తాజాగా తేజస్సుతో.. | beauty tips | Sakshi

తాజాగా తేజస్సుతో..

Mar 7 2018 12:14 AM | Updated on Mar 7 2018 12:14 AM

beauty tips - Sakshi

కొన్ని  ద్రాక్ష పండ్లను సగానికి కట్‌ చేసి, ఆ సగం ముక్కలతో ఒక దాని తర్వాత ఒకటిని ఉపయోగిస్తూ ముఖంపైన మృదువుగా రుద్దాలి. ద్రాక్షలోని ఔషధ గుణాల వల్ల మృతకణాలు సులువుగా వదిలిపోతాయి. ఎండ వల్ల కందిన చర్మం పూర్వపు స్థితికి చేరుకుంటుంది ∙టేబుల్‌ స్పూన్‌ ముడి తేనెను కొద్దిగా వేడిచేయాలి. తట్టుకోగలిగేంత వేడిగా ఉన్నప్పుడు వేళ్లతో ఆ తేనెను తీసుకొని ముఖమంతా రాయాలి. 5–10 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి ∙టేబుల్‌స్పూన్‌ తేనె, రెండు టేబుల్‌ స్పూన్‌ల మీగడ కలిపి ముఖానికి పట్టించి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి.

రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మకాంతి ఇనుమడిస్తుంది ∙పిగ్మెంటేషన్‌ వల్ల అయిన నలుపు మచ్చలు పోవాలంటే బంగాళదంపను సగానికి కోసి, ఆ ముక్కతో మృదువుగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే నలుపు తగ్గుతుంది ∙దోస రసం, గ్లిజరిన్, రోజ్‌ వాటర్‌ కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లబడిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది ఎండ వేడి నుంచి ఉపశమిస్తుంది. సన్‌స్క్రీన్‌లోషన్‌లా పనిచేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement