
రైల్వే భూమి బదలాయింపు వేగిరం చేయండి
సికింద్రాబాద్ పరిధిలోని లాలా పేట్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన 12.6 ఎకరాల రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిన ప్రక్రియను వేగ వంతం
అయితే భూమి బదలాయింపు ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో సంబం« దిత ప్రాంతంలో పేదలకు 4 వేల వరకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుకు టీఆర్ఎస్ నేతలు వివరించారు. రైల్వే భూమికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం మరోచోట భూమి ఇచ్చేందుకు, లేదా డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. స్పందించిన ప్రభు.. దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్కుమార్ యాదవ్తో ఫోన్లో మాట్లాడి భూమి బదలా యింపు ప్రక్రియకు సంబంధించిన నివేదికను త్వరితగతిన తయారు చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప గించాలని సూచించారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం సందర్భంగా ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని రైల్వే సమస్యలను ప్రభు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే జీఎం అధ్యక్షతన ఎంపీలు హైదరాబాద్లో సమావేశం కానున్నారు.