ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా | Andhra pradesh assembly adjourned to monday | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా

Published Sat, Mar 19 2016 12:22 PM | Last Updated on Sat, Aug 18 2018 5:18 PM

Andhra pradesh assembly adjourned to monday

హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఆందోళనలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం దద్దరిల్లింది. ఎమ్మెల్యే ఆర్కే రోజా విషయంలో న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ సీపీ నేతలు ఎంతకూ వెనక్కి తక్కకపోవడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ సభ మూడోసారి ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. రోజాను సభకు అనుమతించాలంటూ నినాదాలు చేయగా పరిస్థితిని కంట్రోల్ చేయలేని పక్షంలో సభను సోమవారానికి వాయిదావేశారు.

అంతకుముందు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సభకు నల్ల దుస్తులతో వచ్చి తమ నిరసన తెలిపారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం, రోజాను ఎందుకు అనుమతించడం లేదంటూ పదే పదే అడుగుతున్న క్రమంలో రెండు సార్లు సభ వాయిదా పడిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement