'అవినీతిపై హైకోర్టును ఆశ్రయిస్తా'
హైదరాబాద్ : మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో జరిగిన అవినీతిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ...టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎంసెట్-2 లీకేజీ విషయంలో మంత్రిని ఎందుకు కాపాడుతున్నారని ? నాగం ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతిపై హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు. కృష్ణాజలాలపై ఏపీ ప్రభుత్వం పాలమూరు జిల్లాకు అన్యాయం చేయొద్దని సూచించారు.