చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చైన్ స్నాచర్ల ఘటనలతో మహిళలు ఒంటరిగా బయటకు రావలంటేనే భయపడుతున్నారు.
హైదరాబాద్సిటీ: చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చైన్ స్నాచర్ల ఘటనలతో మహిళలు ఒంటరిగా బయటకు రావలంటేనే భయపడుతున్నారు. తాజాగా మేడిపల్లి పరిధిలోని పిర్జాదిగూడలో ఆదివారం మహిళ మెడలో చైన్ స్నాచింగ్ జరిగింది.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వరలక్ష్మి అనే మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు బైక్పై వచ్చి లాక్కెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.