
విశాఖ-ఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ ప్రారంభం
విశాఖపట్టణం: దేశరాజధాని ఢిల్లీకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సూపర్ఫాస్ట్ రైలు ఏపీ ఎక్స్ప్రెస్ (22415) బుధవారం లాంఛనంగా విశాఖపట్నంలో ప్రారంభం అయింది. న్యూఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, అశోక్గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖ నుండి ఢిల్లీకి వారంలో మూడు రోజులు బుధ, శుక్ర, ఆది వారాల్లో నడవనుంది. ఈ నెల 15 నుంచి పూర్తిస్థాయిలో రైలు సేవలు అందుబాటులోకి వస్తామని అధికారులు తెలిపారు. ఈ రైలులో 16 ఏసీ బోగీలు ఏర్పాటు చేశారు.
షెడ్యూల్ ప్రకారం.. విశాఖపట్నంలో ఉదయం 07.45 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 7 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి సోమ, బుధ, శుక్ర వారాల్లో (22416) నంబరుతో ఉదయం 06.45 గంటలకు ఢిల్లీలో బయలుదేరే ఈ రైలు మరుసటిరోజు సాయంత్రం 06.45 గంటలకు విశాఖ చేరుకుంటుంది.