ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా | Diploma in Elementary Education through Open School | Sakshi

ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా

Published Sun, Sep 10 2017 3:06 AM | Last Updated on Sat, Sep 15 2018 4:26 PM

జాతీయ ఓపెన్‌ స్కూల్‌(ఎన్‌ఐఓఎస్‌) ద్వారా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా కోర్సును దూరవిద్య ద్వారా పొందే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ జి.కిషన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఓపెన్‌ స్కూల్‌(ఎన్‌ఐఓఎస్‌) ద్వారా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా కోర్సును దూరవిద్య ద్వారా పొందే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ జి.కిషన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీ.ఈఎల్‌.ఈడీ) శిక్షణ పొంది ఉండాలన్నారు.

ఇప్పటివరకు శిక్షణ పొందని వారుంటే 31 మార్చి, 2019లోగా శిక్షణ పొందాలన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దూరవిద్య ద్వారా శిక్షణ కార్యక్రమం చేపట్టిందని, ఆసక్తి గలవారు ఈనెల 15లోగా www.nios.ac.in లేదా   dled@nios.ac.in ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement