాతం; అంతర్జాతీయ ఒప్పందాలు-2.5 శాతం. 5.ఇండస్ట్రీ ఇన్కమ్: సదరు ఇన్స్టిట్యూట్లు ఇండస్ట్రీ వర్గాలకు అవసరమైన పరిశోధన కార్యకలాపాలను నిర్వహించిన తీరు, వాటి ద్వారా లభించిన ఆదాయం ఆధారంగా ఈ పారామీటర్కు స్కోర్లు కేటాయించారు. రెండు పారామీటర్లలో వెనుకంజ ‘టైమ్స్’ ర్యాంకుల్లో భారతీయ విద్యాసంస్థలు రీసెర్చ్, సైటేషన్స్లో వెనుకబడ్డాయి. 50 శాతం స్కోర్ కూడా పొందలేకపోయాయి. ఐఐఎస్సీ-బెంగళూరు కూడా పరిశోధనలో 49.2; సైటేషన్స్లో 47.3 శాతం స్కోర్లే సాధించింది. ఐఐటీ ముంబై.. రీసెర్చ్ పారామీటర్లో 31.1 శాతం స్కోర్కే పరిమితమైంది. మెరుగైన ర్యాంకులు పొందేందుకు కృషి.. స్టేట్ వర్సిటీలు ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, స్టూడెంట్ పారామీటర్లలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సైటేషన్స్, రీసెర్చ్ పారామీటర్లలో వీలైనన్ని ఒప్పందాలు చేసుకొని, తద్వారా మంచి ర్యాంకులు పొందేందుకు కృషిచేస్తాం. - ప్రొఫెసర్ కె.జాన్పాల్, రిజిస్ట్రార్, ఏఎన్యూ రీసెర్చ్కుప్రాధాన్యమిస్తాం.. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకు దక్కించుకోవడం హర్షణీయం. ఇకపై అన్ని ర్యాంకింగ్స్లో ఏటా నిలిచేందుకు కృషిచేస్తాం. పరిశోధనకు ప్రాధాన్యం పెరిగేలా చర్యలు తీసుకుంటాం. - ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, వీసీ, ఓయూ రెండు పారామీటర్లపై దృష్టి సారిస్తాం.. ఇంటర్నేషనల్ స్టూడెంట్, ఫ్యాకల్టీ-స్టూడెంట్ నిష్పత్తి పరంగా మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. వీటి ద్వారా భవిష్యత్తులో అన్ని సంస్థల ర్యాంకింగ్స్లో మరింత ముందంజ వేసేందుకు కార్యాచరణ చేపడతాం. - ప్రొఫెసర్ వి.ఉమామహేశ్వరరావు, రిజిస్ట్రార్, ఏయూ. -
ఆధునిక ప్రభుత్వ వ్యవస్థకు ప్రతిరూపం
అధికారం పూర్తిగా ఒకరి చేతిలోనే ఉంటే ఆ ప్రభుత్వాన్ని రాచరిక ప్రభుత్వ వ్యవస్థగా పిలుస్తారు. కొద్దిమంది చేతిలో ఉంటే దాన్ని కులీన ప్రభుత్వం అంటారు. ఈ విధంగా కాకుండా అధికారం ప్రజలందరి చేతిలో ఉంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం అవుతుంది. ఈ విధానంలో ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ న్యాయం, హక్కులు ఉంటాయి. ఇదిఆధునిక ప్రభుత్వ వ్యవస్థకు ప్రతిరూపం. ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో డెమోక్రసీ (Democracy)అంటారు. ఇది గ్రీకు భాషకు చెందిన డెమోస్ (Demos),క్రోటోస్ (Crotos) అనే పదాల కలయికతో ఏర్పడింది. డెమోస్ అంటే ప్రజలు, క్రోటోస్ అంటే అధికారం అని అర్థం. దీని ప్రకారం ప్రజాస్వామ్యమంటే ప్రజా ప్రభుత్వం, ప్రజాధికారం, ప్రజా పాలన, ప్రజా శక్తి అని చెప్పొచ్చు. ప్రజాస్వామ్యంపై ప్రముఖుల నిర్వచనాలు అబ్రహం లింకన్: ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల నిర్వహించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. అరిస్టాటిల్: సార్వభౌమాధికారం ప్రజలందరిలో ఉన్న అత్యుత్తమ ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. హెరిడోటస్: సమాజంలో ఉండే వారందరికీ పాలనాధికారం చెందితే అది ప్రజాస్వామ్యం అవుతుంది. డైసీ: జనాభాలో ఎక్కువ భాగం ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములైతే అదే ప్రజాస్వామ్యం. సీలీ: ప్రజలందరికీ భాగస్వామ్యమున్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం రెండు రకాలు 1. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం 2. పరోక్ష ప్రజాస్వామ్యం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: పరిపాలనలో ప్రజలందరూ ప్రత్యక్షంగా పాల్గొంటారు. ప్రజ లందరూ సమావేశమై ప్రభుత్వ పాలనకు కావాల్సిన చట్టాలను, బడ్జెట్ను, పాలనా విధానాలను ఆమోదిస్తారు. తమకు కావాల్సిన ఉద్యోగులను నియమించుకుంటారు. ఇది ప్రాచీన గ్రీకు రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టాలతోపాటు రోమ్ నగరంలో ఉండేది. చిన్న చిన్న దేశాల్లో ఈ విధానం సాధ్యమవుతుంది. ప్రస్తుత ఆధునిక దేశాల పాలనకు ఈ వ్యవస్థ అనువైంది కాదు. అయినప్పటికీ స్విట్జర్లాండ్, అమెరికాల్లోని కొన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు 1. ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం): రెఫరెండం అంటే ప్రజలకు నివేదించండి అని అర్థం. దేశంలో ఏదైనా చట్టం చేయాలన్నా, రాజ్యాంగ సవరణ చేపట్టాలన్నా ఈ విషయాన్ని ప్రజలముందు పెట్టాలి. వారి అభిప్రాయాలు, ఆమోదం లభించిన తర్వాతే అమలు నిర్ణయం తీసుకుంటారు. ఇది స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్ దేశాల్లో వాడుకలో ఉంది. 2. రీకాల్: అంటే వెనుకకు పిలవడం. ప్రజలతో ఎన్నికైన ప్రతినిధులు తమ విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడినా, అసమర్థులని తేలినా ప్రజలందరూ సమావేశమై తీర్మానం ద్వారా వారిని పదవి మధ్యకాలంలోనే తొలగిస్తారు. ఈ పద్ధతి స్విట్జర్లాండ్, అమెరికాలలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. 3. ప్రజానిర్ణయం (ప్లెబిసైట్): ప్రభుత్వ విధానాల మీద, ప్రజాసమస్యలపై ఓటు ద్వారా ప్రజల నిర్ణయాలను సేకరిస్తారు. ఈ పద్ధతి ద్వారా రాజకీయ సమస్యలను పరిష్కరించడం సులువవుతుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రతినిధులను ఎన్నుకొని వారితో ప్రభుత్వాన్ని నడిపించడమే పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రజలు ప్రభుత్వ నిర్వహణలో పరోక్ష బాధ్యత నిర్వర్తిస్తారు. ప్రజాభిప్రాయాలు ప్రతినిధుల ద్వారా వ్యక్తమవుతాయి. ప్రతినిధుల నిర్ణయాలు కూడా ప్రజాభీష్టానికి అద్దం పడతాయి. ఈ పద్ధతి మొదట బ్రిటన్లో ప్రారంభమైంది. తర్వాత ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, భారత్ మొదలైన దేశాలకు విస్తరించింది. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థలో మూడు ముఖ్య స్తంభాలు 1. కార్య నిర్వాహక శాఖ 2. శాసన శాఖ 3. న్యాయశాఖ కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, మంత్రులు, అధికారులు, ఉద్యోగులుంటారు. వీరు ప్రభుత్వ వ్యవహారాలను అమలు చేస్తారు. శాసన శాఖలో ప్రజా ప్రతినిధులు చట్టాల రూపకల్పనలో భాగస్వాములై, ప్రభుత్వాన్ని నియంత్రిస్తారు. న్యాయశాఖ ప్రభుత్వ చట్టాల న్యాయ బద్ధతను పర్యవేక్షిస్తూ రాజ్యాంగ నిబంధనల అమలుకు ప్రయత్నిస్తుంది. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో మంత్రివర్గం శాసనశాఖకు బాధ్యత వహిస్తుంది. వారి విశ్వాసం పొందినంత కాలమే ప్రభుత్వం మనుగడలో ఉంటుంది. లేకపోతే వారు రాజీనామా చేయాలి. ఈ విధానంలో రాష్ట్రపతి (అధ్యక్షుడు)కి నామమాత్ర అధికారాలు ఉంటాయి. మంత్రిమండలికి వాస్తవ అధికారాలుంటాయి. ప్రధానమంత్రి సూపర్ పవర్గా ఉంటాడు. మనదేశంలో ఇదే పద్ధతి అమల్లో ఉంది. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం ఈ విధానంలో సర్వాధికారాలు అధ్యక్షుడు (రాష్ట్రపతి)కే ఉంటాయి. కార్య నిర్వాహక వర్గం, శాసనసభకు బాధ్యత వహించదు. అమెరికాలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రజాస్వామ్య విజయానికి ప్రభుత్వం పౌరులకు సమకూర్చే హక్కులు ప్రాతిపదికలవుతాయి. పౌరుల హక్కులు రాజ్యాంగపరంగా నిర్ణయించి ఉంటాయి. ఇవి ప్రజాస్వామ్య పటిష్టతకు దోహదపడతాయి. బొమ్మనబోయిన శ్రీనివాస్ సీనియర్ ఫ్యాకల్టీ, హన్మకొండ -
యూరో- 2016, కోపా అమెరికా
2016లో ఇప్పటి వరకు ఒలింపిక్స్తో పాటు యూరో-2016, కోపా అమెరికా సెంటెనరీ ఫుట్బాల్ టోర్నమెంట్లు కూడా జరిగాయి. వాటి వివరాలు.. యూరో ఫుట్బాల్ టోర్నీ యూఈఎఫ్ఏ (ద యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్స) చాంపియన్షిప్ను ‘యూరో’ ఫుట్బాల్ టోర్నీ అంటారు. దీన్ని 1960 నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి ఐరోపా ఫుట్బాల్ చాంపియన్ను నిర్ణయించడానికి నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 15 యూరో టోర్నమెంట్లు నిర్వహించగా జర్మనీ, స్పెయిన్లు అత్యధికంగా చెరో మూడుసార్లు టైటిల్ దక్కించుకున్నాయి. వరుసగా రెండుసార్లు యూరో టైటిల్ గెలుచుకున్న ఏకైక దేశం స్పెయిన్. వరుసగా 2008, 2012లో స్పెయిన్ ఈ టైటిల్ గెలుపొందింది. యూరో టోర్నమెంట్ విజేతకు హెన్రీ డెలానే ట్రోఫీని బహూకరిస్తారు. నాలుగు జట్లు యూరో టోర్నమెంట్లో పాల్గొన్న తొలిసారే టైటిల్ను సాధించాయి. అవి.. సోవియట్ యూనియన్ (1960), స్పెయిన్ (1964), ఇటలీ (1968), పశ్చిమ జర్మనీ (1972). యూరో కప్ టోర్నీలో జర్మనీ అత్యధికంగా 49 మ్యాచ్లు ఆడింది. దీంతోపాటు అత్యధిక మ్యాచ్లు గెలిచిన జట్టు (26 సార్లు), అత్యధిక గోల్స్ చేసిన జట్టు (72 గోల్స్) వంటి రికార్డులు కూడా జర్మనీ పేరునే ఉన్నాయి. ఈ టోర్నమెంట్లలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారులు ఇద్దరు-మిషెల్ ప్లాటిని (ఫ్రాన్స), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్). వీరు చెరో తొమ్మిది గోల్స్ చేశారు. యూరో-2016 15వ యూరో ఫుట్బాల్ టోర్నమెంట్ ఫ్రాన్సలో జూన్ 10 నుంచి జూలై 10 వరకు జరిగింది. ఇందులో తొలిసారిగా 24 జట్లు పాల్గొన్నాయి. ఫ్రాన్స యూరోకు ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. గతంలో 1960, 1984లలో ఫ్రాన్సలో యూరో జరిగింది. 15వ యూరో టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన స్పెయిన్ రౌండ్ ఆఫ్ 16లోనే ఇంటి ముఖం పట్టింది. 2016, జూలై 10న సెయింట్ డెనిస్లో జరిగిన ఫైనల్లో పోర్చుగల్.. ఆతిథ్య దేశమైన ఫ్రాన్సను 10తో ఓడించి తొలిసారి యూరోను గెలుచుకుంది. ఈ మ్యాచ్లో నమోదైన ఏకైక గోల్ను పోర్చుగల్ సబ్స్టిట్యూట్ ఆటగాడు ఎడెర్ అదనపు సమయంలో చేశాడు. పోర్చుగల్కు ఇది తొలి అంతర్జాతీయ ఫుట్బాల్ టైటిల్. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా పెపె (పోర్చుగల్)ను ప్రకటించారు. ఈ విజయంతో పోర్చుగల్2017లో రష్యాలో జరిగే ఫిఫా కాన్ఫెడరేషన్స కప్కు అర్హత సాధించింది. యూరో- 2020 టోర్నమెంట్ను 13 దేశాల్లో నిర్వహిస్తారు. అవి.. అజర్బైజాన్, బెల్జియం, డెన్మార్క, ఇంగ్లండ్, జర్మనీ, హంగేరీ, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స, రొమేనియా, రష్యా, స్కాట్లాండ్, స్పెయిన్. ఈ టోర్నీ 2020 జూన్-జూలైలో జరగనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు మాత్రం లండన్లోని వెంబ్లీ స్టేడియంలో జరుగుతాయి. కోపా అమెరికా కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నమెంట్ 1916లో ప్రారంభమైంది. దీన్ని దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించి ఫుట్బాల్ చాంపియన్ను నిర్ణయించేందుకు నిర్వహిస్తారు. అయితే 1990 దశకం నుంచి ఉత్తర అమెరికా, ఆసియా ఖండ దేశాలను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ను 45 సార్లు నిర్వహించగా, ఉరుగ్వే అత్యధికంగా 15 సార్లు విజేతగా నిలిచింది. అర్జెంటీనా 14 సార్లు, బ్రెజిల్ 8 సార్లు, పరాగ్వే, చిలీ, పెరూ దేశాలు రెండు సార్లు, కొలంబియా, బొలీవియాలు చెరోసారి టైటిల్ సాధించాయి. తొలి కోపా అమెరికా టోర్నమెంట్ 1916లో అర్జెంటీనాలో జరిగింది. తొలి టైటిల్ను ఉరుగ్వే సాధించింది. ఈ టోర్నీకి అత్యధికంగా 9 సార్లు ఆతిథ్యమిచ్చిన దేశం అర్జెంటీనా. కోపా అమెరికా సెంటెనేరియో కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నమెంట్కు వందేళ్లు పూర్తయిన సందర్భంగా 2016, జూన్లో ప్రత్యేక టోర్నమెంట్ నిర్వహించారు. దీన్నే కోపా అమెరికా సెంటెనేరియో అంటారు. ఈ టోర్నీని 2015లో నిర్వహించినప్పటికీ, ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని.. ఏడాది వ్యవధిలోనే రెండోసారి నిర్వహించారు. ఇది 45వ కోపా అమెరికా. కోపా అమెరికా సెంటెనేరియో జూన్ 3 నుంచి 26 వరకు యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగింది. దీంతో దక్షిణ అమెరికా ఖండం వెలుపల జరిగిన తొలి కోపా అమెరికా టోర్నీగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులో 16 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ పోటీ 2016, జూన్ 26న అమెరికాలోని ఈస్ట్ రూథర్ఫర్డ నగరంలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగింది. ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాను డిఫెండింగ్ చాంపియన్ చిలీ ఓడించి, వరుసగా రెండో కోపా అమెరికా టైటిల్ను (2015తో కలిపి) సాధించింది. ఫైనల్ మ్యాచ్లో చిలీ దేశానికి చెందిన క్లాడియో బ్రావోకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్లో నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయంలో కూడా ఏ జట్టూ గోల్ చేయలేదు. దాంతో పెనాల్టీలతో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించారు. చిలీ 4 పెనాల్టీ గోల్స్ చేయగా, అర్జెంటీనా కేవలం 2 పెనాల్టీలనే గోల్స్గా మలచగలిగింది. ఈ పరాజయంతో అంతర్జాతీయ టోర్నమెంట్ ఫైనల్లో వరుసగా మూడోసారి అర్జెంటీనా విఫలమైంది. అర్జెంటీనా 2014 ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో జర్మనీ చేతిలో, 2015 కోపా అమెరికాలో చిలీ చేతిలో ఓడిపోయింది. 45వ కోపా అమెరికాలో చిలీకి చెందిన ఎడ్వార్డో వర్గాస్ అత్యధికంగా 6 గోల్స్ చేయగా, అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ 5 గోల్స్, అర్జెంటీనాకు చెందిన గోంజాలో హిగ్వేన్ 3 గోల్స్ సాధించారు. అవార్డులు గోల్డెన్ బాల్ - అలెక్సిస్ సాంచెజ్ (చిలీ) గోల్డెన్ బూట్ - ఎడ్వార్డో వర్గాస్ (చిలీ) గోల్డెన్ గ్లోవ్ - క్లాడియో బ్రావో (చిలీ) ఫెయిర్ ప్లే అవార్డు - అర్జెంటీనా 46వ కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నమెంట్ 2019లో బ్రెజిల్లో జరుగుతుంది. యూరో - 2016 అవార్డులు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ - ఆంటోన్ గ్రీజ్మన్ (ఫ్రాన్స) యంగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ - రెనాటో సాంచెస్ (పోర్చుగల్) గోల్డెన్ బూట్ - ఆంటోన్ గ్రీజ్మన్ (ఫ్రాన్స - ఆరు గోల్స్) సిల్వర్ బూట్ - క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్ - 3 గోల్స్) బ్రాంజ్ బూట్ - ఒలివియర్ గిరోడ్ (ఫ్రాన్స - 3 గోల్స్) -
SCATSAT-1
ఇస్రో.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సెప్టెంబరు 26న ఉదయం పీఎస్ఎల్వీ-సీ35 రాకెట్ను విజయవంతగా ప్రయోగించింది. దీనిద్వారా భారత్కు చెందిన స్కాట్శాట్-1, ప్రథమ్, పైశాట్ ఉపగ్రహాలను, అదేవిధంగా అల్జీరియాకు చెందిన మూడు అల్శాట్ ఉపగ్రహాలను, అమెరికాకు చెందిన పాత్ఫైండర్, కెనడాకు చెందిన ఎన్ఎల్ఎస్-19 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. ఒకే రాకెట్తో రెండు భిన్న కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రోకు ఇదే మొదటిసారి. దీంతోపాటు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రయోగాన్ని అత్యధిక సమయం (2 గంటల 15 ని.లు) నిర్వహించింది. పీఎస్ఎల్వీ-సీ35ను ప్రయోగించిన తర్వాత దాదాపు 1058 సెకన్లకు, 729 కి.మీ. ఎత్తులో ధ్రువ సూర్యానువర్తిత (ౌ్క్చట ఠ డఛిజిటౌౌఠట) కక్ష్యలోకి స్కాట్శాట్ -1ని ప్రవేశపెట్టింది. అనంతరం ఉదయం 11.25 గంటలకు ప్రథమ్, పైశాట్ ఉపగ్రహాలను, 5 విదేశీ ఉపగ్రహాలను 689 కి.మీ. ధ్రువ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. స్కాట్శాట్-1 ఎంతో కీలకం పీఎస్ఎల్వీ-సీ35 ద్వారా ఇస్రో మొత్తం 8 ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిలో 3 దేశీయ ఉపగ్రహాలు, 5 విదేశీ ఉపగ్రహాలు. దేశీయ ఉపగ్రహాల్లో ప్రధానమైందిస్కాట్శాట్ -1. దీని బరువు 371 కిలోలు. ఇది అత్యాధునిక వాతావరణ ఉపగ్రహం. వాతావరణ పరిశీలనకు, తుపానుల గుర్తింపు, వాటి గమనానికి సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది. 2009, సెప్టెంబరు 23న పీఎస్ఎల్వీ-సీ14 ద్వారా ఇస్రో ప్రయోగించిన ఓషన్శాట్-2 ఉపగ్రహంలోని స్కాటెరోమీటర్ పరికరానికి కొనసాగింపుగా స్కాట్శాట్-1ని ప్రయోగించింది. స్కాట్శాట్-1లో కేయూ బ్యాండ్ స్కానింగ్ స్కాటెరోమీటర్ రాడార్ అనే పరికరం ఉంది. ఇది 13.515 గిగాహెర్ట్జ తరంగ దైర్ఘ్యంలో రాడార్ సూత్రంపై పనిచేస్తుంది. ఈ పరికరం నుంచి విడుదలయ్యే శక్తి తరంగాలు సముద్ర ఉపరితలాన్ని తాకి, తిరిగి ప్రతిధ్వనిలా పరావర్తనం చెందినప్పుడు కీలక సమాచారాన్ని సేకరిస్తుంది. స్కాటెరోమీటరు నుంచి విడుదలయ్యే విద్యుత్ అయస్కాంత తరంగాలు, సముద్ర అలల మధ్య జరిగే అంతర చర్యలు ఈ ఉపగ్రహ విధిలో కీలకమైనవి. ప్రపంచ వ్యాప్తంగా సముద్ర ఉపరితలాల గాలుల అధ్యయనానికి స్కాట్శాట్-1 ఉపకరిస్తుంది. తుపానుల గమనం, హిమాలయాల్లో హిమ నిర్మాణం-తరుగుదల, మరీ ముఖ్యంగా గ్రీన్ల్యాండ్ హిమం తరుగుదల, తుపాను తీరందాటే కచ్చిత సమయాన్ని అంచనా వేయడానికి స్కాట్శాట్-1 ఉపయోగపడుతుంది. దీని సమాచా రాన్ని ఇస్రో, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు ఉపయోగించుకుం టాయి. ఇస్రో ఓషన్శాట్-3ను ప్రయోగించేంత వరకు స్కాట్శాట్-1 కీలకంగా వ్యవహరిస్తుంది. దీని జీవిత కాలం 5 ఏళ్లు. ప్రథమ్ ఇది ఐఐటీ బాంబే అభివృద్ధి చేసిన ఉపగ్రహం. దీని బరువు 10 కిలోలు. వాతావరణంలోని ఐౌౌటఞజ్ఛిట్ఛ భాగాన్ని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించింది. ప్రధానంగా ఐనోస్ఫియర్లోని ఎలక్ట్రాన్లను అధ్యయనం చేస్తుంది. స్టూడెంట్ శాటిలైట్ ప్రాజెక్ట్లో భాగంగా ఐఐటీ-బాంబే దీన్ని అభివృద్ధి చేసింది. పైశాట్ బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయ విద్యార్థులు అభివృద్ధి చేసిన నానో ఉపగ్రహమే ఈ పైశాట్. దీని బరువు 5 కిలోలు. పైశాట్ ప్రాజెక్టు 2012లో ప్రారంభమైంది. 2014లో పూర్తయింది. ఇది 80ఝ రిజల్యూషన్తో భూమి ఉపరితలాన్ని చిత్రీకరిస్తుంది. విదేశీ ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ-సీ 35 ద్వారా 3 అల్శాట్ ఉపగ్రహాల (అట్చ్ట 1ూ, అట్చ్ట ఆ, అట్చ్ట 2ఆ)తో పాటు అమెరికాకు చెందిన పాత్ఫైండర్-1, కెనడాకు చెందిన ఎన్ఎల్ఎస్-19 ఉపగ్రహాలను ప్రయోగించారు. దీంతో ఇస్రో పీఎస్ఎల్వీ ద్వారా 21 దేశాలకు చెందిన 79 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించినటై్లంది. భవిష్యత్లో మరిన్ని విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించే దిశగా పీఎస్ఎల్వీ మార్కెటింగ్పై ఇస్రో వాణిజ్య విభాగం ఆంత్రిక్స్ కార్పొరేషన్ దృష్టి సారించింది. పీఎస్ఎల్వీ ఇస్రో ఇప్పటి వరకు 37 పీఎస్ఎల్వీ ప్రయోగాలను నిర్వహించగా, అందులో 36 వరుసగా విజయవంతమయ్యాయి. దీంతో ప్రపంచంలో అత్యంత విజయవంతమైన అతి కొద్ది రాకెట్లలో ఒకటిగా పీఎస్ఎల్వీ గుర్తింపు పొందింది. ఇస్రో ఒకే రాకెట్ ద్వారా రెండు భిన్న కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టి, రాకెట్ ప్రయోగ టెక్నాలజీలో మరో మైలురాయిని అధిగమించింది. : హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీ బ్యూటడైన్ అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజైన్+25% హైడ్రజైన్ హైడ్రేట్ నైట్రోజన్ టెట్రాక్సైడ్ మోనో మిథైల్ హైడ్రజైన్ మిక్స్డ్ ఆక్సైడ్స ఆఫ్ నైట్రోజన్ ఇటీవలి కాలంలో పీఎస్ఎల్వీ ప్రయోగాలు.. సి.హరికృష్ణ సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ -
యూజీ కోర్సులు..
విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు మొదటి గమ్యస్థానం.. అమెరికా. ఏ అంతర్జాతీయ సర్వే చూసినా అమెరికా యూనివర్సిటీలు టాప్లోనే ఉంటాయి. క్వాకరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ యూనివర్సిటీల ర్యాంకు (2016-17)లో టాప్-100లో 32 ఇన్స్టిట్యూట్స్,టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీల సర్వే (2016-17)ల్లో 41 అమెరికన్ విద్యాసంస్థలు టాప్-100లో నిలిచాయి. ప్రస్తుతం యూఎస్లోని ప్రముఖ యూనివర్సిటీలన్నీ 2017 సంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రముఖ యూనివర్సిటీల్లో యూజీ కోర్సులు.. అర్హతలు.. ప్రవేశానికి అవసరమైన పత్రాలు తదితర వివరాలు.. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రదేశం: శాన్ఫ్రాన్సిస్కో సౌత్, కాలిఫోర్నియా, యూఎస్. మొత్తం విద్యార్థులు: 16,000కుపైగా (6,994 మంది అండర్గ్రాడ్యుయేట్స్, 9,128 మంది గ్రాడ్యుయేట్స్. వీరిలో 3,555 మంది విదేశీ విద్యార్థులు). ఫ్యాక ల్టీ: 2,153 మంది; స్టూడెంట్ - ఫ్యాకల్టీ రేషియో: 4:1 ప్రత్యేకతలు ఇప్పటివరకు 31 మంది స్టాన్ఫర్డ్ ఫ్యాకల్టీ/పూర్వ విద్యార్థులకు నోబె ల్ బహుమతి లభించింది. ప్రస్తుత ఫ్యాకల్టీలో 21 మంది నోబెల్ గ్రహీతలు. 151 దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించారు. యూజీ కోర్సులు: టాప్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు.. కంప్యూటర్ సైన్స్, హ్యూమన్ బయాలజీ, ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ అండ్ సొసైటీ, ఎకనామిక్స్. అర్హత: దరఖాస్తుకు ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/10+2) కోర్సులు పూర్తిచేసుండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి సబ్మిట్ చేయాలి. ప్రవేశాలకు అవసరమైన పత్రాలు అకడమిక్ సర్టిఫికెట్లు లెటర్ ఆఫ్ రికమండేషన్స్ శాట్ (ఎస్సేతో కలిపి)/ఏసీటీ (రైటింగ్) స్కోర్లు టోఫెల్ స్కోర్ విద్యాభ్యాసానికి తగిన ఆర్థిక వనరులు ఉన్నట్లు రుజువు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు: 1861 ప్రదేశం: కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్, యూఎస్. మొత్తం విద్యార్థులు: 11,331 (అండర్ గ్రాడ్యుయేట్స్ 4,527; గ్రాడ్యుయేట్స్ 6,804; మొత్తం విద్యార్థుల్లో 3,717 మంది విదేశీ విద్యార్థులు). ఫ్యాకల్టీ: 1,036. వీరిలో 9 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు. స్టూడెంట్, ఫ్యాకల్టీ రేషియో: 8:1 ప్రత్యేకతలు ఇప్పటివరకు 85 మంది మిట్ ఫ్యాకల్టీ/పూర్వ విద్యార్థులకు నోబెల్ బహుమతి లభించింది. 116 దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. యూజీ అడ్మిషన్స్-2017 మిట్ యూజీ అడ్మిషన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఇన్స్టిట్యూట్లో ప్రవేశాలకు ప్రపంచ వ్యాప్తంగా ఏటా 4 వేల మంది విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటుంటే.. 150 మందికి మాత్రమే ప్రవేశం లభిస్తోంది. కోర్సులు: ఎలక్ట్రికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; కంప్యూటర్ సైన్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ; ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్; ఏరోస్పేస్ ఇంజనీరింగ్; ఆఫ్రికన్ అండ్ ఆఫ్రికన్ డయాస్పోరా స్టడీస్; ఆంత్రోపాలజీ; అప్లైడ్ ఇంటర్నేషనల్ స్టడీస్; ఆర్కియాలజీ అండ్ మెటీరియల్స్; ఆర్కిటెక్చర్; పబ్లిక్ పాలసీ తదితర కోర్సులు. అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/ 10+2) కోర్సులు పూర్తిచేసుండాలి. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్టులు- స్కోర్లు టోఫెల్ (పీబీటీ) - కనీసం 577. 600కు పైగా సాధిస్తే ప్రాధాన్యతనిస్తారు. టోఫెల్ (ఐబీటీ) - కనీసం 90. 100కు పైగా సాధిస్తే ప్రాధాన్యతనిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీలు ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016 రెగ్యులర్ యాక్షన్: జనవరి 1, 2017 వెబ్సైట్: www.caltech.edu ప్రవేశాలకు అవసరమైన పత్రాలు అకడమిక్ సర్టిఫికెట్లు లెటర్ ఆఫ్ రికమండేషన్స్ శాట్, శాట్ సబ్జెక్టు టెస్ట్/ఏసీటీ స్కోర్లు టోఫెల్/ఐఈఎల్టీఎస్ స్కోర్లు మొత్తం విద్యార్థులు: 2,243 (వీరిలో 603 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు). స్టూడెంట్, ఫ్యాకల్టీ రేషియో 3:1 ప్రత్యేకతలు కాల్టెక్ ఫ్యాకల్టీ/ పూర్వ విద్యార్థులు 34 మంది నోబెల్ బహుమతులు పొందారు. కోర్సులు: బయాలజీ; బయోఇంజనీరింగ్; కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్; ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సెన్సైస్; జియోలాజికల్ అండ్ ప్లానెటరీ సెన్సైస్; ద హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్; ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ. అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/10+2) కోర్సులు పూర్తిచేసుండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీలు ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016 రెగ్యులర్ డెసిషన్: జనవరి 3, 2017 వెబ్సైట్: mitadmissions.org ప్రవేశాలకు అవసరమైన పత్రాలు అకడమిక్ సర్టిఫికెట్స్ లెటర్ ఆఫ్ రికమండేషన్స్ శాట్, శాట్ సబ్జెక్టు టెస్టులు/ఏసీటీ స్కోర్లు టోఫెల్/ఐఈఎల్టీఎస్ స్కోర్లు యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఠి మొత్తం విద్యార్థులు: 14,221 (వీరిలో 2,888 మంది విదేశీ విద్యార్థులు). ప్రత్యేకతలు ఠి 80 మంది ఇక్కడి ఫ్యాకల్టీ/పూర్వ విద్యార్థులకు నోబెల్ బహుమతి పొందారు. ఠి కోర్సులు: ఆంత్రోపాలజీ; అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్; ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్; బయలాజికల్ కెమిస్ట్రీ; సినిమా అండ్ మీడియా స్టడీస్; కంప్యూటర్ సైన్స్ తదితర కోర్సులు. ఠి అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/10+2) కోర్సులు పూర్తిచేసుండాలి. ఠి దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి. ముఖ్య తేదీలు ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016 రెగ్యులర్ డెసిషన్: జనవరి 1, 2017 వెబ్సైట్: mitadmissions.org ప్రవేశాలకు అవసరమైన పత్రాలు దరఖాస్తు ప్రింటవుట్ అకడమిక్ సర్టిఫికెట్స్ లెటర్ ఆఫ్ రికమండేషన్స్ శాట్, శాట్ సబ్జెక్టు టెస్టులు/ఏసీటీ స్కోర్లు టోఫెల్/ఐఈఎల్టీఎస్ స్కోర్లు యేల్ యూనివర్సిటీ ఏర్పాటు: 1701; ప్రదేశం: న్యూ హెవెన్, కనెక్టికట్ మొత్తం విద్యార్థులు: దాదాపు 12 వేల మంది. (వీరిలో 118 దేశాలకు చెందిన 4,462 మంది విదేశీ విద్యార్థులు/ స్కాలర్స్). మొత్తం ఫ్యాకల్టీ సంఖ్య: 4,410 ప్రత్యేకతలు ప్రపంచంలోనే రెండో ధనిక విద్యాసంస్థ అంతేకాకుండా మూడో అతిపెద్ద లైబ్రరీ ఉంది. అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన ఐదుగురు (జార్జి బుష్ సీనియర్, జార్జిబుష్ జూనియర్, బిల్ క్లింటన్, విలియమ్ హోవర్డ్ టఫ్ట్, గెరాల్డ్ ఫోర్డ్) ఇక్కడే చదువుకున్నారు. కోర్సులు: ఆఫ్రికన్ అమెరికన్ స్టడీస్; ఆంత్రోపాలజీ; అప్లైడ్ ఫిజిక్స్, ఆర్కియాలజికల్ స్టడీస్, ఆర్కిటెక్చర్, ఆర్ట్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, క్లాసికల్ సివిలైజేషన్, క్లాసిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్... అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/10+2) కోర్సులు పూర్తిచేసుండాలి. ప్రవేశం కోసం కావాల్సిన పత్రాలు దరఖాస్తు ప్రింటవుట్ అకడమిక్ సర్టిఫికెట్స్ మిడ్ ఇయర్ రిపోర్ట్స్ ఇద్దరు టీచర్ల్లు ఇచ్చిన లెటర్ ఆఫ్ రికమండేషన్స్ శాట్/శాట్ సబ్జెక్టు/రీజనింగ్ టెస్ట్లు/ఏసీటీ స్కోర్లు టోఫెల్/ఐఈఎల్టీఎస్/పీటీఈ స్కోర్లు. టెస్టులు- స్కోర్లు: శాట్ వెర్బల్- 710 - 800 శాట్ మ్యాథ్స్ - 710 - 790 శాట్ రైటింగ్ - 720 -800 దరఖాస్తుకు చివరి తేదీలు: ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016 రెగ్యులర్ డెసిషన్: జనవరి 2, 2017 వెబ్సైట్: www.uchicago.edu ఏర్పాటు: 1740; ప్రదేశం: ఫిలడెల్ఫియా మొత్తం విద్యార్థులు: 21,395 మంది (వీరిలో 4,048 మంది విదేశీ విద్యార్థులు). ప్రత్యేకతలు ఈ యూనివర్సిటీ ఫ్యాకల్టీ/పూర్వ విద్యార్థుల్లో 25 మందికి నోబెల్ బహుమతి అందింది. వివిధ దేశాలకు అధ్యక్షులుగా, ప్రధానులుగా పనిచేసిన వారిలో కొంతమంది ఇక్కడే విద్యనభ్యసించారు. కోర్సులు: ఆఫ్రికన్ స్టడీస్; ఇంటర్నేషనల్ రిలేషన్స్; అర్బన్ స్టడీస్; ఎన్విరాన్మెంటల్ స్టడీస్; బయో ఇంజనీరింగ్; బయోమెడికల్ సైన్స్; నెట్వర్క్డ్ అండ్ సోషల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్; విజువల్ స్టడీస్; సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్; డిజిటల్ మీడియా డిజైన్. అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/ 10+2) కోర్సులు పూర్తిచేసుండాలి. ప్రవేశం కోసం కావాల్సిన పత్రాలు అకడమిక్ సర్టిఫికెట్స్ మిడ్ఇయర్ రిపోర్ట్స్ లెటర్ ఆఫ్ రికమండేషన్స్ శాట్/శాట్ సబ్జెక్టు టెస్టులు/ఏసీటీ స్కోర్లు టోఫెల్/ఐఈఎల్టీఎస్ స్కోర్లు దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి సబ్మిట్ చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీలు: ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016 రెగ్యులర్ డెసిషన్: జనవరి 5, 2017 వెబ్సైట్: www.admissions.upenn.edu -
వాట్సాప్ ఉపయోగించుకుందాం ఇలా..
వాట్సాప్.. నేటి సాంకేతిక ప్రపంచంలో దీని గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. టాక్టైం బ్యాలెన్స లేకపోయినా మొబైల్ డేటా ఉంటే చాలు గంటల తరబడి చాటింగ్ చేయొచ్చు. వీడియోలు, వాయిస్ చాట్లు, ఎస్ఎంఎస్లు పంపించొచ్చు. అందుకే నేటి యువత దృష్టిలో వాట్సాప్ అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది. అయితే ఈ సాంకేతికతను సద్వినియోగ పరచుకుంటున్న వారితో పాటు దుర్వినియోగపరుస్తున్న వారు కూడా ఉంటున్నారు. కొందరు దీని వాడకం తెలియక ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. చేయదగినవి (Do's) వాట్సాప్లో కొత్తగా వస్తున్న ఫీచర్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. వ్యక్తిగత, వివాదాస్పద విషయాలను గ్రూప్లో కాకుండా విడిగా చర్చించాలి. తెలిసిన వారికే రిక్వెస్ట్లు పంపాలి. తెలిసిన వాళ్ల రిక్వెస్ట్లనే అంగీకరించాలి. గ్రూప్లోని సభ్యుల మధ్య ఎంత ఘాటుగా చర్చ జరుగుతున్నా సంయమనం కోల్పోకూడదు. మీరు పంపిన మెసేజ్లు ఎవరెవరు చూస్తున్నారో తెలుసుకుంటూ ఉండాలి. ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులను బ్లాక్ చేయాలి. మీరు చెప్పదలచుకున్న విషయాలను సూటిగా, స్పష్టంగా చెప్పండి. అవసరమైన, ఉపయోగకరమైన విషయాలను మాత్రమే చర్చించాలి. చేయకూడనివి (Dont's) చాలా మంది క్లాస్మేట్స్, రూంమేట్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇలా రకరకాల గ్రూప్లను క్రియేట్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటుంది. మీ అభిప్రాయాలు, వ్యక్తిగత విషయాలు, ఇతరులతో మీరు చర్చించిన అంశాలు, మీరు మీ క్లోజ్ ఫ్రెండ్కి పంపిన ఫొటోలు, వాయిస్ చాట్లు గ్రూప్లో ఉన్న వారందరికీ తెలుస్తుంది. అందువల్ల సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా వారిని గ్రూప్లో యాడ్ చేయకండి. గ్రూప్లో ఉండి ఒక్కరితోనే మాట్లాడకండి. ఇలా చేయడ ం వల్ల ఇతరులు మిమ్మల్ని దూరం పెట్టడంతో పాటు అనుమానించే అవకాశం ఉంది. మీకు తెలియని వారు పంపిన రిక్వెస్ట్ను అంగీకరించకండి. ఒకవేళ మీకు పరిచయం లేని వారు పంపిన రిక్వెస్ట్ని అంగీకరిస్తే వారి చెడ్డ పనులకు మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అనవసర, వివాదాస్పద విషయాలను గ్రూప్లో పోస్ట్ చేయకండి. వీటివల్ల గ్రూప్ సభ్యుల మధ్య సుహృద్భావ వాతావరణం దెబ్బతిని అనేక వివాదాలు ఏర్పడతాయి. ఒకే సమాధానాన్ని పదేపదే పంపడం, ఒకే పదంతో జవాబివ్వడం లేదా రిప్లై ఇవ్వకుండా మౌనంగా ఉండటం వంటివి చేయకూడదు. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల ఎదుటివారి మనసు గాయపడి, రిలేషన్షిప్ దెబ్బతింటుంది. అవతలి వాళ్ల మానసిక, శారీరక, వృత్తిగత పరిస్థితిని అర్థం చేసుకోకుండా గంటల తరబడి చాటింగ్ చేయడం మంచిది కాదు. మీ వ్యక్తిగత విషయాలు, ఇష్టాయిష్టాలు గ్రూప్లలో పోస్ట్ చేయకపోవడం ఉత్తమం. ఎందుకంటే మీతో ఏకీభవించని వారు కూడా ప్లో ఉంటారన్న విషయాన్ని మరచిపోకండి. లేనిపోని రూమర్లను పంపడం, ఏదైనా మెసేజ్ పంపిన వెంటనే రిప్లై ఆశించడం మంచిది కాదు. అర్థంకాని ఫొటోలను పంపొద్దు. ఇతరులు పంపిన ప్రతి విషయాన్ని నమ్మకూడదు. అలాగే ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా స్పందించకూడదు. -
బాంబే హైకోర్టులో 100‘లా క్లర్క్’ పోస్టులు
బాంబే హైకోర్టుతోపాటు నాగ్పూర్, ఔరంగాబాద్లలోని హైకోర్టు బెంచ్ల్లో ‘లా క్లర్క్’ ఉద్యోగ ఖాళీలను ఏడాది కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు సంబంధిత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం నోటిఫికేషన్ను విడుదల చేసింది. విద్యార్హత: 1. కనీసం 55 శాతం మార్కులతో ఫైనల్ ఎల్ఎల్బీ ఎగ్జామ్ను ఫస్ట్ అటెంప్ట్లో పాసైన తాజా లా గ్రాడ్యుయేట్లు (లేదా) న్యాయశాస్త్రంలో పీజీ ఉత్తీర్ణులు. 2. న్యాయశాస్త్రంలో పీజీ చేసినవారికి ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. 3. కంప్యూటర్/ల్యాప్టాప్, లా కేసులకు సంబంధిత సాఫ్ట్వేర్ల వినియోగంలో ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి. వయసు: 21-30 ఏళ్లు (విద్యార్థి చదివిన లా కాలేజీ ప్రిన్సిపల్/అభ్యర్థి పేరు నమోదైన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రికమండేషన్ చేసే తేదీని వయసు లెక్కింపునకు పరిగణనలోకి తీసుకుంటారు). దరఖాస్తు విధానం: దరఖాస్తుదారుల అభ్యర్థిత్వాన్ని కింది విద్యా సంస్థల ప్రిన్సిపల్స్ / బార్ అసోసియేషన్ల అధ్యక్షుల్లో ఎవరైనా ఒకరు తప్పనిసరిగా రికమండ్ చేయాలి. ఈ విషయంలో సంబంధిత ప్రిన్సిపల్/ బార్ ప్రెసిడెంట్ నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలి. 1.నేషనల్ లా స్కూల్-బెంగళూరు, హైదరాబాద్, జోధ్పూర్ 2.న్యూజేఎస్ లా కాలేజ్, కలకత్తా 3.గవర్నమెంట్ లా కాలేజ్, చర్చ్ గేట్, ముంబై 4.ఐఎల్ఎస్ లా కాలేజ్, పుణె 5.సింబయాసిస్ లా కాలేజ్, పుణె 6.యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, నాగ్పూర్ 7.ఎంపీ లా కాలేజ్, ఔరంగాబాద్ 8.ుశ్వంత్ లా కాలేజ్, నాందేడ్ 9.వీఎం సల్గాంకర్ లా కాలేజ్, మిరామర్, పణజి 10.కారే లా కాలేజ్, మార్గోవ్, గోవా 11.యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా లా కాలేజ్ (ఇది గౌరవ చీఫ్ జస్టిస్ ఆమోదానికి లోబడి ఉంటుంది) 12.బాంబే బార్ అసోసియేషన్/అడ్వొకేట్స్ అసోసియేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా/ది ఇన్కార్పొరేటెడ్ లా సొసైటీ/హైకోర్టు బార్ అసోసియేషన్, నాగ్పూర్/హైకోర్టు బార్ అసోసియేషన్, ఔరంగాబాద్/హైకోర్టు బార్ అసోసియేషన్, పణజి, గోవా. ఎంపిక విధానం: 1.పైన పేర్కొన్న విధంగా రికమండేషన్ కలిగిన అభ్యర్థులు బాంబే హైకోర్టులో జరిగే పర్సనల్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి. 2.మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన గౌరవ చీఫ్ జస్టిస్ ఆమోదానికి లోబడి ఉంటుంది. గౌరవ వేతనం: నెలకు రూ.20,000 స్టైపెండ్/హానరోరియం చెల్లిస్తారు. దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తుకు సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హత, వయసు తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను, రికమండేషన్ లెటర్ను జతచేసి కింది అడ్రస్కు స్పీడ్ పోస్ట్లో/కొరియర్లో/ఆర్పీఏడీలో/స్వయంగా పంపాలి. చిరునామా: రిజిస్ట్రార్ (పర్సనల్), హైకోర్టు, అప్పిలేట్ సైడ్, బాంబే, ఫిఫ్త్ ఫ్లోర్, న్యూ మంత్రాలయ బిల్డింగ్, జీటీ హాస్పిటల్ కాంపౌండ్, బిహైండ్ అశోక షాపింగ్ సెంటర్, నియర్ క్రౌఫోర్డ్ మార్కెట్, ఎల్టీ మార్గ్, ముంబై, 400001. ముఖ్య తేదీలు: 1. దరఖాస్తులను పంపేందుకు చివరి తేది: 2016, సెప్టెంబర్ 30 2. ఇంటర్వ్యూ తేది: హైకోర్టు వెబ్సైట్లో/అభ్యర్థి ఇ-మెయిల్కు తెలియజేస్తారు. వెబ్సైట్: http://bombayhighcourt.nic.in -
భవిత తారుమారు
ఎస్కేయూ : చక్కగా పరీక్షలు రాశాం.. మెరుగైన ఫలితాలు సాధిస్తాం.. అని డిగ్రీ సెకెండ్ సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులందరూ తమ భవితవ్యాన్ని గొప్పగా ఊహించుకున్నారు. తీరా ఫలితాలు తారుమారు కావడంతో ఆశలన్నీ అడియాసలయ్యాయి. శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం రెగ్యులర్ డిగ్రీ పరీక్షల విభాగం అస్తవ్యస్తంగా తయారైందన్నదానికి ఇదీ నిదర్శనం. ఫలితాల జాబితాలో చూస్తే పరీక్షలకు హాజరైనా గైర్హాజరు అయినట్లు చూపుతోంది. విద్యార్థులు తమ సబ్జెక్టులను రీవ్యాల్యుయేషన్ పెట్టించాలా.. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలా? అన్నదానిపై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈనెల 30న తుది గడువు ముగియనుంది. యూజీ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా తయారైంది. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ రెండో సెమిస్టర్ (రెగ్యులర్ ఫలితాలు) శనివారం విడుదల చేశారు. ఫలితాలు తారుమారు కావడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పరీక్షలకు హాజరైన గైర్హాజరు అయినట్లు ఫలితాలు ప్రకటించడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కొందరు అగళి డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాల అనంతపురం విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఫలితాలు ప్రకటించారు. యూజీ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఫలితాలు తారుమారు అయ్యాయని కళాశాల అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతేడాది నుంచి ఇలాంటి తప్పిదాలు పునరావృతం అవుతున్నా.. ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో యూజీ విభాగం అధికారుల్లో జవాబుదారీతనం కొరవడింది. ఒక సబ్జెక్టుకు బదులు మరో సబ్జెక్టు : డిగ్రీ మొదటి, రెండు, మూడో సంవత్సరం రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయేషన్కు విద్యార్థులు ఫీజు కట్టిన సబ్జెక్టు కాకుండా మరో సబ్జెక్టుకు రీవాల్యుయేషన్ చేశారు. దీంతో వేలాది మంది విద్యార్థులు ఎస్కేయూ యూజీ విభాగం వద్ద పడిగాపులు కాస్తున్నారు. తీరా యూజీ విభాగం అధికారుల దృష్టికి తీసుకువస్తే ఫీజు చెల్లించిన చలానాలు చూపిస్తే.. రీవాల్యుయేషన్కు జవాబు పత్రాలు పంపుతున్నారు. వేలాది ఫెండింగ్ కేసులు ఇలాంటివి ఉన్నాయి. అయితే డిగ్రీ రెగ్యులర్, రీవాల్యుయేషన్లో ఫెయిల్ అయినవారు సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెలాఖరులోపు సప్లిమెంటరీ ఫీజు కట్టాలని నిర్దేశించారు. పెండింగ్లో రీవాల్యుయేషన్ ఫలితాలు ప్రకటించకపోవడంతో విద్యార్థులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఇంటర్నల్ మార్కులు పంపలేదు ఆయా కళాశాలలు విద్యార్థుల ఇంటర్నల్ మార్కులు పంపకపోవడంతో ఫలితాలు ప్రకటించలేదు. ఎన్నో సార్లు హెచ్చరించినప్పటికీ కళాశాలల యాజమాన్యాలు అప్రమత్తం కాలేదు. ఇంటర్నల్ మార్కులు అందగానే ఫలితాలు సవరిస్తాం. – శ్రీరాములు నాయక్, డిప్యూటీ రిజిస్ట్రార్, ఎస్కేయూ యూజీ విభాగం -
పిలుస్తున్నాయి పీఎస్యూ'లు!
ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు మంచి వేతనం ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)లో ఉద్యోగం చేజిక్కించుకోవాలని ఆకాంక్షిస్తారు. ఇలాంటి వారికిగ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)మంచి మార్గం. ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఐఐఎస్సీ తదితర సంస్థల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతోపాటు ప్రభుత్వరంగ యూనిట్లలో ఉద్యోగాలకు కూడా గేట్ స్కోర్ ప్రామాణికంగా మారింది. దీంతో ఈ పరీక్షకు ప్రాధాన్యం పెరిగింది. గేట్-2017 స్కోర్ ఆధారంగా వివిధ పీఎస్యూలు నియామకాలకు శ్రీకారం చుట్టాయి.ఈ క్రమంలో ప్రత్యేక కథనం.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మహారత్న కంపెనీలు (భెల్, గెయిల్, ఎన్టీపీసీ..), నవరత్న కంపెనీలు (బీపీసీఎల్, హెచ్పీసీఎల్..), మినీరత్న కంపెనీలు (బార్క్, ఏఏఐ..) కార్పొరేట్ సంస్థలతో పోటీగా ఆకర్షణీయమైన వేతనాలు, సౌకర్యాలతో నియామకాలు చేపడుతున్నాయి. అభ్యర్థులు తాము ఇంజనీరింగ్లో చదువుతున్న కోర్ సబ్జెక్టుకు సంబంధించిన రంగంలోనే పనిచేసే అవకాశంతోపాటు, సంతృప్తినిచ్చే పని సంస్కృతిని పీఎస్యూలు అందిస్తున్నాయి. గ్రూప్-ఎ స్థాయి పోస్టులైన సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ ఎస్ఎఫ్ఐ (టెలీ), సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (క్రిప్టో), ఎస్ఆర్వో (ఎస్ అండ్ టీ) నియామకాలకు కూడా గేట్ స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. బీఎస్ఎన్ఎల్.. జేటీవోల భర్తీకి కూడా గేట్ను ఆధారంగా చేసుకుంటోంది. గేట్-2017 ద్వారా 35-40 పీఎస్యూలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. గేట్లో జనరల్ కేటగిరీలో 500-1000 లోపు ర్యాంకు సాధిస్తే తదుపరి దశకు ఏదో ఒక సంస్థ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం, అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి స్కోర్ సాధించడానికి ప్రయత్నించాలి. రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వార్షిక వేతనం అందించే పీఎస్యూల్లో మేనేజ్మెంట్ ట్రెయినీ/ఇంజనీర్ ట్రెయినీ ఉద్యోగం సంపాదించాలంటే గేట్ స్కోర్ కీలకం. తుది ఎంపికలో గేట్ స్కోర్కు 75%-80% వెయిటేజీని పరిగణనలోకి తీసుకుంటారు. గేట్ స్కోర్ ఆధారంగా వడపోసిన అభ్యర్థులకు పీఎస్యూలు రెండో దశలో గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూలు, రిటెన్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. ఎంపికైనవారికి ఆకర్షణీయమైన వేతనాలతో ఆఫర్ లెటర్లు అందుతాయి. గ్రూప్ డిస్కషన్ (జీడీ) తుది ఎంపికలో గ్రూప్ డిస్కషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆయా సంస్థలకు అవసరమైన నైపుణ్యాలను జీడీ ద్వారా పరీక్షిస్తాయి. ఇందులో అభ్యర్థులకు ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి, 10-15 నిమిషాలు చర్చించమంటారు. జీడీ ద్వారా భావ వ్యక్తీకరణ (communication), నాయకత్వ(leadership), బృంద స్ఫూర్తి (team spirit), సృజనాత్మక (ఛిట్ఛ్చ్టజీఠ్ఛి) తదితర నైపుణ్యాలను పరిశీలిస్తారు. గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ గ్రూప్ టాస్క్లో భాగంగా అభ్యర్థులకు ఒక టాస్క్ ఇచ్చి, దానికి సమాధానాలు కూడా ఇస్తారు. వీటి నుంచి ఒకదాన్ని ఎంపిక చేసుకొని, దాన్ని సమర్థించడానికి కారణాలు వివరించాల్సి ఉంటుంది. చివర్లో వ్యక్తిగత మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. ఇందులో ప్రధానంగా అడిగే అంశాలు.. అభ్యర్థి స్వీయ పరిచయం, బీఈ/బీటెక్ చివరి సంవత్సర ప్రాజెక్టు, తమకు పట్టున్న సబ్జెక్టు అంశాలు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆయా సంస్థలకు అభ్యర్థులు తమ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ప్రాక్టికల్గా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. వ్యక్తిగత ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పాలి. ఇది అభ్యర్థి శ్రద్ధ, నైతికత, పరిపక్వతలను తెలియజేస్తుంది. ప్రతి ప్రశ్నను శ్రద్ధగా విని, సమాధానం చెప్పాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు ఒకట్రెండు మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం మంచిది. గతంలో ఆయా సంస్థలకు ఎంపికైన అభ్యర్థుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. సంస్థల వెబ్సైట్లను క్షుణ్నంగా పరిశీలించాలి. గేట్-2017 ద్వారా నియామకాలు జరిపే కొన్ని సంస్థలు బీఎస్ఎన్ఎల్ (జేటీవో) ఉద్యోగం: జూనియర్ టెలికం ఆఫీసర్ విభాగాలు: ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, సివిల్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఎస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఖాళీలు: 2510 దరఖాస్తు: 2017, జనవరి 1- జనవరి 31 వెబ్సైట్: www.externalexam.bsnl.co.in (2016, డిసెంబర్ 1 నుంచి అందుబాటులో ఉంటుంది.) బీపీసీఎల్ ఉద్యోగం: మేనేజ్మెంట్ ట్రెయినీ. విభాగాలు: మెకానికల్/కెమికల్ అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: గేట్ 2017 స్కోర్, జీడీ, ఇంటర్వ్యూ. దరఖాస్తు: 2017, జనవరి 1- జనవరి 31 వెబ్సైట్: www.bpclcareers.in హెచ్పీసీఎల్ ఉద్యోగం: గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ విభాగాలు: సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, టెలికాం. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్, జీడీ, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ. దరఖాస్తు: 2017, జనవరి 10-ఫిబ్రవరి 10 వెబ్సైట్: www.hindustanpetroleum.com/ www.hpclcareers.com ఎండీఎల్ (మజగావ్ డాక్ లిమిటెడ్) ఉద్యోగం: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (టెక్నికల్) విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్ అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఖాళీలు: 8. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: 2017, జనవరి 6-ఫిబ్రవరి 6 వెబ్సైట్: www.mazagondock.gov.in కేబినెట్ సెక్రటేరియట్ ఉద్యోగం: సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ విభాగాలు: ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్; టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్; ఫిజిక్స్/కెమిస్ట్రీ. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో పీజీ. ఖాళీలు: 8. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా. వెబ్సైట్: www.cabsec.nic.in హెచ్పీయూ (హర్యానా పవర్ యుటిలిటీస్) ఉద్యోగం: అసిస్టెంట్ ఇంజనీర్. విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, సివిల్. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్ ఆధారంగా వెబ్సైట్: www.hvpn.gov.in -
వాయు కాలుష్యాన్ని నివారించాలంటే..
నైట్రస్ ఆక్సైడ్ వాతావరణంలోని మేఘాల రాపిడి వల్ల ఏర్పడే ఉరుములు, మెరుపుల్లో నైట్రోజన్, ఆక్సిజన్ సంయోగం చెంది నైట్రస్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. పరిశ్రమలు, వాహనాలు, విద్యుదుత్పత్తి కేంద్రాల్లో శిలాజ ఇంధనాలను మండిస్తే ఈ వాయువు వెలువడుతుంది. నైట్రస్ ఆక్సైడ్ వల్ల హిమోగ్లోబిన్ ప్రభావితమవుతుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు ఏర్పడతాయి. మొక్కల్లో శ్వాసక్రియ రేటు తగ్గిపోతుంది. ఆకులు రాలి మొక్కలు చనిపోతాయి. వస్త్ర పరిశ్రమల్లో ముఖ్యంగా నూలు వస్త్రాలపై వేసిన అద్దకాలు ఈ వాయువు వల్ల వివర్ణమవుతాయి (Colourless). కాంతి రసాయన స్మాగ్ ఏర్పడుతుంది. ఆమ్ల వర్షాలు కురుస్తాయి. స్మాగ్ Dr. Antoine Des Voeux అనే శాస్త్రవేత్త పొగ మంచుకు 1905లో స్మాగ్ అని పేరు పెట్టాడు. స్మాగ్ అనే పదం స్మోక్+ఫాగ్ ( (Smoke+ Fog =Smog)) నుంచి వచ్చింది. వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్డైఆక్సైడ్, ఓజోన్ వాయువు, హైడ్రో కార్బన్లు, ఇతర పదార్థ రేణువులు (పెరాక్సీ అసైల్ నైట్రేట్-) కలిసి స్మాగ్ను ఏర్పరుస్తాయి. స్మాగ్ వల్ల మానవుల్లో శ్వాసకోశ సంబంధై ఆస్తమా, ఎలర్జీ కలుగుతాయి. మొక్కలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. వాతావరణంలో స్మాగ్ ఏర్పడటం వల్ల దృష్టి జ్ఞానం తగ్గి రోడ్డుపై వచ్చే వాహనాలు సరిగా కనబడక ప్రమాదాలు జరుగుతాయి. ఓజోన్ భూవాతావరణంలోని పరివర్తన మండలంలో వ్యాపించి ఉంది. దీనిలో ప్రాణవాయువు (ఆక్సిజన్) ఉంటుంది. ఓజోన్ పొర.. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను శోషించుకొని సమస్త జీవరాశులకు రక్షణ పొరలా పని చేస్తుంది.ఓజోన్ పొర పలచబడి రంధ్రాలు ఏర్పడటానికి కారణం క్లోరో ఫ్లోరోకార్బన్లు (ఫ్రియాన్ వాయువు), నైట్రిక్ ఆక్సైడ్, క్లోరిన్, ఇతర వాయువులు. రిఫ్రిజిరేటర్లు, కోల్డ్ స్టోరేజీల నుంచి వెలువడే సీఎఫ్సీల వల్ల, జెట్ విమానాల నుంచి వెలువడే పొగ వల్ల ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడి వాటి నుంచి అతి నీల లోహిత కిరణాలు భూమికి చేరి జీవులకు నష్టం కలగజేస్తున్నాయి. ఒక క్లోరో ఫ్లోరోకార్బన్ అణువు సుమారు లక్ష ఓజోన్ అణువులను విచ్ఛిన్నం చేస్తుంది. అంటార్కిటికా ధృవం వద్ద ఓజోన్ సొండే అనే పరికరంతో ఓజోన్ గాఢతను లెక్కించి ఆ పొర మందం తగ్గినట్లు కనుగొన్నారు.ఓజోన్ ఉన్న గాలిని పీల్చితే ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. లుకేమియా, స్త్రీలకు రొమ్ము క్యాన్సర్, కంటికి క్యాటరాక్ట్ సమస్యలు కలుగుతాయి. 1976లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమ విభాగం ఓజోన్ పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఏటా సెప్టెంబర్ 16న ఓజోన్ పరిరక్షణ దినం నిర్వహిస్తున్నారు. ఎగిరే బూడిద (Fly Ash) థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గును మండిస్తే వెలువడే బూడిదను ఫ్లైయాష్ (ఎగిరే బూడిద) అంటారు. ఇది వాతావరణంలోకి ప్రవేశించి ఆకులు, ఇళ్లు, నేలలు, నీటి ఉపరితలంపైకి చేరి వాటిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల పంట దిగుబడి తగ్గుతుంది. దీంతోపాటు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. సారవంతమైన నేలలు బీడు భూములుగా మారతాయి. ఇతర విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఫ్లైయాష్ ఉన్న గాలిని పీల్చితే శ్వాస సరిగా ఆడదు. దీంతో ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి. ఫ్లైయాష్ను ఇటుకలు, డిటర్జెంట్ పరిశ్రమల్లో వాడటం ద్వారా దాని వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించొచ్చు. అమోనియా(NH3) ఇది ఘాటైన వాసన గల వాయువు. దీన్ని శీతలీకరణిగా ఉపయోగిస్తారు.ఈ వాయువును ప్లాస్టిక్, పేలుడు, రంగు పదార్థాలు, ఔషధాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. పరిశ్రమల నుంచి వెలువడే అమోనియా వల్ల గొంతులో బొబ్బలు ఏర్పడతాయి. కంట్లో మంటలు పుడతాయి.వాతావరణంలో అమోనియా శాతం పెరిగితే మొక్కల్లో కిరణజన్యసంయోగ క్రియ మందగిస్తుంది. హైడ్రో కార్బన్లు హైడ్రోజన్, కార్బన్ కలయిక వల్ల ఏర్పడిన పదార్థాలను హైడ్రోకార్బన్లు అంటారు. పెట్రోలియం ఉత్పత్తులను, గ్యాసోలిన్ను వీటికి ఉదాహరణగా చెప్పొచ్చు. హైడ్రోకార్బన్లు వాహనాల నుంచి వెలువడే పొగ ద్వారా వాతావరణంలోకి ప్రవేశించి కాలుష్యాన్ని కలగజేస్తాయి.హైడ్రోకార్బన్లు గల గాలిని పీల్చితే శ్వాస కోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తాయి. హైడ్రో కార్బన్లు కాంతి రసాయన పొగ మంచును ఏర్పరుస్తాయి. పెట్రోలియం ఉత్పత్తుల నుంచి ెలువడే సీసం వల్ల పిల్లల్లో బుద్ధిమాంధ్యం ఏర్పడుతుంది.మొక్కల్లో ఎదుగుదల మందగిస్తుంది. ఏరో సాల్స్ అణువులను ఏరో సాల్స్ అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015లో జారీ చేసిన ప్రకటన ప్రకారం మనదేశంలో వాయు కాలుష్య పట్టణాల స్థానాలు.. 1. ఢిల్లీ 2. పాట్నా 3. గ్వాలియర్, 4. రాయ్పూర్ వాయు కాలుష్య నియంత్రణ చట్టాలు భారత ప్రభుత్వం వాయు కాలుష్య చట్టాన్ని 1981లో, పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని 1986లో రూపొందించింది. వాయు కాలుష్య నివారణ చర్యలు పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అణువిద్యుత్ కేంద్రాలను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలి.పరిశ్రమల నుంచి వెలువడే పొగ, విష వాయువులు, బూడిద వంటి వాటిని పొగ గొట్టంలోని ఫిల్టర్ల సాయంతో వడపోసి అవి వాతావరణంలోకి చేరకుండా చూడాలి.మోటార్ వాహనాలు, రైళ్లు, పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో శిలాజ ఇంధనాల (బొగ్గు, పెట్రోల్, డీజిల్) బదులు సంప్రదాయేతర ఇంధన వనరులను అంటే జీవ ఇంధనాలను, పవన శక్తి, సముద్ర వనరుల శక్తి వంటి వాటిని ఉపయోగించాలి.పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను సాధ్యమైనంత వరకు రీసైక్లింగ్ చేసి పునర్వినియోగించాలి. అడవులను పెంచడమే కాకుండా వాటిని సంరక్షించాలి.వాయు కాలుష్య నియంత్రణ చట్టాలను తప్పనిసరిగా అమలు చేయాలి. నీటి కాలుష్యం లేదా జల కాలుష్యం నిర్వచనం: ఘన/ద్రవ పదార్థాలు నీటిలోకి చేరడం వల్ల ఆ నీటి నాణ్యత తగ్గి తాగడానికి/వాడుకోవడానికి వీలు లేకపోవడాన్ని నీటి కాలుష్యం అంటారు. (లేదా) జాతీయ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ప్రస్తుతం/భవిష్యత్లో మానవుడు తన అవసరాలకు వాడుకోవడానికి పనికిరాని, కనీస నాణ్యతలేని నీటిని ‘కలుషిత నీరు’ అంటారు. (లేదా) ‘నీటికి ఉండే సహజ లక్షణాలకు భంగం వాటిల్లడమే నీటి కాలుష్యం’. (లేదా) నీటిలో అనవసర పదార్థాలు కలవడం వల్ల నీటి సహజ గుణం మారిపోయి నిరుపయోగంగా; మానవుడికి, ఇతర జీవులకు హానికరంగా మారడాన్ని నీటి కాలుష్యం అంటారు. సి.హెచ్. మోహన్ సబ్జెక్టు నిపుణులు, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
సరైన ప్రణాళికతోనే సక్సెస్
అమ్మానాన్న పడుతున్న కష్టం అతనిలో ఉన్నత స్థానాలకు ఎదగాలన్న సంకల్పం నింపింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కన్నవారిని ఏ లోటూ లేకుండా చూసుకోవాలని పదో తరగతిలోనే నిర్ణయించుకున్నారు. అదే ధ్యేయంతో నిరంతరం శ్రమిస్తూ తొలుత 2006లో టీచర్ ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగిపోకుండా తర్వాత2011లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, 2012లో డిప్యూటీ తహసీల్దార్ కొలువు సొంతం చేసుకున్నారు నల్లగొండ జిల్లాకు చెందిన మందడి నాగార్జున రెడ్డి. ప్రణాళికాబద్ధంగా, ఏకాగ్రతతో చదివితే ఎలాంటి పోటీ పరీక్షలోనైనా సులువుగా విజయం సాధించొచ్చని అంటారాయన.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారికోసం నాగార్జున రెడ్డి సలహాలు.. మాది నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని బోయగూడెం. అమ్మానాన్న వ్యవసాయ పనులు చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి వారు పడే కష్టాన్ని దగ్గర నుంచి చూశా. ప్రభుత్వ ఉద్యోగం సాధించి వారికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలని పదో తరగతిలో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నా. టెన్త్ వరకు రాజవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివా. ఇంటర్ తర్వాత టీటీసీ పూర్తిచేశా. ఇంటర్, డిగ్రీ హాలియాలో చదివా. 2006లో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. అందులో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)గా సెలెక్ట్ అయ్యా. ఆ ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్కు సిద్ధమయ్యాను. ఈ క్రమంలో వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అందులో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ సాధించా. 2011లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో ఆరో జోన్లో మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యా. ప్రస్తుతం నిడమనూర్లో ఇన్చార్జ్ తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నా. ప్రామాణిక పుస్తకాలతో.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో మార్కెట్లో ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే అభ్యర్థులు ఒక సబ్జెక్టుకు సంబంధించి ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకొని, వీలైనన్ని ఎక్కువ సార్లు చదవాలి. ఒక సబ్జెక్టు కోసం వేర్వేరు పుస్తకాలు చదవడం వల్ల సమయం వృథా తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే ఒకే పుస్తకాన్ని ఎంచుకొని వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. చాప్టర్ల వారీగా ముఖ్యమైన అంశాలను నోట్స్ రూపంలో రాసుకొని, పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. అకాడమీ పుస్తకాలు లేదా మార్కెట్లో దొరికే ప్రామాణిక మెటీరియల్ను చదవడం మంచిది. సొంతంగా చదవడమే మేలు కోచింగ్ తీసుకుంటేనే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమనే భావన చాలామంది అభ్యర్థుల్లో ఉంటుంది. ముందు దీన్నుంచి బయటపడాలి. కోచింగ్ ద్వారా ఏయే అంశాలు, ఎలా చదవాలో తెలుస్తుంది. ప్రస్తుతం పలు పోటీ పరీక్షలకు అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థులు సొంతంగా, ప్రణాళికాబద్ధంగా చదవడం మంచిది. అలాగే వీలైనన్ని మాక్టెస్టులు రాయాలి. వీటిద్వారా తాము ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నామో గుర్తించి, వాటిపై మరింత దృష్టిసారించాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. -
స్టడీ ఇన్ సింగపూర్
సింగపూర్.. భారతీయ విద్యార్థుల విదేశీ విద్యకు గమ్యస్థానంగా నిలుస్తోన్న దేశాల్లో ఒకటి. ప్రపంచంలోని అత్యున్నత విద్యా సంస్థలకు వివిధ సంస్థలు ఇచ్చే ర్యాంకుల్లో సింగపూర్ యూనివర్సిటీలు.. టాప్-100లో చోటు దక్కించుకుంటున్నాయి. ప్రపంచంలోనే సురక్షిత దేశాల్లో ఒకటి కావడం, వివిధ బహుళజాతి సంస్థలు సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండటం వంటి కారణాలతో ఈ దేశాన్ని ఎంచుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్ యూనివర్సిటీలు.. ప్రవేశాలపై ప్రత్యేక కథనం.. ప్రస్తుతం ఆసియాలో ఆర్థికంగా గణనీయంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన సింగపూర్ను మంచి ఎడ్యుకేషన్ హబ్గా కూడా పరిగణిస్తున్నారు. నాణ్యమైన విద్యకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దేశం సింగపూర్. ముఖ్యంగా మేనేజ్మెంట్ కోర్సులను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది. టెక్నాలజీ, మేనేజ్మెంట్పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉన్నత విద్య కోసం సింగపూర్ను ఎంచుకుంటున్నారు. భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉండటం, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువగా ఉండటం మన దేశ విద్యార్థులను సింగపూర్ వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్యూఎస్) ఆసియాలో పేరుగాంచిన యూనివర్సిటీల్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఒకటి. 2016-17 క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే 12వ స్థానంలో నిలిచింది. ఇక సబ్జెక్టుల పరంగా చూస్తే కంప్యూటర్ సైన్సలో 9, బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్లో 12వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పరిధిలో 13 అండర్గ్రాడ్యుయేట్ స్కూళ్లు, 4 గ్రాడ్యుయేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 300 పైగా వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రీసెర్చ్ బేస్డ్ ఎడ్యుకేషన్కు ఈ యూనివర్సిటీ పెట్టింది పేరు. ఆ దేశ విద్యార్థులతో కలిపి వివిధ దేశాల నుంచి సుమారు 38 వేల మంది విద్యార్థులు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో విద్యను అభ్యసిస్తున్నారు. అడ్మిషన్స: అండర్గ్రాడ్యుయేషన్: అక్టోబర్, మార్చి గ్రాడ్యుయేషన్: జనవరి, ఆగస్టు వెబ్సైట్: www.nus.edu.sg నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్టీయూ) ఆసియాలో అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఎన్టీయూ టాప్-5లో ఉంటుంది. 2016-17కు క్యూఎస్ ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీల ర్యాంకుల్లో ప్రపంచంలోనే 13వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా రీసెర్చ్ ప్రోగ్రామ్లకు ఈ యూనివర్సిటీ ఉత్తమమైంది. దీని పరిధిలో ప్రస్తుతం ఐదు కాలేజీలు, ఐదు అటానమస్ ఇన్స్టిట్యూట్లతోపాటు 16 ఇతర ఇన్స్టిట్యూట్లు, సెంటర్లు ఉన్నాయి. యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల్లో దాదాపు 33 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అడ్మిషన్స: అండర్గ్రాడ్యుయేషన్: ఆగస్టు - జనవరి గ్రాడ్యుయేషన్: ఆగస్టు - జనవరి వెబ్సైట్: www.ntu.edu.sg సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ (ఎస్ఎమ్యూ) సింగపూర్లోని టాప్ యూనివర్సిటీల్లో ప్రధానమైంది సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో సోషల్, మేనేజ్మెంట్ స్టడీస్కు కేరాఫ్ అడ్రస్ ఈ యూనివర్సిటీ. దీని పరిధిలోని అకౌంటెన్సీ, బిజినెస్, ఎకనామిక్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజ్మెంట్, లా, సోషల్ సైన్స్ విభాగాల్లో ఆరు స్కూళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 10 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీటితోపాటు మరో 11 విద్యా సంస్థలు ఎస్ఎంయూ పరిధిలో ఉన్నాయి. అడ్మిషన్స: అండర్గ్రాడ్యుయేషన్: అక్టోబర్ - మార్చి గ్రాడ్యుయేషన్: ఏప్రిల్ - నవంబర్ వెబ్సైట్: www.smu.edu.sg సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సింగపూర్లోని ఉత్తమ విద్యా సంస్థల్లో మరొకటి.. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. 2005లో ఏర్పాటు చేసిన ఈ ప్రైవేట్ యూనివర్సిటీ పరిధిలో ఆర్ట్స్- సోషల్ సెన్సైస్, బిజినెస్, హ్యూమన్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలకు చెందిన ఐదు స్కూళ్లలో దాదాపు 50 డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సుమారు 14 వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇందులో అడ్మిషన్ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. వెబ్సైట్: http://www.sim.edu.sg సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ (ఎస్యూటీడీ) టెక్నాలజీ అండ్ డిజైన్ కోర్సులకు ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ.. సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ యూనివర్సిటీ అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైనాలోని ఝెజియాంగ్ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇక్కడ చేరిన విద్యార్థులకు యూఎస్, చైనా సర్టిఫికెట్లు అందిస్తోంది. ఆర్కిటెక్చర్ అండ్ సస్టైనబుల్ డిజైన్, ఇంజనీరింగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ సిస్టమ్స్ అండ్ డిజైన్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ టెక్నాలజీ అండ్ డిజైన్, హ్యుమానిటీస్, ఆర్ట్స్ అండ్ సోషల్ సెన్సైస్ ఈ యూనివర్సిటీ అందిస్తున్న ప్రధానమైన కోర్సులు. అడ్మిషన్స: గ్రాడ్యుయేషన్: మార్చి పోస్ట్గ్రాడ్యుయేషన్: సెప్టెంబర్ వెబ్సైట్: www.sutd.edu.sg ప్రస్తుతం భారతీయ విద్యార్థులు విదేశీ విద్యపై ఆసక్తి చూపిస్తున్న దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి. అక్కడ తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అభ్యసించవచ్చు. సింగపూర్లో అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలకు చెందిన ప్రముఖ విద్యా సంస్థలు కూడా తమ క్యాంపస్లను నెలకొల్పాయి. ఆయా దేశాల్లో ఉన్నత విద్య ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అదే విద్యను సింగపూర్లో తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చు. సింగపూర్లో ఎక్కువగా మేనేజ్మెంట్ స్టడీస్, ఎంఎస్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. కొన్ని యూనివర్సిటీలు జీఆర్ఈ స్కోరు లేకుండా కూడా అడ్మిషన్లు కల్పిస్తున్నాయి. కాబట్టి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యకు సింగపూర్ బెస్ట్ చాయిస్. - అరుల్ జోసెఫ్, అడ్మిషన్ కన్సల్టెంట్, హైదరాబాద్ -
క్షిపణి విధ్వంసక నౌక మోర్ముగావో జలప్రవేశం
క్షిపణి విధ్వంసక నౌక మోర్ముగావో ప్రారంభం భారత నౌకా దళానికి చెందిన అధునాతన క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక మోర్ముగావోను నేవీ ఛీప్ అడ్మిరల్ సునీల్ లాంబా సతీమణి రీనా సెప్టెంబర్ 17న ముంబైలో ప్రారంభించారు. దీన్ని ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) అభివృద్ధి చేసింది. మోర్ముగావో నుంచి ఉపరితలం నుంచి ఉపరిత లానికి, ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులను, జలాంతర్గామి విధ్వంసక రాకె ట్లను ప్రయోగించవచ్చు. ఇది 7,300 టన్నుల సామర్థ్యంతో గరిష్టంగా గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. గస్తీ నౌక రాణి గెయిడిన్లీ.. తీర గస్తీ దళానికి అప్పగింత భారత తీర గస్తీ దళం కోసం విశాఖ షిప్యార్డ్ రూపొందించిన గస్తీ నౌక రాణి గెయిడిన్లీని సెప్టెంబర్ 14న ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులకు అప్పగించారు. ఈ నౌక పొడవు 51.5 మీటర్లు, వెడల్పు 8.3 మీటర్లు. స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్-2ను ప్రయోగించిన చైనా అంతరిక్ష కేంద్రానికి అవసరమైన స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్-2ను చైనా సెప్టెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించింది. 2022 నాటికి మానవ సహిత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ల్యాబ్ను పంపింది. దీన్ని గోబీ ఎడారిలోని జియుక్వాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి ప్రయోగించారు. అవార్డులు ఆర్థిక స్వేచ్ఛలో భారత్కు 112వ స్థానం ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించి భారత్ ప్రపంచంలో 112వ స్థానంలో నిలిచింది. ఎకనమిక్ ఫ్రీడం ఆఫ్ ది వరల్డ్-2016 వార్షిక నివేదిక.. 159 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో హాంకాంగ్ మొదటి స్థానంలో, సింగపూర్, న్యూజిలాండ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పప్పుల మద్దతు ధర పెంపునకు కమిటీ సిఫార్సు దేశంలో పప్పుల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.1,000 చొప్పున పెంచాలని, ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సెప్టెంబర్ 16న నివేదికను సమర్పించిన కమిటీ.. దానిలో సాగు పెంపు, ధరల అదుపు దిశగా పలు సంస్కరణలను సూచించింది. యుద్ధ ప్రాతిపదిక న పప్పుల కొనుగోలుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరింది. ఆగస్టులో 3.74 శాతానికి డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఆగస్టు నెలలో 3.74 శాతానికి చేరుకుంది. ఇది జూలైలో 3.55 శాతంగా ఉంది. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న విడుదల చేసింది. జూలైలో 11.82 శాతంగా ఉన్న ఆహార ధరల సూచీ ఆగస్టులో 8.23 శాతంగా నమోదైంది. సదస్సులు బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సమావేశం ద క్షిణ గోవాలో రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సమావేశం సెప్టెంబర్ 16న ముగిసింది. ఈ సమావేశంలో హరిత సంబంధిత అంశాలపై పరస్పర సహకారానికి సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పారిస్ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు, సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ శాఖ (ఇండిపెండెంట్ చార్జ) మంత్రి అనిల్ దవే తెలిపారు. వైజాగ్లో పట్టణీకరణపై బ్రిక్స్ సదస్సు విశాఖపట్నంలో సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు పట్టణీకరణపై బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పట్టణీకరణ ఆవశ్యతక, దాని వల్ల తలెత్తే సమస్యలపై ప్రధానంగా చర్చించారు. పట్టణీకరణ సమస్యలపై ప్రతినిధుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. బ్రిక్స్ దేశాల నుంచి మంత్రులు, అధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు. కాలుష్య తగ్గింపుపై బ్రిక్స్- భారత్ ఒప్పందం వాయు, జల కాలుష్య నియంత్రణకు సంబంధించి బ్రిక్స్ దేశాలతో కలిసి భారత్ అవగాహన పత్రంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల సమర్థ నిర్వ హణ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలున్నాయి. వార్తల్లో వ్యక్తులు యూపీఎస్సీ చైర్మన్గా అల్కా సిరోహి: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నూతన ైచైర్మన్గా అల్కా సిరోహి సెప్టెంబర్ 18న నియమితులయ్యారు. ఆర్సీఐ డెరైక్టర్గా నారాయణ మూర్తి: ప్రముఖ శాస్త్రవేత్త బీహెచ్వీఎస్ నారాయణమూర్తి సెప్టెంబర్ 14న డీఆర్డీవోలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) డెరైక్టర్గా బాధ్యతలు చేపట్టారు. పౌర హక్కుల నేత బొజ్జా తారకం మృతి: పౌర హక్కుల నేత, ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం (77) సెప్టెంబర్ 16న హైదరాబాద్లో మరణించారు. ఆయన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కారంచేడు ఘటనపై దళితుల పక్షాన సుప్రీంకోర్టులో పోరాడి దోషులకు శిక్ష పడేలా చేశారు. ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు, ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
ఇండియన్ నేవీలో ఎస్ఎస్సీ ఆఫీసర్లు
ఇండియన్ నేవీ.. పైలట్/నాయిక్ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్డ్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ల ప్రవేశం కోసం నిర్వహించే కోర్సుకు అవివాహిత మహిళలు, పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సు జూన్, 2017 నుంచి ఇండియన్ నేవల్ అకాడమీ - ఎజిమల(కేరళ)లో ప్రారంభమవుతుంది. ఇంజనీరింగ్గ్రాడ్యుయేట్స్కు ఇది చక్కటి అవకాశం. ప్రారంభంలో సబ్ లెఫ్టినెంట్గా చేరినవారికి అన్ని కలుపుకుని నెలకు రూ.87,600 నుంచి రూ.90,000 వరకు చెల్లిస్తారు. పైలట్ అర్హత: ఇంటర్మీడియెట్/10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. ఇంతకుముందు పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ)లో ఉత్తీర్ణులు కానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.వయోపరిమితి: 19 - 24 ఏళ్లు. అభ్యర్థులు జూలై 2, 1993 - జూలై 1, 1998 మధ్య జన్మించి ఉండాలి. కమర్షియల్ పైలట్ లెసైన్స్ (సీపీఎల్) ఉన్నవారికి 19-25 ఏళ్లు. వీరు జూలై 2, 1992 - జూలై 1, 1998 మధ్య జన్మించాలి.పైలట్ శారీరక ప్రమాణాలు: అభ్యర్థులు ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి. దీంతోపాటు తగిన బరువును కలిగి ఉండాలి. ఠి నాయిక్ అర్హత: 60 శాతం మార్కులతో మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ ప్రొడక్షన్/ఇన్స్ట్రుమెంటేషన్/ఐటీ/కెమికల్ మెట్లర్జీ/ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత లేదా ఈ స్పెషలైజేషన్లలో బీటెక్ ఫైనలియర్ చదివే విద్యార్థులూ అర్హులే.వయోపరిమితి: 19 1/2 - 25 ఏళ్లు. జూలై 2, 1992 - జనవరి 1, 1998 మధ్య జన్మించి ఉండాలి.నాయిక్ శారీరక ప్రమాణాలు: పురుషులు కనీసం 157 సెం.మీ, మహిళలు కనీసం 152 సెం.మీ ఉండాలి. దీంతోపాటు వయసు, ఎత్తుకు తగిన బరువును కలిగి ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతల మార్కుల ఆధారంగా సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ స్టేజ్-1, స్టేజ్-2 అనే రెండు దశలుగా ఉంటుంది. ఇవి.. డిసెంబర్, 2016 నుంచి మార్చి, 2017 వరకు ఉంటాయి. స్టేజ్-1: దీన్ని ఒక రోజు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. స్టేజ్-2: ఇందులో భాగంగా నాలుగు రోజులు సైకలాజికల్ టెస్టులు, గ్రూప్ టాస్క్ టెస్టులు, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో విజయం సాధించినవారిని వైద్య పరీక్షలకు ఎంపిక చేస్తారు. వైద్య పరీక్షలు మూడు నుంచి ఐదు రోజులపాటు ఉంటాయి. పైలట్కు దరఖాస్తు చేసుకున్నవారికి పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ)తోపాటు ఏవియేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. పైలట్ పరీక్షలు, ఇంటర్వ్యూ బెంగళూరులో, నాయిక్ ఇంటర్వ్యూలు బెంగళూరు/భోపాల్/కోయంబత్తూరు/విశాఖపట్నంలో ఉంటాయి. అన్నింటిని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని శిక్షణకు ఎంపిక చేస్తారు. పైలట్, నాయిక్గా మొత్తం 14 ఏళ్లపాటు విధులు నిర్వర్తించొచ్చు. అంతకుమించి పొడిగించరు.పైలట్ ఎంట్రీ: ఎంపికైనవారు 22 వారాలపాటు నేవల్ ఓరియెంటేషన్ కోర్సు (ఎన్వోసీ), తర్వాత స్టేజ్-1, స్టేజ్-2 ప్లైయింగ్ ట్రైనింగ్లను పూర్తిచేసుకోవాలి. వీటిని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి వింగ్స్ అవార్డు ఇస్తారు.నాయిక్ ఎంట్రీ: వీరికి కూడా వివిధ నేవల్ ఎస్టాబ్లిష్మెంట్స్/యూనిట్స్/షిప్స్లో, ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ అందిస్తారు. వేతన శ్రేణి, పదోన్నతులు: మొదట సబ్ లెఫ్టినెంట్ (పేస్కేల్: రూ.15,600 - రూ.39,100, గ్రేడ్ పే రూ.5400) హోదాతో ఉద్యోగంలో చేరినవారు తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి లెఫ్టినెంట్ (పేస్కేల్: రూ.15,600 - రూ.39,100, గ్రేడ్ పే రూ. 6100), లెఫ్టినెంట్ కమాండర్ (పేస్కేల్: రూ.15,600-రూ.39,100, గ్రేడ్ పే రూ.6600), కమాండర్ (పే స్కేల్: రూ.37400- రూ. 67,000, గ్రేడ్ పే రూ.8000) స్థాయి వరకు చేరుకుంటారు. నిబంధనలకు మేరకు ఇతర అలవెన్సులు (ఫ్లైయింగ్, ఇన్స్ట్రక్షనల్, యూనిఫామ్, హౌస్ రెంట్, హార్డ్ ఏరియా, ట్రాన్స్పోర్ట్, డైవింగ్ తదితర) ఉంటాయి. కుటుంబానికంతటికీ ఉచిత వైద్య సదుపాయం, క్యాంటీన్, రేషన్, మెస్/క్లబ్/స్పోర్ట్స్ సౌకర్యాలు, ఫర్నీచర్తో కూడిన ప్రభుత్వ నివాస గృహం, త క్కువ వడ్డీకి కారు/హౌసింగ్ లోన్ ఇస్తారు. రైలు ప్రయాణ ఛార్జీల్లో 40 శాతం తగ్గింపు ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబంతో కలిసి ఉచితంగా కూడా ప్రయాణించొచ్చు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత రెండు ప్రింటవుట్స్ తీసుకోవాలి. ఒక దరఖాస్తు ప్రింటవుట్కు సంబంధిత విద్యార్హతలు (పదో తరగతి, ఇంటర్మీడియెట్, బీటెక్/బీఈ), మార్కుల లిస్ట్స్, ఇతర సర్టిఫికెట్లను కలిపి ‘పోస్ట్ బాక్స్ నెంబర్ 02, సరోజిని నగర్ పీవో, న్యూఢిల్లీ - 110023’కి సాధారణ పోస్టులో పంపాలి. ఎన్వలర్ కవర్ పైన ‘ఆన్లైన్ అప్లికేషన్ నెంబర్...... అప్లికేషన్ ఫర్ పైలట్/నాయిక్ జూన్ 2017 కోర్స్ క్వాలిఫికేషన్...... పర్సంటేజ్.........%’ రాయాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 30, 2016 వెబ్సైట్: www.joinindiannavy.gov.in -
1857 సిపాయిల తిరుగుబాటు
శతాబ్ద కాలంగా ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భారతీయుల్లో పేరుకుపోతూ వచ్చిన అసంతృప్తి జ్వాల 1857 తిరుగుబాటు రూపంలో చెలరేగింది. యూరోపియన్లలో కొందరు దీన్ని ‘సిపాయిల తిరుగుబాటు’ అని పేర్కొనగా, మరికొందరు దీన్ని మత దురభిమానులు సాగించిన యుద్ధం, జాతుల మధ్య పోరాటం, నాగరికత-ఆటవికత మధ్య సాగిన సంఘర్షణ అని పేర్కొన్నారు. భారతదేశంలోని జాతీయవాదులు, చరిత్రకారులు దీన్ని ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా పేర్కొన్నారు. వారిలో వి.డి.సావర్కర్ ప్రథములు. ఆర్.సి. మజుందార్ దీన్ని ‘ఒక తిరుగుబాటు’గా పేర్కొన్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగిన ప్రముఖ చారిత్రక సంఘటనల్లో 1857 తిరుగుబాటుకు ప్రత్యేక స్థానం ఉంది. తిరుగుబాటు స్వభావం గురించి చరిత్రకారులు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం దీన్ని 5 విధాలుగా వర్గీకరించొచ్చు. అవి.. 1. సిపాయిల పితూరీ 2. జాతి సంఘర్షణ 3. హిందువులు, మహ్మదీయులు కలిపి పన్నిన కుట్ర 4. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం 5. స్వాతంత్య్ర సమరానికి నాందీ (లేదా) మొదటి మెట్టు తిరుగుబాటుకు కారణాలు ఆంగ్ల చరిత్రకారులు భావించినట్లు కేవలం ఆవు, పంది కొవ్వు పూసిన తూటాల కారణంగానే 1857లో తిరుగుబాటు జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. అవి.. డల్హౌసీ విధానాలు (లేదా) రాజకీయ కారణాలు సాంఘిక కారణాలు మత సంబంధమైన కారణాలు ఆర్థిక కారణాలు సైనిక కారణాలు తక్షణ కారణం ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలు డల్హౌసీ విధానాలు(లేదా) రాజకీయ కారణాలు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా సతారా, నాగ్పూర్, భరత్పూర్, ఉదయ్పూర్, ఝాన్సీ వంటి హిందూ రాజ్యాలు ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. ఆ విధంగా రాజ్యాలను కోల్పోయిన స్వదేశీ రాజులు తిరుగుబాటులో ప్రముఖ పాత్ర వహించారు. సాంఘిక కారణాలు పాశ్చాత్య నాగరికత పట్ల భారతీయులు విముఖత చూపారు. దాని వ్యాప్తి వల్ల తమ ప్రాచీన సంప్రదాయాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చెందారు. నరబలి, సతీసహగమనం, బాల్య వివాహాలను ఆంగ్లేయులు రద్దు చేయడం, వితంతు వివాహాలను చట్టబద్ధం చేయడం, స్త్రీ విద్యను ప్రోత్సహించడం వంటివన్నీ భారతీయులకు వింతగా, సనాతన ధర్మానికి విరుద్ధంగా తోచాయి. మత కారణాలు హిందువులను క్రైస్తవులుగా మార్చనిదే వారు నాగరికులు కాలేరని, తమకు విశ్వాసపాత్రులై ఉండరని భావించి ఆంగ్లేయులు క్రైస్తవ మత బోధన సాగించారు. విద్యా సంస్థల్లో నిర్బంధ బైబిల్ బోధనను ప్రవేశపెట్టారు. అయితే ఖురాన్, హిందూ మత గ్రంథాల బోధనకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. ఆర్థిక కారణాలు ఆంగ్లేయులు స్వదేశీ రాజ్యాలను ఆక్రమించడంతో ఆయా రాజ్యాల్లోని ప్రభుత్వోద్యోగులు, సైనికులు నిరుద్యోగులుగా మిగిలారు. ఇంగ్లండ్లో వచ్చిన పారిశ్రామిక విప్లవ ప్రభావం ఫలితంగా భారతదేశంలో కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. విదేశీ వస్తువులు చౌకగా లభించడం వల్ల స్వదేశీ పరిశ్రమలపై ఆధారపడిన వారు నిరుద్యోగులయ్యారు. క్షామ కాలంలో ప్రజలకు తగిన రీతిలో సాయం లభించలేదు. ప్రజా సంక్షేమంపై ఆంగ్లేయులు సరైన దృష్టి సారించలేదు. సైనిక కారణాలు ఆంగ్ల సైనికులతో పోల్చితే భారత సిపాయిల జీతభత్యాలు చాలా తక్కువగా ఉండేవి. అర్హత, శక్తి సామర్థ్యాల ప్రాతిపదికన కాకుండా కేవలం క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారికి, ఆంగ్లేయుల ఆదరాభిమానాలు చూరగొన్న వారికి మాత్రమే ఉన్నత పదవులు లభించాయి. తక్షణ కారణం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ రైఫిల్స్లో ఉపయోగించే తూటాల చుట్టూ ఆవు, పంది కొవ్వు పూస్తున్నారనే వదంతులు వ్యాపించాయి. ఆవు హిందువులకు పవిత్రం కాగా, పంది మహ్మదీయులకు నిషిద్ధ జంతువు. దాంతో హిందూ, ముస్లిం సిపాయిలు ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకించి తిరుగుబాటుకు ఉపక్రమించారు. ఆయా ప్రాంతాల్లో తిరుగుబాటు నాయకులు కాన్పూర్: ఇక్కడ తిరుగుబాటుకు నానాసాహెబ్ నాయకత్వం వహించాడు. రావుసాహిబ్, తాంతియాతోపే, అజీముల్లాఖాన్ (సలహాదారు) అతడికి మద్దతుగా నిలిచారు. కాన్పూర్ను 1857, డిసెంబర్లో బ్రిటిష్ సైన్యాధికారి కొలిన్ క్యాంప్బెల్ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. నానాసాహెబ్ నేపాల్కు పారిపోయాడు. 1859లో ప్రభుత్వం ఇతడిని కాల్చి చంపింది. లక్నో: ఇది అవథ్ రాజధాని. 18 నెలల తన కుమారుడి తరఫున తల్లి ‘బేగం హజ్రత్ మహల్’ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. ఆమె సలహాదారు అహ్మదుల్లా. కొలిన్ క్యాంప్బెల్ 1858, మార్చి 18న లక్నోను స్వాధీనం చేసుకున్నాడు. బేగం హజ్రత్ మహల్ నేపాల్కు పారిపోయింది. ఝాన్సీ, గ్వాలియర్: లక్ష్మీబాయి ముందుగా ఝాన్సీలో పోరాటం చేసింది. ఝాన్సీని జనరల్ హ్యూరోస్ స్వాధీనం చేసుకున్నాడు. గ్వాలియర్ రాజు సింధియా బ్రిటిష్ పక్షాన నిలిచాడు. కానీ అతని సైనికులు ఝాన్సీ లక్ష్మీబాయిని నాయకత్వం వహించాల్సిందిగా కోరారు. గ్వాలియర్లో యుద్ధం చేస్తున్న లక్ష్మీబాయి 1858, జూన్ 17న బ్రిటిష్ జనరల్ హ్యూరోస్ చేతిలో చనిపోయింది. తాంతియాతోపే ఝాన్సీ, గ్వాలియర్ రెండు చోట్ల లక్ష్మీబాయికి మద్దతుగా నిలిచాడు. బిహార్: బిహార్లోని అర్రా అనే ప్రాంతంలో 70 ఏళ్ల జమీందారు కున్వర్సింగ్, అతని సోదరుడు అమర్సింగ్లు తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. రాయ్బరేలి: ఖాన్ బహమర్ ఖాన్ ఫైజాబాద్ : మౌలానా అహ్మదుల్లా ఢిల్లీ: ఇక్కడ తిరుగుబాటుకు నామమాత్రపు నాయకుడు రెండో బహదూర్షా. ఇతను తిరుగుబాటుదారులపై పెద్దగా నమ్మకం చూపకుండా ఊగిసలాట ధోరణిని ప్రదర్శించాడు. అతని భార్య బేగం హజరత్ మహల్ బ్రిటిష్ వారితో కుమ్మక్కైంది. ఢిల్లీలో తిరుగుబాటుకు నిజమైన నాయకుడు రాయ్బరేలీలో సుబేదార్గా పనిచేసిన ‘జనరల్ భక్త్ఖాన్’. ఢిల్లీని ‘జాన్ నికల్సన్’ అనే బ్రిటిష్ సైన్యాధికారి 1857, సెప్టెంబర్లో తిరుగుబాటుదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. లెఫ్టినెంట్ హడ్సన్ అనే బ్రిటిష్ సైన్యాధికారి రెండో బహదూర్షా కుమారుడు ఫకీరుద్దీన్తోపాటు అతని కుమారుణ్ని కాల్చి చంపాడు. బ్రిటిష్ ప్రభుత్వం రెండో బహదూర్షా, అతని భార్య జీనమహల్ను దేశాంతర వాస శిక్ష కింద బర్మాలోని రంగూన్కి పంపించింది. వారు అక్కడే మరణించారు. ‘జనరల్ భక్త్ఖాన్’ అవధ్కు వెళ్లి బేగం హజ్రత్ మహల్కు అండగా నిలిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయిన అతణ్ని ప్రభుత్వం1859లో పట్టుకుని కాల్చి చంపింది. తిరుగుబాటు ప్రారంభం కాకముందే బెంగాల్లోని బారక్పూర్లో ‘మంగళ్ పాండే’ ఎన్ఫీల్డ్ తూటాలు ఉపయోగించేందుకు నిరాకరించి, లెఫ్ట్నెంట్ బాగ్ అనే అధికారిని 1857, మార్చి 29న కాల్చిచంపాడు. మంగళ్పాండేను 1857 సిపాయి తిరుగుబాటు కాలం నాటి తొలి హీరోగా వీడీ సావర్కర్ పేర్కొన్నారు. తిరుగుబాటు వైఫల్యానికి కారణాలు ఇది కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఉత్తరప్రదేశ్, బిహార్లలో మాత్రమే దీనికి సామాన్య ప్రజల మద్దతు లభించింది. సర్ జాన్ లారెన్స మంచి పాలన అందించి పంజాబ్ ప్రజలు, సిక్కులు తిరుగుబాటులో చేరకుండా చూశాడు.గ్వాలియర్ రాజు సింధియా, ఇండోర్ రాజు హోల్కర్, నేపాల్ రాణా, హైదరాబాద్ నవాబు తదితర స్వదేశీ సంస్థానాధీశులు తిరుగుబాటును అణచివేయడంలో బ్రిటిష్ వారికి మద్దతిచ్చారు. తిరుగుబాటు నాయకుల మధ్య సమన్వయం, ముందుచూపు కొరవడ్డాయి. పూర్వ యుద్ధ అనుభవం లేకపోవడం కూడా వైఫల్యానికి మరో కారణం. బ్రిటిష్ వారికి అధునాతన సైన్యం, ఆయుధాలు, రైల్వే, టెలిగ్రాఫ్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఫలితాలు 1958 చట్టం ప్రకారం కంపెనీ పాలన రద్దయి అధికారం బ్రిటిష్ పార్లమెంట్ వశమైంది. బ్రిటన్ రాణి దేశాధినేత అయ్యారు. గవర్నర్ జనరల్ పదవి.. వైశ్రాయ్ పదవిగా మారింది. లార్డ కానింగ్ మొదటి వైశ్రాయ్ అయ్యాడు. తిరుగుబాటు తర్వాత స్వదేశీ సంస్థానాధీశుల పట్ల బ్రిటిష్ ప్రభుత్వం స్నేహపూర్వక ధోరణిని ప్రదర్శించింది. సైన్యంలో దేశభక్తి భావాలు ఏర్పడకుండా సైన్యాన్ని కులం, ప్రాంతం పేరుతో విడగొట్టారు. ఉదా: సిక్కు రెజిమెంట్, గూర్ఖా రెజిమెంట్, మద్రాసు రెజిమెంట్. తిరుగుబాటులో పాల్గొన్న రాజపుత్రులు, బ్రాహ్మణులను సైన్యంలోకి తీసుకోవడం తగ్గించారు. తిరుగుబాటులో పాల్గొనని సిక్కులు, గూర్ఖాలు, మద్రాసీలను సైన్యంలోకి తీసుకున్నారు. తిరుగుబాటుతో ప్రభుత్వ ఆర్థిక స్థితి దెబ్బతింది. దాంతో జేమ్స్ విల్సన్ కమిటీని నియమించి దీని సూచన మేరకు ఆదాయపు పన్ను (ఐటీ), పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టారు. -
డిప్యూటీ తహశీల్దార్ డిలైట్ఫుల్ కెరీర్కు పునాది..
డిప్యూటీ తహశీల్దార్ (డీటీ).. గ్రూప్-2 ఔత్సాహికుల్లో అత్యంత క్రేజీ పోస్టు! గ్రూప్-2 నోటిఫికేషన్ అనగానే.. డీటీ ఖాళీలు ఎన్ని ఉన్నాయంటూ అభ్యర్థులు వాకబు చేస్తారు. ఇవి తక్కువగా ఉంటే నిరాశకు గురవుతారు. ఒకవైపు టీఎస్పీఎస్సీ గ్రూప్-2దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఏపీపీఎస్సీ నుంచి త్వరలో నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశముంది. ఈ క్రమంలో డిప్యూటీ తహశీల్దార్ కెరీర్ గ్రాఫ్పై విశ్లేషణ.. రెవెన్యూ శాఖలో కీలకమైన పోస్టు.. డిప్యూటీ తహశీల్దార్. మండల స్థాయిలో మండల రెవెన్యూ అధికారులు (తహశీల్దార్లు) క్షేత్రస్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తే.. డిప్యూటీ తహశీల్దార్లు రెవెన్యూ కార్యాలయ బాధ్యతలు చూస్తారు. తహశీల్ కార్యాలయంలో రోజువారీ పరిపాలన విధులు, ఫైల్ ప్రొసీడింగ్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ తదితర విధులు నిర్వహిస్తారు. ఫైళ్లకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే విషయంలో తహశీల్దార్లకు తమ పరిశీలనలతో కూడిన ప్రతిపాదనలు అందిస్తారు. వాటి ఆధారంగా తహశీల్దార్లు తుది నిర్ణయం తీసుకుంటారు. రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ డిప్యూటీ తహశీల్దార్లుగా ఎంపికైన అభ్యర్థులు.. ముందుగా ప్రొబేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో మొత్తం మూడేళ్ల వ్యవధిలో కంటిన్యూగా రెండేళ్ల సర్వీస్ తప్పనిసరి. ప్రొబేషన్ సమయంలో చూపిన పనితీరు ఆధారంగా సర్వీస్ ఖ రారు అవుతుంది. పనితీరు ఆధారంగా ప్రొబేషన్ను పొడిగించే విధానం సైతం అమలవుతోంది. ప్రొబేషన్ సమయంలో క్షేత్ర స్థాయిలోనూ విధులు నిర్వర్తించాలి. తర్వాత హోదా తహశీల్దార్ డిప్యూటీ తహశీల్దార్గా ప్రొబేషన్ పూర్తిచేసి సర్వీస్ ఖరారు చేసుకున్న తర్వాత సీనియార్టీ ఆధారంగా తహశీల్దార్ (మండల రెవెన్యూ అధికారి- ఎంఆర్వో)గా పదోన్నతి లభిస్తుంది. ఈ హోదాలో మండలంలోని అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మండల స్థాయిలో కొన్ని వివాదాల పరిష్కారానికి తహశీల్దార్లకు మెజిస్టీరియల్ అధికారాలు కూడా ఉంటాయి. మండల స్థాయిలో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి వీఆర్ఏ నుంచి డిప్యూటీ తహశీల్దార్ల వరకు పలు సూచనలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ సర్వీస్ రూల్స్ ప్రకారం- దాదాపు 50 రకాల విధులను నిర్వర్తించాల్సిన కీలకమైన హోదా తహశీల్దార్. కొన్ని సందర్భాల్లో డిప్యూటీ కలెక్టర్/ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా పని చేయాలి. ఎంఆర్వో టు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్వో తర్వాత లభించే పదోన్నతి డిప్యూటీ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. డివిజన్లోని అన్ని శాఖలను సమన్వయం చేయడం, డివిజన్ పరిధిలోని మండల స్థాయి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం, జిల్లా కలెక్టర్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరపడం వంటివి డిప్యూటీ కలెక్టర్ ప్రధాన విధులు. ఫస్ట్క్లాస్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ దిశగా చర్యలు తీసుకునే అధికారం డిప్యూటీ కలెక్టర్కు ఉంటుంది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో కనీసం ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేస్తే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా లభిస్తుంది. ఇది డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ హోదాకు సమానం. ఈ హోదాలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్కు పరిపాలన పరమైన విధుల్లో సహకరించాల్సి ఉంటుంది. ప్రధానంగా కలెక్టర్ కార్యాలయంలో రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, సిబ్బంది పర్యవేక్షణ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణ - పరిశీలన, వాటికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్కు ప్రతిపాదనలు పంపుతారు. వీటి ఆధారంగా సంబంధిత దరఖాస్తులు, ఆయా శాఖలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల కాలంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను కొన్ని ప్రత్యేక ప్రాజెక్టుల పర్యవేక్షణకు స్వతంత్ర హోదాలో నియమిస్తున్నారు. ముఖ్యంగా ఆయా ప్రాజెక్టులకు అవసరమయ్యే భూ సేకరణ, పర్యవేక్షణకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల నియామకం జరుగుతోంది. ఎస్డీసీ టు జేసీ-2 ప్రస్తుతం రెవెన్యూ పరిపాలన విభాగంలో జిల్లా స్థాయిలో జేసీ-2 (జాయింట్ కలెక్టర్-2) అనే కొత్త హోదాకు రూపకల్పన చేశారు. ఈ హోదాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను లేదా దానికి సమానంగా భావించే జిల్లా రెవెన్యూ అధికారుల (డీఆర్వో)ను నియమిస్తారు. వీరు ప్రధానంగా పౌర సరఫరాలు, ప్రొటోకాల్, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పర్యవేక్షణ వంటి విధులను నిర్వర్తిస్తారు. డీటీ నుంచి జేసీ-2 వరకు డిప్యూటీ తహశీల్దార్గా కెరీర్ను ప్రారంభించే అభ్యర్థులు భవిష్యత్తులో జాయింట్ కలెక్టర్-2 హోదా వరకు పదోన్నతి సాధించే అవకాశాలున్నాయి. ఒక స్థాయి నుంచి.. పై స్థాయికి ప్రమోషన్ ఇచ్చే క్రమంలో నిర్దిష్టంగా సర్వీస్ నిబంధనలు, సీనియారిటీ ప్రాతిపదిక లేకపోయినా.. జాయింట్ కలెక్టర్-2 వరకు చేరుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. డిప్యూటీ తహశీల్దార్లు భవిష్యత్తులో పదోన్నతులు పొందాలంటే.. సర్వీస్ కమిషన్లు ఆరు నెలలకోసారి నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్ట్ల్లో ఉత్తీర్ణత సాధించాలి. అలా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ప్రమోషన్ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు. అలాగని డిపార్ట్మెంట్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించినంత మాత్రాన ప్రమోషన్ వస్తుందని భావించకూడదు. పదోన్నతి ఇచ్చేందుకు ఇది ఒక ప్రాతిపదిక మాత్రమే. తాజా గ్రాడ్యుయేట్లు.. కన్ఫెర్డ్ ఐఏఎస్! ఇప్పుడే డిగ్రీ పూర్తి చేసుకొని 21 లేదా 22 ఏళ్ల వయసులో డిప్యూటీ తహశీల్దార్ పోస్ట్ సొంతం చేసుకున్న అభ్యర్థులు.. భవిష్యత్తులో కన్ఫెర్డ్ ఐఏఎస్ హోదా సైతం అందుకునే అవకాశముంది. కన్ఫెర్డ్ ఐఏఎస్గా ఎంపికయ్యేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం- డిప్యూటీ కలెక్టర్ హోదాలో కనీసం ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తిచేసుండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే సంవత్సరంలో జనవరి 1 నాటికి 52 ఏళ్ల వయసు దాటకూడదు. ఈ రెండు అర్హతలున్న వారు ముందుగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జీఏడీకి దరఖాస్తు చేసుకోవాలి. జీఏడీ ఆ దరఖాస్తులను పరిశీలించి సర్వీస్ రికార్డ్, డిప్యూటీ తహశీల్దార్గా ఎంపికైనప్పటి నుంచి జీఏడీకి దరఖాస్తు చేసుకునే రోజు వరకు చూపిన పనితీరును పరిశీలిస్తుంది. దాని ఆధారంగా అర్హుల జాబితాను రూపొందిస్తుంది. దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కు పంపిస్తారు. ఆ తర్వాత కమిషన్.. జాబితాలోని వ్యక్తులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వారిని కన్ఫెర్డ్ ఐఏఎస్ హోదాకు అర్హులని పేర్కొంటుంది. అంటే.. డిప్యూటీ తహశీల్దార్గా కెరీర్ ప్రారంభించిన అభ్యర్థులు అత్యుత్తమ పనితీరు కనబరిస్తే 52 నుంచి 53 ఏళ్ల వయసు వచ్చే నాటికి కన్ఫెర్డ్ ఐఏఎస్ హోదా సొంతం చేసుకుని, జాయింట్ కలెక్టర్ స్థాయిలో సైతం విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. కన్ఫెర్డ్ ఐఏఎస్ లభించాక ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా మారుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రజలకు నేరుగా సేవచేసే అవకాశం ఉండటం రెవెన్యూ శాఖలోని ప్రత్యేకత. కానీ, అతి కొద్ది మంది వల్ల అధిక శాతం ప్రజల్లో ‘అవినీతి’ ఎక్కువ అనే దురభిప్రాయం నెలకొంది. ఈ సర్వీసులో కొత్తగా అడుగుపెట్టాలనుకునే అభ్యర్థులు సేవా దృక్పథంతో ముందుకెళ్లాలి. సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరేలా, అన్ని వర్గాల శ్రేయస్సుకు కృషి చేసేలా విధులు నిర్వర్తించాలి. - బి.వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహశీల్దార్, ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్. -
భారత్లో ఆర్థిక సంస్కరణలు
1980వ దశకం చివరి కాలం, 1990 దశకమంతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తూర్పు ఐరోపాతోపాటు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలైన ఇండియా, వియత్నాం, పెరూ, మొరాకో, క్యూబా వంటి దేశాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. సుస్థిర ఆర్థిక వృద్ధిని త్వరితగతిన సాధించాలనే లక్ష్యంతో ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక సంస్కరణల వైపు మొగ్గుచూపాయి. ఆర్థిక సంస్కరణల అమలుతో మెక్సికో, చిలీ, స్పెయిన్ వంటి దేశాలు మెరుగైన ఫలితాలు సాధించాయి. ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం ఆర్థిక సంస్కరణల సమర్థత కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. భారత్లో ఆర్థిక సంస్కరణలు - మొదటి దశ ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉత్పత్తికి సంబంధించిన సాంఘిక సంబంధాల్లో మార్పులకు అనుగుణంగా భారత్ కూడా ఆర్థిక ప్రక్రియలో ప్రపంచీకరణ పెంపునకు స్పందించింది. రాజీవ్ గాంధీ 1985లో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత మొదటి దశ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రకటించిన నూతన ఆర్థిక విధానంలో ఉత్పాదకత పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, పూర్తి సామర్థ్య వినియోగంతోపాటు ప్రైవేటు రంగ పాత్రను ఆర్థిక వ్యవస్థలో పెంచడం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రైవేటు రంగానికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో పారిశ్రామిక లెసైన్సింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపు, నియంత్రణల నిర్మూలన, విదేశీ ఈక్విటీ మూలధనం, కోశ విధానం, ద్రవ్య, పరిపాలనా సంబంధిత నియంత్రణ వ్యవస్థను సులభతరం చేయడంతోపాటు ఎగుమతి -దిగుమతి విధానానికి సంబంధించి అనేక విధాన మార్పులను నూతన ఆర్థిక విధానంలో పొందుపరిచారు. నూతన ఆర్థిక విధానంలో భాగంగా చేపట్టిన చర్యలు బహిరంగ మార్కెట్లలో పంచదార స్చేచ్ఛా అమ్మకపు వాటా పెంచారు. పెద్ద బిజినెస్ హౌజ్ల ఆస్తుల పరిమితికి సంబంధించి సీలింగ్ను రూ.20 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచారు. లెసైన్సింగ్కు సంబంధించి బ్రాడ్బాండింగ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మొదట్లో ఈ పథకాన్ని ద్విచక్ర వాహనాల ఉత్పత్తిలో వైవిధ్యాన్ని తెచ్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టగా, తర్వాత ఫోర్వీలర్స, రసాయనాలు, పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, టైప్రైటర్స వంటి 25 రకాల పరిశ్రమలకు విస్తరించారు. 97 ఔషధాలను పూర్తిగా లెసైన్సింగ్ జాబితా నుంచి తొలగించారు. 27 పరిశ్రమలను ఎంఆర్టీపీ చట్టం పరిధి నుంచి మినహాయించారు. నూతన టెక్స్టైల్ విధానం-1985 ద్వారా లెసైన్సింగ్ విధానానికి సంబంధించి మిల్లు, పవర్లూమ్, హ్యాండ్లూమ్ రంగాలు, నేచురల్, సింథటిక్ ఫైబర్ల మధ్య తేడాను రద్దు చేశారు. ఎంఆర్టీపీ చట్ట నియంత్రణ నుంచి ఎలక్ట్రానిక్ పరిశ్రమలను తొలగించారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో ఫెరా (ఊౌట్ఛజీజ ఉ్ఠఛిజ్చిజ్ఛ ఖ్ఛజఠ్చ్టజీౌ అఛ్టి) కంపెనీల ప్రవేశాన్ని కూడా సరళతరం చేశారు. ఎగుమతి - దిగుమతి విధానం-1985 ద్వారా ఎగుమతి ఉత్పత్తి బేస్ను పటిష్టపరచడం, సాంకేతిక పరిజ్ఞానం పెంపునకు అవకాశాలు కల్పించడం, దిగుమతుల అందుబాటును వేగవంతం, సులభతరం చేయడం లాంటి చర్యలు తీసుకున్నారు.ఏడో పంచవర్ష ప్రణాళిక అమలు దిశగా 1985లో దీర్ఘకాల కోశ విధానాన్ని ప్రకటించారు. రెండో దశ ఆశించిన ఫలితాలను సాధించడంలో మొదటి దశ ఆర్థిక సంస్కరణలు విఫలమయ్యాయి. వాణిజ్య శేషంలో లోటు ఆరోపంచవర్ష ప్రణాళికలో రూ.5,935 కోట్లు కాగా, ఏడో పంచవర్ష ప్రణాళికలో రూ.10,841 కోట్లకు పెరిగింది. మరోవైపు అదృశ్య ఖాతా (ఐఠిజీటజీఛ్ఛ ్చఛిఛిౌఠ్ట)లో రాబడులు తగ్గాయి. తద్వారా భారత్లో వాణిజ్య చెల్లింపుల శేషం సంక్షోభం తలెత్తింది. ఈ స్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ల నుంచి 7 బిలియన్ డాలర్ల రుణాన్ని కోరింది. రుణాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్ అంగీకరిస్తూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో అంతర్గత, బహిర్గత విశ్వాసాన్ని పెంపొందించేందుకు పీవీ నరసింహారావు ప్రభుత్వం 1991-92లో అనేక స్థిరీకరణ చర్యలు ప్రవేశపెట్టింది. వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం, వినిమయ రేటులో 22 శాతం సర్దుబాటు, విదేశీ వాణిజ్య విధానాన్ని సరళీకరించడం, సులభతరం చేయడం, ద్రవ్యలోటు తగ్గింపుతోపాటు ఆర్థిక విధానంలో భాగంగా ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రారంభించింది. 2వ దశ ఆర్థిక సంస్కరణలు- విధానపర చర్యలు 1990-91లో ఉన్న ద్రవ్యలోటు 8.4 శాతాన్ని (జీడీపీలో) తగ్గించేందుకు ప్రభుత్వం అనేక ద్రవ్యపర చర్యలు చేపట్టింది. ప్రభుత్వ వ్యయంపై నియంత్రణలు విధించడంతోపాటు పన్ను, పన్నేతర రాబడి పెంపునకు చర్యలు తీసుకుంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ద్రవ్య క్రమశిక్షణను విధించింది. సబ్సిడీల తగ్గింపు, సమర్థ వ్యయ వ్యవస్థను అభివృద్ధి పరచడం, రాష్ర్ట ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచే విధంగా రాష్ర్ట ప్రభుత్వాలను ప్రోత్సహించడం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు బడ్జెటరీ మద్దతును ఉపసంహరించుకోవడం ద్వారా వాటిలో సమర్థత, లాభదాయకతల పెంపు వంటి చర్యలు తీసుకున్నారు. దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడంతో పాటు వాణిజ్య చెల్లింపుల శేషం స్థితిని మెరుగుపర్చేందుకు కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబించారు. సబ్సిడీలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు తగ్గించేందుకు, సరళమైన ధరల నిర్మాణతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక వస్తువులు, ఉత్పాదితాల పాలిత ధరలను పెంచింది. మార్కెట్ శక్తులకు అనుగుణంగా ధరను నిర్ణయించుకొనే స్వేచ్ఛను ప్రభుత్వ రంగ సంస్థలకు కల్పించింది. చెల్లింపుల శేషంలోని కరెంట్ అకౌంట్ లోటును తగ్గించేందుకు ప్రభుత్వం దిగుమతుల తగ్గింపు చర్యలను పాటించింది. పారిశ్రామిక విధానంలో అవసరమైన సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు 1991 జూలై 24న ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. పారిశ్రామిక విధాన సంస్కరణల్లో భాగంగా చేపట్టిన చర్యలు కింది విధంగా ఉన్నాయి. పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించి భద్రత, వ్యూహాత్మక లేదా పర్యావరణ పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని మూడు అంశాలు మినహా మిగిలిన వాటి విషయంలో పారిశ్రామిక లెసైన్సింగ్ రద్దు. ప్రాధాన్యత కలిగిన 34 పరిశ్రమల్లో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆటోమేటిక్ అనుమతి. ొకేషన్ విధానంలో సరళీకరణ. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ. ట్రేడ్ అకౌంట్లో రూపాయి పూర్తి మార్పిడి (1993-94) కరెంట్ అకౌంట్లో రూపాయి మార్పిడి (1994-95) మూలధన అకౌంట్లో రూపాయి పాక్షిక మార్పిడి (1996-97) సర్దుబాటు ప్రక్రియలో భాగంగా పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రాథమిక విద్య, గ్రామీణ తాగునీటి సరఫరా, ఉపాంత, చిన్నతరహా రైతులకు ఆర్థిక సహాయం, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలతోపాటు అవస్థాపన, ఉపాధి కల్పనా కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది. గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం, వృద్ధాప్య పింఛన్లు, మెటర్నిటీ బెనిఫిట్స్, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు సంబంధించిన పథకాల విషయంలో గ్రూప్ ఇన్సూరెన్స కల్పించడానికి ప్రభుత్వం 1995-96 బడ్జెట్లో జాతీయ సామాజిక ఆర్థిక పథకాన్ని ప్రకటించింది. నూతన ఆర్థిక విధానంపై అనుకూల వాదనలు ఆసియాన్ దేశాలైన సింగపూర్, మలేసియా, హాంకాంగ్, దక్షిణ కొరియాల ఆర్థిక వృద్ధిరేటుకు సమాన వృద్ధిని భారత్ (7.5 శాతానికి పైగా) సాధించడం. అంతర్జాతీయ మార్కెట్లో దేశ పారిశ్రామిక రంగ ఉత్పత్తులకు సంబంధించి పోటీతత్వం పెరగడం. ఆదాయం, సంపదల పంపిణీలో పేదరిక తీవ్రత, అసమానతలు తగ్గడం. నూతన ఆర్థిక విధానం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల సమర్థత, లాభదాయకత పెంపొందడం. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సంస్కరణలు తోడ్పడటం. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంలో పెరుగుదల. బడ్జెట్లో ద్రవ్యలోటు తగ్గుదల. విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో అసమతౌల్యం నివారణ. లోటు బడ్జెట్ తగ్గుదల. ప్రభుత్వ వ్యయ పరిమాణం తగ్గుదల. సప్లయ్ యాజమాన్యం ద్వారా నూతన ఆర్థిక విధానం ద్రవ్యోల్బణ నియంత్రణకు దోహదపడింది. నూతన ఆర్థిక విధానం - ప్రతికూల వాదనలు పారిశ్రామిక, వాణిజ్యం, సేవా రంగాలతో పోల్చితే వ్యవసాయ రంగాన్ని నూతన ఆర్థిక విధానం నిర్లక్ష్యం చేసింది. భారతదేశం ప్రపంచ ఆర్థిక సంస్థల ఒత్తిళ్లకు తలొగ్గి, సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను ప్రవేశపెట్టింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్మరించడం ద్వారా విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. నూతన ఆర్థిక విధానం శ్రామికుల వేతనాల్లో వ్యత్యాసాలకు దారితీసి ఆదాయ అసమానతలను పెంచింది. ఎగ్జిట్ విధానం ద్వారా దేశంలో నిరుద్యోగం పెరిగింది. ప్రైవేటు రంగానికి అధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా దేశంలో సాంఘిక రంగం నిర్లక్ష్యానికి గురైంది. విలాసవంతమైన వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించడం వల్ల వినిమయతత్వానికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు బలపడేందుకు నూతన ఆర్థిక సంస్కరణలు కారణమయ్యాయి. ధరలు, ద్రవ్యలోటు పెరుగుదల, సబ్సిడీలను నియంత్రించడం, ప్రభుత్వ ప్రణాళికేతర వ్యయంలో పెరుగుదలను నియంత్రించడం వంటి అంశాల్లో నూతన ఆర్థిక సంస్కరణలు విఫలమయ్యాయి. 2వ తరం ఆర్థిక సంస్కరణలు 2001-02 బడ్జెట్లో రెండో తరం ఆర్థిక సంస్కరణలకు సంబంధించి సమగ్ర ఎజెండాలో భాగంగా కింది వ్యూహాలను అవలంబించాలని భావించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలను వేగవంతం చేయడం ద్వారా ఆహార ఆర్థిక వ్యవస్థ (ఊౌౌఛీ ఉఛిౌౌఝడ) యాజమాన్యం. అవస్థాపన సౌకర్యాలపై పెట్టుబడి పెంపు. విత్త, మూలధన రంగంలో సంస్కరణల కొనసాగింపు. నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేయడం. విద్యా అవకాశాలను పెంపొందించడం, సాంఘిక భద్రతా పథకాలను అమలుచేయడం ద్వారా మానవాభివృద్ధి. అనుత్పాదక వ్యయంపై కఠిన నియంత్రణ, ప్రభుత్వ వ్యయ నాణ్యత పెంపు. ప్రభుత్వ రంగ సంస్థల పునర్నిర్మాణం, ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం. ట్యాక్స్ బేస్లను విస్తృతం చేయడం ద్వారా రెవెన్యూ పెంపు. అన్ని స్థాయిల్లో అమలు 2002-03 బడ్జెట్ ఈ విధానాలను అన్ని స్థాయిల్లో అమలుపరచాలని పేర్కొంది. సమగ్ర వ్యూహాన్ని అవలంబించడం ద్వారా రాష్ట్రాల స్థాయిలో ఈ ప్రక్రియను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. వ్యవసాయ, ఆహార ఆర్థిక వ్యవస్థ సంస్కరణలకు ప్రాధాన్యమిస్తూ కొనసాగించడం. అవస్థాపనా రంగంపై ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడుల పెంపు. విత్త రంగం, మూలధన మార్కెట్ను పటిష్ట పరచడం. అధిక పారిశ్రామికాభివృద్ధి, నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేయడం. పేద వర్గాల ప్రజలకు సాంఘిక భద్రత. పన్ను సంస్కరణలను ఏకీకృతం చేయడం, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల స్థాయిలో విత్త సర్దుబాటును కొనసాగించడం. -
ధర్మ చక్ర పరివర్తనం అంటే?
నూతన మతాల ఆవిర్భావం క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన మతాలు ప్రపంచ చరిత్ర భవితవ్యాన్ని మార్గనిర్దేశం చేశాయి. ఇవి తమ ఆధునిక, విప్లవాత్మక భావాలతో అప్పటి వరకూ ఉన్న సామాజిక కట్టుబాట్లను, వ్యత్యాసాలను తీవ్రంగా వ్యతిరేకించాయి. వీటికి ఆద్యులు సోక్రటీస్(గ్రీస్), జొరాస్టర్ (పర్షియా), కన్ఫ్యూషియస్, లావోత్సే (చైనా), రుషభనాథుడు, గౌతమ బుద్ధుడు (భారత్). వీరు ఆచరణీయ విలువలను ప్రబోధించే కొత్త మతాలను స్థాపించి ప్రజల్లో తాత్విక ఆలోచనలను పెంపొందించడానికి కృషి చేశారు. జైన, బౌద్ధ మతాలు విగ్రహారాధనను, పూజాసంస్కా రాలను, బ్రాహ్మణాధిపత్యాన్ని తిరస్కరించాయి. జైన మతం జైనమత ప్రచారకులను తీర్థంకరులు అంటారు. మొదటి తీర్థంకరుడైన రుషభనాథుడు ఈ మతాన్ని స్థాపించాడు. పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. చివరి (24వ) తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు జైనమత అభివృద్ధికి తన బోధనలతో విశేషంగా కృషిచేసి ప్రజాబాహుళ్యంలో ప్రత్యేక స్థానాన్ని పొందాడు. వర్ధమాన మహావీరుడు (క్రీ.పూ. 540-468) మహావీరుడు వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జన్మించాడు. జ్ఞాత్రిక క్షత్రియ వంశీ యులైన సిద్ధార్థుడు, త్రిశాల ఇతని తల్లిదండ్రులు. భార్య యశోద, కూతురు ప్రియదర్శిని. కుటుంబ సుఖాలను వదిలి జినత్వం కోసం 12 ఏళ్లు తపస్సు చేసి, జినుడయ్యాడు. జినుడు అంటే కోర్కెలను జయించినవాడు. దీన్నే జ్ఞానోదయంగా పేర్కొంటారు. ఈ జినులే జైనులుగా ప్రసిద్ధి చెందారు. వీరి మతాన్ని జైనమతంగా పిలుస్తున్నారు. వర్ధమానుడు తన 72వ ఏట పావాపురిలో నిర్యాణం చెందాడు. జైనమత సూత్రాలు వీటిని పంచవ్రతాలుగా పిలుస్తారు. అవి.. 1. సత్యం 2. అహింస 3. ఆస్తేయం (ఇతరుల ఆస్తిని దొంగిలించకూడదు) 4. అపరిగ్రహం (అవసరానికి మించి ఆస్తి సంపాదించకూడదు) 5. బ్రహ్మచర్యం. వీటిలో మొదటి నాలుగు సూత్రాలను పార్శ్వనాథుడు ప్రవచించగా 5వ సూత్రాన్ని మహావీరుడు ప్రబోధించాడు. ఠి జైనమత ప్రధాన నియమాలు 3. వీటిని త్రిరత్నాలు అంటారు. అవి... 1. సమ్యక్ దర్శనం 2. సమ్యక్ జ్ఞానం 3. సమ్యక్ క్రియ. మత బోధనలపై విశ్వాసం కలిగి ఉండటమే సమ్యక్ దర్శనం. వాటిలోని సత్యాన్ని గ్రహించడమే సమ్యక్ జ్ఞానం. వాటిని పాటించడమే సమ్యక్ క్రియ. వీటిని అనుసరించినవారు మోక్షానికి అర్హులవుతారని జైనుల నమ్మకం. జైనమత పవిత్ర గ్రంథాలను అంగాలు అంటారు. ఈ మతం.. హిందూ మతానికి దగ్గరగా ఉంటుంది. మహావీరుడు వర్ణవ్యవస్థను పూర్తిగా ఖండించలేకపోయాడు. అది పూర్వజన్మ సుకృతంగా అభిప్రాయపడ్డాడు. జైనమత వ్యాప్తి కోసం జైన సంఘాన్ని స్థాపించాడు. మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక, నంద వంశ రాజులు, మౌర్యరాజైన సంప్రతి చంద్రగుప్తుడు జైనమతాన్ని ఎక్కువగా ఆదరించారు. పాటలీపుత్రంలో (క్రీ.పూ. 300లో) చంద్రగుప్తుడు.. శ్రావణ బెళగొళ (కర్ణాటక)కు తన గురువు భద్రబాహుతో కలిసి వెళ్లాడు, అక్కడ సల్లేఖన (ఉపవాస) వ్రతాన్ని పాటించి కన్నుమూశాడు. జైన సాహిత్యం ప్రాకృత, కన్నడ భాషలో లభిస్తుంది. జైన మతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఉదయగిరి (ఒడిశా), ఎల్లోరా (మహారాష్ట్ర) ల్లో జైన గుహలున్నాయి. మన రాష్ట్రంలో కొలనుపాక (నల్గొండ జిల్లా)లో జైన దేవాలయం ఉంది. మౌంట్ అబూ శిఖరం (రాజస్థాన్) పైనున్న దిల్వారా జైన దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. శ్రావణ బెళగొళ (కర్ణాటక)లోని గోమఠేశ్వరుని విగ్రహం జైనమత శిల్పకళకు ప్రతీక. జైన సిద్ధాంతాలు కఠినంగా, ఆచరణకు దూరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే జైనుల్లో శ్వేతాంబరులు (తెల్లని వస్త్రాలు ధరించేవారు), దిగంబరులు (వస్త్రాలు ధరించని వారు) అనే రెండు శాఖలు ఏర్పడ్డాయి. వీరి మధ్య ఐక్యత కోసం ఖారవేలుడు (కళింగరాజు) ఒక సమావేశం ఏర్పాటు చేసి విఫలుడయ్యాడు. బౌద్ధమతం వర్ధమాన మహావీరుడి సమకాలీనుడైన గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించాడు. కపిలవస్తు నగరంలోని లుంబినీ వనంలో బుద్ధుడు జన్మించాడు. శాక్యరాజైన శుద్ధోదనుడు, మాయాదేవి అతని తల్లిదండ్రులు. బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. చిన్నతనంలో తల్లి చనిపోవడంతో సవతి తల్లి గౌతమి ప్రజాపతి బుద్ధుడిని పెంచింది. అందువల్ల అతనికి గౌతముడు అని పేరు వచ్చింది. గౌతముడి భార్య యశోధర, కుమారుడు రాహులుడు. బుద్ధుడు తన 29వ ఏట జీవిత పరమార్థం తెలుసుకున్నాడు. రాజ భోగాలను వదిలి మోక్షం కోసం బయలుదేరాడు. దీన్నే మహాభినిష్ర్కమణం అంటారు. ఇందులో భాగంగా వైశాలి, రాజగృహ నగరాల్లో పండితులను కలిశాడు. చివరికి గయ సమీపంలో బోధివృక్షం కింద 40 రోజులు ధ్యానం చేసి జ్ఞానోదయం పొందాడు. దీన్నే సంబోధిని అంటారు. అప్పటి నుంచి గౌతముడు (సిద్ధార్థుడు) బుద్ధుడిగా మారాడు. గౌతమబుద్ధుడు వారణాసి సమీపంలో ఉన్న మృగదావనం (సార్నాథ్) చేరి 5మంది పండితులకు ప్రథమంగా జ్ఞానబోధ చేశాడు. దీన్ని ధర్మచక్ర పరివర్తనంగా పిలుస్తారు. కుశి నగరంలో క్రీ.పూ. 483లో నిర్యాణం చెందాడు. బౌద్ధమత సూత్రాలు బౌద్ధమత సూత్రాలు 4. వీటిని ఆర్యసూత్రాలు అంటారు. అవి.. 1. {పపంచం దుఃఖమయం 2. దుఃఖానికి కోరికలే కారణం 3. కోరికలను జయించడం ద్వారా దుఃఖం నశిస్తుంది. 4. కోరికలను జయించడానికి అష్టాంగమార్గాన్ని ఆచరించాలి. అష్టాంగ మార్గంలో 8 నీతి సూత్రాలు ఉన్నాయి. అవి.. 1. సరైన వాక్కు (మాట) 2. సరైన క్రియ (పని) 3. సరైన జీవనం 4. సరైన శ్రమ (కష్టం) 5. సరైన ఆలోచన 6. సరైన ధ్యానం, 7. సరైన నిర్ణయం 8. సరైన దృష్టి (చూపు) వీటిని ఆచరించినవారు ప్రశాంతతను పొందుతారని బౌద్ధమతం ప్రబోధిస్తుంది. బౌద్ధమత గ్రంథాలను త్రిపీఠకాలు అంటారు. వీటిని ప్రాకృత భాషలో రాశారు. బౌద్ధ మతం విస్తృతంగా వ్యాపించింది. గొప్ప చక్రవర్తులు దీన్ని ఆదరించారు. దీంతో శ్రీలంక, బర్మా, చైనా, టిబెట్, జపాన్ల్లోనూ బౌద్ధ మతం వ్యాప్తి చెందింది. బౌద్ధులు స్థాపించిన నలంద, వల్లభి, ధాన్యకటక విశ్వవిద్యాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. వైద్య శాస్త్రజ్ఞులైన చరకుడు, జీవకుడు, బౌద్ధమతాన్ని ఆచరించారు. బౌద్ధమత ఆచార్యుడైన నాగార్జునుడు సుహృల్లేఖ, రస రత్నావళి అనే గ్రంథాలను రచించాడు. మహారాష్ట్రలోని కార్లీ, నాసిక్, అజంతా గుహల్లో, బార్హుత్, సాంచి, అమరావతి, నాగార్జున కొండల్లో బౌద్ధ ఆరామాలు, గుహాలయాలు, మనోహర శిల్పాలు ఉన్నాయి. గౌతమ బుద్ధుడి నిర్యాణం తర్వాత అశోక చక్రవర్తి బౌద్ధమత వ్యాప్తి కోసం విశేషంగా కృషిచేసి.. దాన్ని జాతీయ ధర్మంగా, అంతర్జాతీయ మతంగా రూపొందించాడు. శాంతి, అహింసలను ప్రచారం చేసిన బౌద్ధం.. వర్ణ వ్యవస్థను ఖండించింది. అందరూ సమానమనే నీతిని, విశ్వ శాంతిని కాంక్షించింది. బౌద్ధ సంఘ సమావేశాలు బౌద్ధమత సంఘ సమావేశాలను సంగీతులుగా పిలుస్తారు. మొదటి సంగీతి (క్రీ.పూ.483): రాజగృహలో అజాత శత్రువు నిర్వహించాడు. దీనికి మహాకాశ్యపుడు అధ్యక్షుడు. ఈ సంగీతిలో సుత్త, వినయ పీఠకాలను సంకలనం చేశారు. రెండో సంగీతి (క్రీ.పూ. 383): వైశాలిలో కాలాశోకుడు నిర్వహించాడు. దీనికి సభకామి అధ్యక్షుడు. ఈ సంగీతిలో బౌద్ధ సంఘం రెండు శాఖలుగా(థేరవాదులు, మహాసాంఘికులు)గా విడిపోయింది. మూడో సంగీతి (క్రీ.పూ. 250): దీన్ని అశోకుడు పాటలీపుత్రంలో నిర్వహించాడు. దీనికి మొగలిపుత్త తిస్స అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో అభిదమ్మ పీఠకాన్ని రూపొందించారు. నాలుగో సంగీతి (క్రీ.శ.72): కాశ్మీర్లోని కుందలవనంలో కనిష్కుడు నిర్వహించాడు. వసుమిత్రుడు అధ్యక్షుడు. ఈ సంగీతిలో బౌద్ధమతం.. మహాయాన, హీనయాన శాఖలుగా విడిపోయింది.నాలుగో బౌద్ధ సంగీతి తర్వాత బౌద్ధమతంలో తీవ్రమైన మార్పు సంభవించింది. మహాయాన బౌద్ధం అవలంబించినవారు బుద్ధుడిని ఆరాధించారు. విగ్రహాలు ప్రతిష్టించారు. హీనయానులు మాత్రం దీనికి వ్యతిరేక పద్ధతులను పాటించారు. వేద నాగరికతలోని వైదిక బ్రాహ్మణ క్రతువులైన విగ్రహారాధన, పూజా విధానాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన బౌద్ధమతంలో తిరిగి మహాయానుల ద్వారా వాటినే బౌద్ధంలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మహాయాన శాఖ అభివృద్ధిలో ముందుంది. మహాయాన బౌద్ధాన్ని ప్రచారం చేసిన వారిలో ఆచార్య నాగార్జునుడు ప్రముఖుడు. -
మాతృ భాషల్లో డిజిటల్ టెక్నాలజీ
సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్నా..రైతులు, నిరక్షరాస్యులు మాత్రం ఆ ఫలాలు అందుకోలేకపోతున్నారని గుర్తించాడో 30 ఏళ్లయువకుడు. దీనికి కారణమైన అంతరాలను తొలగించి సాంకేతికతను సామాన్యులకు చేరువ చేయాలని కలలుకన్నాడు. అందరికీ అర్థమయ్యేలా మాతృభాషల్లో సాఫ్ట్వేర్ను రూపొందించాడు.ఆయనే యునిఫోర్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ సీఈవో.. ఉమేశ్ సచ్దేవ్. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్.. ప్రపంచాన్ని మారుస్తున్న (10 మిలినియల్స్) వ్యక్తుల జాబితా-2016లోఉమేశ్కు చోటు కల్పించింది.ఈ నేపథ్యంలో ఆయనతో ఇంటర్వ్యూ.. ఇప్పుడిప్పుడే స్టార్టప్ రంగంవైపు అడుగులేస్తున్న రేపటి కార్పొరేట్స్కు నేనిచ్చే సలహా.. నేటి ఆధునిక ప్రపంచంలో అవకాశాలకు కొదవలేదు. కానీ వాటిని అందిపుచ్చుకుని, భావి వ్యాపారవేత్తలుగా ఖ్యాతి గడించాలంటే మీకొచ్చిన ఆలోచన దేశ తలరాతను మార్చేదిగా, నేటి యువతరాన్ని ఆకట్టుకునేదిగా ఉండాలి. అంతేకాకుండాప్రయాణంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, విజయానికి చేరువ కావాలంటే అనేక మార్గాలుంటాయని విశ్వసించాలి. అప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు మన దేశ కీర్తిప్రతిష్టలను ముందుకు తీసుకె ళ్లగలరు. మాది కార్పొరేట్ లీడర్స్ కుటుంబం. నాన్న టాటా గ్రూప్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవారు. ఇంట్లో ఎప్పుడూ కార్పొరేట్ వాతావరణం ఉండటంతో నాక్కూడా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. సరిగ్గా అప్పుడే (2005-07) మన దేశంలో స్టార్టప్లపై ఆసక్తి మొదలైంది. ఆ సమయంలో నేను జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నోయిడా)లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. నా స్నేహితుడు రవితో కలిసి 2006లో ‘సింగులారిస్’ అనే సంస్థను ప్రారంభించా. పొగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాక్ చేసి పట్టుకోవడమే మా పని. ఆ సమయంలో కుటుంబ సభ్యులందించిన ప్రోత్సాహం మరువలేనిది. అయితే మార్కెట్ పరిస్థితులు, సంస్థ పనితీరు మేమనుకున్నంత ఆశాజనకంగా లేకపోవడంతో రెండేళ్లకే మా ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. దారి చూపిన ఆశాదీపం.. ఎలాగైనా మానవ జీవన గమనాన్ని మార్చే వినూత్న టెక్నాలజీని తయారు చేయాలన్న లక్ష్యంతో సలహాలు, సూచనలు అందించాల్సిందిగా చాలా మంది పెద్దలను కలిసినా సరైన ప్రోత్సాహం లభించలేదు. ఆ సమయంలో ఐఐటీ-మద్రాస్లో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ ఝన్ఝన్వాలా ఎంతో సహకరించారు. ఆయన ప్రోత్సాహంతోనే ఐఐటీ-మద్రాస్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లో ‘యునిఫోర్’ సంస్థను ఏర్పాటుచేశాం. తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యకు సాంకేతికతతో పరిష్కారం చూపాలనుకున్నాం. రైతులు, నిరక్షరాస్యులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి రెండు నెలలపాటు తమిళనాడులోని అనేక మారుమూల గ్రామాల్లో తిరిగి ఒక ప్రధానమైన సమస్యను గుర్తించాం. అదే భాషావరోధం.! నేటి డిజిటల్ యుగంలో కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ల వినియోగం సర్వసాధారణమై పోయింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులే ఉంటున్నారు. వీరికి ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకపోవడంతో అనేక రకాల ఆన్లైన్ సేవలను వినియోగించుకోలేని పరిస్థితి. దీనికి కారణం భాషా అవరోధమని గుర్తించాం. ఎలాగైనా ఈ భాషాంతరాలను తొలగించి, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా చేయాలనుకున్నాం. రైతులు వాతావరణ సమాచారం, మార్కెట్ పరిస్థితులను తెలుసుకొని ఆర్థిక సాధికారతను పెంపొందించుకునేందుకు ఫోన్లు ఉపయోగపడాలి. దీని కోసం మాతృభాషల్లో ఆన్లైన్ వ్యవహారాలను చేసుకునేలా టెక్నాలజీని అభివృద్ధి చేశాం. ఈ మూడింటిపైనే దృష్టి.. యునిఫోర్ ప్రధానంగా వాయిస్ టెక్నాలజీస్ అయిన స్పీచ్ రికగ్నేషన్, వాయిస్ బయోమెట్రిక్స్, వాయిస్ అసిస్టెంట్పైనే దృష్టిపెడుతోంది. మొదట్లో ఈ టెక్నాలజీని మన దేశంలోని గ్రామీణ ప్రజలు, నిరక్షరాస్యులు ఉపయోగించుకుంటే చాలనుకున్నాం. కానీ నేడు మన దేశంతోపాటు ఫిలిప్పీన్స్, సింగపూర్, మలేషియాతోపాటు పశ్చిమాసియా దేశాలు సైతం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. త్వరలో చైనీస్ మార్కెట్పై కూడా దృష్టిపెట్టబోతున్నాం. ప్రస్తుతం ఈ టెక్నాలజీ 16 భారతీయ భాషలు, 150 ప్రాంతీయ మాండలికాలతోపాటు 70 అంతర్జాతీయ భాషల్లో సేవలందిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాం, ఏవియేషన్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్కేర్, రిటైల్ సెక్టార్లలో ఈ టెక్నాలజీ సేవలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఆర్థికంగానూ దినదినాభివృద్ధి చెందుతున్న యునిఫోర్ సంస్థ.. మానవ వనరుల ఎంపికలోనూ వినూత్నంగా వ్యవహరిస్తోంది. స్పష్టమైన లక్ష్యం, సృజనాత్మకత ఉండి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసంతో పనిచేయగలిగిన వారినే ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటున్నాం. 2019 నాటికి 1.33 బిలియన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఇప్పుడిప్పుడే స్పీచ్ అనలిటిక్స్, వాయిస్ బయోమెట్రిక్స్పై దృష్టిసారిస్తున్నాయి. 2019 నాటికి ఈ మార్కెట్ 1.33 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇటీవల ఓ సర్వే సంస్థ స్పీచ్ అనలిటిక్స్పై ప్రపంచవ్యాప్తంగా 500 మంది పేరొందిన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల అభిప్రాయాలను కోరగా దీనివల్ల ప్రజలకు నాణ్యమైన సేవలందుతాయని 72 శాతం మంది.. డబ్బు ఆదా అవుతుందని 68 శాతం మంది.. ప్రజల ఆర్థిక, సాంకేతిక పురోభివృద్ధికి తోడ్పడుతుందని 52 శాతం మంది తెలిపారు. రాబోయే రెండేళ్లలో ఈ విభాగంలో అధిక సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. -
2016 టెన్నిస్ గ్రాండ్స్లామ్ విజేతలు
టెన్నిస్లో నాలుగు అతి ముఖ్యమైన టోర్నమెంట్లను ‘గ్రాండ్స్లామ్స్’ అంటారు. వీటినే ‘మేజర్స’ అని కూడా పిలుస్తారు. వీటిని ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ను జనవరిలో మెల్బోర్నలో, ఫ్రెంచ్ ఓపెన్ను మే, జూన్లలో పారిస్లో, వింబుల్డన్ను జూన్, జూలైలలో లండన్లో, యూఎస్ ఓపెన్ను ఆగస్టు, సెప్టెంబర్లలో న్యూయార్కలో నిర్వహిస్తారు. ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టోర్నమెంట్లను హార్డ కోర్టలపై,ఫ్రెంచ్ ఓపెన్ను క్లే కోర్టపై ఆడతారు. వింబుల్డన్ను మాత్రమే పచ్చికపై నిర్వహిస్తారు.ఈ నాలుగింటిలో వింబుల్డన్ అత్యంత పురాతనమైంది. దీన్ని 1877లో ప్రారంభించారు. యూఎస్ ఓపెన్ను 1881 నుంచి, ఫ్రెంచ్ ఓపెన్ను 1891 నుంచి, ఆస్ట్రేలియన్ ఓపెన్ను1905 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ నాలుగు మేజర్ చాంపియన్షిప్లను ఒకే కేలండర్ సంవత్సరంలో సాధిస్తే ఆ ఘనతను గ్రాండ్స్లామ్గా అభివర్ణిస్తారు. వరుసగా నాలుగు టోర్నమెంట్లను రెండు వేర్వేరు సంవత్సరాల్లో గెలిస్తే దాన్ని ‘నాన్ కేలండర్ ఇయర్ గ్రాండ్స్లామ్’ గా వ్యవహరిస్తారు. ఒక టెన్నిస్ క్రీడాకారుడు తన కెరీర్లో ఈ నాలుగు మేజర్లను గెలిస్తే దాన్ని ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ అంటారు. ఒకే కేలండర్ సంవత్సరంలో నాలుగు మేజర్లతోపాటు ఒలింపిక్స్లో స్వర్ణ పతకం కూడా సాధిస్తే అది ‘గోల్డెన్ గ్రాండ్స్లామ్’ లేదా ‘గోల్డెన్ స్లామ్’. గ్రాండ్స్లామ్ విజేతలు టెన్నిస్ చరిత్రలో సింగిల్స్లో ఒకే కేలండర్ ఇయర్లో గ్రాండ్స్లామ్ సాధించిన వ్యక్తులు కేవలం ఐదుగురు. వీరిలో రాడ్ లేవర్ ఈ ఘనతను రెండుసార్లు సాధించాడు. నాన్ కేలండర్ ఇయర్ గ్రాండ్స్లామ్ పురుషుల సింగిల్స్లో ఈ ఘనతను సెర్బియాకు చెందిన నొవాక్ జొకోవిచ్ సాధించాడు. ఇతడు 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టోర్నమెంట్లు, 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్లో మార్టినా నవ్రతిలోవా (1983- 84), స్టెఫీగ్రాఫ్ (1993-94), సెరెనా విలియమ్స్ (2002-03, 2014-15)లు నాన్ కేలండర్ ఇయర్ గ్రాండ్స్లామ్ సాధించారు. కెరీర్ గ్రాండ్స్లామ్ 8 మంది పురుష క్రీడాకారులు సింగిల్స్లో కెరీర్ గ్రాండ్స్లామ్ సాధించారు. వీరు ఫ్రెడ్ పెర్రీ, డాన్ బడ్జ, రాడ్ లేవర్, రాయ్ ఎమర్సన్, ఆండ్రీ అగస్సీ, రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నొవాక్ జొకోవిచ్. 10 మంది మహిళలు సింగిల్స్లో కెరీర్ గ్రాండ్స్లామ్ సాధించారు. వారు మౌరీన్ కనోలీ, డోరిస్ హార్ట, షిర్లీ ఫ్రై ఇర్విన్, మార్గరెట్ కోర్ట, బిల్లీ జీన్ కింగ్, క్రిస్ ఎవర్ట, మార్టినా నవ్రతిలోవా, స్టెఫీగ్రాఫ్, సెరెనా విలియమ్స్, మరియా షరపోవా. గోల్డెన్ స్లామ్ టెన్నిస్లో గోల్డెన్ స్లామ్ సాధించిన ఏకైక వ్యక్తి స్టెఫీగ్రాఫ్. ఆమె 1988లో నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లతో పాటు సియోల్ ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2016 పురుషుల సింగిల్స్: సెర్బియా క్రీడాకారుడు నొవాక్ జొకోవిచ్ బ్రిటన్కు చెందిన ఆండీ ముర్రేను ఓడించి ఈ ఏడాదిలో జరిగిన తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ను గెలుచుకున్నాడు. ఇది అతడికి ఆరో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. గతంలో జొకోవిచ్ 2008, 2011, 2013, 2014, 15లో ఈ టైటిల్ సాధించాడు. ఈ గెలుపుతో ఆస్ట్రేలియాకు చెందిన రాయ్ ఎమర్సన్ పేరిట ఉన్న అత్యధిక ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ (ఆరు) రికార్డును సమం చేశాడు. మహిళల సింగిల్స్: జర్మనీ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్, అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్పై విజయం సాధించి తన కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ను సాధించింది. ఈ టైటిల్ విజయంతో కెర్బర్ 1999లో స్టెఫీగ్రాఫ్ తర్వాత ఓ గ్రాండ్స్లామ్ టైటిల్ నెగ్గిన జర్మన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. పురుషుల డబుల్స్: జేమీ ముర్రే (బ్రిటన్), బ్రూనో సోరస్ (బ్రెజిల్)ల జోడి.. డేనియల్ నెస్టర్ (కెనడా) రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)లను ఫైనల్లో ఓడించింది. మహిళల డబుల్స్: సానియా మీర్జా (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)లు చెక్ రిపబ్లిక్కు చెందిన ఆండ్రియా హ్లవకోవా, లూసీ హ్రదెకాలను ఓడించి టైటిల్ను కైవసం చేసుకున్నారు. ఇది వీరికి వరుసగా మూడో గ్రాండ్స్లామ్ టైటిల్. ఈ జోడీ 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్లను సాధించింది. మిక్స్డ్ డబుల్స్: ఎలీనా వెస్నినా (రష్యా), బ్రూనో సోరస్ (బ్రెజిల్)ల జంట.. కోకో వందెవెఘె (అమెరికా) హొరియా టెకావు (రుమేనియా)లను ఓడించింది. ఫ్రెంచ్ ఓపెన్-2016 పురుషుల సింగిల్స్: సెర్బియా క్రీడాకారుడు నొవాక్ జొకోవిచ్ 2016 జూన్ 5న పారిస్లోని రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో బ్రిటన్ క్రీడాకారుడు ఆండీ ముర్రేను ఓడించి తన తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఈ విజయంతో జొకోవిచ్ కెరీర్ గ్రాండ్స్లామ్ను పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా నాన్ కేలండర్ ఇయర్ గ్రాండ్స్లామ్ను కూడా సాధించాడు. జొకోవిచ్కు ఇది 12వ గ్రాండ్స్లామ్ టైటిల్. మహిళల సింగిల్స్: స్పెయిన్ క్రీడాకారిణి గార్బైన్ ముగురుజా తన తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించింది. ఫైనల్లో అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ను ఓడించింది. పురుషుల డబుల్స్: స్పెయిన్కు చెందిన లిసియానో లోపెజ్, మార్క లోపెజ్లు.. అమెరికన్ జంట.. మైక్ బ్రయాన్, బాబ్ బ్రయాన్లను ఓడించి పురుషుల డబుల్స్ టైటిల్ సాధించారు. మహిళల డబుల్స్: క్రిస్టినా మ్లాథెనోవిక్, కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్)లు ఎకతెరినా మకరోవా, ఎలీనా వెస్నినా (రష్యా)లను ఓడించారు. మిక్స్డ్ డబుల్స్: లియాండర్ పేస్ (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)ల జంట.. ఫైనల్లో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా), సానియా మీర్జా (భారత్) జంటను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఇది లియాండర్ పేస్కు 18వ గ్రాండ్స్లామ్ టైటిల్ (ఎనిమిది పురుషుల డబుల్స్, 10 మిక్స్డ్ డబుల్ టైటిల్స్) యూఎస్ ఓపెన్ -2016 పురుషుల సింగిల్స్: స్విట్జర్లాండ్కు చెందిన స్టానిస్లాస్ వావ్రింకా, సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్ను ఓడించి యూఎస్ ఓపెన్ టైటిల్ను సాధించాడు. ఇది వావ్రింకాకు తొలి యూఎస్ ఓపెన్ టైటిల్, మూడో గ్రాండ్స్లామ్ టైటిల్. మహిళల సింగిల్స్: జర్మనీ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్.. చెక్ రిపబ్లిక్కు చెందిన కరోలినా ప్లిస్కోవాను ఫైనల్లో ఓడించి తన తొలి యూఎస్ ఓపెన్ టైటిల్ను సాధించింది. పురుషుల డబుల్స్: బ్రూనో సోరస్ (బ్రెజిల్), జేమీ ముర్రే (బ్రిటన్)లు.. పాబ్లో కరెనో బస్టా, గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెయిన్)లను ఓడించారు. మహిళల డబుల్స్: బెతానీ మాటెక్ శాండ్స్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)లు.. కరోలినా గార్సియా (ఫ్రాన్స్), క్రిస్టీనా మ్లదెనోవిచ్ (ఫ్రాన్స్)లను ఓడించి మహిళల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. మిక్స్డ్ డబుల్స్: మాతె పావిక్ (క్రొయేషియా), లారా సిగ్మండ్ (జర్మనీ)ల జోడి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను సాధించింది. ఫైనల్లో వీరు అమెరికాకు చెందిన రాజీవ్ రామ్, కోకో వందెవెఘెలను ఓడించారు. వింబుల్డన్ - 2016 యూఎస్ ఓపెన్ -2016 పురుషుల సింగిల్స్: 2016 జూలై 10న జరిగిన ఫైనల్లో ఆండీ ముర్రే (బ్రిటన్).. కెనడాకు చెందిన మిలోస్ రోనిక్ను ఓడించి వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇది ముర్రేకు రెండో వింబుల్డన్, మూడో గ్రాండ్స్లామ్ టైటిల్. మహిళల సింగిల్స్: అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్.. జర్మనీకి చెందిన ఏంజెలిక్ కెర్బర్ను ఫైనల్లో ఓడించి వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ను సాధించింది. ఇది సెరెనాకు ఏడో వింబుల్డన్ టైటిల్. దీంతో సెరెనా.. స్టెఫీగ్రాఫ్ 22 టైటిళ్ల రికార్డును సమం చేసింది. పురుషుల డబుల్స్: ఫ్రాన్స్కు చెందిన నికోలస్ మహుత్, పియరీ హ్యుగ్స్ హెర్బర్ట్లు అదే దేశానికి చెందిన జులియన్ బెన్నెత్యూ, ఎడ్వ్ర్డ్ రోజర్ వాసెలిన్లను ఓడించి పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. మహిళల డబుల్స్: సెరెనా, వీనస్ విలియమ్స్లు (అమెరికా).. తిమియా బాబోస్ (హంగేరీ), యారోస్లావా ష్వెదోవా (కజకిస్థాన్)లను ఓడించారు. మిక్స్డ్ డబుల్స్: హెన్రీ కొంటెనెన్ (ఫిన్లాండ్), హీదర్ వాట్సన్ (బ్రిటన్)లు.. రాబర్ట్ ఫరా (కొలంబియా), అన్నా లెనా గ్రోన్ఫీల్డ్ (జర్మనీ)లపై గెలిచారు.