రిటైర్డ్ ఎస్సై ఇంట్లో చోరీ | robbery in retired SI house at markapuram of prakasham district | Sakshi
Sakshi News home page

రిటైర్డ్ ఎస్సై ఇంట్లో చోరీ

Dec 18 2015 10:24 PM | Updated on Aug 30 2018 5:27 PM

రిటైర్డ్ ఇంట్లో దొంగలు పడి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.

మార్కాపురం: రిటైర్డ్ ఇంట్లో దొంగలు పడి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. స్థానిక పవర్ ఆఫీస్ వెనుక భాగంలో నివాసముంటున్న రిటైర్డ్ ఎస్సై షేక్ అజ్మల్ భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ఇంటికి తాళం వేసి చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లారు.

ఇది గుర్తించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న రూ. 3 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలతో పాటు రూ. 15 వేల నగదును ఎత్తుకెళ్లారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన బంధువులు ఇది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement