Suresh Prabhu
-
అసలు విల్లాలో ఏం జరిగింది?..ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
విజయ్, శీతల్ బట్ జంటగా తెరకెక్కిన చిత్రం 'విల్లా 369'. ఈ చిత్రానికి సురేష్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. విగన్ క్రియేషన్స్ సమర్పణలో విద్య గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు డాక్టర్ రాకేశ్ సహానిర్మాతగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను దర్శకుడు తేజ విడుదల చేశారు. అనంతరం దర్శకుడు తేజ మాట్లాడుతూ.. 'దర్శకుడు సురేష్ ప్రభు మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని తీసిన చిత్రం "విల్లా 369". సినిమా దర్శక, నిర్మాతలకు మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'. అని అన్నారు. నిర్మాత విద్య గణేష్ మాట్లాడుతూ.. ' దర్శకుడు మంచి నటీ నటులను ఎంపిక చేశారు. ఈ సినిమాకు ర్యాడీ రఫీ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. సంగీత దర్శకుడు మహావీర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.' అని అన్నారు... దర్శకుడు సురేష్ ప్రభు మాట్లాడుతూ..'ఇలాంటి మంచి కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు. అందరూ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినందునే ఈ సినిమా అనుకున్న విధంగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'. అని అన్నారు. -
నేను తెలుగు ప్రజల కజిన్ను: కేంద్ర మాజీ మంత్రి
హైదరాబాద్: తాను తెలుగు ప్రజలకు కజిన్ అని.. ఇక్కడ నుంచి తనకు రాజ్యసభ సీటు లభించింది అని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సురేశ్ ప్రభు గుర్తుచేసుకున్నారు. విశాఖ జోన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం ప్రకటించామని, దీనిపై ఎంపీలు పరిశీలిస్తున్నారని తెలిపారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ప్రజల పన్నులతోనే నడుస్తాయని అన్నారు. ప్రైవేటైజేషన్ అంటే షేర్ హోల్డర్స్కు మంచి లాభాలు ఇవ్వడానికేనని వివరించారు. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందని ప్రకటించారు. ప్రాణాలు అర్పించి కార్మాగారం తెచ్చారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో శుక్రవారం ఏర్పాటుచేసిన బీజేపీ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమని.. రెండంకెల వృద్ధి సాధ్యమని సురేశ్ ప్రభు తెలిపారు. బడ్జెట్ కరోనా కారణంగా వచ్చిన ఇబ్బంది ఎప్పుడూ రాలేదని గుర్తుచేశారు. ఈయూ, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం చూపిందని చెప్పారు. వృద్ధి రేటు కూడా తగ్గిందని.. ఈ బడ్జెట్ కొత్త వేవ్ తీసుకుని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి వస్తుంది అని భావిస్తున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం రెండింతలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.16.57లక్షల కోట్లు వ్యవసాయానికి కేటాయించారని వెల్లడించారు. సూక్ష్మ సేద్యం కోసం, ఈనామ్ ద్వారా మార్కెట్ సదుపాయాలు పెంచారని సురేష్ ప్రభు చెప్పుకొచ్చారు. రక్షణకు తాము మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. చర్చల ద్వారానే రైతు సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఒకే మార్కెట్ దేశంలో రైతులకు ఉపయోగమని, ప్రభుత్వం వారితో చర్చించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. రైతులకు తాము వ్యతిరేకం కాదని.. వారిని గౌరవిస్తామని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. -
సౌదీ పర్యటన; బీజేపీ ఎంపీ స్వీయ నిర్బంధం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు కరోనా భయాల నేపథ్యంలో స్వీయ నిర్బంధం విధించుకున్నారు. భారత్ తరపున జీ20 సదస్సు ప్రతినిధిగా ఉన్న ఆయన ఇటీవల సౌదీ అరేబియా వెళ్లొచ్చారు. వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్ అని వచ్చినప్పటికీ 14 రోజులపాటు హోమ్ క్వారైంటన్లో ఉండనున్నారు. దీంతో ఆయన పార్లమెంట్ సమావేశాలకు దూరం కానున్నారు. ఈమేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. ‘రాబోయే జీ20 సదస్సుకు సంబంధించి సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్లో మార్చి 10న నిర్వహించిన సమావేశానికి హాజరయ్యాను. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నా. రిజల్ట్ నెగటివ్గానే వచ్చింది. అయినప్పటికీ నియంత్రణ చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నా. ఐసోలేషన్ సమయం ముగిసేవరకూ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేను. పార్లమెంటు సభ్యులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా’అని సురేష్ ప్రభు లేఖలో పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. కేరళలోని ఓ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి మరళీధరన్ సైతం ఇంట్లోనే స్వీయ నిర్బంధం విధించుకున్న సంగతి తెలిసిందే. ఆయన సందర్శించిన ఆస్పత్రి వైద్యుడొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. -
వాస్తవాలు చెప్పకుండా దుష్ప్రచారం చేస్తున్నారు
సాక్షి, విజయవాడ : జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) చట్టంపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సు లో మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పాల్గొన్నారు. సురేష్ ప్రభు మాట్లాడుతూ.. జనాభా గణనకు, పౌరసత్వ చట్ట సవరణకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అస్సొం మినహా ఎన్నార్సీ మరెక్కడా అమలు కాదని పేర్కొన్నారు. కొన్ని రాజకీయపక్షాలు వాస్తవాలను బయటికి చెప్పకుండా దుష్ప్రచారంతోనే భయాందోళనలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఏళ్ల తరబడి వివాదాస్పదంగా ఉన్న పలు కీలకమైన అంశాల్లో బీజేపీ నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ప్రజలను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడతుందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్షాలు ఇప్పటికే ఎన్నార్సీ , సిఎఎ చట్టాలపై ప్రజల్లో అపోహలు తొలగిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఏ మతాన్ని, ఏ వ్యక్తిని ఉద్దేశించింది కాదని అందుకే ఈ చట్టం వల్ల దేశంలోని హిందువులకు, ముస్లింలకు ఎలాంటి ముప్పు ఉండదని వెల్లడించారు. -
జెట్ సంక్షోభంపై స్పందించిన సురేష్ ప్రభు
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించాలని పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం ఆదేశించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా, వారి భద్రతను పరిగణనలోకి తీసుకుంటూ జెట్ ఎయిర్వేస్లో సమస్యలను చక్కదిద్దేందుకు చొవర చూపాలని పౌర విమానయాన కార్యదర్శి ఖరోలాను ఆదేశిస్తూ మంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. మరోవైపు సమస్యలు చుట్టుముట్టడంతో విమానాల సంఖ్యను, సేవలను తగ్గిస్తున్న జెట్ ఎయిర్వేస్ కేవలం 9 విమానాలనే నడుపుతోంది. జెట్ ఎయిర్వేస్ గురువారం తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. రోజంతా అంతర్జాతీయ సేవలను రద్దు చేసింది. జెట్ చర్యతో పెద్దసంఖ్యలో ప్రయాణీకులు పలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. జెట్ ఇబ్బందులు ప్రస్తుతం ఏ స్ధాయిలో ఉన్నాయంటే విమాన సర్వీసులు రద్దవడంతో కేవలం ప్రయాణీకులకే సంస్థ రూ 3500 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. -
‘జెట్’లో జోక్యం చేసుకోం
న్యూఢిల్లీ: రుణ భారం, నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. సంస్థను గట్టెక్కించేందుకు డీల్స్ కుదర్చడంలో కేంద్రం పాత్రేమీ ఉండదని పేర్కొన్నారు. జెట్ ఎయిర్వేస్లో నేరుగా వాటాదారులైన బ్యాంకులే.. కంపెనీ వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయని, ఈ నేపథ్యంలో తమ శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని మంత్రి విలేకరులతో చెప్పారు. ‘ప్రభుత్వ శాఖ ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదు. రైల్వే విషయంలోనూ నేను ఇదే పాటించాను. జెట్కి సంబంధించినంతవరకూ అది బ్యాంకులు, మేనేజ్మెంట్కి మధ్య వ్యవహారం‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, భద్రతాపరమైన అంశాలపై మాత్రం కచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. తన సంస్థ దివాలా తీస్తుంటే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. జెట్ను మాత్రం గట్టెక్కించడానికి ప్రయత్నిస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయంటూ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోటరు మాల్యా ఆరోపించిన నేపథ్యంలో సురేష్ ప్రభు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్ ఎయిర్వేస్పై దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయింది. బ్యాంకుల షరతులకు ఒప్పుకున్నా: గోయల్ జెట్ ఎయిర్వేస్కి తక్షణం నిధుల సహాయం అందించేందుకు బ్యాంకులు విధించిన షరతులన్నింటికీ తాను అంగీకరించినట్లు సంస్థ ప్రమోటరు, మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వెల్లడించారు. జెట్ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని రుణపరిష్కార ప్రణాళిక అమలు కోసం పూర్తి సహకారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రణాళిక కింద సంస్థ యాజమాన్య అధికారాలను బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకోవడంతో పాటు రూ. 1,500 కోట్ల నిధులివ్వనున్నాయి. ఎగురుతున్నది 28 విమానాలే.. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ కేవలం 28 విమానాలే నడుపుతోందని, ఇందులో 15 విమానాలు దేశీ రూట్లలో తిరుగుతున్నాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. ముందుగా జెట్ 15 కన్నా తక్కువ సంఖ్యలో విమానాలే నడుపుతోందంటూ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పిన ఖరోలా.. ఆ తర్వాత తాజా వివరణనిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విదేశీ రూట్లకు సర్వీసులు నడిపే విషయంలో జెట్ సామర్ధ్యాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఒకప్పుడు దాదాపు 119 విమానాలతో సర్వీసులు నడిపిన జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం లీజులు కట్టలేక, ఇతర కారణాలతో పలు విమానాలను నిలిపివేసింది. మార్చి జీతాలు వాయిదా .. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులకు మార్చి నెలకు జరపాల్సిన జీతాల చెల్లింపులను జెట్ వాయిదా వేసింది. సంక్లిష్టమైన అంశాల వల్ల రుణ పరిష్కార ప్రణాళిక ఖరారుకు మరింత సమయం పట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులకు పంపిన లేఖలో చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా తెలిపారు. చెల్లింపులు ఎప్పటికిల్లా జరుగుతాయన్నది చెప్పకపోయినప్పటికీ, ఇందుకు సంబంధించిన వివరాలను ఏప్రిల్ 9న మరోసారి అప్డేట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. జెట్లో 16,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. షేరు 5 శాతం డౌన్.. విమానాల అద్దెలు చెల్లించలేకపోవడంతో మరో 15 విమానాలను పక్కన పెట్టినట్లు జెట్ ఎయిర్వేస్ వెల్లడించడంతో బుధవారం సంస్థ షేరు 5 శాతం పైగా క్షీణించింది. బీఎస్ఈలో సంస్థ షేరు 5.21 శాతం నష్టంతో రూ. 251.10 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 6.37 శాతం క్షీణించి రూ. 248కి కూడా తగ్గింది. -
ఎయిర్లైన్స్ పనితీరు బాధ్యత వాటిదే..
న్యూఢిల్లీ: ఆర్థిక పనితీరు మెరుగ్గా ఉండేలా చూసుకోవడం, సమర్ధంగా కార్యకలాపాలు నిర్వహించుకోవడమన్నది పూర్తిగా విమానయాన సంస్థల బాధ్యతేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఆయా సంస్థల రోజువారీ కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదని చెప్పారు. దేశీ విమానయాన రంగం తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుండటం, జెట్ ఎయిర్వేస్ పెను సంక్షోభంలో కూరుకుపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రతి విమానయాన సంస్థ.. మార్కెట్ను పరిశీలించి, ఆర్థిక వనరులను చూసుకుని సొంతంగా ఒక వ్యాపార ప్రణాళిక వేసుకుంటుంది. ఈ ప్రణాళికల ఆధారంగా తమ తమ కార్యకలాపాలను సమర్ధంగా నిర్వహించుకోవడం, మెరుగైన ఆర్థిక పనితీరు ఆయా సంస్థల బాధ్యత’ అని మంత్రి చెప్పారు. మరోవైపు, సంక్షోభంలో ఉన్న ఎయిరిండియాకి సంబంధించి పునరుద్ధరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సమగ్ర ఆర్థిక ప్యాకేజీ, స్పెషల్ పర్పస్ వెహికల్కు రుణాల బదలాయింపు తదితర అంశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రభు తెలిపారు. -
కేంద్ర మంత్రికి ట్వీట్.. అర్ధగంటలో స్టాల్ సీజ్
తిరుపతిలోని రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై ఉన్న క్యాంటీన్లో బిస్కెట్ ప్యాకెట్ను ఎమ్మార్పీ కంటే అధికధరలకు విక్రయిస్తున్నారంటూ వినియోగదారుడు రైల్వే మంత్రికి ట్వీట్ చేయడంతో.. అర్ధగంటలో స్టాల్ను సీజ్ చేశారు.’ ‘హైదరాబాద్ నుంచి రేణిగుంటకు రైల్లో ప్రయాణిస్తున్న ఓ 20 ఏళ్ల యువతి ఎదురుగా మరో వ్యక్తి కూర్చున్నాడు. ఆ బోగీలో పెద్దగా ప్రయాణికులు లేకపోవడం, వ్యక్తి చూపులు అనుమానంగా ఉండడంతో భయపడ్డ యువతి వెంటనే సమస్యను మంత్రికి ట్వీట్ చేసింది. 12 నిమిషాల తరువాత ఓ స్టేషన్ రాగా ఆ వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతికి స్వయాన రైల్వే మంత్రి ఫోన్ చేసి అభినందించడం ఇటీవల పత్రికల్లో చదివే ఉంటాం’ ‘ఇటీవల చెన్నై నుంచి విజయవాడ మీదుగా వెళుతున్న రైల్లో ఫ్యాను పనిచేయడం లేదని ఓ ప్రయాణికుడు స్మార్ట్ఫోన్ నుంచి ట్విట్టర్ ద్వారా రైల్వే మంత్రికి ట్వీట్ పంపాడు. నిముషాల వ్యవధిలో విజయవాడ సీనియర్ డీఈఈకు సమాచారం అందడంతో విద్యుత్ సిబ్బంది రైలు వద్దకు చేరుకుని ఫ్యాన్ మరమ్మతు చేశారు.’ ‘రెండు రోజుల కిందట బెంగళూరు నుంచి బళ్లారికి రాత్రి వేళ రైల్లో వెళుతున్న ఓ యువతి నెలసరి సమస్యతో బాధపడుతుంటే.. ఆమె స్నేహితురాలు రైల్వే మంత్రికి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. రైల్వే మంత్రి సూచనతో రంగంలోకి దిగిన అధికారులు ఆరు నిముషాల్లో ఈమె ప్రయాణిస్తున్న బోగి వద్దకు వచ్చి కావాల్సిన శానిటరీ నాప్కిన్లు, మాత్రలు ఇచ్చి వెళ్లారు.’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే కలిగే మేలు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇవి మచ్చుకలు మాత్రమే. ఇటీవల రైళ్లలో ఎదురవుతున్న సమస్యలపై ట్విట్టర్ ద్వారా రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళుతుంటే అప్పటికప్పుడే పరిష్కరిస్తుండడం వల్ల రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతోపాటు సంస్థపై జనానికి నమ్మకం కలుగుతోంది. అందుబాటులో ఉన్న సేవలను ఉపయోగించుకోవడంలో విద్యావంతులు తమదైనశైలి మార్కు వేస్తున్నారు. సోషల్ మీడియా సత్తా.. రైళ్లలో ప్రయాణించేటప్పుడు చాలా మందికి వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. క్యాటరింగ్లో పాచిన ఆహారం ఇవ్వడం, మరుగుదొడ్ల నుంచి దుర్గంధం వస్తున్నా పట్టించుకోకపోవడం, ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడం లాంటి ఘటనలు చాలానే ఎదురవుతుంటాయి. వీటిని ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక కొందరు.. స్టేషన్లలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మరికొందరు సమస్యను ప్రశ్నించడమే మానేస్తుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సమస్యల ప్రస్తావనకు సోషల్ మీడియా మంచి మాధ్యమంగా మారుతోంది. సామాన్య మధ్యతరగతి ప్రజల చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉండడం సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైలు ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళుతున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. ప్రధానంగా సమస్యలను రైల్వేశాఖ మంత్రికి క్షణాల్లో చెప్పడం.. నిమిషాల్లో ఇవి పరిష్కారానికి నోచుకుంటుండడంతో ప్రజలు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల పర్యవేక్షణ.. ట్విట్టర్లో రైల్వే మంత్రికి అందే ఫిర్యాదులను ఢిల్లీలోని రైల్ భవన్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఇది 24 గంటల పాటు పనిచేసే సెంట్రల్ వ్యవస్థ. రైలు ప్రయాణికులు పంపే ఫిర్యాదులను రైల్వే మంత్రి చూడడంతో పాటు.. రైల్ భవన్లోని అధికారులు సైతం ఫిర్యాదులు చూస్తూ ఉంటారు. ట్విట్టర్ వేదికగా వచ్చే ఫిర్యాదులు, సూచనలపై అప్పటికప్పుడు సానుకూల స్పందన వస్తుండడం ప్రయాణికులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఎలాంటి సమస్యలంటే... రైల్లో దొంగతనాలు జరుగుతున్నా సిబ్బంది స్పందిచకపోవడ అనుమానిత వ్యక్తులు మన పక్కన ఉన్నప్పుడు.. అసాంఘిక కార్యకలాపాలు రైల్లో జరుగుతున్నప్పుడు రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోవడం, క్యాంటీన్లలో ఎమ్మార్పీ కన్నా అధిక ధరలు వసూలు చేసినా ప్లాట్ఫామ్పై నీళ్లు రాకపోయినా, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల వసతులు సరిలేకపోయినా, అసౌకర్యాలపై రైల్లో ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా, మహిళలు, దివ్యాంగుల బోగీల్లో ఇతరులు ఎక్కినా ఫిర్యాదులు చేయొచ్చు. ఇలాంటివే ఫిర్యాదు చేయాలి.. ఇలాంటి చేయకూడదని లేదు. కానీ ఫిర్యాదు చేసేటప్పుడు కాస్త విజ్ఞతతో ఆలోచిస్తే సరి. ట్వీట్ చేసేటప్పుడు తప్పనిసరిగా పేరు, ఫోన్ నంబరు నమోదు చేయాలి. అలాగే ప్రయాణి కుల బెర్తు, బోగీ కూడా రాయాలి. మీరూ ట్విట్టండి.. స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా ట్విట్టర్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ట్విట్టర్లో వ్యక్తి పేరు, పాస్వర్డ్, మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ నమోదు చేసి సేవ్ చేసుకున్న తరువాత ట్విట్టర్ వినియోగంలోకి వస్తుంది. అనంతరం రైల్వే మినిస్టర్ అని టైప్చేస్తే రైల్వేమంత్రి పీయుష్ గోయల్ చిత్రంతో పాటు సైట్ ఓపెన్ అవుతుంది. ప్రయాణికులు తమకు తెలిసిన భాషల్లో సమస్యలను నేరుగా మంత్రికి ట్వీట్ రూపంలో తెలియచేయొచ్చు. ట్వీట్ మెసేజ్ సెకన్ల వ్యవధిలోనే ఆయా డివిజన్ల రైల్వే ఉన్నతాధికారులకు చేరుతుంది. అర్ధరాత్రులు సైతం అధికారులు స్పందిస్తారు. మెసేజ్ చేరగానే అప్రమత్తమై ప్రయాణికుల సమస్యలను పరిష్కరించి తిరిగి రైల్వే మంత్రికి నివేదిస్తారు. -
స్టార్టప్లకు ఉపశమనం!
న్యూఢిల్లీ: పన్నుకు సంబంధించి స్టార్టప్ సంస్థల్లో నెలకొన్న భయాందోళనలు కాస్త ఉపశమించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏంజెల్ ఫండ్స్ వెచ్చించే పెట్టుబడులపై స్టార్టప్స్ పన్ను మినహాయింపులను కోరేందుకు సంబంధించిన ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఏంజెల్ ఫండ్స్ ద్వారా తాము సమీకరించిన నిధులపై పన్నులు చెల్లించాలంటూ ఇటీవలి కాలంలో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ నుంచి తమకు నోటీసులందటంపై స్టార్టప్స్ వ్యవస్థాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఐటీ చట్టంలోని సెక్షన్ 56 (2) కింద స్టార్టప్ సంస్థలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. స్టార్టప్కు పన్ను మినహాయింపు నిబంధనల విషయంలో తాజా మార్పుల నోటిఫికేషన్కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆమోదం తెలిపినట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ‘త్వరలో అమల్లోకి రానున్న కొత్త విధానం ప్రకారం స్టార్టప్స్ గనుక ఏంజెల్ ఫండ్స్పై పన్ను మినహాయింపులను కోరాలంటే ముందుగా పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి (డీఐపీపీ) దరఖాస్తు చేసుకోవాలి. నిర్ధేశిత స్టార్టప్ దరఖాస్తును తగిన ధ్రువపత్రాలతో కలిపి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల విభాగానికి (సీబీడీటీ) డీఐపీపీయే పంపుతుంది. దరఖాస్తును అందుకున్న 45 రోజుల్లోగా స్టార్టప్లకు పన్ను మినహాయింపునకు ఆమోదం తెలపడం లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తిరస్కరించడంపై సీబీడీటీ కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో నోటిఫికేషన్... గతంలో స్టార్టప్లు సమర్పించే పన్ను మినహాయింపు దరఖాస్తును అంతర్ మంత్రిత్వ శాఖల విభాగం ధ్రువీకరణ కోసం పంపేవారు. దీనివల్ల జాప్యం అయ్యేంది. ఇప్పుడు డీఐపీపీ ద్వారా నేరుగా సీబీడీటీకి పంపేలా ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వం వర్గాలు వివరించాయి. అదేవిధంగా స్టార్టప్లు విక్రయించిన షేర్లకు మార్కెట్ విలువ ఎంతనేది నిర్ధారిస్తూ మర్చెంట్ బ్యాంకర్ నుంచి నివేదికను తీసుకొని సమర్పించాలన్న గత నిబంధనను కూడా తాజాగా తొలగించారు. డీఐపీపీ గుర్తింపు ఉన్న స్టార్టప్లన్నీ కొన్ని షరతులకు లోబడి ఈ పన్ను మినహాయింపు పొందే వీలుంది. ప్రధానంగా ఖాతాల వివరాలతోపాటు గడిచిన మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాలి. అలాగే ఏంజెల్ ఇన్వెస్టర్లు కూడా తమ నెట్వర్త్, పెట్టుబడిపై ఎంత ఆదాయం వచ్చింది అనే వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. కాగా, ఏంజెల్ ఫండ్స్ ఇతరత్రా ఇన్వెస్టర్ల నుంచి రూ.10 కోట్లకు మించి జరిపిన నిధుల సమీకరణపై పూర్తిగా పన్ను మినహాయింపు వర్తిస్తుందని 2018 ఏప్రిల్లో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఐటీ చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం స్టార్టప్స్ తమకున్న మార్కెట్ విలువకు మించి జరిపే నిధుల సమీకరణపై 30 శాతం పన్ను విధించేందుకు వీలుంది. దీని ఆధారంగానే ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. కాగా, పన్ను మినహాయింపు నిబంధనల్లో తాజా మార్పులన్నీ నోటిఫికేషన్ జారీ అయినతర్వాత అమల్లోకి వస్తాయని.. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి కొత్త నిబంధనలు వర్తించవని ఆయా వర్గాలు తెలిపాయి. ఏటా 300– 400 స్టార్టప్లకు ఏంజెల్ ఫండ్స్ నుంచి నిధులు అందుతుండగా... 2018 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ కేవలం రెండు స్టార్టప్స్కు మాత్రమే పన్ను మినహాయింపు లభించడం గమనార్హం. ఈ అంశాన్ని కూడా మంత్రి సురేష్ ప్రభు కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేయండి ప్రధానిని కోరిన ఐస్పిర్ట్ న్యూఢిల్లీ: స్టార్టప్లకు శాపంగా మారిన ఏంజెల్ ట్యాక్స్ను తక్షణం రద్దు చేయాలని స్టార్టప్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐస్పిర్ట్... ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఈ మేరకు ఈ సంస్థ ఒక లేఖ రాసింది. స్టార్టప్ల్లో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్ అని పేర్కొంది. ఏంజెల్ ఇన్వెస్టర్లు ఎంతో రిస్క్ తీసుకొని ఈ పెట్టుబడుల పెడతారని, విదేశాల్లో ఇలాంటి పెట్టుబడులకు నజరానాలిస్తుండగా, ఇక్కడ మాత్రం పన్నులు వేసి పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు వస్తుండటంతో పలు స్టార్టప్లు బెంబేలెత్తుతున్నాయని, కొన్ని మూతపడుతున్నాయని పేర్కొంది. ఈ ఏంజెల్ ట్యాక్స్ను తక్షణం రద్దు చేయాలని, అలా కుదరని పక్షంలో కనీసం నిబంధనలను సరళీకరించాలని కోరింది. స్టార్టప్లలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు 20 లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల వరకు ఇన్నోవాక్సర్లో తొలి పెట్టుబడి బెంగళూరు: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్ స్టార్టప్లలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. మైక్రోసాఫ్ట్కు చెందిన కార్పొరేట్ వెంచర్ ఫండ్, ఎమ్12 (గతంలో మైక్రోసాఫ్ట్ వెంచర్స్ ఫండ్గా వ్యవహరించేవారు) భారత స్టార్టప్లలో ఒక్కో కంపెనీలో 20 లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల రేంజ్లో పెట్టుబడులు పెట్టబోతోంది. దీన్లో భాగంగా తొలి పెట్టుబడి పెట్టడానికి హెల్త్ టెక్ స్టార్టప్, ఇన్నోవాక్సర్ను ఎంచుకున్నామని ఎమ్12 పార్ట్నర్ రష్మి గోపీనాధ్ చెప్పారు. బీ2బీ స్టార్టప్లలో ఏ నుంచి సి రౌండ్ సిరీస్లలో నిధులు సమకూరుస్తామని పేర్కొన్నారు. బిగ్ డేటా, అనలిటిక్స్, బిజినెస్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్లకు నిధులందిస్తామని ఆమె పేర్కొన్నారు. -
వ్యవసాయ ఎగుమతుల పెంపుపై దృష్టి
న్యూఢిల్లీ: వ్యవసాయ ఎగుమతుల పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో రాష్ట్రాలకు రవాణా సబ్బిడీని అందించాలని యోచిస్తోంది. వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం ఈ విషయం తెలిపారు. అంతకుముందు వాణిజ్యం, అభివృద్ధి వ్యవహారాల మండలి సమావేశం జరిగింది. కర్ణాటక, పంజాబ్, తమిళనాడుసహా పలు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ ఎగుమతుల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం చర్చించినట్లు ప్రభు తెలిపారు. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న రుణ సంబంధ సమస్యలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ఫైనాన్స్ వ్యవహారాల కార్యదర్శి ఈ అంశంపై బ్యాంకర్లతో చర్చిస్తారని పేర్కొన్నారు. ఎగుమతుల రంగానికి రుణాన్ని ప్రాధాన్యతాపరమైనదిగా పరిగణించాలని డిమాండ్ ఉంది. అంతర్జాతీయ చట్టాలను ఏ విధంగానూ ఉల్లంఘించకుండా, ఇరాన్తో వాణిజ్య సంబంధాలు నెరపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. భారత్–చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 2018–19 ఏప్రిల్–అక్టోబర్ మధ్య భారత్ వ్యవసాయ ఎగుమతుల విలువ 48 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 43.11 బిలియన్ డాలర్లు. -
దేశీ ఈ కామర్స్ సంస్థలకూ అవే నిబంధనలు...
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో (ఎఫ్డీఐ) కూడిన ఈ కామర్స్ సంస్థలకు సంబంధించిన నిబంధనలను దేశీయ ఈ కామర్స్ సంస్థలకూ అమలు చేయడం ద్వారా, అనైతిక వ్యాపార విధానాలకు పాల్పడకుండా నిరోధించాలని అఖిల భారత వర్తకుల సంఘం (సీఏఐటీ) డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించిన విధానాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాసింది. ఈ కామర్స్ రంగానికి సంబంధించిన విధానంపై వాణిజ్య శాఖ పనిచేస్తుండగా... త్వరలోనే దాన్ని విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో సీఏఐటీ లేఖ రాయడం గమనార్హం. ‘‘నూతన విధానంలో పేర్కొన్న ఎఫ్డీఐ నిబంధనలు దేశీయ ఈ కామర్స్ సంస్థలకూ వర్తింపజేయాలి. అనైతిక వ్యాపార ధోరణలను అనుసరించకుండా నిరోధించాలి. వాటిని ఇతర ఈ కామర్స్ సంస్థలతో సమానంగా చూడాలి’’ అని సీఏఐటీ కోరింది. ఈ రంగానికి స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేసింది. కొన్ని సంఘాలు ఎఫ్డీఐ నిబంధనలను తప్పుబడుతున్నాయని, ఎటువంటి ఒత్తిళ్లకు లొంగవద్దని కోరింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి విదేశీ ఈ కామర్స్ సంస్థలు తమ ప్లాట్ఫామ్లపై, తమ వాటాలు కలిగిన కంపెనీల ఉత్పత్తులను విక్రయించకుండా, ప్రత్యేకమైన మార్కెటింగ్ ఒప్పందాలతో ఉత్పత్తులను మార్కెట్ చేయకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. అయితే త్వరలోనే ఈ–కామర్స్లోకి రావటానికి ప్రయత్నాలు చేస్తున్న రిలయన్స్ వంటి సంస్థలకు ఈ పరిణామం లాభించవచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ సంస్థలకూ ఇవే నిబంధనలు వర్తింపజేయాలని వర్తకుల సంఘం డిమాండ్ చేస్తోంది. -
త్వరలో కొత్త పసిడి విధానం
న్యూఢిల్లీ: పసిడిపై కేంద్రం ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తోంది. త్వరలో బంగారంపై కొత్త విధానం ప్రకటించే అవకాశం ఉందని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారమిక్కడ తెలియజేశారు. పసిడి పరిశ్రమ వృద్ధి, ఆభరణాల ఎగుమతుల వృద్ధి ప్రధాన లక్ష్యాలతో తాజా విధాన రూపకల్పన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం భారత ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా 15 శాతంగా ఉంది. విధాన రూపకల్పనలో భాగంగా సంబంధిత వర్గాలతో రానున్న కొద్ది రోజుల్లో సమావేశం కానున్నట్లు ప్రభు తెలిపారు. పసిడిపై ప్రస్తుతం 10 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్ను కూడా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 100 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు లక్ష్యం.. భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు మంత్రి ప్రభు తెలిపారు. వచ్చే రెండేళ్లలో 100 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు రప్పించటమనేది కేంద్రం లక్ష్యమని తెలిపారు. భారత్లో ఏ రంగాలు భారీ పెట్టుబడులను కోరుతున్నాయి? ఇందుకు ఏ దేశాల నుంచి పెట్టుబడులను పొందే అవకాశం ఉంటుంది? వంటి అంశాలపై వాణిజ్య, పరిశ్రమల పరిశ్రమల మంత్రిత్వశాఖ దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ దిశగా విదేశాలతో చర్చలకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. స్టార్టప్స్ పన్ను సమస్యల పరిష్కారం స్టార్టప్స్ పురోగతికి కేంద్రం తగిన చర్యలన్నీ తీసుకుంటుందని సురేశ్ ప్రభు తెలిపారు. ప్రత్యేకించి ఏంజిల్ ఫండ్స్ నుంచి నిధుల సమీకరణలో స్టార్టప్స్ ఎదుర్కొంటున్న పన్ను సంబంధ సమస్యలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని కోరినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. స్టార్టప్స్, ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఎదుర్కొంటున్న పన్ను సమస్యల పరిష్కార మార్గాలను సూచించడానికి గత వారం కేంద్రం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
భారత్ ఎగుమతులు బాగున్నాయి
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు గడచిన 14 నెలల్లో చాలా బాగున్నాయని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు బుధవారం చెప్పారు. అయితే పూర్తి సంతృప్తి మాత్రం లేదన్నారు. ఎగుమతుల పెంపునకు భారత్ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు. 2019లో పటిష్ఠ వృద్ధి సాధించడానికి ఎగుమతులే ప్రధాన వనరుగా ఉండాలన్నది ఈ వ్యూహం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రక్షణాత్మకవాదం, మందగమనం, వాణిజ్య యుద్ధం, దిగుమతి సుంకాలుసహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ, దేశ ఎగుమతులు పెరుగుతుండడం గమనార్హమని మంత్రి పేర్కొన్నారు. 2011–12 నుంచి దేశ ఎగుమతుల విలువ 300 బిలియన్ డాలర్లుగా ఉంది. 2017–18లో 10% వృద్ధితో 303 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అల్యూమినియంపై దిగుమతి సుంకం పెంపు! అల్యూమినియంపై దిగుమతి సుంకాల పెంపునకు కేంద్రం సానుకూలంగా ఉంది. దేశీయ పరిశ్రమ, తయారీ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు ప్రభు పేర్కొన్నారు. ఈ కమోడిటీ భారీ దిగుమతులపై అల్యూమినియం పరిశ్రమ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అల్యూమినియం స్క్రాప్పై బేసిక్ కస్టమ్స్ సుంకం 2.5%. ప్రైమరీ అల్యూమినియంపై 7.5%. రెండింటిపై ఈ సుంకాన్ని 10 శాతానికి పెంచాలన్న డిమాండ్ వస్తోంది. దీనితోపాటు ఈ కమెడిటీ దిగుమతిపై కనీస దిగుమతి ధర, దిగుమతులపై కోటా నిర్దేశం వంటి మరికొన్ని పరిమితులూ విధించాలని దేశీయ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. -
ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ప్రముఖ నేతలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వార్షిక సమావేశాలు వచ్చే నెల 21 నుంచి 25వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ పట్టణంలో జరగనున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ కిమ్ సహా ఆరుగురు సంయుక్తంగా అధ్యక్షత వహిచనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాధిపతులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, పౌర సమాజం ప్రముఖులు కలసి 3,000 మంది వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ‘ప్రపంచీకరణ 4.0: నాలుగో పారిశ్రామిక విప్లవం దశలో ప్రపంచ స్వరూపం’ ఈ కార్యక్రమం ప్రధాన అంశంగా ఉంటుంది. వాతావరణం మార్పులు, జీవ వైవిధ్యం, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల నష్టం అంశాలను పరిష్కరించాల్సి ఉందని ప్రపంచ ఆర్థిక ఫోరం వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లౌస్ ష్వాబ్ పేర్కొన్నారు. కేటీఆర్, లోకేశ్ సైతం...: భారత్ నుంచి పాల్గొనే వారిలో అరుణ్ జైట్లీతోపాటు కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్నాథ్, చంద్రబాబునాయుడు, దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారు. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, కేటీఆర్ సైతం హాజరు కానున్నారు. వ్యాపార ప్రముఖులు అజీమ్ ప్రేమ్జీ, ముకేశ్ అంబానీ దంపతులు, ఉదయ్ కోటక్, గౌతం అదానీ, లక్ష్మీ మిట్టల్, నందన్ నీలేకని, ఆనంద్ మహీంద్రా, అజయ్ పిరమల్ కూడా పాలు పంచుకోనున్నారు. -
ఈ–కామర్స్లో పారదర్శకతకు పెద్దపీట
న్యూఢిల్లీ: ఆన్లైన్ వ్యాపారంలో పారదర్శకతను పెంపొందించే దిశగా కొత్త ఈ–కామర్స్ విధానం ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ధరలు, డిస్కౌంట్లలో పారదర్శకతతో పాటు ఇటు రిటైలర్లు అటు కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కొత్త విధానం ముసాయిదాపై కసరత్తు చేస్తోందని, వచ్చే 2–3 వారాల్లో సంబంధిత వర్గాల అభిప్రాయాల కోసం దీన్ని వెల్లడిస్తామని ప్రభు తెలిపారు. ‘ఈ–కామర్స్ వ్యాపార నిర్వహణను సులభతరం చేయడమనేది పాలసీ ప్రధాన లక్ష్యం. ఇటు రిటైలర్లకు... అటు వినియోగదారులకు ఇది ప్రయోజనకరంగా ఉండాలి. ఈ–కామర్స్ వ్యాపారంలో ధరలు, డిస్కౌంట్ల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలి‘ అని ఆయన చెప్పారు. ‘డిస్కౌంట్లు ఇవ్వొచ్చని గానీ ఇవ్వొద్దని గానీ మేం నిర్దేశించబోము. ఏది చేసినా పారదర్శకంగా ఉండాలన్నదే మా ఉద్దేశం‘ అని మంత్రి వివరించారు. వాణిజ్య శాఖ గతంలో తయారు చేసిన ముసాయిదాలోని సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని కొత్త ముసాయిదాను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు, భారత్లో తయారీ కేంద్ర ఏర్పాటు విషయంలో కొన్ని మినహాయింపులు కోరుతున్న అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రతినిధులతో వచ్చే నెల దావోస్లో భేటీ కానున్నట్లు సురేశ్ ప్రభు తెలిపారు. ఇప్పటికే యాపిల్తో చర్చలు జరుగుతున్నాయని, ఆ సంస్థ కోరుతున్న మినహాయింపులను ప్రభుత్వం పరిశీలించే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. -
ఏంజెల్ ట్యాక్స్పై స్టార్టప్లలో ఆందోళన
న్యూఢిల్లీ: ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపుతుండటం.. స్టార్టప్ సంస్థలను కలవరపెడుతోంది. పలు స్టార్టప్లు వీటిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. దీనిపై ఆర్థిక శాఖతో చర్చిస్తున్నట్లు సైటు ట్విటర్లో పేర్కొన్నారు.మరోవైపు, పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) గుర్తింపు లేని స్టార్టప్స్కు మాత్రమే ఏంజెల్ ట్యాక్స్ నోటీసులు జారీ అవుతుండవచ్చని ఆదాయ పన్ను శాఖ అధికారి తెలిపారు. అటు ఈ నోటీసుల కారణంగా ఏంజెల్ ఇన్వెస్టర్లు, స్టార్టప్లు పన్నులపరమైన వేధింపులకు గురికాకుండా చూడాలని రెవెన్యూ విభాగం దృష్టికి తీసుకెళ్లినట్లు డీఐపీపీ వెల్లడించింది. స్టార్టప్లలో సిసలైన పెట్టుబడులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. ప్రారంభ దశలోని స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లను ఏంజెల్ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తారు. ఇలాంటి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులతో పాటు మొత్తం పెట్టుబడులు రూ. 10 కోట్ల లోపే ఉంటే పన్నుల నుంచి మినహాయింపులు ఉంటున్నాయి. సముచిత మార్కెట్ రేటుకు మించి ప్రీమియంతో ఏంజెల్ ఇన్వెస్టర్ పెట్టుబడులు పెట్టారని భావించిన పక్షంలో అలా సేకరించిన అధిక మొత్తానికి 30 శాతం పన్ను రేటు వర్తిస్తుందని ఆదాయ పన్ను శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీన్నే ఏంజెల్ ట్యాక్స్గా వ్యవహరిస్తున్నారు. -
రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి
సాక్షి, విజయవాడ: కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పనిచేయాలని, రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. గన్నవరం విమానశ్రయంలో 611 కోట్ల రూపాయలతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్కు భూమి పూజ కార్యక్రంమంలో కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి సురేష్ ప్రభు, సహాయ మంత్రి జయంత్ సిన్హాతో కలిసి పాల్గొన్న ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రవాణా రాకపోకాలు పెరగటం అభివృద్ధికి సూచిక అని పేర్కొన్నారు. గన్నవరం విమానశ్రయంలో సింగపూర్కే కాదు ప్రపంచ దేశాలకు సైతం విమాన సర్వీసులు రావాలని ఆకాంక్షించారు. అందమైన కృష్ణా నది, కూచిపూడి నాట్యం, జాస్మిన్ ప్లవర్ ఆకారాలలో న్యూ టెర్మినల్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. రోడ్డు, రైలు, ఎయిర్, వాటర్ కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తిరుపతి, రాజమండ్రి, కడప ఎయిర్ పోర్టుల అభివృద్ది కూడా జరగాల్సి ఉందన్నారు. 100 కొత్త విమానాశ్రయాలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్దికి అవసరమైన మౌళిక సౌకర్యాలు సమకూర్చుతున్నామని కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. 65 బిలియన్ డాలర్స్ వెచ్చించి100 కొత్త విమానాశ్రాయాలు నెలకొల్పామని తెలిపారు. టెర్మినల్ పూర్తయిన తరువాత ఏపీకి ఐకాన్గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. ప్రైవేట్ ఎయిర్లైన్స్తో పోటీగా ప్రయాణికులకు సౌకర్యాలు సమకూర్చుతున్నామన్నారు. వచ్చే రెండు రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. -
కుట్రలను వెలికితీయండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం వెనుక దాగిన కుట్రలను వెలికి తీయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పౌర విమానయానశాఖ మంత్రి సురేష్ప్రభుకు లేఖ రాశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బి.ఎస్.భుల్లర్ నుంచి సంబంధిత సమాచారాన్ని ఆశిస్తున్నట్టు పేర్కొంటూ డీజీసీఏకు 13 ప్రశ్నలు సంధించారు. జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం వెనుక కుట్రలను వెలుగులోకి తెచ్చేందుకు రాజ్యసభ సభ్యుడిగా ఈ సమాచారాన్ని కోరుతున్నట్లు లేఖలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. హత్యాయత్నం ఘటనపై దర్యాప్తునకు ఆదేశిస్తారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. డైరెక్టర్ జనరల్కు ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నలు ఇవీ.. - జె.శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఏరోడ్రమ్ ఎంట్రీ పర్మిట్(ఏఈపీ) కోసం దుండగుడు శ్రీనివాస్ లేదా అతడి యజమాని హర్షవర్దన్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి దరఖాస్తు సమర్పించారా? ఒకవేళ సమర్పిస్తే జె.శ్రీనివాసరావుకు నేర చరిత ఉన్న సంగతిని దరఖాస్తులో ప్రస్తావించారా? క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న సంగతి ప్రస్తావించారా? - ఫ్యూజన్ రెస్టారెంట్లో పనిచేయడానికి అనుమతి ఇచ్చేముందు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిందితుడు శ్రీనివాసరావు గత చరిత్ర గురించి ఏపీ పోలీసులను నివేదిక కోరారా? కోరితే ఏపీ పోలీసుల నుంచి వచ్చిన జవాబు ఏమిటి? - జె.శ్రీనివాసరావుకు విశాఖపట్నం ఎయిర్పోర్టులో పనిచేసేందుకు అవసరమైన అనుమతి ఉందా? అతడు అక్కడ ఏ ప్రాంతం/జోన్లో తిరిగేందుకు అనుమతి ఉంది? - జె.శ్రీనివాసరావు లేదా హర్షవర్దన్లు ఏఏఐకి చెందిన లాంజ్ ఆఫీసర్ నుంచి గానీ మేనేజర్ నుంచి గానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ అధికారి నుంచి గానీ ఎయిర్పోర్టులోని ముఖ్య ప్రాంతాల్లో తిరిగేందుకు అనుమతి తీసుకున్నారా? - విశాఖ ఎయిర్పోర్టులోని విమానాల్లో కూడా ఆహారం పంపిణీ చేసేందుకు జె.శ్రీనివాసరావు అనుమతి కలిగి ఉన్నాడా? ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్కు విభిన్న ఎయిర్లైన్ సంస్థలకు చెందిన విమానాల్లో ప్రయాణికులకు ఆహారం సరఫరా చేసేందుకు అనుమతి ఉందా? - ఫ్యూజన్ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ విశాఖపట్నం ఎయిర్పోర్టులోని అన్ని సున్నితమైన ప్రాంతాల్లో తిరగడం వాస్తవం కాదా? అది నిజమే అయితే అందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? - ఏ నిబంధన కింద హర్షవర్దన్కు విశాఖ ఎయిర్పోర్టులో రెస్టారెంట్ నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేశారు? రెస్టారెంట్ నిర్వహణలో హర్షవర్దన్ ఏవైనా నిబంధనలు ఉల్లంఘించారా? - సీఎం చంద్రబాబు విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రతిసారి హర్షవర్దన్ ఆయనకు స్వాగతం పలిపేందుకు విమానం వరకూ వెళ్లడం వాస్తవం కాదా? విమానం వరకూ వెళ్లి ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు హర్షవర్దన్కు ఎవరు అనుమతి ఇచ్చారు? - హర్షవర్దన్పై గానీ రెస్టారెంట్పై గానీ అందులో పనిచేసే సిబ్బందిపై గానీ ఏవైనా ఫిర్యాదులు నమోదయ్యాయా? - విశాఖపట్నం ఎయిర్పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేసేందుకు ఎవరెవరిని అనుమతించారు? - ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ పనివేళలు ఏమిటి? - సిబ్బందికి పని వేళలు రోస్టర్ ప్రకారం ఉంటాయా? జె.శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పని వేళలు ఏమిటి? - విశాఖపట్నం ఎయిర్పోర్టులో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఎప్పుడు ఆడిట్ నిర్వహించింది? తనిఖీలు లేదా విచారణ చేసినప్పుడు హర్షవర్దన్ విషయంలో గానీ లేదా సిబ్బంది విషయంలో గానీ ఏవైనా అవకతవకలు గానీ నేరపూరిత చర్యలు గానీ నిబంధనల ఉల్లంఘన గానీ గుర్తించిందా? గుర్తిస్తే తీసుకున్న చర్యలేమిటి? -
వాణిజ్య వివాదాలపై అమెరికాతో చర్చలు: మంత్రి సురేష్ ప్రభు
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలను పరిష్కరించుకునే దిశగా భారత్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఇందుకు సంబంధించి అమెరికా చేసిన ఆఫర్కు ప్రతిగా భారత్ మరో ప్రతిపాదన చేసినట్లు ఆయన వివరించారు. భారత్ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిగా అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, ఉక్కు, ఇనుము వంటి సుమారు 29 ఉత్పత్తులపై సుంకాలను నవంబర్ 2 నుంచి పెంచనున్నట్లు భారత్ ప్రకటించింది. అయితే, తాజాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను వాయిదా వేసిన నేపథ్యంలో మంత్రి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
వైఎస్ జగన్పై హత్యాయత్నం; స్పందించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంతో సహా అన్ని శాఖలను ఆదేశించారు. ఎవరు బాధ్యులో గుర్తించాలని విమానయాన శాఖ కార్యదర్శికి సూచించినట్టు వెల్లడించారు. వైఎస్ జగన్పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. విచారణ జరిపి దోషిని శిక్షిస్తామన్నారు. తక్షణమే దర్యాప్తు మొదలు పెట్టాలని ఆదేశించామని, విచారణ జరుగుతోందని సురేశ్ ప్రభు ట్విటర్లో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సురేశ్ ప్రభు అదనంగా పౌర విమానయాన శాఖను చూస్తున్నారు. అశోక్గజపతి రాజు ఈ పదవికి రాజీనామా చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిఫారసు మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనకు మార్చిలో విమానయాన శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. Shocked by attack on Mr Jagan Reddy,Asked all agencies to investigate matter thoroughly,including @CISFHQrs .Asked secretary civil aviation to fix responsibility.I strongly condemn this cowardly attack,we will punish the guilty.Investigations are underway, started immediately — Suresh Prabhu (@sureshpprabhu) October 25, 2018 సంబంధిత కథనాలు: వైఎస్ జగన్పై హత్యాయత్నం! సెల్ఫీ తీసుకుంటానని నవ్వూతూ వచ్చాడు.. ‘ఎయిర్పోర్టులోకి కత్తులు అనుమతిస్తారా?’ ఇది పిరికిపందల చర్య: ఓవైసీ నిందితుడి జేబులో లెటర్ : పథకం ప్రకారమే దాడి -
25 నుంచి సింగపూర్కు విమాన సర్వీసు నడపాల్సిందే
సాక్షి, అమరావతి: విజయవాడ– సింగపూర్ విమాన సర్వీసులు ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 25 నుంచి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీట్లు భర్తీ కాకపోతే ఆ నష్టాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇస్తామని ఫ్రభుత్వం ఇచ్చిన హామీతో ఇండిగో సర్వీసులు నడపడానికి ముందుకొచ్చింది. గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించడానికి తగిన మౌలిక వసతులు లేవంటూ కస్టమ్స్, ఎయిర్పోర్టు్ట అధికారులు మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ఆయాశాఖల అధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.18 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చినా జాప్యం చేయడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై త్వరలోనే ఆర్థిక మంతి అరుణ్జైట్లీ, విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాయనున్నట్లు సీఎం తెలిపారు. -
60 బిలియన్ డాలర్లతో 100 కొత్త విమానాశ్రయాలు!
న్యూఢిల్లీ: రానున్న 10–15 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలియజేశారు. ఇందుకు దాదాపు 60 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.2 లక్షల కోట్లు) వ్యయం అవుతుందని మంగళవారమిక్కడ ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. గత మూడేళ్లుగా విమాన ప్రయాణికుల డిమాండ్ పుంజుకోవడంతో దేశీ విమానయాన రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) 120కి పైగానే ఏరోడ్రోమ్స్ను నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఎయిర్పోర్టులను నిర్మించాలనేది మా వ్యూహం’ అని ప్రభు వివరించారు. కొత్తగా ఎయిర్కార్గో విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించారు. 2037 నాటికి భారత్కు సంబంధించి మొత్తం వార్షిక విమాన ప్రయాణికుల సంఖ్య (విదేశీ, దేశీ ప్రయాణికులు) 52 కోట్లకు చేరుతుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేస్తోంది. 2010లో ఈ సంఖ్య 7.9 కోట్లుగా ఉండగా... 2017 నాటికి రెట్టింపు స్థాయిలో 15.8 కోట్లకు పెరిగింది. మరో పదేళ్లలోపే జర్మనీ, జపాన్, స్పెయిన్, బ్రిటన్లను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్గా (ప్రయాణికుల పరంగా) భారత్ అవతరించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. -
లాజిస్టిక్స్లో పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: లాజిస్టిక్స్ రంగంలో 2025 నాటికి 500 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 34.5 లక్షల కోట్లు) పెట్టుబడులు రాగలవని వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. దీంతో లక్షల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. అలాగే దేశీయంగా వ్యాపారాలకు, అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోగలవని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ దిశగా సమగ్రమైన వ్యూహాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన, పాలనాపరమైన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన ఇండియా లాజిస్టిక్స్ లోగోను సోమవారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. మిగతా దేశాలతో పోలిస్తే లాజిస్టిక్స్ వ్యయాలు భారత్లో అత్యధికంగా.. స్థూల దేశీయోత్పత్తిలో 14 శాతంగా ఉన్నాయి. ‘2025 నాటికి ఇన్ఫ్రా సహా లాజిస్టిక్స్లో పెట్టుబడులు 500 బిలియన్ డాలర్లకు చేరతాయి. ప్రపంచ వాణిజ్యంలో మన వాటాను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో లాజిస్టిక్స్దే కీలక పాత్ర’ అని ప్రభు చెప్పారు. భారీ లాజిస్టిక్స్ వ్యయాలు.. పోటీ తత్వంపైనా, సరకు రవాణాపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. లాజిస్టిక్స్కి సంబంధించిన వర్గాలన్నింటినీ ఒకే చోట చేర్చేలా వాణిజ్య శాఖ ప్రత్యేకంగా జాతీయ లాజిస్టిక్స్ పోర్టల్ను తయారు చేస్తోందని వివరించారు. ఎగుమతి.. దిగుమతి వ్యయాలు, దేశీయంగా వాణిజ్య వ్యయాలను తగ్గించేందుకు సమగ్రమైన వ్యూహాన్ని కూడా రూపొందిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. సెంటర్ ఫర్ లాజిస్టిక్స్ ఏర్పాటుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ)తో లాజిస్టిక్స్ విభాగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
త్వరలో కొత్త కేంద్ర పారిశ్రామిక విధానం
సాక్షి, హైదరాబాద్: త్వరలో కేంద్రం కొత్త పారిశ్రా మిక విధానాన్ని ప్రకటించనున్నట్లు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. తోలు పరిశ్రమ వంటి సంప్రదాయ రంగాల పరిశ్రమలను పునరుద్ధరించడంతో పాటు భవిష్యత్తు కలిగిన కొత్త రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడంపై కొత్త విధానం దృష్టి పెడుతుం దన్నారు. గురువారం రాయదుర్గంలో ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్డీడీఐ) నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. వస్తు ఉత్పత్తిలో ప్రత్యేకత సాధించిన జిల్లాలను గుర్తించి ఈ కొత్త విధానం ద్వారా ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. 100 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను అదనంగా విదేశీ మార్కెట్లకు పంపాలన్న లక్ష్యంతో ఈ విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. దేశ తోలు పరిశ్రమల రంగాన్ని నవీకరించడం, పునరుద్ధరించడంలో భాగంగా ఎఫ్డీడీఐ భవనాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సవాళ్ల ను ఎదుర్కొంటూ దశాబ్దాలుగా తోలు పరిశ్రమ దేశంలో మనుగడ సాధించగలిగిందని, విదేశీ పరిశ్రమల నుంచి ప్రస్తుతం ఎదురవుతున్న పోటీని సమర్థంగా అధిగమించాల్సి ఉందన్నారు. ప్రపంచ మార్కెట్ను ఆకర్షించేలా.. తోలు పరిశ్రమల పునరుద్ధరణకు కేంద్రం ఇప్పటికే రూ.2,600 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని సురేశ్ ప్రభు అన్నారు. ఆధునిక యంత్రాల కొనుగోళ్లు, శిక్షణ, మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఈ నిధులను వినియోగిస్తున్నామన్నారు. కొత్త భవనంలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించామని, దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇదొకటి అని చెప్పారు. తోలు ఉత్పత్తుల మార్కెటింగ్కు ఆకర్షణీయ డిజైన్లు కీలకమని, ఇక్కడి విద్యార్థులు ప్రపంచ మార్కెట్ను ఆకర్షించే డిజైన్లకు రూపకల్పన చేసి తోలు వస్తువుల ఎగుమతుల పెంపునకు దోహదపడాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, వాణిజ్య శాఖ జాయింట్ సెక్రెటరీ అనిత, ఎఫ్డీడీఐ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్సిన్హా, కార్యదర్శి వివేక్ తదితరులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలన మోదీతోనే సాధ్యం
వరంగల్ రూరల్ జిల్లా: తెలంగాణ రాష్ట్రం రాక ముందు..వచ్చాక ఎలాంటి మార్పు రాలేదని, తెలంగాణాలో కానీ దేశంలో కానీ పేదరిక నిర్మూలన జరగాలంటే ఒక్క మోదీతోనే సాధ్యం తప్ప టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలతో కాదని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు వ్యాఖ్యానించారు. జనచైతన్య యాత్రలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రజలు ఆనందంగా ఉన్నట్లుగా తెలంగాణ ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించిందని, అయినా కూడా ఇక్కడి ప్రజలు పనుల నిమిత్తం ముంబై వెళ్లాల్సి వచ్చిందంటే.. ఈ ప్రాంతాన్ని ఎలా అణగదొక్కారో అర్ధం అవుతుందన్నారు. రైతులకు లబ్ధి చేకూరేలా..పంటకు మద్ధతు ధర ప్రకటించి.. నా ద్వారా మోదీ ఇక్కడి ప్రజలకు సందేశం పంపించారని తెలిపారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో పట్టణాల్లో ఉన్న ప్రజలు జీవిస్తున్నట్లుగా.. రైతులు కూడా ఉండాలని అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతు కుటుంబంలో ఏ ఎక్కరైనా అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబం అప్పుల పాలయ్యే పరస్థితి ఏర్పడుతుందని.. ఆ పరిస్థితి మారేందుకు ఆయుష్మాన్ భవ పథకం తీసుకురాబోతున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో ఇక్కడి ప్రభుత్వం కారణంగా లబ్ధి పొందలేకపోతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితి మారాలంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. వరంగల్తో జనసంఘ్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే..ఈ జిల్లాకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఇప్పించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దేశ రక్షణ కోసం వరంగల్ ప్రజలు ముందుంటారు కాబట్టి మీరంతా బీజేపీ జెండా పట్టుకుని మద్ధతుగా నిలవాలని కోరారు. తాను ఇక్కడ పుట్టనప్పటికీ..తనను ఈ తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా పంపి మంత్రిని చేసినందుకు మీకు రుణపడి ఉంటానని తెలిపారు. -
పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని కోరారు. ‘పసుపు సాగు.. ఎగుమతులు’అనే అంశంపై సోమవారం వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల మంత్రులను కలిశానని, ఐదుగురు ముఖ్యమంత్రులు పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతుగా లేఖలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. రబ్బర్, సిల్క్కు బోర్డు ఏర్పాటు చేసిన విధంగానే పసుపుకూ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఉడకబెట్టిన పసుపు ఎండబెట్టేందుకు యంత్రాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయో లేదో కేంద్రం అధ్యయనం చేయాలని కోరారు. మేలైన రకాల పసుపు విత్తనాలను అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరామన్నారు. అయితే బోర్డు ఏర్పాటు కుదరదని, ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారన్నారు. ఆ విధంగానే పసుపు సెల్ ఏర్పాటు చేశారని ఆమె వివరించారు. 1990లో 7 లక్షల మెట్రి క్ టన్నుల పసుపు ఉత్పత్తి కాగా నేడు 3 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు శాతమే పసుపు ఎగుమతి జరుగుతోందన్నారు. గతంలో ఎంపీలు పట్టించుకోలేదు: జీవన్రెడ్డి గతంలో ఎంపీలు పసుపు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. కవిత ఎంపీ అయ్యాక పసుపు రైతుల గురించి అనేకసార్లు కేంద్రంతో చర్చలు జరిపారన్నారు. అనేక రాష్ట్రాలు తిరిగి పసుపుపై అధ్యయనం చేశారన్నారు. ప్రత్యేక పసుపు సెల్ ఏర్పాటుకు ఎంపీ కవితనే కారణమన్నారు. నిజామాబాద్ జిల్లా రైతాంగం ఎంపీ కవితకు రుణపడి ఉంటారన్నారు. ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ, ఎంపీ కవిత కృషి వల్ల పసుపుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారన్నారు. పసుపు బోర్డు కోసం అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశామని గుర్తు చేశారు. కాగా, ఈ వర్క్ షాప్లో రైతులు, ట్రేడర్లు, సైంటిస్టులు, అధికారులు ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. పలు అంశాలపై నిపుణులు సందేహ నివృత్తి చేస్తూ పసుపు ఉత్పాదకత పెంపు, సాగులో మెళకువలు, మార్కెట్ వ్యూహాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్పైసెస్ బోర్డు వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ లింగప్ప, కొచ్చి మార్కెటింగ్ డైరెక్టర్ పీఎం.సురేశ్కుమార్, పరిశోధన, అభివృద్ధి విభాగం డైరెక్టర్ డాక్టర్ ఏబీ రేమాశ్రీ తదితరులు పాల్గొన్నారు. కేంద్రానికి రైతుల డిమాండ్లు.. - పసుపు కుర్కుమిన్ నాణ్యతను పరీక్షించే విధానం వ్యవసాయ మార్కెట్లలో ఉండాలి. - ధర పడిపోయినప్పుడు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయాలి. - పసుపును ఆరబెట్టేందుకు సామూహిక కల్లాలను నిర్మించాలి. -
ఈ-కామర్స్ కంపెనీలపై స్మార్ట్ఫోన్ దిగ్గజాలు ఫిర్యాదు
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్లపై కఠిన చర్యలు?
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ కంపెనీలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లపై స్మార్ట్ఫోన్ దిగ్గజాలు ఆపిల్, నోకియా, వివో వంటి కంపెనీలు ఫిర్యాదు చేశాయి. మొబైల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఈ-కామర్స్ కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయని ఈ హ్యాండ్సెట్ తయారీదారుల లాబీ ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్(ఐసీఏ), వాణిజ్య మంత్రి సురేష్ ప్రభుకు ఫిర్యాదు చేసింది. విదేశీ మూలధనాన్ని భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేయడానికి వాడుతున్నాయని ఐసీఏ ఆరోపిస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీఏ కోరుతోంది. ఇన్వెస్టరీని పెట్టుకుని, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలను ప్రభావితం చేస్తూ.. ఎఫ్డీఐలోని ప్రెస్ నోట్ 3 కిందనున్న నిబంధనను కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయని ఐసీఏ పేర్కొంటోంది. దీంతో ఆఫ్లైన్ రిటైలర్ల రెవెన్యూలు హరించుకుపోతున్నాయని, దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని ఐసీఏ తెలిపింది. ఈ పరిస్థితిపై అమెజాన్, ఫ్లిప్కార్ట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా మొబైల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తుల ధరలను ఇవి ప్రభావితం చేస్తున్నాయని సురేష్ ప్రభుకు తెలియజేసింది. ప్రెస్ నోట్ 3 నిబంధనలను, ఇతర చట్టాలను ఉల్లంఘించే వారిపై మనీ లాండరింగ్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కోరుతోంది. ఈ కంపెనీలను దేశానికి వ్యతిరేకంగా ఎకనామిక్ టెర్రరిజం చేపడుతున్నాయని భావించాలని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను అమెజాన్ కొట్టిపారేసింది. తాము దేశీయ చట్టాలకు, నిబంధనలకు కట్టుబడి ఉన్నామని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు. విక్రయదారులు నిర్ణయించిన ధరలను అమెజాన్.ఇన్ మార్కెట్ప్లేస్లో ఆఫర్ చేస్తున్నాని పేర్కొన్నారు. ఫ్లిప్కార్ట్ మాత్రం దీనిపై స్పందించలేదు. ఐసీఏ, హ్యాండ్సెట్ తయారీదారులు ఆపిల్, మైక్రోమ్యాక్స్, నోకియా, వివో, లావా, మోటోరోలా, లెనోవా వంటి కంపెనీల లాబీ సంస్థ. -
ఆయన కోలుకుంటున్నారు: కేంద్రమంత్రి ట్వీట్
పనాజి : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహార్ పారికర్ ప్రస్తుతం కోలుకుంటున్నారని కేంద్రమంత్రి సురేష్ ప్రభు ట్విట్ చేశారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో గతకొంత కాలంగా ఇబ్బంది పడుతున్న పారికర్ అమెరికాలో వైద్యం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పారికర్ ఆరోగ్యంపై వాకాబు చేసిన సురేష్ ప్రభు.. ‘ప్రస్తుతం పారికర్ వైద్యానికి స్పందిస్తున్నారు, వేగంగా కోలుకుని, త్వరలోనే రాష్ట్రానికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను’ అని తన ట్వీటర్లో పేర్కొన్నారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో పారికర్ ఫిబ్రవరి 14న ముంబాయిలోని లీలావతి హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజునే ఆయన రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన అనంతరం సమస్య తీవ్రం కావడంతో పారికర్ పనాజీలోని గోవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చేరారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మార్చి మొదటి వారంలో ఆయనను అమెరికా తీసుకెళ్లారు. కాగా సీఎం రాష్ట్రంలో లేని కారణంగా ముగ్గురు మంత్రుల బృందం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. -
ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ఎయిర్ కార్గో కార్యకలాపాలు ప్రోత్సహించడం, ఉడాన్ స్కీమ్ కింద 56 కొత్త ఎయిర్పోర్ట్లలో త్వరితగతిన కార్యకలాపాలు ప్రారంభించడం అనేవి పౌరవిమానయాన శాఖ ముందున్న ప్రధాన అంశాలని వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ఆయన సోమవారం పౌరవిమానయాన శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ కలిగిన చైనాతో పోలిస్తే భారత్లో ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతోందని తెలిపారు. ప్రయాణికుల సంఖ్యలో 16–20 శాతం వృద్ధి నమోదవుతోందన్నారు. ‘ప్రయాణికుల సేవలు, కనెక్టివిటీ మెరుగుదలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నాం. ఉడాన్ స్కీమ్ కింద కొత్తగా 56 ఎయిర్పోర్ట్లు అనుమతులు పొందాయి. వీలైనంత త్వరగా వీటిల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని చూస్తున్నాం. దీని వల్ల కనెక్టివిటీ మరింత పెరుగుతుంది’ అని వివరించారు. -
రాజు స్థానంలో ప్రభు
న్యూఢిల్లీ: పౌర విమానయాన శాఖ మంత్రిగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. పి. అశోక్గజపతి రాజు ఈ పదవికి రాజీనామా చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిఫారసు మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో రైల్వే మంత్రిగా పనిచేసిన సురేశ్ ప్రభు.. 2017లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అంతకుముందు ఆ శాఖను నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ రక్షణ శాఖ మంత్రిగా నియమితులవడంతో వాణిజ్య, పరిశ్రమల శాఖను ప్రభుకు కేటాయించారు. 2000 నుంచి 2002 వరకు వాజపేయి ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. -
సురేశ్ ప్రభుకు విమానయాన శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు అదనంగా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ బాధ్యతలను శనివారం ప్రభుత్వం అప్పగించింది. విమానయాన శాఖా మంత్రిగా పనిచేస్తున్న టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు రాజీనామాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించిన మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ సలహా మేరకు రాష్ట్రపతి కోవింద్ పౌరవిమానయాన శాఖ అదనపు బాధ్యతలను సురేశ్ ప్రభుకు అప్పగించారని రాష్ట్రపతిభవన్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. -
పౌర విమానయాన శాఖా మంత్రిగా సురేశ్ ప్రభు
సాక్షి, న్యూఢిల్లీ : అశోక గజపతిరాజు మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పౌరవిమానయాన శాఖా మంత్రిగా సురేశ్ ప్రభు నియమితులయ్యారు. 2014 నుంచి 17 వరకు రైల్వే మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శివసేనను వదిలి 2014లో సురేశ్ ప్రభు బీజేపీలో చేరారు. ప్రస్తుతం వాణిజ్య శాఖామంత్రిగా పని చేస్తున్న ఆయనకు పౌరవిమానయాన శాఖను కేటాయించారు. -
పసుపు బోర్డుపై స్పందించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కె తారకరామారావు రాసిన లేఖకు కేంద్ర మంత్రి స్పందించారు. స్పైసెస్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ కోరకు ప్రత్యేకంగా ఒక సెల్ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. పసుపు పంట మార్కెటింగ్ రీసెర్చీ ద్వారా పంట అభివృద్ది చేయాల్సిన బాద్యత కేంద్ర, రాష్ట్రాల వ్యవసాయ శాఖలపై ఉందని సురేష్ ప్రభు అన్నారు. స్పైసెస్ బోర్డు పసుపుతో పాటు ఇతర ఎగుమతులు, నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం ప్రత్యేక సెలల్ను స్పైసెస్ బోర్డులో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీం పథకం కింద ప్రత్యేకంగా ఓస్పైసెస్ పార్క్ను కూడా నెలకొల్పుతామని ఆయన లేఖలో పేర్కొన్నారు. -
భారత్ కంటే మేమే ముందు
-
భారత్ కంటే మేమే ముందు
విశాఖపట్నం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈడీబీ) ర్యాంకుల్లో తాము భారతదేశం కంటే ముందంజలో ఉన్నామని, ప్రపంచ దేశాలతోనే తమకు పోటీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఆదివారం ‘రిఫామ్ కాలిక్యులస్–ప్రమోటింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’అనే అంశంపై జరిగిన సెమినార్లో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈడీబీ ర్యాంకుల్లో భారత్ ప్రస్తుతం 100వ స్థానంలో ఉందని, రాష్ట్రానికి వచ్చిన పాయింట్ల ఆధారంగా చూస్తే ఏపీ 88వ ర్యాంకులో ఉంటుందన్నారు. 86.6 పాయింట్లతో న్యూజి లాండ్ మొదటి స్థానంలో ఉండగా, 60.8 పాయింట్లతో ఇండియా 100వ స్థానంలో ఉందని తెలిపారు. దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్లో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు 63.6 పాయింట్లు వచ్చాయని, వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 88వ ర్యాంకు వస్తుందన్నారు. దేశంలో తాము మొదటి స్థానంలో కొనసాగుతామని, తమకు ఇక్కడ ఎవరూ పోటీ కాదని వెల్లడించారు. ప్రపంచంలో టాప్–5 దేశాల్లో ఒకటిగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కేంద్రం వేగంగా స్పందించాలి దేశీయంగా తమ ర్యాంకు మూడు నెలల్లో 64, 9 నెలల్లో 40కి చేర్చేందుకు రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు చంద్రబాబు వివరించారు. ఈడీబీ ర్యాంకుల లెక్కింపులో ప్రధానంగా 10 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని, ఇందులో 7 అంశాలు కేంద్రం పరిధిలో, 3 అంశాలు రాష్ట్రం పరిధిలో ఉంటాయన్నారు. కాబట్టి కేంద్రం వేగంగా స్పందిస్తే ర్యాంకు మరింత మెరుగవుతుందన్నారు. కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. కొత్త ఆవిష్కరణలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సీఐఐ సదస్సులో ‘టెక్నాలజీస్ ఫర్ టుమారోస్’అనే అంశంపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్లీజ్ ఆఫ్ డూయింగ్ ఉండాలి: సురేష్ ప్రభు దేశంలో చేపట్టిన సంస్కరణల వల్ల ఈడీబీలో ఇండియా ర్యాంకు మరింత మెరుగవుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం సీసీఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ.. వ్యాపారం అనేది సంతోషంగా చేయాలని, అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ కాకుండా ప్లీజ్ ఆఫ్ డూయింగ్ ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ నియమ నిబంధనలకు సంబంధించిన బుక్లెట్ను సురేష్ ప్రభు ఆవిష్కరించారు. అనంతరం కాకినాడలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఎఫ్టీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ) క్యాంపస్లకు శంకుస్థాపన చేశారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రూపొందించిన ఈ–స్పైస్ బజార్ వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. ‘ఎంపెడా’రూపొందించిన ఎన్రోల్మెంట్ కార్డులను ఆక్వా రైతులకు అందచేశారు. -
‘ఫార్మా’ వృద్ధికి ఊతమిస్తాం..
సాక్షి, హైదరాబాద్ : ఫార్మా రంగంలో పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూనే సామన్యుడి వైద్య ఖర్చులు పెరగకుండా చూడాల్సిన అవసరముందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ఫార్మా రంగం 20 ఏళ్లలో అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందని, మారుతున్న ప్రపంచంలో ఈ రంగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న బయో ఆసియా సదస్సులో శనివారం సురేశ్ ప్రభు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనిషి ఆయుఃప్రమాణాలు పెరుగుతున్న తీరు ఫార్మా రంగానికి డిమాండ్ కల్పిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆరోగ్య పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు లక్ష వెల్నెస్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆరేడు గ్రామాలకు ఒకటి చొప్పున ఏర్పాటయ్యే ఈ కేంద్రాలు వైద్యాన్ని సామాన్యుడి చెంతకు తీసుకుపోవడంతోపాటు ఫార్మా కంపెనీలకు కొత్త మార్కెట్లను సృష్టిస్తాయని చెప్పారు. ఫార్మా రంగంపై ప్రభుత్వ నియంత్రణ గురించి మాట్లాడుతూ.. మనిషి జీవితానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ రంగంపై నియంత్రణలు తప్పనిసరి అని, భవిష్యత్తులో మరిన్ని నియంత్రణలూ రావచ్చని చెప్పారు. ఫార్మా కంపెనీలు అల్లోపతి మందులతోపాటు ఆయుర్వేదం, సిద్ధ వంటి ఇతర వైద్య విధానాలపైనా దృష్టి పెట్టి కొత్త మందులు తయారు చేయాలని.. తద్వారా తక్కువ ఖర్చుతో పరిపూర్ణ వైద్యం అందించడం వీలవుతుందన్నారు. ప్రోత్సాహకాలు ఇవ్వండి: కేటీఆర్ ఫార్మా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు తీసుకెళ్లారు. మందుల ధరలను నిర్ణయించే విషయంలో తమతో సంప్రదింపులు జరపాలన్న పారిశ్రామిక వర్గాల విన్నపంపై ప్రభు స్పందిస్తూ.. ఈ విషయాన్ని నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ చూసుకుంటుందని సమాధానమిచ్చారు. రసాయనాలు, ఫార్మా మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఈ అంశాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఫార్మా పరిశ్రమలు కొత్త మందులను కనుగొనే లక్ష్యంతో పరిశోధనల కోసం భారీ ఖర్చు పెడుతుంటాయని, వీటిపై రాబడులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని పరిశ్రమల తరఫున కేటీఆర్ కోరారు. దీనికి ప్రభు స్పందిస్తూ.. ఈ అంశాన్ని పరిశ్రమలకు ఇచ్చే ప్యాకేజీగా చూడకూడదని.. మందుల తయారీ వల్ల ఎన్నో సామాజిక ప్రయోజనాలు ఉన్న కారణంగా మొత్తం సమాజానికి ఇచ్చే ప్రోత్సాహకాలుగా చూడాలని చెప్పారు. 1999లో ప్రైవేట్ సంస్థలు పరిశోధనలపై పెట్టే ఖర్చులో రాయితీలు ఇచ్చేందుకు రూ.50 కోట్లు కేటాయించారని అలాంటి పథకాన్ని మళ్లీ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు వార్రూమ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
సంస్కరణలతో పన్నులు తగ్గుతాయి
విశాఖపట్టణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాహసోపేతమైన సంస్కరణల వల్ల ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు కనిపించినా దీర్ఘకాలంలో పలు ప్రయోజనాలు చేకూరతాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. సంస్కరణల వల్ల దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగితే పన్ను రేట్లు దిగొస్తాయన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ భాగస్వామ్య సదస్సును శనివారం విశాఖలో ఉప రాష్ట్రపతి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో పన్ను చెల్లించే వారి సంఖ్య 6.74 కోట్ల నుంచి 8.28 కోట్లకు పెరిగిందని, ఇది మరింత పెరిగితే పన్ను రేట్లు కూడా దిగొస్తాయని ఉప రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.సంస్కరణలు, సమర్థవంతమైన నాయకత్వం, స్థిరమైన వృద్ధి రేటుతో దూసుకుపోతున్న భారత్లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారని ఉప రాష్ట్రపతి తెలిపారు. వచ్చే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 2.3 ట్రిలియన్ డాలర్ల నుంచి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం ద్వారా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించనుందన్నారు. ఏపీ అన్నిట్లో ఎదగాలి: కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. ఏపీ పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఉద్యోగ కల్పనలోనూ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. తూర్పు తీరంలో అతి పెద్ద ఆటో కాంపొనెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోందని, దీన్ని ఏపీలో నెలకొల్పాలన్న వినతిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
ఉదయ్ లేదా!
సాక్షి, విశాఖపట్నం: ‘ఉదయ్’.. (ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఏసీ యాత్రి) మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేందుకు ఉద్దేశించిన డబుల్ డెక్కర్ రైలు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే విశాఖ–విజయవాడల మధ్య దీనిని ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించి రెండేళ్లయింది. ఈ ట్రైన్కు 22701 నంబరును కూడా ప్రకటించారు. ఏడాదిలోగా ‘ఉదయ్’ను పట్టాలెక్కిస్తామని అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ దీనిపై ప్రకటన వెలువడుతుందని అంతా ఆశించారు. ప్చ్.. కనీసం దాని ప్రస్తావనే తేవడం మానేశారు. దీంతో దీని రాక ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ ‘ఉదయ్’ డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కితే విశాఖ–విజయవాడల మధ్య రాకపోకలు సాగించే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చార్జీలు తక్కువ.. ఈ ఏసీ రైలులో టిక్కెట్ చార్జీలు కూడా అందుబాటులోనే ఉంటాయి. ఎక్స్ప్రెస్ రైలు థర్డ్ ఏసీకంటే తక్కువ, స్లీపర్ చార్జీలుకంటే కాస్త ఎక్కువగా ఉండనున్నాయి. విశాఖపట్నం నుంచి విజయవాడకు స్లీపర్ క్లాస్ టిక్కెట్టు రూ.240, థర్డ్ ఏసీ టిక్కెట్టు రూ.560 ఉంది. అంటే ఈ లెక్కన ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు టిక్కెట్ చార్జీ రూ.400 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఎందుకు ఆలస్యం? ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలుకు అవసరమైన బోగీల తయారీలో జాప్యం జరుగుతోందని, అందువల్లే దీనిని ప్రారంభించడానికి ఆలస్యమవుతోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ డబుల్ డెక్కర్ బోగీల నిర్మాణం పంజాబ్లోని కపుర్తలా కోచ్ తయారీ కేంద్రంలో జరుగుతోంది. కోచ్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాక తొలుత ఉత్తర రైల్వేలో ప్రయోగాత్మకంగా నడుపుతారు. ఈ ఉదయ్ డబుల్ డెక్కర్ బోగీలను కూడా ఆ రైల్వేలోనే ప్రయోగాత్మకంగా నడిపి చూసి సంతృప్తి చెందాక తూర్పు కోస్తా రైల్వేకు అప్పగిస్తారు. ఆ తర్వాత అధికారికంగా ఈ రైలును ప్రారంభిస్తారు. ఇప్పటికే విశాఖ–తిరుపతిల మధ్య ఒక డబుల్ డెక్కర్ రైలు నడుస్తోంది. -
విదేశాల్లో రెండుసార్లు చిక్కితే పాస్పోర్ట్ రద్దు!
సాక్షి, న్యూఢిల్లీ : పర్యాటక, సందర్శక వీసాలతో విదేశాలకు వెళ్లి పనిచేస్తూ పట్టుబడిన కార్మికుల పాస్పోర్టులను ఐదేళ్ల పాటు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్మికులు అలా పట్టుబడినప్పుడు ఆయా దేశాలతో మాట్లాడి విడిపించినా.. వారు మళ్లీ అదే తరహాలో విదేశాలకు వెళ్లి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకే పాస్పోర్టుల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నారై సంక్షేమ శాఖ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వివరాలు వెల్లడించారు. ఈ భేటీలో పాల్గొన్న మంత్రి కె.తారకరామారావు అనంతరం మీడియాతో మాట్లాడారు. విదేశాల్లో ఒకసారి చిక్కుకుని కేంద్ర ప్రభుత్వ సాయంతో స్వదేశానికి చేరుకుంటున్న కొందరు కార్మికులు... తిరిగి అదేబాట పడుతున్నారని కేంద్రం గుర్తించిందని తెలిపారు. ఈ పరిస్థితికి అడ్డుకట్టవేసేందుకు చర్యలు చేపట్టిందని, రెండు సార్లు విదేశాల్లో చిక్కుకున్న వారి పాస్పోర్టులను ఐదేళ్ల పాటు రద్దు చేయాలని నిర్ణయించిందని చెప్పారు. దానికి అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని వెల్లడించారు. సుష్మాకు ఆహ్వానం త్వరలో హైదరాబాద్లో జరగనున్న విదేశీ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సుష్మా స్వరాజ్ను ఆహ్వానించామని కేటీఆర్ తెలిపారు. విదేశాల్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో తెలుగువారికి సహాయపడేందుకు అక్కడి ఎంబసీల్లో తెలుగు మాట్లాడే సిబ్బందిని నియమించాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. అవసరమైతే రాష్ట్రం నుంచి డిప్యుటేషన్ మీద తెలుగు సిబ్బందిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించామని, కేంద్ర మంత్రి దీనిపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. విదేశాలకు పంపుతామంటూ ప్రచారం చేసుకునే నకిలీ ఏజెంట్ల పట్ల కఠిన వైఖరి అవలంబించాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర మంత్రి కోరారని తెలిపారు. పాస్పోర్టు సేవల్లో హైదరాబాద్ కేంద్రం మెరుగైన పనితీరును కనబరుస్తోందని కితాబిచ్చారని వెల్లడించారు. ఫార్మాసిటీకి ‘నిమ్జ్’ హోదా ఇవ్వండి సుష్మాస్వరాజ్తో సమావేశం అనంతరం కేటీఆర్ కేంద్ర వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభును కలిశారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి ‘జాతీయ పెట్టుబడులు, ఉత్పాదకత జోన్ (ఎన్ఐఎంజెడ్)’హోదా ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అలాగే అక్కడ కామన్ ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.1,500 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ స్పైస్ పార్కుకు కేంద్రం తరఫున ఇస్తామన్న రూ.20 కోట్లు విడుదల చేయాలని... హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–రామగుండం, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో మెగా లెదర్పార్క్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 22, 23 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బయో ఆసియా సదస్సుకు గౌరవ అతిథిగా రావాలని సురేశ్ ప్రభును కేటీఆర్ ఆహ్వానించారు. -
హార్వర్డ్ సదస్సుకు కేటీఆర్, అమరీందర్
వాషింగ్టన్: ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న 15వ భారత వార్షిక సదస్సుకు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు, పంజాబ్ సీఎం అమరీందర్, సినీ నటుడు కమల్ హాసన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ‘భారత్ – అద్భుత ఆవిష్కరణలు’ అనే అంశంపై చర్చ జరగనుంది. సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారక రామారావు, బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి, నటి దివ్య స్పందన, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆదిల్ జైనుల్బాయ్ తదితరులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
మూడు రెట్ల వృద్ధి:2.6 కోట్ల ఉద్యోగాలు
సాక్షి,న్యూఢిల్లీ: 2022 నాటికి ఆయుష్ రంగంలో మూడు రెట్ల పెరుగుదలను కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆయుష్ పరిశ్రమ భవిష్యత్తులో రెండంకెల వృద్ధిని సాధించనుందని, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభింస్తాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. 2020 నాటికి 26 మిలియన్ల మందికి పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఢిల్లీ నేటి (డిసెంబర్4) నుంచి మూడు రోజులపాటు జరగనున్న మొట్టమొదటి అంతర్జాతీయ వెల్నెస్, ఆరోగ్య 2017 సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో ఆయుష్ రంగం ప్రగతి దిశగా పయనిస్తోందని.. ఈ రంగంలో మున్ముందు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని సురేశ్ ప్రభు అన్నారు. 2020 నాటికి ఈ రంగం ప్రత్యక్షంగా 10లక్షల మందికి, పరోక్షంగా 2.5 కోట్ల మందిని ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధా, హోమియోపతి కలిసి ఉన్న ఆయుష్రంగం ద్వారా దేశీయంగా రూ. 500కోట్లను ఎగుమతుల ద్వారా రూ.200 వందలకోట్లను సాధిస్తుందని అంచనా వేసినట్టు చెప్పారు. సంప్రదాయ ఔషధాలపై అవగాహన కల్పించేందుకు భారత్తో కలిసి అనేక దేశాలు పనిచేస్తున్నాయని, అందుకు చాలా ఆనందంగా ఉందని కేంద్రమంత్రి ప్రభు వెల్లడించారు. దాదాపు 6,600 ఔషధ మొక్కల సంపదతో ప్రపంచంలోని ఆయుష్ మరియు ఔషధ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉందన్నారు. అలాగే ఆయుష్లో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. వైద్యరంగంలో స్టార్టప్లు పెట్టాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఈ రంగంలో అనేక అవకాశాలున్నాయని ప్రభు తెలిపారు.వచ్చే ఐదేళ్లలో ఆయుష్ రంగం మూడు రెట్ల పరిమాణాన్ని పెంచేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ సెక్రటరీ వైద్య రాజేష్ వెల్లడించారు. -
ఆ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు
సాక్షి,న్యూఢిల్లీ: వైద్య,ఆరోగ్య రంగం రెండంకెల వృద్ధి సాధించే క్రమంలో ఆయుష్ పరిశ్రమలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారు.2020 నాటికి ఆయుష్ పరిశ్రమలో పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 2.5 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు సమకూరుతాయని మంత్రి పేర్కొన్నారు. ఆయుర్వేద, యోగ,నేచురోపతి,యునాని,సిద్ధ,హోమియోపతి వైద్య విధానాలను కలిపి ఆయుష్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశ ఆయుష్ మార్కెట్ రూ 500 కోట్లుకాగా, రూ 200 కోట్ల మేర ఎగుమతులు సాగుతున్నాయి. హాలిస్టిక్ హెల్త్కేర్లో స్టార్టప్ల కోసం యువత ఆసక్తి కనబరుస్తోందని మంత్రి తెలిపారు. వెల్నెస్,ఆరోగ్య 2017 సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. సంప్రదాయ వైద్య విధానాల విషయంలో సాంకేతికత, విజ్ఞానాన్ని మేళవించేందుకు పలు దేశాలతో్ కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పారు. ఆయుష్ రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతించిందని తెలిపారు. -
ఆపిల్ రాక ఎంతో ఆనందదాయకం
ప్రపంచపు టెక్ దిగ్గజం ఆపిల్, తన కంపెనీ తయారీ యూనిట్ను భారత్లో ఏర్పాటుచేయడానికి కేంద్రం సపోర్టు ఇస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ అన్నారు. వారి నుంచి అధికారిక ప్రతిపాదన కోసం వేచిచూస్తున్నామని తెలిపారు. ''వారి నుంచి మంచి ప్రతిపాదన రావాల్సి ఉంది. ఆపిల్ రాక నిజంగా చాలా ఆనందదాయకం. ఆపిల్ ప్రపంచంలో టాప్ బ్రాండుల్లో ఒకటి. ఒకవేళ వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటే, వాటిని పరిష్కరించడానికి కృషిచేస్తాం. మేము అధికారిక ప్రతిపాదన కోసం వేచిచూస్తున్నాం'' అని సురేష్ ప్రభు అన్నారు. అయితే కూపర్టినోకి చెందిన ఈ కంపెనీ, భారత్లో తయారీ యూనిట్ను ఏర్పాటుచేయడానికి పలు రాయితీలను అభ్యర్థిస్తోంది. ప్రతిపాదించిన తయారీ యూనిట్లో ఎంత మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు, ఉద్యోగ వివరాలను వంటి వాటిని కేంద్రం ఆపిల్ నుంచి కోరుతోంది. కాగ, ఆపిల్ కోరుతున్న చాలా డిమాండ్లను కేంద్రం అంగీకరించడానికి సిద్ధంగా లేదని మార్చి నెలలో అప్పటి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
కొత్త రైల్వేమంత్రిగా మరో కేంద్ర మంత్రి?
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన రైల్వే ప్రమాదాల నేపథ్యంలో రైల్వేశాఖలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రైల్వే మంత్రిగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని నియమించే అవకాశం ఉందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతోపాటు రోడ్డు, రైల్వే ,రవాణా శాఖలను కలిపి ఒకటి చేయాలనికూడా ప్రభుత్వం యోచిస్తోందట. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రోడ్డు, రవాణా మంత్రి గా ఉన్న ఆయనకు అదనంగా ఈ బాధ్యతలను కూడా అప్పగించనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజా నివేదికల ప్రకారం సురేష్ ప్రభు రాజీనామాకు ఆమోదం లభిస్తుందనీ, ఆయన స్థానంలో కేంద్ర మంత్రి గడ్కరీ రైల్వేమంత్రి పదవిని చేపట్టనున్నారని తెలుస్తోంది. గత అయిదు రోజుల్లో రెండు బ్యాక్-టు-బ్యాక్ ప్రమాదాల కారణంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాజీనామాకు సిద్ధపడ్డారు. ప్రమాదాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దురదృష్టకరమైన ప్రమాదాలు, ప్రయాణీకులు విలువైన జీవితాలను కోల్పోవటం గాయపడటం తనకు చాలా బాధ కలిగించిందంటూ బుధవారం మధ్యాహ్నం రైల్వే మంత్రి వరుస ట్వీట్లలో ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేల మెరుగుకోసం తన రక్తాన్ని, చెమటను, అంకితం చేశానని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన అభిప్రాయాన్ని తెలిపానన్నారు. అయితే ప్రధాని వేచి వుండమని సూచించినట్టు ట్వీట్ చేశారు. అటు రైల్వే బోర్డు ఛైర్మన్ పదవికి ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఛైర్మన్ అశోక్ లోహానీ నియమితులయ్యారు. ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే బోర్డు ఛైర్మన్ అశోక్ మిట్టల్ స్థానంలో రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో అశ్వని లోహానిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అశ్వని ప్రస్తుతం ఎయిరిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు కేంద్ర క్యాబినెట్ లో అతి త్వరలోనే భారీ మార్పులు చేర్పులు జరగనున్నాయినే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో పళని స్వామి, పన్నీరు సెల్వం విలీనం తరువాత అన్నాడీఎంకేకు క్యాబినెట్లో బెర్త్ ఖాయం అనే వార్త హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఘోర రైలు ప్రమాదం : 23 మంది మృతి
-
పట్టాలు తప్పిన ఉత్కళ్
- యూపీలో ఘోర రైలు ప్రమాదం - 23 మంది మృతి.. 60 మందికి పైగా గాయాలు ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లో శనివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముజఫర్నగర్ జిల్లా ఖతౌలి వద్ద పూరీ–హరిద్వార్ ఉత్కళ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 23 మంది మృతిచెందగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. రైల్లోని 14 బోగీలు పట్టాలు తప్పడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఏటీఎస్ బలగాలు, వైద్య బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. భారీ క్రేన్లు, గ్యాస్ కట్టర్లతో బోగీల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. ప్రమాదతీవ్రతతో ఒక బోగీ ట్రాక్ పక్కనున్న ఇంట్లోకి దూసుకుపోగా.. రెండు బోగీలు ఒకదానిపైకి మరకొటి ఎక్కాయి. సహాయక చర్యల్లో స్థానికులు కూడా బలగాలకు సాయం చేస్తున్నారు. ఘటనాస్థలంలో పరిస్థితి భీతావహంగా మారింది. అంబులెన్సుల ద్వారా బాధితులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. శనివారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు మీరట్ జోన్ రైల్వే మెడికల్ అధికారి పీఎస్ మిశ్రా స్పష్టం చేశారు. ఎస్1 నుంచి ఎస్ 10 వరకు స్లీపర్ కోచ్లు, థర్ట్ ఏసీ బీ1, సెకండ్ ఏసీ ఏ1, ప్యాంట్రీ బోగీలు పట్టాలు తప్పాయన్నారు. ప్రమాదానికి కారణమేంటి? దుర్ఘటన విషయం తెలియగానే మొదట దీన్ని ఉగ్రవాద ఘటనగానే రైల్వే శాఖ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భావించాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, వైద్య బృందాలతోపాటుగా ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్)ను కూడా యూపీ సర్కారు రంగంలోకి దించింది. అయితే.. దుర్ఘటన జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన ఆధారాలతో.. మానవ తప్పిదమే ఈ ఘటనకు కారణమని యూపీ సర్కారు స్పష్టం చేసింది. ఏటీఎస్ కూడా దీన్ని ధ్రువీకరించింది. మీరట్–సహరాన్పూర్ డివిజన్లో పలుచోట్ల రైల్వే ట్రాక్కు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ విషయంపై ఆ మార్గంలో ప్రయాణించే రైలు డ్రైవర్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా రైలు వేగాన్ని డ్రైవర్ నియంత్రణలో ఉంచుకుంటారు. అయితే రిపేర్లు జరుగుతున్న విషయాన్ని డ్రైవర్కు సూచించకపోవటం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నార్తర్న్ రైల్వేలో చాలా రద్దీగా ఉండే ఈ లైన్ ద్వారా వెళ్లే రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ముజఫర్నగర్ అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటుచేశారు. 0131–2436918, 0131–2436103, 0131–2436564 నంబర్ల ద్వారా వివరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని, యూపీ సీఎం దిగ్భ్రాంతి ఈ ఘటనపై ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన బాధాకరమన్న మోదీ.. బాధితులను ఆదుకునేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ, యూపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ‘ముజఫర్నగర్ వద్ద రైలు పట్టాలు తప్పిన దుర్ఘటన బాధాకరం. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటన తమను కలచివేసిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి సురేశ్ ప్రభు విచారణకు ఆదేశించారు. తనే స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ దుర్ఘటన కారకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సహాయకచర్యలను వేగవంతం చేసేందుకు యూపీ సర్కారుతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.3.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25వేల పరిహారం ఇవ్వనున్నట్లు సురేశ్ ప్రభు వెల్లడించారు. యూపీ సీఎం యోగి కూడా మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, ఇద్దరు యూపీ మంత్రులు ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైల్వే బోర్డు చైర్మన్, ట్రాఫిక్ బోర్డు సభ్యులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చీకటి కారణంగా సహాయకచర్యలకు ఆటంకం కలగకుండా.. విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒడిశా బాధితులకు రూ.5లక్షలు ప్రమాద ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఒడిశా ప్రయాణికుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50వేలు పరిహారంగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని పట్నాయక్ ఆదేశించారు. కాగా, ప్రమాదానికి గురైన 14 బోగీల్లో కలిపి 80 మంది స్లీపర్ క్లాసులో, ఆరుగురు ఏసీ కోచ్లో పూరీలో ఎక్కినట్లు అధికారులు తెలిపారు. బాధితుల వివరాల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే 1072 టోల్ ఫ్రీ నంబర్ను ప్రారంభించింది. పట్టాలెక్కని కకోద్కర్ సిఫార్సులు ముజఫర్నగర్ దుర్ఘటన భారత రైల్వే భద్రతలోని డొల్లతనాన్ని మరోసారి స్పష్టం చేసింది. రైల్వే భద్రతా అంశాలను అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాలని కోరుతూ 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అనిల్ కకోద్కర్ అధ్యక్షతన ఓ కమిటీని నియమించింది. ఐదేళ్లు గడిచినా కమిటీ చేసిన సూచనల్లో చాలా మటుకు ఇంకా అమలుకు నోచుకోలేదు. అందులో... ఐదేళ్ల కాలానికి ప్రయాణికుల భద్రత కోసం లక్ష కోట్లు వెచ్చించడంతో పాటు, రైల్వే భద్రతా ప్రాధికార సంస్థ ఏర్పాటు లాంటివి ఉన్నాయి. రైల్వే బోర్డుపై పని ఒత్తిడి పెరిగినా, భద్రతా ప్రాధికార సంస్థపై ఎలాంటి పురోగతి జరగలేదు. కమిటీ చేసిన మరికొన్ని సిఫార్సులు ► రైల్వే కార్యకలాపాల పర్యవేక్షణకు సంస్థ ఏర్పాటు ► ఐదేళ్లలో అన్ని లెవల్ క్రాసింగ్ల ఎత్తివేత ► లెవల్ క్రాసింగ్లను తొలగించడానికి అయ్యే ఖర్చు రూ.50 వేల కోట్లు. నిర్వహణ ఖర్చు తగ్గించుకోవడం ద్వారా ఈ మొత్తాన్ని 8 ఏళ్లలో తిరిగి రాబట్టుకోవచ్చు. ► అన్ని బ్రిడ్జిల వద్ద నీటి మట్టాలు, నీటి ప్రవాహ వేగాలను తరచూ పర్యవేక్షించాలి. ► రైలు లోకోపైలట్కు సూచించేలా ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిల వద్ద నీటి మట్టాలను కొలిచే పరికరాలు, టర్బైన్ ఫ్లో మీటర్లను బిగించాలి. ► రూ. 20 వేల కోట్ల వ్యయంతో యూరప్ దేశాల మాదిరిగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. భారీ రైలు ప్రమాదాలు ► డిసెంబర్ 28, 2016: యూపీలోని కాన్పూర్ దేహత్ జిల్లాలో షెల్దా–అజ్మీర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 62 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ► నవంబర్ 20, 2016: యూపీలోని ఫతేపూర్ సమీపంలో కల్కా మెయిల్కు చెందిన 15 బోగీలు పట్టాలు తప్పడంతో దాదాపు 70 మంది మరణించగా.. వందల మంది గాయపడ్డారు. ► మే 28, 2010: పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో మావోయిస్టులు పట్టాలు తొలగించడంతో జ్ఞానేశ్వర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి 148 మంది మృతిచెందారు. ► సెప్టెంబర్ 9, 2002: హౌరా–ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ బిహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లాలోని దవే నదిలో పడడంతో 100 మంది మరణించగా.. 150 మంది గాయపడ్డారు. ► ఆగస్టు 2, 1999: 2,500 మందితో వెళ్తున్న రెండు రైళ్లు అస్సాంలోని గైసల్ సమీపంలో ఢీకొనడంతో 290 మంది మరణించారు. ► నవంబర్ 26, 1998: పంజాబ్లోని ఖాన్నా సమీపంలో పట్టాలు తప్పిన ఫ్రాంటియర్ మెయిల్ను జమ్ముతావి–షెల్దా ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో 212 మంది ప్రాణాలు కోల్పోయారు. ► సెప్టెంబర్ 14, 1997: అహ్మదాబాద్–హౌరా ఎక్స్ప్రెస్కు చెందిన 5 బోగీలు మధ్యప్రదేశ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని నదిలో పడడంతో 81 మంది దుర్మరణం చెందారు. ► ఆగస్టు 20, 1995: యూపీలోని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగిఉన్న కలింది ఎక్స్ప్రెస్ను పురుషోత్తమ్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో 400 మంది మరణించారు. ► ఏప్రిల్ 18, 1988: యూపీలోని లలిత్పూర్ సమీపంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. ► జూలై 8, 1988: కేరళలోని అష్టముది సరస్సులో ఐలాండ్ ఎక్స్ప్రెస్ పడడంతో 107 మంది మరణించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యూపీలో ఘోర రైలు ప్రమాదం
-
యూపీలో ఘోర రైలు ప్రమాదం
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్లోని ముజఫర్నగర్ ఖతౌలి వద్ద కళింగ ఉత్కల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో ఇప్పటివరకూ 23 మంది మరణించారు. పెద్దసంఖ్యలో ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాదంపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి మెడికల్ వ్యాన్స్, వైద్య సిబ్బంది చేరుకున్నాయని చెప్పారు. I am personally monitoring situation.Hv instructed senior officers to reach site immediately and ensure speedy rescue and relief operations https://t.co/OCpgUGhg5y — Suresh Prabhu (@sureshpprabhu) 19 August 2017 సహాయ కార్యక్రమాలపై తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, సహాయ చర్యలను వేగవంతం చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్ను ఆదేశించామన్నారు. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకూ 50 మంది ప్రయాణీకులను కాపాడినట్టు అధికారులు తెలిపారు. ఒడిశాలోని పూరి నుంచి ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు ట్రైన్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.3.5 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.50 వేలు ఎక్స్గ్రేషియాగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. -
యూపీలో ఘోర రైలు ప్రమాదం..
-
రైల్వే భూమి బదలాయింపు వేగిరం చేయండి
కేంద్ర మంత్రి సురేశ్ ప్రభును కోరిన దత్తాత్రేయ, టీఆర్ఎస్ నేతలు - వెంటనే దక్షిణ మధ్య రైల్వే జీఎంతో మాట్లాడిన ప్రభు - త్వరితగతిన రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ పరిధిలోని లాలా పేట్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన 12.6 ఎకరాల రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిన ప్రక్రియను వేగ వంతం చేయాలని రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీఆర్ఎస్ నేతలు కోరారు. రాష్ట్ర మంత్రి పద్మారావు, టీఆర్ఎస్ ఎంపీలు వినోద్కుమార్, కొండా విశ్వేశ్వరరెడ్డి, కె.కవిత, సీతారాంనాయక్, మల్లా రెడ్డి తదితరులు మంగళవారం ప్రభును పార్ల మెంటులో కలిశారు. ఈ సందర్భంగా భూమి బదలాయింపు ప్రక్రియ పురోగతిపై చర్చించారు. గతంలో సికింద్రాబాద్ పరిధిలో రైల్వే భూమిని బదలాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తిపై సురేశ్ ప్రభు సానుకూలంగా స్పందించారు. అయితే భూమి బదలాయింపు ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో సంబం« దిత ప్రాంతంలో పేదలకు 4 వేల వరకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుకు టీఆర్ఎస్ నేతలు వివరించారు. రైల్వే భూమికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం మరోచోట భూమి ఇచ్చేందుకు, లేదా డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. స్పందించిన ప్రభు.. దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్కుమార్ యాదవ్తో ఫోన్లో మాట్లాడి భూమి బదలా యింపు ప్రక్రియకు సంబంధించిన నివేదికను త్వరితగతిన తయారు చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప గించాలని సూచించారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం సందర్భంగా ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని రైల్వే సమస్యలను ప్రభు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే జీఎం అధ్యక్షతన ఎంపీలు హైదరాబాద్లో సమావేశం కానున్నారు. -
మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్..
న్యూఢిల్లీ: ప్రపంచకప్ ఫైనల్కు చేరిన భారత మహిళా జట్టులోని రైల్వే క్రికెటర్లకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పదోన్నతులతో సహా నగదు ప్రోత్సాహకాలిస్తామని, భారత్ జట్టు ఫైనల్లో గెలువాలని ఆకాంక్షిస్తూ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్( ఆర్ఎస్పీబీ) సెక్రటరీ రేఖా యాదవ్ మీడియాకు తెలిపారు. మిథాలీ సేనలోని 15 మంది సభ్యుల్లో 10 మంది రైల్వే ఉద్యోగులు ఉండటం విశేషం. కెప్టెన్ మిథాలీతో సహా వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఎక్తా బిష్త్, పూనమ్ రౌత్, వేధ కృష్ణమూర్తి, పూనమ్ యాదవ్, సుష్మా వర్మ, మోనా మెశ్రామ్, రాజేశ్వరి గైక్వాడ్, నుజాత్ పర్విన్లు రైల్వే ఉద్యోగులే. వీరి అద్భుత ప్రదర్శనతోనే భారత్ ఫైనల్కు చేరిందని రైల్వే శాఖ సంతోషం వ్యక్తం చేసింది. మిథాలీ నిలకడగా ఆడుతూ వన్డెల్లో ప్రపంచ రికార్డు నమోదు చేయగా, వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సెమీస్లో ఆస్ట్రేలియా పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. రాజేశ్వరి గైక్వాడ్, ఎక్తా బిష్త్ బౌలింగ్తో చెలరేగగా, వేద కృష్ణమూర్తి న్యూజిలాండ్తో మెరుపు బ్యాటింగ్ చేసింది. -
ఫిర్యాదు చేస్తే వెకిలి నవ్వులు.. కేంద్ర మంత్రి ఫైర్
ముంబయి: ముంబయి లోకల్ రైలులో ఓ 22 ఏళ్ల విద్యార్థినిపట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. కళ్లతో సైగలు చేయడంతోపాటు వెకిలిచేష్టలు చేస్తూ చెప్పరాని విధంగా చేశాడు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా రైల్వే పోలీసులు కంప్లెయిట్ తీసుకోకపోగా వెకిలి నవ్వులు నవ్వడం మొదలుపెట్టారు. దీంతో తాను ఎదుర్కొన్న భయానక సంఘటనను ఫేస్బుక్ ద్వారా ఆమె సోషల్ మీడియాలోకి తీసుకొచ్చింది. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దర్యాప్తునకు ఆదేశించారు. ఘటన విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని, సదరు పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ట్వీట్ కూడా చేశారు. బాధితురాలు ఫేస్బుక్లో తెలిపిన వివరాల ప్రకారం.. మరో ప్రయాణీకురాలితో కలిసి ఆమె ప్రత్యేక మహిళల రైలు బోగీలో కూర్చొని ఉంది. మరో బోగీకి వీరు కూర్చున్న బోగీకి మధ్య ఇనుప రెయిలింగ్ అడ్డుగా ఉంది. అవతలి బోగీలో ఉన్న ఉన్న వ్యక్తి ఆమె పక్కనే ఉన్న మహిళకు చేయి ఊపడం గమనించింది. అయితే, తొలుత ఆ వ్యక్తికి మతి స్థిమితం లేదని అనుకున్నారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం తన చేష్టలు ఆపకుండా నోటితో చెప్పలేని విధంగా చేస్తూ దుర్మార్గంగా వ్యవహరించాడు. అనంతరం వారిద్దరిని ఇబ్బందికరంగా తిట్టడమే కాకుండా లైంగిక దాడి చేస్తానంటూ బెదిరించాడు. ఇదే విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారు కేసు నమోదు చేసుకోకపోగా వారిని చూసి నవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఆమె సోషల్ మీడియాను ఆశ్రయించినట్లు తెలిపింది. -
విజయవాడ రైల్వేస్టేషన్కు మహర్దశ
► ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంతో కార్పొరేట్ హంగులు ► నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ► విజయవాడకు రానున్నరైల్వేమంత్రి సురేష్ ప్రభు విజయవాడ రైల్వేస్టేషన్లోని ప్రతి ప్లాట్ఫాం అత్యాధునిక ఎస్కలేటర్లతో ప్రయాణికులకు ఆహ్వానం పలకనున్నాయి. 1, 6, 7, 8, 9 ప్లాట్ఫాంలపై అత్యాధునిక ఫుడ్కోర్టులు ఏర్పాటు కానున్నాయి. వీటితోపాటు మల్టీఫంక్షన్ హాల్లు, థియేటర్స్, షాపింగ్ మాల్స్, ఎగ్జిక్యూటివ్ లాంజ్లు, ఏసీ వెయిటింగ్ హాల్లు, పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కోసం మినీ థియేటర్స్ ప్రయాణికులకు వరల్డ్క్లాస్ సౌకర్యాలను తలపించనున్నాయి. రైల్వేస్టేషన్ (విజయవాడ): ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంతో విజయవాడ రైల్వే స్టేషన్కు కార్పొరేట్ హంగులు అమరునున్నాయి. రాజధాని నేపథ్యంలో విజయవాడకు ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయ్యింది. రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద 195 కోట్లతో పి.పి.పి(ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో పనులు చేపట్టనున్నారు. రైల్వేమంత్రి సురేష్ ప్రభు విజయవాడలో గురువారం పనులను ప్రారంభించనున్నారు. నెలాఖరుకు బిడ్లను ఖరారు చేస్తారని రైల్వే వర్గాలు తెలిపాయి. విజయవాడ నగర శివార్లలో, రాయనపాడు సమీపంలో ఇప్పటివరకు నిరుపయోగంగా ఉన్న వందలాది ఎకరాల రైల్వే స్థలాలను సైతం పి.పి.పి పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. దీంతో డివిజన్తోపాటు విజయవాడ రైల్వేస్టేషన్ ఆదాయం కూడా గణనీయంగా పెరగనుంది. నిత్యం విజయవాడ మీదుగా 350కి పైగా ఎక్స్ప్రెస్, పాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం అన్సీజన్లో లక్ష, సీజన్లో లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు ఈ స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. రీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా విమానాశ్రయ తరహాలో సౌకర్యాలు అమరనున్నాయి. ప్రతి ప్లాట్ఫాంకు ఎస్కలేటర్... స్టేషన్లోని పది ప్లాట్ఫాంలపై అత్యాధునిక ఎస్కలేటర్లు, 1, 6, 7, 8, 9 ప్లాట్ఫాంలపై అత్యాధునిక ఫుడ్కోర్టులు, మల్టీఫంక్షన్ హాల్లు, థియేటర్స్, షాపింగ్ మాల్స్, ఎగ్జిక్యూటివ్ లాంజ్లు, ఏసీ వెయిటింగ్ హాల్లు, చిల్ట్రన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం మినీ థియేటర్స్ను నిర్మించనున్నారు. ఇప్పటికే వైఫై, డీజీ పే వంటి సౌకర్యాలు ప్రయాణికులకు అమరాయి. వివిధ రైళ్ల రాక ఆలస్యమైన ప్రయాణికులకు వినోదాన్ని అందించటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పీపీపీ పద్ధతిలో రైల్వే స్థలాల అభివృద్ధి... సత్యనారాయణపురం, సింగ్నగర్, రాయనపాడులో ఖాళీగా ఉన్న 200 ఎకరాల రైల్వే స్థలాలను పి.పి.పి పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. అదే విధంగా ప్రయాణికులు బస చేసేందుకు అత్యాధునిక విశ్రాంతి మందిరాలను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ స్టేషన్ ఎదురుగా ఉన్న 2 ఎకరాల స్థలంలో అత్యాధునిక మల్టీలెవల్ ఫంక్షన్ హాల్, విశాలమైన కార్ పార్కింగ్ స్టాండ్, ద్విచక్రవాహనాల పార్కింగ్ స్టాండ్లను నిర్మించనున్నారు. ప్రయాణికుల లగేజీని భద్రపరుచుకునేందుకు అత్యాధునిక క్లోక్ రూంలను నిర్మించనున్నారు. గురువారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు పనులను ప్రారంభించనున్నారు. జూన్ నెలాఖరుకు టెండర్లను ఖరారు చేస్తారని రైల్వే వర్గాలు తెలిపాయి. వీటితో పాటు కొత్త రైళ్లు, పలు అభివృద్ధి పనులు ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారని సమాచారం. ఇప్పటికే రైల్వేస్టేషన్కు రోజుకు సుమారు రూ.80లక్షల ఆదాయం వస్తోంది. ఈ అత్యాధునిక సౌకర్యాల ఏర్పాటుతో ఈ ఆదాయం మరింత పెరగనుంది. అత్యాధునిక సౌకర్యాల కల్పనతో విజయవాడ రైల్వేస్టేషన్ ప్రయాణికులకు వరల్డ్ క్లాస్ స్టేషన్ అనుభూతిని కలిగించనుంది. -
తిరుపతి నుంచి ఢిల్లీకి హమ్సఫర్ ఎక్స్ప్రెస్
గురువారం ప్రారంభించనున్న రైల్వే మంత్రి తిరుపతి అర్బన్: ఢిల్లీ వెళ్లేందుకు పూర్తి ఏసీ బోగీలతో కూడిన ఎక్స్ప్రెస్ రైలు రాయలసీమ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. తిరుపతి–జమ్ముతావి మధ్య హమ్సఫర్ ఎక్స్ప్రెస్ పేరుతో నడవనున్న ఈ రైలును రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఈ హమ్సఫర్ ఎక్స్ప్రెస్(22705) ప్రతి మంగళవారం సాయంత్రం 5.10కి తిరుపతి నుంచి బయల్దేరి గురువారం రాత్రి 9.10కి జమ్ముతావి చేరుకుంటుంది. ఈ రైలు(22706) తిరిగి జమ్ముతావి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 5.30కు బయల్దేరి ఆదివారం ఉదయం 11.20కి తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోనీ, మంత్రాలయం రోడ్డు, రాయచూర్ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఖాజీపేట, రామగుండం, నాగపూర్, ఢిల్లీ, అంబాలా, లూథియానా, మీదుగా జమ్ముతావి వెళుతుంది. -
‘స్వచ్ఛ’ సికింద్రాబాద్
- దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో రెండో స్థానం - విశాఖకు టాప్, విజయవాడకు నాలుగో స్థానం - ఏృ కేటగిరీ స్టేషన్లలో ఖమ్మం, మంచిర్యాల, వరంగల్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే స్వచ్ఛ రైల్వేస్టేషన్గా విశాఖపట్నం స్టేషన్ గుర్తింపు పొందింది. తర్వాతి స్థానంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిలిచింది. విజయవాడ రైల్వే స్టేషన్కు నాలుగో స్థానం లభించింది. దేశంలో రద్దీ తీవ్రంగా ఉండే దాదాపు 75 రైల్వే స్టేషన్లలో స్వచ్ఛతపై థర్డ్ పార్టీ రూపొందించిన ఆడిట్ నివేదికను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. దీంతో పాటు స్వచ్ఛ రైల్ పోర్టల్ను కూడా ఆయన ఆవిష్కరించారు. పార్కింగ్ ప్రాంతం, ప్రధాన ప్రవేశ ప్రాంతం, ప్రధాన ప్లాట్ఫాం, వేచి ఉండే గది, ప్రయాణికుల స్పందన, తదితర పరిమితుల ఆధారంగా ఈ ఆడిట్ను నిర్వహించారు. ఇందులో అత్యంత స్వచ్ఛత పాటిస్తున్న ఏృ1 కేటగిరీ స్టేషన్లలో తొలి 10 స్థానాల్లో వరుసగా విశాఖ, సికింద్రాబాద్, జమ్ముతావి, విజయవాడ, ఆనంద్ విహార్ టర్మినల్, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, పుణే, బెంగళూరు సిటీ స్టేషన్లు నిలిచాయి. అలాగే ఏృకేటగిరీ స్టేషన్ల జాబితాలో బియాస్, ఖమ్మం, అహ్మద్నగర్, దుర్గాపూర్, మంచిర్యాల, బద్నెర, రంగ్ ఇయా జంక్షన్, వరంగల్, దమో, భుజ్ టాప్ టెన్ ర్యాంకులు సాధించాయి. రైల్వే జోన్ల విభాగంలో ఆగ్నేయ మధ్య రైల్వే, తూర్పుకోస్తా రైల్వే, సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, పశ్చిమ రైల్వే, నైరుతి రైల్వే, ఈశాన్య రైల్వే, వాయవ్య రైల్వే, దక్షిణ రైల్వే, ఉత్తర ఫ్రాంటియర్ రైల్వేలు తొలి పది ర్యాంకులు కైవసం చేసుకున్నాయి. కాగా ఏృ1 కేటగిరీ స్టేషన్లలో గడిచిన ఏడాదిలో స్వచ్ఛత విషయంలో గణనీయమైన వృద్ధి సాధించిన విషయంలో విశాఖ, విజయవాడ రైల్వేస్టేషన్లు ఉండగా ఏృకేటగిరీ స్టేషన్లలో ఖమ్మం, వరంగల్, అనంతపురం ఉన్నాయి. -
రైళ్లు ఆలస్యమయ్యాయో.. ఇక అంతే!
రైళ్లు ఆలస్యం అవుతున్నాయంటే పదే పదే ఫిర్యాదులు రావడంతో రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు సీరియస్ అయ్యారు. రైళ్లన్నీ సకాలంలో తిరిగేలా చూసుకోవాలని, లేకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీచేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఒక సీనియర్ అధికారి తప్పనిసరిగా నైట్ షిఫ్టులో ఉండాలని, ఏవైనా సమస్యలుంటే పరిశీలించి వెంటనే వాటిని పరిష్కరించాలని, తద్వారా రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించాలని జోనల్ స్థాయి అధికారులను ఆయన ఆదేశించారు. జాతీయ రైలు విచారణ వ్యవస్థలో ఉన్న సమయాలకు, భారతీయ రైల్వే అధికారిక వెబ్సైట్లలో ఉన్న సమయాలకు మధ్య ఉన్న తేడాలను కూడా సురేష్ ప్రభు గుర్తించారు. ఈ రెండింటికి, రైళ్లు వాస్తవంగా నడుస్తున్న సమయాలకు కూడా తేడా ఉండటం గమనార్హం. ఈ సమస్యను కూడా తక్షణం పరిష్కరించాలని రైల్వే అధికారులను ఆయన ఆదేశించారు. గత సంవత్సరం ఏప్రిల్ 1-16 తేదీల మధ్య రైళ్లు సకాలంలో నడిచే తీరు 84 శాతం వరకు ఉండగా, ఈ సంవత్సరం అది 79 శాతానికి పడిపోయింది. రైళ్లు ఆలస్యం కావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని, దీన్ని వెంటనే అరికట్టాలని గట్టిగా చెప్పారు. చుట్టుపక్కల డివిజన్లకు చెందిన అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆలస్యాలను నివారించాలన్నారు. -
అద్దాల రైల్లోంచి అరకు అందాలు చూసేద్దాం
-
అద్దాల రైల్లోంచి అరకు అందాలు చూసేద్దాం
సాక్షి, విశాఖపట్నం: ఇకపై అద్దాల రైల్లోంచి అరకు అందాలను చూడొచ్చు. విశాఖపట్నం–అరకు మధ్య నడిచే అద్దాల (విస్టాడోమ్) రైలు ఆదివారం ప్రారంభమైంది. ఈ రైలును రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు భువనేశ్వర్ నుంచి వీడియో లింక్ ద్వారా జాతికి అంకితం చేశారు. అద్దాల రైల్లో ప్రత్యేకతలివిగో...: ఒక్కో కోచ్లో 40 మంది కూర్చునేలా ఉన్న ఈ రెండు ఏసీ బోగీల్లో మొత్తం 80 మంది ప్రయాణించొచ్చు. ► ఈనెల 18 వరకు ఈ రైలును ప్రయోగాత్మకంగా నడుపుతారు. ►19 నుంచి కిరండోల్ పాసింజర్కు అనుసంధానం చేస్తారు. 18వ తేదీ నుంచి టిక్కెట్ల జారీ మొదలుపెడతారు. ► విశాఖ–అరకు మధ్య టిక్కెట్టు ధర రూ.650గా నిర్ణయించారు. ► ఈ రైలులో చుట్టూ, పైభాగంలో కూడా అద్దాలు అమర్చారు. ► కుర్చీలను 360 డిగ్రీల కోణంలో ఎటువైపైనా తిప్పుకోవచ్చు. ►ఎల్ఈడీ స్క్రీన్లు, సీసీ కెమెరాలు అమర్చారు. ► జీపీఎస్ అనుసంధానంతో ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ వ్యవస్థ ఉంటుంది. -
అద్దాల రైల్లో అందాల ప్రయాణం
విశాఖపట్నం: విస్టాడోం! విశాఖ–అరకు మధ్య అందాలను చూపించడానికి వచ్చిన అద్దాల కోచ్ పేరిది. పర్యాటక ప్రియులను మంత్రముగ్ధులను చేయడానికి సుందరంగా రూపుదిద్దుకుంది. అద్దాల్లోంచి ప్రకృతి రమణీయతను వీక్షించవచ్చు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారి కల నెరవేర్చడానికి ఆదివారం ఉదయం నెరవేరింది. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు భువనేశ్వర్ నుంచి వీడియో లింక్ ద్వారా రైలును ప్రారంభించారు. రైలు 10 గంటలకు బయలుదేరింది. విశాఖపట్నం నుంచి అరకులోయ వరకు రెండు విస్టాడోం కోచ్లను నడపాలని రైల్వేశాఖ గతంలోనే నిర్ణయించింది. విశాఖ- కిరండోల్ పాసింజర్కు ఈ కోచ్లను అమర్చనుంది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా కోచ్లను చెన్నైలో తయారు చేయించింది. అతి విశాలమైన గ్లాసుల కిటికీలు, పైన ఆకాశాన్ని కూడా చూసేలా అద్దాల టాప్ను సుందరంగా రూపొందించారు. బోగీ నుంచి 360 డిగ్రీలు తిరిగేలా కుర్చీలను ఏర్పాటు చేశారు. కోచ్లో జీపీఎస్తో అనుసంధానించిన ఎల్సీడీ ఆడియో, వీడియోలు ఉన్నాయి. ఒక్కో కోచ్కు సుమారు రూ.3 కోట్లు రైల్వే శాఖ ఒక్కో కోచ్కు సుమారు రూ.3 కోట్లు వెచ్చించింది. వీటిలో ఒకటి శుక్రవారం రాత్రి విశాఖ వచ్చింది. రెండోది మరో పక్షంలో రానుంది. ప్రయోగాత్మకంగా రెండు రోజులు నడిపాక ఈ నెల 19 నుంచి కిరండోల్ పాసింజర్కు అనుసంధానం చేసి రోజూ నడుపుతారు. ఇటు నుంచి రోజూ ఉదయం 7.05 గంటలకు విశాఖలో బయలుదేరి 11.05 గంటలకు అరకు చేరుకుంటుంది. 128 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి నాలుగ్గంటల సమయం పడుతుంది. మార్గంమధ్యలో 11 చోట్ల ఆగుతూ 58 టన్నెల్స్ను, 84 వంతెనలను దాటుకుని వెళ్తుంది. అరకులో ఈ బోగీని తొలగిస్తారు. అటు నుంచి సాయంత్రం తిరుగు ప్రయాణంలో వచ్చే కిరండోల్–విశాఖపట్నం పాసింజర్కు అరకులో ఈ కోచ్ను తగిలిస్తారు. ఈ రైలు అక్కడ సాయంత్రం 4.10కి బయల్దేరి రాత్రి 8.50 గంటలకు విశాఖకు చేరుకుటుంది. ధర భారమే.. విశాఖ–అరకుల మధ్య ఈ విస్టాడోమ్లో ప్రయాణం ఒకింత భారం కానుంది. ప్రస్తుతానికి టిక్కెట్ ధర నిర్ణయించలేదు. కానీ రూ.500–550 వరకు ఉంటుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. పూర్తి ఏసీ బోగీ కావడం, అన్ని అత్యాధునిక సదుపాయాలు ఉండడం వల్ల ఈ ధర ఉంటుందని చెబుతున్నారు. విశాఖ నుంచి అరకుకు అదే రైలులో టిక్కెట్టు ధర రూ.30లు ఉంది. స్లీపర్కు రూ.150, సెకండ్ ఏసీకి రూ.400 వరకు ఉంది. బోగీకి 40 సీట్లు ఈ విస్టాడోం కోచ్కు 40 సీట్లు మాత్రమే ఉంటాయి. రెండో కోచ్ వస్తే అదనంగా మరో 40 సీట్లు పెరుగుతాయి. ఈ నెల 19 నుంచి రెగ్యులర్గా కిరోండోల్ పాసింజరుకు ఈ కోచ్ను అనుసంధానం చేసి నడపనున్నారు. ఇందుకోసం 18వ తేదీ నుంచి టిక్కెట్లను విక్రయిస్తారు. ఆదివారం నుంచి ఒక ఇంజన్తో విస్టాడోం కోచ్ను ట్రయలరన్గా నడుపుతారు. ప్రయాణికులను అనుమతించరు. -
కళ్యాణదుర్గం–కదిరి దేవరపల్లి లైన్ ప్రారంభం
వీడియో లింక్ ద్వారా ప్రారంభించిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సాక్షి, న్యూఢిల్లీ/కళ్యాణదుర్గం రూరల్: రాయదుర్గం–తుముకూరు రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే ట్రాక్ నిర్మాణం పూర్తయిన కళ్యాణదుర్గం–కదిరి దేవరపల్లి మార్గాన్ని కేంద్ర మంత్రులు సురేష్ప్రభు, అశోక్గజపతిరాజు బుధవారం ఢిల్లీ నుంచి వీడియోలింక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్(జీఎం) ఏకే గుప్తా, హుబ్లీ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ఏకే జైన్, చీఫ్ ఆపరేషన్ మేనేజర్ జీజే ప్రసాద్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అశోక్గుప్తా, సీపీఆర్వో విజయ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం–కదిరి దేవరపల్లి రైల్వేలైన్ (23 కి.మీ.) ప్రారంభమవ్వడంతో కళ్యాణదుర్గం, రాయదుర్గం, బళ్లారి, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం మీదుగా తిరుపతి వెళ్లే ప్యాసింజర్ రైలు (57477/57478)ను కదిరి దేవరపల్లి వరకు పొడిగించారు. ఈ రైలును బుధవారం కళ్యాణదుర్గంలో రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు పచ్చ జెండా ఊపి నూతన మార్గంలోకి పంపించారు. ఈ రైలు ప్రతిరోజూ తిరుపతిలో రాత్రి 10.30కి బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కదిరి దేవరపల్లికి చేరుకుంటుంది. తిరిగి అదేరోజు కదిరి దేవరపల్లిలో మధ్యాహ్నం 1.20కి బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.20కి తిరుపతి చేరుకుంటుంది. కాగా, ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ.. ఏపీలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ ప్రారంభం
-
పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ ప్రారంభం
హైదరాబాద్: పెద్దపల్లి-నిజామాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు శనివారం ప్రారంభించారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్లోని హైటెక్సిటీ రైల్వేస్టేషన్ నుంచి రిమోట్ లింక్ ద్వారా రైల్వే లైన్ ను స్టార్ట్ చేశారు. మహబూబ్ నగర్ - సికింద్రాబాద్ రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు కూడా సురేశ్ ప్రభు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీఆర్ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డి. శ్రీనివాస్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రైల్వే లైన్ ను ప్రారంభించిన తర్వాత నిజామాబాద్లో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. మంగళ, గురువారాలు మినహా అన్ని రోజులు ఈ రైలు నడుస్తుంది. ఆ రెండు రోజులు నిజామాబాద్ స్టేషన్లోనే రైలును నిలిపివేస్తారు. నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వరకు పదమూడు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. -
కేంద్ర మంత్రికి ట్వీట్.. మహిళా ప్యాసింజర్ సేఫ్
భువనేశ్వర్: సోషల్ మీడియాను మనం వాడుకునే తీరును బట్టి అది మనకు అనుకూల, ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఓ మహిళా ప్రయాణికులరాలికి మాత్రం సోషల్ మీడియా పోస్ట్ ఎంతో మేలు చేసింది. ఎలా అంటారా.. న్యూఢిల్లీకి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో గురువారం ప్రయాణిస్తోంది. ఆ రైల్లోనే ఆమె ఉన్న కంపార్ట్మెంట్లో యాభైఏళ్ల ప్రయాణికుడు బని ప్రసాద్ మహంతి ప్రయాణిస్తున్నాడు. ఆ మహిళతో బని ప్రసాద్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఎంత చెప్పినా వినకుండా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయంపై ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ పోస్ట్ చూసిన ఓ బాధిత మహిళ స్నేహితురాలు విషయాన్ని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తీసుకెళ్లింది. తన స్నేహితురాలికి సాయం చేయాలని రైల్వే మంత్రికి ట్వీట్ చేసింది. వెంటనే స్పందించిన సురేశ్ ప్రభు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. నిందితుడు బని ప్రసాద్ను టీటీఈలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది టాటానగర్ స్టేషన్లో అదుపులోకి తీసుకుని రైలు నుంచి దించేశారు. టాటానగర్ రైల్వే పోలీసులకు నిందితుడిని అప్పగించారు. వారు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు. నిందితుడు బని ప్రసాద్ ఒడిషాలోని ఖుర్దాకు చెందినవాడని రైల్వే పోలీసులు వివరించారు. -
మాచర్ల–నల్గొండ రైల్వే లైను కుదరదు :కేంద్రం
న్యూఢిల్లీః మాచర్ల–నల్గొండ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేమని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బుధవారం సమాధానం ఇచ్చారు. ఈ రైల్వేలైనును 1997–98 బడ్జెట్లో రూ. 125 కోట్ల అంచనా వ్యయంతో చేర్చారని, ప్రస్తుతం దీని అంచనా వ్యయం రూ. 815 కోట్లు అని తెలిపారు. సర్వే తుది దశలో ప్రజా ప్రతినిధులు ఈ మార్గాన్ని మార్చాలని సూచించారని, ఇదే సందర్భంలో దీనిపై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జరిపిన యోగ్యత అధ్యయనం ఈ ప్రాజెక్టులో ఆర్థిక యోగ్యత లేదని తేల్చిందని వివరించారు. స్పెషల్పర్పస్ వెహికిల్ విధానంలో గానీ, పీపీపీ విధానంలో గానీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని తేల్చారు. ప్రజల్లో ఈ డిమాండ్ ఉన్నప్పటికీ నిధుల కొరత, ఇతరత్రా కారణాల వల్ల ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని, కానీ ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయలేదని వివరించారు. -
ఐదేళ్లలో పట్టాలన్నీ బ్రాడ్గేజ్కి
లోక్సభలో రైల్వే మంత్రి వెల్లడి న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం రైల్వే నెట్వర్క్ వచ్చే ఐదేళ్లలో బ్రాడ్గేజ్లోకి మారనుంది. అన్ని రైళ్లలో బయో టాయిలెట్లు వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే శాఖకు నిధుల డిమాండ్ (డిమాండ్ ఫర్ గ్రాంట్స్)పై రాజ్యసభలో రెండు రోజుల చర్చకు బుధవారం సమాధానమిస్తూ ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని మీటర్ గేజ్ పట్టాలన్నింటిని ఐదేళ్లలో బ్రాండ్ గేజ్లోకి మార్చి, 2019 అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నాటికి అన్ని రైళ్లలో బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘రైల్వేలో వచ్చే ఐదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చేందుకు రోడ్ మ్యాప్ రూపొందించాం. రైల్వే నెట్వర్క్ భద్రతను పటిష్టం చేసేం దుకు రూ. లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేశాం’ అని వివరించారు. తర్వాత సభ మూజువాణి ఓటుతో నిధుల డిమాండ్ను ఆమోదించింది. పొరుగు దేశాలకు రైల్వే లైన్లు: వాణిజ్యం పెంపు, ఆసియాలో పేదరిక నిర్మూలనS కోసం పొరుగు దేశాలను రైల్వే మార్గాలతో అనుసంధానించాలని సురేశ్ ప్రభు ఢిల్లీలో జరిగిన ఐరాస సదస్సులో సూచించారు. -
15 మంది కేంద్ర మంత్రులతో వెంకయ్య సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న విభిన్న కేంద్ర ప్రాజెక్టులు, పథకాలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం 15 మంది కేంద్ర మంత్రులతో సమీక్ష జరిపారు. రాజ్నాథ్సింగ్, మనోహర్ పరికర్, సురేష్ ప్రభు, ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, రవిశంకర్ ప్రసాద్, ఉమాభారతి, స్మృతీ ఇరానీ, నరేందర్సింగ్ తోమర్, రాధామోహన్ సింగ్, తావర్చంద్ గెహ్లాట్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, కల్రాజ్ మిశ్రా, మహేష్శర్మ, అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి తదితర కేంద్ర మంత్రులు ఈ చర్చలో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు అవసరమైన చట్ట సవరణను సత్వరం తీసుకురావాలని హోంమంత్రి రాజ్నాథ్, న్యాయ మంత్రి రవిశంకర్ను వెంకయ్య కోరారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేస్తున్నామని, తర్వాత కేబినెట్కు పంపుతామని వారు తెలిపారు. అలాగే ఐఎన్ఎస్ విరాట్ను పర్యాటక స్థలిగా మార్చేందుకు ఏపీకి సాయం చేయాలని, నాగాయలంకలో డీఆర్డీవో మిస్సైల్ టెస్ట్ కేంద్రాన్ని, బొబ్బిలిలో నావల్ ఎయిర్ స్టేషన్ను ఏర్పాటుచేయాలని రక్షణమంత్రి పరికర్ను కోరారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు ప్రకటన చేయాలని కోరగా.. ఈ అంశంలో పురోగతి ఉందని సురేష్ ప్రభు తెలిపినట్టు సమాచారం. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే పవర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సిద్ధమని పీయూష్ గోయల్ తెలిపారు. ఈ చర్చల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, పలువురు టీడీపీ ఎంపీలూ పాల్గొన్నారు. -
'రైల్వే పాస్లకు ఆధార్తో లింకుపెట్టం'
ఢిల్లీ: రైల్వే పాస్లకు ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే ప్రతిపాదనేదీ తమ వద్ద ప్రస్తుతం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. రైలు పాస్లున్న వారు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం లేదంటూ ఆయన రైల్వే ఉద్యోగులు, పింఛనుదారులు మాత్రం ఏ పోర్టల్ నుంచైనా టికెట్లు బుక్ చేసుకునే విషయం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రైలుపాస్లున్న వారికి కూడా ఇలాంటి సదుపాయాన్ని కల్పించే అవకాశాలను చూస్తున్నామని మంత్రి వివరించారు. అన్ని విభాగాల్లో కలిపి సుమారు 13.30 లక్షల మంది రైల్వే శాఖ ఉద్యోగులకు పాస్లున్నాయని వెల్లడించారు. రైలు రద్దయిన సందర్భాల్లో టికెట్ రుసుమును వాపసు చేయటంలో కలుగుతున్న ఆలస్యాన్ని తగ్గించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
భద్రత, వేగానికి పెద్దపీట!
రైల్వే బడ్జెట్లో ప్రత్యేకంగా రూ.20 వేల కోట్లు! న్యూఢిల్లీ: తొంభై రెండేళ్ల సుదీర్ఘ సంప్రదాయానికి విరుద్ధంగా తొలిసారిగా సాధారణ బడ్జెట్తో ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్లో భద్రత, వేగం, మౌలిక సదుపా యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాటు రైళ్ల వేగాన్ని 200 కి.మీ. వరకు పెంచే చర్యలు చేపట్టనున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఈ చారిత్రక బడ్జెట్ను బుధవారం సమర్పించనున్నారు. తరచూ రైళ్లు పట్టాలు తప్పుతున్న నేపథ్యంలో కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, కొన్ని స్టేషన్ల ఆధునీ కరణ చేయనున్నారు. దీనికి రానున్న ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రైల్వే భద్రత నిధిని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నిధిలో 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.20 వేల కోట్లు కేటాయించవచ్చు. రైళ్ల భద్రతా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు రూ.1.19 లక్షల కోట్ల ప్రత్యేక నిధి కేటా యించాలన్న రైల్వేమంత్రి సురేశ్ప్రభు అభ్యర్థన మేరకు జైట్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రైళ్ల పర్యవేక్షణకు రైలు అభివృద్ధి సంస్థను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు హైస్పీడ్ రైల్ అథారిటీనీ ఏర్పాటు చేయవచ్చు. అలాగే టిక్కెటేతర ఆదాయాన్ని పెంచుకొనేందుకు కసరత్తు జరుగుతోంది. -
ఏపీకి ప్రత్యేక సాయం చేయండి
రైల్వే కేటాయింపులపై కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే కేటాయింపుల్లో ఏపీకి అవసరమైన మేరకు నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వివిధ మార్గాల్లో కొత్త రైళ్లను మంజూరు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. మంగళవారం కేంద్ర మంత్రితో భేటీ అయిన సుబ్బారెడ్డి.. ఏపీకి, ఒంగోలు జిల్లాకు సంబంధించి పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో రెండో టికెట్ బుకింగ్ కౌంటర్, రెండో ఎస్కలేటర్, లిఫ్ట్ సదు పాయం కల్పించాలని కోరారు. ఒంగోలు– సికింద్రాబాద్ మధ్య నడికుడి మీదుగా అమరావతిని కలుపుతూ పగలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును నడపాలని కోరారు. ఒంగోలు స్టేషన్లో కేరళ, జోధ్పూర్, జైపూర్, పాండిచ్చేరి ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలపాలని విజ్ఞప్తి చేశారు. టంగుటూరులో తిరుమల, హైద రాబాద్, సింహపురి ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వా లని అభ్యర్థించారు. అలా గే సింగరాయకొండ స్టేషన్లో పద్మావతి, చార్మినార్, మచిలీపట్నం, శేషాద్రి ఎక్స్ప్రెస్లకు, దొనకొండలో హౌరా ఎక్స్ ప్రెస్, కురిచేడులో ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కోరారు. గుంటూరు– ముంబై రైలును నడపాలని, సికింద్రాబాద్–గుంటూరు మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు ప్రవేశపెట్టడం, ప్రస్తుతం నడుస్తున్న సికింద్రాబాద్–గుంటూరు ప్యాసింజర్ రైలు ను ఎక్స్ప్రెస్గా మార్చాలని, మచిలీ పట్నం–యశ్వంత్పూర్ మధ్య నడుస్తున్న కొండవీడు ఎక్స్ప్రెస్ను ప్రతిరోజూ నడపాలని, సికింద్రాబాద్లో రాత్రి 10.55 గంటలకు బయల్దేరే సింహపురి ఎక్స్ప్రెస్ను రాత్రి 10 గంటలకు మార్చాలని అభ్యర్థిస్తూ వినతిప్రత్రాన్ని సమర్పించారు. -
సాదాసీదాగా సర్వసభ్య సమావేశం
సీఎం, మంత్రి ఐకేరెడ్డి, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం నిర్మల్ టౌన్ : ఆర్మూర్– నిర్మల్– ఆదిలాబాద్ రైల్వేలైన్ నను ఏర్పాటుచేసేందుకు సుముఖత వ్యక్తంచేసిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ప్రభుకు, సీఎం కేసీఆర్కు, మంత్రి ఐకేరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మున్సిపల్ సర్వసభ్యసమావేశంలో సభ్యులు తీర్మానించారు. జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలోని సమావేశమందిరంలో బుధవారం మున్సిపల్ సర్వసభ్యసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి మాట్లాడారు. నిర్మల్కు రైల్వేలైన్ రావడానికి మంత్రి ఐకేరెడ్డి కృషిచేశారని తెలిపారు. పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలో పూర్తిగా ఎల్ఈడీ లైట్లు బిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. జిల్లాకేంద్రంలోని సోఫినగర్ నుంచి చించోలి(బి) వరకు డ్రెయినేజీ నిర్మించేందుకు రూ. 30లక్షలు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల టాకీస్ వద్ద ఉన్న మురుగుకాలువ పరిస్థితిపై మున్సిపల్ వైస్ చైర్మన్ అజీంబిన్ యాహియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చైర్మన్ మాట్లాడారు. తిరుమల టాకీస్ వద్ద ఉన్న మురుగుకాలువకు సంబంధించి ఇప్పటికే తాత్కాలిక చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి త్వరలోనే కల్వర్టు నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశానికి సగం మంది సభ్యులే హాజరుకావడంతో సమావేశం బోసిపోయింది. -
ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వే లైన్కు నిధులు
రైల్వే మంత్రితో భేటీ అనంతరం జోగురామన్న, ఇంద్రకరణ్ సాక్షి, న్యూఢిల్లీ: ఆర్మూర్– ఆదిలాబాద్ వయా నిర్మల్ రైల్వే లైన్ నిర్మాణానికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. రైల్వే లైన్కు నిధులు కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రాసిన లేఖను మంగళవారం ఢిల్లీలో సురేశ్ ప్రభును ఆయన కార్యాలయంలో కలసి మంత్రులు అందజేశారు. రైల్వే లైన్తో నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఇంద్రకరణ్ పేర్కొన్నారు. రైల్వే లైన్ నిర్మాణ ఖర్చులో సగం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రికి వివరించినట్లు తెలిపారు. ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ప్రభు.. వచ్చే బడ్జెట్లో రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. నిధుల విడుదలను బట్టి ఈ ఏడాదిలోపు పనులు ప్రారంభిస్తామని జోగురామన్న తెలిపారు. భద్రాచలం–కొవ్వూరు, మణుగూరు–రామగుండం రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. సురేశ్ ప్రభును కలసిన వారిలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్ర తెజోవత్, ఎంపీ జి.నగేశ్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ ఉన్నారు. -
ఉమ్మడిగా రైల్వే ప్రాజెక్టులు
రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు - రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ సహకారం అభినందనీయం - వీడియో లింకు ద్వారా పలు అభివృద్ధి పనులు ప్రారంభం - జగిత్యాల–మోర్తాడ్ సర్వీసుకు పచ్చజెండా ఊపిన మంత్రి సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలను అందిస్తోందని, ఇప్పటి వరకు చేపట్టిన రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలమని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఢిల్లీలోని రైల్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో వీడియో లింకు ద్వారా ప్రారంభించారు. సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన 500 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్గ్రిడ్ను, నాంపల్లి రైల్వేస్టేషన్లో నిర్మించిన ఆర్వోబీని, ఈ రెండు స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని, సికింద్రాబాద్ స్టేషన్లో ఎంఎంటీఎస్ బుకింగ్ కేంద్రాలను, ఎల్ఈడీ లైట్లను కేంద్ర మంత్రి బండారు దత్తా త్రేయ, ఎంపీ కవిత, రైల్వే ఉన్నతాధికారులతో కలసి ప్రారంభించారు. కరీంనగర్– లింగంపేట్– జగిత్యాల సెక్షన్లో నడుస్తున్న డెమూ ప్యాసింజర్ ను మోర్తాడ్ వరకు పొడిగింపునకు పచ్చా జెండా ఊపారు. రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్గా (ఉమ్మడి సంస్థగా) ఏర్పడి ప్రాజెక్టులను పూర్తి చేస్తా యన్నారు. కొన్ని ప్రాజెక్టుల వ్యయాన్ని పంచు కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ, సహకా రాన్ని అభినందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 790 కోట్ల రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నా యన్నారు. ప్రస్తుతం 104 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సదు పాయం ఉందని, 2017 చివరికి మొత్తం 200 స్టేషన్లలో ఈ సేవలను విస్తరించనున్నామ న్నారు. పూర్తి భద్రతతో కూడిన, మెరుగైన రైల్వే సేవలను అందజేయడమే తమ లక్ష్యమన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశకు అనుమతి: దత్తాత్రేయ ప్రధాని, రైల్వే మంత్రి పెద్దపల్లి–నిజామాబాద్ లైనుకు ప్రాధాన్యమిచ్చి త్వరితగతిన పూర్తి చేస్తుం డడం సంతోషకరమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. 2017 చివరిలోగా ఈ రైల్వే లైను పూర్తవుతుందని ఆకాంక్షించారు. మౌలాలీ– సనత్ నగర్ మధ్య రక్షణ శాఖ భూముల్లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు అనుమతి లభించిందని చెప్పారు. ఇటు భువనగిరి, యాదాద్రి వరకు, అటు శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయని తెలిపారు. సికింద్రాబాద్– కాజీపేట్ మార్గంలో మూడో లైన్ నిర్మించాలని, కాజీపేట్లో ని వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణంపై రైల్వే శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన ఆశిస్తున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం సంతోషిం చదగిన విషయమని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. 2017 చివరి కల్లా పెద్దపల్లి–నిజామా బాద్ మధ్య రైల్వే సేవలు ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డెమూ రైలును మోర్తాడ్ వరకు పొడిగించడంపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలి పారు. సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన ప్రారంభో త్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, పట్నం మహేందర్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మహ్మద్ అలీఖాన్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వశిష్ట జోహ్రీ తదితరులు పాల్గొన్నారు. -
జగిత్యాల-మోర్తాడు డెమో సర్వీసు ప్రారంభం
హైదరాబాద్: ఢిల్లీలో రిమోట్ వీడియో లింకు ద్వారా జగిత్యాల- మోర్తాడు డెమో సర్వీసును కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, బండారు దత్తాత్రేయ, ఎంపీ కవిత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 20 ఏళ్ల కల నిజమైందని తెలిపారు. 25 సార్లు కేంద్రమంత్రికి వినుతులు ఇచ్చినట్లు గుర్తుచేశారు. వచ్చే ఏడాది పెద్దపల్లి రైల్వే లైన్ క్లియర్ అవుతుందని, నిజామాబాద్ స్టేషన్ అభివృద్ధికి నిధులు ఇచ్చేలా రైల్వే మంత్రి హామి ఇచ్చినట్టు కవిత తెలిపారు. వచ్చే బడ్జెట్ నాటికి మరిన్ని ప్రతిపాదనలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ అభివృద్ది పనులకు రూ.709 కోట్లు కేటాయిస్తున్నామని సురేష్ ప్రభు చెప్పారు. 2017 తెలంగాణకు రైల్వే పరంగా మంచి సంవత్సరం అవుతుందన్నారు. -
రండి పెళ్లి చేస్తాం...
ఖాళీగా అవసరం లేకుండా అలా పడిఉన్న రైల్వే స్టేషన్లను పెళ్లి మండపాలుగా మార్చితే ఎంత బాగుంటుంది. ఇలాంటి ఐడియాతోనే రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ముందుకొచ్చారు. ఖాళీగా పడిఉన్న రైల్వే స్టేషన్లను వేరే ప్రాంతాలకు తరలించే బదులు వాటిని పెళ్లి వేడులకు, ఇతర గ్రాండ్ ఈవెంట్లకు వాడాలని నిర్ణయించారు. వెడ్డింగ్ ఫంక్షన్లకు, ఇతర ఈవెంట్లకు రైల్వే స్టేషన్లను అద్దెకివ్వాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది. గత నెల న్యూఢిల్లీలో జరిగిన రైల్ వికాస్ శివిర్ మీటింగ్లో ఈ అద్భుతమైన ఆలోచనను ఎంపికచేశారు. రవాణా వ్యవస్థలో అత్యంత ప్రముఖమైన పాత్ర వహిస్తున్న రైల్వే కార్యకాలపాల అభివృద్ధికి వినూత్నమైన ఆలోచనలతో ముందుకు రావాలని ప్రధాని మోదీ ఈ మీటింగ్లో అధికారులకు పిలుపునిచ్చారు. రైల్వే అభివృద్ధికి రోడ్ మ్యాప్ చేయాలని ఆదేశించారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రైల్వే బోర్డు అడ్వయిజర్ అలోక్ రాజన్ తెలిపారు. -
29 నుంచి తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ రైలు
తిరుపతి: తిరుపతి-విశాఖపట్టణం మధ్య కొత్తగా ఏర్పాటుచేయనున్న డబుల్ డెక్కర్ రైలును రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ఈనెల 29వ తేదీన ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రి 29వ తేదీ ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. తిరుపతిలో డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించడంతో పాటు తిరుప్తిలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక లాండ్రీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. తిరుపతి రైల్వే దక్షిణం వైపున ఉన్న టీటీడీ స్థలాల్లో అదనపు ప్లాట్ఫారాల నిర్మాణం, కనెక్టివిటీ రోడ్డు పనులకు కూడా కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. -
రైల్వేలో పట్టాలెక్కబోతున్న మరో సంస్కరణ
రైల్వేలో మరో రెండో అతిపెద్ద సంస్కరణ పట్టాలెక్కబోతోంది. 92 ఏళ్ల సంస్కృతికి చరమగీతం పాడుతూ రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపిన కేంద్రప్రభుత్వం, చార్జీల మార్పునకు ప్రత్యేక ఏజెన్సీ నియమించాలని యోచిస్తోంది. చార్జీల ప్రతిపాదనకు ఓ స్వతంత్ర ఏజెన్సీ నియమించాలని కోరుతూ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కేబినెట్ను ప్రతిపాదించనున్నారట. చైర్మన్తో కూడిన నలుగురు సభ్యుల డెవలప్మెంట్ అథారిటీని నియమించాలని రైల్వే ప్రతిపాదించింది. మంత్రి ఆమోదంతో ఈ వారంలోనే ఈ ప్రతిపాదన కేబినెట్ ముందుకు రాబోతుందట. వచ్చే వారంలోనే కేబినెట్ దీన్ని ఆమోదించబోతుందని తెలుస్తోంది. దీంతో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసిన తర్వాత ఇదే రెండో అతిపెద్ద సంస్కరణ కాబోతుంది. ఈ విషయంపై ఇప్పటికే రైల్వే శాఖ వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను, నీతి ఆయోగ్ కామెంట్లను కూడా స్వీకరించింది. ప్రయాణికులకు అందిస్తున్న సబ్సిడీలతో దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా పేరున్న రైల్వేలు రూ.33,000 కోట్ల నష్టాలను మూటకట్టుకుంటున్నాయి. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ, సీనియర్ అధికారులతో సురేష్ ప్రభు చర్చించారు. వారు కూడా దీనికి సానుకూలంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు. మార్కెట్ డిమాండ్ బట్టి చార్జీల హేతుబద్దీకరణ చేపట్టనున్నట్టు రైల్వే తెలుపుతోంది. -
పట్టాలు తప్పిన రైలు.. ఇద్దరి మృతి
పట్నా నుంచి గువాహటి వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఇద్దరు మరణించడగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని సముక్తల స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ఘటనకు కారణం ఏంటో ఇంకా తెలియలేదు. రెస్క్యూ బృందాలను హుటాహుటిన ఘటనా స్థలానికి తరలించారు. రైలు డ్రైవర్ సిగ్నల్ను పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంజన్, మరో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. వాటిలో ఒకటి ఎస్ఎల్ఆర్ కాగా, మరొకటి జనరల్ సెకండ్ క్లాస్ బోగీ. బిహార్లోని దానాపూర్ నుంచి గువాహటికి ఈ రైలు వెళ్లాల్సి ఉంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలో ఉన్న అలీపుర్దౌర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైలు ఆగిపోవడంతో ఇరుక్కుపోయిన దాదాపు 150 మంది ప్రయాణికులను కామాఖ్య-అలీపుర్దౌర్ జంక్షన్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్లో అలీపుర్దౌర్ తీసుకెళ్లారు. అక్కడ పట్టాలను బాగుచేసిన తర్వాత ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తారు. హెల్ప్లైన్ నంబర్లు ఈ ప్రమాదం విషయంలో ఏమైనా తెలుసుకోవాలంటే రైల్వేశాఖ హెల్ప్లైన్ నంబర్లను ప్రకటించింది. అవి.. 9002052957, 8585082833 మరియు 03564-259935. -
రైల్వే ప్రాజెక్టుల భాగస్వామ్యానికి రాష్ట్రాలు ఓకే
న్యూఢిల్లీ: కొత్త లైన్ల ఏర్పాటు, స్టేషన్ల అభివృద్ధిలో రాష్ట్రాలు పాలు పంచుకోవాలని రైల్వే శాఖ చేసిన విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ట్రాలు అంగీకరించాయి. దాదాపు రూ.62,379 కోట్ల ఖర్చుతో కూడుకున్న 43 రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో పాలు పంచుకోవాలని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారని, ఇందుకుగాను 16 రాష్ట్రాలు ఒప్పుకున్నాయని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయంలో 25 నుంచి 66 శాతం వరకు రాష్ట్రాలు భరించనున్నాయని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల కోసం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉచితంగా స్థలాలను ఇస్తున్నాయని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ల అభివృద్ధి, కొత్త లైన్ల ఏర్పాటు, లైన్ల డబ్లింగ్ పనులు వంటి వాటిపై రైల్వే శాఖ దృష్టి సారించిందని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, గుజరాత్, హరియాణా, కేరళ, ఒడిశా రాష్ట్రాలు జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకాలు చేశాయని ఆయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా జాయింట్ వెంచర్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి అంగీకరించాయని చెప్పారు. -
ఆ రైల్వే స్టేషన్కు ఏం పేరు పెడతారో?
ముంబై: పశ్చిమ రైల్వే మార్గంలో కొత్తగా నిర్మించిన ‘ఓషివరా’ రైల్వే స్టేషన్ ప్రారంభానికిసిద్ధమైంది. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈ నెల 27న ప్రారంభించనున్నారు. ఆ తరువాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే స్లో అప్, డౌన్ లోకల్ రైళ్లకు హాల్టు ఇవ్వడంతో రాకపోకలు ప్రారంభమవుతాయి. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజలకు ఊరట లభించనుంది. ఖరారు కాని పేరు.. రూ.26 కోట్లు ఖర్చుచేసి కొత్తగా నిర్మించిన ఈ స్టేషన్కు ఏం పేరు పెట్టాలనేది ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం ఈ స్టేషన్ ఓషివరా ప్రాంతంలో ఉండడంవల్ల అదే పేరుతో పిలుస్తున్నారు. ఈ పేరే పెట్టాలని కొందరు స్థానికులు కోరుతుండగా ‘రాం మందిర్’ అని నామకరణం చేయాలని బీజేపీ వర్గీయులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రారంభోత్సవానికి ముందే స్టేషన్ బయట పెద్దపెద్ద ఎలక్ట్రానిక్ బోర్డులు, ప్లాట్ఫారాలపై వివిధ రకాల బోర్డులు, ఇండికేటర్లు, స్టేషన్ కోడ్, అనౌన్స్మెంట్ వంటి రకరకాల ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. టికెట్లు ఏ స్టేషన్ పేరుతో ఇవ్వాలో ముందే నిర్ణయిస్తే అన్ని స్టేషన్లలో టికెట్ జారీచేసే కంప్యూటర్లలో మార్పులు చేయడానికి వీలుపడుతుందని సిబ్బంది అంటున్నారు. సమయం దగ్గర పడుతోంది. కాని, ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోకపోవడంతో రైల్వే సిబ్బంది, అధికారులు ఆందోళన చెందుతున్నారు.