రంగుల ‘బతుకమ్మ’ | Padma Devender reddy to inaugurate Bathukamma art gallery exhibition at Madhapur | Sakshi
Sakshi News home page

రంగుల ‘బతుకమ్మ’

Published Sun, Oct 12 2014 4:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

రంగుల ‘బతుకమ్మ’

రంగుల ‘బతుకమ్మ’

మహిళా కళాకారుల కుంచెల నుంచి వర్ణభరితంగా జాలువారిన బతుకమ్మ చిత్రాలు కనువిందు చేశాయి. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటైన ఈ చిత్ర ప్రదర్శనను తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, జీవకళ ఉట్టిపడే చిత్రాలను రూపొందించిన మహిళా కళాకారులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు, గౌరవ పారితోషికంతో సత్కరించారు. ఈ చిత్రప్రదర్శన ఈ నెల 17 వరకు కొనసా గుతుంది.
     - మాదాపూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement