Breadcrumb
'కేసులకు మేం భయపడం'
Published Thu, Mar 2 2017 9:43 AM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గురువారం ఫైర్ అయ్యారు. బస్సు ప్రమాదంపై బాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. దోషులను తప్పించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసులు పెట్టడం దారుణమని అన్నారు. బాధితుల పక్షాన ప్రతిపక్ష నేత ప్రశించడం తప్పా? అని ప్రశ్నించారు. ఇలాంటి కేసులకు వైఎస్సార్సీపీ భయపడదని చంద్రబాబుకు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు.
Advertisement
Related news by tags
-
Alia Al Rufai: తానొక.. అందమైన ఫ్యాషన్ లేడీ!
బాలీవుడ్లో అనుష్కా శర్మకు మంచి నటిగానే కాదు స్టయిల్ ఐకాన్గానూ పేరుంది. ఎయిర్ పోర్ట్ లుక్ నుంచి రెడ్కార్పెట్ వాక్ దాకా సందర్భానికనుగుణంగా ఆమె «ధరించే కాస్ట్యూమ్స్కి వీర ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాషనిస్టా వెనుక స్టయిలిస్ట్ అలియా అల్ రుఫై కృషి ఉంది. ఆమె ఎవరో తెలుసుకుందాం..అలియా అల్ రుఫై.. వాళ్లమ్మ ఇండియన్. నాన్న అరబ్. అందుకే తనను తాను హాఫ్ ఇండియన్, హాఫ్ అరబ్గా అభివర్ణించుకుంటుంది అలియా. పన్నెండవ ఏట నుంచే ఆమెకు ఫ్యాషన్ మీద ఆసక్తి ఏర్పడింది. కారణం వాళ్లమ్మే. వింటేజ్ స్టయిల్కి కంటెంపరరీ టచ్నిచ్చి క్రియేట్ చేసుకునే ఆమె డ్రెస్లు, బ్లౌజెస్ అలియాను అమితంగా ఆకట్టుకునేవట. ఆ ఆకర్షణే తన చుట్టూన్న వాళ్ల డ్రెస్ సెన్స్ని, కల్చర్స్ని గమనించే గుణాన్ని పెంచిందట అలియాలో. ఆ తపనే ఆమెకు ఫ్యాషన్ మ్యాగజైన్స్నీ పరిచయం చేసింది. వాటి ప్రభావంతో తన డైలీ రొటీన్ డ్రెసెస్లోనే ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చేది.తన ఫ్రెండ్ సర్కిల్లో కాంప్లిమెంట్స్ అందుకునేది. ఒకసారి బాల్యంలోనే.. ఇతిహాద్ ఎయిర్వేస్లో బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్నప్పుడు.. ఒక బ్లాంకెట్ని ఇంటికి పట్టుకొచ్చేసిందిట దొంగతనంగా! తర్వాత దాన్ని స్కర్ట్గా మలచుకుందట. అలా ఆమెకు ఫ్యాషన్ మీదున్న శ్రద్ధ తనతో పాటే పెరుగుతూ వచ్చింది. ముంబై యూనివర్సిటీలో ఏంబీఏ పూర్తి చేసింది. అయినా ఏదో వెలితి. తనకు జాబ్ శాటిస్ఫాక్షన్ దొరికేది ఫ్యాషన్ రంగంలోనే అని ఆమె ప్రగాఢ విశ్వాసం. అందుకే ‘హార్పర్స్ బజార్’లో జూనియర్ ఫ్యాషన్ ఎడిటర్గా ఆఫర్ వస్తే.. రెండో ఆలోచన లేకుండా అందులో చేరింది.అక్కడ పనిచేస్తున్నప్పుడే అనుకోకుండా బాలీవుడ్ నుంచి కాల్ అందుకుంది.. ‘మధుర్ భండార్కర్ తీస్తున్న ‘ఫ్యాషన్’ సినిమాకి స్టయిలిస్ట్గా ఉన్న రీతా ధోడీకి అసిస్టెంట్ కావాలి. రాగలరా?’ అంటూ! ‘వై నాట్.. అఫ్కోర్స్’ అంటూ వెంటనే రీతా ధోడీ స్టయిల్ టీమ్లో మెంబర్ అయింది. ‘తొలి అవకాశమే కంగనా రనౌత్, ప్రియంకా చోప్రాలతో కలసి పనిచేయడం.. నా అదృష్టం! వాళ్ల దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలంటే ‘ఫ్యాషన్’ సినిమా ఫ్యాషన్ ప్రపంచం గురించి నాకెన్నో విషయాలను తెలియజెప్పింది. ఎన్నో మెలకువలనూ నేర్పింది’ అని చెబుతుంది అలియా.ఆ సినిమా ఆమె కెరీర్కి మైలు రాయి అనుకోవచ్చు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం ముందుకే సాగింది. పలు ఫ్యాషన్ షోలకు పనిచేసింది. ఎన్నో ఫ్యాషన్ మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాసింది. అలా ఆమె నైపుణ్యం చూసిన అనుష్కా శర్మ .. అలియాను తన పర్సనల్ స్టయిలిస్ట్గా నియమించుకుంది. ఆమె అనుష్కా దగ్గర చేరగానే అనుష్కా తీరుతెన్నులే మారిపోయాయి. ఏ డ్రెస్ అయినా అనుష్కా కోసమే డిజైన్ అయిందేమో అన్నంత ఆప్ట్గా.. ఏ యాక్ససరీకైనా ఆమె వల్లే అందం వస్తుందేమో అన్నంత గ్రేస్ఫుల్గా కనిపించసాగింది ఆ నటి.దీన్ని బాలీవుడే కాదు యూరప్ ఫ్యాషన్ ప్రపంచమూ గమనించింది. అలియాకు చాన్స్ల వరద కురిపించింది. సెలబ్స్ ఎవరైనా రెడ్కార్పెట్ మీద కాలు పెట్టాలంటే అలియా స్టయిలింగ్ చేయాల్సిందే అన్నంత పాపులర్ అయిపోయింది. అలా దీపికా పదుకోణ్, ఆలియా భట్, కియారా ఆడ్వాణీ, యామీ గౌతమ్, నర్గిస్ ఫక్రీ, శ్రద్ధా కపూర్ వంటి వాళ్లందరికీ అలియా పర్సనల్ స్టయిలిస్ట్గా పనిచేసింది.ఫ్యాషన్లో మరింత స్కిల్ సంపాదించుకునేందుకు 2018లో మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ రంగంలో పట్టభద్రురాలైంది."అంకితభావం, హార్డ్వర్కే నన్నీ రోజు ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేర్చాయి. బ్యూటీ అంటే నా దృష్టిలో సింప్లిసిటీ! మీ స్కిన్తో మీరు ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత అందంగా కనపడతారు. నా వింటేజ్ ఫ్యాషన్కి ఇన్స్పిరేషన్ మా అమ్మే అని చెబుతాను. సందర్భానికి తగ్గట్టు ఆమె రెడీ అయ్యే తీరే నాలో ఫ్యాషన్ సెన్స్ని పెంచింది. సీజన్స్ మారుతుంటాయి. ఫ్యాషన్ మాత్రం ఇవాల్వ్ అవుతూంటుంది. ఈ సత్యాన్ని గమనిస్తే స్టయిలిస్ట్లకు తిరుగులేదు.నేర్చుకోవడానికి బాలీవుడ్ని మించిన ఇండస్ట్రీ లేదు. మెంటర్ కన్నా రెండడుగులు ముందుండాలి ఎప్పుడూ! ఫలానా పని చేయండి అని మెంటర్ ఆర్డర్ వేయగానే ఆల్రెడీ డన్ అనే ఆన్సర్ ఉండాలి మన దగ్గర. నా ఫిలాసఫీకి వస్తే.. ఈ క్షణంలో బతకడాన్ని మించిన ఆనందంలేదు అంటాను. అదే అందం. చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెదుక్కుంటాను!" – అలియా అల్ రుఫైఇవి చదవండి: తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ! -
సాధికారతతో పెరిగిన మహిళా ఓటింగ్
సాక్షి, అమరావతి: 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మహిళా సాధికారతకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలు వారి కాళ్లపై వారు నిలబడటమే కాకుండా, కుటుంబానికి కూడా ఆర్థికంగా తోడ్పాటునందించడానికి పలు పథకాలు ప్రవేశపెట్టారు. చిన్న వ్యాపారాల నుంచి పరిశ్రమల ఏర్పాటు వరకు వారికి అండదండగా నిలిచారు. దీంతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొన్నారు. కుటుంబంలో వారి ప్రాబల్యం పెరిగి, కుటుంబ పొదుపు పెరిగింది. రాష్ట్రంలో మహిళలు సాధించిన ఈ సాధికారత పెరిగిన డిపాజిట్ల ఖాతాల రూపంలో, ఈ ఎన్నికల్లో మహిళల ఓట్ల రూపంలో ప్రతిబింబించిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. 2019 మార్చి నుంచి 2023 మార్చి వరకు రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా మహిళల డిపాజిట్ల ఖాతాల్లో పెరుగుదల, రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన 6 దశల లోక్సభ ఎన్నికల్లో పెరిగిన మహిళల ఓట్లను ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది.ఆంధ్రప్రదేశ్లో 2019 మార్చి నుంచి 2023 మార్చికి మహిళా డిపాజిట్ ఖాతాలు 90.4 లక్షలు పెరిగాయని తెలిపింది. తద్వారా మహిళలు నిర్ణయాత్మకంగా మారారని, దాని ఫలితంగానే 2019 ఎన్నికలను మించి 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అదనంగా 8.4 లక్షల మంది మహిళలు ఓటు వేశారని నివేదిక వెల్లడించింది. ఈ సంవత్సరం ఎన్నికల్లో పురుషులకన్నా మహిళా ఓటర్లు పోలింగ్లో అత్యధికంగా పాల్గొన్నారని తెలిపింది. రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఓట్ల పెరుగుదల జనరల్ కేటగిరీ నియోజకవర్గాలకంటే ఎక్కువగా ఉండటం స్వాగతించదగ్గ అంశమని పేర్కొంది. ఆసక్తికరంగా, ప్రతి అదనపు 100 మంది పురుష ఓటర్లకు, ఎస్సీ నియోజకవర్గాల్లో 115 మంది, ఎస్టీ నియోజకవర్గాల్లో 111 మంది మహిళా ఓటర్లు ఉన్నారని, సాధారణ నియోజకవర్గాల్లో 105 మంది మహిళలు ఉన్నారని నివేదిక పేర్కొంది.6 దశల్లో 54.3 కోట్ల మంది ఓటు వేశారని..దేశవ్యాప్తంగా జరిగిన ఆరు దశల పోలింగ్లోనూ మహిళల ఓట్లు గతంలోకన్నా బాగా పెరిగాయని తెలిపింది. కేరళ, మణిపూర్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో 2019 ఎన్నికలకన్నా 2024 ఎన్నికల్లో మహిళా ఓట్లు 1.73 లక్షలు పెరిగినట్లు చెప్పింది. 2019 మార్చి నుంచి 2023 మార్చి నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మహిళా డిపాజిట్ ఖాతాల సంఖ్య 30.97 కోట్లు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్లో 4.18 కోట్ల మహిళా ఖాతాలు, ఆ తరువాత ఢిల్లీలో 3.32 కోట్ల మహిళా ఖాతాలు పెరిగినట్లు తెలిపింది. 2024లో మొత్తం 57.8 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 2019లో తొలి 6 దశల్లో 54.3 కోట్ల మంది ఓట్లు వేశారని, ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 3.45 కోట్ల మంది ఓటర్లు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. పెరిగిన 3.45 కోట్ల మంది ఓటర్లలో, మహిళా ఓటర్లు 1.73 లక్షలు, పురుష ఓటర్లు 1.62 లక్షలుగా తెలిపింది. ఇలా మహిళా ఓటర్లు పురుషులకంటే నిర్ణయాత్మకంగా ఉన్నారని, ప్రతి 100 మంది పురుష ఓటర్లకు 107 మంది మహిళా ఓటర్లు ఉన్నారని నివేదిక విశ్లేషించింది. -
ఆరోగ్యం ఆమె హక్కు!
ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండాలనుకోవడం కూడా ఒక హక్కే. ఈ విషయాన్ని ప్రపంచంలోని ప్రతి మహిళా గుర్తించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా మే 28న‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్ హెల్త్’ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళ తన ఆరోగ్య సంరక్షణ కోసం అవగాహన పెంచుకోవడంతో ΄ాటు హక్కుగా ఎలా భావించాలో తెలుసుకోవాలి. మహిళల ఆరోగ్య సంరక్షణలో కొనసాగుతున్న ఇబ్బందులు, అవకాశాలను హైలైట్ చేసే ఒక ముఖ్యమైన వేడుకగా ఈ రోజును భావించాలి.మహిళల ఆరోగ్య సంరక్షణలో అసమానతలను తొలగించడానికి లాటిన్ అమెరికన్, కరీబియన్ ఉమెన్ హెల్త్ నెట్వర్క్ 1987లో గ్లోబల్ నెట్వర్క్ (డబ్ల్యూజిఎన్ఆర్ఆర్)ను ఏర్పాటు చేశారు. ఆరోగ్య సంరక్షణలో మహిళల తక్షణ అవసరాలను గుర్తించడానికి ఈ నెట్వర్క్ ఆవిర్భవించింది. మహిళల ఆరోగ్య సేవలు, హక్కులలో నిరంతరంగా వచ్చే అవాంతరాలను పరిష్కరించాలి. మరింత పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను సాధించాలనేది ఈ నెట్వర్క్ ఉద్దేశ్యం.మొదటిది ప్రసూతి ఆరోగ్యంమొదట పునరుత్పత్తి, ప్రసూతి సమయాలలో సురక్షితమైన ఆరోగ్య సేవలను ΄÷ందడంపై దృష్టి సారించడానికి ఈ రోజును కేటాయించారు. ప్రపంచంలో ముప్పై ఏళ్ల క్రితం ప్రసూతి మరణాలు అధికంగా ఉండటంతో తొలుత వాటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ తర్వాత స్త్రీల మానసిక ఆరోగ్యం, హెచ్ఐవి, గర్భనిరోధక సాధనాలు, నాన్–కమ్యూనికబుల్ వ్యాధులు, ఆర్థిక–సామాజిక కారకాల ప్రభావం... వంటి విస్తృత శ్రేణి అంశాలను చేర్చే దిశగా క్రమంగా విస్తరణ జరిగింది. ఒక విధంగా చె΄్పాలంటే ఈ అవగాహన అంతర్జాతీయ స్థాయిలో మహిళల ఆరోగ్య ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి సెమినార్లు, శిక్షణ, పరిశోధన కార్యక్రమాలను స్పాన్సర్ చేశాయి. నిధుల పెట్టుబడిని ్ర΄ోత్సహిస్తూ ‘సురక్షిత మాతృత్వం’ అనే థీమ్తో సమస్యను చేపట్టాయి. 1987 మే, 28 నుంచి ఈ రోజుకు ఓ ్ర΄ాధాన్యాన్ని కల్పిస్తూ అనేక ప్రభుత్వాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళ ΄ûర సమాజ సంస్థలు మహిళల ఆరోగ్యం కోసం తమ చేయూతను అందిస్తున్నాయి. అవగాహనే కీలకంగా! ఎవరూ ఏ మాత్రం పట్టించుకోని, హాని కలిగించే వ్యాధులతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే క్లిష్టమైన ఆరోగ్య సమస్యలను ఈ రోజు చర్చకు తెస్తూ, వాటిని హైలైట్ చేస్తుంది. బహిరంగ సమావేశాల ఏర్పాటు ద్వారా ఈ సమస్యలను వెలుగులోకి తీసుకు వస్తూ, మహిళల ఆరోగ్య సంబంధిత విద్యలను ్ర΄ోత్సహిస్తుంది. .ఆరోగ్య హక్కుల కోసం న్యాయవాదిగా!మహిళల ఆరోగ్య హక్కుల కోసం వాదించడానికి, ఆరోగ్య సంరక్షణలో జెండర్ సమానత్వాన్ని ్ర΄ోత్సహించే విధానాల అమలుకు అవసరమైన కార్యక్రమాల ఆవశ్యకతను నొక్కి చెప్పడానికి ఇదొక వేదికగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని వివిధ ్ర΄ాంతాల నుంచి మహిళల ఆరోగ్య న్యాయవాదులు, సంస్థలు, కమ్యూనిటీలను ఒకచోట చేర్చి, వారిలో సంఘీభావాన్ని పెం΄÷ందిస్తుంది. ఈ సమష్టి చర్య మహిళల ఆరోగ్య హక్కుల కోసం చేసే ఉద్యమాలను బలపరుస్తుంది.మహిళా సాధికారత మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడం ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సుపై బాధ్యత వహించడానికి ఈ ప్రత్యేకమైన రోజు మహిళలకు ఓ శక్తినిస్తుంది. ఆరోగ్య సమాచారాన్ని వెతకడానికి, సేవలను ΄÷ందడానికి తామే నిర్ణయాత్మక శక్తిలా మారే కార్యక్రమాలలో ΄ాల్గొనేలా మహిళలను ్ర΄ోత్సహిస్తుంది. మహిళల ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వాలు మద్దతునివ్వాలి. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో మహిళల ఆరోగ్యం, హక్కులను ్ర΄ోత్సహించే కార్యక్రమాలలో ΄ాల్గొనేలా చేయాలి. ఆరోగ్య నిపుణులు, విధాన రూపకర్తలు, కమ్యూనిటీ నాయకులతో సహా వివిధ సంస్థలు కూడా ఇందులో భాగం కావాలన్నది డబ్ల్యూజిఎన్ఆర్ఆర్ నెట్వర్క్ ప్రధాన లక్ష్యం. -
ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్తో!
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పరిచయ అక్కర్లేని పేరు. బీ టౌన్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ప్రముఖ హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ను పెళ్లాడింది. ప్రస్తుతం హాలీవుడ్తో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన ప్రియాంక అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత ఖరీదైన నెక్లెస్ ధరించిన స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.తాజాగా రోమ్లో జరిగిన బుల్గారీ 140వ వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రియాంక హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తన బ్రాండ్ క్లాసీ ఆభరణాలను ధరించింది. దీంతో అందరి కళ్లు ప్రియాంక నెక్లెస్పైనే పడ్డాయి.ఇంతకీ ప్రియాంక ధరించిన డైమండ్ నెక్లెస్ ధర వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ప్రియాంక వేసుకున్న నెక్లెస్ను 140 క్యారెట్ల డైమండ్తో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం డైమండ్ నెక్లెస్ దాదాపు రూ.358 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. ఆ నెక్లెస్ రూపొందించడానికి దాదాపు 2,800 గంటల సమయం పట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో అత్యంత ఖరీదైన నెక్లెస్లో ఇది ఒకటిగా నిలిచింది.ఇక సినిమాల విషయానికొస్తే ప్రియాంక హాలీవుడ్ మూవీ హెడ్స్ ఆఫ్ స్టేట్ షూటింగ్ను ఇటీవలే పూర్తి చేసుకుంది. బాలీవుడ్లో ఆమె చివరిసారిగా 2019లో వచ్చిన ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో ఫర్హాన్ అక్తర్తో కలిసి నటించారు. ప్రస్తుతం ఆమె అలియా భట్, కత్రినా కైఫ్తో కలసి జీ లే జరా అనే సినిమాలో కనిపించనుంది. View this post on Instagram A post shared by BVLGARI Official (@bvlgari) -
‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
సాక్షి, అమరావతి: నిజ జీవితంలో పేదరికం, సామాజిక, లింగ వివక్ష వంటి రుగ్మతలను సమర్థంగా ఎదుర్కొని తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచిన విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. సీఐఐ ఫౌండేషన్ మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, సామాజిక లింగ – ఆధారిత వివక్షను ఎదుర్కొన్న అట్టడుగు మహిళా నాయకులను గుర్తించి ఎగ్జంప్లర్ పేరుతో అవార్డునిస్తోంది. ఇందులో భాగంగా సీఐఐ వుమెన్ ఫౌండేషన్ 19వ ఎడిషన్లో సూక్ష్మ మధ్య చిన్నతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రంగంలో సరస్వతి ఎంపిక కాగా శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అవార్డును అందించారు. మొత్తం మూడు విభాగాల్లో అవార్డులను ప్రకటించగా విద్యారంగం నుంచి మహారాష్ట్రకు చెందిన రంజిత పవార్, ఆరోగ్యరంగంలో బిహార్కు చెందిన రుమీ పర్వీన్, ఎంఎస్ఎంఈ రంగంలో మన రాష్ట్రానికి చెందిన సరస్వతి ఎంపికయ్యారు. అవార్డు గ్రహీతలకు ట్రోఫీ, సర్టిఫికెట్తో పాటు రూ.మూడు లక్షల నగదును అందజేశారు. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా మొత్తం 300మంది పోటీపడగా వాటిలో తుది పోటీకి 16మందిని ఎంపిక చేసి స్వయంగా వెళ్లి పరిశీలించి, వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసినట్లు సీఐఐ శుక్రవారం పేర్కొంది. మహిళా రైతులతో నెట్వర్క్విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస నిజజీవితంలో గృహ హింస, లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆహార భద్రత, ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి రావడమే ఈ వివక్షకు ప్రధాన కారణమని గుర్తించిన ఆమె ఇంకెవ్వరూ ఇలాంటి కష్టాలు ఎదుర్కోకూడదని మిల్లెట్ సిస్టర్స్ పేరుతో చిన్న స్థాయి మహిళా రైతుల నెట్వర్క్ను స్థాపించారు. దీని ద్వారా 20,000 మంది మహిళలకు ఆదాయాన్ని మెరుగుపర్చేలా జీవనోపాధిని కల్పించి ఆదర్శంగా నిలిచారు. మహిళా సాధికారితలో అయిదు ‘ఈ’లు ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, ఎంప్లాయిమెంట్, ఎకనావిుక్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ ప్రధానమైనవిగా గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సీఐఐ 19వ ఎడిషన్లో ఎంపికైన 16 మందితో కలిపి ఇప్పటి వరకు 120 కంటే ఎక్కువ మందిని గుర్తించామని, వీరి ద్వారా 30 లక్షల మంది జీవితాల్లో స్పష్టమైన మార్పులను గమనిస్తున్నట్లు సీఐఐ పేర్కొంది.
Related News by category
Advertisement