School Education Department
-
‘చదివింపులు’ పెరగాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్లో పాఠశాల విద్యకు కేటాయింపులు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్ర బడ్జెట్ రూ.3లక్షల కోట్లు దాటుతోంది. ఇందులో విద్యారంగానికి కనీసం 15 శాతం కేటాయింపులు ఉండాలన్నది ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, విద్యారంగ నిపుణుల డిమాండ్. రాష్ట్ర అవతరణ నుంచి కేటాయింపులు గరిష్టంగా 7 శాతం దాటడం లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, కొత్త టీచర్ల నియామకా లు చేపట్టాలన్నా, నిధుల కొరత అడ్డంకిగా మారుతుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది. విద్యారంగానికి నిధులు పెంచాలని రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫా ర్సు చేసింది. నిధులు పెంచి విద్యారంగ సంస్కరణలు చేప ట్టాలని మంత్రివర్గ ఉపసంఘం కూడా అభిప్రాయపడింది. ఎక్కువ భాగం వేతనాలకే చెల్లు రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే కేటాయింపుల్లో సింహభాగం టీచర్లు, ఇతర సిబ్బంది వేతనాలకే ఖర్చవుతోంది. ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం వెనుకబడి ఉందని కేంద్ర విద్యాశాఖ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇప్పటికే పేద విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు సకాలంలో పంపిణీ చేయడానికి ఇబ్బందులు తప్పడం లేదు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లనూ తీర్చిదిద్దుతామని చెప్పి మన ఊరు–మనబడి కార్యక్రమం చేపట్టినా తొలి దశలోనే నిధుల కొరత ఎదురైంది. తగ్గుతున్న ప్రవేశాలు కోవిడ్ కాలంలో మినహా ప్రభుత్వ స్కూళ్లల్లో ప్రవేశాలు ఏటా పడిపోతున్నాయి. రాష్ట్రంలో 11,067 గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూళ్లున్నాయి. చిన్న స్కూళ్లలో ఫీజులు రూ.30 నుంచి రూ.40 వేల మధ్య ఉంటున్నాయి. కార్పొరేట్ స్కూళ్లల్లో రూ.లక్షల్లో ఉంటున్నాయి. అయినా మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయించడానికి కారణం.. ప్రభుత్వ స్కూళ్లల్లో నాణ్యత కొరవడటమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి సర్కారీ స్కూళ్లల్లో నాణ్యమైన బోధకులే ఉన్నారు. కానీ బోధన విధానం సరైన రీతిలో ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే విద్యారంగానికి కేటాయింపులు పెంచాల్సిన అవసరముంది. టీచర్లు ఏరి.. సదుపాయాలెక్కడ ? ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ 18 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా స్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్లే లేరు. 602 మండలాల్లో కేవలం 17 చోట్ల మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. 6 వేల పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. విద్యావలంటీర్ల నియామకంపైనా పాఠశాల విద్యా శాఖ దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా బోధన అరకొరగా ఉంటోందన్న ప్రచారం.. విద్యార్థులను ప్రైవేట్ బాట పట్టిస్తోంది. నిధులు పెంచాలి పాఠశాల విద్యకు నిధులు పెంచాలి. మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రైవేట్ విద్యాసంస్థలతో పోటీపడే శక్తి సామర్థ్యాలున్నా, అవసరమైన వసతులు లేకపోవడమే సమస్యగా మారింది. – పింగిలి శ్రీపాల్రెడ్డి,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ 15 శాతం నిధులైనా ఇవ్వాలి విద్యకు కేవలం 7 శాతం నిధులే ఇస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 13 శాతం నిధులిస్తున్నారు. 90 శాతం బడుగు,బలహీన వర్గాల విద్యార్థులున్న తెలంగాణలో విద్యారంగానికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహిస్తోంది. – మాచర్ల రాంబాబు,ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కేటాయింపులతో సంస్కరణలు పాఠశాల విద్యలో సంస్కరణలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనిని స్వాగతిస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో అవసరాలు ఏంటి? ఏమేం సమకూర్చాలనే దానిపై ఫోకస్ పెట్టాలి. ఇది జరగాలంటే నిధులు పెంచాలి. – రాజగంగారెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
‘గురి’తప్పిన గురుకులాలు!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. ఈ పాఠశాలల ప్రారంభ సమయంలో ఒక్కో సీటుకోసం కనీసం నలుగురు విద్యార్థులు పోడిపడగా, ఇప్పుడు ఇద్దరు కూడా పోటీలో లేకపోవడం గమనార్హం. ఇటీవల గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు అధికం కావటం, వసతుల లేమి కారణంగా వాటిల్లో చేరేందుకు విద్యార్థులు, చేర్పించేందుకు వారి తల్లిదండ్రులు ఆసక్తి చూప టం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ గతేడాది డిసెంబర్లో విడుదల కాగా, గడువు ముగిసేనాటికి దాదాపు 80 వేల మందే దరఖాస్తు చేసుకున్నారు. సీట్లు 51 వేలు.. దరఖాస్తులు 80 వేలు రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలున్నాయి. ఇందులో నాలుగు సొసైటీలు సంక్షేమ శాఖలకు అనుబంధంగా కొనసాగుతుండగా.. జనరల్ సొసైటీ పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉంది. ప్రస్తుతం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గురు కుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)లు ఐదోతరగతికి ఉమ్మడిగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాయి. మైనార్టీ గురుకుల సొసైటీ మాత్రం ప్రత్యేకంగా సెట్ నిర్వహించి ప్రవేశాలు చేపడుతోంది. మైనార్టీ సొసైటీలోని పాఠశాలలు మినహా మిగిలిన నాలుగు సొసైటీల్లోని 643 పాఠశాలల్లో ఐదోతరగతిలో 51,924 సీట్లు ఉన్నా యి. వీటిలో ఐదోతరగతి ప్రవేశాలకు గతేడాది డిసెంబర్ 21 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 80 వేలలోపే దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే ఇవి దాదాపు 40 వేలు తక్కువ. ఈ నెల 23వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం నమోదైన దరఖాస్తుల ప్రకారం ఒక్క సీటు కోసం సగటున 1.6 మంది పోటీ పడుతున్నారు. గురుకుల పాఠశాల ప్రవేశం కోసం గతంలో విపరీతమైన డిమాండ్ ఉండేది. ఒక్కో సీటు కోసం సగటున నలుగురు విద్యార్థులు పోటీపడేవారు. గత ఏడాది కాలంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు భారీగా పెరగటమే డిమాండ్ తగ్గటానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలు విడుదల చేశారు. జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన టెట్ పరీక్షల్లో మొత్తం 31.21 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 1,35,802 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయగా.. 42,384 మంది అర్హత సాధించారు. టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితాలను https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.కాగా, ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత ఏడాది 11 వేల టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇంకా 17 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్ అర్హత సాధించినవారు దాదాపు 3 లక్షల మంది ఉన్నా రు. -
ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఆధారిత బోధన
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త తరహాలో బోధనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వర్చువల్ రియాలిటీ విధానంలో పాఠాలు చెప్పేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్స్టెప్ ఫౌండేషన్ సహకారం తీసుకోనుంది. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఫౌండేషన్కు వెళ్లి అక్కడ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఏ తరహా మౌలిక వసతులు, ఏఐ ఆధారిత టూల్స్ కావాలో తెలుసుకున్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో కొన్ని స్కూళ్ళను ఎంపిక చేసి..వచ్చే విద్యా సంంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రూపొందించిన ఓ నివేదికను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి త్వరలో ప్రభుత్వానికి సమరి్పంచనున్నారు. సరి చేసుకునే వరకు సూచనలు! రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్ళున్నాయి. ఇందులో తొలి విడతగా 5 వేల స్కూళ్ళను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కంప్యూటర్లు, ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న స్కూళ్ళ జాబితాను పరిశీలిస్తున్నారు. 5వ తరగతి మొదలు కొని 10వ తరగతి వరకూ ఏఐ ఆధారిత బోధన ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సిలబస్ను దృష్టిలో ఉంచుకుని ప్రోగ్రామ్స్ రూపొందిస్తారు. ప్రధాన సర్వర్ల నుంచి ఆయా స్కూళ్ళకు వీటిని అనుసంధానం చేస్తారు. టీచర్ ఒక పాఠం చెప్పిన తర్వాత ఏఐ ఆధారిత ప్రశ్నలు గూగుల్ క్రోం ద్వారా విద్యార్థులకు పంపుతారు. వీటికి ఆన్లైన్లోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తప్పులుంటే సరి చేసుకునే వరకూ ఏఐ టెక్నాలజీ విద్యారి్థకి సూచనలు చేస్తుంది. వర్చువల్ రియాలిటీ విధానంలో.. ఏఐ సాంకేతికత అందుబాటులోకి వస్తే విద్యార్థి స్వయం అనుభవం మాదిరి పాఠం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు విత్తనం మొలకెత్తడం, వృద్ధి చెందడానికి సంబంధించి థియరీ మాత్రమే పుస్తకాల్లో ఉంటుంది. వర్చువల్ విధానంలో విద్యారి్థకి కెమెరా లెన్స్ పరికరం ఇస్తారు. దీన్ని ధరించిన తర్వాత విత్తనం తానే నాటి, అది దశల వారీగా ఎలా ఎదుగుతుందో పరిశీలిస్తున్న అనుభూతి పొందుతాడు. అదే విధంగా ఎర్రకోట గురించి పాఠం చెప్పేప్పుడు, టిప్పు సుల్తాన్ యుద్ధంపై బోధన చేసేప్పుడు అక్కడే ఉండి చూస్తున్నట్టుగా చేయడం ఏఐ టెక్నాలజీతో సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో పఠనాసక్తి పెరగడంతో పాటు, జ్ఞాపక శక్తి మెరుగయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలే కీలకం డిజిటల్ బోధన కోసం గతంలో 3 వేల పాఠశాలల్లో లే»ొరేటరీలు ఏర్పాటు చేశారు. 10 వేల స్కూళ్ళకు కంప్యూటర్లు ఇచ్చారు. 8 వేల స్కూళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. కానీ ఏఐ ఆధారిత బోధనకు మరింత అత్యాధునిక మౌలిక వసతులు అవసరం. ఇప్పుడున్న నెట్ స్పీడ్ పది రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. సర్వర్ల నుంచి వేగంగా ప్రోగ్రామింగ్ అందుకోగల మాడ్యూల్స్ను రూపొందించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లకు ఏఐపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంది. గతంలో ఇచ్చిన కంప్యూటర్లు చాలా స్కూళ్లలో వాడకుండా పక్కన పడేశారు. తాజాగా ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామాల్లో ఉండే యువతను ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ఏఐతో మెరుగైన బోధన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్ల కంటే మెరుగైన విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నాం. ఇందులో భాగంగానే ఏఐ టెక్నాలజీతో విద్యా బోధన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనిపై త్వరలోనే కార్యాచరణ చేపట్టాలని భావిస్తున్నాం. – ఈవీ నర్సింహారెడ్డి (పాఠశాల విద్య డైరెక్టర్) మంచి ఫలితాలకు అవకాశం ఉంది అమెరికాలో గూగుల్ క్రోం ద్వారానే అసైన్మెంట్స్ ఇస్తున్నారు. మూల్యాంకనం చేపడుతున్నారు. ఏఐ వాడకంలో అక్కడి స్కూళ్ళు ముందంజలో ఉన్నాయి. మన విద్యార్థులు గణితంలో అక్కడివారి కంటే మెరుగ్గా ఉంటారు. కాబట్టి ఏఐ టెక్నాలజీతో మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. – సంక్రాంతి రవికుమార్ (అమెరికాలో ఏఐ బోధన పరిశీలించిన టీచర్) అడ్మిషన్లు పెరుగుతాయి ఏఐ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెరుగుతాయి. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు ఇది మంచి మార్గం. దీనిపై టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. – పింగిలి శ్రీపాల్రెడ్డి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు) -
విద్యపై ప్రకృతి ప్రకోపం
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వేడి గాలులు, తుపానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పాఠశాల విద్యకు అంతరాయం కలుగుతోంది. ఈ విషయం యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్స్ (యునిసెఫ్) అధ్యయనంలో వెల్లడైంది. గతేడాది ప్రకృతి విపత్తులతో 85 దేశాల్లో 242 మిలియన్ల మంది విద్యార్థులు ప్రీ–ప్రైమరీ నుంచి అప్పర్ సెకండరీ వరకూ విద్యలో అంతరాయాన్ని ఎదుర్కొన్నట్టు పేర్కొంది. ప్రతి ఏడుగురు విద్యార్థుల్లో ఒకరి పాఠశాల విద్యపై వాతావరణ సంక్షోభం ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు స్పష్టం చేసింది. విపత్తుల కారణంగా విద్యలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో దిగువ, మధ్య ఆదాయ దేశాలే అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. గతేడాది విద్య అంతరాయానికి గురైన 242 మిలియన్ల మంది విద్యార్థుల్లో 74 శాతం మంది అల్పాదాయ దేశాలకు చెందిన వారున్నారు. భారత్లోనూ 5 కోట్ల మంది 2024 విద్య అంతరాయానికి తీవ్రమైన వేడిగాలులు ప్రధాన కారణంగా నిలిచాయని చెప్పవచ్చు. తీవ్రమైన వేడిగాలుల కారణంగా గతేడాది భారత్లో 5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. వేడిగాలుల కారణంగా భారత్తో పాటు బంగ్లాదేశ్, కంబోడియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్ వంటి దేశాలు గణనీయమైన ప్రభావాలను చవిచూశాయి. ఈ దేశాల్లో కనీసం 118 మిలియన్ల మంది పిల్లలకు చదువుల్లో అంతరాయం ఎదురైంది. ఈ కారణంతో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడినవారు 171 మిలియన్ల మంది ఉంటారని అంచనా వేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా అత్యంత తరచుగా విద్య అంతరాయాలు సంభవించాయి. 18 దేశాలలో తరగతులు నిలిపేశారు. తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాలలో 16 మిలియన్ల మంది పిల్లలపై ప్రభావం పడింది. ఆఫ్రికాలో 107 మిలియన్ల మంది పిల్లలు ఇప్పటికే పాఠశాలలకు దూరంగా ఉండగా.. వీరిలో 20 మిలియన్ల మంది వాతావరణ సంక్షోభం కారణంగానే పాఠశాలల నుంచి తప్పుకున్నట్టు స్పష్టమైంది. 2050–2059 మధ్య తీవ్ర వాతావరణ సంక్షోభాలను ప్రపంచ దేశాలు చవిచూడనున్నాయని అధ్యయన నివేదిక వెల్లడించింది. 26వ స్థానంలో భారత్ ప్రకృతి వైపరీత్యాల ద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాలపై యునిసెఫ్ గతంలోనే అధ్యయనం చేసింది. 163 దేశాలకు చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ (సీసీఆర్ఐ) పేరిట స్కోరింగ్ ఇచ్చింది. ఇందులో భారత్కు 26 స్థానం దక్కింది. పాకిస్తాన్ 14, బంగ్లాదేశ్, 15, ఆఫ్ఘనిస్తాన్ 25 స్థానాల్లో ఉన్నాయి. -
పాఠశాల విద్యలో క్లస్టర్ విధానం
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యా శాఖలో కీలకమైన స్కూల్ కాంప్లెక్స్ల స్థానంలో క్లస్టర్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సుమారు 5,200 స్కూల్ కాంప్లెక్స్ల స్థానంలో 4,034 క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి. ప్రతి క్లస్టర్కు గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 కి.మీ. పరిధిలో ఉన్న 10 నుంచి 15 పాఠశాలలు, పట్టణ ప్రాంతాల్లో 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని 8 నుంచి 10 పాఠశాలలు అనుసంధానం చేశారు.దీంతోపాటు క్లస్టర్లో 40 నుంచి 50 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు. ఇకపై ప్రతి నెలా పాఠశాల కాంప్లెక్స్ సమావేశాలు కొత్త విధానంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, పాఠశాలల మధ్య విద్య అనుసంధానం, విద్యా వనరుల సామగ్రి తయారీ, తనిఖీలు, విద్యావ్యవస్థ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలు క్లస్టర్ కేంద్రంగా నిర్వహిస్తారు. ఎంఈవో అధికారాలు క్లస్టర్ హెచ్ఎంకు.. కొత్త విధానంలో క్లస్టర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కీలకంగా మారనున్నారు. మండల యూనిట్లో ప్రస్తుతం డీడీవో అధికారాలు ఎంఈవోలకు ఉండగా.. ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికి త్వరలో క్లస్టర్ హెచ్ఎంకు జీతాల పంపిణీ అధికారం బదలాయింపు చేయనున్నారు. ఎంఈవోలు కేవలం పరిపాలన సంబంధ అంశాలకు మాత్రమే పరిమితం కానున్నారు. క్లస్టర్ స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులపై ప్రస్తుతం ఉన్న రోజువారీ విధులకు అదనంగా క్లస్టర్ నిర్వహణ భారం పడడంతోపాటు ఎంఈవోలు నిర్వహిస్తున్న డీడీవో బాధ్యతలను కూడా క్లస్టర్ హెచ్ఎంకే ఇవ్వనున్నట్టు సమాచారం. స్కూల్ కాంప్లెక్స్ను బలోపేతం చేయాలి కొత్తగా పునర్వ్యవస్థీకరణ చేసిన స్కూల్ క్లస్టర్ కేంద్రాలను బలోపేతం చేస్తూ గ్రాంటు రూ.లక్ష వరకు విడుదల చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక డిజిటల్ అసిస్టెంట్, బోధనేతర సిబ్బందిని నియమించాలన్నారు. పాఠశాలల సంఖ్యను పెంచినందున ఇద్దరు చొప్పున సీఆర్పిలను కేటాయించాలని కోరారు. 800 మంది సీఆర్పిలపై ప్రభావం ప్రభుత్వ స్కూళ్లలో బోధనా అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే స్కూల్ కాంప్లెక్స్లను తగ్గిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ విభాగంలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను కూడా తగ్గిస్తోంది. రెండు దశాబ్దాలుగా పాఠశాల విద్యాశాఖలో 4,100 మంది సీఆర్పిలుగా పనిచేస్తుండగా.. ఇప్పుడు వీరిలో దాదాపు 800 మందిని తగ్గించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. స్కూల్ కాంప్లెక్స్ల పునరి్నర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం జూలైలో పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. ఈ మేరకు కాంప్లెక్స్ల స్థానంలో క్లస్టర్ విధానం అమలు చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు.ఇందులో భాగంగా ఒక్కో మండలంలో రెండు స్కూల్ కాంప్లెక్స్లను ఒక్కటిగా చేస్తున్నారు. ఈ క్రమంలో తగ్గిన కాంప్లెక్స్ల సంఖ్యకు అనుగుణంగా సీఆర్పిలు కూడా ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రస్తుతం ఒక్కో మండలం పరిధిని బట్టి 8 నుంచి 10 స్కూళ్లకు కలిపి ఒక స్కూల్ను కాంప్లెక్స్గా, మండలంలో మొత్తం 4 నుంచి 6 కాంప్లెక్స్లు కొనసాగుతున్నాయి. ఆయా స్కూళ్ల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యా సంబంధ పథకాలు, విద్యా కేలండర్, ఉపాధ్యాయుల శిక్షణ తదితర అంశాలను సీఆర్పీలు పరిశీలించి ప్రభుత్వానికి ఎంఈవోల ద్వారా నివేదిక అందిస్తారు.కాంట్రాక్టు విధానంలో నియమితులైన వీరంతా బీఈడీ అర్హత ఉండడంతో గత ప్రభుత్వం క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు (సీఆర్ఎంటీ)గా గుర్తింపు ఇవ్వడంతో పాటు మండలంలో ఎక్కడైనా ఉపాధ్యాయులు సెలవులో ఉన్నప్పుడు బోధనకు అంతరాయం లేకుండా వీరు అక్కడ పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు క్లస్టర్ విధానం అమలుతో సగం మందిని తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి మరో ప్రత్యామ్నాయం చూపుతారా లేదా అన్నదానిపై ఇప్పటి దాకా విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
సంస్కరణల పేరుతో...పాఠశాల విద్యకు తూట్లు!
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో సంస్కరణలు ప్రవేశపెడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 117ను ఉపసంహరిస్తున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు ప్రకటించారు. జీవోలో ఉన్న అంశాలకు భిన్నంగా కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నట్టు గురువారం మెమో జారీ చేశారు. 2022 జూన్లో జాతీయ విద్యావిధానాలకు అనుగుణంగా ప్రభుత్వ విద్యలో మార్పులు చేస్తూ గత ప్రభుత్వం జీవో 117ను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్నా, రద్దు చేయాలన్నా తిరిగి ప్రభుత్వమే మరో జీవో ఇవ్వాల్సి ఉంది. కానీ పాఠశాల విద్య డైరెక్టర్ అందుకు భిన్నంగా జీవోను వెనక్కి తీసుకుంటున్నట్టు మెమో ఉత్తర్వులు విడుదల చేయడం చర్చనీయాంశమైంది. కొన్ని నెలలుగా గుర్తింపు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతున్న డైరెక్టర్, జీవో 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న ఆయన ఈ నిర్ణయం ప్రకటించడం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నష్టం జరిగేలా మార్పులు చేయడంపై ఉపాధ్యాయుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేగాక గ్రామ పంచాయతీల్లో మోడల్ ప్రైమరీ స్కూల్స్ స్థాపనతో పాటు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ స్కూళ్లలో టీచింగ్ స్టాఫ్ విభజనపైనా మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే, జిల్లా పరిషత్ చట్టాలనే మున్సిపల్ టీచర్లకు కూడా వర్తించేలా ఉత్తర్వులు ఉండటంతో ఆ విభాగం టీచర్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే, గత ప్రభుత్వం తీసుకువచ్చిన స్కూలింగ్ విధానానికి పేర్లు మార్చడంతో పాటు 3–5 తరగతులకు అందిస్తున్న సబ్జెక్టు టీచర్ విధానాన్ని రద్దు చేయడం, ఆ తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడంతో పాటు, గ్రామీణ పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హైసూ్కల్ ప్లస్ బోధనను కూడా రద్దు చేస్తున్నట్టు వివరించారు. అంతేగాక మున్సిపల్ స్కూళ్లకు కూడా ప్రభుత్వ, పంచాయతీరాజ్ స్కూల్స్ నిబంధనలు వర్తింపజేయనున్నట్టు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు నష్టం జరిగేలా ఉత్తర్వులు పాఠశాల విద్యా విధానంలో కొత్త విధానం తీసుకొస్తూ విడుదలైన తాజా ఉత్తర్వులు ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం చేసేలా ఉన్నాయి. అన్ని పాఠశాలల్లోను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాలు రెండూ అందుబాటులోకి తెచ్చాకే జీవో 117ను రద్దు చేయాలి. సెక్షన్ల వారీగా కాకుండా విద్యార్థుల సంఖ్యను బట్టి స్టాఫ్ ప్యాట్రన్ నిర్ణయించాలి. ప్రతి మీడియంకు 75 మంది విద్యార్థులు ఉంటే 9 మంది పాఠశాల సిబ్బందిని ఇవ్వాలి. లోపభూయిష్టంగా ఉన్న తాజా ఉత్తర్వులను సవరించాలి. హైసూ్కల్ ప్లస్కు ప్రత్యామ్నాయంగా జిల్లా పరిషత్ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలి. – సి.వి.ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీటీఎఫ్, అమరావతి మున్సిపల్ టీచర్లకు అన్యాయం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు మున్సిపల్ టీచర్లకు అన్యాయం చేసేలా ఉన్నాయి. ప్రభుత్వ విద్య, పంచాయతీరాజ్ టీచర్లకు మేలు చేస్తూ నిబంధనలు రూపొందించారు. పంచాయతీరాజ్ నిబంధనలనే మిగిలిన యాజమాన్యాల్లో ఉన్న పురపాలక, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ టీచర్లకు ఆపాదిస్తున్నారు. ప్రస్తుతం 14 వేలమంది పురపాలక టీచర్లు పట్టణాల్లో పనిచేస్తున్నారు. కానీ ప్రస్తుత నిబంధనలతో పురపాలక టీచర్లను గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేసే పరిస్థితి నెలకొంది. జీవో 84 రద్దు చేసి, నిబంధనను తక్షణమే సవరించాలి. – ఎస్.రామకృష్ణ, అధ్యక్షులు, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్విద్యావిధానంలో మార్పులు ప్రస్తుతం జీవో 117 ప్రకారం... పాఠశాల విద్యలో ఆరు అంచెల పాఠశాలలు కొనసాగుతున్నాయి. 1.శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్ (పీపీ–1, పీపీ–2), 2.ఫౌండేషనల్ స్కూల్ (పీపీ–1 నుంచి రెండో తరగతి వరకు), 3. ఫౌండేషనల్ స్కూల్ ప్లస్ (పీపీ–1, 2తో పాటు 1 నుంచి 5వ తరగతి), 4. ప్రిహైసూ్కల్/ యూపీ స్కూల్ (3 నుంచి 8 తరగతులు), 5. హైసూ్కల్ (3–10 తరగతులు), 6. హైసూ్కల్ ప్లస్ (3 నుంచి ఇంటర్ వరకు) అమలు చేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు రకాల పాఠశాలల వ్యవస్థను 5 రకాల పాఠశాలల వ్యవస్థగా మార్పు చేస్తున్నారు. 1.శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2) మహిళా శిశు సంక్షేమశాఖ చూస్తుంది. ఫౌండేషనల్ స్కూల్ (పీపీ–1 టు 2వ తరగతి), ఫౌండేషనల్ స్కూల్ ప్లస్ స్థానంలో బేసిక్ ప్రైమరీ స్కూల్గా మార్చి పాత విధానం అమలు చేస్తారు. ప్రిహైసూ్కల్ స్థానంలో మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రవేశపెట్టి బేసిక్ ప్రైమరీ స్కూల్ బోధనను అందిస్తారు.హైస్కూల్స్లో 6 నుంచి 10 తరగతులు ఉంటాయి. హైస్కూల్ ప్లస్ను రద్దు చేస్తున్నారు. ఈ విధానంలో ప్రధానంగా 3–5 తగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ విధానం, హైస్కూల్ ప్లస్లో ఇంటర్ విద్య రద్దవుతుంది. అయితే, హైస్కూల్ ప్లస్ రద్దు చేసిన వాటికి ప్రత్యామ్నాయంగా ఆయా పాఠశాలల స్థానంలో అనుబంధ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. ఒక నిబంధన.. అనేక అనుమానాలుమోడల్ ప్రైమరీ స్కూల్స్లో విద్యార్థుల నమోదు 60 దాటితే తరగతికి ఒక టీచర్ను కేటాయిస్తామన్నారు. కానీ బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటారు. ఈ రెండు స్కూలింగ్ విధానంలోనూ ఒకే తరహా తరగతులు కొనసాగుతాయి. కానీ నిబంధనలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి.పాఠశాలల్లో 6, 7, 8 తరతుల్లో విద్యార్థుల సంఖ్య 30 లేదా అంతకంటే తక్కువుంటే ఆ పాఠశాల స్థాయిని బేసిక్ ప్రైమరీ స్కూల్కు తగ్గించి ఆయా ఉన్నత తరగతుల విద్యార్థులను సమీపంలోని హైసూ్కల్లో చేరుస్తారు. అంటే విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థను రద్దు చేస్తున్నారు. దీంతో మూడు కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత తరగతుల చదువు అందే పరిస్థితి లేదు. దీంతో బాలికల ఉన్నత చదువుకు ఆటంకం ఏర్పడుతుంది.ఉన్నత పాఠశాల వ్యవస్థలో 6 నుంచి 10 తరగతులకు సెక్షన్ల వారీగా ఉపాధ్యాయ సంఖ్యను నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 117 జీవో ప్రకారం 3–5 తరగతులను హైసూ్కల్స్లో కలపడంతో ఎనిమిది సెక్షన్లు వరకు కొనసాగుతున్నాయి. దీంతో బోధనకు రెండో స్కూల్ అసిస్టెంట్స్ను అందించారు. అయితే, 3–5 తరగతులను వెనక్కి తీసుకుపోవడంతో రాష్ట్రంలోని 60 శాతం పైగా హైసూ్కళ్లల్లో ఐదు సెక్షన్లు మాత్రమే మిగులుతాయి.ప్రస్తుతం ఆయా హైసూ్కళ్లల్లో మ్యాథ్స్, ఇంగ్లిష్, సోషల్ బోధన అందిస్తున్న రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఒక పోస్టు రద్దు కానుంది. ఈ చర్యతో వందలాది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులు చూపనున్నారు.75 కంటే తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్ట్ ఇచ్చేది లేదని, వ్యాయామ ఉపాధ్యాయులు సైతం మిగులు ఉంటేనే ఆ పోస్టును కేటాయిస్తామన్నారు. అంటే ఇప్పుడున్న పీఈటీలను ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. పై నిబంధనల అమలుకు క్లస్టర్ లెవెల్, మండల్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. దీంతో అధికారులపై ఒత్తిడి తప్పదు.ప్రస్తుతం హైస్కూల్ ప్లస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఏం చేస్తారేది ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. దీంతో ఆయా ఉపాధ్యాయుల పరిస్థితి గందరగోళంగా మారనుంది. సర్ప్లస్ ఉపాధ్యాయులను ఎక్కడ సర్దుబాటు చేస్తారనేది అనుమానమే. -
పాఠాలు తర్వాత.. రిపోర్టులు పంపండి!
సాక్షి, అమరావతి: ‘మీ పాఠశాలల్లో ఎస్సీ ఉపాధ్యాయులు ఎంత మంది ఉన్నారు? విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 2014–15 నుంచి 2023–24 విద్యా సంవత్సరం వరకు ఈ వివరాలు అర్జెంటుగా పంపించండి’.. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అందిన ఆదేశం ఇది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వెబెక్స్లో సమాచారం అందించి, సాయంత్రంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. గత వారం ఉపాధ్యాయుల సర్వీసు సమాచారం వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అంతకు ముందు అపార్.. పెన్.. ఇలా రోజుకో అంశంపై ఉపాధ్యాయులకు ‘అర్జెంట్ ఫైల్’ అంటూ ఆదేశాలు అందుతున్నాయి. దీంతో స్కూళ్లలో పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులకు సమయం ఉండటంలేదు. అధికారులు అడిగే సమాచారం అందించేందుకే సమయం సరిపోవడం లేదని, పాఠాలు చెప్పే సమయం ఎక్కడిదని టీచర్లు వాపోతున్నారు.ఎప్పుడు ఏం అడుగుతారో తెలియడంలేదని, పైగా అర్జెంట్ అంటూ అప్పటికప్పుడు సమాచారం మొత్తం ఇచ్చేయాలని ఆదేశిస్తున్నారని, దీంతో టెన్షన్తో గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవుల్లోనూ ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వింత పోకడతో రాష్ట్రవ్యాప్తంగా విద్యా బోధన కుంటుపడింది. దీంతో మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో సమస్యలు ఏర్పడ్డాయి. గత ప్రభుత్వంలో విద్యా శాఖలో చేపట్టే సంస్కరణలు, మార్పులపై అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించేవారని, కూటమి ప్రభుత్వంలో రిజిస్టర్డ్ సంఘాలకు అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారని టీచర్లు వాపోతున్నారు. కొన్ని నెలలుగా సమావేశాలు జరగడమే గానీ సమస్యలు పరిష్కారం కాలేదని ఈ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఆందోళనలు, ధర్నాలకు సిద్ధమవుతున్నాయి. దీంతో పాఠశాల విద్య డైరెక్టర్ తాజాగా వారితోనూ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. అయితే, సమస్యలు విని పరిష్కరిస్తారా.. లేక ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరిస్తారా అనేది తేలాల్సి ఉంది. చర్చలకు గుర్తింపు సంఘాలకే అనుమతి కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత జూన్ నెలలో చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు రసాభాసగా మారింది. నేతల రికమండేషన్లు, ఒత్తిళ్లతో బదిలీ ప్రక్రియని గందరగోళంగా మార్చేశారు. ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత, పలుచోట్ల ఆందోళనల నేపథ్యంలో వారంలో పూర్తవ్వాల్సిన సర్దుబాటు రెండు నెలల పాటు సాగింది. అనంతరం ఉపాధ్యాయ సమస్యలపై కమిషనరేట్లో చర్చలకు శ్రీకారం చుట్టారు. జీవో 117 రద్దు, ఇంగ్లిష్ మీడియం రద్దు, 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం, టీచర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాల చెల్లింపు వంటి అంశాలపై పాఠశాల విద్య డైరెక్టర్ అధ్యక్షతన చర్చలు జరుగుతున్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్న ఈ చర్చలకు అన్ని సంఘాలను పిలవడంలేదు. కేవలం 9 గుర్తింపు సంఘాల నేతలను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. 37 రిజిస్టర్డ్ సంఘాలను అస్సలు పట్టించుకోవడంలేదు. చివరకు గుర్తింపు సంఘాల సూచనలనూ పరిగణనలోకి తీసుకోవడంలేదు. దీంతో సమస్యలు కూడా పరిష్కారం కావడంలేదు. ముఖ్యంగా ఒకటో తేదీన వేతనాన్ని ఒక్క నెల మాత్రమే అమలు చేశారు. గత ఐదు నెలలుగా వారం తర్వాతే ఇస్తున్నారు. పురపాలక సంఘాల్లోని పాఠశాలల్లో ఉన్న 14 వేల మంది ఉపాధ్యాయులకు చర్చల్లో కనీస ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఇతర సంఘాల నిర్ణయాలనే తమపై రుద్దుతున్నారని, ఇదెక్కడి న్యాయమని మున్సిపల్ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. -
టీఐఎస్లో సాంకేతిక సమస్యలు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల కోసం ఆన్లైన్లో వివరాల నమోదుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 1.87 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తమ సర్వీసు వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వెబ్సైట్లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాల వారీగా ఈ నెలాఖరులోగా వివరాలను అప్లోడ్ చేయాలని చెప్పడంతో ఉపాధ్యాయులు అదే పనిలో ఉన్నారు. అయితే, సాంకేతిక సమస్యలతో పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లోని టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టీఐఎస్) పని చేయకపోవడంతో ఇప్పటివరకు 20 శాతం మంది ఉపాధ్యాయులు కూడా తమ వివరాలను అప్డేట్ చేయలేకపోయారు. మరోవైపు వెబ్సైట్లోకి వెళితే ఆరు నెలల క్రితం నమోదు చేసిన అంశాలు కూడా ఇప్పుడు కనిపించకుండా పోతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో పాత వివరాలతోపాటు తాజా వివరాలను సైతం నమోదు చేద్దామంటే వెబ్సైట్ పనిచేయడం లేదని, సమస్యను పరిష్కరించి తమకు మరికొంత గడువు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లోని టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టీఐఎస్)లో రాష్ట్రంలోని 1.87 లక్షల మంది ఉపాధ్యాయులు తమ సర్వీస్, విద్యార్హతలు, ఇప్పటి వరకు పొందిన పదోన్నతులు, బదిలీలు వంటి 136 వివరాలను నమోదు చేయాలి. అలాగే డిపార్ట్మెంటల్ టెస్టుల వివరాలను గెజిట్ నంబర్లతో సహా నమోదు చేయాలి. వీటి ఆధారంగానే వచ్చే ఏడాది పదోన్నతులు, బదిలీలు చేపడతారు. ఈ క్రమంలో తమ వివరాలు నమోదుకు మరికొంత గడువు పెంచాలని కోరుతున్నారు. సర్వర్ సామర్థ్యం పెంచాలి సాంకేతిక సమస్యలతో పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లోని టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టీఐఎస్) పనిచేయడం లేదని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సర్విసు వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేందుకు వీలుగా టీఐఎస్ సర్వర్ సామర్థ్యాన్ని పెంచాలని విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఒకేసారి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేందుకు సన్నద్ధం కావడంతో సంబంధిత టైటిల్స్ తెరుచుకోవడం లేదన్నారు. ఒకవేళ వెబ్సైట్ తెరుచుకున్నా గతంలో నింపిన వివరాలు తొలగిపోకుండా చూడాలని కోరారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం కెపాసిటీని పెంచి వివరాల నమోదుకు గడువు పొడిగించాలని, అలాగే మొబైల్ వెర్షన్ కూడా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. -
ఈ మార్పు మంచికేనా?!
విద్య–సమాజం విడదీయలేనివి. అవి ఏకకాలంలో పరస్పరాశ్రితాలు, పరస్పర ప్రభావితాలు కూడా. ఒక సమాజంలో పిల్లలకు అందే విద్య ఆ సమాజ స్థాయికి ప్రతిబింబంగా ఉంటుంది. క్రమేపీ ఆ సమాజాన్ని మెరుగుపరుస్తుంది. తిరిగి ఆ ప్రభావంతో విద్య ఉచ్చస్థితికి వెళ్తుంటుంది. అందువల్లే సమాజ స్థితిగతుల అధ్యయనం ఆధారంగా విద్యావిధాన నిర్ణయాలుండాలంటారు. పాఠశాల విద్యలో ప్రస్తుతం అమలవుతున్న ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రం రద్దు చేయటంపై లోతైన చర్చే సాగుతోంది. కేంద్రీయ విద్యాలయాలూ, నవోదయా విద్యాలయాలూ, సైనిక్ స్కూళ్లతోపాటు కేంద్రం నడిపే మరో 3,000 పాఠశాలల్లో తక్షణం ఈ విధానం అమల్లోకొచ్చింది. పర్యవసానంగా ఇకపై అయిదు, ఎనిమిది తరగతుల వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేనివారికి రెండు నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. రెండోసారి కూడా ఫెయిలైతే వారు తిరిగి అవే తరగతులు చదవాలి. వాస్తవానికి ఈ విధానం రద్దు కోసం 2019లోనే విద్యాహక్కు చట్టాన్ని కేంద్రం సవరించింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది కనుక రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. అప్పట్లో 16 రాష్ట్రాలూ, 2 కేంద్రపాలిత ప్రాంతాలూ కేంద్ర విధానానికి అంగీకారం తెలిపాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకించాయి. నిర్ణయం తీసుకున్న అయిదేళ్ల తర్వాత తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. ‘నో డిటెన్షన్’ విధానంపై అనుకూల వాదనలు ఎన్ని వున్నాయో, ప్రతికూల వాదనలు కూడా అంతకు మించే ఉన్నాయి. అనుకూల వాదనలు తీసిపారేయదగ్గవి కాదు. ఈ విధానంవల్ల డ్రాపౌట్ల శాతం గణనీయంగా తగ్గిందని, ఉత్తీర్ణత సాధించలేమన్న భయాన్ని విడనాడటంవల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నదని, అందరూ తమను చిన్నచూపు చూస్తారన్న ఆందోళన తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక విద్యార్థిని ఫెయిల్ చేసినంత మాత్రాన నైపుణ్యం పెరుగుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదని, పైగా తనతో చదివినవారంతా పై తరగతులకు పోవటంవల్ల ఆత్మ న్యూనతకు లోనై, ఒత్తిడి పెరిగి విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని కూడా ‘నో డిటెన్షన్’ సమర్థకులు చెబుతున్నారు. విద్యాహక్కు చట్టం ‘నో డిటెన్షన్’ విధానం పెట్టి ఊరుకోలేదు. అందులోని 29(2)(హెచ్) నిబంధన విద్యాబోధన తీరుతెన్నులనూ, పిల్లల అధ్యయన నైపుణ్యాలనూ మెరుగుపరిచేందుకు సమగ్ర, నిరంతర మూల్యాంకన(సీసీఈ) విధానం ఉండాలని సూచిస్తోంది. సంప్రదాయ పరీక్ష విధానానికి బదులుగా నిర్దేశించిన ఈ విధానం ఆచరణలో ఎలా అమలవుతున్నదో ఎవరైనా పరిశీలించారా? ఇది సక్రమంగా అమలైతే ఎప్పటికప్పుడు పిల్లల గ్రాహకశక్తిని అంచనా వేసి చదువుల్లో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటానికి అవకాశం ఉండేది. కానీ ఉపాధ్యాయులకు అప్పజెప్పే ఇతరేతర పనులవల్ల కావొచ్చు... వారిలోని అలసత్వం వల్ల కావొచ్చు– పిల్లలపై శ్రద్ధ తగ్గిందన్నది ‘నో డిటెన్షన్’ విధానం రద్దు అనుకూలుర మాట. ‘ఎలాగైనా’ ఉత్తీర్ణులమవుతామన్న ధైర్యంతో పిల్లలు చదవటం లేదని, అలాంటివారి విషయంలో ఉపాధ్యా యులు కూడా నిర్లిప్తంగా ఉండిపోతున్నారని, ఇందువల్ల ఇతర పిల్లలపై కూడా ఆ ప్రభావంపడి మొత్తంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని వారి వాదన. చాలా రాష్ట్రాల్లో పాలకులు పాఠశాల విద్యపై సమగ్ర దృష్టి సారించటం లేదు. ఈ విషయంలో కేరళ తర్వాత ఢిల్లీ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర ప్రదేశ్లో విద్యారంగ ప్రక్షాళన ఒక యజ్ఞంలాగే నడిచింది. ఒకపక్క సకల సదుపాయాలతో పాఠశాల భవనాలను తీర్చిదిద్దటంతోపాటు పిల్లల చదువులను మెరుగుపరిచేందుకు వీలుగా తరగతి గదుల్లో ఎన్నో బోధనోపకరణాలు ప్రవేశపెట్టారు. విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. విద్యాబోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ల అమలుకు అంకురార్పణ చేశారు. ఈ తరహా సిలబస్లు ప్రవేశపెట్టిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి ట్యూషన్ ఫీజు కింద రూ. 14 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయని ఈమధ్య మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రభుత్వాలు పాఠశాల విద్యను నిరంతరం పర్యవేక్షించి తగినంతమంది టీచర్లను నియమిస్తే, సదుపాయాలు మెరుగుపరిస్తే, ప్రామాణికమైన సిలబస్లు ప్రవేశపెడితే పిల్లల నైపుణ్యాలు పెరుగు తాయి. ప్రైవేటు విద్యలో ఎల్కేజీ నుంచే పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచే అనారోగ్యకర విధానాలు అమలవుతున్నాయి. కాన్సెప్ట్ స్కూళ్లు ఈ పోటీని మరింత పెంచాయి. ‘పిండికొద్దీ రొట్టె’ అన్నట్టు డబ్బు పారేస్తే తమ పిల్లలు అమాంతం ఎదుగుతారన్న భ్రమల్లో తల్లిదండ్రులున్నారు. మరి సర్కారీ బడుల్లో పిల్లల్ని చదివిస్తున్న పేద తల్లిదండ్రులు ఏం కావాలి... వారి పిల్లలకు మెరుగైన విద్య ఎలా అందాలి? గోరుచుట్టుపై రోకటి పోటులా ఇప్పుడున్న ‘నో డిటెన్షన్’ విధానం రద్దయితే పేద పిల్లలు ఎప్పటికి మెరుగుపడాలి? ఎదిగాక ఏం చేయాలి? కేంద్రం ఏ విధానం అమలు చేయదల్చుకున్నా దానికి ముందు బావురుమంటున్న ప్రభుత్వ బడులను ఉద్ధరించాలి. అక్కడి పిల్లలకు కడుపునిండా తిండి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బోధన ఉంటున్నాయో లేదో గమనించాలి. ఉపాధ్యాయుల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించాలి. వారిని బోధనకే పరిమితం చేయాలి. ‘నాణ్యత అనేది యాదృచ్ఛికంగా ఊడిపడదు. అది నిరంతరం కొనసాగే వేనవేల బౌద్ధిక చర్యల సమాహారం’ అన్నారు ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్. పాలకులు దాన్ని గుర్తెరగాలి. -
మార్చి 15 నుంచి పది పరీక్షలు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది. మార్చి నెలాఖరుకల్లా పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పరీక్షల టైమ్ టేబుల్ను ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు తెలిసింది. ఇతర పరీక్షల షెడ్యూళ్లు కూడా పరిగణనలోకి తీసుకుని.. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకని పాఠశాల విద్యా శాఖ 100 రోజుల యాక్షన్ ప్లాన్ను విడుదల చేసింది. టైమ్ టేబుల్తో కూడిన ప్రణాళికను పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు సోమవారం రాష్ట్రంలోని అన్ని మెనేజ్మెంట్లలోని ఉన్నత పాఠశాలలకు పంపించారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు సెషన్లలో తరగతులు నిర్వహించాలని.. ఈనెల ఒకటో తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పరీక్షలపై భయం పోయేలా స్లిప్ టెస్టులు నిర్వహించాలని.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. శిక్షణ అనంతరం విద్యార్థులను ఇంటికి పంపే వరకు ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈనెల 7న జరిగే పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో దీనిపై చర్చించాలని.. ఉపాధ్యాయులు సెలవు రోజుల్లో పనిచేసినందుకు ప్రత్యేక సీసీఎల్ మంజూరు చేస్తామని చెప్పారు. మెరిట్ విద్యార్థులకు అదనపు అభ్యాసాలు ఇవ్వాలని.. అభ్యసన ప్రణాళికలను తల్లిదండ్రులకు కూడా వివరించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. సెలవు రోజులను మినహాయించాలి.. పదో తరగతి యాక్షన్ ప్లాన్ షెడ్యూల్లో సెలవు రోజులను మినహాయించాలని విద్యా శాఖను ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. ఇంకా సిలబస్ పూర్తి కానందున కార్యాచరణ ప్రణాళికను సమ్మేటివ్–1 పరీక్షల అనంతరం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించాలని.. సగటు విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రతి సబ్జెక్టుకూ ముఖ్య ప్రశ్నలను రూపొందించి పుస్తకాలు అందించాలని కోరారు. -
మున్సిపల్ స్కూళ్లలో ఉత్తుత్తి పదోన్నతులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యతో కూటమి సర్కారు చెడుగుడు ఆడుతోంది. ప్రభుత్వ మేనేజ్మెంట్లోని జెడ్పీ తదితర పాఠశాలల్లో సర్దుబాటు పేరుతో సబ్జెక్టు టీచర్లను లేకుండా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మున్సిపల్ స్కూళ్ల ఉపాధ్యాయులతో ఆటలు ప్రారంభించింది. పదోన్నతులు కల్పిస్తామంటూ నెల రోజుల క్రితం చేపట్టిన ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కి రాకపోగా ఉత్తుత్తి పదోన్నతులతో పాత పోసు్టల్లోనే కొనసాగాలని ఆదేశించడం గమనార్హం.మున్సిపల్ స్కూళ్ల ఉపాధ్యాయుల్లో 350 మంది ప్రమోషన్లకు అర్హులని తేల్చిన ప్రభుత్వం చివరకు 200 మందికే పోస్టింగ్ ఇచ్చింది. చట్టప్రకారం ఖాళీలను 70 శాతం పదోన్నతులతోను, మరో 30 శాతం డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నా అందుకు పూర్తి విరుద్ధంగా చర్యలు చేపట్టింది. పదోన్నతులు 30 శాతానికే పరిమితం చేసింది.ఇటీవల కల్పించిన పదోన్నతుల్లో 50 మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా అవకాశం కల్పించి కొత్త పోస్టింగ్ కూడా ఇచ్చాక ఒక్క రోజులోనే వారిని పాత పోసు్టల్లోనే కొనసాగాలని ఆదేశించడం విస్మయం కలిగిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో చేపట్టాల్సిన పదోన్నతులు సగం ఏడాది పూర్తయ్యాక చేపట్టడం.. గందరగోళంగా మార్చేయడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ ప్రకటించకుండా నిర్లక్ష్యంగా ప్రక్రియ పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ గతనెల 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 28న సీనియారిటీ లిస్టు ప్రకటిస్తామని, గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పోస్టులకు ఈనెల 6న కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొంది. అయితే సీనియారిటీ లిస్టు ప్రకటించేందుకు దాదాపు 10 రోజులు సమయం పట్టింది. తప్పుల తడకగా విడుదల చేయడంపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొన్నిచోట్ల పదోన్నతులు నిలిపివేశారు. దాదాపు 14 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా పదోన్నతులకు 350 మందే అర్హులని తేల్చారు. అయితే వారికీ పదోన్నతులు కల్పించడంలో పాఠశాల విఫలమైంది. ఆయా మున్సిపాలిటీల వారీగా గతంలో పదోన్నతులు కల్పించినప్పుడు రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పాయింట్ ఎక్కడ ఆగిందో ప్రకటించాలి. కానీ ఇవేమీ లేకుండా నిర్లక్ష్యంగా నెల రోజుల ప్రక్రియను సాగదీసి గందరగోళంగా మార్చేశారు. అర్థంపర్థం లేని పదోన్నతులు.. విద్యా సంవత్సరం మధ్యలో పదోన్నతులు కల్పించటమే తప్పుడు విధానమైతే.. ఆ పోస్టులో చేరాక తిరిగి వారిని పాత పోస్టులోనే పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 200 మంది మున్సిపల్ టీచర్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వీరిలో 50 మందికి స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా అవకాశం లభించింది. ప్రధానోపాధ్యాయలుగా పదోన్నతి పొందిన వారు కౌన్సెలింగ్లో మరో స్కూల్లో హెచ్ఎంగా చేరి బాధ్యతలు తీసుకున్నారు. అయితే వారిని వచ్చే విద్యా సంవత్సరం వరకు పాత పోస్టులోనే కొనసాగాలని అధికారులు ఆదేశించారు. వీరికి పదోన్నతి వేతనం ఇస్తారా..? లేక స్కూల్ అసిస్టెంట్ వేతనం ఇస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు. మరోపక్క ఆయా హెచ్ఎం పోస్టుల్లో ఇన్చార్జి్జలుగా పనిచేసేందుకు ఉపాధ్యాయులు సుముఖత చూపడం లేదు. ఈ క్రమంలో ఈ నెలాఖరులో టీచర్ల వేతనాలు బిల్లులు ఎవరు రూపొందిస్తారో తెలియని పరిస్థితి తలెత్తింది. -
పాఠశాల విద్యలో పైరవీల రాజ్యం!
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో మరోసారి అక్రమ బదిలీలకు తెర తీశారు. బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రికమండేషన్ల లేఖలతో ఓపెన్ స్కూల్ కంట్రోలర్లుగా బదిలీ చేయడం విస్మయం కలిగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతు తాజాగా వెలుగు చూసింది. పలు జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల లేఖలతో ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారుల వద్ద క్యూ కట్టడంతో వారికి ఓపెన్ స్కూల్ జిల్లా స్థాయి పోస్టులు ఇచ్చేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఇటీవల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో కీలకంగా మారిన సిఫారసు లేఖలు ఇప్పుడూ పని చేస్తున్నట్లు ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు విద్యా సంవత్సరం మధ్యలో జిల్లాలకు వెళ్లడం.. అందుకు ఎమ్మెల్యేలు సహకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకే పోస్టుకు ఎమ్మెల్యే, మంత్రి చెరొకరిని సిఫారసు చేయడం.. దాన్ని విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోవడం.. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఓపెన్ స్కూల్ డైరెక్టర్ ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఆరు జిల్లాలకు మెమో..ఆరు జిల్లాలకు ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్లుగా కూటమి నాయకులు సిఫారసు చేసిన ఉపాధ్యాయుల పేర్లతో మంగళవారం మెమో విడుదల కావడం చర్చకు దారితీసింది. హిందీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని వైఎస్సార్ కడప జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్గా నియమించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి లేఖ ఇవ్వగా... ఇదే పోస్టు మరో ఉపాధ్యాయుడికి ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి లేఖ ఇచ్చారు. విజయనగరం జిల్లా కో ఆర్డినేటర్ పోస్టుకు ఆ జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ప్రకాశం జిల్లా పోస్టుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, అనంతపురం పోస్టుకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అన్నమయ్య జిల్లా పోస్టుకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్కుమార్రెడ్డి లేఖలతో ఉపాధ్యాయులకు ఆయా పోస్టులు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేటప్పుడు ఆయా పోస్టుల వివరాలు, అర్హతలను బహిరంగ పరచాలి. విధివిధానాలతో దరఖాస్తులు ఆహ్వానించాలి. కానీ ఇవేమీ లేకుండానే నేతల సిఫారసు లేఖలకు విద్యాశాఖ అధికారులు తలొగ్గడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
ఏఏఐ చైర్మన్గా విపిన్ కుమార్
న్యూఢిల్లీ: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి విపిన్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్ బిహార్ క్యాడర్కు చెందిన ఆయన ఈ పదవిలోకి రాక ముందు కేంద్ర విద్యాశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. బిహార్లో జిల్లా మెజి్రస్టేట్గా, బిహార్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్గానూ విధులు నిర్వర్తించారు. ఏఏఐ పూర్తి స్థాయి చైర్మన్ సంజీవ్ కుమార్ డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఏఏఐ సభ్యులు ఎం.సురేశ్ తాత్కాలిక చైర్మన్గా ఇప్పటి వరకు వ్యవహరించారు. మినీ రత్న అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 137 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
కుల, మత రహిత కాలమ్ ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సర్టిఫికెట్లు, పాఠశాలలో చేరే ముందు సమర్పించే దరఖాస్తులో కుల, మత రహిత కాలమ్ ఉండాల్సిందేనని సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. కులం, మతం వద్దనే హక్కు ప్రజలకు ఉందని అభిప్రాయపడింది. కుల, మత విభాగాలను దరఖాస్తులో నింపనంత మాత్రాన అవి తిరస్కరణకు గురికావని పాఠశాల విద్యాశాఖ సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ను పరిశీలనలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. 2010, 2021లోనూ రిట్ పిటిషన్లు దాఖలు చేసి కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు ఇప్పటికే ఉపశమన ఆదేశాలు పొందారని పేర్కొంది. బాధిత వ్యక్తులు అవసరమైతే తదుపరి నష్టపరిహారాన్ని కోరే హక్కు కలిగి ఉంటారని వ్యాఖ్యానించింది. పాఠశాల విద్యాశాఖ స్పష్టమైన వైఖరితో తదుపరి చర్యలు అనవసరమని పేర్కొంటూ పిల్లో విచారణ ముగిస్తున్నామని చెప్పింది. జనన ధ్రువపత్రం నుంచి మరణ ధ్రువపత్రం వరకు అన్నింటిలో ‘కులం, మతం లేదు’ అనే స్టేటస్ కోరుకునే వారిని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ డీవీ రామకృష్ణారావు, ఎస్ క్లారెన్స్ కృపాళిని తదితరులు 2017లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇలాంటి పిటిషన్లు గతంలో దాఖలయ్యాయని, కులం, మతాన్ని పేర్కొనడం, వదులుకోవడంపై స్వేచ్ఛ ఉందని పాఠశాల విద్య డైరెక్టర్ అండ్ కమిషనర్ తరఫున దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారని చెప్పింది. మతం, కులం వివరాలు పేర్కొననంత మాత్రాన పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశం నిరాకరించబడదని స్పష్టం చేసింది. దీంతో విచారణ ముగిస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. -
సర్కారు చదువులు చట్టుబండలు!
సాక్షి, అమరావతి: సజావుగా సాగుతున్న పాఠశాల విద్యపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టింది. పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను, అందులోనూ ప్రాథమిక దశ నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను దూరం చేసేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకెళుతోంది. తాజాగా జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను నిర్దయగా రద్దు చేస్తోంది. పిల్లల్లో విద్యా నాణ్యత పెంచేందుకు 3, 4, 5 తరగతుల విద్యార్థులకు నిపుణులైన సబ్జెక్టు టీచర్లతో బోధన అందించేందుకు తీసుకొచ్చిన జీవో 117ను రద్దుచేసి, వచ్చే ఏడాది నుంచి ఆ తరగతులను ప్రాథమిక పాఠశాల్లోకి మార్చాలని నిర్ణయించింది. ఏపీ మోడల్ను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తుంటే.. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అమలు చేసిన విద్యా సంస్కరణలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ‘ప్రభుత్వాలు మారడం సహజం. కానీ.. పాలన మాత్రం మారకూడదు. మంచి ఏ ప్రభుత్వంలో జరిగినా దాన్ని కొనసాగించాలి’ అని ఇటీవల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అంతేకాదు.. విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులనూ పరిశీలించారు. గత ప్రభుత్వంలో విద్యా సంస్కరణలు బాగున్నాయని, వాటిని అలాగే కొనసాగిద్దామని ఉన్నతాధికారుల వద్ద కూడా పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రే బాగున్నాయని చెప్పిన సంస్కరణలను రద్దు చేయడం విస్మయం కలిగిస్తుంది. జీవో 117 రద్దు చేస్తే విద్యార్థులకు అన్యాయం పలు సర్వేల అనంతరం విద్యారంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)–2020 సంస్కరణలను తీసుకొచ్చి0ది. దీని ప్రకారం దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని, జాతీయ స్థాయిలోను, రాష్ట్రాల్లోను ఒకేవిధమైన విధానాలు అనుసరించాలని, పిల్లలు నేర్చుకునే దానికి, వస్తున్న ఫలితాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని సూచించింది. ఇందుకోసం ఉపాధ్యాయ–విద్యార్థుల నిష్పతి్తని తగ్గించాలంది. ఎన్ఈపీ–2020 విద్యా బోధనను 5+3+3+4 విధానంలో పునర్నిర్మించాలని సూచించింది. ఎన్ఈపీ సంస్కరణల్లో భాగంగా గత ప్రభుత్వం 2022లో జీవో–117 జారీ చేసింది. దీనిప్రకారం గతేడాది ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి మార్చారు. ఇలా 4,900 ఎలిమెంటరీ స్కూళ్లలోని 2.43 లక్షల మంది విద్యార్థులను కి.మీ. లోపు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో చేర్చారు. 8 వేల మంది అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పించి సబ్జెక్టు టీచర్ బోధన అందుబాటులోకి తెచ్చారు.అంతేగాక ఉపాధ్యాయులపై బోధనా ఒత్తిడి తగ్గించేందుకు ప్రాథమిక విద్యార్థుల బోధనను ఒక టీచర్కు 20 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంది. ఎంతో ఉన్నతమైన ఆశయంతో తీసుకొచ్చిన జీవో 117ను ఉపాధ్యాయులు సైతం మెచ్చుకున్నారు. కానీ.. ఇప్పుడు అదే చట్టాన్ని రద్దు చేయడమంటే పేదల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేయడమేనని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బెడిసికొట్టిన టీచర్ల సర్దుబాటు
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో సర్దుబాటు పేరిట ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ బెడిసికొట్టింది. పాఠశాలలు తెరిచిన తర్వాత దాదాపు 2 నెలల పాటు కసరత్తు చేసి, ఒక యూనిట్ పరీక్షలు పూర్తయ్యాక ప్రారంభించిన బదిలీలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన నిబంధనలను మునిసిపల్, ఎయిడెడ్ స్కూళ్లలోనూ అమలు చేయడంతో అక్కడ ఒకటి, రెండు తరగతులకు బోధిస్తున్న జూనియర్ ఉపాధ్యాయులను పదో తరగతి సిలబస్ బోధించేందుకు బదిలీ చేయడం గమనార్హం.సర్దుబాటుకు ముందు ప్రాథమిక పాఠశాలల్లో సీనియర్లు, అర్హత గల ఉపాధ్యాయులను సబ్జెక్టు టీచర్లుగా నియమించడంతో గతేడాది పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే, ఈ సర్దుబాటు ప్రక్రియతో ప్రస్తుతం హైస్కూళ్లలో బోధిస్తున్న సీనియర్ ఎస్జీటీలను తిరిగి ఎలిమెంటరీ స్కూళ్లకు పంపించి, వారి స్థానంలో ఎలిమెంటరీ స్కూళ్లలోని జూనియర్లను హైస్కూళ్లకు పంపించారు. సబ్జెక్టుపై అవగాహన లేనివారిని హైస్కూళ్లకు పంపడంతో పాటు కొన్ని సబ్జెక్టులకు అసలు టీచర్లనే నియమించలేదు. దీంతో ఉత్తమ ఫలితాల సాధన అటుంచి, విద్యార్థులను పాస్ కూడా చేయలేమని మునిసిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ లేదా సబ్జెక్టు నిపుణుల కొరత ఉన్నప్పుడు గత ప్రభుత్వం అర్హతలున్న దాదాపు 8 వేల మంది ఎస్జీటీలను సీనియారిటీ ఆధారంగా సబ్జెక్టు టీచర్లు (స్కూల్ అసిస్టెంట్)గా పదోన్నతి కలి్పంచింది. విద్యా సంవత్సరం మధ్యలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్లు రిటైరైతే వారిస్థానంలో అర్హత గల సీనియర్ ఎస్జీటీని డిప్యుటేషన్పై నియమించింది. తద్వారా పదో తరగతిలో 91 శాతం ఉత్తీర్ణత సాధ్యమైంది. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లకు ఇదే విధానం అనుసరించింది.మునిసిపల్ హైస్కూళ్లలో 8 ఏళ్లుగా పోస్టులను భర్తీ చేయకపోవడంతో దాదాపు 2,800 సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. మునిసిపల్ ఉపాధ్యాయ సరీ్వస్ రూల్స్పై కోర్టులో కేసులు పెండింగ్లో ఉండటంతో సబ్జెక్టు టీచర్ల కొరతను తొలగించేందుకు ప్రాథమిక పాఠశాలల్లోని సీనియర్లు, సబ్జెక్టు నిపుణులను డిప్యుటేషన్పై నియమించి పదో తరగతి సిలబస్ బోధించేవారు. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన “సర్దుబాటు’ ప్రక్రియలో నిబంధనల ప్రకారం విద్యారి్థ, ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా అత్యంత జూనియర్ టీచర్లను మిగులుగా చూపి బదిలీ చేశారు. ఇదే నిబంధనను మునిసిపల్ స్కూళ్లకు వర్తింపజేయడంతో ప్రాథమిక పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయుల్లో అత్యంత జూనియర్ను హైస్కూళ్లలో సర్దుబాటు చేసి, ప్రస్తుతం ఇక్కడ డిప్యుటేషన్పై పనిచేస్తున్న సీనియర్లను ఎలిమెంటరీ స్కూళ్లకు పంపించారు. మరోపక్క హిందీ, ఇంగ్లిష్ ఉపాధ్యాయుల కొరత ఉండటంతో ఈ ప్రభావం ఈ ఏడాది పదో తరగతి ఫలితాలపై తీవ్రంగా చూపనుంది. -
ప్రతి విద్యార్థికీ ప్రత్యేక నంబర్
సాక్షి, అమరావతి: ‘ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ’ (అపార్) పేరుతో విద్యార్థులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్తో కూడిన గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ‘వన్ నేషన్–వన్ ఐడీ’ కార్డును అందుబాటులోకి తీసుకొస్తోంది. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలనూ ఆదేశించడంతో రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ కూడా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 9 నుంచి 12 (ఇంటర్) తరగతుల విద్యార్థుల వివరాలు నమోదు చేసేందుకు ప్రణాళికను సిద్ధంచేసింది. దసరా సెలవుల్లో ఆయా తరగతుల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలపై సంతకాలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే అందించారు. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ అపార్ నంబర్ కేటాయింపు ప్రక్రియ చేపట్టింది. అధార్ వివరాలను చాలా రాష్ట్రాలు బహిర్గతం చేయడాన్ని సమ్మతించకపోవడంతో ఆధార్ తరహాలోనే అపార్ నమోదు ప్రక్రియ చేపట్టారు.చదువు పూర్తయ్యే వరకూ ఇదే నెంబరు..నిజానికి.. విద్యార్థుల ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా ప్రస్తుతం బడుల్లో చేరికలు జరుగుతున్నాయి. ఇలా చేరిన తర్వాత ప్రతి విద్యార్థికీ ‘పర్మినెంట్ ఎన్రోల్మెంట్ నంబర్’ (పెన్)ను కేటాయించి యూడైస్ ప్లస్లో నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నంబర్కు అదనంగా 12 అంకెలతో కూడిన ‘అపార్’ నంబర్ కేటాయిస్తారు. ఇదే నంబరును విద్యార్థి చదువు పూర్తయ్యే వరకు అన్ని సర్టిఫికెట్లపైనా, ఐడీ కార్డుపైనా ముద్రిస్తారు. ఈనెల 14న అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థుల నుంచి ధ్రువపత్రాలు తీసుకుని వాటిని కేంద్ర విద్యాశాఖ యూడైస్ ప్లస్ వెబ్సైట్లో నమోదు చేస్తారు.9–12 తరగతుల్లో 18 లక్షల విద్యార్థులు..అపార్ నంబర్ కేటాయింపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం 2022లోనే ప్రవేశపెట్టి, అన్ని రాష్ట్రాలు దీనిని పాటించాలని కోరింది. ఈ క్రమంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవగా, ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవుల తర్వాత ప్రారంభం కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో సుమారు 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తొలి విడతలో వీరి వివరాలు నమోదు చేస్తారు. తర్వాత మిగిలిన విద్యార్థుల నమోదు ప్రక్రియ చేపడతారు. ఈ అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, అందుకోసం దసరా సెలవుల అనంతరం నిర్వహించే తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం)లో చర్చించాలని పాఠశాల విద్యాశాఖ డీఈఓలను, ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. తొలి విడతలో 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు. దీంతో అన్ని పాఠశాలల్లోను మంగళవారమే విద్యార్థులకు దరఖాస్తు పత్రాలను అందించారు. వాటిపై తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని సూచించారు.అపార్తో నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట..ఇక కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ ‘అపార్’.. హైస్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థుల చదువుకు సంబంధించి సమగ్ర డిజిటల్ సమాచార కేంద్రంగా పనిచేస్తుంది. వివిధ బోర్డులు, విశ్వవిద్యాలయాలు జారీచేసే ప్రతి సర్టిఫికెట్ పైనా ఈ అపార్ నంబరును ముద్రిస్తారు. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల సమయంలో సమర్పించిన సర్టిఫికెట్లపై అనేక ఫిర్యాదులు రావడం, అవి అసలువా లేక నకిలీవా అనేది తేల్చేందుకు జాప్యం జరుగుతుండడంతో అభ్యర్థికి నష్టం జరుగుతోంది. ఈ క్రమంలో విద్యలో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్–వన్ స్టూడెంట్ ఐడీ’ అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడ చదువుతున్నా సదరు విద్యార్థిని సులభంగా గుర్తించేందుకు, గత అకమిక్ వివరాలు తెలుసుకునేందుకు ఈ ‘అపార్’ ఉపయోగపడుతుంది. అంతేగాక.. ఇదే నంబరును డిజీ లాకర్తో అనుసంధానం చేయడంతో పాటు వాటిపై ఇదే నంబర్ ముద్రించడం ద్వారా విద్యా సంబంధమైన అన్ని పత్రాలు అసలైనవిగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. -
టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష..
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం టెట్ అభ్యర్థుల వడపోతకు దిగింది. టెట్ పరీక్షలు రాయకుండా ఆది నుంచే వడపోత చేపట్టింది. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ టెట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సెంటర్లను మార్చేసింది. బీఈడీ, డీఈడీల అర్హతలు ఉన్నవారికి, డీఈడీ, స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హతలు గల అభ్యర్థులు ఒకే రోజు పరీక్ష రాయాల్సి ఉన్నా.. రెండు పేపర్లకు వేర్వేరు జిల్లాల్లో సెంటర్లు ఇచ్చి ఒక పేపర్ రాసే అవకాశాన్ని లేకుండా చేసి వారికి అగ్ని పరీక్ష పెట్టింది. ఫిబ్రవరిలో గత ప్రభుత్వం టెట్ పరీక్ష పూర్తి చేయగా.. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వం టెట్–2024 (జూలై) పేరుతో మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) విభాగంలో పేపర్–1(ఏ)కి 1,82,609 మంది, ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్–1(బీ)కి 2,662 మంది, స్కూల్ అసిస్టెంట్ పేపర్–2(ఏ) లాంగ్వేజెస్కు 64,036 మంది, మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో 1,04,788 మంది దరఖాస్తు చేసుకోగా, సోషల్ స్టడీస్లో 70,767 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్–2(బి)కి 2438 దరఖాస్తులు అందాయి. వీరిలో చాలా మంది రెండు పేపర్లకు అర్హత గలవారు ఉన్నారు. అయితే, పాఠశాల విద్యాశాఖ ఈ నెల 21 నుంచి జారీ చేసిన హాల్ టికెట్లు చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. రెండు పేపర్లకు ఒకే జిల్లా, ఒకే సెంటర్ను ఆప్షన్గా ఇస్తే ఒక్కో పేపర్కు సెంటర్తో పాటు జిల్లాలను కూడా మార్చేశారు. మరికొందరికి రాష్ట్రాన్నే మార్చేసి బెంగళూరులో సెంటర్ కేటాయించడం విద్యాశాఖ మాయాజాలానికి నిదర్శనం.జిల్లాలు దాటి సెంటర్ల కేటాయింపు ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఎంపిక చేసిన ఇంజినీరింగ్ కాలేజీలు, ఆన్లైన్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఉన్న సెంటర్లలోనే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ హాల్టికెట్లను పాఠశాల విద్యాశాఖ ఈ నెల 21న సాయంత్రం నుంచి ఆన్లైన్లో ఉంచింది. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రెండు పరీక్షల హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకుని చూస్తే రెండు పరీక్షలకు వేర్వేరు సెంటర్లు ఉండడం చూసి హతాశులయ్యారు. ఏలూరు జిల్లాకు చెందిన ముగ్గురు అభ్యర్థులు పేపర్–1, పేపర్–1బీ జిల్లా కేంద్రాంలోనే రాయాల్సి ఉన్నా.. ఇద్దరికి ఉదయం ఏలూరులోను మధ్యాహ్నం పేపర్–1బి కాకినాడలోను సెంటర్ ఇచ్చారు. మరొకరికి రెండో పేపర్ను విజయవాడలో సెంటర్ ఇచ్చారు. గత నెలలో విద్యాశాఖ ‘దరఖాస్తు ఎడిట్’ అవకాశం ఇవ్వడంతో మీడియం ‘తెలుగు’ అని మార్చినా హాల్టికెట్లో మాత్రం ‘ఇంగ్లిష్’ అనే ఇచ్చారు. తెలుగు మీడియంలో చదువుకున్న వారు ఇప్పుడు ఇంగ్లిష్లో పేపర్ ఎలా రాయగలమని ఆందోళన చెందుతున్నారు.నిరుద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యమాఏపీ టెట్ నిర్వహణలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పరీక్ష సెంటర్లు ప్రతి జిల్లాలో అందుబాటులో ఉన్నా వందల కిలోమీటర్ల దూరంలోని మరో జిల్లాలో కేటాయించారు. అలాగే పేపర్–1ఏ ఒక జిల్లాలోను, పేపర్–1బీ మరో జిల్లాలో సెంటర్లు కేటాయించడంలో అంతర్యం ఏమిటి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏ జిల్లా అభ్యర్థులకు ఆ జిల్లాలోనే సెంటర్లు ఇచ్చేలా మార్పులు చేయాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లిష్ మీడియం అని హాల్ టికెట్లో ఇవ్వడంతో అనేకమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి మరోసారి ‘ఎడిట్’ అవకాశం కల్పించి న్యాయం చేయాలి. – ఎ.రామచంద్ర, ఏపీ నిరుద్యోగ ఐక్య సమితి – ప్రకాశం జిల్లాకు చెందిన పెద్దిశెట్టి వెంకట మహేష్బాబు ఎస్జీటీకి పేపర్–1ఏ రాయాల్సి ఉంది. ఈ అభ్యర్థికి కేంద్రం ఒంగోలులో కాకుండా 110 కి.మీ. దూరంలోని గుంటూరు జిల్లాలో సెంటర్ ఇచ్చారు. – తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీహెచ్.దినేష్ అనే అభ్యర్థికి విజయవాడలో సెంటర్ కేటాయించారు. – అనంతపురం జిల్లాకు చెందిన దాసప్పగారి సింధూజ స్కూల్ అసిస్టెంట్ పేపర్–2ఏ (మ్యాథమెటిక్స్, సైన్స్) పేపర్ రాసేందుకు తెలుగు మీడియం ఆప్సన్ ఇచ్చారు. కానీ.. హాల్ టికెట్లో మాత్రం ఇంగ్లిష్ మీడియం అని ఇచ్చారు.– ఏలూరు జిల్లాకు చెందిన కె.భువనేశ్వరి ఎస్జీటీ, స్పెషల్ ఎడ్యుకేషన్ రెండింటికీ దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 6న రెండు పేపర్లు రాయాలి. రెండు పరీక్షలకు ఏలూరు సెంటర్ ఇస్తే.. ఉదయం జరిగే పరీక్ష ఏలూరులోను, మధ్యాహ్నం పరీక్ష ఏలూరుకు సుమారు 155 కి.మీ. దూరంలోని కాకినాడలోను సెంటర్ కేటాయించారు. ఇదే జిల్లాకు చెందిన పి.జయలక్ష్మికి కూడా ఏలూరు, కాకినాడ సెంటర్లను ఒకేరోజు రెండు పరీక్షలకు కేటాయించారు. -
సీబీఎస్ఈకీ మంగళం!
సాక్షి, అమరావతి: మొన్న టోఫెల్.. నిన్న ఐబీ.. నేడు సీబీఎస్ఈ.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ఉన్నతాశయంతో పేద విద్యార్థుల భవిష్యత్తుకు వీటి ద్వారా బంగారు బాటలు వేస్తే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్న సత్సంకల్పంతో విద్యారంగంలో జగన్ అనేక సంస్కరణలు అమలుచేస్తే.. ఆయన మీద అక్కసుతో చంద్రబాబు సర్కారు పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తూ పాఠశాల విద్యను తిరోగమనం బాట పట్టిస్తోంది. ఇందులో భాగంగా.. జగన్ అమలుచేసిన ఒక్కో అంశానికీ స్వస్తి చెబుతోంది. టోఫెల్, ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) బోధనకు ఇప్పటికే చరమగీతం పాడిన ఈ ప్రభుత్వం అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన ఊసెత్తడంలేదు. తాజాగా.. సీబీఎస్ఈ బోధనకూ తూచ్ అంటూ పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను దూరం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల పీక పిసికేస్తోంది.విద్యా సంవత్సరంలో మధ్యలో..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది తల్లిదండ్రుల్లోను, విద్యార్థుల్లోను వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైఎస్ జగన్ సర్కారు 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అమల్లోకి తెస్తే.. చంద్రబాబు సర్కారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దుచేసేసింది. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్ మీడియం రద్దుచేస్తామని మొన్నటి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు బహిరంగంగా చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఆయనిప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే, విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ‘టోఫెల్’ శిక్షణను అధికారంలోకి వచ్చీరాగానే జూన్లో రద్దుచేసి పారేశారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు సీబీఎస్ఈ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారని చెబుతూ 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన సీబీఎస్ఈ బోధనను రద్దుచేశారు. అలాగే, విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో అక్కడి ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో బదిలీ చేసింది. ఇలా ప్రభుత్వ నిరంకుళ విధానాల కారణంగా.. ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది.జగన్పై కోపంతోనే విద్యపై అక్కసు..‘పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, ప్రైవేటు బడులు బాగుంటాయి. డబ్బున్న వారు అక్కడ చదువుకుంటారు, మీరూ ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లండి’.. అని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు బహిరంగంగా అన్నారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయనకు పేదలన్నా.. పేదల పిల్లల చదువులన్నా ఎంత చులకనో ఈ మాటలే చెబుతున్నాయి. ఆయన తన నైజాన్ని మరోసారి రుజువు చేసుకుంటూ పేదల విద్యను నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే కార్పొరేట్ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ముకాస్తూ రాష్ట్రంలో పేద పిల్లల చదువును పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఉదా.. గతంలో తక్కువ మంది విద్యార్థులున్నారని 2014–19 మధ్య 1,785 పాఠశాలలను మూసివేసి అక్కడి విద్యార్థులను గాలికొదిలేశారు. అలాగే, 4,300 ప్రభుత్వ పాఠశాలలను ఆయన హయాంలోనే మూసివేశారు. ఇప్పుడు వైఎస్ జగన్పై కోపంతో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ బోధనకు సైతం అదే గతి పట్టించారు.విద్యా సంస్కరణలకు జగన్ శ్రీకారం..పిల్లలకు మనమిచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది నాణ్యమైన విద్య మాత్రమేనని, పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్మిన వైఎస్ జగన్ తన పాలనలో విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడుతో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది, పేద విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధనను అందుబాటులోకి తెచ్చారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే వారికి ఇంగ్లిష్ మీడియం బోధన ఉండాలని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంచుతూ ఇంగ్లిష్ మీడియం అమలుచేశారు. విద్యార్థులకు భాషపై భయం పోగొట్టేందుకు బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలను సైతం అందించారు. మరోపక్క.. ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ‘టోఫెల్’ను సిలబస్లో అంతర్భాగం చేశారు. మరోపక్క.. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా రాష్ట్రంలోని ఎక్కువమంది విద్యార్థులకు సీబీఎస్ఈ విద్యను అందించేందుకు 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో 2023–34 విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తెచ్చారు. దీంతో దాదాపు 84 లక్షల మంది విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఒక యూనిట్ పరీక్షలు కూడా ముగిసిన తర్వాత ఉన్నపళంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పరీక్షా విధానం రద్దుచేసి విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేసింది.అంధకారంలోకి 84 వేల సీబీఎస్ఈ విద్యార్థుల భవిష్యత్తు..నిజానికి.. గత విద్యా సంవత్సరంలో పదో తరగతికి ఇంగ్లిష్ మీడియం అమలుచేయకున్నా దాదాపు 1.94 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇంగ్లిష్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారంటే ఈ మీడియం బోధనను విద్యార్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే, 2023–24 విద్యా సంవత్సరం నుంచి 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తేగా ఇప్పుడీ స్కూళ్లల్లో దాదాపు 84 వేల మంది టెన్త్ విద్యార్థులు, 82 వేల మంది 9వ తరగతి చదువుతున్నారు. అయితే, ఇటీవల పదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ట్యాబ్స్ ద్వారా పరీక్ష నిర్వహించారు. పేపర్–పెన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి.. విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దుచేసింది.‘ప్రైవేటు’కు 2 లక్షల మంది విద్యార్థులు..ఇదిలా ఉంటే.. తాము అధికారంలోకి వచ్చాక ఇంగ్లిష్ మీడియంను సైతం రద్దుచేస్తామనడంతో ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దాదాపు నాలుగేళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదివిన తమ పిల్లల భవిష్యత్ ఎక్కడ అంధకారమవుతుందోనని భయపడ్డారు. దీంతో ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది తగ్గిపోయారంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా దిగజార్చిందో అర్థంచేసుకోవచ్చు. మరోవైపు.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడంతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారన్న సాకుతో ప్రభుత్వం వారిని వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ‘రేషనలైజేషన్’ పేరుతో విద్యార్థుల్లేని స్కూళ్లలో టీచర్ పోస్టులను ప్రభుత్వం రద్దుచేసే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.తల్లికి వందనం ఎగనామం!మరోవైపు.. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రకటించింది. దీంతో.. తల్లికి వందనం కింద వచ్చే రూ.15 వేలకు అదనంగా కొంత మొత్తం ఫీజుగా చెల్లిస్తే సరిపోతుందని ప్రైవేటు స్కూళ్లు ఆకర్షిస్తుండడంతో తల్లిదండ్రులు అటువైపు వెళ్లారు. కానీ, అధికార పగ్గాలు చేపట్టాక మాటమార్చి వచ్చే విద్యా సంవత్సరంలో చూద్దామని శాసనసభ సాక్షిగా ఆ శాఖా మంత్రి లోకేశ్ ప్రకటించి తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు జల్లారు.నిర్దాక్షిణ్యంగా ‘టోఫెల్’ రద్దు..ఇక పదో తరగతి, ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా కోర్సుల్లో మన విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అంతర్జాతయ విద్యా ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో ఇంగ్లిష్లో ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుగా గత విద్యా సంవత్సరం జగన్ సర్కారు టోఫెల్ శిక్షణను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా.. 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్ ప్రైమరీ, 6–9 తరగతుల పిల్లల కోసం టోఫెల్ జూనియర్ పేరుతో ప్రాథమిక శిక్షణను ప్రారంభించింది. నాడు–నేడు పథకంలో భాగంగా స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీలు అందుబాటులోకి తెచ్చిన స్కూళ్లల్లో ఈ శిక్షణ అందించారు. ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన టోఫెల్ జూనియర్ విభాగంలో 16,52,142 మందికి గాను 11,74,338 మంది (70 శాతం) విద్యార్థులు, ప్రైమరీ విభాగంలో 4,53,265 మందికిగాను 4,17,879 మంది (92 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ సంస్థ సర్టిఫికెట్లను ప్రదానం చేయాల్సి ఉంది. కానీ, గత పరీక్షల ఫలితాలను ప్రకటించకపోగా, ఈ విద్యా సంవత్సరంలో టోఫెల్ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దుచేసింది.ఐబీ శిక్షణకూ అదే గతి..‘టోఫెల్ అనేది డిగ్రీ తర్వాత విదేశాల్లో చదువుకునే వారికి మాత్రమేగాని, స్కూలు పిల్లలకు ఎందుకు? ఈ విధానం సరైంది కాదు’.. అని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యలకు తగ్గట్లుగానే టీడీపీ ప్రభుత్వం టోఫెల్ శిక్షణకు జూలైలో టాటా చెప్పేసింది. అలాగే, అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోని ‘ఐబీ’ కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో 2025 జూన్ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్ను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. వాస్తవానికి.. ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్పై శిక్షణ నిర్వహించాలని ఏర్పాట్లుచేశారు. కానీ, ఇప్పుడా కార్యాలయాన్నే తొలగించడంతో మొత్తం ప్రక్రియ అటకెక్కినట్లయింది. -
ఫీజుల దరువుకు బ్రేకులెలా?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించిన నేపథ్యంలో, పాఠశాల విద్య డైరెక్టరేట్ దీనిపై కసరత్తుకు సిద్ధమవుతోంది. ఫీజుల నియంత్రణకు 2017లో ఆచార్య తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తోంది. అవసరమైతే ప్రత్యేక చట్టం తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు స్కూళ్లలోనే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. సర్కారీ స్కూళ్లలో మౌలికవసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ.4 లక్షల వరకు వార్షిక ఫీజును వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్ళు ప్రతి ఏటా ఏకంగా 25 శాతం వరకూ ఫీజులు పెంచుతున్నాయి. దీనిపై కొన్నేళ్లుగా ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై దృష్టి సారించింది. మౌలిక వసతుల ఆధారంగానే ఫీజులు! ఫీజుల నియంత్రణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. 35 లక్షల మందికిపైగా చదివే 11 వేల ప్రైవేటు స్కూళ్లను దీని పరిధిలోకి తేవాలని భావిస్తోంది. ఇష్టానుసారం కాకుండా స్కూళ్లలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజుల పెంపునకు అనుమతించేలా నిబంధనలు రూపొందించే యోచనలో ఉంది. అవసరం లేని ఖర్చును అభివృద్ధిలా..! ఫీజుల నియంత్రణకు సంబంధించి గతంలో ఇచ్చిన జీవోలు అమలు కాకపోవడంతో చట్టపరమైన అడ్డంకులు లేకుండా చేయాలని పాఠశాల విద్య అధికారులకు ఉప సంఘం సూచించింది. స్కూల్ డెవలప్మెంట్ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా 15 శాతం ఫీజులు పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో జీవోలిచ్చారు. వాటిని ఆధారంగా చేసుకుని పెద్ద స్కూళ్ళు అవసరం లేని ఖర్చును చేస్తూ ఆ పనులను అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఓ ఉదాహరణను పరిశీలిస్తే.. ఒక స్కూలు ప్రతి గదిలో అత్యాధునిక సౌండ్ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేసింది. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టుగా లెక్కల్లో చూపింది. ఫీజులు 25 శాతం పెంచేసింది. ఇలా స్కూళ్లు ఫీజులు అడ్డగోలుగా పెంచేస్తున్నాయి. వీటిని క్రమబధ్ధికరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఖర్చు 10 శాతం దాటితే పక్కా లెక్క ఉండాలి స్కూళ్ల మూడేళ్ల ఖర్చును బట్టి వార్షిక ఫీజుల పెంపునకు అనుమతించవచ్చని తిరుపతిరావు కమిటీ సూచించింది. ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటి ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా ఉండాలని ప్రతిపాదించారు. వేతనాలు, స్కూలు కోసం కొనుగోలు చేసే మౌలిక వసతులు, ఇతరత్రా ఖర్చులకు బ్యాంకు ద్వారానే చెల్లింపులు ఉండాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి. వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని కసరత్తు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. 11 వేల స్కూళ్ళ ఆదాయ, వ్యయ లెక్కలు చూడాలంటే ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. ఈ దిశగానూ కొన్ని సిఫారసులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 10 శాతం పైగా ఫీజు పెంచే స్కూళ్లు విధిగా లెక్కలు చూపేలా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టనున్నారు. -
జీవో 317పై అభ్యంతరాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317కు అనుగుణంగా చేపట్టిన ఉద్యోగ కేటాయింపులపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. జీవో 317 ద్వారా నష్టపోయిన, ఇబ్బందులకు గురైన వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక ఆయా ఉద్యోగుల నుంచి ఆన్లైన్లో వినతులను స్వీకరించింది. ఈ క్రమంలో 33 ప్రభుత్వ శాఖల నుంచి ప్రభుత్వానికి ఏకంగా 52,235 మంది ఉద్యోగులు వినతులు సమర్పించడం గమనార్హం. దీన్నిబట్టి రాష్ట్రంలో నూతన జోనల్ విధానంలో భాగంగా జరిపిన కేటాయింపుల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో స్థానచలనం కలిగిన ఉద్యోగుల్లో దాదాపు 80 శాతం మంది ఉద్యోగులు నష్టపోయామని అంటున్నారు. వీరికి న్యాయం చేస్తామన్న హామీ మేరకు ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో సభ్యులుగా ఐటీ మంత్రి డి.శ్రీధర్బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యి క్షేత్రస్థాయి నుంచి వినతులు స్వీకరించింది. ఈ కమిటీ ఈ నెల 18న మరోమారు సమావేశం కానుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. విద్యాశాఖ నుంచి అత్యధిక వినతులు జీఓ 317 కేటాయింపులతో అన్యాయం జరిగిందంటూ వచ్చిన వినతుల్లో అత్యధికులు విద్యాశాఖ నుంచే ఉన్నారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 20,209 దరఖాస్తులు రాగా.. 11,417 దరఖాస్తులతో హోంశాఖ ఆ తర్వాతి స్థానంలో ఉంది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి 4,833 దరఖాస్తులు, రెవెన్యూ శాఖ నుంచి 2,676 దరఖాస్తులు, పంచాయతీరాజ్ నుంచి 2,390 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. సాంఘిక సంక్షేమ శాఖ నుంచి 1,797, అటవీ, పర్యావరణ శాఖ నుంచి 1,235, గిరిజన సంక్షేమ శాఖ నుంచి 1,140 వినతులు వచ్చాయి. పది శాఖల నుంచి వందలోపు, మిగతా శాఖల నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ వెయ్యిలోపు ఉన్నాయి. మొత్తం వినతుల్లో జిల్లా స్థాయి కేడర్లో 36,982 మంది ఉద్యోగులు ఉండగా, జోనల్ స్థాయిలో 12 వేల మంది ఉద్యోగులు, మల్టీ జోనల్ స్థాయిలో 3,253 మంది ఉన్నారు. ఈ దరఖాస్తులను శాఖల వారీగా పరిశీలించిన అధికారులు సాధ్యాసాధ్యాలపై ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. 18న కేబినెట్ సబ్ కమిటీ ముందుకు... శాఖల వారీగా జీఓ 317 వినతుల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉప సంఘం ఈనెల 18న సచివాలయంలోని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి చాంబర్లో భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పాల్గొనాలని ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) ఆదేశించింది. ఈనెల 16 నాటికి శాఖల వారీగా వచ్చిన వినతుల సంఖ్య, ఇందులో పరిష్కరించినవి, పరిష్కరించనివి, తిరిస్కరించినవి, కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్నవి, శాఖ వద్ద పెండింగ్లో ఉన్నవి, కోర్టు తీర్పు వెలువడినవి, శాఖలో కేడర్ స్ట్రెంగ్త్, కేటగిరీ వారీగా కేడర్ తదితర పూర్తిస్థాయి సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్లో సమర్పించాలని జీఏడీ ఆదేశించింది. ఈమేరకు జీఏడీ రూపొందించిన ఫార్మాట్తో కూడిన నోట్ను సాధారణ పరిపాల విభాగం కార్యదర్శి ఎం.రఘునందన్రావు జారీ చేశారు. -
ఇంటర్ బోర్డు చొరవతో దివ్యాంగ విద్యార్థులకు మేలు
సాక్షి, అమరావతి: సాంకేతిక కారణాలతో ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు వచ్చినా చేరలేకపోయిన దివ్యాంగ విద్యార్థులకు రాష్ట్ర ఇంటరీ్మడియట్ బోర్డు సకాలంతో స్పందించడంతో వారికి మేలు జరిగింది. రాష్ట్రంలో ఇంటర్ చదివే దివ్యాంగ విద్యార్థులు పరీక్షల్లో ఒక సబ్జెక్టు నుంచి మినహాయింపు ఉంది. దీంతో విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతం భాషల్లో (లాంగ్వేజ్ పేపర్) రాయడం లేదు. దీంతో విద్యార్థులు నాలుగు సబ్జెక్టులకే పరీక్షలు రాస్తున్నారు. అయితే, ఈ ఏడాది మద్రాస్ ఐఐటీ ప్రవేశాలకు ఐదు సబ్జెక్టుల విధానం తప్పనిసరి చేసింది. దీంతో ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడంతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్లోను ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు మద్రాస్ ఐఐటీతో పాటు పలు ఎన్ఐటీల్లోను సీట్లు సాధించారు. కానీ కౌన్సెలింగ్లో మార్కుల లిస్టును పరిశీలించిన అధికారులు ‘నాలుగు’ సబ్జెక్టులకే మార్కులుండటంతో వారి ప్రవేశాలను తిరస్కరించే పరిస్థితి తలెత్తింది. దీంతో గత నెలలో పలువురు దివ్యాంగ విద్యార్థులు తాడేపల్లిలోని ఇంటర్ విద్యా మండలికి చేరుకుని న్యాయం చేయాలని అభ్యర్థించారు. దీనిపై వెంటనే స్పందించిన ఇంటర్ బోర్డు అధికారులు మద్రాస్ ఐఐటీ అధికారులను సంప్రదించి, ఏపీలో దివ్యాంగ విద్యార్థులకు కల్పిస్తున్న సబ్జెక్టు వెసులుబాటును వివరించారు. అయితే, ప్రభుత్వం నుంచి జీవో ఇస్తే చేర్చుకుంటామని చెప్పడంతో ఇంటర్ బోర్డు అధికారులు మార్గాలను అన్వేíషించారు. 1992లో పదో తరగతి దివ్యాంగ విద్యార్థుల కోసం జారీ చేసిన జీవో నం.1161 ప్రకారం ఇంటర్ దివ్యాంగ విద్యార్థులకు మేలు చేయవచ్చని ప్రభుత్వానికి ఫైల్ పంపారు. నాలుగు పేపర్లలో వచ్చిన మార్కుల సరాసరి ఆధారంగా పరీక్ష రాయని సబ్జెక్టుకు మార్కులు కేటాయించవచ్చని పేర్కొన్నారు. దీనిపై ఇటీవల పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ జీవో నం.255 ఇవ్వడంతో దాదాపు 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందే అవకాశం దక్కింది. -
నెరవేరిన టీచర్ల కల
సాక్షి, హైదరాబాద్: పదోన్నతుల కోసం దాదాపు దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కల ఎట్టకేలకు నెరవేరింది. రంగారెడ్డి జిల్లా మినహా రెండు జోన్లలోనూ పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. చివరిసారిగా 2015లో పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ప్రమోషన్ల ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. టీచర్ల హేతుబదీ్ధకరణ చేపట్టాలని కొన్నాళ్లు భావించారు. కోర్టు కేసుల కారణంగా మరికొంత జాప్యం జరిగింది. 2023లో బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మల్టీజోన్–1లో కొంత వరకూ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ముందుకెళ్లింది. అంతలోనే స్పౌజ్ కేసుల కారణంగా ఇది ఆగిపోయింది. పండిట్లు తమ పోస్టులు తమకే ఇవ్వాలన్న డిమాండ్తో కోర్టును ఆశ్రయించారు. వీటిని పక్కనబెట్టి ప్రమోషన్లు ఇవ్వాలని భావించారు. ఈ సమయంలో ప్రమోషన్లకు టెట్ ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనను కొంతమంది టీచర్లు ముందుకు తెచ్చారు. న్యాయస్థానం స్టే కారణంగా 2023లో ఇది ఆగిపోయింది. ఈలోగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోషన్లు, బదిలీలు చేయాలని అధికారులు కంకణం కట్టుకున్నారు. ఈ వ్యవహారంలో పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యూహాత్మకంగా న్యాయ పరమైన చిక్కులు తొలగించారు. దీంతో 18,942 మందికి ఒకేసారి పదోన్నతులు దక్కాయి. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా, కొంతమంది, స్కూల్ అసిస్టెంట్ల నుంచి హెచ్ఎంలుగా మరికొంతమంది ప్రమోషన్లు పొందారు. వీళ్లందరినీ బదిలీ చేశారు. దీంతో ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఖాళీలు 22 వేల పైనే... బదిలీలు, పదోన్నతుల తర్వాత వాస్తవ ఖాళీలు అధికారులు లెక్కగట్టాల్సి ఉంది. ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది. 18,942 మందికి ప్రమోషన్లు ఇచ్చినా... వీరిలో 3 వేల మంది ఒకటికి మించి పదోన్నతులకు అర్హత ఉన్నవారున్నారు. ఉదాహరణకు సైన్స్, మేథ్స్ సబ్జెక్టులు రెండింటికీ అర్హత ఉంటుంది. పదోన్నతి రెండింటికీ లభిస్తుంది. అయితే, టీచర్ ఒకే సబ్జెక్టులో పదోన్నతి తీసుకోవాలి. ఈ రకంగా 3 వేల ఖాళీలు ఏర్పడే వీలుంది. జిల్లాల వారీగా ఈ లెక్కలు తేలితే... ఈ స్థానంలో మరికొన్ని పదోన్నతులు లభించే అవకాశముంది. జూలైలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ప్రస్తుతం 11 వేల పోస్టులను చేర్చారు. పదోన్నతుల ద్వారా మరో 11 వేల వరకూ ఖాళీ అయ్యే వీలుంది. వీటిని కూడా చేర్చి, పూర్తిస్థాయిలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇదో చరిత్ర : ముఖ్యమంత్రి కార్యాలయం ఇంత పెద్ద మొత్తంలో టీచర్లకు పదోన్నతులు కల్పించడం రాష్ట్ర చరిత్రలోనే గొప్ప విషయమని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఓ ప్రకటనలో పేర్కొంది. ఎక్కడా ఎలాంటి వివాదానికి తావివ్వకుండా, చట్టపరమైన చిక్కులను అధిగమించడంలో ప్రభుత్వం చూపిన చొరవను ఉపాధ్యాయ సంఘాలు ప్రశంసిస్తున్నాయని తెలిపింది. టీచర్ల కష్టాన్ని, శ్రమను ప్రభుత్వం గుర్తించిందని, సముచిత రీతిలో గౌరవించిందని, ఈ కారణంగా టీచర్లు మరింత కంకణబద్దులై పనిచేస్తారన్న ఆశాభావాన్ని సీఎంవో వ్యక్తం చేసింది. ఖాళీలు 22 వేల పైనే...బదిలీలు, పదోన్నతుల తర్వాత వాస్తవ ఖాళీలను అధికారులు లెక్కగట్టాల్సి ఉంది. ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది. 18,942 మందికి ప్రమోషన్లు ఇచ్చినా.. వీరిలో 3 వేల మంది ఒకటికి మించి పదోన్నతులకు అర్హత ఉన్నవారున్నారు. ఉదాహరణకు సైన్స్, మేథ్స్ సబ్జెక్టులు రెండింటికీ అర్హత ఉంటుంది. పదోన్నతి రెండింటికీ లభిస్తుంది. అయితే, టీచర్ ఒకే సబ్జెక్టులో పదోన్నతి తీసుకోవాలి. ఈ రకంగా 3 వేల ఖాళీలు ఏర్పడే వీలుంది. జిల్లాల వారీగా ఈ లెక్కలు తేలితే... ఈ స్థానంలో మరికొన్ని పదోన్నతులు లభించే అవకాశముంది. జూలైలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ప్రస్తుతం 11 వేల పోస్టులను చేర్చారు. పదోన్నతుల ద్వారా మరో 11 వేల వరకూ ఖాళీ అయ్యే వీలుంది. వీటిని కూడా చేర్చి, పూర్తిస్థాయిలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. -
మోగనున్న బడిగంట.. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
సాక్షి, అమరావతి: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు గురువారం తెరుచుకోనున్నాయి. దీంతో 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో మొత్తం 62,023 పాఠశాలలు ఉండగా.. వీటిలో ప్రభుత్వ యాజమాన్యంలో 44,954 పాఠశాలలు, ప్రైవేటు యాజమాన్యంలో 15,784, ఎయిడెడ్లో మరో 1,225 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో మరో 60 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర పాఠశాలలు మినహా మిగిలినవి నేడు (గురువారం) ప్రారంభమవుతాయి. ఇక కేంద్రీయ విద్యాలయాలు ఈ నెల 21న, నవోదయ విద్యాలయాలు 30న ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి బుధవారమే బడులు తెరుచుకోవాల్సి ఉండగా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో పాఠశాలల పునఃప్రారంభం షెడ్యూల్ను అధికారులు గురువారానికి మార్చారు. బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పీఎం–పోషణ్ గోరుముద్ద (మధ్యాహ్న భోజనం)ను సైతం అదే రోజు విద్యార్థులకు అందించాలన్నారు. ప్రస్తుతానికి గతేడాది వరకు అనుసరించిన విధానంలోనే విద్యార్థులకు భోజనం అందించనున్నారు. కొత్త విద్యాశాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్నాక తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. కాగా, ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పూర్తవగా, ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి.20 తర్వాతే విద్యార్థులకు పుస్తకాలు, కిట్లు రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గత విద్యా సంవత్సరం వరకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను పాఠశాల తెరిచిన మొదటిరోజే అందజేశారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా ద్విభాషా పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్ –తెలుగు) నోట్ బుక్స్, వర్క్ బుక్స్, కుట్టు కూలితో 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, ఒకటో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన కిట్ను ఇచ్చేవారు. 2024–25 విద్యా సంవత్సరానికి కూడా 36 లక్షల మంది విద్యార్థులకు గతేడాది మాదిరిగానే రూ.1,042.53 కోట్ల ఖర్చుతో స్టూడెంట్ కిట్లను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, సరఫరాదార్ల నుంచి పూర్తిస్థాయిలో వస్తువులు స్టాక్ పాయింట్లకు చేరలేదు. దీంతో వీటిని ఈనెల 20 తర్వాతే విద్యార్థులకు అందించే అవకాశం ఉంది. కాగా, ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు నూతన విద్యా సంవత్సరం కేలండర్ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించేది. అయితే, ఈసారి 1,000 ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లు కూడా ఉండడంతో ఈ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సీబీఎస్ఈ అధికారులతో కలిసి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) అధికారులు నూతన కేలండర్ను రూపొందిస్తున్నారు. దీంతో మరో వారం రోజుల్లో విద్యా కేలండర్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ప్రతి విద్యార్థికీ ‘పెన్’
సాక్షి, అమరావతి: కాకినాడ నగురంలోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న బాలకృష్ణ కుటుంబం చెన్నైకి వలస వెళ్లింది. బాలుడు ఇక్కడ టీసీ తీసుకోలేదు. అయితే, ఆ విద్యార్థి అక్కడ బడిలో చేరినట్టు ఎక్కడా వివరాలు లేవు. ఇలాంటి పరిస్థితి విద్యాశాఖకు సవాలే. బడి ఈడు పిల్లలు ఎంతమంది బడిలో ఉంటున్నారు, ఎంతమంది బడికి వెళ్లడంలేదో తెలుసుకునేందుకు ఇంటింటికీ సర్వే చేయడం తప్ప ఇప్పటివరకు మరో మార్గం లేదు. ‘పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్)’తో దీనికి పరిష్కారం లభిస్తుంది. నూతన జాతీయ విద్యావిధానం–2020 (ఎన్ఐపీ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యార్థులందరికీ ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య పెన్ను తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో ఈ విధానాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం 2022–23 విద్యా సంవత్సరం నుంచే ఇదే తరహా విధానం అమలు చేస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం (2024–25) నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసింది.’పెన్’ అంటే..ప్రి ప్రైమరీలో అడ్మిషన్ తీసుకున్న సమయంలో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఇంటి అడ్రస్ వంటి అన్ని వివరాలను డిజిటలైజ్ చేసి కేంద్ర పాఠశాల విద్య మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలోని ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)’లో నమో దు చేస్తారు. ఒకటో తరగతిలో విద్యార్థుల వివరాలు నమోదు చేసే సమయంలోనే ప్రతి ఒక్కరికీ డిజీ లాకర్ను ఓపెన్ చేసి, అన్ని సర్టిఫికెట్లను అందులో ఉంచుతారు. ఆ తర్వాత 11 అంకెల పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ వస్తుంది. ఈ నంబరు ఆధార్ నంబరులాగానే విద్యార్థికి జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. ఒక ప్రభు త్వ లేదా ప్రైవేటు స్కూలు నుంచి మరొక ప్రభు త్వ లేదా ప్రైవేటు స్కూలుకు బదిలీ అయినప్పు డు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోని స్కూలు లేదా కాలేజీలో చేరే సమయంలో టీసీ లు, మైగ్రేషన్ సర్టిఫికెట్లు అవసరం లేకుండా చేరొచ్చు. ఈ పెన్ నంబరు ఇవ్వగానే ఆన్లైన్లో ఆ విద్యార్థికి సంబంధించిన అన్ని సర్టిఫికె ట్లు అందులో వస్తాయి. దీనిద్వారా విద్యార్థి ఒక విద్యా సంస్థ నుంచి మరొక విద్యా సంస్థకు సులభంగా ట్రాన్స్ఫర్ అవ్వొచ్చు. చదువు పూ ర్తయిన అనంతరం వారు ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు పిల్లలను పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఆధార్ నంబర్ నమోదు చేసేవారు. అయితే, ఈ వివరాలు ఆ జిల్లా, రాష్ట్రం వరకే తెలిసేవి. ఒకవేళ విద్యార్థి రాష్ట్రం వెలుపల మరోచోట చదువుతున్నా తెలుసుకోవడం కష్టం. అయితే పెన్ ద్వారా విద్యార్థి ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది. చిరునామా వంటి వివరాలు మారినప్పుడు పెన్ నంబర్కు కూడా అప్డేట్ చేస్తారు. దాంతో దేశవ్యాప్తంగా విద్యార్థి ఎక్కడున్నా సులువుగా తెలుసుకోవచ్చు.పత్రాలు లేకుండానే బదిలీరాష్ట్రంలో ప్రస్తుతం స్కూల్ స్థాయి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 86 లక్షల మందికి, ఈ విద్యా సంవత్సరం ప్రి ప్రయిమరీలో చేరే విద్యార్థులకు కూడా ‘పెన్’ కేటాయిస్తారు. దీని ద్వారా జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే 2024–25 విద్యా సంవత్సరంలో ఒక తరగతి నుంచి మరొక తరగతికి వెళ్లే విద్యార్థులు, ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలలో చేరే విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఒకప్పటి నిబంధనల ప్రకారం ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశాలలో చేరే విద్యార్థికి టీసీ, స్టడీ సర్టిఫికెట్ కుల ధ్రువీకరణ పత్రం.. ఇలా అనేక సర్టిఫికెట్లను సమర్పించాలి. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ల అవసరం లేకుండా విద్యార్థి ‘పెన్’ నంబర్తో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒక్క క్లిక్తో విద్యార్థిని బదిలీ చేయొచ్చు.పాఠశాలలకు విద్యార్థుల మ్యాపింగ్వచ్చే నెలలో ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల బదిలీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ సులభతరం చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 5, 7 తరగతులు పూర్తి చేసిన విద్యార్థులను పై తరగతులు ఉన్న పాఠశాలలకు ట్యాగింగ్ చేస్తారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థికి అవసరమైన స్కూళ్లను ఆన్లైన్లో చూపిస్తే తల్లిదండ్రులు నచ్చిన పాఠశాలను ఎంపిక చేసుకుంటారు. ఇలాంటి విద్యార్థులందరినీ మ్యాప్ చేసిన తర్వాత ఆ డేటాను విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి నేరుగా విద్యార్థులు ఎంపిక చేసుకున్న పాఠశాలకు బదిలీ చేస్తారు. విద్యార్థి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు సమర్పించా ల్సిన అవసరం ఉండదు. ఉన్నత తరగతులకు ప్రమోట్ చేసేటప్పుడు కూడా ఇదే విధానం అనుసరిస్తారు. అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని పాఠశాలల్లో ఇదే తరహా విధానం అనుసరిస్తారు. గత ఏడాది వరకు పాఠశాలలో ప్రవేశానికి తప్పనిసరిగా పుట్టిన తేదీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, నేటివిటీ సర్టిఫికెట్, నివాస «సర్టిఫికెట్ వంటివి తప్పనిసరి. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆ విధానానికి స్వస్తి పలకనున్నారు. ‘పెన్’పై అవగాహన ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థికి ‘పెన్’ నంబర్ కేటాయించాలని పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ జిల్లా, మండల విద్యా శాఖాధికారులు, పాఠశాలల హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను చేర్చుకునే సమయంలో పర్మినెంట్ నంబర్పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, సర్టిఫికెట్ల పేరిట తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయొద్దని చెప్పారు. -
పిల్లల మార్కులు నేరుగా తల్లిదండ్రులకే
సాక్షి, అమరావతి: విద్యార్థి ఒక్క రోజు బడికి రాకపోతే తల్లిదండ్రులకు మెసేజ్ (ఎస్ఎంఎస్లు)ల ద్వారా తెలియజేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. మరో వినూత్న ప్రక్రియను చేపట్టింది. విద్యార్థులు వివిధ పరీక్షల్లో సాధించిన మార్కులను, నెలలో ఎన్నిరోజులు బడికి వచ్చారో చెబుతూ ‘హోలిస్టిక్ రిపోర్టు కార్డు’ లను తల్లిదండ్రులకు పంపిస్తోంది. ఫార్మేటివ్ (యూనిట్), సమ్మేటివ్ (అర్ధ, వార్షిక) అసెస్మెంట్స్లో విద్యార్థులు సాధించిన మార్కులను నేరుగా తల్లిదండ్రులకే చేరవేస్తోంది.గతంలో వార్షిక పరీక్షల ఫలితాలను మాత్రమే ప్రోగ్రెస్ కార్డుల్లో ఇవ్వగా, ఈ ఏడాది అందుకు భిన్నంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్లకు హోలిస్టిక్ రిపోర్టు కార్డులను ఎస్ఎంఎస్ రూపంలో పంపించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 9 తరగతుల పిల్లలకు ఈ నూతన విధానం ప్రవేశపెట్టింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఐటీ విభాగం ప్రత్యేక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది. అన్ని మేనేజ్మెంట్స్లోని బడుల్లో 9వ తరగతి వరకు చదువుతున్న సుమారు 61.81 లక్షల మంది విద్యార్థుల మార్కులు, బడికి హాజరైన రోజుల సమాచారాన్ని తల్లిదండ్రులకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 55,71,173 మందికి (90.13 శాతం) ఎస్ఎంఎస్లు పంపారు. పిల్లల ప్రగతి తల్లితండ్రులకు తెలిసేలా.. గతంలో విద్యార్థులు వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులను ప్రోగ్రెస్ రిపోర్టుగా ఏప్రిల్/ మే నెలల్లో పంపించేవారు. అయితే 2023–24 విద్యా సంవత్సరంలో నాలుగు ఎఫ్ఏ పరీక్షలు, రెండు ఎస్ఏ పరీక్షల్లో సాధించిన మార్కులు, ఎన్ని రోజులు బడికి హాజరయ్యారో కూడా వివరిస్తూ తల్లిదండ్రులకు హోలిస్టిక్ రిపోర్టు కార్డులను వారి ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తున్నారు. కార్డులను డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. దీనిద్వారా తమ పిల్లలు ఏ పరీక్షలో ఎన్ని మార్కులు సాధించారు, ఎన్ని రోజులు బడికి వెళ్లారో తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చాయో గుర్తించి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్లను అడిగేందుకు అవకాశముంటుంది. దీనిద్వారా తల్లిదండ్రుల్లో బాధ్యత పెరుగుతుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురే‹Ùకుమార్ ‘సాక్షి’కి తెలిపారు.100 శాతం పూర్తిచేసిన ప్రభుత్వ బడులు విద్యార్థుల మార్కులు, హాజరు వివరాలను పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్ వెబ్సైట్లో నమోదు చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి పాఠశాల (ప్రాథమిక, ఉన్నత) ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక లాగిన్ ఇచ్చారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత హాజరు, ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల్లో సాధించిన మార్కులను ఇందులో నమోదు చేయాలి. ఈ ప్రక్రియను ప్రభుత్వ పాఠశాలలు నూరు శాతం పూర్తి చేయగా, ప్రైవేటు పాఠశాలలు 89 శాతం మాత్రమే నమోదు చేశాయి. బడులు తెరిచేలోగా అన్ని స్కూళ్లూ ఈ వివరాలను నమోదు చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.డిజీ లాకర్లో 8, 9 తరగతుల మార్కులు ఇప్పటికే డిగ్రీ, ఇంటర్మీడియట్తో పాటు పదో తరగతి మార్కుల జాబితాలను ‘డిజీ లాకర్’లో నమోదు చేస్తుండగా.. 2023–24 విద్యా సంవత్సరంలో 8, 9 తరగతుల మార్కుల జాబితాలను సైతం డిజీ లాకర్లో అందుబాటులో ఉంచారు. బడులు తెరిచాక పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో డిజీ లాకర్పై అవగాహన కల్పించనున్నారు. -
ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంగ్లీష్ మీడియం బోధనను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ) వంటి అధునాతన పద్ధతుల్లో విద్యా బోధన చేస్తోంది. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు బడి తెరిచిన మొదటి రోజే వారికి అవసరమైన పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు వంటివి అన్ని వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక (జేవీకే) కిట్లను అందిస్తోంది. వచ్చే నెల 12న ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరానికి కూడా ఈ కిట్లు సిద్ధమవుతున్నాయి. పాఠ్య పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. మరోపక్క 1 నుంచి 10 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆన్లైన్లోనూ పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు–ఇంగ్లిష్ మీడియంలో వర్క్బుక్స్తో కలిపి మొత్తం 391 టైటిళ్లను పీడీఎఫ్ రూపంలో పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్లో ఉంచింది. గతేడాది ఆన్లైన్లో ఉంచిన పుస్తకాలను దాదాపు 18 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 1,72,482 పాఠ్యపుస్తకాలు డౌన్లోడ్ అవడం విశేషం. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కొత్త సిలబస్ పుస్తకాలను కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. త్వరలో ఉర్దూ, తమిళం, ఒడియా, కన్నడ వంటి మైనర్ మీడియం బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను సైతం వెబ్సైట్లో ఉంచనున్నారు. పాఠాలను విద్యార్థులు విశ్లేషణాత్మకంగా అర్ధం చేసుకొని, సామరŠాధ్యలను మెరుగుపరుచుకొనేందుకు ఆన్లైన్ పీడీఎఫ్లోని ప్రతి పాఠానికి ఎస్సీఈఆర్టీ ‘క్యూఆర్’ కోడ్ను జత చేసింది. ఆ కోడ్ను స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేస్తే పుస్తకంలోని పాఠాన్ని ‘దీక్ష’ పోర్టల్లో వీడియో రూపంలో చూసే అవకాశం కూడా కల్పించారు. పీడీఎఫ్ పాఠ్య పుస్తకాలను https://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. బడి తెరిచిన రోజే వాటిని అందించేందుకు ఇప్పటికే ప్రింటర్స్ నుంచి జిల్లా స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేశారు. 1, 2 తరగతులు మినహా మిగతా అన్ని తరగతుల పాఠ్య పుస్తక ముఖచిత్రాలు మార్చారు. ముఖ చిత్రాల ఆధారంగా సులభంగా పుస్తకాలను గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతంలో ఇచ్చినట్టుగానే ఈసారీ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న స్కూళ్లు ప్రారంభమవుతాయి. జూన్ 8వ తేదీకే అన్ని స్కూళ్లకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి పుస్తకాలను తరలించనున్నారు. 8, 9, 10 తగరతుల విద్యార్థులకు 1.08 కోట్ల రెండో సెమిస్టర్ పుస్తకాల ముద్రణ సైతం దాదాపు పూర్తయింది. సెమిస్టర్–2 బోధన అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటిని జూలైలో విద్యార్థులకు అందిస్తారు.ఈసారి పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలోగత విద్యా సంవత్సరం వరకు 1 నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అమల్లో ఉంది. జూన్లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారనుంది. ఈ నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ సిలబస్ను అనుసరించి అధికారులు పుస్తకాలను సిద్ధం చేశారు. పదో తరగతి ఫిజికల్ సైన్స్ పుస్తకాలను తొలిసారి పూర్తి ఆర్ట్ పేపర్పై ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సు బోధనకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఎక్స్పర్ట్స్గానూ నియమించింది. ఫ్యూచర్ స్కిల్స్ సిలబస్ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలను సిద్ధం చేసింది. బైలింగ్యువల్లో మేథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను విద్యార్థులు ఆసక్తిగా చదివేలా తీర్చిదిద్దారు. దీనిద్వారా విద్యార్థులకు సబ్జెక్టులపై మరింత అవగాహన పెరుగుతుందని, ఆంగ్ల భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను మార్కెట్లోకి రెండు రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వ టెక్టŠస్ బుక్స్ డైరెక్టర్ కొండా రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. వాటిని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పుస్తకాల ముద్రణను జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తయిన తర్వాతే కాంట్రాక్టు అప్పగించామన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్ ( ఠీఠీఠీ. ఛిట్ఛ. ్చp. జౌఠి. జీn)లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. -
డీఎస్సీ–2024 నిర్వహణపై ‘ఈసీ’కి లేఖ
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) ఫలితాల ప్రకటన, డీఎస్సీ–2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్నా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సెట్ ఫలితాలు ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డీఎస్సీ నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్, డీఎస్సీని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51 వేల మంది ఎస్టీజీ పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామన్నారు. -
మే 20 నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను మే 20 నుంచి జూన్ 3 వరకూ నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్, సమాచార బులెటిన్ను ఈ నెల 20న స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే ఈ పరీక్షకు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు పంపుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ను గత నెల 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా, ఈ గడువు ఏప్రిల్ 3తో ముగుస్తుంది. టెట్లో అర్హత సాధిస్తే తప్ప డీఎస్సీ రాసేందుకు అర్హత ఉండదు. దీనివల్ల టెట్ అర్హత లేని బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు డీఎస్సీ రాసే వీలు ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ను డీఎస్సీకి ముందే నిర్వహించాలని, ఇందులో అర్హత సాధించిన వారికి డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు తేదీలను కూడా పొడిగించారు. జూన్ 6 వరకూ డీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు దేవసేన తెలిపారు. డీఎస్సీ పరీక్షను ఆన్లైన్ మోడ్లో జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తు న్నట్టు కమిషనరేట్ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ ఇదే టెట్లో పాల్గొనేందుకు చాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడవ్వాల్సి ఉంది. టీచర్ల పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయడంతో 80 వేల మంది ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంటుంది. -
పదో తరగతి హాల్టికెట్లు సిద్ధం
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 30 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థుల హాల్టికెట్లను సిద్ధం చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ కోడ్ నంబర్తోను, విద్యార్థులు తమ పుట్టిన తేదీని నమోదు చేసి సోమవారం మధ్యాహ్నం నుంచి www.bse.ap.gov.in నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలున్నారు. గతేడాది పదో తరగతి తప్పి తిరిగి ప్రవేశం పొందినవారు మరో 1,02,528 మంది కూడా రెగ్యులర్గా పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగుస్తుండగా, మరో రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలుంటాయి. విద్యాశాఖ 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్ను సిద్ధం చేసింది. 130కి పైగా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
నేడు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త నోటిఫికేషన్ గురువారం వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు దాదాపు 1.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షను నిర్వహించాలనుకున్న తేదీల్లోనే అసెంబ్లీ ఎన్నికల తేదీలు రావడంతో డీఎస్సీ పరీక్షను వాయిదా వేశారు. కాగా కొత్త ప్రభుత్వం 11,062 పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. గత డీఎస్సీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని బుధవారం నాటి ప్రకటనలో స్పష్టం చేసింది. -
టెట్, టీఆర్టీ నోటిఫికేషన్ల నిలుపుదలకు ‘నో’
సాక్షి, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష (టీఆర్టీ), ఏపీ టీచర్ అర్హత పరీక్ష (టెట్)ల నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే, పరీక్షల వాయిదాకు సైతం తిరస్కరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదంది. ఈ వ్యవహారంపై తుది విచారణ జరుపుతామని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. టీఆర్టీ, టెట్ పరీక్షల నోటిఫికేషన్లను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లను రద్దుచేయాలని కోరారు. రెండు పరీక్షల మధ్య తగినంత సమయంలేదని, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆ సమయం సరిపోదని వారు వివరించారు. టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్ పరీక్ష నిర్వహణకు 8న నోటిఫికేషన్లు జారీచేశారని తెలిపారు. టెట్లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంతమాత్రం సరిపోదన్నారు. టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు కోరారు. నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేయడంతో పాటు పరీక్షలను వాయిదా వేసి తిరిగి షెడ్యూల్ను ఖరారు చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యంకాదని, అలా ఇస్తే తుది ఉత్తర్వులు ఇచ్చినట్లేనన్నారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ అవసరమని పిటిషనర్లు చెబుతున్న నేపథ్యంలో ఈనెల 28న తుది విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టంచేశారు. -
27 నుంచి ఏపీటెట్–2024
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీటెట్)–2024 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం టెట్ హాల్టికెట్లను https://aptet.apchss.in వెబ్సైట్లో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 2,67,559 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారందరికీ పరీక్ష సెంటర్లను సైతం కేటాయించి, ఆయా వివరాలను ఆన్లైన్లో ఉంచింది. కాగా బీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు అనర్హులని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థుల ఫీజును తిరిగి చెల్లించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా అభ్యర్థుల ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు అకౌంట్కు ఫీజులు మొత్తాన్ని తిరిగి జమ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ప్రకటించింది. నిర్వహణ ఇలా.. పేపర్ 1ఏ : ఈనెల 27 నుంచి మార్చి 1 వరకు పేపర్ 2ఏ : మార్చి 2, 3, 4, 6 తేదీలు పేపర్ 1బి : మార్చి 5 (ఉదయం) పేపర్ 2బి : మార్చి 5 (మధ్యాహ్నం) 120 కేంద్రాల్లో ఏపీటెట్ ఈనెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 120 కేంద్రాల్లో ఏపీ టెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పరీక్షా కేంద్రాన్ని మాత్రమే కేటాయించినట్టు కమిషనరేట్ తెలిపింది. సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థుల్లో 76.5 శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్నే కేటాయించారు. పరీక్ష కేంద్రాలపై అభ్యర్థులకు సందేహాలుంటే ఆయా జిల్లా విద్యాశాఖాధికారులను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. దీంతోపాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండేలా కమిషనరేట్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. -
నిబంధనల ప్రకారమే డీఎస్సీ
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2024లో ప్రతి అంశంలోను పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని, అభ్యర్థులకు ఎటువంటి గందరగోళం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా జీవో నం.77 ప్రకారం రోస్టర్ పాయింట్లు చూపించామని చెప్పారు. ప్రస్తుత డీఎస్సీని 2018 డీఎస్సీ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తు నుంచి పరీక్ష వరకు అప్పటి నిబంధనలే ఉంటాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ ‘ఈనాడు’ పత్రిక డీఎస్సీ అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టేలా కథనం ప్రచురించిందన్నారు. రోస్టర్ విధానం తెలియకుండా ఆ పత్రిక ప్రచురించిన కథనం డీఎస్సీ అభ్యర్థులను ఆందోళనకు గురిచేసేలా ఉందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన జీవో 77 ప్రకారం అన్ని రోస్టర్లను చూపించామని, కానీ, బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో ఆ సంవత్సరం రిక్రూట్మెంట్ రోస్టర్లను అలాగే కొనసాగించాలని అన్నారు. జీవో ప్రకారం పాయింట్లు ప్రోస్పెక్టివ్గానే ఉంటాయిగానీ, రెట్రోస్పెక్టివ్గా ఉండదని చెప్పారు. ఆయన చెప్పిన వివరాలివీ.. ♦ మొదటి దరఖాస్తుదారులకు ఈడబ్లు్యఎస్ కోటా కనిపించలేదనడంలోనూ వాస్తవం లేదు. దరఖాస్తులు ప్రారంభమైన తేదీ నుంచే ఆప్షన్లో ఈడబ్లు్యఎస్ కోటా ఉంది. ఈనాడులో రాసింది తప్పు. ♦ పరీక్ష ఫీజుపైనా తప్పుగా రాశారు. వాస్తవానికి అభ్యర్థి అప్లికేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా 2018 డీఎస్సీ నిబంధనే. ♦ స్థానికేతర అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర ఆప్షన్ (ఓపెన్) ఇవ్వవచ్చు. ఒకసారి ఈ ఆప్షన్ ఎంచుకుని దరఖాస్తు చేసుకుంటే అభ్యర్థి నియామకం కూడా ఎంచుకున్న జిల్లాకే పరిమితం అవుతుంది. ఇదే విధానం జోనల్ పోస్టులకూ వర్తిస్తుంది. అలాగే దరఖాస్తు చేసుకోవాలి. ♦ డీఎస్సీ వెబ్సైట్కు సర్వర్ సమస్య ఎప్పుడూ లేదు. ఇప్పటివరకు టెట్ – 2024కు 3,17,950 దరఖాస్తులు అందాయి. డీఎస్సీకి 3,19,176 మంది నమోదు చేసుకున్నారు. సర్వర్ సమస్య ఉంటే ఇంత మంది దరఖాస్తు చేసుకోలేరు. అభ్యర్థులు కొందరికి ఫీజు చెల్లించే సమయంలో ఇంటర్నెట్ సమస్య ఉత్పన్నమై ఉంటుంది. దరఖాస్తు అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించాం. ఎవరైనా ఫీజు చెల్లించి ‘జర్నల్ నంబర్’ రాకుంటే చెల్లించిన ఫీజు మొత్తం వారి బ్యాంకు ఖాతాలో ఐదు రోజుల్లో తిరిగి జమ అవుతుంది. ♦ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఫిబ్రవరి 12 నుంచే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. బుధవారం వరకు మొత్తం 2,40,119 మంది ఫీజు చెల్లించారు. ♦సెంటర్ టెట్ (సీటెట్) విషయంలో కొందరికి అవగాహన లేదు. వాస్తవానికి ఏపీ విద్యా శాఖ వద్ద సీటెట్ డేటాబేస్ ఉండదు. సీటెట్ అభ్యర్థులు మొత్తం మార్కులు, గరిష్ట మార్కులను వారే స్వయంగా నమోదు చేయాలి. ఏపీ టెట్ అభ్యర్థులు మాత్రం హాల్ టికెట్ నంబరు నమోదు చేస్తే సరిపోతుంది. అభ్యర్థులకు ఎడిట్ అవకాశం దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ లేకండా 30 వేల మంది అవస్థలు పడుతున్నారని అనడం కూడా సరికాదు. దరఖాస్తు సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పులు జరిగితే సవరించే అవకాశం లేదని బులెటిన్లోనే పేర్కొన్నాం. కానీ అభ్యర్థుల సమస్యను దృష్టిలో ఉంచుకుని అప్లికేషన్ను ఎడిట్ చేసుకొనే అవకాశం కల్పించాం. అభ్యర్థులు మొదట వెబ్సైట్లో డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలి. పాత జర్నల్ నంబర్, మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ పొందవచ్చు. దీనిద్వారా ఎలాంటి రుసుం చెల్లించకుండా తప్పులు సరిదిద్దుకుని తిరిగి అప్లై చేసుకోవచ్చు. ఇందులో అభ్యర్థి పేరు, ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అన్ని అంశాలూ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ తప్పుగా ఉంటే పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్స్లో సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకునే అవకాశం ఉందని సురేష్ కుమార్ తెలిపారు. 25 వరకు ఫీజు చెల్లింపు గడువు డీఎస్సీ అభ్యర్థులు ఫీజు చెల్లించే గడువును పెంచినట్టు పాఠశాల కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈనెల 25వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని, ఈ ఆవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే, హెల్ప్ డెస్క్ సమయాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించామని తెలిపారు. -
ఇంటర్ హాల్టికెట్ల విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల హాల్టికెట్లను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ విడుదల చేశారు. బుధవారం విజయవాడలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాల్టికెట్లను ఆయన విద్యార్థులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది బోర్డు పరీక్షలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు 10,52,221 మంది హాజరవుతున్నారన్నారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాడు–నేడు కార్యక్రమం కింద మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తోందని, ఇప్పటికే పనులు పూర్తయిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను చూసి ప్రైవేట్ యాజమాన్యాలు ఆశ్చర్యపోతాయన్నారు. ప్రభుత్వ యాప్లపై అవగాహన పెంచాలి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘భాషిణి, డిజీ లాకర్’ వంటి యాప్స్ ప్రత్యేకతను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియజేసి వారికి వాటిపై అవగాహన పెంపొందించాలని ప్రవీణ్ ప్రకాశ్ అధికారులను ఆదేశించారు. సమగ్ర శిక్ష, ఎస్సీఈఆర్టీ, ఎఫ్ఎల్ఎన్, సాల్ట్, ప్రథమ్, ఎల్ఎఫ్ఈ, శామో, టోఫెల్ నిర్వహణ తదితర విభాగాల ప్రతినిధులతో బుధవారం ఆయన సమీక్ష జరిపారు. విజయవాడలోని ఐబీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ..‘భాషిణి’ యాప్ ద్వారా ఇతర భాషల నుంచి వాయిస్, టెక్ట్స్ మెసేజ్గా అనువాదం చేసుకోవచ్చన్నారు. ఫార్మెటివ్ సమ్మేటివ్ పరీక్షల మార్కులను డిజీ లాకర్ యాప్ ద్వారా తల్లిదండ్రులు తెలుసుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీలోని 40 యాజమాన్య పాఠశాలలను ఎస్సీఈఆర్టీ, ఐబీ బృందాలు పరిశీలిస్తాయని చెప్పారు. ఈ నెల 27 నుంచి మార్చి 6 వరకు జరిగే ఈ ప్రక్రియలో పాఠశాలల్లోని విద్యా కార్యక్రమాల తీరును అధ్యయనం చేస్తాయన్నారు. -
విశ్వవిజేతల కార్ఖానా!
తెలుగు ప్రసార మాధ్యమాలు పెద్దగా పట్టించుకోని ఈ వారపు ఘటనల్లో ఎన్నదగ్గవి రెండు: పాఠశాలల్లో ఐబీ సిలబస్ను ప్రారంభించేందుకు సన్నాహంగా ఒక బృందం పాఠశాలల పరిశీలనకు బయల్దేరింది. రెండవది – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో ఒక ఒప్పందం చేసుకున్నది. మొదటిది పాఠశాల విద్యకు సంబంధించినదైతే, రెండోది ఉన్నత విద్యకు సంబంధించిన అంశం. చంద్రబాబు యాచిస్తున్న పొత్తు కౌగిలిని బీజేపీ ప్రసాదిస్తుందా లేదా, జనసైనికులు ఆశిస్తున్న సీట్ల ప్యాకేజీని టీడీపీ అంగీకరిస్తుందా లేదా వగైరా పొలిటికల్ మిర్చి ముందు పై రెండు వార్తలను మీడియా చప్పిడి వార్తలు గానే పరిగణించి ఉండవచ్చు. యెల్లో మీడియా అయితే ఉద్దేశ పూర్వకంగానే విస్మరించింది. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ యెల్లో మీడియాలో ఉక్కపోత ఎక్కువైంది. కడుపు ఉబ్బరం పెరిగింది. ఒత్తిడి పెరిగింది. ఫలి తంగా దాని వార్తా ప్రాథమ్యాలు మరింత అదుపు తప్పాయి. ‘రాజధాని ఫైల్స్’ పేరుతో ఓ సినిమాను విడుదల చేశారు. ‘ఫైల్స్ కాదు పైల్స్’ (మొలలు) అన్నారెవరో! పెత్తందారీ పైల్స్ అనే పేరు పెడితే బాగుండేదన్నారు. యెల్లో మీడియా ఉన్న పరిస్థితికి ఈ సినిమా బాగా కనెక్టయింది. అందుకే యెల్లో మీడియాలో ప్రముఖ వార్తగా మారింది. యెల్లో మీడియాకు తోడయిన ఇంకో కామ్రేడరీ వార్త ‘విధ్వంసం’ పేరుతో పుస్తకావిష్కరణ. ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ’ అంటారు గదా! అట్లాగే పెత్తందారీ బాధ యెల్లో మీడియా ద్వారా సకల జనులకు బాధ. ఈ రెంటికీ మధ్యనున్న కామ్రేడరీ అనుబంధమే ఆ పుస్తక సారాంశం. కనుక అది కూడా వారికి పెద్ద వార్తే. స్కూళ్లలో ఐబీ సిలబస్ పెడితే మాత్రం ఏమిటి విశేషం? ఎడెక్స్ ద్వారా కళాశాలల్లో అంతర్జాతీయ సిలబస్ను ప్రవేశ పెడితే ఏం ప్రయోజనముంటుంది? ఇటువంటి సందేహాలు కలగడం సహజం. వాటిని గురించి చర్చించడానికి ముందు ప్రస్తుత ప్రపంచ పరిణామ దశ గురించిన ప్రాథమిక అవగాహన మనకు ఉండాలి. టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ప్రపంచం ఏకైక గ్లోబల్ మార్కెట్గా అవతరిస్తున్నది. ఈ మార్కెట్ను ఒకే ఒక వ్యవహారిక భాష నియంత్రించనున్నది. గ్లోబల్ విలేజి గురించి తరచూ మాట్లాడుతుంటారు. మన పూర్వీకులు ఎప్పటి నుంచో ‘వసుధైక కుటుంబం’ అనే భావనను వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ ఏక కుటుంబంలో ఏకైక సంధాన భాష అవసరం కూడా ఏర్పడింది. ఎలిజర్ బెన్ యెహుదా అనే భాషా శాస్త్రవేత్త ఉండేవారు. ఆయన రష్యాలో పుట్టి పెరిగిన యూదు జాతీయుడు. ప్రపంచ మంతా ఒకే భాష మాట్లాడే రోజు వస్తుందనే అభిప్రాయాన్ని వందేళ్లకు పూర్వమే ఆయన ప్రకటించారు. అయితే అది హిబ్రూ భాష కావాలనేది ఆయన కోరిక. అలాగే సంస్కృతానికి గ్లోబల్ భాషయ్యే లక్షణాలున్నాయనే భాషావేత్తలు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఇప్పటికే ప్రపంచ భాషగా ఇంగ్లిషు చాలాదూరం వెళ్లిపోయింది. ప్రపంచీకరణ, సాంకేతిక పురోగతి, వలసల కార ణంగా ఏర్పడుతున్న సాంస్కృతిక మార్పులన్నీ ఆంగ్లీకరణను వేగవంతం చేస్తున్నాయి. ఉన్నతమైన జీవనాన్ని ఆకాంక్షించే ప్రతి బాలికా బాలుడు, ప్రతి యువతీ యువకుడు గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా దూసు కొనిపోవలసిన అవసరం ఉన్నది. అలా దూసుకుపోవాలంటే మొదటి అవసరం – ఇంగ్లిషు భాషలో ప్రావీణ్యం. రెండో అవసరం – వేగంగా మారుతున్న టెక్నాలజీల మీద పట్టు సాధించడం. మూడోది – గ్లోబల్ మార్కెట్ అవసరాలకు పనికివచ్చే సబ్జెక్టులను అభ్యసించడం. ఈ అవసరాలను మన పిల్లలు ఎలా సమకూర్చుకోగలరు? ఎవరో పెట్టిపుట్టినవారు, కలవారి పిల్లలు మాత్రమే నెరవేర్చుకోగలిగిన కలలుగా ఇవి కనిపిస్తున్నాయి. భారతదేశమంతా కలిపి కేవలం 210 అత్యున్నతస్థాయి ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ఇప్పుడు ఐబీ సిలబస్ను అమలు చేస్తున్నారు. సంపన్నులు మాత్రమే ఆ స్కూళ్ల ఫీజులను భరించగలరు. మనకు అలవాటైన ‘భట్టీయం’ పద్ధతికి భిన్నంగా ఐబీ విద్యాబోధన ఉంటుంది. మన సంప్రదాయ పద్ధతిలో ఇరవై ఎక్కాలు గడగడ చదివేవారు కూడా సాధారణ లెక్కలు చేయలేక పోవడం మనకు తెలిసిందే. భట్టీయం పద్ధతిలో వివేచన, విశ్లేషణ, ఆలోచనలకు అవకాశం తక్కువ. విమర్శనాత్మకంగా ఆలోచించడం, భిన్నంగా ఆలోచించడం, సమస్యను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను ఐబీ పాఠశాలల్లో అలవాటు చేస్తారు. వీటితోపాటు వివిధ రంగాల్లో రాణించేలా ప్రపంచమంతటా ఉపాధి, ఉన్నత విద్యావకాశాలు పొందే విధంగా తర్ఫీదు ఉంటుంది. దేశంలో కేవలం 210 బడుల్లో మాత్రమే ఉన్న ఇటువంటి ఖరీదైన ఐబీ విద్యాబోధనను రాష్ట్రంలోని 40 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ సంవత్సరం ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వచ్చే సంవత్సరం (2025–26) నుంచి ఒకటో క్లాసులో ఐబీ సిలబస్ ప్రవేశపెడతారు. ఏటా ఒక్కో క్లాసు పెంచుకుంటూ వెళ్తారు. 2037 నాటికి ప్లస్ టూ వరకు ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యార్థులంతా ఐబీ సిలబస్లోనే ఉంటారు. ప్రపంచ గమనానికి అనుగుణంగా మన ఉన్నత విద్యా కోర్సులు మారలేదన్నది ఒక వాస్తవం. ప్రభుత్వాధినేతలకు ఉండవలసిన దార్శనికత (విజన్) లేకపోవడం ఒక కారణం. అసలు సంకల్పమే లేకపోవడం మరో కారణం. చంద్రబాబు వంటి పెత్తందారీ నాయకులు అసలు విద్యారంగంలో ప్రభుత్వ జోక్యమే అనవసరమనీ, దాన్ని పూర్తిగా ప్రైవేట్ రంగానికే వదిలి వేయాలనీ బహిరంగంగానే ప్రబోధించారు. అందుకు తగ్గట్టు గానే ప్రభుత్వ విద్యారంగం కుప్పకూలిపోయేవిధంగా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణల ఫలితంగా నాణ్యమైన ప్రపంచశ్రేణి విద్య పేద విద్యార్థులందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్, పెత్తందారీ శక్తులు అందువల్లనే జగన్మోహన్రెడ్డిని అధికారంలోంచి దింపేయడానికి భయంకరమైన కుట్రను రచించాయి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న మన విద్యా ర్థులు ప్రపంచ మార్కెట్లో పోటీపడటానికి అనువుగా వారి పాఠ్యాంశాలు, బోధనా ప్రక్రియలు లేవన్నది నిర్వివాదాంశం. వరల్డ్ క్లాస్ స్థాయికి మన కళాశాలలను తీర్చిదిద్దడానికి చాలా సమయం పట్టవచ్చు. అప్పటివరకు ఏటా బయటకొస్తున్న మన పట్టభద్రులంతా అన్యాయానికి గురికావలసిందేనా? అలా జరగ కూడదన్న లక్ష్యమే ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందానికి కారణమైంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, కొలంబియా. కేంబ్రిడ్జి, ఎమ్ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ వర్సిటీలు అందించే కోర్సులను ఎడెక్స్ ద్వారా మన డిగ్రీ, పీజీ, ఇంజనీ రింగ్ విద్యార్థులకు అందుబాటులోకి తేవడం ఈ ఒప్పందంలోని ప్రధానాంశం. విద్యార్థులకు ఈ కోర్సులు ఉచితంగా అందు బాటులోకి వస్తాయి. కరిక్యులమ్లో భాగమవుతాయి. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చ్యువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రిస్క్ మేనేజిమెంట్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, స్టాక్ ఎక్స్ఛేంజ్, వెల్త్ మేనేజిమెంట్ వంటి ఆధునిక కోర్సుల్లో మన దగ్గర ప్రామాణికత లేదు. ఎడెక్స్ ద్వారా ఇందులో వరల్డ్ క్లాస్ కోర్సులను మన విద్యార్థులకు అందుబాటులోకి తెస్తు న్నారు. ఈ వర్టికల్స్కు సంబంధించిన పరీక్షను ఎంపిక చేసు కున్న గ్లోబల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో నిర్వహిస్తారు. విద్యార్థికి ఆ కోర్సులకు సంబంధించిన క్రెడిట్స్ లభిస్తాయి. గ్లోబల్ మార్కెట్లో ఉపాధి పొందడానికి, ఉన్నతమైన విదేశీ విద్యను అభ్యసించడానికి ఈ క్రెడిట్స్ ఉపకరిస్తాయి. ఈ ప్రయత్నాలు ఇంకో పది పదిహేనేళ్లు నిర్విఘ్నంగా కొన సాగితే మన విద్యార్థులు ప్రపంచ వేదికపై జైత్రయాత్ర చేస్తారు. అత్యున్నత స్థానాలకు ఎగబాకుతారు. వారితోపాటు వారి కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం, దేశం అభివృద్ధి ఫలాలను అందుకుంటాయి. పేదవాడు అభివృద్ధి చెందడం పెత్తందారీ శక్తులకు నచ్చదు. వారి అభివృద్ధిని ఓర్వలేరు. ఇంతటి విప్లవా త్మకమైన ప్రగతిశీలతకు విత్తనాలు చల్లుతున్న శుభఘడియలకు వారి దృష్టిలో ప్రాధాన్యం లేదు. అందుకే అవి వార్తలు కావు. పైపెచ్చు మసిపూయాలి. బురద చల్లాలి. విధ్వంసం జరుగుతున్నదని ఓండ్రపెట్టాలి. అభివృద్ధి ఎక్కడు న్నదని మొరగాలి. మూలశంక వ్యాధి వికారాన్ని సినిమాల్లో ప్రద ర్శించాలి. ఇప్పుడదే జరుగుతున్నది. పేదలకు విజ్ఞాన ఫలాలు అందకూడదు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉండకూడదనే పెత్తందారుల కుట్ర కేవలం వారి స్వార్థం మాత్రమే కాదు. ఇదొక దేశద్రోహ నేరం. దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు. క్రీస్తుశకం రెండో శతాబ్దం నుంచి ఆరేడు శతాబ్దాల మధ్యకాలంలో భారతీయ మేధావులు చేసిన ఆవిష్కరణలు సామాన్యమైనవి కావు. శూన్యాంకాన్ని (జీరో) ప్రసాదించి ప్రపంచ గణితశాస్త్రాన్ని మలుపుతిప్పిన ప్రతిభాశాలి, గ్రహగతు లను, భూభ్రమణాన్ని నిర్ధారించిన మేధావి ఆర్యభట్ట, గణిత ఖగోళ శాస్త్రజ్ఞులైన భాస్కర – బ్రహ్మగుప్త – వరాహమిహిర, వైద్యశాస్త్ర పితామహుడు చరకుడు, సర్జరీ పితామహుడు సుశ్రుతుడు, ఆటమిక్ థియరీని ప్రతిపాదించిన కణాదుడు, తత్వవేత్త – రసవాద శాస్త్రవేత్త ఆచార్య నాగార్జునుడు, ప్రామా ణిక అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు, యోగశాస్త్ర సృష్టికర్త పతంజలి వగైరాలంతా ఆ కాలంలో జీవించినవారే. కానీ ఆనాటి విజ్ఞాన మంతా సంస్కృత భాషకే పరిమితం కావడం, ఆ భాషను నేర్చుకునే అర్హత పిడికెడు మందికే పరిమితం కావడం జాతికి జరిగిన తీరని ద్రోహం. విశాల ప్రజానీకానికి విద్య అందుబాటులో ఉండి ఉంటే, సంస్కృతం నిషిద్ధం కాకపోయి ఉంటే ఈ మేధావుల ఆవిష్క రణలు మరింత ఊర్ధ్వగతి పొందేవి. వందలాదిమంది శాస్త్ర వేత్తలు ఉద్భవించేవారు. పారిశ్రామిక విప్లవం బ్రిటన్ కంటే రెండు మూడు శతాబ్దాల ముందే భారత్లో ప్రభవించేది. మన నెమలి సింహాసనం, మన కోహినూర్ వజ్రం మన దగ్గరే ఉండేవని చెప్పడం చాలా చిన్న విషయం. ఇంకా ఏమేమి జరిగి ఉండేవనేది ఒక అధ్యయనాంశం. ఇప్పుడు కూడా ప్రపంచ భాష ఇంగ్లిష్ నేర్చుకోవద్దనీ, నాణ్యమైన విద్యను అభ్యసించ కూడదనీ పేదవర్గాలను మన పెత్తందార్లు శాసిస్తున్నారు. ఇదే దేశద్రోహం. ఈ దేశద్రోహానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పేద వర్గాల ప్రజలు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో యుద్ధానికి సిద్ధ మవుతున్నారు. పెత్తందారీ – కార్పొరేట్ శక్తులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సకల రాజకీయ పక్షాలను ఏకం చేసి మోహ రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ‘కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగ...’ అన్నట్టు అతివాద మితవాద పార్టీలన్నీ ఎవరి దారిలో వారు ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. పెత్తందార్ల సేవలో తరిస్తున్నారు. చివరికి త్యాగాల చరిత గల పతాకాలనూ అపవిత్రం చేస్తున్నారు. పేదవర్గాలు ఈ పరిణామాలను గమనించాయి. సమరోత్సాహంతో నినదిస్తున్నాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
విద్యా శాఖలోకి ‘పురపాలక’ టీచర్లు
సాక్షి, అమరావతి: ఎంతోకాలంగా నలుగుతున్న పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు బదలాయింపు ఎట్టకేలకు పూర్తయింది. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసును ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖలో విలీనం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నం.7, నగరపాలక సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నం.8, జీవీఎంసీ ఉపాధ్యాయులకు జీవో నం.9, విజయవాడ నగరపాలక సంస్థ ఉపాద్యాయులకు జీవో నం.10 జారీ చేశారు. దీంతో పురపాలక ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశం పూర్తిగా విద్యా శాఖకు అప్పగించినట్టయింది. గతంలో నగర, పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేర్వేరు సర్వీసు నిబంధనలు ఉండేవి. దాంతో వారు ఆ సంస్థ పరిధిలోని పాఠశాలలకు మాత్రమే బదిలీ అయ్యేవారు. ఇకపై జిల్లా యూనిట్గా వారి నియామకాలు, బదిలీలు చేపడతారు. ఈ ప్రక్రియను కూడా పాఠశాల విద్యా శాఖ నిర్వహిస్తుంది. -
లీకు వీరులకు బ్రేక్!
దశాబ్దాలుగా దాదాపు దేశవ్యాప్త జాడ్యంగా వున్న సమస్యకు సమగ్ర పరిష్కారం కోసం తొలి అడుగు పడింది. పోటీపరీక్షల్లో ప్రశ్నపత్రాన్ని లీక్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకొనే బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నేరగాళ్లని తేలితే రూ. కోటి వరకూ జరిమానా, అయిదేళ్ల వరకూ శిక్ష ఉంటాయని బిల్లు చెబుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీకుల్ని అరికట్టేందుకు చట్టాలున్నాయి. అయితే వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉన్నట్టులేదు. కేంద్రం తెచ్చిన చట్టం దాని పరిధిలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎన్టీఏ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్,నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి వర్తిస్తుంది. ఈ నమూనాలో రాష్ట్రాలు కూడా చట్టాలు చేయాలని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చేసిన సూచన మంచిదే. పోటీ పరీక్షల చుట్టూ వేలాదికోట్ల వ్యాపారం నడుస్తోంది. ఒకప్పుడు ప్రధాన నగరాలు కొన్నిటిలో తర్ఫీదిచ్చే సంస్థలు కొలువుదీరేవి. అక్కడ వేలకు వేలు ఖర్చుపెట్టిన లక్షలాదిమంది విద్యార్థులు దర్శనమిచ్చేవారు. ఈమధ్య ఇది చిన్న నగరాలకూ, పట్టణాలకూ కూడా పాకింది. సివిల్ సర్వీసులు మొదలుకొని రాష్ట్రాల్లోని సర్వీసు కమిషన్లు, ప్రభుత్వరంగ సంస్థలు, ఆర్మీ, పోలీసు విభాగాలు నిర్వహించే పరీక్షల కోసం పల్లెసీమల నుంచి సైతం వేలమంది తరలివస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాలు సాధిస్తే జీవితాంతం చీకూ చింతా లేకుండా బతికేయొచ్చని నిరుద్యోగులు కలలు కంటున్నారు. కానీ ప్రశ్నపత్రాలతో వందలకోట్లు దండు కునే ముఠాలు ఈ కలల్ని కొల్లగొడుతున్నాయి. ప్రభుత్వోద్యోగాల భర్తీని ప్రహసన ప్రాయం చేస్తున్నాయి. విజేతలవుతున్నవారిలో ఎవరు సచ్ఛీలురో, ఎవరు కాదో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతోంది. పోటీ పరీక్షల్లో అక్రమాలను అరికట్టే అంశంపై 90వ దశకంనుంచి ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలెట్టాయి. కానీ అవి ఆగిన జాడ లేదు. ఐఐటీ జేఈఈ ప్రశ్నపత్రాలు లీకయినట్టు తొలిసారి 1997లో మీడియాలో కథనాలొచ్చాయి. లక్నోలోని ఒక సంస్థ ఆ ఏడాది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పరీక్షలకు 12 గంటల ముందు తమ విద్యార్థులకు ఆ ప్రశ్నలు అందించినట్టు ఆ కథనాలు తెలిపాయి. ‘ఆఖరి నిమిషం టిప్స్’ ప్రోగ్రాం మాటున తమ దగ్గరున్న 700 మందిలో వందమంది విద్యార్థుల దగ్గర అదనంగా సొమ్ము వసూలు చేసి వారిచేత బట్టీపట్టించిన వైనం అప్పట్లో సంచలనం కలిగించింది. మొదటిరోజున ఒక విద్యార్థి తండ్రి జేఈఈ చైర్మన్కు ఈ సంగతి ఫిర్యాదుచేసినా కుమారుడి వైఫల్యంపై వేదనతో ఆధారం లేని ఆరోపణ చేశారని ఆయన కొట్టిపారేశారు. తమ నిర్వాకంపై ఆయనకు అంత నమ్మకం మరి! కానీ మరుసటి రోజు మ్యాథ్స్ పేపర్ను ఫాక్స్ చేశాక ఆయనకు తత్వం బోధపడింది. కావాలని అక్కడక్కడ చేసిన కొద్దిపాటి మార్పులు మినహా అది తమ ప్రశ్నపత్రాన్నే పోలివుందని గ్రహించి చివరి నిమిషంలో ఆ పరీక్షను రద్దుచేశారు. ఆ లీకేజీకి అప్పటి కాన్పూర్ ఐఐటీ డైరెక్టర్కు వున్న పుత్రప్రేమే కారణమని కథనాలొచ్చాయి. ఆ ఏడాది రూర్కీ ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశపరీక్షపై సైతం ఇలాంటి కథనాలే వెలువడినా అది రద్దు కాలేదు. ప్రశ్నపత్రాలు కైంకర్యం చేసి కోట్లాది రూపాయలు వెనకేస్తున్న మాఫియాతోపాటు కొన్ని సందర్భాల్లో ఉన్నతస్థాయి వ్యక్తులకుండే స్వప్రయోజనాలు, అవతలివారిని రాజకీయంగా దెబ్బతీసే ఉద్దేశాలు కూడా ఈ లీకులకు కారణమైన ఉదంతాలు లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ కేబినెట్లో పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన గాలి ముద్దు కృష్ణమనాయుడు అప్పట్లో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకుకు నైతిక బాధ్యతవహిస్తూ తప్పుకున్నారు. చిత్తూరు జిల్లాలో తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు పార్టీ ప్రముఖ నాయకుడే ఈ లీకేజ్కి ఒడిగట్టారని ఆయన ఆరోపించటం ఎవరూ మరిచిపోరు. ప్రశ్నపత్రాలు సంపాదించే ఉద్యోగార్థుల్లో కొందరు గప్చిప్గా ఉండక సొమ్ము చేసుకోవాలని కక్కుర్తిపడిన సందర్భాల్లో లేదా తమ సన్నిహితులకు అందజేసినప్పుడు మీడియాకు వెల్లడై చాలాసార్లు చౌర్యం బయటపడుతుంటుంది. ఇలాంటివేమీ లేనప్పుడు అంతా సజావుగా సాగిపోతుంది. నిజాయితీపరులైన ఉద్యోగార్థులను లీకేజీ దెబ్బతీస్తుంది. ప్రపంచ దేశాల్లో మనం నవ్వుల పాలవుతాం. గత అయిదేళ్లలో 15 రాష్ట్రాల్లో లక్షా నాలుగువేల ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయనీ, ఇందువల్ల కోటి 40 లక్షలమంది ఉద్యోగార్థుల భవి ష్యత్తు దెబ్బతిందనీ ఒక ఆంగ్ల దినపత్రిక కథనం. ఈ లీకుల పర్యవసానంగా పరీక్ష రద్దు చేసినా, నిరవధిక వాయిదా వేసినా, పట్టించుకోకుండా వదిలేసినా దెబ్బతినేది నిరుద్యోగులే. నిరుడు తెలంగాణ, రాజస్థాన్లలో ప్రశ్నపత్రాల లీకు నిరుద్యోగ ప్రపంచాన్ని ఎంత కలవరపరిచిందో ఎవరూ మరిచిపోరు. అయితే లీకులకు కొన్ని సంస్థలు, వ్యకులను మాత్రమే బాధ్యులుగా చేయడంతో సరి పెట్టక రాజకీయ నాయకులు, ఏజెంట్లు, పోటీ పరీక్షల విభాగాల్లోవుండే అవినీతి అధికారులు వగైరాలతో కూడిన మాఫియా ముఠాలున్నాయని గుర్తిస్తే తాజా చట్టం మరింత కఠినతరం చేయ టానికి అవకాశం వుంటుంది. లీకు సంగతి వెల్లడికాగానే రంగప్రవేశం చేసేలా ఈడీ, సీబీఐ తరహాలో ప్రత్యేక దర్యాప్తు సంస్థలను ఏర్పరచటంవల్ల బాధ్యులను గుర్తించటం వేగవంతమవుతుంది. ఈ కేసుల్లో నిందితుల విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు కూడా అవసరమే. ఇక లీకులవల్ల లబ్ధి పొందే ఉద్యోగార్థులను ఈ చట్టం పరిధినుంచి తప్పించటం ఎంతవరకూ సబబో ఆలోచించాలి. ఈ లీకుల లబ్ధిదారుల్లో సైతం భయభక్తులుంటేనే సమస్యను అరికట్టడం సాధ్యమవుతుంది. -
AP DSC Notification: 6,100 పోస్టులతో డీఎస్సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి డీఎస్సీ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)తో పాటు డీఎస్సీ–2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్ను ఈనెల 12న ఇవ్వనుంది. టెట్, డీఎస్సీకి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ https://cse.ap.gov.in ద్వారా చేసుకోవాలి. ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మొత్తం ప్రక్రియను పూర్తిచేసి, ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని, వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని మంత్రి బొత్స తెలిపారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసినవారికి, గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ను సైతం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వివిధ విద్యా సంస్థల పరిధిలో 6,100 పోస్టులు.. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఆశ్రం), ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లల్లో విద్యపై రూ.73 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో పేదింటి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తే వారు ఉజ్వల భవిష్యత్ను అందుకుంటారో సీఎం వైఎస్ జగన్కు బాగా తెలుసని చెప్పారు. అందుకే ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, టోఫెల్ను అందుబాటులోకి తెచ్చారన్నారు. కొద్దిరోజుల క్రితం ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యార్థుల మేలు కోసం కొత్త నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ అయితే విద్యార్థులకు బోధన సమస్య తలెత్తుతోందన్నారు. కొత్తవారిని నియమించినా విద్యార్థులు అలవాటు పడేందుకు సమయం పడుతోందని వివరించారు. ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్నట్టు గుర్తించామన్నారు. దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులు రిటైర్ అయితే, ఆ విద్యా సంవత్సరం మొత్తం వారినే కొనసాగించే యోచన చేస్తున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒకే టీచర్ బోధన అందుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విధానం కేరళలో అమల్లో ఉందని, త్వరలో దీనిపై విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో టెట్, డీఎస్సీ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు రెండింటినీ ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో ఏర్పాటు చేస్తామన్నారు. డీఎస్సీ రాయాలనుకునే జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయోపరిమితి ఉంటుందని చెప్పారు. ఈసారి డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు నాలుగు దశల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ), టెక్నాలజీ ట్రైనింగ్, టోఫెల్, బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందులో సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేస్తామన్నారు. కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్ష రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పి.భాస్కర్, విద్యాశాఖ జేడీలు మేరీ చంద్రిక, మొవ్వా రామలింగం, డాక్టర్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లు సిటీకి.. చదువులు గాలికి!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నిరోజులుగా కొత్త టీచర్లు కొలువుదీరుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీలేమీ లేకున్నా.. కొత్త నియామకాలేవీ జరగకున్నా.. కొత్త టీచర్లు వస్తుండటంపై తోటి టీచర్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కొత్త టీచర్లంతా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పనిచేయాల్సిన వారు. కానీ డిçప్యుటేషన్లపై పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వచ్చి తిష్టవేస్తున్నారు. తమకు పోస్టింగ్ ఇచ్చిన గ్రామీణ పాఠశాలలో పనిచేయడం ఇష్టం లేకనో, మరేదైనా కారణాలతోనో.. జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈఓలు), పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలోని అధికారులు, రాజకీయ నేతల సహకారంతో ఇలా పట్టణ ప్రాంత బడుల్లోకి మారుతున్నారు. ఈ జిల్లాల పరిధిలో వంద మందికిపైగా టీచర్లు ఇలా డిçప్యుటేషన్లపై ఇతర చోట్లకు వెళ్లినట్టు అంచనా. దీంతో ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో సతమతం అవుతున్న గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధనకు మరింతగా ఇబ్బంది ఎదురవుతోంది. రూ.3 లక్షల దాకా ముట్టజెప్పి.. కోరిన చోటికి డిప్యూటేషన్పై వెళ్లేందుకు కొందరు టీచర్లు.. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలతో పైరవీలు చేయించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు విద్యాశాఖ అధికారులను ఆశ్రయించి డిప్యుటేషన్ పొందుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో టీచర్ రూ.3 లక్షల వరకు ముట్టజెప్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు డీఈఓలు అందినకాడికి వసూలు చేసి, ఇలా డిప్యుటేషన్లు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోపల, శివార్లలోని దగ్గరి ప్రాంతాల స్కూళ్లకు వెళ్లేందుకు అంతకంటే ఎక్కువే చేతులు మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 2న యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం జెడ్పీ హైస్కూల్కు చెందిన ఓ టీచర్ను ఏకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగోల్ జెడ్పీ హైసూ్కల్కు డిప్యూటేషన్పై పంపుతూ యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి అంతర్ జిల్లా డిప్యూటేషన్ ఇచ్చే అధికారం డీఈఓలకు ఉండదు. అయినా ఇలాంటి ఆదేశాలు రావడం గమనార్హం. అయితే రాష్ట్రంలో ఎక్కడా డిప్యూటేషన్లు ఇవ్వలేదని, పాఠశాల విద్య కమిషనరేట్ నుంచి అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చెప్తుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని డిప్యూటేషన్లు ఇలా.. ► రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ జెడ్పీ హైసూ్కల్ నుంచి ఓ ఉపాధ్యాయుడు అబ్దుల్లాపూర్మెట్ మండలం రాగన్నగూడ జెడ్పీహెచ్ఎస్కు డిప్యూటేషన్పై వెళ్లారు. ► మాడ్గుల మండలం అవురుపల్లి జెడ్పీహెచ్ఎస్లో పనిచేయాల్సిన ఓ టీచర్.. చంపాపేట్ జెడ్పీహెచ్ఎస్లో డిప్యూటేషన్పైన విధులు నిర్వహిస్తున్నారు. ► మాడ్గుల మండలం పుట్టగడ్డతండా ప్రాథమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు.. అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇదే మండలం అన్నబోయినపల్లి పాఠశాలకు చెందిన టీచర్.. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ పాఠశాలకు డిప్యూటేషన్పై వెళ్లారు. ► ఇలా మాడ్గుల మండలానికి చెందిన సుమారు ఇరవై మంది టీచర్లు డిప్యూటేషన్లపైన ఇతర మండలాల్లో పనిచేస్తున్నట్టు సమాచారం. ► షాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని దాదాపు 60 మంది టీచర్లు.. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో దాదాపు 12 పాఠశాలల్లో టీచర్లెవరూ లేరని సమాచారం. మానవతా దృక్పథంతో చేస్తున్నాం.. పక్షవాతం, కేన్సర్ తదితర వ్యాధుల బాధితులు, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల జీవిత భాగస్వాములు వంటి వారి డిప్యూటేషన్లను అనుమతిస్తున్నాం. అలాంటి వారు ఎవరున్నా దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్తున్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి దరఖాస్తులను మానవతా దృక్పథంతో ఆమోదించి పోస్టింగ్లు ఇస్తున్నాం. విద్యాశాఖ కమిషనర్ నుంచి వస్తున్న ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. – బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఒక్క డిప్యూటేషన్ కూడా ఇవ్వలేదు డిప్యూటేషన్లు, బదిలీలకు సంబంధించి నేను ఎక్కడా సంతకాలు చేయలేదు. నాకు ఎలాంటి సంబంధం లేదు. గత మూడున్నరేళ్లలో నేను ఒక్క ఆర్డర్పై కూడా సంతకం చేయలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అమలు చేస్తా. – దేవసేన, విద్యాశాఖ కమిషనర్ -
ఇతర రాష్ట్రాలకు నమూనాగా ఏపీ విద్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న జనవరి 30న ఒకటవ తరగతి నుంచే ఐబీ సిలబస్తో పాఠశాల విద్యను ప్రారంభించడానికి ఒక అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంగ్లిష్ మీడియంలో ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రపంచ ప్రమాణాలకు అనుసంధానం చేయడంలో ఇది మరో ప్రధాన అడుగు. విద్యార్థులు దీంతో ఉమ్మడి సర్టిఫికెట్ పొందుతారు. విజ్ఞాన భారత్ను నిర్మించడంలో భాగంగా, ఏపీ ప్రభుత్వం అసాధారణ రీతిలో పాఠశాల విద్యపై దృష్టి సారించిందన్న విషయం, గణతంత్ర దినోత్సవం నాడు ప్రదర్శించిన రాష్ట్ర శకటంలో ప్రతిఫలించింది. గ్రామీణ పాఠశాల విద్య నుండి ప్రపంచ స్థాయి తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులను సృష్టిస్తుందని ప్రపంచానికి చాటడానికి ప్రదర్శించిన అత్యంత గొప్ప భవిష్యత్ శకటం ఇది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్లో, ‘పాఠశాల విద్య పరివర్తన’ థీమ్తో ఒక శకటాన్ని ప్రపంచ, జాతీయ నాయకత్వం ముందు ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త దృక్పథాన్ని చూపించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాడుతూ, నృత్యాలు చేస్తూ శకటం వెంట కదిలారు. అధికారులు సృజనాత్మకంగా నిర్మించిన ఆ శకటాన్ని పరేడ్లో ఉంచడానికి ఏపీ ముఖ్యమంత్రికి ధైర్యం, విశ్వాసం అవసరం. దాన్ని వీక్షించిన అంతర్జాతీయ, జాతీయ వీక్షకులు చాలా ఉత్సా హంగా చప్పట్లు కొట్టారు. ఎందుకంటే ఇది ఇతర రాష్ట్ర శకటాల కంటే ఒక ప్రధాన వ్యత్యాసాన్ని కనబర్చింది. ‘సకల విద్యలకు మేమే సాటి / విశ్వ విద్యకు మేమే పోటీ’ అంటూ పిల్లలు పాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లల కోసం అందిస్తున్న ఇంగ్లిష్ మీడియం విద్యా నాణ్యత గురించి ఈ పాట చెబుతుంది. తమ పాఠశాల యూనిఫారంలో నిల బడి ఉన్న విద్యార్థులు వారి టాబ్లెట్లు, ద్విభాషా పుస్తకాలను చూపు తున్నారు. ఉపాధ్యాయులు నైపుణ్యాలను, జ్ఞానాన్ని నేర్చుకోవడంలో వారికి సహాయం చేస్తున్నారు. భారతదేశం తన గ్రామీణ పాఠశాల విద్య నుండి ప్రపంచ స్థాయి తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులను సృష్టిస్తుందని ప్రపంచానికి చాటడానికి ప్రదర్శించిన అత్యంత గొప్ప భవిష్యత్ శకటం ఇది. గణతంత్ర దినోత్సవ అతిథిగా వచ్చిన ఫ్రా¯Œ ్స అధ్యక్షుడు మెక్రాన్ దానిని ఆసక్తితో చూశారు. పాఠశాల విద్యకు సంబంధించిన పరివర్తన సందేశం గురించి ఒక అనువాద కుడు ఆయనకు వివరించడం కనిపించింది. గత 74 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రిపబ్లిక్ డే పరేడ్లలో ఇలాంటి వినూత్న పాఠశాల విద్యా నమూనాను ప్రదర్శించలేదు. నాణ్యమైన విద్య కాకపోయినా, అక్షరాస్యత రేటును చూపించడానికి ధైర్యం చేయగల ఏకైక రాష్ట్రం కేరళ కూడా ఇన్నేళ్లుగా తమ పాఠశాల విద్యా విజయాన్ని ఏపీ ప్రభుత్వం రీతిలో జరుపుకోవాలని అనుకోలేదు. వాస్తవానికి, ప్రతి అధికార రాజకీయ పార్టీ తన పనితీరు, విధాన కార్యక్రమం ఆధారంగా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుంది. కానీ పాఠశాల మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన కొత్త ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య, గ్లోబల్ పవర్ హౌజ్గా మారాలని భావిస్తున్న ప్రజాస్వామ్యంలో హృదయాన్ని కదిలించే విషయం. నాణ్యమైన పాఠశాల విద్య అనే ఆలోచనను జగన్ ప్రైవేట్ నుంచి పబ్లిక్గా మార్చారు. మారుమూల గ్రామాల్లోని పేద పిల్లలు తమ సొంత గ్రామంలోని పాఠశాలల్లో ఆధునిక ప్రపంచ నైపుణ్యాలను నేర్చుకుంటూ ఆత్మవిశ్వాసంతో, గౌరవంగా జాతీయ, ప్రపంచ మార్కెట్లలోకి రావాలని ఆశపడుతున్నారు. జగన్ తన ముందున్న అభివృద్ధి నమూనాకు విరుద్ధంగా ఈ అభివృద్ధి నమూనాను ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు సింగపూర్ వంటి రాజధాని నగరం నిర్మించడానికి 30,000 ఎకరాల భూమిని సమీకరించడంలో రాష్ట్ర వనరులను పెట్టుబడిగా పెట్టారు. ప్రభుత్వ రంగాన్ని ఏమాత్రం పట్టించుకోని ప్రైవేట్ రంగ పెట్టుబడి నమూనాయే ఆయన నమూనా. విద్యా రంగంలో కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆయన ప్రోత్సహించారు. ఏపీ శకటం ఇతర రాష్ట్ర శకటాలతో పోలిస్తే భిన్నంగా ఉంది. గత వైభవం, స్వాతంత్య్ర పోరాట చిహ్నాలు, మతపరమైన చిహ్నాలు లేదా వారి గిరిజన, సాదాసీదా జీవన స్త్రీలను మిగతా రాష్ట్రాలు ప్రదర్శించాయి. ఈ ఏడాది రిపబ్లిక్ పరేడ్ కవాతును దేశంలో మహిళా సాధి కారతను ప్రత్యేకంగా ప్రదర్శించడానికి ఉద్దేశించారు. సైన్యంలోని అన్ని విభాగాల్లో, ఇస్రో వంటి వైజ్ఞానిక కార్యకలాపాలలో, ప్రతి రంగంలో దేశం మహిళలను ఎలా ప్రోత్సహిస్తోందో ప్రపంచానికి చూపించడానికి దీన్ని రూపొందించారు. అంతరిక్ష శాస్త్రంలో తన సొంత మహిళా శక్తిని ‘ఇస్రో’ తన శకటంలో ఉంచింది. ఆ రకంగా అది దాని సొంత భవిష్యత్తు యోగ్యతను కలిగి ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ (రామ్ లల్లాపై తన శకటాన్ని రూపొందించింది) వంటివి తమ సాంప్రదాయ నృత్యం చేసే మహిళలతో తమ శకటాలను రూపొందించాయి. కానీ ప్రపంచీకరణ యుగంలో ఆధునికమైన, చక్కగా అమర్చిన ఇంగ్లిష్ మీడియం విద్యతో, పాఠశాల విద్యను ఈ దేశ భవిష్యత్తుగా చూపిన ఏకైక రాష్ట్రం ఏపీయే. ఇప్పటికీ అర్ధ–మధ్యయుగ జీవన వ్యవస్థలతో వేలాడుతున్న గిరిజన (ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ మొదలైనవి) లేదా గిరిజనేతర మహి ళల భవిష్యత్తు సవాళ్లు ఏమిటో ఆ యా రాష్ట్రాలు చూపలేదు. ముస్లిం మహిళల స్థితిగతులు ఏమిటో ఏ శకటమూ చెప్పలేదు. కశ్మీర్ నుంచి కనీసం అలాంటి ఒక్క శకటాన్నయినా తేవాల్సింది.రాష్ట్ర చరిత్రను చూపించడం ఒక విషయం; పిల్లలకు చక్కగా, ప్రణాళికాబద్ధమైన విద్యనుఅందించడం ద్వారా దేశ భవిష్యత్తును చూపించడం మరొక విషయం. ఆంధ్రప్రదేశ్ దీనిని స్పష్టమైన విజన్ తో చేసింది. ఏపీ శకటం కదులుతుండగా ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని జాగ్రత్తగా గమనించారు. ఆయన సొంత గుజరాత్ మోడల్ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అంత బాగా అందించలేకపోయింది. గుజరాత్ కూడా ఇప్పుడు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య కోసం ప్రైవేట్ పాఠ శాలలపై ఆధారపడుతోంది. అది కూడా ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంది. భారతదేశం పాశ్చాత్య దేశాలతో, చైనాతో పోటీ పడాలని ఆకాంక్షిస్తున్నప్పుడు, తమ సొంత ప్రాంతీయ భాషలో చక్కటి పునాది కలిగివుండి, ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందించడమే ఏకైక మార్గం. జగన్ మోహన్ రెడ్డి చైతన్యపూర్వకమైన ప్రయత్నంతో నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యపై ఆంధ్రా విద్యార్థులకు విశ్వాసం ఏర్పడింది. ఇప్పుడు దాన్నే వైఎస్ జగన్ తన ఎన్నికల ఆయుధంగా మలుచుకున్నారు. ఆ ఆలోచనతోనే ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్లో పాఠ శాల విద్యా శకటాన్ని ప్రదర్శింపజేశారు. పాఠశాల విద్యలో కేంద్రం లేదా రాష్ట్రం ఏదైనా పెద్ద సానుకూల అడుగు వేసిందంటే తప్పనిసరిగా అభినందించాలి. దేశ భవిష్యత్తు అక్కడే ఉంది. సైద్ధాంతిక విభేదాలు ఏ విషయంలోనైనా ఉండవచ్చు, కానీ ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా నాణ్యమైన పాఠశాల విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించడంలో కచ్చితంగా విభేదాలు ఉండ కూడదు. అప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తుకు ఎదురుదెబ్బ తగ లదు. ఏ పిల్లవాడు అయినా రెండు భాషలను చాలా సులభంగా నేర్చు కోగలడు. మన విషయంలో అది ఇంగ్లిష్, పిల్లల ప్రాంతీయ భాష అయి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రా విద్యా నమూనాను అర్థం చేసుకుంటుందని, అభినందిస్తుందని ఎవరైనా ఆశిస్తారు. - వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
ప్రభుత్వ బడుల్లో ‘ఐబీ’ విద్య అమలుకు ఒప్పందం
భావి తరాలకు నాణ్యమైన విద్య అందించడం ఎంతో ముఖ్యం. భవిష్యత్తు తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, ప్రపంచంలో నంబర్వన్గా నిలవాలన్నా నాణ్యమైన విద్యే కీలకం. – ఐబీతో ఒప్పందంలో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ విద్యా బోధన దిశగా కీలక ఘట్టం పూర్తి అయ్యింది. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ అంటోన్ బెగుయిన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలి పెక్కా హీనోనెన్ ఈ కార్యక్రమంలో జెనీవా నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలో ఐబీని భాగస్వామ్యం చేయడం గొప్ప సంతృప్తినిస్తోందన్నారు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైందని, ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమంగా అభివర్ణించారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కా, ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ పరిస్థితి ఇక మారుతుంది: సీఎం జగన్ భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అత్యవసరమని, ఇప్పుడున్న విధానాలను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ చెప్పారు. సాంకేతికత, పాఠ్య ప్రణాళిక తదితర అంశాలను అప్గ్రేడ్ చేయాలన్నారు. సమస్యా పూరణ సామర్థ్యం, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మోడల్లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వినియోగం లాంటివి చాలా కీలకమని, ఐబీ ద్వారా ఇది సాధ్యమన్నారు. ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైందని, రానున్న విద్యా సంవత్సరంలో టీచర్లకు, సిబ్బందికి ఐబీ విధానాలపై శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. ఐబీ విద్య సంపన్నులకు మాత్రమే అనే పరిస్థితి ఇప్పుడు మారుతుందని వ్యాఖ్యానించారు. పేదలకు, అణగారిన వర్గాలకూ ఇకపై ఐబీ బోధన అందుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలై 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి పన్నెండో తరగతుల్లో ఐబీ బోధన ప్రారంభమవుతుందని తెలిపారు. ఎస్సీఈఆర్టీ, ఐబీ భాగస్వామ్యంతో విద్యా బోధన కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందన్నారు. ఇతర దేశాలకు ఈ ఒప్పందం స్ఫూర్తి: ఓలి పెక్కా తమది లాభాపేక్ష లేని సంస్థ అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై చాలా నిబద్ధతతో ఉన్నామని ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలి పెక్కా హీనోనెన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. విద్య ద్వారా ఉత్తమ ప్రపంచాన్ని, శాంతియుత సమాజాన్ని నిర్మించాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇంత పెద్దస్థాయిలో తమ సంస్థ భాగస్వామ్యం కావడం ఇదే ప్రథమమని, ఇతర దేశాలకు, ప్రాంతాలకు ఈ ఒప్పందం ఒక స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. దీనిద్వారా భారత్తో విద్యారంగంలో తమ సంబంధాలు మరింత మెరుగుపడతాయని, నాణ్యమైన విద్యకోసం ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య మంచి వాతావరణాన్ని కల్పించి సామర్థ్యాలను పెంచుతామన్నారు. పిల్లలు, స్కూళ్లు, తల్లిదండ్రులు, యూనివర్శిటీలతోనూ తమ సంబంధాలు మెరుగుపడతాయన్నారు. ఏపీలో కొత్త తరహా విద్యా విధానంలో తొలుత ప్లే బేస్డ్ లెర్నింగ్ విధానంతో పిల్లల్లో ఆసక్తిని కలిగించేందుకు ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్తో పాటు మాతృ భాషల్లోనే కాకుండా పిల్లలు విదేశీ భాషలను నేర్చుకోవడంపైనా దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. దీనివల్ల పిల్లల్లో కొత్త సామర్థ్యాలు అలవడతాయన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ, సింగపూర్, ఎస్తోనియా, ఫిన్లాండ్, కెనడా దేశాల్లోని విద్యామంత్రులతో ఇటీవల నాణ్యమైన బోధన, అభ్యాసాలపై చర్చించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్.జవహర్రెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (ఇన్ఫ్రా) కాటమనేని భాస్కర్, సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ(మిడ్ డే మీల్స్) డైరెక్టర్ ఎస్.ఎస్.శోభిక, ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఐబీ భాగస్వామ్యంపై జీవో పాఠశాల విద్యలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలుకు అనుగుణంగా ఎస్సీఈఆర్టీలో ఐబీ భాగస్వామ్యంపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం జీవో నంబర్ 5 జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో భవిష్యత్ సాంకేతికత, సిలబస్, బోధన, సదుపాయాలు తదితర అంశాలపై ఐబీ ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు. 21 మంది ఐబీ ప్రతినిధుల బృందం వచ్చే నెల రోజుల్లో 40 పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాలను పరిశీలించి అధ్యయనం నిర్వహిస్తుంది. ఎగ్జామినేషన్ విధానాలను సైతం పరిశీలించి మార్పుచేర్పులపై సూచనలు చేస్తారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు శిక్షణ, సిలబస్పై సూచనలు ఇచ్చేందుకు ఎస్సీఈఆర్టీలోని 19 మంది నిపుణులతో పాటు ఐబీకి చెందిన 26 మంది నిపుణులు చర్చించనున్నారు. మొత్తం ప్రక్రియను 2025 మే నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధనను ప్రవేశపెట్టనున్నారు. -
ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో సీఎం జగన్
తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రెండో సారి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటించారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నానని సీఎం జగన్ చెప్పారు. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామన్న సీఎం జగన్.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామని, మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమని చెప్పిన సీఎం జగన్... కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని, విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినట్టే.. తమ కుటుంబాన్ని కూడా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ చెప్పినదాంట్లో ముఖ్యాంశాలు పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టి పెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం నేను ఏ హామీ ఇచ్చాను, ఏం చేశాను అన్నది చూడాలి మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.4 శాతం అమలు చేశాను అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.? సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా? వాటిని చూసి కన్విన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి పెద్దగా లేదు పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం: కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుంది అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించాలనుకుంది అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు నేను కాంగ్రెస్నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు వారు పాఠాలు నేర్వలేదు కాంగ్రెస్ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు ఇండియాటుడే తరపున రాజ్దీప్ ప్రశ్నలు, ముఖ్యమంత్రి జగన్ సమాధానాలు సవివరంగా.. రాజ్దీప్ : తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో విద్యపై సదస్సు నిర్వహించడం సంతోషకరం, చదువుతో వచ్చే మార్పు ఏంటన్నది కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ మార్పే చోటు చేసుకోబోతుంది. ఏపీలోని అత్యంత సామాన్య విద్యార్థులు అమెరికాలోని వాషింగ్టన్ డీసీని పర్యటించడం గొప్ప విషయం సీఎం జగన్ : ఇండియా టుడే జర్నలిస్టులు తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాలలు చూడడం గొప్ప విషయం పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలి పేదలు చదివేది ఒకటయితే, ధనిక పిల్లలు చదివేది మరొకటి పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది, ధనిక పిల్లలు ఇంగ్లీషులో చదివేవారు రాజ్దీప్ : మూడో తరగతి నుంచే గ్లోబల్ ఎగ్జామ్ టోఫెల్ లాంటిపై అవగాహన కల్పించేలా చేసిన మార్పులపై విమర్శలొచ్చాయి. తెలుగు మీడియంలోనే బోధించాలని విమర్శలు చేశారు కదా.? సీఎం జగన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? నన్ను, ప్రభుత్వ విధానాలను విమర్శించే ముందు మీ విధానాలను ప్రశ్నించుకోండి రాజ్దీప్ : అకస్మాత్తుగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు పాఠశాల మానేసే ప్రమాదం లేదా? సీఎం జగన్ : ఇలా జరక్కుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్ పెట్టాం. మా బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్ అంశాలను చేర్చాం. పాఠశాలలు అన్నింటిలోనూ సౌకర్యాలు మెరుగుపరిచాం. ఒక విధంగా చెప్పాలంటే సమగ్ర ప్రణాళికతో వీటిని అమల్లోకి తెచ్చాం. నాడు-నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం. 62వేల తరగతి గదులుంటే .. 40 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరుకల్లా మిగతా చోట కూడా పూర్తవుతాయి. టీచర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా ప్రణాళికకు ఒక సమగ్ర రూపం తీసుకొచ్చాం. 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక ఆధునికమైన టాబ్ నేర్చుకునేందుకు అందించాం. రాజ్దీప్ : 8వ తరగతి విద్యార్థికి టాబ్ ఇచ్చారా? కోవిడ్ సమయంలో తగిన సాధన సంపత్తి (టీవీలు, మొబైళ్లు, టెక్నాలజీ) లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు? ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా.? వచ్చే మూడేళ్లలో పదో తరగతి విద్యార్థులందరికీ టాబ్లు ఉంటాయని నమ్మకంగా చెప్పగలరా? సీఎం జగన్ : 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టాబ్లున్నాయి. డిసెంబర్ 21న టాబ్లు ఇచ్చాం. నా పుట్టిన రోజు నాడు నేనే తరగతి గదికి వెళ్లి పిల్లలను కలిసి వాళ్లకు టాబ్ అందజేస్తాం. రాజ్దీప్ : ప్రభుత్వాల్లో పనులు అంత వేగంగా జరగవని చెబుతారు, మీరు మీ యంత్రాంగాన్ని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నారా? IB సిలబస్ కూడా ప్రవేశపెట్టారా? అది కేవలం కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంది కదా.? అయితే ఇదంతా తొందరపడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. తల్లితండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మంచి అవకాశం ఎలా వచ్చిందని.? సీఎం జగన్ : ఐబీ సిలబస్ మన రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో చేతులు కలిపింది. IB అన్నది ప్రస్తుతం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. జూన్ 2025 తర్వాత మొదటి తరగతిలో IB సిలబస్ ప్రవేశపెడతాం. అక్కడి నుంచి దశలవారీగా ఏడో తరగతి వరకు ప్రవేశపెడతాం. ఐదేళ్ల తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్ సర్టిఫెకెట్ కోసం పోటీ పడతారు. ఈ ప్రయత్నం ఎందుకంటే.. విద్యలో నాణ్యత అనేది చాలా ముఖ్యం. అదే లేకుంటే మా రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేరు కదా.. ఈ పోటీలో కేవలం ధనికులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉండకూడదు, అణగారిన వర్గాల వారికి కూడా అవకాశం దక్కాలి రాజ్దీప్ : అది గొప్ప దార్శనికతే. గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన విద్యార్థి పోటీ పడాలన్న ఆలోచన మంచిదే. కానీ విద్యార్థులకు మంచి బోధన అందించేందుకు నాణ్యమైన ఉపాధ్యాయులు ఉన్నారనుకుంటున్నారా? సీఎం జగన్ : ఒక మంచి ఆలోచనకు మావంతు ప్రయత్నం జోడిస్తున్నాం. IB, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. IBతో చర్చలు జరిపి మాతో కలిసి పని చేసేలా వారిని ఒప్పించాం. ఇందుకు వారిని అభినందిస్తున్నాను. ఫలితంగా IB తన అధికారిక కార్యాలయాన్ని SCERTతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తోంది. ఇది విప్లవాత్మకమైన మార్పుకు నాంది. 2035 నాటికి IBలో చదువుకున్న విద్యార్థులు పదో తరగతిలో ప్రవేశిస్తారు. ఈ లక్ష్యంతోనే మేం పని చేస్తున్నాం. రాజ్దీప్ : ఈ పన్నెండేళ్ల ప్రాజెక్టులో IB తో కలిసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నది మీ ఆలోచనా? దీనికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి, తగినన్ని మీ దగ్గర నిధులున్నాయా? సీఎం జగన్ : ముందు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ.. చిన్న నుంచి పెద్ద తరగతుల వారికి IB బోధన ఇస్తున్నాం ఆ తర్వాత 11, 12 తరగతుల వరకు IB సిలబస్ బోధన అందుతుంది ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అన్న విషయం IBకి కూడా తెలుసు. వాళ్లు కూడా ప్రభుత్వంలో భాగమైనందున.. మిగిలిన వారి వద్ద తీసుకునే స్థాయిలో రాయల్టీలాంటివి ఉండకపోవచ్చు. అట్టడుగు స్థాయి విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించవచ్చన్నది ప్రపంచానికి తెలిపేందుకు ఏపీ ప్రభుత్వం, IB కలిసి చేస్తున్న ప్రయత్నం ఇది. ఇక నిధుల విషయానికొస్తే.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.14వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇప్పటివరకు రూ.8200 కోట్లను ఖర్చు పెట్టాం. నాడు-నేడు తొలిదశలో భాగంగా మొత్తం 44వేల పాఠశాలల్లో 15వేల పాఠశాలలు పూర్తయ్యాయి. రెండో దశలో భాగంగా 16వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి రెండో దశ పూర్తవుతుంది. వచ్చే ఏడాది మిగిలిన పాఠశాలల్లో పనులు చేపడుతాం. రాజ్దీప్ : 2018లో ఏపీలో పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల శాతం 84.48, ఆ ఏడాది జాతీయ సగటు 99.21. ఈ పరిస్థితుల్లో డ్రాపవుట్లను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు? జగనన్న అమ్మ ఒడిలా నేరుగా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తారా? ఆ డబ్బును పిల్లల చదువుకు ఖర్చు పెట్టేలా చూస్తారా? సీఎం జగన్ : మేం పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అట్టడుగున ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మధ్యాహ్నా భోజన పథకాలు, అమ్మ ఒడి లాంటి వాటి సాయంతో డ్రాప్ అవుట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. మా రాష్ట్రంలో అమలవుతోన్న మధ్యాహ్న భోజన పథకం చాలా వినూత్నమైంది. గోరు ముద్ద పేరుతో ఇస్తోన్న ఈ పథకంలో ఒక్కో రోజు ఒక్కో మెనూతో పౌష్టికాహరం అందిస్తున్నాం. అవసరమయితే రాష్ట్రంలోని ఏ పాఠశాలకైనా మీరు వెళ్లి పరిశీలించుకోవచ్చు. రాజ్దీప్ : ఈ పథకాల అమలును ఎలా పర్యవేక్షిస్తున్నారు? గతంలో ప్రభుత్వాలు పాఠశాలలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కదా.? నాకిపుడు అర్థమైంది మీరు ఢిల్లీలో ఎందుకు తక్కువ సమయం గడుపుతారన్నది అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గతంలోనూ ఒక సమస్య ఉండేది, ఈ రాష్ట్ర యువతకు నిరుద్యోగం సమస్య ఎక్కువ. ఒక దశలో 35% దాకా ఉండేది. ఈ నేపథ్యంలో వీరికి నైపుణ్యాలు అందించడం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం ఒక సవాలేనా? సీఎం జగన్ : ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చూస్తోంది. నేనే స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తున్నాను. కలెక్టర్లతో నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాను. మేం పాఠశాల విద్య మీద మాత్రమే కాదు ఉన్నత విద్యపైనా దృష్టి పెట్టాం. ఉద్యోగాలకు అవసరమైనట్టుగా బోధనాంశాల్లో మార్పులు చేశాం. మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో భాగంగా ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేశాం. అన్ని డిగ్రీలను నాలుగేళ్లు చేస్తున్నాం, ఆన్లైన్ కోర్సులు ఇస్తున్నాం. ఇందులో భాగంగానే త్వరలో ఎడెక్స్తోనూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. పిల్లలు ఆన్లైన్లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్తో ఒప్పందం చేసుకున్నాం బీకాం నేర్చుకునేవారికి అసెట్ మేనేజ్ మెంట్ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం: ------------- విద్యారంగంలో ఏపీ కొత్త ఒరవడి 5.12pm, జనవరి 24, 2024 విద్యా రంగంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ఇంట్రో ఏపీలో విద్యారంగంలో సమూల మార్పులు, విద్యా రంగంలో ఆంధ్ర మోడల్, కొత్త ఒరవడి సృష్టించిన సీఎం జగన్ ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్కు సీఎం జగన్ 5.11pm, జనవరి 24, 2024 ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ చర్చ తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ 5.10pm, జనవరి 24, 2024 మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సీఎం జగన్ తిరుపతిలోని ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ Updates: ►ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం జగన్ ►ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానం, మన బడి నాడు - నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, టోఫెల్ శిక్షణ మొదలైన అంశాలపై చర్చ ►దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానంపై ఇండియా టుడే సమ్మిట్ ప్రతినిధులు ప్రశంస ►రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►మరి కొద్దిసేపట్లో తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్కు హాజరుకానున్న సీఎం జగన్ ►తిరుపతి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొననున్న సీఎం సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడే జరిగే ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో తెలియజేసింది. బుధవారం సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి సీఎం జగన్ తిరుపతికి( Tirupati ) బయలుదేరతారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తాజ్ హోటల్కు వెళ్తారు. అక్కడ జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి ప్రయాణం అవుతారు. సీఎం రాక నేపథ్యంలో.. తిరుపతిలో అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. -
ఈయన మాటలు వింటే చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటాడో
-
స్మార్ట్ ఫోన్లా ట్యాబ్లను వాడలేరు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు టెక్నాలజీ విద్యను చేరువ చేస్తూ ఉచితంగా అందించిన బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్ల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ ఐటీ సెల్ డిజిటల్ ఇనీషియేటివ్స్ రాష్ట్ర నోడల్ అధికారి సీహెచ్వీఎస్ రమేష్కుమార్ చెప్పారు. గురువారం గుంటూరులో ట్యాబ్ల యాక్టివేషన్పై ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రమేష్కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లను స్మార్ట్ఫోన్లా ఉపయోగించేందుకు ఆస్కారం లేదని, ప్రీ లోడెడ్ యాప్స్ను గూగుల్ సంస్థ ద్వారా బ్లాక్ చేయించినట్లు తెలిపారు. బైజూస్ కంటెంట్తో కూడిన యాప్తో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన స్విఫ్ట్చాట్, ఈ–పాఠశాల, డ్యూలింగో, డిక్షనరీ యాప్లు మినహా మరే ఇతర యాప్లు ట్యాబ్లు ఉండవని స్పష్టం చేశారు. ఇంటర్నెట్తో పనిలేకుండా బైజూస్ కంటెంట్ను విద్యార్థులు చూడవచ్చని.. మిగిలిన 4 యాప్స్ను చూడాలంటే పాఠశాలల్లోని వైఫై ద్వారా కనెక్ట్ కావాలని చెప్పారు. సిమ్కార్డ్ స్లాట్ను బ్లాక్ చేశామని, 256 జీవీ సామర్ధ్యం కలిగిన ఎస్డీ కార్డు ద్వారా 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్లో అన్ని పాఠ్యాంశాలను లోడ్ చేశామని తెలిపారు. డ్యూలింగో యాప్ ద్వారా విద్యార్థులు విదేశీ భాషలు నేర్చుకోవచ్చన్నారు. స్విఫ్ట్ చాట్ యాప్ ద్వారా విద్యార్థి ఏ సబ్జెక్టుకు సంబంధించిన సమాచారాన్నైనా తెలుసుకోవచ్చని.. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు.. ట్యాబ్లలో ఇన్బిల్ట్గా ఉన్న మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా విద్యార్థుల ట్యాబ్లను ఐటీ సెల్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రమేష్కుమార్ చెప్పారు. ట్యాబ్లలో ఆధునిక భద్రతా వ్యవస్థ ఇమిడి ఉందన్నారు. ఈ ట్యాబ్లను విద్యార్థులు, ఉపాధ్యాయులు మినహా ఇతరులెవ్వరూ వినియోగించేందుకు అవకాశం లేదన్నారు. బ్లాక్ చేసిన యాప్లను అన్లాక్ చేసేందుకు సెల్ఫోన్ షాపులవాళ్లు, ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. దీనిపై అన్ని జిల్లాల ఎస్పీలకు ప్రభుత్వం సమాచారం చేరవేసిందని తెలిపారు. విద్యార్థులు ట్యాబ్లలో ఏ సబ్జెక్టు ఎంతసేపు చూశారనే సమాచారం కూడా నమోదవుతుందని వివరించారు. సర్వీస్ సెంటర్ల ద్వారా ఉచిత సేవలు ట్యాబ్లలో ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే.. ఆ సంస్థ సర్వీసు సెంటర్ల ద్వారా ఉచిత సేవలు పొందవచ్చని రమేష్కుమార్ చెప్పారు. పని చేయని ట్యాబ్ను సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కు అందిస్తే, వాళ్లు ఆన్లైన్లో నమోదు చేసి టోకెన్ ఇస్తారని పేర్కొన్నారు. అనంతరం ఆ ట్యాబ్ను సర్వీసు కేంద్రానికి పంపించి.. బాగు చేయించి మూడు రోజుల వ్యవధిలో తిరిగి అందజేస్తారని చెప్పారు. ట్యాబ్ కింద పడినా పాడవకుండా సురక్షితమైన కవర్ కేస్తో పాటు స్క్రీన్ గార్డు, చార్జర్, ఇయర్ ఫోన్ అందిస్తున్నట్లు చెప్పారు. -
7, 10 తరగతులకు ‘ఈఈఎంటీ’ ప్రతిభా పరీక్ష
సాక్షి, అమరావతి: విద్యార్థుల్లో ప్రతిభను పోత్సహించేందుకు ఎడ్యుకేషనల్ ఎపిఫనీ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ‘ఈఈఎంటీ–2024’ (ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్) పరీక్ష తోడ్పడుతుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఈఈఎంటీ షెడ్యూల్ను మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10 తరగతి విద్యార్థులకు గత 11 సంవత్సరాలుగా ఆన్లైన్లో ఈ ఉచిత టెస్ట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. పిల్లల్లో ప్రతిభా పాటవాలను వెలికి తీసేలా ఈ పోటీలు ఉంటాయన్నారు. జనవరి 23న ప్రిలిమనరీ, 31న మెయిన్స్ పరీక్ష ‘కోడ్ తంత్ర’ సాఫ్ట్వేర్ ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం నుంచి జనవరి 8వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. 162 మంది విజేతలకు రూ.9 లక్షల బహుమతులు 7, 10 తరగతుల్లో డిసెంబర్ వరకు పూర్తయిన సిలబస్పై 80 శాతం ప్రశ్నలు, జనరల్ నాలెడ్జిపై మరో 20 శాతం ప్రశ్నలు ఉంటాయి. కాగా, ఈ పోటీల్లో మొత్తం 162 మంది విజేతలకు దాదాపు రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. మరో 1,752 మందికి మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు ప్రకటించారు. ఏడో తరగతిలో రాష్ట్ర స్థాయి మొదటి విజేతకు రూ.20 వేలు, రెండో విజేతకు రూ.15 వేలు, మూడో విజేతకు రూ.10 వేలు బహుమతిగా అందిస్తారు. ఈ పరీక్షకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి, ఎపిఫనీ సంస్థ ప్రతినిధి డి.నభీ కోఆర్డినేటర్లుగాను, వి.ఎస్.సుబ్బారావు పరీక్షా కన్వీనర్గా వ్యవహరిస్తారు.https:// educationalepiphany.org/eemt 2024/registration.php లింక్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పూర్తి వివరాలకు https:// educationalepiphany.org/ వెబ్సైట్లో గాని, 96667 47996 నంబర్లోగాని సంప్రదించి తెలుసుకోవచ్చు. ఈ సమావేశంలో ఎడ్యుకేషనల్ ఎపిఫనీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తవనం వెంకటరావు, ఉపాధ్యక్షుడు హేమచంద్ర, కన్వీనర్ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. -
Fact Check: వాస్తవాలు దాచిపెట్టి ట్యాబ్లపై విష ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లల్లో విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చిందని.. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు పేద విద్యార్థులకు జరుగుతున్న మేలుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్స్ ఆన్లైన్లో తక్కువ ధర లభిస్తున్నా.. అధిక ధరకు కొనుగోలు చేశారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపింది. ట్యాబ్ కొనుగోలులో రూ.1,200 కోట్లు అవినీతి జరిగిందనడం పూర్తిగా అబద్ధమని పేర్కొంది. ట్యాబ్ స్పెసిఫికేషన్, వారంటీ తెలియకుండా ఆన్లైన్ ధర రూ.11,999 ఉందని.. బల్క్లో కొంటే రూ.9 వేలకే వస్తున్నట్టు పేర్కొంటూ.. ఈ ట్యాబ్స్ను రూ.14,250కు కొనుగోలు చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారనడం పూర్తిగా అవాస్తవమని ఖండించింది. పాఠశాల విద్యాశాఖ ఇంకా ఏం తెలిపిందంటే.. ► వాస్తవానికి ఆయా కంపెనీలు పాత స్టాక్ను క్లియర్ చేసుకునేందుకు ఆన్లైన్లో తక్కువ ధరకు పెడుతుంటాయని, పైగా మనం కోరుకున్న స్పెసిఫికేషన్స్ అందులో ఉండవు. కానీ.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్స్కు నిర్ణీత ప్రత్యేకతలు పేర్కొని, ఆ తరహా ట్యాబ్స్ మాత్రమే తీసుకుంది. ► విద్యార్థులకు ప్రధానంగా శాంసంగ్ ఏ7 లైట్ ట్యాబ్లు ఇవ్వగా.. దాని బ్యాటరీతో సహా 3 ఏళ్ల వారంటీ, మూడేళ్ల పాటు మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం), ఓటీజీ కేబుల్, ట్యాబ్కు రక్షణగా ఫ్లిప్ కవర్ ఉంటాయి. ► 256 జీబీ మెమరీ కార్డు గల ట్యాబ్ ధర మార్కెట్లోగాని, ఆన్లైన్లోగాని రూ.17,500 పైనే ఉంది. కానీ.. ప్రభుత్వం టెండర్ ద్వారా రూ.14,250 అంటే ఆన్లైన్ ధర కంటే చాలా తక్కువకు తీసుకుంది. ఆయా కంపెనీలు ఓటీజీ కేబుల్, డ్యూయల్ లేయర్ ట్యాబ్ ప్రొటెక్టెడ్ రగ్గడ్ కేస్, ట్యాంపర్డ్ స్క్రీన్ గార్డ్, ఫ్లాష్డ్ ఎడ్యుకేషన్ కంటెంట్తో 256 జీబీ యూ3 మెమరీ కార్డు, 3 సంవత్సరాల వారంటీతో అందించాయి. ► ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులకు వారంటీగాని, సాఫ్ట్వేర్ సమస్యలకు కొనుగోలుదారే అదనంగా చెల్లించాలి. కానీ.. విద్యార్థులు ట్యాబ్లో ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని గ్రామ/వార్డు సెక్రటేరియట్లో ఇచ్చి కంపెనీ సేవలకు ఉచితంగా పొందవచ్చు. గతేడాది ట్యాబ్స్ కొనుగోలుపైనా ఆరోపణ ► గత సంవత్సరం ఏసర్ ట్యాబ్ ధర రూ.14 వేలు ఉంటే, దాన్ని ప్రభుత్వం రూ.17,500కి కొనుగోలు చేసిందని, దాంతో రూ.2,500 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ► వాస్తవానికి గతేడాది ప్రభుత్వం ఏసర్ ట్యాబ్లను కొనుగోలు చేయనేలేదు. ఈ ఏడాది మాత్రమే 1.35 లక్షల ఏసర్ ట్యాబ్లను కొనుగోలు చేసింది. ఒక్కో ఏసర్ ట్యాబ్ను రూ.14,200కు ఓటీజీ కేబుల్, డ్యూయల్ లేయర్ ట్యాబ్ ప్రొటెక్టెడ్ రగ్గడ్ కేస్, ట్యాంపర్డ్ స్క్రీన్ గార్డ్, ఫ్లాష్డ్ ఎడ్యుకేషన్ కంటెంట్తో గల 256 జీబీ యూ3 మెమరీ కార్డు, 3 సంవత్సరాల వారంటీ ఈ ధరలోనే ఉన్నాయి. అన్ని యాక్సెసరీస్కు మూడేళ్ల గ్యారెంటీ కూడా ఉంది. ► పైగా ట్యాబ్ కొనుగోలు టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు వెళ్లిన తర్వాత, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే టెండర్లు పిలిచారు. రెండేళ్లలో ప్రభుత్వం 9,52,925 ట్యాబుల కొనుగోలుకు వెచ్చించిన మొత్తం రూ.1.305.74 కోట్లు అయితే.. రూ.2,500 కోట్ల అక్రమాలకు ఎలా ఆస్కారముంటుందని పాఠశాల విద్యాశాఖ ప్రశ్నించింది. -
శతశాతమే 'లక్ష్యం'
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షల్లో వందశాతం ఫలి తాలు సాధించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పాఠ శాల విద్య డైరెక్టరేట్ కార్యా లయం ఈ మేరకు జిల్లా అధికారులకు దిశానిర్దేం చేస్తూ..‘లక్ష్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కార్యాచరణలోకి తెచ్చింది. ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా చూడటం దీని ఉద్దేశం. ఎన్నిక లు కూడా ముగియడంతో ఉన్నత పాఠశాలల ఉపా ధ్యాయులు టెన్త్ విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలని డీఎస్ ఈ సూచించింది. వెనుకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక బోధన చేపట్టాలని ఆదేశించింది. వీలైనంత త్వర గా సిల బస్ పూర్తి చేసి, జనవరిలో పునశ్చరణకు వెళ్లాలని పేర్కొంది. లక్ష్యం సాధించిన పాఠశాలల కు అవార్డు లిచ్చే అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పరిశీలిస్తు న్నారు. టెన్త్ పరీక్షలు మార్చి, ఏప్రిల్ నెల లో జరుగుతాయి. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి, పరీక్షలకు సన్నద్ధమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలపై మరింత దృష్టి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లపైనే..: రాష్ట్ర ప్రభుత్వ పాఠశా లలు, స్థానిక సంస్థల పాఠశాలల్లో టెన్త్ ఫలితాలు తక్కువగా నమోదవుతున్నాయి. 2023లో జెడ్పీ పా ఠశాలల నుంచి 1,39,922 మంది టెన్త్ పరీక్షకు హా జరైతే, 1,10,738 మంది మాత్రమే ఉత్తీర్ణుల య్యా రు. అంటే 79.14 శాతం రిజల్ట్ నమోదైంది. ప్రభు త్వ స్కూళ్లలో 21,495 మంది పరీక్ష రాస్తే, 15,561 (72.39 శాతం) మంది పాసయ్యారు. ప్రభుత్వ రెసి డెన్షియల్ స్కూళ్లలో 98 శాతం, గురుకు లాల్లో 95 శాతం ఫలితాలొచ్చాయి. ఇది ప్రైవేటు పాఠశాలక న్నా ఎక్కువ. అయితే ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్లల్లో ఫలితాలపై ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆ సబ్జెక్టులపైనే దృష్టి: ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎక్కు వగా మేథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఎక్కువగా ఫెయిల్ అవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ సబ్జెక్టులపై ప్రత్యేక బోధనకు ప్లాన్ చేశారు. టెన్త్ విద్యార్థులకు ఉదయం గంట అదనంగా క్లాసులు తీసుకుంటారు. వారంలో 3 సబ్జెక్టులు రోజుకు ఒకటి చొప్పున చేపట్టాలని నిర్ణయించారు. ఇది కూడా సంబంధిత సబ్జెక్టులో కఠినంగా ఉండే చాప్టర్లను ఎంపిక చేసుకోవాలని పాఠశాలలకు సూచిస్తున్నారు. జనవరి ఆఖరివారం లేదా ఫిబ్రవరి నుంచి సాయంత్రం కూడా అదనంగా మరో గంట ప్రత్యేక బోధన చేపట్టాలని నిర్ణ యించారు. దీనివల్ల టెన్త్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించడం సాధ్యమనేది అధికారుల ఆలోచన. -
కేజీబీవీల్లో ‘పంచతంత్ర’ ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)లోని విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మిడియెట్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థినులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంపై దృష్టి సారించింది. ఈ మేరకు 100 రోజుల ‘పంచతంత్ర’ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో ఆయా విద్యాలయాల ప్రిన్సిపాల్స్, టీచర్లతోపాటు డీఈవోలు, ప్రాజెక్టు కో–ఆరి్డనేటర్లు, జీసీడీవోలు, ఎంఈవోలు చేపట్టాల్సిన విధివిధానాలను సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు రూపొందించి కేజీబీవీలకు పంపారు. శనివారం నుంచి వచ్చే ఏడాది మార్చి 6వ తేదీ వరకు (100 రోజులు) అనుసరించాల్సిన రోజువారీ ప్రణాళికను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి టీచర్ 15 మంది విద్యార్థులపై శ్రద్ధ పెట్టేలా.. కేజీబీవీల్లో 2022–23 విద్యా సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతిలో 67 శాతం, ఇంటర్మిడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 59.37 శాతం, రెండో సంవత్సరం విద్యార్థులు 41.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలు పునరావృతం కాకుండా ఉండేందుకు విద్యాశాఖ వందరోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో పదో తరగతి విద్యార్థులు 13,217 మంది, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 9,654 మంది, రెండో ఏడాది విద్యార్థులు 8,093 మంది, మొత్తం 3,0964 మంది ఉన్నారు. వీరందరూ ఉత్తీర్ణులయ్యేలా పాఠ్యాంశాల వారీగా యాక్షన్ ప్లాన్ను తయారు చేశారు. ఇందులో స్టడీ ప్లానింగ్, వారాంతపు పరీక్షలు, చదువులో వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల సమావేశాలు కీలకంగా ఉన్నాయి. ప్రతి టీచర్ 15 మంది విద్యార్థినులపై వ్యక్తిగత పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు రూ.5 వేలు, నూరు శాతం ఫలితాలు సాధించిన విద్యాలయాలకు రూ.50 వేల నగదు బహుమతి ఇస్తామని సమగ్ర శిక్ష ప్రకటించింది. ఉపాధ్యాయుల కొరత ఉన్న విద్యాలయాల్లో గెస్ట్ ఫ్యాకల్టీని నియమంచాలని ఇప్పటికే సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, వచ్చే నెలాఖరు నాటికి విద్యార్థినులకు డబుల్ బంకర్ బెడ్లు అందించనున్నారు. ఉత్తమ ఫలితాలకు పురస్కారం గత ఏడాది ఫలితాలు ఈసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నాం. పది, ఇంటర్మిడియెట్ పరీక్షలు రాసే విద్యార్థినులు, ఉపాధ్యాయులపై ఈ వందరోజులు రాష్ట్ర స్థాయిలో అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెడతారు. అన్ని సబ్జెక్టులను కవర్ చేస్తూ రోజువారీ స్టడీ ప్లాన్, టైం టేబుల్ ఇచ్చాం. వెనుకబడిన విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ను కూడా ఇస్తాం. ఇంటర్లో బాగా చదివేవారి కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ను ఇస్తాం. వారు నీట్, జేఈఈ మెయిన్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాసేందుకు వీలుగా శిక్షణ ఉంటుంది. – డి.మధుసూదనరావు, కేజీబీవీ కార్యదర్శి -
చకచకా డిజిటలైజేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థిపై చేసే ఖర్చు భవిష్యత్ పెట్టుబడిగా భావించి, అన్ని సదుపాయాలను అందిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే 30,715 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీ)లు అందించగా, ఈ డిసెంబర్లో ఇచ్చే 32 వేల స్క్రీన్లతో కలిపి మొత్తం 63 వేలు అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్ టీవీలు 33 వేలకు చేరడంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను డిజిటలైజేషన్ పూర్తవుతుంది. మరోపక్క ట్యాబ్స్ పంపిణీ 10 లక్షలకు పైగా చేరుకుంటుంది. దీంతో దేశంలోనే ప్రభుత్వ విద్యలో పూర్తిస్థాయి డిజిటల్ టెక్నాలజీని అనుసరించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఐఎఫ్పీలు, ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్ టీవీల అమరిక డిసెంబర్ 21 నాటికి పూర్తి కానుంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖలోని నాడు–నేడు కమిషనరేట్ అధికారులు ప్రణాళికసిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో 4,800 ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు సెక్షన్కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చి డిజిటల్ బోధన చేపట్టారు. ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేసిన విషయం తెలిసిందే. రెండో దఫాలో 32 వేల ఐఎఫ్పీలు, 22 వేల స్మార్ట్ టీవీలను పాఠశాలలకు అందించనుంది. -
టోఫెల్ తర్ఫీదుకు కీలక అడుగు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ‘టోఫెల్ సర్టిఫికేషన్’కు సన్నద్ధం చేయడంలో భాగంగా ‘లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ విద్యా సంవత్సరానికి టోఫెల్ శిక్షణకు అవసరమైన సాఫ్ట్వేర్, ఈ–కంటెంట్ను ఉచితంగా అందించడంతో పాటు, ఉపాధ్యాయులు, అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఇప్పటికే మూడో తరగతి నుంచి తొమ్మిది వరకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రోజుకు గంట పాటు టోఫెల్ శిక్షణ ప్రారంభించినట్టు తెలిపారు. విద్యార్థుల్లో లిజనింగ్, స్పీకింగ్ నైపుణ్యాల పెంపు, వివిధ దేశాల్లో ఇంగ్లిషు మాట్లాడే తీరును అర్థం చేసుకుని.. తిరిగి జవాబు ఇచ్చేలా తర్ఫీదు ఇస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే ఎస్సీఈఆర్టీ ద్వారా మెటీరియల్ తయారు చేశామన్నారు. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ ఏజెన్సీ మెటీరియల్ అవసరాన్ని గుర్తించి లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్తో ఒప్పందం చేసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో వారిని దృష్టిలో పెట్టుకుని లిక్విడ్ సంస్థ ఉచితంగా మెటీరియల్ ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టుకు సమగ్ర శిక్ష పీడీ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. వాస్తవానికి టోఫెల్ సర్టిఫికేషన్ కోసం ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్విసెస్(ఈటీఎస్)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా.. విద్యార్థులను టోఫెల్ పరీక్ష కోసం సిద్ధం చేస్తున్నామన్నారు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సంస్థల నుంచి టెండర్లు పిలిచినా.. శిక్షణ ప్రక్రియ ప్రారంభించేందుకు సమయం లేదన్నారు. అందుకే ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే లిక్విడ్ ఇచ్చే కంటెంట్ వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. వచ్చే ఏడాది టెండర్లు పిలిచి కంటెంట్ ఖరారు చేస్తామని వివరించారు. తరగతి గదుల డిజిటలైజేషన్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని ప్రవీణ్ప్రకాశ్ చెప్పారు. ఇందులో భాగంగానే 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 41 లక్షల మంది ఆంగ్ల మాధ్యమం అభ్యసిస్తున్నట్టు చెప్పారు. దేశంలో తొలిసారిగా సైన్స్, సోషల్ సైన్స్, గణితం సబ్జెక్టుల్లో ద్విభాషా పాఠ్యపుస్తకాలను తీసుకొచ్చినట్టు తెలిపారు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యం పెంపొందించడంలో భాగంగా బైజూస్ ద్వారా ఉత్తమ కంటెంట్ అందిస్తోందన్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్ను ఇన్స్టాల్ చేసి 5.18 లక్షల ట్యాబ్లను పంపిణీ చేసిందని వెల్లడించారు. నాడు–నేడులో భాగంగా పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్పీ), ప్రాథమిక పాఠశాలల్లో 10,038 స్మార్ట్ టీవీలతో తరగతి గదులను డిజిటలైజ్ చేసిందని చెప్పారు. డిసెంబర్ నాటికి మొత్తం తరగతి గదుల్లో హైస్పీడ్ ఇంటర్నెట్తో డిజిటల్ బోధనలు ప్రవేశపెడతామని వివరించారు. అంతర్జాతీయంగా గుర్తింపు నోయిడాకు చెందిన లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్.. కామన్ యూరోపియన్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ రిఫరెన్స్(సీఇఎఫ్ఆర్)తో పాటు బ్రిటీష్ కౌన్సిల్, పియర్సన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, మాక్మిలన్, ఆదిత్య బిర్లా ఫౌండేషన్, పబ్లిషింగ్ కంపెనీలకు విశ్వసనీయ సేవలందిస్తోంది. విద్యార్థుల తరగతి, వయస్సును బట్టి ఈ కంటెంట్ను తయారు చేసి అందిస్తోంది. కెయిర్న్ ఇండియా, అలహాబాద్ యూనివర్సిటీ, ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌండేషన్, ఫ్రాంక్ఫిన్, గ్లోబల్ లాజిక్, ఇండియన్ మిలిటరీ అకాడమీ, జెట్కింగ్, ఒడిశా మోడల్ ట్రైబల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వంటి అనేక మందికి సేవలందిస్తోంది. -
మరిన్ని స్కూళ్లు ‘డిజిటల్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి విద్యార్థికీ అత్యున్నత స్థాయి విద్య అందించాలని, వారు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో విద్యా రంగంలో పలు సంస్కరణలు తెచ్చారు. పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్కూళ్లలో మాదిరిగా అత్యాధునిక పద్ధతుల్లో బోధన, వసతులు ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తెస్తున్నారు. ఇందుకోసం గత నాలుగున్నరేళ్లలో రూ. 66 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ‘నాడు – నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలకు నూతన భవనాల నిర్మాణంతోపాటు అత్యాధునిక బోధన పద్ధతులను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పాఠశాల విద్యను పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీలు) ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ నాటికి అన్ని ఉన్నత పాఠశాలల్లో మరో 32 వేల ఐఎఫ్పీ స్క్రీన్లు, ప్రాథమిక పాఠశాలల్లో 23 వేల స్మార్ట్ టీవీలు అందించనున్నారు. సామాన్యుల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన బోధనను ఈ (2023–24) విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో పాఠశాల విద్యను దేశంలోనే అతి పెద్ద డిజిటల్ ప్లాట్ఫారంగా మారుస్తోంది. తొలివిడత నాడు–నేడులో ఆధునీకరించిన పాఠశాలల్లో నూతన తరగతి గదులు, డబుల్ డెస్క్ బెంచీలు, ద్విభాషా పాఠ్య పుస్తకాలతో పాటు కార్పొరేట్ పిల్లలకు మాత్రమే సాధ్యమైన బైజూస్ కంటెంట్ ఉన్న ట్యాబ్లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచితంగా అందించింది. అనంతరం అమెరికా వంటి అగ్ర దేశాల్లో మాత్రమే విద్యా బోధనకు వినియోగించే అత్యాధునిక టెక్నాలజీ గల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల ను, స్మార్ట్ టీవీలను 11,315 పాఠశాలల్లో ఈ ఏడాది జూన్ నెలలోనే అందుబాటులోకి తెచ్చింది. 4,800 ఉన్నత పాఠశాలల్లో 30,715 ఐఎఫ్పీ స్క్రీన్లను ఏర్పాటు చేయగా, 6,515 ప్రాథమిక పాఠశాలల్లో 10,038 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. ఈ డిసెంబరు మొదటి వారానికి మరో 32 వేల ఐఎఫ్పీలను హైస్కూళ్లకు అందించనుంది. గతంలో పాఠశాలలకు సరఫరా చేసిన ఐఎఫ్పీలనే ఇప్పుడూ తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈమేరకు అధికారులు టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసే 23 వేల స్మార్ట్ టీవీల టెండర్ల జ్యుడిíÙయల్ ప్రివ్యూ పూర్తయింది. ఈ టెండర్లను ఖరారు చేసి వచ్చే నెలలోనే స్మార్ట్ టీవీల పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే దేశంలో పాఠశాల విద్యను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. ఈ ఏడాది టోఫెల్ కూడా ప్రవేశపెట్టడం, స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీల ద్వారా బోధన వల్ల కలిగే మంచి ఫలితాలు ఇటీవల ముగిసిన ఫార్మాటివ్ అసెస్మెంట్ 1, 2 పరీక్షల్లో కనపడటంతో అన్ని పాఠశాలల్లో కొత్త ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. ఐఎఫ్పీలతో అత్యాధునిక పద్ధతిలో బోధన ఐఎఫ్పీలు అత్యాధునిక బోధనకు ప్రతీకగా నిలుస్తాయి. 165 సెంటీమీటర్ల వైశాల్యం ఉండే ఈ స్క్రీన్లపై ఓ పక్క వీడియోలో బోధన చేస్తూనే.., మరోపక్క విద్యారి్థకి అర్థం కాని అంశాలను ఉపాధ్యాయులు బోర్డు మీద రాసి చూపించవచ్చు. అవసరమనుకుంటే అదే అంశాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. మొత్తం పాఠాన్ని లింక్ రూపంలో ఆన్లైన్లో పెట్టొచ్చు. అంటే ఒకే బోర్డుపై అనేక విధాలుగా బోధన (మల్టీ టాస్కింగ్) చేయొచ్చు. ఈ ఐఎఫ్పీ ప్యానెళ్లలో పాఠ్యాంశాలు, బైజూస్ కంటెంట్ను తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం ఏడు భాషల్లో అందిస్తారు. గూగుల్ అసిస్టెంట్తో వచ్చే ఈ ఇంటరాక్టివ్ స్మార్ట్ ప్యానెళ్లు 6 నుంచి 10వ తరగతి వరకు సెక్షన్కు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. తొలివిడత ఐఎఫ్పీ స్క్రీన్లు ఏర్పాటుచేసిన పాఠశాలల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించినట్టు గుర్తించారు. -
అవగాహనే అస్త్రం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. దశాబ్దాలుగా ప్రకటనలకే పరిమితమైన ‘స్కూల్ కన్జ్యూమర్ క్లబ్’లను ప్రస్తుత వైఎస్ జగన్ సర్కార్.. ప్రతి ప్రభుత్వ స్కూల్లోనూ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 8, 9 తరగతుల విద్యార్థులతో దాదాపు 6 వేలకు పైగా వినియోగదారుల క్లబ్లను ఏర్పాటు చేయించింది. ఒక్కో క్లబ్లో కనీసం 100 మంది విద్యార్థులను భాగస్వాములను చేస్తూ.. సుమారు 6 లక్షల మందిని వినియోగదారుల హక్కుల పరిరక్షకులుగా తీర్చిదిద్దబోతోంది. విద్యార్థులే వినియోగదారులుగా తమ హక్కులను అర్థం చేసుకోవడంతో పాటు వాటిని తమ కుటుంబసభ్యులకు, గ్రామాల్లోని నిరక్షరాస్యులకు, తోటి విద్యార్థులకు బోధించేలా ప్రభుత్వం ఈ క్లబ్లకు రూపకల్పన చేసింది. వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు దోపిడీకి గురికాకుండా సమగ్ర పరిజ్ఞానాన్ని అందిస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఇద్దరు మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చింది. ఈ మాస్టర్ ట్రైనర్లు రాష్ట్రంలోని అన్ని క్లబ్ల టీచర్ గైడ్లకు దశలవారీగా, క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వనున్నారు. పుస్తకాలు, వాట్సాప్ గ్రూప్ల ద్వారా వినియోగదారుల హక్కులకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘మేము సైతం’ పేరుతో శిక్షణ మాడ్యూల్ పుస్తకాన్ని వెలువరించారు. త్వరలోనే వినియోగదారుల హక్కుల పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి, క్లబ్లు చేపట్టిన కార్యకలాపాలను అప్లోడ్ చేయడానికి వీలుగా ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానుంది. క్లబ్ల కార్యక్రమాల ఆధారంగా అవార్డులతో విద్యార్థులను ప్రోత్సహిస్తారు. పోస్టర్లతోనూ విస్తృత ప్రచారం వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పిం చేలా 10 రకాల పోస్టర్లతో కూడా ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించనుంది. వస్తువు కొనుగోలులో వినియోగదారులకు ఉండే హక్కులు, బాధ్యతలు, ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ బంకుల్లో పొందే హక్కులు, విత్తనాలు, ఎరువుల కొనుగోలుపై అవగాహన, సమస్య వస్తే వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేసే విధానం, బిల్లు ఆవశ్యకత తదితర అంశాలను వివరించనుంది. అలాగే వినియోగదారుల హక్కుల పరిరక్షణ అంశాలతో ‘మేలు కొలుపు’ పేరుతో మాస పత్రికను కూడా ప్రచురిస్తోంది. నెలకు సుమారు 9 వేల కాపీలను విడుదల చేస్తుండగా వీటిని వినియోగదారుల క్లబ్లకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో వినియోగదారుల అవగాహన కార్యక్రమాల నిర్వహణకు జాయింట్ కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించారు. విద్యార్థులతోనే చైతన్యం.. ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదంటే సేవను పొందేటప్పుడు వినియోగదారుడికి చట్టం కొన్ని హక్కులు కల్పిం చింది. వీటి ద్వారా మోసాల నుంచి కొనుగోలుదారుడు తనను తాను రక్షించుకోవచ్చు. కానీ, ఎన్నో ఏళ్లుగా వినియోగదారులు తమ హక్కులు తెలుసుకోవడంలో వెనుకబడిపోయారు. అందుకే ప్రభుత్వం పాఠశాల విద్య దశలోనే ఈ అంశంపై సమగ్ర అవగాహన కల్పిం చేందుకు కృషి చేస్తోంది. విద్యార్థుల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చు. అందుకే సమస్య వస్తే వినియోగదారుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియజేయడంతో పాటు మోసపోకుండా సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నాం. – హెచ్.అరుణ్ కుమార్, వినియోగదారుల వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ -
ఇంటింటా ఇంగ్లిష్ వసంతం
ఈ 2023 అక్టోబర్ 5... 206వ భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం. భారతదేశంలో పరిపాలనా భాషగా మనుగడ సాగించిన ఈ 206 సంవత్సరాల్లో ఇంగ్లిష్ అతి సంపన్నుల ఆస్తిగా మిగిలిపోయింది. దేశంలో అతి ధనవంతులు లేక స్థిరమైన వేతనం పొందేవారు మాత్రమే తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను చెప్పించగలిగారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నాలుగేళ్ల కాలంలో భారతదేశంలోని విద్యా నమూనానే మార్చివేశారు. ఈ నమూనాలో వ్యవసాయ కార్మికుల పిల్లలు, ఆదివాసీలు, చేతివృత్తుల వారితోపాటు, పేదల్లోకెల్లా నిరుపేదలు కూడా కేవలం ఇంగ్లిష్ మాధ్యమం విద్యనే కాదు, పూర్తిగా భిన్నమైన విద్యను పొందుతున్నారు. మన దేశంలో అతి ధనవంతులు లేక సక్రమంగా ఉద్యోగం చేస్తూ స్థిరమైన వేతనం పొందేవారు మాత్రమే తమ పిల్లలకు పరిమితమైన స్థాయి నుండి ఉన్నత తరగతి ఇంగ్లిష్ మీడియం విద్యను చెప్పించగలిగారు. దేశంలోని అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులందరూ తమ పిల్ల లను ఇంగ్లిషు మీడియంలో చదివించేవారు. నాగాలాండ్ వంటి చిన్న ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలందరికీ ఏదో ఒక రకమైన ఇంగ్లిష్ మాధ్యమ విద్యను అందిస్తున్నాయి. రాజధాని ఢిల్లీ నుంచి దేశాన్ని అత్యధిక కాలం పాలించిన భారత జాతీయ కాంగ్రెస్, 15 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన బీజేపీ వంటి జాతీయ పార్టీలు ఇప్పుడు ఇంగ్లిష్ భాషా విద్యను ధనవంతులకు సొంతం చేశాయి. ఈ పార్టీల అభివృద్ధి నమూనాలో పాఠశాల విద్యకు అతితక్కువ ప్రాధాన్యత మాత్రమే లభించింది. వెనుకబడిన నైజాం రాష్ట్రంలో సరైన తెలుగు మీడియం పాఠశాల కూడా లేని ఒక కుగ్రామంలో పుట్టి, ఇంగ్లిష్ నేర్చుకోవడంలో దుర్భ రమైన కష్టాన్ని అనుభవించిన వ్యక్తిగా బతికిన నేను, జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాఠశాల విద్యపై ఇంత శ్రద్ధ చూపుతారని ఎన్నడూ ఊహించలేదు. నా 71 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, విడిపోయిన ఏపీ, తెలంగాణలలో అనేక మంది ముఖ్యమంత్రులను చూశాను. నేను అనేక రాష్ట్రాల్లో పర్యటించాను. ముఖ్యమంత్రుల, ప్రధాన మంత్రుల పరిపాలనా పద్ధ తుల గురించి చదివాను. అయితే పాఠశాల విద్యా కార్యక్రమాలకు ఏపీ ముఖ్యమంత్రి వెచ్చిస్తున్నంత సమయాన్ని ఏ ముఖ్యమంత్రి కానీ, ప్రధాన మంత్రి కానీ వెచ్చించలేదు. గతంలో సిద్ధరామయ్య కర్ణాటకకు మొదటి దఫా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పినరయి విజయన్ రెండు పర్యాయాలు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వారితో మాట్లాడి ఆ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని అభ్యర్థించాను. అయితే అగ్రవర్ణ మేధాజీవులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆ ఇద్దరూ భయపడ్డారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో పేదల్లోకెల్లా నిరుపేదలకు ఈ రోజువరకూ ఇంగ్లిష్ మీడియం విద్యను అందించడం లేదు. దీన్ని అలా పక్కన బెడితే రాష్ట్ర విద్యావ్యవస్థ పనితీరును సమీక్షించడానికి ఏ ముఖ్య మంత్రీ జగన్లా పాఠశాల విద్యపై ఇంత డబ్బు, సమయం, శక్తి వెచ్చించలేదు. ‘నా రాష్ట్ర పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించాలని కోరుకుంటున్నాను, అదే వారి భవిష్యత్ ఆస్తి’ అని జగన్ మోహన్ రెడ్డి పదేపదే చెప్పారు. పాఠశాల, కళాశాల పిల్లల తల్లుల ఖాతాల్లో ఏడాదికి సుమారు 35 వేల రూపాయలు జమ అవుతున్నాయి. ఆ డబ్బును వారు తమ విద్యా అవసరాలకు ఖర్చు చేస్తారు. పిల్లల బూట్లు, బ్యాగుల నాణ్యత, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్ల సౌకర్యాలు వంటివాటిపై ఏపీ ముఖ్యమంత్రి నిత్యం సమీక్షిస్తున్నారు. దేశంలోని ఏ భాగానికి చెందిన పాఠశాల మౌలిక సదుపాయాలు కూడా భారతదేశ చరిత్రలో ఏపీలోని పిల్లలకు ఉన్న నాణ్యతతో ఎన్నడూ లేవు. ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్మాణాన్ని రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి అని ఎప్పుడూ నిర్వచించలేదు. బడా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి వారిని బలిపించడం నుంచి చిన్న కాంట్రాక్టర్ల దిశగా అభివృద్ధి ఆలోచనలను జగన్ మోహన్ రెడ్డి మార్చి వేశారు. ఇలాంటి చిన్న కాంట్రాక్టర్లు ఇప్పుడు గ్రామ, పట్టణ మార్కెట్లలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో వేతనాలు పొందే కార్మికులు గ్రామాలు, పట్టణాలలో విస్తరించారు. ఈ నమూ నాలో అభివృద్ధి పెద్ద నగరాల్లో మాత్రమే కేంద్రీకృతం కాదు. గ్రామ మార్కెట్లు ఎంతగానో పుంజుకుంటాయి. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి ఐదేళ్ల చంద్రబాబు పాలనను, తెలంగాణలో చంద్రశేఖర్ రావు పదేళ్ల పాలనను చూశాను. వారు తమ తమ రాష్ట్రాల్లోని పాఠశాల విద్యా నిర్మాణాలను ఎప్పుడూ సమీక్షించలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పుడూ రాష్ట్ర పేద పిల్లల జీవితం, అభివృద్ధి గురించి చర్చించే స్థలంగా ఉండలేదు. పాఠ శాల, కళాశాల విద్యను కార్పొరేట్ వ్యాపార సంస్థలకు అప్ప జెప్పడంలో వీరు పేరొందారు. కానీ జగన్ మోహన్ రెడ్డి గ్రామీణ పాఠశాలలకు వైఫై, స్మార్ట్ టీవీలు ఇవ్వడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ వినూత్న విద్యా పద్ధతులను సమీక్షిస్తూ, గ్రామీణ పాఠశాలలకు వాటిని జోడిస్తూనే ఉన్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో నడిచే దేశం, రాష్ట్రాలు ఈ ఏడాది భారతీయ ఇంగ్లిష్ దినోత్స వాన్ని జరుపుకోవాల్సిన నేపథ్యం ఇది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి మాట్లాడటం నేను టీవీ ఛానళ్లలో చూశాను. తెలుగు కంటే వారి ఇంగ్లిష్ చాలా బాగుంది. ఎందుకు? వారు అగ్రశ్రేణి ఇంగ్లిష్ మాధ్యమ పాఠశాలల్లోనూ, అమెరికాలో కూడా చదువుకున్నారు. కానీ ఆ కుటుంబం, ఆయన పార్టీ 2019లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడానికి జగన్ కోర్టు పోరాటాలు, మీడియా పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఏపీకి చెందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎం.వి.రమణ ఆ విధానాన్ని వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువు తున్న నిరుపేదలకు, తల్లులకు ఆర్థిక సాయంతో జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు. అలాంటి కార్మిక పిల్లలు ఇంగ్లిష్ మాట్లాడే సుసంపన్న దేశమైన అమెరికాకు వెళ్లి ఐక్యరాజ్యసమితి విద్యా సమావే శాలలో, వైట్ హౌస్లో ధైర్యంగానూ, విశ్వాసంతోనూ మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకుల నుంచి చప్పట్లు స్వీకరించారు. ఇది కచ్చితంగా భారతదేశ భవిష్యత్ పాఠశాల విద్యా వ్యవస్థకు ప్రేరణాత్మక ఉదాహరణ. ఈ రోజు పేదలు, గ్రామ పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవడంపై సంబ రాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 1817లో మన జాతీయ జీవనంలోకి వచ్చిన ఇంగ్లిష్ విద్య కొత్త మార్గాన్ని సుగమం చేసింది. కొత్త ఆశను సృష్టించింది. మన విద్యావ్యవస్థలో ఇద్దరు సంస్కర్తలు విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్ 206 సంవత్సరాల క్రితం అక్టోబర్ 5న మొదటి పాఠశాలను ప్రారంభించారు. అయితే ఆ భాషా ఫలాలు వ్యవసాయాధారిత ప్రజానీకానికి, పట్టణ పేదల పిల్లలకు ఇప్పటికీ చేరలేదు. ఉన్నత స్థాయి ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య నుండి వచ్చిన ఏ విద్యావేత్త కూడా సమాన విద్యా మాధ్యమం కోసం పోరాడలేదు. మన దేశంలో ప్రాంతీయ భాషల వేడుకలను ఎవరూ వ్యతిరేకించరు. కానీ అదే సమయంలో భారతీయ ఇంగ్లిష్ను సెలబ్రేట్ చేసుకోవడం, ఆ ప్రపంచ భాషని మన గ్రామాల్లోకి విస్తరించడం అనేది మన సొంత రూపాంతరంలో ఇంగ్లిష్ని తీర్చిదిద్దుతుంది. 206 సంవత్సరాల పాటు ఇంగ్లిష్ అగ్రవర్ణ ధనవంతులు భద్రపరుచు కున్నదిగా ఉండిపోయింది. ఇంగ్లిష్ భాషను ధనవంతుల ఇళ్లకు, ఉన్నత కార్యాలయాలకు, మాల్ మార్కెట్లకు, విమానాశ్రయాలకు పరిమితం చేయడం నేరం. ఇది గ్రామ మార్కెట్లు, గ్రామ బస్టాప్ లతోపాటు వ్యవసాయ క్షేత్రాలకు చేరుకోవాలి. అక్కడే అది మరింతగా భారతీయతను సంతరించుకుంటుంది. ఏ భాషనూ ఒక వర్గ ప్రజల ఆస్తిగా పరిగణించకూడదు. జగన్ ప్రభుత్వం ఆ తొలి అడుగు వేసింది. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఇండియన్ ఇంగ్లిష్ను వేడుకగా జరుపుకొని, ఆ రోజున మన పిల్లలను, యువతను ఒక పుస్తకాన్ని చదివేలా చేద్దాం. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మాకు ఎన్నాళ్లీ శిక్ష?
సాక్షి, హైదరాబాద్: వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న తమను ఒకేచోటుకు బదిలీ చేయాలంటూ 13 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయులు పిల్లలతో కలసి సోమవారం హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన మౌనదీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. దీక్ష చేస్తున్న ఉపాధ్యాయ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉపాధ్యాయులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. మహిళలని కూడా చూడకుండా బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్లు ఎక్కించడాన్ని ఉపాధ్యాయ దంపతులు తీవ్రంగా ప్రతి ఘటించారు. గాంధీ జయంతి సాక్షిగా ఈ తరహా పోలీసు దౌర్జన్యం సరికాదంటూ నినదించారు. 317 జీవో అమల్లో భాగంగా గతేడాది ఉపాధ్యాయ భార్యాభర్తలను వేర్వేరు జిల్లాలకు బదిలీ చేశారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవడంతో కొన్ని జిల్లాల స్పౌజ్ కేసులను పరిష్కరించారు. కానీ ఇప్పటికీ 13 జిల్లాల స్పౌజ్ల బదిలీలు పెండింగ్లోనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి వారు అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. తాము తీవ్ర మనోవేదనతో ఉన్నామని, కిలోమీటర్ల దూరంలో భార్య ఒకచోట, భర్త ఒకచోటపనిచేయడం సమస్యగా మారిందని, పిల్లల ఆలనాపాలన చూసే దిక్కులేకుండా పోయిందని ప్రభుత్వానికి విన్నవించారు. అయినప్పటికీ దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట మౌనదీక్షకు దిగారు. మాకెందుకీ అన్యాయం గత జనవరిలో కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు మాత్రమే చేపట్టారు. ఇంకా 1500 మంది బదిలీలకు నోచుకోక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో దీక్ష చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యను సానుభూతిలో పరిష్కరించాలి. – నరేశ్, స్పౌజ్ ఫోరంకో–కన్వీనర్ మానసిక క్షోభకు పరిష్కారం లేదా? గత 22 నెలలుగా ఉపాధ్యాయ దంపతులు బదిలీల్లేక మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ పరిస్థితికి పరిష్కారం లేదా అనే అనుమానం కలుగుతోంది. పెద్ద మనసుతో వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలి. – వివేక్, స్పౌజ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు -
విషయ పరిజ్ఞానమే కొలమానం
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో విద్యార్థి వికాస చదువులకు రాష్ట్రంలో ప్రాధాన్యం పెరిగింది. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా రాణించేలా పరీక్షల్లోను, ప్రశ్నల తీరులోను మార్పులు తీసుకొచ్చారు. అకడమిక్ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా విషయ పరిజ్ఞానం అంచనా వేసేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా పరీక్షల్లో సంప్రదాయ ప్రశ్నల శైలి.. మార్కుల సాధనకే పరిమితమైంది. పిల్లల్లో వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను అంచనా వేసే విధానం కరువైంది. దీంతో గత ఏడాది నుంచి రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరీక్ష నిర్వహణ, ప్రశ్నల శైలిలో మార్పులు తీసుకొచ్చింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాస్థాయిని అంచనా వేసేందుకు, అభ్యసన లోపాలను గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు చేస్తోంది. వీటిలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎఫ్ఎల్ఎస్), నేషనల్ అచీవ్మెంట్ సర్వే ముఖ్యమైనవి. వీటిద్వారా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను అంచనా వేసి రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తోంది. విద్యా సంవత్సరంలో నిర్వహించే ఫార్మెటెవ్, సమ్మెటివ్ అసెస్మెంట్లలో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు సిలబస్ ప్రకారం విశ్లేషణాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్ఏఎస్ సర్వేకు అనుగుణంగా పరీక్షలు దేశవ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అచీవ్మెంట్ టెస్ట్ (ఎన్ఏఎస్), ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వేను ఏటా చేపడుతుంది. 2021లో కేంద్రం ఎన్ఏస్, 2022లో ఎఫ్ఎల్ఎస్ నిర్వహించింది. కరోనా అనంతరం నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అభ్యసన లోపాలు ఉన్నట్టు గుర్తించి, వాటిని అధిగమించేందుకు పలు సంస్కరణలను చేపట్టి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఏ తరహా పరీక్షలు, ప్రశ్నలు ఉంటాయో అదే విధానాన్ని ప్రభుత్వం పాఠశాల విద్యలో గత ఏడాది నుంచి అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 3న జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత నెలలో అండమాన్–నికోబార్లో వివిధ రాష్ట్రాల అసెస్మెంట్ సభ్యులకు శిక్షణ ఇచ్చింది. అందులో రాష్ట్రాలు విద్యా ప్రమాణాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, అసెస్మెంట్లో అనుసరించాల్సిన విధానాలను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా సిద్ధమవ్వాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో అసెస్మెంట్ సెల్ ఏర్పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఈ తరహా పరీక్ష విధానాన్ని 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఎఫ్ఎల్ఎస్ పరీక్షల తరహాలోనే రాష్ట్రంలో పరీక్ష పత్రాలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం 15 మంది నిపుణులైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రత్యేక అసెస్మెంట్ సెల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు సాధించిన ఫలితాల ఆధారంగా బోధనలో సైతం మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతినెలా సబ్జెక్టు టీచర్లకు స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ సైతం ఇస్తున్నారు. విద్యార్థి సామర్థ్యం అంచనాకు విశ్లేషణాత్మక ప్రశ్నలు ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ నాలుగు ఫార్మెటివ్, రెండు సమ్మెటివ్ (ఆరు) అసెస్మెంట్లు నిర్వహిస్తోంది. వీటిలో రెండు ఫార్మెటివ్, ఒక సమ్మెటివ్ అసెస్మెంట్లకు ‘ఓఎంఆర్’ విధానం అనుసరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎఫ్ఏ–1 ఓఎంఆర్ విధానంలో పూర్తిచేయగా, ఎఫ్ఏ–2ను పాత విధానంలో మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ విధానాన్ని 1 నుంచి 8వ తరగతి వరకు అనుసరిస్తోంది. పదో తరగతిలో బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా 9, 10 తరగతులకు పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎఫ్ఏలో మొత్తం 20 మార్కులకు 15 ప్రశ్నలు ఉంటాయి, ఇందులో 10 ప్రశ్నలకు ఓఎంఆర్ విధానంలో జవాబులు గుర్తించాలి. మరో ప్రశ్నలకు 5 డిస్క్రిప్టివ్ విధానంలో సమాధానాలు రాయాలి. ఈ ప్రశ్నలన్నీ విద్యార్థి మానసిక సామర్థ్యం, ప్రశ్నలు అర్థం చేçసుకునే విధానాన్ని పరీక్షించేలా ఉంటాయి. -
ఐబీ సిలబస్ అమలుపై అధ్యయనం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం మొదలైంది. ఇప్పటికే గుంటూరు, విజయవాడల్లోని ఐబీ స్కూళ్లలో సిలబస్ అమలును పాఠశాల విద్యా శాఖ పరిశీలించింది. అయితే, ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ రెండేళ్లుగా అమలవుతోంది. ఈ క్రమంలో శనివారం పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ నేతృత్వంలోని బృందం అక్కడి పాఠశాలలను పరిశీలించింది. ఐబీ సిలబస్ బోధిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాలు, విద్యార్థులకు బోధిస్తున్న విధానంపై అధ్యయనం చేసింది. ఏపీలో ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టేందుకు ఉపాధ్యాయుల శిక్షణ, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ ఆవశ్యకతను అర్థం చేసుకునేందుకు, విధివిధానాలను తెలుసుకునేందుకు ఢిల్లీ వెస్ట్ వినోద్నగర్లోని సర్వోదయ కన్య విద్యాలయ (ఎస్కేవీ)ను వీరు సందర్శించారు. ఒకటి, మూడు, ఐదో తరగతి విద్యార్థులతో మమేకమై వివిధ అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, ఐబీ సిలబస్ అమలుపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా ప్రభుత్వం ఇటీవల స్టీరింగ్ కమిటీని నియమించిన నేపథ్యంలో ఆ కమిటీ ఢిల్లీ స్కూళ్లను పరిశీలించింది. -
టీచర్లు, విద్యార్థులకు డిజిటల్ శిక్షణ అవసరం
సాక్షి, అమరావతి: డిజిటల్ పరికరాల వాడకంతో విద్యార్థుల సమయం దుర్వినియోగం కావడమే కాకుండా వ్యసనంలా మారే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థల ప్రతినిధులతో గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సాంకేతిక యుగంలో డిజిటల్ వాడకానికి ప్రాధాన్యం పెరిగిందని, వాటిని సరైన రీతిలో వినియోగిస్తే ఎలాంటి హాని ఉండదని అన్నారు. సోషల్ మీడియా అతి వాడకం, తప్పుడు వార్తల ప్రభావం సైబర్ నేరాలకు పురిగొల్పుతాయని, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ వంటి డిజిటల్ పరికరాలు, సోషల్ మీడియా వాడకం ప్రయోజనాలు, దు్రష్పయోజనాలపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా అంశాలపై రూపొందించిన మాడ్యూళ్లు, పోస్టర్లను కమిషనర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల విద్య డైరెక్టర్ పి.పార్వతి, డబ్ల్యూహెచ్వో ప్రతినిధులు డాక్టర్ ట్రాన్ మిన్హు ఎన్జెన్, సోఫియా భావన బి.ముఖోపాధ్యాయ్ డాక్టర్ నాన్సీ ప్రీత్ కౌర్, జేవీ మోహన్రావు, షేక్ ఇస్మాయిల్, ఆర్.మన్మోహన్ పాల్గొన్నారు. -
AP: ప్రభుత్వ బడుల్లో ‘ఐబీ’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో అంతర్జాతీయ ప్రమాణాల పెంపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో సగర్వంగా నిలబెట్టేందుకు మహత్తర యజ్ఞాన్ని తలపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బక్లారియెట్ (ఐబీ) సిలబస్ అమలుకు ముందడుగు వేసింది. ఈ మేరకు ఐబీ సంస్థతో పాఠశాల విద్యా శాఖ కుదుర్చుకున్న ఒప్పందానికి (ఎంఓయూ) బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో హర్షధ్వానాల మధ్య ఆమోదం లభించింది. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే ఆంగ్ల భాష పరిజ్ఞానం పెంపునకు మూడో తరగతి నుంచి ప్రతి రోజు గంటపాటు విద్యార్థులకు టోఫెల్ శిక్షణ అందిస్తోంది. తాజా ఒప్పందంతో ఒకటవ తరగతి నుంచి ఐబీ సిలబస్ను ప్రవేశపెడుతూ నెమ్మదిగా పై తరగతులకు విస్తరిస్తుంది. దీంతోపాటు రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేకూరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ అనంతరం సీపీఎస్ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రతిపాదించిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) అమలుకు ముందడుగు వేసింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీం(ఏపీజీపీఎస్) బిల్లు– 2023ను ప్రవేశపెట్టనుంది. దీనితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన సుమారు 10 వేల మందికిపైగా ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ బిల్లు–2023నూ అసెంబ్లీ ముందుకు తీసుకురానుంది. ఈ నిర్ణయాలకూ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాల వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సహం’ పేరుతో అవార్డులను అందజేయనున్నారు. యూపీఎస్సీ పరీక్షల్లో ప్రిలిమనరీ, మెయిన్స్ రెండు విభాగాల్లో ఉత్తీర్ణులై సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన పేద అభ్యర్థులకు ఆర్థిక సాయం అందిస్తారు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే రూ.లక్ష, వీరిలో మెయిన్స్కు అర్హత సాధిస్తే అదనంగా మరో రూ.50 వేలు నగదు ప్రోత్సాహకం అందిస్తారు. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జఫ్రీన్కు గ్రూప్–1 ఉద్యోగం కోసం చట్ట సవరణ 2017 డెఫ్ ఒలింపిక్స్ టెన్నిస్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతక విజేత, ఇండియన్ డెఫ్ టెన్నిస్ టీం కెప్టెన్ షేక్ జఫ్రీన్కు గ్రూప్–1 సర్వీసెస్లో కో–ఆపరేటివ్ సొసైటీస్ డెప్యూటీ రిజిస్ట్రార్ హోదాలో నియామకం కల్పించనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పేట్రన్ అండ్ పే స్ట్రక్చర్) యాక్ట్– 1994ను సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జఫ్రీన్కు 10 సెంట్ల ఇంటి స్థలం కూడా కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జీరో వేకెన్సీలో టాప్ వైద్య ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ పాలసీని సమర్థవంతంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. ఆరోగ్య శాఖలో ఎక్కడా కూడా ఖాళీలు లేకుండా సిబ్బందిని ఎప్పటికప్పుడు నియమిస్తున్నారు. తాజాగా కేన్సర్ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు డీఎంఈ పరిధిలోని విశాఖ కింగ్జార్జ్ ఆస్పత్రి, గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రి, కడప ప్రభుత్వ ఆస్పత్రిలో కేన్సర్ కేర్ సెంటర్లో 353 పోస్టుల భర్తీ చేస్తున్నాం. ఒంగోలు, ఏలూరు, విజయవాడలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో ప్రమోషన్ విధానం/అవుట్ సోర్సింగ్ ద్వారా 168 పోస్టుల భర్తీకి నిర్ణయం. వీటికి తోడు 11 ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వివిధ విభాగాల్లో మరో 99 పోస్టులను భర్తీ చేయాలన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదలకు ఆమోదం లభించింది. ఏపీ వైద్య విధాన పరిషత్ను వైద్య ఆరోగ్య శాఖలోకి విలీనం చేస్తున్నాం. ఆర్డినెన్స్ స్థానంలో దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నాం. దీంతో ఏపీవీవీపీలోని ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనికి మంత్రివర్గం ఆమోదం లభించింది. 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష రాష్ట్రంలోని ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే సెప్టెంబరు 15 నుంచి జగనన్న ఆరోగ్య సురక్షపై అవగాహన కార్యక్రమాలు తలపెట్టాం. ఇందులో భాగంగా తప్పకుండా పేదల ఇళ్లను సందర్శించి ఆరోగ్య శ్రీ, ఆరోగ్య సురక్షపై అవగాహన కల్పించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సీఎం జగన్ సూచించారు. ఆ తర్వాత ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లు, ఎంఎల్హెచ్పీలు ఇంటింటికీ వెళ్లి అవసరమైన వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేస్తారు. మెడికల్ క్యాంపుల తేదీలను ముందుగానే ప్రకటిస్తారు. దీర్ఘకాలిక, తీవ్ర వ్యాధులతో బాధ పడేవారికి పూర్తిగా చికిత్స చేయించేంత వరకు తోడుగా నిలుస్తారు. ఇందుకోసం ప్రభుత్వం విలేజ్ క్లినిక్స్లో అందుబాటులో ఉన్న మందులు కాకుండా అదనంగా 162 రకాల మందులు, 18 సర్జికల్స్ అందుబాటులో ఉంచుతోంది. స్పెషలిస్ట్ వైద్యుల సూచన మేరకు ఇతర మందులు కూడా అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 15 వరకు దాదాపు 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణకు క్యాబినెట్ ఆమోదించింది. ప్రైవేటు వర్సిటీ విద్యలో మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు వర్సిటీస్ (ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్టు–2016 చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నాం. దీని ద్వారా ప్రైవేటు వర్సిటీల్లో నాణ్యత ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ చట్ట సవరణతో ఇంతకు ముందున్న ప్రైవేటు వర్సిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు వర్సిటీలు ప్రపంచంలోని టాప్ 100 వర్సిటీలతో భాగస్వామ్యం కలిగి ఉండాలి. ప్రఖ్యాత వర్సిటీలతో ఇక్కడి ప్రైవేటు వర్సిటీలు విద్యార్థులకు సంయుక్త సర్టిఫికేషన్ డిగ్రీలు అందించాలి. ఇప్పుడున్న ప్రైవేటు కాలేజీలను వర్సిటీలుగా మారిస్తే వచ్చే అదనపు సీట్లలో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తాయి. దీనివల్ల పేద విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. చిరుద్యోగికి పెద్ద సాయం ప్రభుత్వంలో చిరుద్యోగి రిటైరయ్యే సమయానికి కనీసం ఇంటి స్థలం సమకూర్చుకునేలా ప్రోత్సహిస్తాం. దీనిని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరిస్తుంది. రిటైరైన తర్వాత చిరుద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీతో సేవలు అందేలా సీఎం నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరోవైపు పోలవరం నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఇళ్ల అంచనా ఖర్చు పెరిగింది. 2016–17 నాటి రేట్ల ప్రకారమే ఇళ్ల నిర్మాణ అంచనాలు తయారు చేశారు. తాజా రేట్లను బట్టి చూస్తే 8,424 ఇళ్ల నిర్మాణానికి రూ.70 కోట్లు అదనంగా వ్యయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. భూదాన్– గ్రామదాన్ చట్ట సవరణ ఆంధ్రప్రదేశ్ భూదాన్–గ్రామదాన్ యాక్టు 1965 సవరణలతో కూడిన డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఆచార్య వినోభా భావే లేక ఆయన నామినేట్ చేసిన వ్యక్తిని సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు భూదాన్ బోర్డును నియమించాలి. కానీ ఈ చట్టం వచ్చి 58 సంవత్సరాలు కావడం, వినోభా భావే మృతి చెంది కూడా 41 ఏళ్లవడంతో ఆయన నామినేట్ చేసిన అసలు వ్యక్తి ఎవరో నిర్ధారించడం కష్టంగా మారింది. దీంతో చట్టానికి అనుగుణంగా ప్రభుత్వమే బోర్డు ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులను నియమించేందుకు వీలుగా చట్టాన్ని సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బలహీన వర్గాలు, పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం భూమిని మంజూరు చేసే అధికారాన్ని బోర్డు కల్పించేలా చట్టంలో మార్పు చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్ట సవరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. పోస్టుల భర్తీ ప్రతిపాదనకు ఆమోదం – ఆదోనిలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 టీచింగ్ పోస్టులు, 10 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి కేబినెట్ ఆమోదం. – కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా 13 స్పెషల్ కేడర్ డెప్యూటీ రిజిస్ట్రార్, 6 డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీ. – సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు భర్తీ. – ఆంధ్రప్రదేశ్ విద్యుత్ విభాగంలో డెప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ (తిరుపతి), ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్(రాజమండ్రి) పోస్టుల ఏర్పాటు. – కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజిమెంట్ అథారిటీ (ఏపీసీజెడ్ఎంఏ)లో శాశ్వత విభాగంతో పాటు 10 కొత్త పోస్టుల మంజూరు. – సాధారణ పరిపాలన విభాగంలో చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ. – ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ ట్రిబ్యునల్లో 5 కొత్త పోస్టుల మంజూరు. – ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 40 ఆఫీసు సబార్డినేట్ పోస్టులు, 28 డ్రైవర్ పోస్టులు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ. మరిన్ని అంశాలకు కేబినెట్ పచ్చ జెండా – ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా తొమ్మిది మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రతిపాదిత నిర్ణయం – కురుపాం గిరిజన ఇంజనీరింగ్ కళాశాలలో 50 శాతం సీట్లను షెడ్యూల్ ప్రాంతంలోని ఎస్టీ విద్యార్థులకే కేటాయింపు. – వ్యక్తుల గుర్తింపు కోసం ఆధారం వినియోగంపై చట్టబద్ధత కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఆధార్ చట్టంపై బిల్లుకు కేబినెట్ ఆమోదం. – నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతున్న రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్(ఆర్డీఎఫ్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు)పై నిషేధం మరో ఏడాది పొడిగింపు. – ఏపీఐఐసీసీకి చెందిన 2 వేల ఎకరాల్లో రూ.2,190 కోట్లతో బల్క్ డ్రగ్ ప్రాజెక్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే తొలుత అనుకున్నట్లు కాకుండా కాకినాడ నుంచి బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టును అనకాపల్లి జిల్లా నక్కపల్లికి తరలిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం ప్రభుత్వ భూముల్లోనే ఈ ప్రాజెక్టు నెలకొల్పాలి. నక్కపల్లిలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో స్థలం మార్పు చేయడానికి మంత్రివర్గం ఆమోదించింది. పలు చట్ట సవరణ బిల్లులకు ఆమోదం – ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాక్టు–2017లో భాగంగా వర్సిటీల్లో నియామకాలు ఇకపై ఏపీపీఎస్సీ ద్వారానే చేపట్టేలా సవరణ బిల్లు. – ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ టాక్సియేషన్ యాక్ట్ 1963 సవరణలతో కూడిన డ్రాప్ట్ బిల్లు. – ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ 2023 సవరణల బిల్లు. – ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్టు–1987 సవరణలకు ఆమోదం. – ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) యాక్ట్ 1977కు సవరణ. ఆర్డినెన్స్ స్థానంలో చట్టం తీసుకువస్తూ ప్రవేశపెట్టనున్న బిల్లు. – ది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు (ఏపీ ఎస్ఎస్జీ) బిల్లుకు అమోదం. అభివృద్ధికి భూ కేటాయింపులు – విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో ఎస్బీఐ ఆధ్వర్యంలో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు ఎకరా స్థలాన్ని 33 ఏళ్లపాటు లీజు ప్రతిపాదికన కేటాయింపు. – పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగులవరంలో 100.45 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు. – గుంటూరుకు చెందిన విశ్వ మానవ సమైక్యతా సంసత్ విజ్ఞప్తి మేరకు ఎకరా రూ.లక్ష చొప్పున 7.45 ఎకరాల స్థలాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడిమిపాలెంలో మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆస్పత్రి నిర్మాణానికి కేటాయింపు. – చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కృష్ణ, శ్రీకాకుళం, బాపట్ల, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన భూ కేటాయింపులు. – ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఉచితంగా 2.41 ఎకరాల భూమి కేటాయింపు. – సంస్కృతి, కళలు పెంపొందిస్తూ పర్యాటక ఆదాయాన్ని పెంచడంలో భాగంగా మధురవాడలో యూనిటీ మాల్ (కన్వెన్షన్ సెంటర్) నిర్మాణం. – బాపట్ల, నాయుడుపేట, తణుకు మున్సిపాల్టీల పరిధిలో చదరపు మీటరుకు ఏడాదికి రూ.1 నామమాత్రపు అద్దె ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులను డీబీఓటీ (డిజైన్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానంలో నిర్వహించేందుకు అవసరమైన భూమి కేటాయింపు. ‘ఐబీ’ సిలబస్ చారిత్రక ఘట్టం అమెరికా వంటి దేశాల్లో మాత్రమే ఐబీ సిలబస్ అందుబాటులో ఉంది. ఇప్పుడు మన పిల్లలకు అందిస్తున్నాం. రాష్ట్రంలో ‘ఐబీ’ సిలబస్ను ప్రవేశపెట్టడం చారిత్రక ఘట్టం. ఐబీలో చదువుకున్న విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా ఏ యూనివర్సిటీకి వెళ్లినా మంచి అవకాశాలు వస్తాయి. ప్రశ్నలు వేసే విధానం, వాటికి సమాధానాలు నేర్చుకునే విధానం నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. ఇప్పటికే మూడో తరగతి నుంచి విద్యార్థులకు వారానికి ఆరు రోజులు.. రోజూ గంట పాటు టోఫెల్ శిక్షణ ఇప్పిస్తున్నాం. వీళ్లు 8, 9 తరగతులకు వచ్చే సరికి మంచి నైపుణ్యం సాధిస్తారు. దీనివల్ల వారికి ఇంగ్లిషులో పరిజ్ఞానం బాగా పెరుగుతుంది. సివిల్స్కు సన్నద్ధమయ్యే వారికి కూడా మనం తోడ్పాటునందించాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే రూ.లక్ష, వీరు మెయిన్స్ కూడా క్వాలిఫై అయితే అదనంగా మరో రూ.50 వేలు ఇస్తే.. కష్టపడి చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఎంతో మేలు చేసినట్టువుతుంది. భవిష్యత్తులో సివిల్ సర్వెంట్లుగా ఎందరో పేదలకు సేవ చేయడానికి స్ఫూర్తినిచ్చినట్టు ఉంటుంది. – ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్పై మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ -
రోజుకు రెండు విడతలుగా టీఆర్టీ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ప్రభుత్వం మొత్తంగా 5,089 పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా రాత పరీక్ష, నియామక విధి విధానాల సమగ్ర వివరాలతో బులెటిన్ జారీ చేసింది. నవంబర్ 20వ తేదీ నుంచి రోజూ రెండు సెషన్లలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) ఉంటుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని తెలిపింది. పూర్తి ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. అభ్యర్థులు ఇచ్చే ఆప్షన్లను బట్టి పరీక్ష కేంద్రాల కేటాయింపు ఉంటుందని వెల్లడించింది. –సాక్షి, హైదరాబాద్ ఒక్కో ప్రశ్నకు అర మార్కు స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పోస్టులకోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో 160 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోదానికి అర మార్కు ఉంటుంది. టీఆర్టీ నియామకాల్లో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. అంటే 80శాతం మార్కులను రాత పరీక్ష నుంచి, 20 శాతం మార్కులను టెట్ నుంచి కలిపి తుది మార్కులను నిర్ణయిస్తారు. ♦ ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించిన పరీక్షలో వంద మార్కులకు 200 ప్రశ్నలుంటాయి. ♦ ఎస్జీటీలకు ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు.. మిగతా పోస్టులకు ఇంటర్మిడియేట్ వరకు రాష్ట్ర సిలబస్ నుంచి ప్రశ్నలిస్తారు. ♦ దివ్యాంగులకు గతంలో 75శాతంపైగా వైకల్యం ఉండాలనే నిబంధన ఉండగా.. దీనిని 40శాతానికి తగ్గించారు. పరీక్ష కేంద్రాలు ఇవీ.. అభ్యర్థులు అక్టోబర్ 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి, రూ.వెయ్యి పరీక్ష ఫీజుగా చెల్లించాలి. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్,వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు ఉంటాయి. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులుఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆప్షన్లను బట్టి అభ్యర్థులకు పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. పోస్టుల వారీగా అర్హతలివీ.. ♦ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులతో పీజీ లేదా డిగ్రీతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. (రిజర్వేషన్ కేటగిరీల వారు 45శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే చాలు).ఏ సబ్జెక్టు పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో, సంబంధిత సబ్జెక్టును డిగ్రీలో చదివి ఉండాలి. ♦ లాంగ్వేజ్ పండిట్లు సంబంధిత భాషలో డిగ్రీ, బీఈడీ చేసి ఉండాలి. ♦ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్లో కనీసం 50% (రిజర్వేషన్ వారికి 45%) మార్కులు పొంది.. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. డిగ్రీతోపాటు బీపీఈడీ చేసిన వారు కూడా దీనికి అర్హులే. ♦ అన్ని పోస్టులకు అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.ఆయ వర్గాల రిజర్వేషన్ల మేÆý‡కు మినహాయింపులు వర్తిస్తాయి. పరీక్షలు, సిలబస్ తీరు ఇదీ.. ♦ స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులకు 160 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు అరమార్కు చొప్పున 80 మార్కులుంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, విద్యలో పురోగతి, టీచింగ్ మెథడ్ నుంచి వివిధ అంశాలతో ప్రశ్నలుంటాయి. ♦ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలో 200 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి అర మార్కు చొప్పున వంద మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లి‹Ùతోపాటు క్రీడా విద్యకు సంబంధించి వివిధ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ♦ ఎస్జీటీలకు 160 ప్రశ్నలుంటాయి. ఒక్కో దానికి అరమార్కు చొప్పున 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. వివిధ సబ్జెక్టులు, టీచింగ్ విధానాలు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలుంటాయి. ఇవి 8వ తరగతి వరకూ ఉండే సిలబస్ నుంచి ఇస్తారు. ♦ పరీక్షలో కనీసం ఓసీలు 90 మార్కులు, బీసీలు 75, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు 60 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్టుగా భావిస్తారు. అభ్యర్థులు సాధించే మార్కులు, రోస్టర్ను అనుసరించి ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున ఎంపిక చేస్తారు. వారి నుంచి డీఎస్సీ ఒకరిని ఎంపిక చేస్తుంది. ఎవరికి ఎప్పుడు పరీక్ష? -
వరల్డ్ క్లాస్ విద్య
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రొఫైళ్లను సంపూర్ణంగా మారుద్దామని అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్ స్కూళ్ల కంటే ఉన్నతంగా తీర్చిదిద్దుదామన్నారు. ఈ క్రమంలో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ తరగతి గదులు, నాడు–నేడు పనులతోపాటు ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) సిలబస్ను అందుబాటులోకి తేవడం, నిత్యం టోఫెల్ శిక్షణా తరగతులను నిర్వహించడం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల అమలు, పురోగతిపై సీఎం జగన్ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టోఫెల్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం వారంలో 3 రోజుల పాటు మూడు తరగతుల చొప్పున శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు పేర్కొనగా ఇకపై ప్రతి రోజూ టోఫెల్ శిక్షణకు ఒక పీరియడ్ కేటాయించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. తద్వారా విద్యార్థులు క్రమంగా నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టడంపై సంపూర్ణ మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. దశలవారీగా ఐబీ సిలబస్ను అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం అనుసరిస్తున్న సిలబస్ను ఐబీతో అనుసంధానిస్తూ ఈ ప్రక్రియ సజావుగా, సులభంగా జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. విద్యాశాఖలో సంస్కరణల అమలు, పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్యాబ్ల పంపిణీ.. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులు, తరగతి ఉపాధ్యాయులకు రెండో విడత ట్యాబుల పంపిణీకి సిద్ధం కావాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటిల్ అసిస్టెంట్లతో డివైజ్ల వినియోగంపై విద్యార్థులకు శిక్షణ ఇప్పించాలి. నాడు–నేడు రెండో దశ పనులు పూర్తయిన అన్ని పాఠశాలల్లో కూడా డిసెంబర్ కల్లా ఐఎఫ్పీ బోర్డులు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు పూర్తి కావాలి. జూనియర్ కాలేజీలుగా మార్చేందుకు గుర్తించిన హైస్కూళ్లలో ఐఎఫ్పీ సహా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. అత్యంత నాణ్యంగా ఆహారం.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా పౌష్టికాహారాన్ని అందించేందుకు అధికంగా నిధులు వెచ్చిస్తున్నాం. ఆరోగ్యకరమైన, రుచికరమైన మెనూ తీసుకొచ్చాం. రాగిజావ అందిస్తున్నాం. వీటిల్లో ఏ ఒక్కటీ క్వాలిటీ తగ్గకూడదు. విద్యార్థులకు పెట్టే భోజనం నూటికి నూరుశాతం నాణ్యతగా ఉండాల్సిందే. పాఠశాలల్లో విద్యార్థులు తినే భోజనంపై ప్రతి రోజూ అధికారుల పర్యవేక్షణ మరింత మెరుగ్గా ఉండాలి. ఈమేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) పాటించాలి. బలహీనంగా, రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులను ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం ద్వారా గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిత్యం పౌష్టికాహారం, సమయానికి మందులు అందేలా చర్యలు తీసుకోవాలి. ఫలించిన స్పెషల్ డ్రైవ్ ప్రాథమిక విద్యలో 100 శాతం పిల్లలు బడిలోనే రాష్ట్రంలో చిన్నారులను విద్యవైపు నడిపించేలా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ సత్ఫలితాలను ఇచ్చిందని అధికారులు సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తెచ్చారు. ప్రాథమిక విద్యలో నూటికి నూరు శాతం పిల్లలు బడిలోనే ఉన్నారని వివరించారు. సీనియర్ సెకండరీ విభాగంలో 96.94 శాతం మంది, హయ్యర్ సెకండరీ విభాగంలో 74.9 శాతం స్కూళ్లలోనే ఉన్నట్టు తెలిపారు. అమ్మఒడి పథకంతోపాటు 10, 12వ తరగతులు ఫెయిల్ అయిన విద్యార్థులకు రీ అడ్మిషన్, స్కిల్ సెంటర్లలో చేర్పించి వారికి ఓపెన్ స్కూల్ అడ్మిషన్, వలంటీర్లు, సచివాలయాల ద్వారా నిర్వహించిన ప్రచారంతో సత్ఫలితాలు వచ్చాయన్నారు. 1 నుంచి 12వ తరగతి వరకు ప్రస్తుతం 83,52,738 మంది విద్య అభ్యసిస్తున్నట్టు వెల్లడించారు. తొలి విడతగా నిర్దేశించుకున్న మేరకు 4,804 స్కూళ్లలో 30,213 ఐఎఫ్పీ ప్యానళ్లు, 6,515 స్కూళ్లలో స్మార్ట్ టీవీలను బిగించామని అధికారులు వివరించారు. ఇప్పటికే ఐఎఫ్పీ, స్మార్ట్ టీవీల వినియోగింపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామన్నారు. 91.33 శాతం మంది ఇంగ్లీషు మీడియంలోనే పరీక్షలు ఐఎఫ్పీ ప్యానళ్లు ఏర్పాటు చేసిన చోట రెండు రకాల ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. స్మార్ట్ ఫోన్లో, ఫోన్ ఎస్డీ కార్డులో, యూట్యూబ్లో, ట్యాబుల్లో, ఐఎఫ్పీలో, అధీకృత వెబ్సైట్లలో, ఇ–పాఠశాల డీటీహెచ్ల్లో ఇలా ఎందులోనైనా ఒకే విధమైన పాఠ్యప్రణాళిక, ఒకే పాఠ్యాంశాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచామన్నారు. ఆగస్టులో నిర్వహించిన మొదటి అసెస్మెంట్లో మూడో తరగతి నుంచి 9 వతరగతి వరకూ దాదాపు 91.33 శాతం మంది పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాశారని చెప్పారు. 6 నుంచే ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర అత్యాధునిక టెక్నాలజీపై సమీక్షలో అధికారులు పలు అంశాలను సీఎంకు నివేదించారు. ఆరో తరగతి నుంచి కృత్రిమ మేధను ప్రత్యేక సబ్జెక్టుగా బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శిక్షణ, బోధన కార్యక్రమాలకు సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీలను అనుసంధానం చేయడంతో పాటు ఏఐపై పాఠ్యాంశాలు బోధించేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందిస్తున్నట్టు వివరించారు. అవసరమైన చోట అదనపు గదులు, సదుపాయాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో రెండో విడత నాడు–నేడు పనులు చురుగ్గా జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తెస్తుండగా వాటిల్లో ఒకటి బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 679 మండలాలకుగాను 473 మండలాల్లో బాలికలు, కో–ఎడ్యుకేషన్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చామన్నారు. మిగిలిన చోట్ల హైస్కూళ్లను ప్లస్ టూగా మార్చేందుకు జాబితా రూపొందిస్తున్నామన్నారు. అవసరమైన మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (మౌలిక వసతుల కల్పన) కాటమనేని భాస్కర్, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ నిధి మీనా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సి.ఎన్ దీవాన్రెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,139 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం ఉదయ, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్ పేపర్–1, పేపర్–2 నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది. వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచిన అధికారులు, వాటిలో పొరపాట్లు తలెత్తితే సరిచేసుకునే సూచనలు సైతం వెల్లడించారు. ♦ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపర్–1 పరీక్షకు 1,139 కేంద్రాలు ఏర్పాటు చేయ గా, 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ♦మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్–2 పరీక్షకు 913 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,08,498 మంది అభ్యర్థులు హాజరవుతారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో... టెట్ జరిగే కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్ష తీరును పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రెండు బాల్ పాయింట్ బ్లాక్ పెన్నులు అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలి. హాల్టికెట్ లేకుండా పరీక్షకేంద్రంలోని ప్రవేశం ఉండదు. అభ్యర్థులు ఓఎమ్మార్ పత్రంలో వివరాలు బ్లాక్ బాల్ పాయింట్ పెన్తోనే పూరించాలి. మరే రంగు పెన్నుతో నింపడానికి అనుమతించరు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు, ఇతర వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయం పూర్తయ్యాకే అభ్యర్థులను కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు. అభ్యర్థుల హాల్టికెట్లో పేరులో ఏమైనా స్వల్ప అక్షరదోషాలు, వివరాలు సరిగ్గా లేకుంటే పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలి. హాల్టికెట్పైన ఫొటో, సంతకం సరిగా లేకున్నా ఫొటో అతికించి గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకోవడంతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డు, ఇతర ఫొటో ఐడీ కార్డులతో సంబంధిత డీఈఓలను సంప్రదించాలి. వారి అనుమతితోనే పరీక్షకు అనుమతిస్తారు. -
టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్ను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. వాస్తవానికి ఈ నెల 5వ తేదీనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రూపొందించినప్పటికీ గోప్యంగా ఉంచిన విద్యాశాఖ, గురువారం అర్థరాత్రి వెల్లడించింది. శాఖలో 22 వేల వరకూ ఖాళీలున్నప్పటికీ, కేవలం 5,089 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నట్టు వెల్లడించింది. 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీలను కూడా భర్తీ చేస్తామని గతంలో ప్రకటించినా నోటిఫికేషన్లో ఆ ఖాళీలను ప్రస్తావించలేదు. స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషా పండితుల పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలిపింది. తొలిసారిగా ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్)లో పరీక్షను నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు దశల వారీగా పరీక్ష ఉంటుందని తెలిపారు. గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లు.. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం నల్లగొండ, సంగారెడ్డిలో పరీక్ష కేంద్రాలుంటాయని ప్రభుత్వం పేర్కొంది. అభ్యర్ధుల గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ళు, దివ్యాంగులకు పది సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఇస్తారు. అయితే ఈసారి టీఆర్టీ ఫీజును రూ.200 నుంచి రూ.1,000కి పెంచారు. పరీక్ష ఆన్లైన్లో పెడుతున్న కారణంగా ఫీజు పెంచినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 20 మధ్య ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఉత్తీర్ణతకు ఓసీలు 90, బీసీలు 75, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు 60 మార్కులు తెచ్చుకోవాలి. టెట్ మార్కుల్లో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టీఆర్టీలో వచి్చన మార్కుల ఆధారంగా ప్రతి పోస్టుకు ముగ్గుర్ని ఎంపిక చేస్తారు. వారి మార్కులు ఇతర మెరిట్స్ ఆధారంగా అందులో ఒకరిని ఎంపిక చేస్తారు. కాగా పూర్తి సమాచారం ఈ నెల 20వ తేదీ నుంచి www.schooledu.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. రెండు నెలల వ్యవధేనా? పాఠశాల విద్యాశాఖలో 22 వేల పోస్టులున్నాయని గత ఏడాది విద్యాశాఖ తెలిపింది. ఇందులో 13,086 పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ప్రస్తుతం టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపడుతున్నారు. దీనివల్ల కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. వీటిని కూడా కలిపి ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తారని నిరుద్యోగులు భావించారు. కానీ 5,089 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు కేవలం 2 నెలల వ్యవధిలోనే పరీక్ష నిర్వహిస్తుండటంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. పబ్లిక్ సరీ్వస్ కమిషన్ పరీక్షలకు కూడా ఆర్నెల్ల సమయం ఇస్తున్న సర్కార్, టీఆర్టీని ఇంత త్వరగా పెట్టడం ఏమిటని నిరుద్యోగులు అంటున్నారు. -
ఇంటికే ‘ఈ–పాఠం’
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతోంది. విద్యార్థి ఎక్కడున్నా నేర్చుకునేలా పాఠాలను అందిస్తోంది. పాఠ్యాంశాలు విద్యార్థికి మరింత అర్థమయ్యేలా, వివిధ మాధ్యమాల ద్వారా నేర్చుకునేలా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఏపీ ఎస్సీఈఆర్టీ) వీడియో కంటెంట్ను రూపొందించింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో మూడు నుంచి 9వ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలను సిద్ధం చేసింది.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్పీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందిస్తోంది. మరోవైపు అవే పాఠాలను ట్యాబ్ల ద్వారా ఇంటి వద్ద కూడా నేర్చుకునేలా బైజూస్ కంటెంట్ను అప్లోడ్ చేసి అందించింది. వీటితోపాటు ఆయా తరగతుల అన్ని పాఠ్యాంశాలకు నిపుణులైన ఉపాధ్యాయులతో 366 వీడియోలను రూపొందించిన ఎస్సీఈఆర్టీ వాటిని యూట్యూబ్ (ఆంధ్రప్రదేశ్ ఈ–పాఠశాల చానల్)లోనూ అప్లోడ్ చేసింది.వీటిని మొబైల్ ఫోన్లోనూ చూసే అవకాశం కల్పించింది. ఈ వీడియోలను విద్యార్థి ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు. తద్వారా బడిలో ఉపాధ్యాయులు బోధించినప్పుడు విస్మరించిన, మరిచిపోయిన అంశాలను తిరిగి మననం చేసుకోవచ్చు. ఐదు డీటీహెచ్ చానళ్ల ద్వారా ప్రసారం టీవీలకు అలవాటుపడిన విద్యార్థుల్లో కూడా చదువుపై ఆసక్తి కలిగించేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విధానంలో ప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు ఈ–విద్య డీటీహెచ్ చానళ్లను కేటాయించింది. వీటిలో ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక చానల్ వినియోగిస్తున్నారు. మిగిలిన నాలుగు చానళ్లను ఆరు నుంచి 9వ తరగతి పాఠ్యాంశాల ప్రసారానికి కేటాయించారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన విద్యా క్యాలండర్, పాఠ్యప్రణాళిక ప్రకారం.. ఆయా నిర్మిత తేదీల్లో డీటీహెచ్ చానళ్లలో ఆ నెల పాఠ్యాంశాలను నిరంతరం ప్రసారం చేస్తారు. ఇలా 100 శాతం కంటెంట్తో ఈ–విద్య డీటీహెచ్ చానళ్ల ద్వారా పూర్తి స్థాయి పాఠాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ, జూనియర్ విభాగాల్లో టోఫెల్ను ప్రవేశపెట్టడంతో ఆయా పాఠాల బోధనకు మరో మూడు డీటీహెచ్ చానళ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. మొబైల్ యాప్ సైతం.. ఆన్లైన్లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ‘ఈ–పాఠశాల’ మొబైల్ యాప్ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్పీ, ట్యాబ్, డీటీహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్.. ఇలా అన్ని మాధ్యమాల్లోనూ ఒకే తరహా కంటెంట్, బోధన ఉండేలా వీడియోలను రూపొందించారు. దీంతో విద్యార్థి ఎలాంటి గందరగోళం లేకుండా తన తరగతి పాఠాలను ఈ ఐదు మాధ్యమాల్లో సులువుగా నేర్చుకోవచ్చు. అన్ని కేబుల్ నెట్వర్క్ల్లోనూ ప్రసారం బడిలో ఉపాధ్యాయులు బోధించే అన్ని పాఠాలను ఈ–కంటెంట్ రూపంలోకి మార్చాం. నిష్ణాతులైన సబ్జెక్టు ఉపాధ్యాయులతో సిలబస్ వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వీడియో పాఠాలు రూపొందించాం. ఈ–పాఠశాల చానళ్లను అందించేందుకు ప్రైవేటు టీవీ నెట్వర్క్ ప్రొవైడర్లు కూడా అంగీకరించారు. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రసారమవుతున్నాయి. త్వరలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంట్లో టీవీ ద్వారా విద్యార్థులు పాఠాలు వినొచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా ఎప్పుడైనా వీటిని చూడొచ్చు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతులు 3 నుంచి 9 తరగతి వరకు వీడియో కంటెంట్ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల్లోని కంటెంట్ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖకు అందించింది. వీటిని యధావిధిగా విద్యార్థులకు ఐఎఫ్పీల ద్వారా బోధించడంతోపాటు ట్యాబ్ల్లోనూ అప్లోడ్ చేశారు. అయితే, ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్తోపాటు కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ఇందులో ప్రధానంగా మూడో తరగతి విద్యార్థులకు.. తెలుగు, ఇంగ్లిష్ , మ్యాథ్స్, ఈవీఎస్, నాలుగు, ఐదు తరగతులకు.. తెలుగు, ఇంగ్లిష్ , ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు.. తెలుగు, ఇంగ్లిష్ , హిందీ సబ్జెక్టుల్లో వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్లో పాఠాలు అందరికీ అందుబాటులో ఉండగా.. ప్రైవేటు నెట్వర్క్ ప్రొవైడర్లు చాలా ప్రాంతాల్లో డీటీహెచ్ చానళ్లను అందించడం లేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన డీటీహెచ్ చానళ్లను అన్ని ప్రైవేటు కేబుల్ నెట్వర్క్ సంస్థలు కూడా అందించేలా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను రూపొందించనుంది. -
‘ఇంగ్లిష్’ ప్రావీణ్య ఉపాధ్యాయులకు అవార్డులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఉత్తమ ఇంగ్లిష్ బోధనా నైపుణ్యాలు గల ఉపాధ్యాయులను సత్కరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఏటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న ఉత్తమ ఉపాధ్యాయులను పురస్కారాలతో సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి అదనంగా ఈ ఏడాది ప్రత్యేకంగా ఇంగ్లిష్లో బోధనా నైపుణ్యం గల ఉపాధ్యాయులను ప్రత్యేక కేటగిరీ కింద సత్కరించనుంది. ఇందుకోసం ప్రపంచంలో ఉపాధ్యాయుల నైపుణ్యాలను పరీక్షించే అతిపెద్ద సంస్థ.. సెంటర్ ఫర్ టీచర్ అక్రిడిటేషన్ (సెంటా) సహకారాన్ని తీసుకుంటున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. భారతదేశంలో 80 శాతం ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని అంచనా వేస్తోన్న సెంటా ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రావీణ్యాన్ని పరీక్షిస్తామన్నారు. ఈ నెల 27 వరకు ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ చేపడతామని చెప్పారు. 29న ఆన్లైన్లో ప్రావీణ్య పరీక్ష నిర్వహించనున్నట్టు విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. ఉత్తమ ప్రావీణ్యం గల ఉపాధ్యాయులను టీచర్స్ డే సందర్భంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో అవార్డులతో సత్కరిస్తామన్నారు. -
ప్రతిభకు సర్కారు పట్టం
సాక్షి అమరావతి : రైతుకూలి బిడ్డ అమ్మాజాన్, లారీ డ్రైవర్ కుమార్తె రాజేశ్వరి, సెక్యూరిటీ గార్డు కూతురు జ్యోత్స్న, కౌలురైతు కొడుకు అంజన సాయి, రోజుకూలీ బిడ్డ గాయత్రి, ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కుమార్తె శివలింగమ్మ, టీచర్ కూతురు మనశ్విని, రైతుబిడ్డ యోగీశ్వర్, మెకానిక్ కూతురు రిషితారెడ్డి, ఆటోడ్రైవర్ కుమార్తె చంద్రలేఖ.. వీరి కుటుంబాలకు పని ఉంటేనే రోజు గడిచేది.. లేకపోతే పస్తులే. ఇలాంటి వారి గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది? అని అనిపించడం సహజం. పైగా.. ఈ కోవకు చెందినవారు రాష్ట్రంలో లక్షల్లో ఉంటారు.. పత్రికలో రాసేటంతగా విషయం ఏముంటుంది అని కూడా అనుకోవచ్చు.. కానీ, చదువులో రాణించి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోవడమే వీరు సాధించిన గొప్ప విజయం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉత్తమ మార్కులు సాధించిన 150 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వారికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, మారిన బడుల తీరుపై పరీక్ష నిర్వహించగా మొత్తం 30 మంది ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. వీరికి కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ) కార్యదర్శి మధుసూదనరావు, యూఎన్ఓ స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్కుమార్ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం మౌఖిక పరీక్షలు నిర్వహించి పై 10 మందిని విజేతలుగా ఎంపిక చేసింది. ఇప్పుడు వీరంతా సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు ప్రభుత్వ ఖర్చుతో ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడంతో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడతారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యా సంస్కరణలపైన, పాఠశాలల అభివృద్ధిపైన మాట్లాడేందుకు సరైన ప్రతినిధులు విద్యార్థులేనని.. ఎంపికైన వారంతా పేద కుటుంబాల పిల్లలేనని పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్కుమార్ తెలిపారు. ఈ పర్యటనలో వీరు అమెరికా అధ్యక్ష భవనాన్ని సైతం సందర్శిస్తారన్నారు. విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వమే ఐక్యరాజ్య సమితికి పంపిస్తోందని, వీరికి అవసరమైన పాస్పోర్టు, వీసా వంటి అన్ని ఏర్పాట్లుచేసినట్లు వారు వివరించారు. ఇక ఈ విద్యార్థుల విజయగాథ ఏమిటంటే.. గిరిజన బాలికకు అద్భుత అవకాశం.. కురుపాం మండలం కొండబారిడి గిరిజన గ్రామానికి చెందిన సామల మనశ్విని తల్లి కృష్ణవేణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మనశ్విని ప్రస్తుతం గుమ్మలక్ష్మీపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. గిరిజన కుగ్రామంలో పుట్టి పెరిగిన మనశ్విని అమెరికా వెళ్లనున్న పది మంది విద్యార్థుల్లో ఒక్కరిగా నిలిచింది. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి సభలో తన ప్రసంగం ద్వారా ఆకట్టుకుంది. రైతు బిడ్డకు గొప్ప వరం కర్నూలు జిల్లా కౌతాళం మండలం పొదలకుంట గ్రామానికి చెందిన మించాలవారి సోమనాథ్, గంగమ్మ ల నాలుగో సంతానం శివలింగమ్మ ఆదోని కేజీబీవీలో పదో తరగతి 541 మార్కులతో పాసైంది. బాలిక తండ్రి సోమనాథ్ కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేయడంతో పాటు ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. శివలింగమ్మ అమెరికా వరకు వెళ్లే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు సోమనాథ్ ఎక్కడలేని ఆనందం వ్యక్తంచేశారు. ఐరాస సదస్సుకు రైతుబిడ్డ.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామానికి చెందిన వంజవాకం నాగరాజు, విజయ దంపతుల రెండో కుమారుడు యోగీశ్వర్. తండ్రి ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకునే రైతు. ఇద్దరి సంతానంలో పాప విద్యశ్రీ ఇంటర్ చదువుతుండగా, కుమారుడు యోగీశ్వర్ 10వ తరగతిలో 586 మార్కులు సాధించి జిల్లాలో రెండోస్థానం సాధించాడు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద తమబిడ్డల చదువుకు ఎంతో సహకరించాయని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కేక.. చంద్ర లేఖ.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మోతుకూరి రామారావు, మణి దంపతుల రెండో కుమార్తె చంద్రలేఖ. రాష్ట్ర విభజనతో కుటంబంతో భద్రాచలం నుంచి ఎటపాకకు వచ్చిన రామారావు చంద్రలేఖను స్థానిక కేజీబీవీలో చదివించారు. ఇటీవల పదో తరగతిలో 523 మార్కులు సాధించి కేజీబీవీ జిల్లా టాపర్గా నిలిచి ప్రభుత్వం అందించిన జగనన్న ఆణిముత్యాలు సత్కారం కింద రూ.50 వేల నగదు బహుమతి అందుకుంది. ఈ విజయమే ఆమెను ఐక్యరాజ్య సమితికి వెళ్లేలా బాటవేసింది. తల్లి కష్టంతో తల్లడిల్లి.. పూట గడవడం కూడా కష్టమైన ఇంట్లో పుట్టిన షేక్ అమ్మాజాన్ ఏడేళ్ల క్రితం తండ్రిని కోల్పోయింది. రైతుకూలీ అయిన తల్లి కష్టంచూసి చదువుల్లో రాణించాలనుకుంది. ఐదో తరగతిలోనే వైఎస్సా ర్జిల్లా వేంపల్లిలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో సీటు తెచ్చుకుంది. ఇటీవల టెన్త్లో 581 మార్కు లు సాధించి రాష్ట్రస్థాయిలో జగనన్న ఆణిముత్యా లు సత్కారం కింద రూ.లక్ష నగదు బహుమతి అందుకుంది. ఇప్పుడు ఐరాస గడప తొక్కుతోంది. ప్రస్తుతం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చేరింది. ప్రతిభ చాటిన సెక్యూరిటీ గార్డు బిడ్డ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం రమణక్కపేటకు చెందిన దడాల సింహాచలం ప్రైవేటు సెక్యూరిటీ గార్డు. ఈయన భార్య గృహిణి. వీరి రెండో కుమార్తె జ్యోత్స్న టెన్త్లో 589 మార్కులు సాధించింది. దీంతో పాటు జగనన్న ఆణిముత్యాలు రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాన్ని సైతం అందుకుంది. ఇప్పుడు కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం ఐఐటీ అకాడమీలో ఇంటర్ చదువుతూ అమెరికా అవకాశాన్ని అందిపుచ్చుకుంది. కౌలురైతు కొడుకు ఘనత.. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరుపల్లికి చెందిన జి.గణేష్ అంజనసాయి ఏలూరు జిల్లా అప్పలరాజుగూడెం గురుకుల పాఠ శాలలో చదువుకున్నాడు. టెన్త్లో 581 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. తండ్రి గోపి కౌలురైతు కాగా, తల్లి లక్ష్మి గృహిణి. కుటుంబానికి చదువు భారం కాకూడదని గురుకుల పాఠశాలలో సీటు తెచ్చుకున్నాడు. 590 మార్కులతో అదరహో.. తండ్రి కూలీ, తల్లి గృహిణి. తండ్రికి పని దొరికితేనే పూటగడిచే పరిస్థితి. తన భవిష్యత్ను చదువుల ద్వారా తీర్చిదిద్దుకుని, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని బలంగా అనుకుంది పసుపులేటి గాయత్రి. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివి ఏకంగా 590 మార్కులు సాధించి జిల్లాలోనే టాపర్గా నిలిచింది. అమెరికా బృందానికి ఎంపికైంది. మెరిసిన మెకానిక్ కుమార్తె.. విజయనగరం శివారు జమ్మునారాయణపురంలో నివాసముండే అల్లం రామకృష్ణారెడ్డి, ఉదయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ప్రైవేటు సంస్థలో మెకానిక్గా పనిచేసే రామకృష్ణారెడ్డి రెండో కుమార్తె రిషితారెడ్డి స్థానిక మున్సిపల్ హైస్కూల్లో టెన్త్ చదివి 587 మార్కులు సాధించి, నూజివీడు ట్రిపుల్ ఐటీలో చేరింది. ఇప్పుడు అమెరికా వెళ్లే అరుదైన అవకాశం దక్కించుకుంది. నంద్యాల నుంచి అమెరికాకు.. నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రాంతానికి చెందిన విద్యార్థిని సి.రాజేశ్వరి తండ్రి దస్తగిరి లారీడ్రైవర్, భార్య రామలక్ష్మమ్మ ఇంటివద్ద బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. వీరి పెద్ద కుమార్తె రాజేశ్వరి నంద్యాలలోని ఏపీ మోడల్ స్కూల్లో టెన్త్ చదివి 583 మార్కులు సాధించి నియోజకవర్గంలో టాపర్గా నిలిచింది. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించడంతో ఐరాసకు వెళ్లే అరుదైన అవకాశం కైవసం చేసుకుంది. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: బడికొస్తున్న ‘మేధావి’!
నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి: వెంకటేష్ గతంలో పది రోజుల పాటు పాఠశాలకు రాకపోయినా ప్రధానోపాధ్యాయుడికే సమాచారం లేని పరిస్థితి! వందల మంది విద్యార్థుల్లో ఎవరు సక్రమంగా వస్తున్నారో.. ఎంతమంది డుమ్మా కొట్టారో తెలుసుకోవాలంటే అటెండెన్స్ రిజిస్టర్లు తిరగేయాల్సిందే! ఆ వివరాలన్నీ సేకరించి హెచ్ఎం దృష్టికి వెళ్లేసరికి రోజులు గడిచిపోయేవి! ఇప్పుడు ఓ విద్యార్థి పాఠశాలకు రాకుంటే హెచ్ఎంకే కాదు.. ఏకంగా విజయవాడలోని విద్యాశాఖ కమిషనర్కు కూడా నిమిషాల్లో తెలిసిపోతోంది. ఒక్క రోజు బడికి గైర్హాజరైనా తల్లిదండ్రులకు సమాచారం అందుతోంది. ఉపాధ్యాయులు సమయానికి రాకున్నా, విద్యార్థులకు తాగునీరు అందకపోయినా, మరుగుదొడ్ల తలుపు విరిగిపోయినా ఉన్నతాధికారులు తక్షణమే గుర్తిస్తున్నారు. తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) టెక్నాలజీ సాయంతో పాఠశాల విద్యాశాఖ సాధించిన విజయం. నూరు శాతం ఫలితాలు.. ప్రతి విద్యార్థీ క్రమశిక్షణ పాటిస్తూ రోజూ బడికి వెళ్లి చక్కగా చదువుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తోంది. పుస్తకాల నుంచి ఫీజుల దాకా తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడకుండా భావి పౌరులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్ది ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంగ్లిష్ మీడియంలో చదువులతోపాటు టోఫెల్ లాంటి పరీక్షలకు సైతం ఉచితంగా తర్ఫీదునిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా మన విద్యార్థులను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో కొండకోనల్లోని స్కూళ్లను సైతం పర్యవేక్షించేలా గతేడాది అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక సాంకేతిక విభాగం ఇప్పుడు దేశంలోనే ఉత్తమ పనితీరుతో ముందంజలో నిలుస్తోంది. రాష్ట్రంలోని 58,465 పాఠశాలల్లో జరిగే అన్ని కార్యకలాపాలు, విద్యార్థుల మంచిచెడులు, ఉపాధ్యాయుల స్థితిగతులు, నాడు–నేడు పనులను ‘ఏఐ’ టెక్నాలజీతో నిరంతరం ఉన్నతస్థాయిలో పర్యవేక్షించడంతో పాటు తక్కువ వ్యవధిలోనే నూరు శాతం ఫలితాలు సాధించారు. అత్యుత్తమ కమాండ్ సెంటర్లు మనవే.. నిన్న మొన్నటి దాకా ఇంటి నుంచి కాలు బయటపెట్టిన విద్యార్థి సక్రమంగా స్కూలుకు వెళ్లాడో లేదో అంతు చిక్కని పరిస్థితి. టీచర్ స్కూల్కు వచ్చారో లేదో కనీసం ఎంఈవో దృష్టికి కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ముందస్తు సమాచారం లేకుండా బడి మానేసినా.. ఉపాధ్యాయుడు సెలవు పెట్టకుండా స్కూలుకు రాకున్నా ఆ విషయం విద్యాశాఖ కమిషనర్కు, ప్రధాన కార్యదర్శికి, సంబంధిత మంత్రికి సైతం గంట వ్యవధిలోనే తెలిసిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 70,70,143 మంది విద్యార్థులు, 3,01,677 మంది ప్రభుత్వ టీచర్ల హాజరును కాగితాలతో పని లేకుండా నిత్యం నిశితంగా పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలో రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లను (విద్యా సమీక్ష కేంద్రాలు)నెలకొల్పి విద్యార్థుల హాజరు మొదలు గోరుముద్ద, విద్యాకానుక, అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు లాంటి సమస్త అంశాలను దీనికి అనుసంధానించారు. ఇలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లు దేశంలో మూడు (గుజరాత్, ఢిల్లీ, ఏపీ) మాత్రమే ఉండగా అత్యుత్తమ పనితీరుతో పూర్తిగా ఆన్లైన్ (పేపర్ లెస్) విధానాన్ని అనుసరిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. గతేడాది అక్టోబర్లో ప్రారంభమైన ఈ సెంటర్ సమర్థంగా సేవలు అందించడంతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ప్రతి రోజు 99.50 శాతం హాజరు నమోదవుతుండడం విశేషం. ఎంతో విజయవంతమైన మన ఎడ్యుకేషన్ టెక్నాలజీని పక్క రాష్ట్రాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటెండెన్స్ యాప్లో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో 58,465 పాఠశాలలు (44,372 ప్రభుత్వ, 847 ఎయిడెడ్, 13,189 ప్రైవేట్, 57 కేంద్ర ప్రభుత్వ పరిధిలోవి) ఉండగా వీటిలో 70,70,143 మంది విద్యార్థులు చదువుతున్నారు. అమ్మ ఒడి పథకానికి విద్యార్థుల హాజరును పరిగణలోకి తీసుకుంటూ అన్ని యాజమాన్యాల్లో చదువుతున్న విద్యార్థుల హాజరును రోజూ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. ఉదయం 10.30 గంటలకల్లా విద్యార్థుల హాజరును ఆన్లైన్లో నమోదు చేయగానే గోరుముద్ద, కోడిగుడ్డు, రాగిజావ, చిక్కీ తీసుకునేవారి వివరాలు ‘ఏఐ’ టెక్నాలజీ అటెండెన్స్ యాప్లో నమోదవుతున్నాయి. ఇదే తరహాలో ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నేషన్ సైతం ఉదయం 9 నుంచి 9.15 గంటల మధ్య స్కూలు పరిధిలోనే ఫొటోతో నమోదు చేయాలి. నెట్ సౌకర్యం లేకున్నా అందుబాటులోకి రాగానే టైమ్తో సహా అప్డేట్ అయ్యేలా టెక్నాలజీని రూపొందించారు. ‘‘స్కూల్ ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టం’’ (సిమ్స్)లో రికార్డయ్యే వివరాలు ఉదయం 11– 12 గంటల్లోగా విజయవాడ, విశాఖల్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లకు చేరుతున్నాయి. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యా సంబంధ గ్రీవెన్స్, పాఠశాల పర్యవేక్షణ, గోరుముద్ద, కన్స్టెంట్ రిథమ్(నాడు–నేడు), విద్యాకానుక, బైజూస్, డీబీటీ అంశాలను అనుసంధానించారు. గత సెపె్టంబర్, అక్టోబర్ నాటికి రోజుకు 68 శాతం కంటే తక్కువగా ఉన్న విద్యార్థుల హాజరు ఈ టెక్నాలజీ రాకతో ఇప్పుడు 99.50 శాతానికి పైగా నమోదవుతోంది. నెట్వర్క్ సరిగాలేని ఒకటి రెండు జిల్లాల్లోని కొన్ని పాఠశాలలు మినహా మిగిలిన అన్నిచోట్లా నూరు శాతం ఫలితాలు రావడం గమనార్హం. జిల్లాకు ఇద్దరు చొప్పున పర్యవేక్షణ కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది మధ్యాహ్నం 12 గంటల నుంచి బడికి గైర్హాజరైన విద్యార్థుల వివరాలను గుర్తించి తల్లిదండ్రుల ఫోన్కు మెస్సేజ్లు పంపుతున్నారు. ఒక్క రోజు రాకుంటే తల్లిదండ్రులకు సమాచారం ఇస్తుండగా వరుసగా మూడు రోజులు గైర్హాజరైతే విద్యార్థి ఇంటి పరిధిలోని వలంటీర్కు, గ్రామ / వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శికి, ఎంఈవో, డీఈఓలకు సమాచారం అందుతోంది. అందుకు కారణాలను తెలుసుకుని ఆ వివరాలను యాప్లో నమోదు చేసి సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ఇందుకోసం జిల్లాకు ఇద్దరు చొప్పున 52 మంది సిబ్బందితోపాటు జోన్కు ఒక్కరు చొప్పున నలుగురు పర్యవేక్షకులు విధులు నిర్వర్తిస్తూ ఏ రోజు అంశాలను అదేరోజు పరిష్కరిస్తున్నారు. విజయవాడ సెంటర్ నుంచి టీచర్ల అటెండెన్స్, గోరుముద్ద, బైజూస్, అకడమిక్ అంశాలను పరిశీలిస్తుండగా విశాఖ కేంద్రంగా విద్యార్థుల హాజరు, కన్స్టెన్ రిథమ్, జేవీకే, డీబీటీ అంశాలను పర్యవేక్షిస్తున్నారు. సచివాలయాలతో అనుసంధానం నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డబుల్ డెస్క్ బెంచీలు, ఫ్యాన్లు, స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీ స్క్రీన్లు, టాయిలెట్లు, ఆర్వో తాగునీరు లాంటి వసతులను ప్రభుత్వం కల్పించింది. వీటిని ప్రతినెలా పరిశీలించేలా గ్రామ / వార్డు సచివాలయాల సిబ్బందిని విద్యాశాఖ పోర్టల్తో అనుసంధానించారు. స్థానిక ఆరోగ్య సిబ్బంది వారంలో ఒకసారి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేయాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ సైతం నిర్ణీత వ్యవధిలో స్కూల్లో సమస్యలను గుర్తించి ఫొటోతో సహా యాప్లో అప్లోడ్ చేయాలి. ఇలా స్కూలు హెచ్ఎం నుంచి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి వరకు అన్ని స్థాయిల్లో పరిశీలిస్తారు. ఈ విధానంలో ఎవరికి వారే బాధ్యులు, వారికి వారే పర్యవేక్షకులు. అన్ని అంశాలు పారదర్శకంగా జరిగేలా టెక్నాలజీ అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది. ఒక్క క్లిక్తో పర్యవేక్షణ.. గతంలో పాఠశాలలో ఏం జరుగుతోందో జిల్లా అధికారులకు కూడా తెలిసేది కాదు. ఇక రాష్ట్ర స్థాయికి చేరుకునే ఊసే లేదు. ఇప్పుడు అన్ని అంశాలను టెక్నాలజీ పర్యవేక్షిస్తోంది. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తోంది. గతేడాది అక్టోబర్లో విజయవాడలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశాం. మరో సెంటర్ను ఈ ఏడాది జూన్లో విశాఖలో అందుబాటులోకి తెచ్చాం. దాదాపు 70 లక్షల మంది విద్యార్థులు, 3 లక్షల మంది ఉపాధ్యాయులు, 58 వేల పాఠశాలలను ఒక్క క్లిక్తో పర్యవేక్షించవచ్చు. స్కూళ్ల నిర్వహణ, బోధనలో నూరు శాతం పారదర్శకంగా విజయవంతంగా ఫలితాలను నమోదు చేశాం. అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ ఉండడంతో ఎక్కడా తప్పు జరిగేందుకు ఆస్కారం లేదు. – కాటమనేని భాస్కర్, పాఠశాల మౌలిక వసతుల కమిషనర్ -
రేపటి నుంచి క్లాస్ బేస్డ్ అసెస్మెంట్
సాక్షి, అమరావతి: 1–10 తరగతి విద్యార్థులకు ఆగస్ట్ 1–4వ తేదీ వరకు క్లాస్ బేస్డ్ అసెస్మెంట్ (సీబీఏ–1) పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు ఆదివారం షెడ్యూల్ను విడుదల చేసింది. మంగళ, బుధ, గురువారాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం తెలుగు, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఓఎస్ఎస్సీ (మూడు నుంచి ఐదు తరగతులకు), మధ్యాహ్నం గణితం, ఇంగ్లిష్ పార్ట్–ఏ, మూడు, నాలుగు, ఐదు తరగతులకు పార్ట్–బి అసెస్మెంట్ నిర్వహించనున్నారు. 6,7,8 తరగతులకు మంగళవారం మధ్యాహ్నం సెషన్లో తెలుగు, గణితం, బుధవారం హిందీ, జనరల్ సైన్స్, గురువారం సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ పార్ట్–ఎ, పార్ట్–బి, శుక్రవారం ఓఎస్ఎస్సీ–1, 2 పేపర్లు ఉంటాయి. 9,10 తరగతులకు మంగళవారం ఉదయం తెలుగు, మ్యాథ్స్, బుధవారం ఉదయం హిందీ, జనరల్ సైన్స్, గురువారం సోషల్ స్టడీస్, ఇంగ్లి‹Ù, ఇంగ్లిష్ పార్ట్–బి (తొమ్మిదో తరగతికి), శుక్రవారం ఓఎస్ఎస్సీ–1, 2 ఉంటాయని పేర్కొంది. -
AP: 45 వేల పాఠశాలలు.. 1.06 కోట్ల పుస్తకాలు
సాక్షి, అమరావతి: వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు విద్యాకానుక అందించి చరిత్ర సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు రెండో సెమిస్టర్కు పుస్తకాల పంపిణీ విషయంలోనూ రికార్డు నెలకొల్పింది. నవంబర్లో ప్రారంభమయ్యే 2వ సెమిస్టర్ పుస్తకాలను విద్యార్థులకు 2 నెలల ముందే పంపిణీ చేసింది. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో సైతం పుస్తకాల పంపిణీ పూర్తిచేసింది. రాష్ట్రంలోని 45,409 పాఠశాలల్లో ఒకటి నుంచి 9వ తరగతి వరకు 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి అవసరమైన 1,06,82,080 రెండో సెమిస్టర్ పుస్తకాలను శనివారం అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా సాగిన పుస్తకాల పంపిణీలో విద్యాశాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని అమలాపురం ఎంపీపీ స్కూల్లోను, ఎస్.రాయవరం మండలంలోని రేవు పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పుస్తకాలను పంపిణీ చేశారు. ముందస్తు ప్రణాళిక విజయవంతం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యార్థులకు అవసరమైన అన్ని వసతుల కల్పనలోను లోటు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూలై నాలుగో శనివారాన్ని ‘పుస్తకాల పంపిణీ రోజు’గా పాఠశాల విద్యాశాఖ ముందే ప్రకటించి అందుకు అనుగుణంగా పనులు చేపట్టింది. విద్యార్థులకు పుస్తకాల కొరత ఉండరాదని విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అన్ని పుస్తకాలను అందించిన అధికారులు.. నవంబర్లో ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్కు అవసరమైన 1,06,82,080 పుస్తకాలను జూన్ నెలాఖరునాటికే సిద్ధం చేశారు. దీనికోసం పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ నేతృత్వంలో ప్రత్యేక ప్రణాళిక అమలు చేశారు. పుస్తకాలను మొదట ప్రింటర్స్ నుంచి స్టాక్ పాయింట్లకు, ఆపై ఈనెల 16వ తేదీ నాటికి మండల కేంద్రాలకు చేరవేశారు. ఉపాధ్యాయులకు ఎలాంటి శ్రమ లేకుండా పౌర సరఫరాల శాఖ సహాయం తీసుకున్నారు. ఈనెల 17వ తేదీ నాటికి ఇంటింటి రేషన్ సరుకుల పంపిణీ పూర్తవడంతో 3,400 ఎండీయూ వాహనాల్లో పుస్తకాలను పాఠశాలలకు చేరవేశారు. మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న 1,000 పాఠశాలలకు అమెజాన్ కొరియర్ సేవలను వినియోగించుకుని పుస్తకాలను పంపిణీ చేశారు. 20వ తేదీనాటికే రాష్ట్రంలోని 45,409 పాఠశాలల్లో రెండో సెమిస్టర్ పుస్తకాలను సిద్ధంగా ఉంచి, శనివారం అన్ని పాఠశాలల్లోను ఒకేసారి పంపిణీ చేశారు. జగనన్న విద్యాకానుక పంపిణీ సైతం.. ఎలాంటి విమర్శలకు తావులేకుండా 2023–24 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 43,10,165 మంది విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన మొదటిరోజు జగనన్న విద్యా కానుకను అందించి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ప్రణాళికాబద్ధంగా మండలాల్లో స్టాక్ పాయింట్లను సిద్ధం చేయడంతో పాటు ప్రత్యేకంగా ఆయా కేంద్రాల్లో క్వాలిటీ వాల్ను ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థికి బైలింగువల్ పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్–తెలుగు) నోట్ బుక్స్, వర్క్ బుక్స్, కుట్టు కూలితో 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్ను బడులు తెరిచిన మొదటి రోజే అందజేసింది. ఇదే ప్రణాళికను సెమిస్టర్–2 పుస్తకాల పంపిణీలోను విద్యాశాఖ అమలు చేసి విజయం సాధించింది. సీఎం ఆదేశాల మేరకు ఒకేరోజు పంపిణీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాల కొరత రాకుండా చూడాలని సీఎం జగన్మోహన్రెడ్డి ముందే చెప్పారు. గత ఏడాది నవంబర్లో జరిగిన సమావేశంలోనే రెండో సెమిస్టర్ పుస్తకాలను సకాలంలో అందించాలని, అదీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు పంపిణీ చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేశాం. ఈ నవంబర్లో ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్ పుస్తకాలను ముందే ముద్రించి స్కూళ్లకు పంపిణీ చేశాం. ముందస్తు ప్రణాళికతో పుస్తకాలను అందించడంలో విజయవంతమయ్యాం. – ప్రవీణ్ ప్రకాశ్, పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి నాణ్యత తగ్గకుండా ముద్రణ ప్రతి విద్యార్థికి సకాలంలో పుస్తకాలు అందించడంతో పాటు ముద్రణలో నాణ్యత తగ్గకూడదని విద్యాశాఖ సమీక్ష సమావేశాల్లో సీఎం చెప్పేవారు. ఆమేరకు నాణ్యమైన పేపర్ను తీసుకున్నాం. మొదటి సెమిస్టర్ ముద్రణ జూన్ ఒకటో తేదీనాటికే పూర్తిచేశాం. వెంటనే రెండో సెమిస్టర్ ముద్రణ చేపట్టాం. సమష్టి కృషితో ఏకకాలంలో కోటికిపైగా పుస్తకాలను పాఠశాల పాయింట్ వరకు రవాణా చేశాం. ఉపాధ్యాయులపై ఎలాంటి ఒత్తిడి, ఖర్చు పడకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకుంది. – కె.రవీంద్రనాథ్రెడ్డి, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రచురణ, ముద్రణ సంచాలకులు ప్రభుత్వ ఖర్చుతోనే రవాణా మా స్కూలు రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. బైరెడ్డిపల్లిని ఆనుకునే కర్ణాటక రాష్ట్రం ప్రారంభం అవుతుంది. ఇక్కడి ఏపీ మోడల్ స్కూల్లో ఆరు నుంచి 9వ తరగతి వరకు 340 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇలాంటి ప్రాంతంలో కూడా మొదటి సెమిస్టర్ పుస్తకాలను జూన్ మొదటి వారంలోనే అందిస్తే.. నవంబర్లో ఇవ్వాల్సిన రెండో సెమిస్టర్ పుస్తకాలను ఇప్పుడే అందించారు. గతంలో మండల పాయింట్ నుంచి పుస్తకాలను సొంత ఖర్చులతో తెచ్చుకోవాల్సి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మాకు ఎలాంటి శ్రమ లేకుండా ప్రభుత్వమే పాఠశాలలకు పుస్తకాలను తరలించి మాకు భారం లేకుండా చేసింది. – టీఎస్ అనిత ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, బైరెడ్డిపల్లి (చిత్తూరు జిల్లా) -
శ్వేతసౌధానికి మన ప్రభుత్వ బడి విద్యార్థులు
సాక్షి, అమరావతి: పేదింటి విద్యార్థులు కూడా ప్రపంచస్థాయిలో రాణించాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా.. మన రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదివే పది మంది విద్యార్థులకు అమెరికాలో పర్యటించే అరుదైన అవకాశం వచ్చింది. తొలిసారి విద్యార్థులకు అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ను సందర్శించే చాన్స్ లభించింది. సెపె్టంబర్లో అమెరికా వెళ్లనున్న మన విద్యార్థులు ఆనెల 17 నుంచి 27 వరకు న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యమితి ప్రధాన కార్యాలయంలో స్థిర అభివృద్ధి అనే అంశంపై జరిగే ప్రత్యేక సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాల్లో విద్యావిధానం, కల్పించిన అవకాశాలపై చర్చించనున్నారు. ఇందులో అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, ‘మనబడి నాడు–నేడు’ పథకంతో మారిన పాఠశాలల పరిస్థితులు, వసతులు, ఇంగ్లి‹Ùలో బోధన, డిజిటల్ ఎడ్యుకేషన్ ఫలితంగా వచ్చిన మార్పులపై మన విద్యార్థులు సదస్సులో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీలో జరిగే సదస్సుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రసంగించే అవకాశాన్ని ఆ వర్సిటీలోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ (ఎడ్యుకేషన్) డైరెక్టర్ రాధికా అయ్యంగార్ కల్పించారు. ఈమేరకు గురువారం యూఎన్వో స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్కు అధికారికంగా తెలిపారు. అలాగే వాషింగ్టన్లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బ్యాంకు ఉన్నతాధికారులతో కూడా మన విద్యార్థులు మాట్లాడే అవకాశం లభించిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై వివిధ దేశాల ప్రతినిధులు అభినందనలు తెలుపుతున్నారని, పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించడంపై స్వయంగా వివరించేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సెపె్టంబర్లో జరిగే సదస్సుకు తీసుకెళతామని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ఇదో అద్భుత అవకాశంగా ఆయన అభివర్ణించారు. ప్రధానంగా అమెరికా అధ్యక్ష భవనం సందర్శించేందుకు అమెరికా ప్రభుత్వంలోని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసి యా అఫైర్స్ విభాగం అవకాశం కల్పించిందన్నారు. త్వరలోనే పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్ నేతృత్వంలో అమెరికా సందర్శించే విద్యార్థులను ఎంపిక చేస్తామని షకిన్ కుమార్ తెలిపారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించాలనేది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అని చెప్పారు. అందుకు అనుగుణంగా టోఫెల్, డిజిటల్ విద్య, స్మార్ట్ బోర్డుల బోధన, భాషా నైపుణ్యాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న తీరును ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే స్వయంగా ప్రపంచ వేదికపై తెలియజేస్తారని ఆయన వివరించారు. -
పాఠ్య ప్రణాళికలో కృత్రిమ మేధను చేర్చాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రపంచాన్ని గెలిచేలా.. పాఠాలను మారుద్దాం
మన విద్యా వ్యవస్థలో వీఆర్ (వర్చువల్ రియాలిటీ), ఏఆర్ (అగ్మెంటెడ్ రియాలిటీ), ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీల సాంకేతికతను పెంచాలి. లో లెవల్ మెషిన్ లెర్నింగ్, మెటావర్స్తో మిళితం చేయాలి. మన విద్యార్థులు ఏఐలో నిష్ణాతులుగా మారి, ఆ తర్వాత క్రియేటర్లుగా రాణించేలా ఇక్కడి నుంచే తొలి అడుగు వేయాలి. అందుకే పాఠశాల విద్య, ఉన్నత విద్య స్థాయిలో వేర్వేరుగా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేస్తాం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ విద్యా వ్యవస్థలో సాంకేతికతను ముందుకు తీసుకెళదాం. అత్యుత్తమ ప్రతిభావంతుల ద్వారా పాశ్చాత్య దేశాల విద్యా విధానంలోని అంశాలతో మన కరిక్యులమ్ను రీడిజైన్ చేద్దాం. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ బోధన, నేర్చుకునే సామర్థ్యం పెంచడంతో పాటు.. వారిని ఏఐ క్రియేటర్లుగా తీర్చిదిద్దేలా పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్సిటీల వీసీలకు పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కరిక్యులమ్లో ఏఐ ఒక భాగం కావాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు విద్యా విధానాన్ని ఏఐ మార్చబోతోందని, ఈ రూపంలో ప్రపంచం నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. బోధన, నైపుణ్యాభివృద్ధిలో తొలిసారిగా ఎమర్జింగ్ టెక్నాలజీ అనుసంధానం చేసేలా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా శాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రాక్టికల్ అప్లికబులిటీ ఆఫ్ నాలెడ్జ్ను తీసుకురావడంతో పాటు మరిన్ని వర్టికల్స్ చదువుకునే అవకాశం ఇవ్వాలన్నారు. సాంకేతిక వైద్య విధానాలు అందుబాటులోకి రావడంతో వైద్య విద్య పాఠ్య ప్రణాళిక, బోధనలో రోబోటిక్స్, ఏఐల ప్రాధాన్యం పెంచాలని చెప్పారు. నాలుగవ పారిశ్రామిక విప్లవంలో ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తయారు చేయడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేయాలని దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలు సీఎం జగన్ మాటల్లోనే.. ఏఐలో మనమే లీడర్లుగా ఉండాలి ► ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులను అనేక రంగాల్లో లీడర్లుగా చూడాలనుకుంటున్నాం. అందుకు తగ్గట్టుగా మనం చదువులు అందిస్తున్నామో లేదో ఆలోచించాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విప్లవం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో మనం వెనుకబడితే కేవలం అనుసరించే వాళ్లుగానే మిగిలిపోతాం. ఏఐ అభివృద్ధి చెందేకొద్దీ.. దానిని వినియోగించుకుని, సామర్థ్యాన్ని పెంచుకునే వర్గం ఒకటైతే.. ఏఐని క్రియేట్ చేసే వర్గం మరొకటి తయారవుతుంది. ► టెక్నాలజీ పరంగా తొలి రివల్యూషన్ 1784లో స్టీమ్తో నడిచే రైలు ఇంజన్ ద్వారా చూశాం. ఆ తర్వాత 100 ఏళ్లకు విద్యుత్, 1960–70ల్లో కంప్యూటర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రూపంలో మరో రెండు విప్లవాలు అత్యంత మార్పును తీసుకొచ్చాయి. ఈ మూడింటిలోనూ మనం వెనుకబడ్డాం. ఏదీ క్రియేట్ చేసే పరిస్థితుల్లో లేం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం క్రియేటర్లుగా మారాలి. ఈ రంగంలో మనమే లీడర్లుగా ఉండాలి. అందుకోసం ఆ దిశగా అడుగులు వేగంగా వేయాలి. ఫ్యాకల్టీల్లో ఆప్షన్లు పెంచాలి ► జర్మనీ వంటి దేశంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉంది. పాశ్చాత్య ప్రపంచం అంతా జనాభా అసమతుల్యత (డెమొగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్)ను ఎదుర్కొంటోంది. కానీ, భారతదేశంలోనైనా.. ఆంధ్రప్రదేశ్లో చూసినా సుమారు 70 శాతం మంది పనిచేసే వయస్కులు ఉన్నారు. వీరికి సరైన విజ్ఞానం, నైపుణ్యం అందించేందకు విద్యా రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాలి. ► ఇప్పటి వరకు మన విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులను మాత్రమే నిర్దేశిస్తున్నాం. అదే పాశ్చాత్య దేశాల కరిక్యులమ్లో ఒక ఫ్యాకల్టీలో చాలా వర్టికల్స్ కనిపిస్తాయి. అక్కడ బీకాంలోనే అసెట్ మేనేజ్మెంట్, ఫైనాన్సియల్ మార్కెట్, రిస్క్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అనాలసిస్ ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి మన దగ్గర లేవు. ► మన వాళ్లు మంచి డిగ్రీ కోసం విదేశాలకు వెళ్లాల్సిందే. ఏపీలో చదువుకునే విద్యార్థులకు నచ్చిన వర్టికల్స్ చదువుకునే అవకాశాలు ఇవ్వాలి. తాజాగా డిగ్రీలకు సంబంధించి క్రెడిట్స్ ఇస్తున్నాం. ఇకపై వాటి స్థాయిని పెంచుతూ ప్రతి ఫ్యాకల్టీలో ఎక్కువ ఆప్షన్లలో బోధన సాగించాలి. ఇప్పటికే ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేసి, ఉద్యోగాల కల్పన దిశగా అడుగులేశాం. విద్యార్థుల ఉన్నతికి ఇలాంటి ఎన్నో మార్పులు అవసరం. ► సెక్యూరిటీ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి వర్టికల్ కోర్సులకు బోధన సామర్థ్యం మన దగ్గర అందుబాటులో లేకపోతే.. వర్చువల్ రియాలిటీని.. ఆగ్మెంటెడ్ రియాలిటీతో అనుసంధానించి వర్చువల్ క్లాస్ టీచర్ ద్వారా పాఠాలు చెప్పిద్దాం. మెడికల్ కోర్సుల్లో సాంకేతిక విజ్ఞానం పెంపు ► వైద్య విద్య కోర్సుల్లోని బోధన పద్ధతుల్లో గణనీయమైన మార్పులు రావాలి. భవిష్యత్తులో ఐదేళ్ల మెడికల్ కోర్సులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి. శరీర భాగాలను కోసి ఆపరేషన్ చేసే రోజులు మారిపోయాయి. కంప్యూటర్ల ద్వారా ఏఐను వాడకుని చిన్న చిన్న రంధ్రాలతో ఆపరేషన్ చేస్తున్నారు. అందుకే వైద్య విద్యలో రోబోటిక్స్, ఏఐలను భాగస్వామ్యం చేయాలి. ► హర్యానాలోని ఒక మెడికల్ కాలేజీలో ఇలాంటి కోర్సులనే ప్రవేశపెట్టారు. కేవలం మెడిసిన్లో చికిత్సకు సంబంధించిన విజ్ఞానం ఇవ్వడమే కాదు, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించడంపై కూడా పాఠ్య ప్రణాళికలో జోడించాలి. త్వరలో ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ ► ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ఏర్పాటుతో వ్యవసాయం చేసే తీరులో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే గ్రామ స్థాయిలోనే రైతును చేయి పట్టుకుని సాగు చేయించే వ్యవస్థను తీసుకొచ్చాం. ► ఇంతటితో ఆగిపోకుండా.. ప్రతి ఎకరాలో భూసార పరీక్షలు చేసి పంట సాగయ్యేలా చర్యలు చేట్టాలి. శాటిలైట్ ఇమేజ్ ద్వారా భూమిలోని కాంపోజిషన్ను తెలుసుకోవచ్చు. డ్రోన్ల ద్వారా భూమిలోని మినరల్ డిపాజిట్లను ఇంకా దగ్గరగా తెలుసుకునే అవకాశం వస్తోంది. ఆ రిపోర్టుల ద్వారా వ్యవసాయంలో ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావచ్చు. అప్పుడు పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలో సులభంగా తెలుస్తుంది. ఇటువంటి టెక్నాలజీని మన విద్యార్థులకు నేర్పించాలి. హైలెవల్ అకడమిక్ బోర్డు ► ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోని పాఠ్యపుస్తకాలు, బోధనా పద్ధతులు, ప్రశ్నపత్రాల సరళి మన కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. అక్కడ టెక్ట్ బుక్స్ విద్యార్థులకు ఇచ్చి సమాధానాలు రాయిస్తారు. తద్వారా ప్రాక్టికల్ అప్లికబిలిటీని పరీక్షిస్తారు. అందుకే మనదగ్గర కూడా ప్రశ్నపత్రాల రూపకల్పన, బోధనా పద్ధతులు పూర్తిగా మారాలి. ఒక్కో యూనివర్సిటీ ఒక్కో రకంగా కరిక్యులమ్ తయారు చేయడం కాకుండా అందరూ అనుసరించేలా ఒక నిర్దిష్టమైన కరిక్యులమ్ రూపొందించాలి. ► అందుకే పాఠశాల విద్య, ఉన్నత విద్య స్థాయిలో వేర్వేరుగా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు మనం విజన్ కోసం ఒక హైలెవల్ అకడమిక్ బోర్డు అవసరం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులతో ఈ బోర్డును ఏర్పాటు చేద్దాం. తద్వారా పాశ్చాత్య దేశాల విద్యా విధానంలోని అంశాలతో మన కరిక్యులమ్ను రీడిజైన్ చేద్దాం. పాఠ్యప్రణాళికను, బోధనను, ప్రశ్నపత్రాల తీరును మారుద్దాం. పాఠశాల స్థాయి నుంచే మార్పులు ► విద్యా వ్యవస్థలో పాఠశాల స్థాయి నుంచే సమూల మార్పులు రావాలి. ఇప్పటికే మనం ఆ దిశగా చర్యలు చేపట్టాం. ఇంగ్లిష్ మీడియం చదువులు, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధనను తీసుకొచ్చాం. డిసెంబర్ నాటికి 63 వేల క్లాస్ రూమ్స్ను ఐఎఫ్పీ ఫ్యానెల్స్తో డిజిటలైజ్ చేస్తున్నాం. ఇప్పటికే 31 వేల తరగతి గదుల్లో ప్యానెల్స్ ఏర్పాటు చేశాం. ► బైజూస్ కంటెంట్ను ఇంటిగ్రేట్ చేశాం. ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చాం. దీనికి తదుపరిగా మరిన్ని మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎమర్జింగ్ టెక్నాలజీల్లో చాలా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అవసరమైతే ఇంటర్నెట్లోని కంటెంట్ ద్వారా టెక్నాలజీ వాడకంపై శిక్షణ ఇస్తే మనకూ తగినంత ఫ్యాకల్టీ సిద్ధమవుతారు. ► విద్యా రంగంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులను గమనిస్తే.. మనం ఒక స్థాయిలో ఉంటే.. లక్ష్యం ఇంకో స్థాయిలో ఉంది. ఈ గ్యాప్ను పూడ్చాలంటే వైస్ చాన్సలర్లు కూడా ఆలోచించాలి. దీనిపై మరిన్ని సమాలోచనలకు నాలుగైదు యూనివర్సిటీలతో వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయాలి. మెడికల్, ఇంజినీరింగ్తో పాటు ఇతర ఫ్యాకల్టీలు కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని అత్యుత్తమ పాఠ్య ప్రణాళిక, అత్యుత్తమ బోధనా పద్ధతులను ఖరారు చేయాలి. ► ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, కళాశాల విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయ్కుమార్రెడ్డి, విశ్వవిద్యాలయాల వైస్చాన్సలర్లు పాల్గొన్నారు. -
త్వరలో టెట్ పరీక్ష! తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.. ‘కానీ, ఎందుకు?’
సాక్షి, హైదరాబాద్: త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వెంటనే కసరత్తు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. శుక్రవారం హైదరాబాద్లో సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం దీనికి ఆమోదం తెలిపింది. మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యాశాఖలో దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంశం ఇందులో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తవకుండా నియామకాలు చేపట్టలేమని అధికారులు మంత్రులకు వివరించినట్టు సమాచారం. దీంతో నిరుద్యోగుల్లో అసంతృప్తిని పోగొట్టేందుకు తక్షణమే టెట్ నిర్వహించాలని భావించినట్టు తెలిసింది. భర్తీ కోసం ఎదురుచూపులే..! రాష్ట్ర అవతరణ తర్వాత 2016లో తొలిసారిగా టెట్ నిర్వహించారు. తర్వాత 2017, 2022లలోనూ నిర్వహించారు. ఇందులో గతేడాది టెట్ పరీక్ష సమయంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నాయన్న ఆశతో ఎక్కువ మంది పరీక్ష రాశారు. కానీ ఏడాది గడచినా నియామకాలేవీ చేపట్టలేదు. 2016 నుంచి టెట్ అర్హత పొందిన వారంతా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేస్తే తప్ప కొత్త నియామకాలు చేపట్టలేమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావుడి జరిగినా, కోర్టు వివాదాల కారణంగా వాయిదా పడింది. 22వేల ఖాళీలు.. బోధనకు ఇబ్బంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గతంలో విద్యాశాఖ అంచనా వేసింది. కానీ 12 వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయుల కొరతతో చాలా పాఠశాలల్లో బోధనకు ఇబ్బంది అవుతోంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టిన నేపథ్యంలో ఈ సమస్య ఇంకా పెరిగింది. కొన్ని పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)లను ఉన్నత తరగతుల బోధనకు పంపుతున్నారు. కోర్టు వివాదాలకు దారితీసే రీతిలో విద్యాశాఖ వ్యవహరించడం వల్లే పదోన్నతులు, బదిలీలు ముందుకెళ్లడం లేదని.. టెట్ చేపట్టినా ఉపయోగం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. పోస్టుల భర్తీ లేకుండా టెట్ దేనికి? రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 22వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే లక్షల మంది టెట్ ఉత్తీర్ణులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే నియామకాలు చేపట్టవచ్చు. ఇవేవీ చేయకుండా టెట్ చేపడితే ప్రయోజనం ఏమిటి? ప్రభుత్వం నియామకాలపై దృష్టి పెట్టాలి. – చావా రవి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
గురుకుల సీటుకు సిఫారసు కట్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురు కుల విద్యాసంస్థల్లో సిఫారసు లేఖలకు కాలం చెల్లింది. గురు కులాల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగి శాక మిగులు సీట్ల భర్తీలో మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫా రసు లేఖలను ఏమాత్రం పరిగణ నలోకి తీసుకో రాదని... కేవలం మెరిట్ ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. గత నెలలో ప్రవే శాల ప్రక్రియను ప్రారంభించిన గురుకుల సొసై టీలు తొలివిడత కౌన్సెలింగ్ చేపట్టి సీట్లు పొందిన విద్యార్థులకు గడువులోగా నిర్దేశిత విద్యాసంస్థల్లో రిపోర్టు చేయాల్సిందిగా స్పష్టం చేశాయి. మెజారిటీ విద్యార్థులు ఆయా సంస్థల్లో చేరగా మిగులు సీట్లకు సంబంధించి మరో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారని ఆశావహులు భావించారు. కానీ గురుకుల సొసైటీలు మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ చేయలేదు. మరోవైపు అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు తరగతులు ప్రారంభమవగా బోధన సైతం వేగంగా కొనసాగుతోంది. మెరిట్కే పరిమితం...: రాష్ట్రంలో ఐదు గురుకుల విద్యాసంస్థల సొసైటీలు న్నాయి. మహాత్మా జ్యోతిభాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు సంబంధిత సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతున్నాయి. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ మాత్రం పాఠశాల విద్యాశాఖ పరిధిలో కొనసాగుతోంది. ఐదు సొసైటీల పరిధిలో 1005 పాఠశాలలు, కళాశాలలున్నాయి. వాటిలో ఐదో తరగతి అడ్మిషన్లతోపాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలు, ఇంటర్ ఫస్టియర్, డిగ్రీ ఫస్టియర్కు ఏటా అడ్మిషన్లు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల పరిధిలో ఐదో తరగతికి ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. మిగతా తరగతులకు మాత్రం సొసైటీలు వేరువేరుగా ప్రకటనలు జారీ చేసి అర్హత పరీక్షలు నిర్వహించి మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తాయి. -
విద్యార్థుల్లో ఇంగ్లిష్ నైపుణ్యానికి మరో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రపంచస్థాయిలో ఉన్నత ఉద్యోగాలు సాధించేలా వారికి ఆస్థాయి విద్యను అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి కంకణం కట్టుకుంది. ఇందుకోసం ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ప్రకాష్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం ఈటీఎస్ విద్యార్థులకు టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాస్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ (టోఫెల్) పరీక్షలు నిర్వహించడంతో పాటు సర్టిఫికెట్ ఇవ్వనుంది.ఇంగ్లిష్లో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. 2021–22 నుంచి 6–10 తరగతుల విద్యార్థులందరికీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందిస్తోంది. 3–5వ తరగతి వరకు ఆంగ్లం మెరుగుదల కోసం చిత్ర నిఘంటువులు ఇస్తోంది. అంతేగాకుండా 6వ తరగతికి బదులుగా (ప్రామాణిక నిబంధనల ప్రకారం) 3వ తరగతి నుంచే ఆంగ్లం కోసం సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేసింది. -
2డి, 3డి చిత్రాలు.. డిజిటల్ పాఠాలు
నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి: ఒక్కసారి వినగానే, చూడగానే విద్యార్థుల మదిలో నిలిచిపోయేలా.. ఎప్పుడు ఆ అంశం ప్రస్తావన వచ్చినా పుట్టుపూర్వోత్తరాలన్నీ గుర్తుకొచ్చేలా 2డి, 3డి చిత్రాలతో డిజిటల్ పాఠాలు బోధించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక డిజిటల్ టెక్నాలజీతో విద్యా బోధనకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే నాడు–నేడుతో సర్కారీ స్కూళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటంతోపాటు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లను ఉచితంగా అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. అగ్ర దేశాల్లో విద్యా బోధనకు వినియోగించే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా అందుబాటులోకి తెస్తోంది. తొలివిడత నాడు–నేడు పూర్తయిన 15,713 ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వీటిని వినియోగించనున్నారు. వీటి వినియోగంపై జేఎన్టీయూ ప్రొఫెసర్లతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలలకు సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ చదివే విద్యార్థులు కూడా వారానికి ఒకసారి ఆయా స్కూళ్లను సందర్శించి సాంకేతిక సమస్యలను పరిష్కరించనున్నారు. ఈ మేరకు స్వచ్ఛందంగా సేవలు అందించేలా ఉన్నత విద్యా మండలి ముందుకు వచ్చింది. చదువులకు అండగా నిలుస్తూ, విద్యార్థుల తల రాతను మార్చేలా నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.59 వేల కోట్లకు పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. గూగుల్ అసిస్టెంట్ సదుపాయం దశాబ్దాలుగా ఉపాధ్యాయులు నల్ల బోర్డుపై తెల్ల చాక్ పీస్తో బోధిస్తున్నారు. ఆధునిక విధానాలకు అనుగుణంగా విద్యార్థులు మెరుగ్గా రాణించేలా మనబడి నాడు – నేడు తొలి విడతలో తీర్చిదిద్దిన 5,675 ఉన్నత పాఠశాలలు, ప్లస్ 2 తరగతుల్లో అత్యాధునిక ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీ) 30,212 తరగతి గదుల్లో అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ అసిస్టెంట్ సదుపాయం కలిగిన ఇంటరాక్టివ్ స్మార్ట్ ప్యానెళ్లను ఆరు నుంచి 10వ తరగతి వరకు క్లాస్కు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి స్క్రీన్కు ఇరువైపులా నాలుగు అడుగుల పొడవు, వెడల్పుతో గ్రీన్ చాక్పీస్ బోర్డులను కూడా అమరుస్తున్నారు. పాఠ్య పుస్తకాల్లో, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ల్లో, ఐఎఫ్పీ స్క్రీన్లలో ఒకే కంటెంట్ ఉండడంతో విద్యార్థికి మెరుగైన బోధన అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం నాడు – నేడు రెండో విడతలో మరో 15 వేల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో 3,800 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో పనులు పూర్తయిన వాటిల్లో ఐఎఫ్పీ స్క్రీన్లు ఏర్పాటు చేసి డిసెంబర్ నాటికి అన్ని స్కూళ్లల్లోను డిజిటల్ స్క్రీన్లు అందుబాటులోకి తేనున్నారు. మరో 10,038 పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు మనబడి నాడు–నేడు ద్వారా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యా బోధనను రాష్ట్ర ప్రభుత్వం నవీకరించింది. ప్రాథమిక పాఠశాలకు ఒకటి చొప్పున 10 వేల స్మార్ట్ టీవీలను అందించి గతేడాది ఇంగ్లిష్ ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చింది. వీడియో పాఠాల ద్వారా బోధనతో మెరుగైన ఫలితాలు రావడంతో ఇప్పుడు కొత్తగా 10,038 ప్రాథమిక స్కూళ్లకు అంతే సంఖ్యలో స్మార్ట్ టీవీలను డిజిటల్ కంటెంట్తో ఏర్పాటు చేస్తోంది. మూడో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది ‘టోఫెల్– ప్రైమరీ’ శిక్షణ అందిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన కంటెంట్ను వీడియో, ఆడియో రూరంలో స్మార్ట్ టీవీల ద్వారా బోధించనున్నారు. ఇక నాడు – నేడు రెండో దశలో పనులు జరుగుతున్న మరో 11,200 ప్రాథమిక పాఠశాలల్లోనూ డిసెంబర్ నాటికి స్మార్ట్ టీవీలు రానున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం అయోధ్య రామాపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని తరగతి గది. తరగతి గదుల్లో బోధన అందిస్తూ, అక్కడే చదువుకుని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను చూపించి పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచుతున్నారు. ఇదే మండలంలోని ఉండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైతం ఐఎఫ్పీ స్క్రీన్ డిజిటల్ బోధన ప్రారంభమైంది. ఇది పల్నాడు జిల్లా క్రోసూరు ఏపీ మోడల్ స్కూల్లోని తరగతి గది. విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన కోసం 165 సెం.మీ వైశాల్యం కలిగిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పీ) బోర్డును సిద్ధం చేశారు. దీనికి 256 జీబీ డేటా పాఠ్యాంశాలతో ఎస్డీ కార్డును అనుసంధానించి స్మార్ట్ బోధన నిర్వహించవచ్చు. ఒకపక్క స్క్రీన్పై వీడియో పాఠాన్ని విద్యార్థులు చూస్తుండగా.. మరోపక్క అదే స్క్రీన్పై సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేయవచ్చు. పాఠాలను రికార్డు చేయవచ్చు. అవసరమైన వాటిని నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు. -
‘కిట్ల’పై పిట్ట కథలు.. ‘ఈనాడు’ బురద రాతలు..
సాక్షి, అమరావతి: బడి గంట మోగిన రోజే పిల్లలకు పుస్తకాల నుంచి యూనిఫామ్ దాకా ఉచితంగా అందచేస్తూ చదువుల పట్ల ఆసక్తిని పెంపొందించిన చరిత్ర గతంలో ఎప్పుడైనా ఉందా? తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాకానుక ద్వారా ఇందుకు చొరవ చూపారు. ఒకపక్క పిల్లలను బడికి పంపించే తల్లులకు అమ్మ ఒడి ద్వారా డబ్బులిసూ్తనే మరోపక్క జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా నాణ్యమైన వస్తువులను ఉచితంగా సమకూరుస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దారు. ఇవన్నీ ఎల్లో మీడియాకు కంటగింపుగా మారాయి. ఇక యథాప్రకారం కిట్లలో కిటుకు.. విద్యాకానుక కిట్లు వృథా అంటూ బురద చల్లింది. ఆడిట్ అనంతరం తలెత్తిన ప్రశ్నలకు సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకోవడం సహజమే. కాకపోతే ఆ ప్రక్రియ పూర్తి కాకుండానే ఈనాడు తన పాఠకులకు ఆదరబాదరగా యథా ప్రకారం అబద్ధాలను వడ్డించేసింది!! ఆరోపణ: విద్యార్థుల వాస్తవ సంఖ్యను పరిగణలోకి తీసుకోకుండా అంచనాలకు మించి టెండర్లు పిలి చారు. మిగిలిన కిట్లు ఏం చేయాలో ఆలోచించలేదు. వాస్తవం: 2023–24లో 43.10 లక్షల మంది విద్యార్థులు ఉండవచ్చనే అంచనాలతో ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. టెండర్లు పిలిచినా సరఫరాదారులకు కేవలం 39.96 లక్షల కిట్లకు మాత్ర మే సప్లయ్ ఆర్డర్ ఇచ్చారు. గతేడాది మిగిలిన (జేవీకే 3) సామగ్రిని ఈ ఏడాది జేవీకే 4లో వినియోగించారు. మిగులు వివరాలన్నీ జేవీకే యాప్లో నమోదు చేశారు. ఆరోపణ: పాఠశాల విద్యాశాఖ అస్తవ్యస్థ నిర్ణయాలతో ప్రజాధనం వృథా అయినట్లు ఆడిట్ విభాగం నిగ్గు తేల్చింది. వాస్తవం: విద్యాశాఖ, ఆడిటింగ్ విభాగానికి మధ్య సమాచార మార్పిడి అంశాలను పూర్తిగా వక్రీకరించి కథనాలను ప్రచురించారు. ఆడిట్ విభాగం వ్యక్తం చేసిన సందేహాలపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇచ్చిన అనంతరం పునఃపరిశీలన జరిపి నివేదికను ఖరారు చేస్తుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే తప్పులు జరిగిపోయాయంటూ ఈనాడు తీర్పులిచ్చేసింది. ఆరోపణ: జ్యుడిషియల్ ప్రివ్యూ నిబంధనను ట్యాబ్ల కొనుగోలులో పాటించలేదు. వాస్తవం: ఇది ముమ్మాటికీ అబద్ధం. ట్యాబ్ల కొనుగోలులో ప్రభుత్వం జ్యుడిషియల్ ప్రివ్యూ నిబంధనను తు.చ. తప్పకుండా పాటించింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఉంది. జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియ పాటించిన తర్వాతే కొనుగోలు చేస్తున్నారు. ఆరోపణ:ట్యాబుల మెమరీ కార్డుల్లోకి కంటెంట్ లోడ్ కోసం రూ.22.04 కోట్లు అదనంగా ఖర్చు చేశారు. వాస్తవం: దేశంలో ఎక్కడా లేని విధంగా పాఠశాలల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం చేపడుతోంది. విద్యార్థులకు, టీచర్లకు ట్యాబులు పంపిణీ చేసింది. కేవలం పరికరాలు కొనడమే కాకుండా పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా చర్యలు తీసుకుంది. ఇంటర్నెట్, సరైన బ్యాండ్ విడ్త్ లేకున్నా, ఇంటర్నెట్ ఆధారిత సాంకేతిక లోపాలు తలెత్తినా ట్యాబులు ఉపయోగపడేలా ఆఫ్లైన్ మోడ్లో పాఠాలు నేర్చుకునేలా మెమరీ కార్డులు అమర్చి వీడియో పాఠ్యాంశాలను లోడ్ చేసి ఇచ్చింది. స్కూలు ముగిశాక ఇంట్లో ఇంటర్నెట్ లేకున్నా విద్యార్థులు పాఠాలు పునశ్చరణ చేసుకోవడానికి మెమరీ కార్డు, వీడియో పాఠ్యాంశాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆరోపణ: ఐఎఫ్పీ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు వచ్చాక గ్రీన్ చాక్బోర్డులు ఎందుకు? వాస్తవం: ఐఎఫ్పీ ప్యానెళ్లు, స్మ్రాŠ్ట టీవీలకు అటు ఇటుగా గ్రీన్ చాక్ బోర్డులు ఉన్నాయి. అవసరమైనప్పుడు సంప్రదాయ పద్ధతుల్లో పాఠ్యాంశాలను బోధించినప్పుడు వీటిని టీచర్లు వినియోగించుకుంటారు. ఇందులో ఈనాడుకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? అవి వృథా అవుతాయని ఏ విధంగా నిర్ణయానికి వచ్చారు? ఆరోపణ: ఏటా అదనంగా విద్యాకానుక కిట్లు కొనడంతో ప్రజాధనం వృథా అయింది. వాస్తవం ఇదీ: జేవీకే–3లో మిగిలిన సామగ్రిని 2023–24లో వినియోగిస్తున్నారు. 2022–23లో 5,46,923 నోట్ బుక్స్ మిగలడంతో 2023–24లో (జేవీకే 4) సత్యసాయి, అన్నమయ్య, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పంపిణీ చేశారు. ఆ మేరకు జేవీకే 3 మిగులును పరిగణలోకి తీసుకుని ఈ ఏడాది వాస్తవ విద్యార్థుల సంఖ్య ఆధారంగా విద్యాశాఖ సప్లయ్ ఆర్డర్ ఇచ్చింది. బెల్టులు: గతేడాది మిగిలిన 1,46,485 బెల్టులను కర్నూలు, కోనసీమ, అన్నమయ్య జిల్లాల్లో పంపిణీ చేసింది. బూట్లు: గతేడాది 69,181 బూట్లు మిగిలాయి. వీటిలో బాగున్న వాటిని సైజుల వారీగా జేవీకే యా‹³లో అప్లోడ్ చేసి పంపిణీ చేశారు. పాడైన బూట్లను సరఫరాదారులకు తిరిగి పంపించారు. యూనిఫాం: 2,56,797 మిగులు యూనిఫాంలను కేజీబీవీలకు, ఏపీ మోడల్ స్కూల్, ఏపీఆర్ఎస్ స్కూళ్లల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు పంపిణీ చేశారు. డిక్షనరీలు: గతేడాది మిగిలిన 23,679 పిక్టోరియల్, 29,488 ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను ఈదఫా పంపిణీ చేశారు. బ్యాగులు: గత ఏడాది బ్యాగుల్లో 6,13,003 పాడైపోవడంతో సరఫరాదారులకు వెనక్కి పంపి సొంత ఖర్చుతో రీప్లేస్ చేశారు. -
పకడ్బందీగా 50వేల మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీలు!
సాక్షి, అమరావతి : కొత్త విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ముందే చెప్పినట్లుగా సమర్ధంగా చేపట్టింది. గతంలో మాదిరిగా ఎక్కడా గందరగోళం, గొడవలు లేకుండా, అక్షరాల 50 వేల మంది పైచిలుకు టీచర్ల బదిలీల ప్రక్రియను ప్రారంభించింది. రకరకాల కారణాలతో అయిదారేళ్లుగా ఆగిపోయిన ఈ బదిలీల కౌన్సెలింగ్ 15 రోజుల్లో పూర్తిచేసి, కొత్త స్కూళ్లలో కొత్త టీచర్లను బదిలీ చేసింది. గతంలో అర్థరాత్రి వరకు సాగే బదిలీ ప్రక్రియలో ఎంతో గందరగోళం నెలకొనేది. కానీ, ఈసారి టెక్నాలజీని ఉపయోగించి చేపట్టిన ఈ ప్రక్రియతో ఇంటి నుంచి లేదా ఇంటర్నెట్ పాయింట్ నుంచి బదిలీ ధ్రువపత్రం తీసుకుని కొత్త స్కూల్లో చేరుతున్నారని, వేలాది టీచర్ల ముఖాల్లో కొత్త ఆనందం కనిపిస్తోందని ఉపాధ్యాయ సంఘా లు తెలిపాయి. 45వేల ప్రభుత్వ స్కూళ్లలోని 41 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవుల్లో, ఎక్కడి వారు అక్కడే ఉంటూ, ఎవరి ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేకుండా పకడ్బందీగా నిర్వహించిన చారిత్రాత్మక కౌన్సిలింగ్ అని పేర్కొంటూ ప్రభుత్వాన్ని, పాఠశాల విద్యాశాఖకు ఆయా సంఘాలు కితాబిచ్చాయి. ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ లేదు సంఘాల మధ్య తరచూ చోటుచేసుకునే ఆధిపత్య ధోరణుల నేపథ్యంలో.. ‘అర్థరాత్రుళ్లు ఆగిపోయే కౌ న్సెలింగ్ లేదు.. ఎక్కడా డీఈఓ కార్యాలయాల ముందు ఉపాధ్యాయుల పడిగాపులు లేవు.. ఆమ్యామ్యా లు ఇస్తేనే ఆర్డర్లు ఇస్తామనే వేధింపుల్లేవు.. ఇంట్లో ఉండి దరఖాస్తు చేసుకుని, ఇంట్లో నుంచే బదిలీ ఆర్డర్ పుచ్చుకుని, కొత్త స్కూళ్లల్లో చేరిన వేలాది ఉపాధ్యాయులందరూ టెక్నాలజీకి మనసులోనే నమస్కరిస్తున్నారు. ఇంత ప్రశాంతంగా జరిగిన దాఖలాలు లేవు. ఈ ఘనత మన పాఠశాల విద్యాశాఖదే. బదిలీల ప్రక్రియను అద్భుతంగా నిర్వహించిన ప్ర భుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థుల విద్యా ప్రయోజనాలకు కట్టుబడి ఉందన్న సంకేతాన్ని పంపించింది’ అంటూ డెమోక్రటిక్ పీఆరీ్టయూ ఏపీ టీచర్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: తమ్ముళ్లు ఏరి?.. 21 లక్షలకు పడిపోయిన టీడీపీ సభ్యత్వం -
2 నుంచి ‘టెన్త్’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల కోసం 2,12,221 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 915 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహిస్తామని ఎస్ఎస్సీ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి మంగళవారం తెలిపారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణకు 915 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 915 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 11 వేల మంది ఇన్విజిలేటర్లు, 86 ఆకస్మిక తనిఖీ బృందాల(ఫ్లైయింగ్ స్క్వాడ్)ను నియమించినట్లు పేర్కొన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఎవరూ సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్స్, కెమెరాలు, ఇయర్ ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడినా, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 13, 14 తేదీల్లో రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుందని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణపై సందేహాల నివృత్తి కోసం విజయవాడలో 0866–2974540 నంబర్తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది జూన్ 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. -
‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా
సాక్షి, విజయవాడ: ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. టెన్త్, ఇంటర్ టాపర్లకు జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రోత్సాహకాలు, సత్కార కార్యక్రమాలని నిర్వహించాలని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25 నియోజకవర్గాలు, 27 న జిల్లా కేంద్రాలు, 31 న రాష్ట్ర స్ధాయి కార్యక్రమం నిర్వహించాలని మొదటగా నిర్ణయించగా, అయితే ఈ కార్యక్రమాలని పాఠశాలలు పున: ప్రారంభం తర్వాత జరపాలని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్ధులు, వారి తల్లితండ్రుల కోరిక మేరకు వాయిదా ప్రభుత్వం వాయిదా వేసింది. పాఠశాలలు రీ ఓపెన్ తర్వాత జరిపితే ఎక్కువ మంది హాజరై స్పూర్తిదాయకంగా ఉంటుందని తల్లిదండ్రులు విజ్ణప్తి చేశారు. జూన్ 12 తర్వాత ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు (స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్)’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. ఈ అవార్డుల వేడుకను నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో నడుస్తున్న పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 2023 మార్చి, ఏప్రిల్ పబ్లిక్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు అవార్డులతో ప్రభుత్వం సన్మానించనుంది. చదవండి: నాలుగేళ్ల పాలనపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ ఇంటర్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారిని సత్కరించనుంది. విద్యా రంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ వేడుక నిర్వహిస్తోంది. మూడు స్థాయిల్లోనూ విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వనుంది. సంబంధిత పాఠశాలకు మెమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నారు. -
ముంబై టీఐఎస్ఎస్లో సీటు సాధించిన తొగురు సిరి సింధూర
కర్నూలు కల్చరల్: ముంబైలోని ప్రఖ్యాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్)లోని స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ లేబర్ స్టడీస్ వారి హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్ మెంట్ అండ్ లేబర్ రిలేషన్స్ (హెచ్ఆర్ఎంఎల్ఆర్)లో జిల్లాకు చెందిన తొగురు సిరి సింధూర సీటు సాధించారు. 1936లో స్థాపింపచబడిన టీఐఎస్ఎస్ ఆసియాలోనే సామాజిక స్పృహ (సోషల్ సెన్సిటివిటి)తో కూడిన ప్రొఫెషనల్ కోర్సెస్ అందించే ఉన్నత విశ్వవిద్యాలయం. ప్రతి సంవత్సరం 40 వేల మంది టీఐఎస్ఎస్లోని నాలుగు క్యాంపస్ల్లో చేరడానికి దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో కేవలం 68 మంది మాత్రమే హెచ్ఆర్ఎంఎల్ఆర్ ప్రోగ్రాంకు ఎంపికవువుతారు. ఇందులో జిల్లాకు చెందిన సిరి సింధూర ఎంపిక కావడం గర్వకారణం. నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ కుమార్తె అయిన ఈమె కర్నూలు ఎన్నార్ పేట సెయింట్ జోషప్ పాఠశాలలో పాఠశాల విద్య, హైదరాబాద్ కూకట్ పల్లి నారాయణ కళాశాలలో ఇంటర్ చదివారు. 2015లో ఐఐటీ గౌహతిలో బీఈ (బ్యాచిలర్ ఆఫ్ డిజైన్) పూర్తి చేశారు. ఇగ్నోలో ఎంఏ సోషియాలజీ పూర్తి చేశారు. సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న సిరి సింధూర టీఐఎస్ఎస్కు ఎంపిక కావడంపై ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఉన్నత విద్యే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత సత్ఫలితాలిస్తోంది. పాఠశాల విద్యతోనే పిల్లలు చదువు మానేయకుండా ఉన్నత విద్య వైపు దృష్టి సారించేలా పలు పథకాలు, కార్యక్రమాలు చేపడుతోంది. బడి ఈడు పిల్లలందరినీ ఒక పక్క బడిబాట పట్టిస్తూనే మరో పక్క ఆ పిల్లలందరూ సెకండరీ, ఉన్నత విద్యను అభ్యసించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. తద్వారా పరిమాణాత్మక, గుణాత్మక మెరుగుదల కళ్లకు కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సెకండరీ, ఉన్నత విద్య ఎన్రోల్ మెంట్పై సమీక్షలో చర్చకు వచ్చిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో 2019–20 నుంచి 2022–23 వరకు ఏటేటా ఉన్నత విద్యలో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2018–19లో చంద్రబాబు హయాంలో సెకండరీ విద్యలో (9వ తరగతి నుంచి 10వ తరగతి వరకు) చేరికలు బాగా తక్కువగా ఉండగా, సీఎం జగన్ హయాంలో 2019–20 నుంచి ఏటేటా పెరుగుతూ 2022–23 నాటికి 89.63 శాతానికి పెరిగాయి. 2018–19లో చంద్రబాబు హయాంలో పదవ తరగతి తర్వాత ఇంటర్ విద్యను అభ్యసించడానికి చేరిన వారి సంఖ్య కేవలం 46.88 శాతమే. సీఎం జగన్ హయాంలో 2019–20 నుంచి ఆ సంఖ్య ఏటేటా పెరుగుతూ 2022–23 నాటికి 69.87 శాతానికి చేరింది. ప్రతి దశలో పర్యవేక్షణ ► పిల్లలు పదవ తరగతి తర్వాత ఇంటర్.. ఆ తర్వాత డిగ్రీ అభ్యసించడానికి ప్రధాన కారణం ప్రస్తుత ప్రభుత్వ చర్యలే. అందరినీ బడిబాట పట్టించడంతో పాటు ఆ పిల్లలందరూ డీగ్రీలు చదివేలాగ సూక్ష్మ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులందరూ తదుపరి ఉన్నత విద్యలో చేరుతున్నారా లేదా అనే విషయాన్ని వలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తోంది. ఇందుకు ప్రత్యేక యాప్ను రూపొందించారు. ఆ యాప్ ద్వారా 2022లో పదవ తరగతి పరీక్ష పాస్ అయిన విద్యార్థులు తదుపరి విద్యలో ఎంత మంది చేరలేదు.. ఎందుకు చేరలేదనే సమాచారాన్ని సేకరించారు. ► ఈ సర్వేను మరింత పకడ్బందీగా నిర్వహించడంలో భాగంగా ప్రత్యేక ఫార్మెట్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను కూడా రూపొందించాలని చెప్పారు. తద్వారా మరింత కచ్చితమైన సమాచారం వస్తుందని చెప్పారు. వివిధ శాఖల నుంచి ముందుగానే డేటాను తెప్పించుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. వలంటీర్ల ద్వారా సర్వే కచ్చితంగా ఉండేలా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ► 2004 సెప్టెంబర్ 1 నుంచి 2006 ఆగస్టు 31 వరకు పుట్టిన వారి ఆధారంగా 9వ తరగతి, పదవ తరగతి గ్రాస్ ఎన్రోల్ మెంట్ను గణించాలని, 2006 సెప్టెంబర్ 1 నుంచి 2008 ఆగస్టు 31 వరకు పుట్టిన వారి ఆధారంగా ఉన్నత విద్య గ్రాస్ ఎన్రోల్మెంట్ గణించాలని, ఇందు కోసం జనాభా జాతీయ కమిషన్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జనాభా అంచానాపై విడుదల చేసిన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని సీఎస్ సూచించారు. ఆ ఆరు పథకాల వల్లే విద్యా ప్రగతి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో అద్భుత పురోగతి సాధించిందని నాబార్డు ప్రశంసించింది. 2023–24 రాష్ట్ర ఫోకస్ పత్రంలో విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివేలా ఆరు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, దీంతో ప్రాథమిక విద్య నుంచి సెకండరీ, ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో భారీగా పెరిగిందని నాబార్డు రాష్ట్ర ఫోకస్ పత్రం పేర్కొంది. విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మార్గదర్శక కార్యక్రమాల ప్రభావం ప్రతిబింబించిందని తెలిపింది. మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మారుస్తూ విద్యార్థులు, టీచర్లకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తోందని చెప్పింది. 94.56 శాతం పాఠశాలల్లో కరెంటు, తాగునీరుతో సహా మౌలిక సదుపాయాలున్నాయని, నూరు శాతం శిక్షణ పొందిన ఉపాధ్యాయులున్నారని పేర్కొంది. ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోందని చెప్పింది. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద, నాడు–నేడు పథకాలు.. విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడానికేనని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో జనాభాలో కేవలం 2 శాతం కంటే తక్కువ మంది పిల్లలు మాత్రమే పాఠశాల విద్యకు దూరమైన్నట్లు 2021 డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ పేర్కొందని వివరించింది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయని తేల్చి చెప్పింది. 2022లో సర్వే ఇలా.. 2022లో 5,38,038 లక్షల మంది పదవ తరగతి పాస్ అవ్వగా, వారిలో 4,94,702 మంది తదుపరి కోర్సులు ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇతర డిప్లమా కోర్సులు, ఐఐఐటీలు, ఓపెన్ స్కూల్స్లో చేరారని వలంటీర్ల సర్వే ద్వారా గుర్తించారు. మిగతా 43,336 మంది ఆరోగ్య సమస్యలు, అకడమిక్ సమస్యలు, వివాహం, ప్రత్యేక అవసరాలు తదితర కారణాల వల్ల తదనంతర కోర్సుల్లో చేరలేదని లెక్క తేల్చారు. ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఇతరత్రా సౌకర్యాలు వివరించి వీరిలో కొందరిని తదనంతర కోర్సుల్లో చేర్చారు. ఇకపై ఇలాంటి వారి సంఖ్య ఇంకా తగ్గించేందుకు వలంటీర్ల సర్వేను మరింత శాస్త్రీయంగా చేపట్టనున్నారు. ఉన్నత విద్యలో చేరికలను మరింతగా ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగా పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులందరూ ఐటీఐ, పాలిటెక్నికల్ లేదా రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేలా పర్యవేక్షించాలి. పది తర్వాత ఏ కోర్సులోనూ చేరని విద్యార్థులుంటే వారిని తదుపరి కోర్సుల్లో చేర్పించడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. నాణ్యమైన ఉన్నత విద్యకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ విధంగా అండగా నిలుస్తున్నారో వారికి వివరించాలి. ప్రత్యేక నైపుణ్యంతో కూడిన ఉన్నత చదువుల వల్ల పేదల తల రాతలు మారతాయనే విషయాన్ని బాగా ఎక్కించాలి. ఈ విషయాలన్నింటిలో జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. – ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షలో సీఎస్ జవహర్రెడ్డి -
మా ఆదేశాలు అమలు కావాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యాహక్కు చట్ట నిబంధనల ప్రకారం ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆ ర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని ఈ ఏడాది జనవరిలో తామిచ్చిన ఆదేశాలు అమలుకాని పక్షంలో సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. తమ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 25 శాతం కోటా కింద ప్రవేశాలు కల్పించిన విద్యార్థుల పేర్లతో కూడిన జాబితాను రుజువులతో సహా తమ ముందుంచాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. తాజాగా పిటిషనర్ దాఖలుచేసిన కోర్టుధిక్కార వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న ఆదేశాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు అమలు చేయలేదంటూ పిటిషనర్ తాండవ యోగేష్ హైకోర్టులో కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే ధర్మాసనం మరోసారి విచారించింది. పిటిషనర్ యోగేష్ వాదనలు వినిపిస్తూ.. 25 శాతం సీట్ల గురించి పాఠశాల విద్యాశాఖ అధికారులు ఎలాంటి ప్రచారం నిర్వహించలేదని చెప్పారు. 25 శాతం కోటా కింద 93 వేల సీట్లు ఉండగా, కేవలం 14,888 దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. ప్రభుత్వ న్యాయవాది ఎల్.వి.ఎస్.నాగరాజు ఈ వాదనలను తోసిపుచ్చారు. మీడియాలో విస్తృత ప్రచారం చేశామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తమ ఆదేశాలను అమలుచేయని అధికారులు జైలుకు వెళతారని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. -
‘నాడు–నేడు రెండో దశ’ జూన్ 12లోగా పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు రెండో దశ పనులను జూన్ 12లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యా శాఖ అధికారులకు పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్ కాటంనేని భాస్కర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మన బడి నాడు–నేడు కింద రూ.8,000 కోట్ల అంచనా వ్యయంతో 22,344 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ స్కూళ్లల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం పనులు మినహా పై కప్పు, సీలింగ్, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల మరమ్మతులు, నిర్మాణాలు, ఫర్నీచర్ సరఫరా–ఏర్పాటు, పెద్ద, చిన్న రిపేర్లను జూన్ 12లోగా పూర్తి చేసి స్కూళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే బాధ్యతలను సంబంధిత హెడ్మాస్టర్లకు అప్పగించాలని సూచించారు. నాడు–నేడు కోసం కొనుగోలు చేసిన మెటీరియల్ను హెడ్మాస్టర్లతో పాటు తల్లిదండ్రుల కమిటీలు తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. కొనుగోలు చేసిన మెటీరియల్ నాణ్యత లేకపోయినా, తక్కువ సరఫరా చేసినా హెడ్మాస్టర్ తిరస్కరించాలని ఆదేశించారు. స్కూళ్ల పై కప్పుల మరమ్మతుల ఫొటోలను దశల వారీగా హెడ్మాస్టర్లు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. తరగతి గదుల్లో మెటీరియల్ నిల్వ ఉంచినప్పుడు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. మెటీరియల్ను సురక్షితంగా నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సూచనలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అదనపు వ్యయం అయినా హెడ్మాస్టర్లు లేదా సంబంధిత అధీకృత ప్రతినిధి జీతాల నుంచి రికవరీ చేస్తామన్నారు. అంతేకాకుండా క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ హెడ్మాస్టర్లకు తెలియజేసి అమలయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు స్పష్టం చేశారు. -
ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్మన్లు.. విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాడు–నేడు కింద వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం.. పాఠశాలల భద్రత, అక్కడి పరికరాలు, ఇతర సదుపాయాల పరిరక్షణ కోసం నైట్ వాచ్మన్ల నియామకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీరి నియామకానికి అనుసరించాల్సిన విధివిధానాలపై పాఠశాల విద్యాశాఖ మంగళవారం మార్గదర్శకాలను జారీచేసింది. వాచ్మన్లుగా నియమితులైన వారికి నెలకు రూ.6 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని 2020–21 నుంచి మిషన్ మోడ్లో చేపట్టిన సంగతి తెలిసిందే. దశల వారీగా ఆయా పాఠశాలల్లో రన్నింగ్ వాటర్తో కూడిన టాయిలెట్లు, తాగునీటి సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్బోర్డులు, పాఠశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, ప్రహరీ, కిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేయిస్తోంది. ఫేజ్–1 కింద 15,715 పాఠశాలల్లో ఈ పనులు పూర్తవగా ఫేజ్–2 కింద 22,228 పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన పాఠశాలలను ఫేజ్–3లో అభివృద్ధి చేస్తారు. ఇదేకాకుండా మరుగుదొడ్ల నిర్వహణ నిధిని ఏర్పాటు చేసి వాటి నిర్వహణ కోసం అన్ని పాఠశాలలకు పారిశుధ్య కార్మికులుగా ఆయాలను నియమించారు. మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు రసాయనాలు, సాధనాలను కూడా ప్రభుత్వం అందించింది. నాడు–నేడు ఫేజ్–2 కింద పాఠశాలల్లో ఈ మౌలిక సదుపాయాలతో పాటు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పీ)లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటుచేస్తున్నారు. నాడు–నేడు ఫేజ్–1 కింద పనులు పూర్తయిన స్కూళ్లలో కూడా వీటిని సమకూరుస్తున్నారు. పాఠశాలల్లో నేర్చుకున్న పాఠాలను ఇంటి వద్ద కూడా అభ్యాసం చేసేందుకు వీలుగా ఐఎఫ్పీలలోని కంటెంట్తో కూడిన ట్యాబులను రాష్ట్రంలోని అన్ని స్కూళ్ల 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. వీటికోసం ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ పరికరాలను, మౌలిక సదుపాయాల వస్తువులను రక్షించడం, భద్రంగా ఉండేలా చూడడం ఇప్పుడు ఎంతో ప్రాధాన్యంగా మారింది. వీటితోపాటు పాఠశాలల ఆవరణలోకి సంఘవిద్రోహశక్తులు ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం నైట్ వాచ్మన్లను నియమించాలని ఆదేశాలిచ్చింది. మొత్తం స్కూళ్లలో ప్రస్తుతం గుర్తించిన 5,388 నాన్ రెసిడెన్షియల్ (నివాసేతర) ఉన్నత పాఠశాలల్లో ఒక్కొక్క వాచ్మన్ను నియమించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ డాక్టర్ నిధిమీనా మెమో విడుదల చేశారు. నైట్ వాచ్మన్ విధులు ► పాఠశాల మూసివేయడానికి ముందు సాయంత్రం పాఠశాలకు హాజరు కావాలి. ► పని దినాల్లో మరుసటిరోజు పాఠశాల తెరిచే వరకు విధుల్లో ఉండాలి. ఇతర రోజుల్లో కూడా విధుల్లో ఉండాలి. సంబంధిత ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలో పనిచేయాలి. ► రాత్రి కాపలాదారు విధుల్లో ప్రధానమైనది పాఠశాల ఆస్తి అయిన æభవనం/ప్రాంగణం, ఇతర వస్తువులు, పరికరాలకు రక్షకుడిగా పనిచేయాలి. ► పాఠశాల ప్రాంగణంలోకి అనధికార వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా చూడాలి. ► ఏవైనా అసాధారణ కార్యకలాపాలు జరిగినప్పుడు, అగ్నిప్రమాదం వంటివి ఏర్పడినప్పుడు, ఏదైనా అనుమానం వచ్చినప్పుడు సంబంధిత హెడ్ మాస్టర్కు, సమీప పోలీస్ స్టేషన్కు, అగ్నిమాపక విభాగానికి నివేదించాలి. ► సాయంత్రం పాఠశాల గార్డెన్కు నీరు పోయాలి. ఎప్పటికప్పుడు ఆర్వో ప్లాంట్ను శుభ్రం చేయాలి. ► పాఠశాలకు సంబంధించిన మెటీరియల్ను తీసుకురావడం, వాటిని హెచ్ఎంకు అందించడం చేయాలి. ► స్కూలుకు సంబంధించి హెచ్ఎం చెప్పే ఇతర పనులను చేయాలి. ► నైట్ వాచ్మన్ పనిని హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ► 2023 మే 1వ తేదీనుంచి పాఠశాలల్లో వాచ్మన్లను నియమించేలా చర్యలు తీసుకోవాలి. ► నైట్ వాచ్మన్ రిజిస్ట్రేషన్ సంబంధిత హెడ్మాస్టర్ ఐఎంఎంఎస్ యాప్ ద్వారా చేపట్టాలి. ► వాచ్మన్లను నియమించిన అనంతరం ఆ వివరాలను యాప్లో అప్లోడ్ చేయాలి. మార్గదర్శకాలు.. ► పేరెంట్ కమిటీల ద్వారా పాఠశాలల్లో నైట్ వాచ్మన్ను నియమించాలి. ► ఇప్పటికే నియమితులైన ఆయా/కుక్ కమ్ హెల్పర్ భర్తకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ► గ్రామం/వార్డులో మాజీ సైనికులకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలి. ► వీరెవరూ అందుబాటులో లేకపోతే ఇతర వ్యక్తిని నియమించవచ్చు. ► నైట్ వాచ్మన్ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక నివాసి అయి ఉండాలి. ► ఆ వార్డులో అందుబాటులో లేకుంటే, సంబంధిత పట్టణ ప్రాంతాల నివాసిని ఎంపికచేయాలి. ► వయసు 60 ఏళ్లలోపు ఉండాలి. ► ఇప్పుడు గుర్తించిన 5,388 పాఠశాలలు కాకుండా ఇతర పాఠశాలల్లో నియమించకూడదు. ► ఎంపికైన వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.6 వేల చొప్పున టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ నుంచి చెల్లించాలి. -
ఒకే విద్యా విధానం.. మార్కుల స్థానంలో క్రెడిట్స్.. ఏమిటిది?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా జాతీయ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ను రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ జగదీష్కుమార్ స్పష్టం చేశారు. జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్ ఇవ్వడం దీని ఉద్దేశమని చెప్పారు. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ (ఎన్సీఆర్ఎఫ్)ను యూజీసీ సోమవారం విడుదల చేసింది. దీనిపై వస్తున్న సందేహాలపై యూజీసీ ఛైర్మన్ సమగ్ర వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఏకీకృత విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏమిటీ ఎన్సీఆర్ఎఫ్? విద్యావిధానానికి జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం దీని ఉద్దేశం. దీనికోసం సమీకృత క్రెడిట్ విధానాన్ని అన్ని విద్యా సంస్థలు అనుసరిస్తాయి. పాఠశాల, ఉన్నత విద్య, ఒకేషనల్, స్కిల్ ఎడ్యుకేషన్.. ఏదైనా మార్కులతో పనిలేకుండా క్రెడిట్స్గానే పరిగణిస్తారు. దీనికోసం జాతీయ స్థాయిలో పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్య విద్యలకు ప్రత్యేక క్రెడిట్ విధానంతో మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. క్రెడిట్ విధానం అంటే..? వివిధ స్థాయిల్లో మార్కుల స్థానంలో క్రెడిట్స్ ఇస్తారు. ఒక విద్యార్థి సంవత్సరంలో రెండు సెమిస్టర్లలో 30 గంటల బోధన (ఏదైనా సబ్జెక్టులో) తరగతులకు హాజరవ్వాలి. ప్రతీ సెమిస్టర్కు 20 క్రెడిట్స్ ఉంటాయి. ఏడాదికి 40 క్రెడిట్స్ వస్తాయి. అన్ని సబ్జెక్టులు కలిపి 1200 గంటల బోధన సమయంలో విద్యార్థి 40 క్రెడిట్స్ పొందే వీలుంటుంది. విద్యార్థి 5వ తరగతి పూర్తి చేసిన తర్వాత దీన్ని లెవర్–1గా భావిస్తారు. 6–8 తరగతులు పూర్తి చేస్తే లెవల్–2, తర్వాత 9, 10 తరగతులు పూర్తి చేస్తే లెవల్–3గా, 11, 12 పూర్తి చేస్తే లెవల్–4గా గుర్తిస్తారు. స్కూల్ విద్య మొత్తంగా 160 క్రెడిట్స్ ఉంటాయి. మూడేళ్ళ బ్యాచిలర్ డిగ్రీలో ప్రతి సంవత్సరం 40 క్రెడిట్స్ చొప్పున మొత్తం 120 క్రెడిట్స్ ఉంటాయి. నాలుగేళ్ళ డిగ్రీని 6.5 లెవల్గా, మూడేళ్ళ డిగ్రీ తర్వాత మాస్టర్ డిగ్రీని లెవల్ 7గా, నాలుగేళ్ళ ఇంజనీరింగ్ డిగ్రీ, పీహెచ్డీని కలిపి 8 లెవల్గా చూస్తారు. పీహెచ్డీ పూర్తిచేసిన విద్యారి్థకి మొత్తం 320 క్రెడిట్స్ ఇస్తారు. ఒకేషనల్, స్కిల్ ఎడ్యుకేషన్కు కూడా వివిధ స్థాయిలో (4.5 నుంచి 8 లెవల్స్) క్రెడిట్స్ ఉంటాయి. క్రెడిట్స్ నిల్వ ఇలా... ప్రతీ లెవల్లో విద్యార్థి సాధించిన క్రెడిట్స్ అన్నీ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఎబీసీ) టెక్నాలజీ ప్లాట్ఫాంలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రతి విద్యా సంస్థ ఈ ప్లాట్ఫాం కిందకు వస్తుంది. క్రెడిట్స్ ఆధారంగానే విద్యార్థి స్థాయిని ఎన్సీఆర్ఎఫ్ నిర్ణయిస్తుంది. ఉదాహరణకు టెన్త్ తర్వాత ఐటీఐ పాస్ అయిన విద్యార్థి అదనంగా లాంగ్వేజ్ కోర్సు చేస్తే ఇది 12వ క్లాసుకు సమానం అవుతుంది. అతను యూనివర్సిటీలో చేరేందుకు వీలు కల్పిస్తుంది. అదే విధంగా 5వ స్థాయి విద్యార్థి బ్రిడ్జ్ కోర్సులు అదనంగా చేస్తే అదనపు క్రెడిట్స్ వస్తాయి. అతను నేరుగా 8వ క్లాసు పరీక్షకు హాజరవ్వొచ్చు. విద్యార్థి ఆన్లైన్ కోర్సులు చేసినా ఆ క్రెడిట్స్ను కూడా లెక్కలోకి తీసుకుంటారు. క్రెడిట్స్ను లెక్కగట్టడానికి ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఇవి అకడమిక్, స్కిల్, అనుభవం ద్వారా పొందే విద్యను బట్టి ఉంటాయి. ఇవి కూడా క్రెడిట్సే.. అకడమిక్ విద్యే కాదు... క్రీడలు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, మ్యూజిక్, హెరిటేజ్, ట్రెడిషనల్ స్కిల్స్, ఫైన్ ఆర్ట్స్ వంటి ప్రత్యేక కళలకూ క్రెడిట్స్ ఇస్తారు. ఇవి కూడా క్రెడిట్ బ్యాంకులో చేరతాయి. క్రెడిట్ సిస్టమ్ను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అనుసరిస్తున్నారు. కొన్ని క్రెడిట్స్ను అన్స్కిల్డ్, కొన్ని క్రెడిట్స్ను స్కిల్ అని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే మన దేశమూ అంతర్జాతీయ స్థాయిలో క్రెడిట్ విధానం ఇచ్చేందుకు ప్రయతి్నస్తోంది. -
పిల్లలకూ ‘టోఫెల్’.. సీఎం జగన్ మరో వరం
సాక్షి, అమరావతి: ఇంగ్లిష్ మీడియం నుంచి బై లింగ్యువల్ (ద్వి భాషా) పాఠ్యపుస్తకాల దాకా.. టంచన్గా ఫీజుల నుంచి నాణ్యమైన మధ్యాహ్న భోజనం వరకూ ప్రతి అంశంపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ పిల్లలకు అత్యుత్తమ బోధన అందేలా నిరంతరం పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా మరో కీలక సూచన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యార్థులను ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్ది పోటీ పరీక్షల్లో రాణించేలా చిన్న నాటి నుంచే టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్) పరీక్షకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యుత్తమ ఆంగ్ల నైపుణ్యాలు, సామర్ధ్యాలు అలవడేలా తగిన శిక్షణ ఇచ్చి టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. దీని ద్వారా 3 నుంచి 5 తరగతి విద్యార్థులకు ప్రైమరీ స్థాయిలో, 6 నుంచి 9 తరగతుల వారికి జూనియర్ స్థాయిలో టోఫెల్ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు అందించనున్నారు. ప్రైమరీ స్థాయిలో వినడం, చదవడంలో నైపుణ్యాలపై పరీక్ష ఉంటుంది. జూనియర్ స్థాయిలో వీటికి అదనంగా మాట్లాడటంలో నైపుణ్యాలను కూడా పరీక్షిస్తారు. ఈ పరీక్షల కోసం విద్యార్థులు, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ – కంటెంట్ను రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థీ అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా ముందడుగు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. విద్యార్ధుల చదువులకు అన్ని దశల్లో అండగా ఉంటూ నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. పాఠశాల విద్య మొదలుకొని ఉన్నత విద్యవరకు ఎక్కడా చదువులు ఆర్థికంగా భారం కాకుండా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని చెప్పారు. ఏ ఒక్క విద్యార్థీ, ఏ కారణంతోనూ చదువులకు దూరం కాకుండా, డ్రాపౌట్లు అనే ప్రసక్తే లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్థాయిలో విద్యాశాఖను సమన్వయం చేశామన్నారు. పిల్లలు పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో పాటు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, టీచర్లు వారితో మాట్లాడి బడికి పంపేలా పటిష్ట వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. విద్యారంగంపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు అంశాలపై అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. నిరంతరం ట్రాకింగ్ విద్యార్థులు ప్రతి రోజూ తరగతులకు హాజరై అభ్యసన ప్రక్రియ అవాంతరాలు లేకుండా సాఫీగా సాగేలా చూడడం, నాణ్యతా ప్రమాణాలు పెరిగేలా బోధనాభ్యసన ప్రక్రియలను ట్రాకింగ్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ‘సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది. దీన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవాలి. పిల్లలు పాఠశాలలకు గైర్హాజరైన పక్షంలో తల్లిదండ్రులకు వెంటనే మెసేజ్ వెళుతోంది. దీంతో తమ పిల్లలు సక్రమంగా స్కూళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోగలుగుతున్నారు. వలంటీర్ నుంచి సచివాలయ సిబ్బంది, టీచర్లు తల్లిదండ్రులను కలుసుకుంటూ పిల్లలను పాఠశాలలకు పంపేలా ప్రోత్సహించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రతి ఒక్క విద్యార్థికీ నాణ్యమైన చదువులు అందేలా ఎక్కడా రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆర్థిక స్థోమత లేనందున పిల్లలను చదించుకోలేకపోతున్నామనే పరిస్థితి తలెత్తకుండా అర్హత కలిగిన ప్రతి తల్లికీ పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడి అందిస్తున్నాం. ఇంటర్మీడియట్ వరకూ అమ్మ ఒడిని వర్తింపచేశాం. ఆ తర్వాత కూడా ఉన్నత చదువులు అభ్యసించేలా విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నాం. తల్లిదండ్రులపై నయాపైసా కూడా ఫీజుల భారం లేకుండా ప్రభుత్వమే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తోంది. విద్యార్ధుల వసతి, రవాణా, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20వేల వరకు ఇస్తున్నాం. ఇలా ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రతి విద్యార్ధికీ ఈ తోడ్పాటు అందేలా ట్రాక్ చేస్తున్నాం. డ్రాపౌట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై ఎప్పటికప్పుడు సమర్థంగా పర్యవేక్షణ కొనసాగించాలి’ అని సమీక్షలో సీఎం జగన్ సూచించారు. విద్యాకానుక కిట్లు.. జగనన్న విద్యాకానుక 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి అన్ని వస్తువులను ముందుగానే సిద్ధం చేసి ఉంచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించగా మే 15 నాటికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. నైపుణ్యాలు పెంపొందించేలా సబ్జెక్టు టీచర్లు ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు మూడో తరగతి నుంచే అలవడాల్సిన నైపుణ్యాలు, సామరŠాధ్యలను మెరుగుపర్చేందుకు సబ్జెక్టు టీచర్ల విధానాన్ని తెచ్చామని సీఎం జగన్ తెలిపారు. దీనివల్ల పాఠశాల దశనుంచే పిల్లలకు ప్రతి సబ్జెక్టులో పట్టు లభించి చక్కటి పునాది ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా సబ్జెక్టు టీచర్లకు మెరుగైన బోధన పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణకు అధికారులు ప్రతిపాదించగా సీఎం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేలా కోర్సు ఉంటుందని, వచ్చే రెండేళ్ల పాటు సర్టిఫికెట్ కోర్సు కొనసాగుతుందని అధికారులు వివరించారు. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా బోధనా నైపుణ్యాలు మరింత మెరుగుపడి పిల్లలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, అత్యున్నత ప్రమాణాలు సాధించగలుగుతామని సీఎం పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని ఆదేశించారు. ఎక్కడా కూడా టీచర్లు సరిపోలేదన్న మాటే రాకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధనకు సంబంధించి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ) ఏర్పాటుపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే జూన్ నాటికి నాడు – నేడు తొలిదశ పూర్తైన స్కూళ్లలో తరగతి గదుల్లో ఐఎఫ్పీలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ పూర్తిస్థాయిలో చేయాలన్నారు. ఇప్పటికే వెయ్యి ప్రభుత్వ స్కూళ్లు అఫిలియేట్ అయ్యాయని, మిగిలిన వాటికి కూడా అఫిలియేషన్ పొందేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ నాడు – నేడు పనులపైనా సీఎం సమీక్షించారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టి ముందుకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్యాబ్లకు తక్షణమే మరమ్మతులు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ, వినియోగస్తున్న తీరుపై సీఎం సమీక్షించి కొన్ని సూచనలు జారీచేశారు. ట్యాబ్లకు మరమ్మతులు అవసరమైతే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ట్యాబ్లకు సంబంధించి ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబరును స్కూల్లో ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్వోపీ రూపొందించి అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమస్య తలెత్తితే రెండు మూడు రోజుల్లోనే పరిష్కరించి తిరిగి విద్యార్థులకు అప్పగిస్తున్నట్లు వివరించారు. ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పకడ్బందీగా చర్యలు తీసుకోవడం ద్వారా పదో తరగతి పరీక్షలను సమర్థంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కడా లీకేజీలు, మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా సజావుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలను నో మొబైల్ జోన్స్గా ప్రకటించినట్లు తెలిపారు. ప్రశ్న ప్రత్రాల్లో క్యూ ఆర్ కోడ్ ఇవ్వడం ద్వారా లీకేజీలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షల్లో కూడా ఇలాంటి చర్యలే తీసుకోవడంతో సజావుగా ముగిశాయన్నారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ప్రభుత్వ సలహాదారు ఏ.సాంబశివారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్ విద్య కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతులు) కమిషనర్ కాటమనేని భాస్కర్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసులు, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీఎన్ దీవాన్రెడ్డి, నాడు – నేడు టెక్నికల్ డైరెక్టర్ మనోహర్రెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్కూల్ పిల్లలకు ‘టోఫెల్’ పరీక్షలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యుత్తమ ఆంగ్ల నైపుణ్యాలు, సామరŠాధ్యలు అలవడేలా తగిన శిక్షణ ఇచ్చి టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 3 నుంచి 5 తరగతి ప్రైమరీ విద్యార్థులకు టోఫెల్ ప్రైమరీ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ అందించాలన్నారు. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు జూనియర్ టోఫెల్ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులకు జూనియర్ స్టాండర్డ్ టోఫెల్ సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం మూడు దశల్లో పరీక్షలు ఉంటాయి. ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్ నైపుణ్యాల పరీక్ష ఉంటుంది. జూనియర్ స్టాండర్డ్ స్ధాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఈ పరీక్షల కోసం విద్యార్థులు, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ – కంటెంట్ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. -
పేపర్ లీక్.. టెన్త్ పరీక్షలు వాయిదా?.. పాఠశాల విద్యాశాఖ క్లారిటీ
సాక్షి, వికారాబాద్: తాండూర్లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. సోమవారం ఉదయం 9 గంటలకు టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభం అవ్వగానే నిమిషాల వ్యవధిలో తెలుగు పేపర్ వాట్సాప్లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. దీంతో ప్రశ్నాపత్రం లీకైందంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో మిగతా పరీక్షల నిర్వహణపై సందిగ్దం నెలకొంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన క్లారిటీ ఇచ్చారు. రేపటి పదో తరగతి పరీక్ష యథాతథంగా జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని తెలిపారు. టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ బహిర్గతం కావడంపై జిల్లా కలెక్టర్, వికారాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న నలుగురు వ్యక్తులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. చట్టం 25/1997, CrPC సంబంధిత సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు. ‘సెంటర్ నెం. 24033, గవర్నమెంట్, హైస్కూల్ నెం.1, తాండూరు, వికారాబాద్ జిల్లాలోని ఇన్విజిలేటర్ బందెప్ప పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి మరో ఉపాధ్యాయుడు సమ్మప్పకు ఉదయం 9.37 గంటలకు పంపినట్లు గుర్తించాం. పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం 9.30 తర్వాత బయటి వ్యక్తిని కేంద్రంలోకి రాలేదు. కేంద్రం నుంచి బయటకు ఎవరూ వెళ్లలేదు. పరీక్షా నిర్వహణ విషయంలో రాజీపడలేదు. విచారణ తర్వాత ఇది కేవలం ఇన్విజిలేటర్ బందెప్ప దుర్వినియోగమేనని నిర్ధారించాం’ అని చెప్పారు.. సస్పెండ్ అయ్యింది వీళ్లే.. 1. శివ కుమార్, GHM, ZPHS, ముద్దాయిపేట, యాలాల్(M) (చీఫ్ సూపరింటెండెంట్) 2. K. గోపాల్, SA, Govt., No.1 ఉన్నత పాఠశాల, తాండూరు (డిపార్ట్మెంట్ అధికారి) 3. S. బండప్ప, SA(BS), Govt., No. 1 ఉన్నత పాఠశాల, తాండూరు. (ఇన్విజిలేటర్) 4. సమ్మప్ప, SA(PS), ZPHS, చెంగోలు, తాండూరు మండలం (ఇన్విజిలేటర్) చదవండి: టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్.. -
ఏపీ: ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు (ఫొటోలు)
-
Andhra Pradesh: టెన్త్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3,349 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తున్నారు. 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అన్ని కేంద్రాల్లోనూ పూర్తి స్థాయిలో ఫర్నీచర్, మంచి నీరు వంటి సదుపాయాలు కల్పించామని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా విద్యార్థుల రాకపోకలకు సమస్య లేకుండా ఆర్టీసీ యాజమాన్యం తగినన్ని బస్సులు నడుపుతోందన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో టెన్త్ విద్యార్థులు హాల్ టికెట్ చూపించి, ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఏడు మాధ్యమాల్లో పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ మాధ్యమాల్లో రోజు విడిచి రోజు ఆరు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ► తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మేథ్స్, సోషల్ స్టడీస్ పరీక్షలకు 24 పేజీల బుక్లెట్, ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్, సంస్కృతం, వృత్తి విద్యా కోర్సులకు 12 పేజీల బుక్లెట్లను అందిస్తారు. సైన్స్కు ఒకే ప్రశ్నపత్రం, రెండు ఆన్సర్ షీట్లు ఉంటాయి. ఆయా ప్రశ్నలకు నిర్దేశిత బుక్లెట్లోనే సమాధానాలు రాయాలి. ► పేపర్ లీక్ అనేది లేకుండా పక్కాగా నిఘా ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా, ఏదైనా అవాంఛనీయ ఘటన, లీక్ జరిగితే అది ఎక్కడ జరిగిందో వెంటనే కనిపెట్టేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ► అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తారు. పరీక్షల నిర్వహణకు 43 వేల సిబ్బందిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ తదితర విభాగాల సహకారం తీసుకుంటున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 104 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాలనూ నో ఫోన్ జోన్లుగా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు సహా ఏ ఒక్కరూ మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లరాదు. ► విద్యార్థులు కూడా వాచీలు, ఫోన్లు ఇతర డిజిటల్ వస్తువులను తీసుకెళ్లకూడదు. పెన్ను, పెన్సిల్, ఎరేజర్ స్కేలు వంటివి తీసుకెళ్లవచ్చు. విద్యార్థులకు ఇచ్చిన ఓఎమ్మార్ షీట్లో వివరాలు తనవో కాదో సరిచూసుకున్న తర్వాతే సమాధానాలు రాయాలి. ఏదైనా తేడా ఉంటే ఇన్విజిలేటర్కు చెప్పి సరైనది పొందాలి. ఓఎమ్మార్ షీట్ను సమాధానాల బుక్లెట్కు పిన్ చేయాలి. ► ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. -
టెన్త్ పరీక్షలకు సకలం సిద్ధం
రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరగనున్న టెన్త్ పబ్లిక్పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందిలేకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతోంది. వారికి అవసరమైన ఫర్నిచర్, మంచినీటి సదుపాయంతో పాటు అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతోంది. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చర్యలు చేపట్టారు. కొత్తగా పునర్విభజించిన 26 జిల్లాల ప్రాతిపదికన ఇవి జరుగుతాయి. ఆయా జిల్లాల డీఈఓలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అన్ని జిల్లాల అధికారులు, వివిధ శాఖల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. – సాక్షి, అమరావతి ఉ.9:30 నుంచి మ.12:45 గంటల వరకు.. ఈ పరీక్షలు ఉ.9:30 నుంచి మ.12:45 గంటల వరకు 3.15 గంటల పాటు నిర్వహిస్తారు. అభ్యర్థులను ఉ.8:45 నుంచి 9:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. తద్వారా వారు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలను రాయగలుగుతారని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అలాగే.. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్తో సహా, ఎవరూ మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లడానికి అనుమతించరు. ల్యాప్టాప్లు, ట్యాబ్లు, కెమెరాలు, ఇయర్ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్వాచ్లు, బ్లూటూత్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలనూ అనుమతించరు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. విద్యాశాఖతో పాటు రెవెన్యూ, పోలీసు, పోస్టల్, ఆర్టీసీ, వైద్యారోగ్య శాఖ, ఏపీ ట్రాన్స్కో తదితర విభాగాలు ఈ పరీక్షల ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నాయి. ప్రతి పాయింట్లోనూ పోలీసు భద్రత పరీక్ష పత్రాల రక్షణ దృష్ట్యా అన్ని డిస్ట్రిబ్యూషన్, స్టోరేజ్ పాయింట్ల వద్ద కాన్ఫిడెన్షియల్ ఎగ్జామినేషన్ మెటీరియల్కు భద్రత ఉండేలా పోలీసులను ఏర్పాటు చేయనున్నారు. వీటిని తీసుకెళ్లే వాహనాలకు జిల్లా కేంద్రాల నుంచి ఎస్కార్ట్ ఏర్పాటుచేస్తారు. పరీక్షా కేంద్రాల సందర్శనకు పోలీసు ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు కేంద్రాల వద్ద సాయుధ గార్డులను పెట్టనున్నారు. ఇక ప్రశ్నపత్రాల లీకేజీ, నకిలీ ప్రశ్నపత్రాలు మొదలైన వాటికి సంబంధించిన పుకార్లను నిలువరించే చర్యలకు వీలుగా మొబైల్ పోలీస్ స్క్వాడ్లకు సూచనలు అందిస్తారు. ఎక్కడైనా తప్పిదాలు జరిగితే సంబంధిత సిబ్బందిని వెంటనే విధుల నుంచి తప్పించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తారు. శాంతిభద్రతల నిర్వహణకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించనున్నారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్, నెట్సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాలకు పరీక్షలు జరిగినన్ని రోజులూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ కూడా చర్యలు తీసుకుంటోంది. అన్ని రూట్లలో ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపనున్నారు. హాల్ టికెట్ ఉన్న అభ్యర్థులు అన్ని పరీక్షల రోజుల్లో వారి నివాసం నుండి పరీక్షా కేంద్రానికి ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తారు. అలాగే.. ♦ఎండల దృష్ట్యా విద్యార్థులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురికాకుండా పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంల నియామకంతో పాటు తగిన మెడికల్ కిట్లను వైద్యశాఖ ఏర్పాటుచేయనుంది. మొబైల్ మెడికల్ వాహనాలను కూడా అందుబాటులో ఉంచనుంది. ♦ అన్ని పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్తో పాటు వెంటిలేషన్, పరిశుభ్ర వాతావరణం, ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ♦ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్లో సహా అన్ని జిల్లాల విద్యాధికారి కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటుచేయనున్నారు. డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 0866–2974540 ♦ వొకేషనల్ పబ్లిక్ పరీక్షలతో సహా అన్ని సబ్జెక్టులకు బార్కోడింగ్ విధానాన్ని పొడిగించనున్నారు. కోడింగ్ విధానంపై జిల్లా స్థాయిలో బార్కోడ్ సూపర్వైజర్లు, ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇస్తారు. సమాధాన పత్రాలను కోడింగ్ విధానంలో మూల్యాంకనం చేయనున్నారు. ♦ కోడింగ్ నంబర్ల పరిశీలన తదితర పనులు నిర్వహించాల్సి ఉన్నందున ఇన్విజిలేటర్లు ఉ.8:15లోపు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్కి రిపోర్ట్ చేయాలి. ♦ విద్యార్థులకు ఇచ్చే గ్రాఫ్లు, మ్యాప్ పాయింట్లు, సమాధానాల బుక్లెట్లపై రోల్ నెంబర్, పేరు వంటివి రాయకూడదు. గ్రాఫ్లు, మ్యాప్ పాయింట్లు అటుఇటు కాకుండా ఉండేందుకు బుక్లెట్పై క్రమసంఖ్యను రాసేలా చూడాలి. -
ఆలస్యంగా వస్తే అనుమతి లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్ తెలిపారు. 9.30 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన ఎవరినీ అనుమతించబోమన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సర్క్యులర్ విడుదల చేశారు. www.bse.ap.gov.in లో పదో తరగతి పరీక్షల టైమ్టేబుల్ను చూడొచ్చన్నారు. అన్ని పరీక్షలను నిర్దేశించిన తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులకు సూచనలు.. ♦ హాల్టికెట్లు పొందాక విద్యార్థులంతా తమ పేరు, పుట్టిన తేదీ, ఫొటో వంటి అన్ని వివరాలను సరిచూసుకోవాలి. వాటిలో పొరపాట్లు గమనిస్తే పాఠశాల హెడ్మాస్టర్/ప్రిన్సిపాల్ని సంప్రదించాలి. ♦ విద్యార్థులు తప్పనిసరిగా హాల్టికెట్లను తమతో పాటు పరీక్షకు తీసుకెళ్లాలి. హాల్టికెట్ లేకపోతే పరీక్షకు అనుమతించరు. ♦ పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్, కెమెరాలు, ఇయర్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు. ఎవరైనా వాటిని లోపలకు తీసుకువెళ్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ♦ విద్యార్థులు ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ ప్రశ్నలను వేర్వేరు సమాధాన పత్రాల్లో రాయాలి. ఈ రెండింటి కోసం వేర్వేరుగా 12 పేజీల సమాధానాల బుక్లెట్లు ఇస్తారు. ♦ విద్యార్థులను అత్యవసర పరిస్థితుల్లో మినహా 12:45 గంటల వరకు పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించరు. ♦ ప్రశ్నపత్రాల లీక్ అని తప్పుడు, నిరాధారమైన పుకార్లకు పాల్పడకూడదు. వదంతులను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ♦ పరీక్ష సమయంలో అక్రమాలకు పాల్పడేవారిపై, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు ఉంటాయి. అలాంటివారిని తదుపరి పరీక్షలు రాయనీయరు. ♦ విద్యార్థి పేరు, రోల్ నంబర్, ఇతర వివరాలను 24 పేజీల జవాబు బుక్లెట్, మ్యాప్ లేదా గ్రాఫ్ షీట్లోని ఏ పేజీలోనూ రాయకూడదు. ♦ కాగా పరీక్షలు జరిగే రోజుల్లో ఎంఈవోలు, హెచ్ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ల విధులపైనా సూచనలు జారీ చేశారు. -
ఆమె అక్షర... లక్ష్మి
సాక్షి, హైదరాబాద్: ఆడపిల్ల పాఠశాల విద్య పూర్తి చేయడమే గగనం. అవును నిజం.. కానీ ఇప్పుడది గతం. నేడు అగ్రభాగం ఆమె సొంతం. బడిలో బాలికలదే ముందంజ. ఉన్నత చదువు ల్లోనూ వనితే ఫస్ట్. అక్షరాన్ని ఆయుధంగా భావిస్తున్న నేటి మహిళలు విద్యారంగంలో సత్తా చాటుతున్నారు. ఇంకా ‘సగభాగమేంటి?’.. అంతకు మించే అని గర్వంగా చెబుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు..ఏ విశ్వవిద్యాలయాని కెళ్ళినా ప్రవేశాల సంఖ్యలో అమ్మాయిలదే మొదటి స్థానం. వందేళ్ళు దాటిన ఉస్మానియా సహా చాలా వర్సిటీల్లో వారే అధిక సంఖ్యలో ఉన్నారు. సంప్రదాయాల సంకెళ్లు తొలగి అవగాహన, ఆధునికత పెరగడం, దానికి తగినట్టుగా బడులు, కళాశాలలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రావడం, ప్రత్యేక పాఠశాలలు, కాలేజీలు కూడా ఏర్పాటు కావడం, విద్య అవసరం అనే భావన పెంపొందడం..ఇవన్నీ మహిళలను ఉన్నత విద్య వైపు నడిపిస్తున్నాయి. అందుకే ఏ వర్సిటీ చూసినా, ఏ కోర్సు పరిశీలించినా మహిళల శాతమే మెరుగ్గా ఉంటోంది. అబ్బురపరిచే అంకెలు ► ఉస్మానియా వర్సిటీ పరిధిలో లా, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, బీఎడ్కు సంబంధించిన 20 కాలేజీలుంటే, అందులో 18,763 సీట్లున్నాయి. 2022లో వీటిల్లో 10,897 సీట్లు (58.09 శాతం) అమ్మాయిలే దక్కించుకున్నారు. ఓయూ క్యాంపస్లో 1,599 సీట్లుంటే 1,083 సీట్లు వారివే. పీజీ సెంటర్స్లోని 202 సీట్లలో అమ్మాయిల వాటా 107. ► జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో 2010–11లో 58 శాతం సీట్లు అబ్బాయిలతో భర్తీ అయ్యాయి. 2022లో సీన్ దాదాపు రివర్స్ అయ్యింది. చేరికల్లో అబ్బాయిలది 45 శాతం అయితే, అమ్మాయిలది 55 శాతం. ► పీజీలోనూ అమ్మాయిలదే హవా. వివిధ కోర్సుల్లో దాదాపు 80 శాతం మహిళలే ఉండటం విశేషం. కరోనా తర్వాత బాలురు ఇంజనీరింగ్, డిగ్రీతో ఉపాధి వైపు వెళ్తుంటే, అమ్మాయిలు మాత్రం పీజీలో చేరుతున్నారు. పరిశోధనల వరకూ వెళ్ళాలి మహిళల్లో ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. పోస్టు–గ్రాడ్యుయేషన్ వరకూ ఎక్కడా ఆగకుండా ముందుకెళ్తున్నారు. కానీ రీసెర్చ్ వరకూ వెళ్ళలేకపోతున్నారు. ఆరేళ్ళ వరకూ సమయం వెచ్చించాల్సి రావడం కొంత ఇబ్బందిగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉవంచుకుని మహిళలు, వారి తల్లిదండ్రుల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ విజ్జులత, వీసీ, తెలంగాణ మహిళా యూనివర్సిటీ సాధికారత సాధించాలి విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. సామాజిక మార్పులు, ప్రభుత్వాల ప్రోత్సాహం వల్లే సమాజంలో మహిళలు ముందడుగు వేస్తున్నారు. పురుషులతో సమానంగా మహిళలూ పోటీ పడుతున్న తీరు అభినందనీయం. మహిళాలోకం ఇదే స్ఫూర్తితో మరింత ముందడుగు వేయాలి. సాధికారిత సాధించాలి. – వాకాటి కరుణ, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డిజిటల్ టెక్నాలజీ వైపు అడుగులేయాలి విద్యా రంగంలో అనునిత్యం వస్తున్న మార్పులకు అనుగుణంగా మహిళలూ ముందుకెళుతున్నారు. వృత్తి విద్యా కోర్సుల్లో రాణించేలా ప్రస్తుత సమాజ పోకడలను అవగతం చేసుకుంటున్నారు. విద్యావంతులైన తల్లిదండ్రుల శాతం పెరగడమూ మహిళా విద్యకు ఊతం ఇస్తోంది. ప్రతి మహిళా డిజిటల్ టెక్నాలజీలో మరింత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మా క్యాంపస్లో ప్రత్యేక కోర్సును డిజిటల్ టెక్నాలజీలో ప్రవేశపెడుతున్నాం. భవిష్యత్లో అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. – ప్రొఫెసర్ కవిత దార్నా, వీసీ, జేఎన్ఎఫ్ఏ విధాన నిర్ణేతలుగా ఎదగాలి చదువుతో సామాజికంగా మహిళ ఉన్నత శిఖరాలనే అధిరోహిస్తోంది. అయితే క్రిటికల్ జాబ్స్లో ఇంకా మహిళకు ఎదురీత తప్పడం లేదు. విధాన పరమైన నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే ఈ పరిస్థితి మారుతుంది. అత్యున్నత పదవుల్లో ఉన్నా మహిళకు ఇంటి బాధ్యతలు తప్పడం లేదు. పురుషాధిక్య మానసిక ధోరణే దీనికి ప్రధాన కారణం. – సూర్యదేవర నీలిమ, సీఈఓ, అనురాగ్ యూనివర్సిటీ -
ప్రయివేట్ స్కూళ్లలో పేదలకు ఉచిత ప్రవేశాలు
సాక్షి, అమరావతి: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లలో ప్రవేశాలు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన వారు (అనాథ పిల్లలు, హెచ్ఐవీ బాధిత పిల్లలు, దివ్యాంగుల) కోసం 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల(బీసీ, మైనారిటీ, ఓసీ)కు చెందిన పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హత కలిగిన పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించి 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షిక ఆదాయం రూ.1,20,000, పట్టణ ప్రాంతంలో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షికాదాయం రూ.1,44,000లను ప్రాతిపదికగా తీసుకుని వారి కుటుంబాల పిల్లలను అర్హులుగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాల కల్పనకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు వెల్లడించారు. ఒకటో తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తు నమోదుకు షెడ్యూల్ కూడా ప్రకటించామన్నారు. అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు, అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్(సమగ్ర శిక్ష) దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. విద్యార్థుల ప్రవేశాలకు షెడ్యూల్ ఆన్లైన్ పోర్టల్లో అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల నమోదు తేదీలు: 06.03.2023 నుంచి 16.03.2023 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు (ఆన్లైన్ పోర్టల్లో) తేదీలు: 18.03.2023 నుంచి 07.04.2023 వరకు ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక ప్రక్రియ: 09.04.2023 నుంచి 12.04.2023 వరకు మొదటి ఎంపిక జాబితా విడుదల తేదీ: 13.4.2023 ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో మొదటి జాబితాలో ఎంపిక కాబడిన విద్యార్థుల ప్రవేశాలను నిర్థారించే తేదీలు: 15.04.2023 నుంచి 21.04.2023 వరకు రెండో ఎంపిక జాబితా విడుదల తేదీ: 25.4.2023 రెండో జాబితాలో ఎంపికైన విద్యార్థుల ప్రవేశాలను నిర్థారించే తేదీలు: 26.04.2023 నుంచి 30.04.2023 వరకు (చదవండి: కార్చిచ్చుకు పక్కా స్పాట్) -
ప్రైవేటు స్కూళ్లలో ఆర్టీఈ చట్టం కింద 1వ తరగతిలో ప్రవేశాలు
సాక్షి, అమరావతి: విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం కింద రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి ఒకటో తరగతిలో అర్హులైన పేద విద్యార్ధులకు 25 శాతం సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఈమేరకు జీవో 24ను విడుదల చేశారు. ఐబీ (అంతర్జాతీయ), ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ స్కూళ్లన్నిటిలోను విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను అర్హులైన పేదలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ సీట్లకు సంబంధించి మార్చి 4న ప్రవేశాల క్యాలెండర్తో సహా నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆయా ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు మార్చి 6 నుంచి 16 వరకు సంబంధిత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి సంబంధిత వెబ్సైట్ విండో మార్చి 18నుంచి అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 7వ తేదీవరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థుల ఎంపిక ఏప్రిల్ 9 నుంచి 12 వరకు చేపడతారు. మొదటి విడత కేటాయింపు ఏప్రిల్ 13న ఉంటుంది. విద్యార్థులు ఏప్రిల్ 15 నుంచి 21వ తేదీలోపు ఆయా స్కూళ్లలో చేరికలను ఖరారు చేసుకోవాలి. అనంతరం రెండోవిడత సీట్ల కేటాయింపు ఏప్రిల్ 25న చేపడతారు. ఈ విద్యార్థులు ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీలోపు ఆయా స్కూళ్లలో చేరాలి. రిజిస్ట్రేషన్లను హెచ్టీటీపీఎస్://సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్లో నమోదు చేయాలి. ఈ ప్రైవేటు స్కూళ్లలో ఆర్టీఈ చట్టం కింద ప్రవేశాలకు సంబంధించి సమస్యలు తలెత్తితే 14417 టోల్ఫ్రీ నంబరును సంప్రదించాలి. ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను, విధివిధానాలను జీవోలో వివరించారు. ఈ స్కూళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఒక్కో విద్యార్థికి పట్టణప్రాంతాల్లో రూ.8 వేలు, రూరల్లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100 చొప్పున చెల్లిస్తారని జీవోలో తెలిపారు. రాష్ట్రంలోని తమ పిల్లలను బడులకు (ప్రభుత్వ, లేదా ప్రైవేటు) పంపించే అర్హులైన పేద తల్లులందరికీ అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 75 శాతం, ఆపై హాజరు నిబంధన అమలు చేస్తూ పేద పిల్లలందరికీ అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో సీట్లు పొందే ఈ పిల్లలకు సంబంధించి ఆయా స్కూళ్లకు చెల్లించాల్సిన ఫీజును నిబంధనలను అనుసరించి అమ్మ ఒడిని అందుకున్న అనంతరం విద్యాసంవత్సరం చివరన ఆయా స్కూళ్లకు రీయింబర్స్ చేస్తారని జీవోలో పేర్కొన్నారు. అలా తల్లిదండ్రులు చెల్లించకపోతే ప్రభుత్వం ఆమొత్తాన్ని తదుపరి అమ్మ ఒడి నుంచి మినహాయించి స్కూళ్లకు చెల్లిస్తుందని తెలిపారు. -
ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్: కేంద్రం
ఢిల్లీ: విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్ తీసుకురానుంది. విద్యార్థుల వయసు ఆరు ఏళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్ ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు.. ఈ నిబంధనను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం, పునాది దశలో పిల్లలందరికీ (3 నుండి 8 సంవత్సరాల మధ్య) ఐదు సంవత్సరాల అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది, ఇందులో మూడు సంవత్సరాల ప్రీస్కూల్ విద్య(నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ) తర్వాత.. 1, 2 తరగతులు ఉంటాయి. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న వయస్సులో పాఠశాలలకు పంపరాదని గత ఏడాది సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. -
Jagananna Vidya Kanuka: సీఎం జగన్ ఆదేశాలు.. మేలిమి ‘కానుక’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింపచేస్తూ అందచేస్తున్న జగనన్న విద్యా కానుక (జేవీకే) కిట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మరింత నాణ్యతతో, సకాలంలో సమకూర్చేలా విద్యాశాఖ సన్నద్ధమైంది. రూ.1,042.53 కోట్ల వ్యయంతో 40 లక్షల మందికిపైగా విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందించేలా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి సరఫరాదారులందరికీ ఇప్పటికే వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. ఈసారి విద్యార్థులకు మరింత మన్నికతో కూడిన నాణ్యమైన బ్యాగ్లు, బూట్లను అందించనున్నారు. యూనిఫామ్ను ప్లెయిన్ క్లాత్ కాకుండా ఆకర్షణీయంగా రంగు రంగుల చెక్స్ డిజైన్తో రూపొందించారు. దుస్తులు కుట్టే సమయంలో సమస్యలు ఎదురు కాకుండా యూనిఫామ్ క్లాత్ను అదనంగా పెంచారు. ఇక పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ ముద్రణ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా ఈనెల 24వ తేదీ నుంచి జిల్లా పాయింట్లకు పంపిణీ మొదలవుతుంది. స్కూళ్లు తెరిచే రోజే వీటిని విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల పట్ల పెరుగుతున్న ఆదరణ, ఏటా అదనంగా చేరుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఐదు శాతం అదనపు బఫర్తో ప్రభుత్వం 5.06 కోట్ల పాఠ్యపుస్తకాలను ముద్రిస్తుండటం గమనార్హం. విద్యాకానుక ద్వారా అందించే ప్రతి ఒక్క వస్తువు నాణ్యతను స్వయంగా పరిశీలిస్తూ ఓ మేనమామలా ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయం తెలిసిందే. మూడున్నరేళ్లుగా జేవీకే అమలు తీరును గమనిస్తూ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పు చేర్పులను సూచిస్తున్నారు. ► స్థానిక మార్కెట్లో సుమారు రూ.650 విలువ చేసే నాణ్యమైన బ్యాగులను సరఫరా చేసేందుకు మంజీత్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, కోర్స్ ఇండియా లిమిటెడ్, అభిలాష కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎక్స్వో ఫుట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, వినిష్మా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేసి ఆర్డర్లు ఇచ్చారు. స్వే్కర్ టైపులో పెద్ద బ్యాగులు రీ డిజైన్ చేశారు. ►యూనిఫామ్కి సంబంధించి బాలికల టాప్, బాలుర షర్ట్లను ప్లెయిన్ క్లాత్ నుంచి చెక్స్ (గడులు) రూపంలోకి మార్పు చేశారు. దుస్తులు కుట్టే సమయంలో సమస్యలు ఎదురు కాకుండా క్లాత్ పరిమాణాన్ని కూడా దాదాపు 20 శాతం పెంచారు. మఫత్లాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నందన్ డెనిమ్ లిమిటెడ్, కంచన్ ఇండియా లిమిటెడ్, అరవింద్ కాట్సిన్ ఇండియా లిమిటెడ్, పదమ్ చంద్ మిలాప్చంద్ జైన్ సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేశారు. యూనిఫామ్ వస్త్రం మరో 50 రోజుల్లో జిల్లాలకు సరఫరా మొదలు కానుంది. ►బూట్లు మరింత కాంతివంతంగా (షైనింగ్) ఉండేలా చర్యలు చేపట్టారు. సరఫరాదారులు పాత మెటీరియల్ వాడకుండా నియంత్రించారు. డైమండ్ ఫుట్కేర్ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్, మంజీత్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, ఎక్స్ఓ ఫుట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్, పవర్ టెక్ ఎలక్ట్రో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, లెహర్ పుట్వేర్ లిమిటెడ్ సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేసి పంపిణీ ఆర్డర్లు ఇచ్చారు. ►అటల్ ప్లాస్టిక్స్, ఓం స్పోర్ట్స్ సంస్థలను బెల్టుల తయారీకి టెండర్ల ద్వారా ఎంపిక చేశారు. ►ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్కి గతంలో మాదిరిగా నామినేషన్ ప్రాతిపదికన అప్పగించారు. ►1 నుంచి 9వ తరగతి వరకు బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా 6, 7, 9 తరగతుల విద్యార్థుల కోసం ఎన్సీఈఆర్టీ సిలబస్తో బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలు ముద్రిస్తున్నారు. తమిళనాడు న్యూ ప్రింట్ పేపర్స్ లిమిటెడ్ కాగితాన్ని సరఫరా చేస్తోంది. 40 లక్షల మందికిపైగా విద్యార్థులకు రెండు సెమిస్టర్ల విధానంలో పుస్తకాలు తయారు చేస్తున్నారు. దాదాపు 4.83 కోట్ల పుస్తకాలు ముద్రించి అందించనున్నారు. ►ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అదనపు విద్యార్థుల కోసం 5 శాతం అదనపు బఫర్తో ప్రభుత్వం 5.06 కోట్ల పాఠ్యపుస్తకాలను ముద్రిస్తోంది. ►అన్ని మీడియం పాఠశాలలకు బైలింగ్వుల్ పుస్తకాలు అందించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో చదివే విద్యార్థులకు తెలుగు, ఆంగ్లంలో ద్విభాషా పాఠ్య పుస్తకాలు అందిస్తారు. ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉర్దూ, ఇంగ్లీష్లలో ద్విభాషా పాఠ్య పుస్తకాలను సరఫరా చేయనున్నారు. బెలింగ్వుల్ పుస్తకాలు 5 భాషల్లో (తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం) ముద్రించనున్నారు. 9వ తరగతికి కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్ పుస్తకాలను 2023–24లో పరిచయం చేస్తున్నారు. ►2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ ముద్రణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి 88 ప్రింటర్లకు ఈ పనులు అప్పగించారు. 14,611 మెట్రిక్ టన్నుల ఇన్సెట్ పేపర్, 1,401 మెట్రిక్ టన్నుల టైటిల్ కవర్ పేపర్ సరఫరా కోసం తమిళనాడు న్యూ ప్రింట్ – పేపర్స్ లిమిటెడ్కి ఆర్డర్లు ఇచ్చారు. సంస్థ పేపర్ సరఫరా చేస్తుండడంతో ప్రింటింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ►ఈనెల 24వ తేదీ నుంచి జిల్లా పాయింట్లకు పుస్తకాల పంపిణీ ప్రారంభమవుతుంది. మే 31వ తేదీకల్లా అన్ని స్కూల్ పాయింట్లకు పుస్తకాలు చేరేలా చర్యలు చేపట్టారు. ►పాఠ్య పుస్తకాలు వర్కు బుక్కులు స్కూళ్లు తెరిచే రోజే విద్యార్ధులకు అందించనున్నారు. గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు జగనన్న విద్యా కానుక ద్వారా అందచేసే కిట్లలో నాణ్యత తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు ఎప్పటికప్పుడు ప్రతి దశలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించారు. పాఠ్య పుస్తకాల సంచాలకులు రవీంద్రనాథ్రెడ్డి, సమగ్ర శిక్ష రాష్ట్ర అదనపు సంచాలకులు డా. కె.వి.శ్రీనివాసులురెడ్డితో కలసి వివిధ ముద్రణ కేంద్రాలు, గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మరింత నాణ్యమైన కిట్లను సకాలంలో అందించేలా చర్యలు చేపట్టినట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. -
పాఠశాల విద్యపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫోకస్
-
విద్యార్థుల సామర్థ్యం స్పష్టంగా తెలిసేలా...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సామర్థ్యాలు, ప్రతిభాపాటవాలను సమగ్రంగా అంచనా వేసేందుకు ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రస్థాయిలో విద్యార్థులందరి సామర్థ్యాలను సరైన రీతిలో అంచనా వేసేందుకు తరగతులు, సబ్జెక్టుల వారీగా శాస్త్రీయ పద్ధతిలో రూపొందించిన ప్రశ్నావళితో ఒకే రకమైన ప్రశ్నపత్రాలను వినియోగించి కొత్త విధానంలో సీబీఏ–2, ఫార్మేటివ్–3 పరీక్షలను నిర్వహించనుంది. ఈ పరీక్షలు మంగళవారం నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తారు. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షల షెడ్యూల్ను, పరీక్షల నిర్వహణలో అనుసరించాల్సిన విధివిధానాలను రాష్ట్ర పాఠశాల విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రకటించింది. జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు, ప్రయివేటు పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ జారీచేసే ప్రశ్నపత్రాలతో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని స్పష్టంచేసింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ (సీబీఏ)–2 పరీక్షలు నిర్వహించనున్నారు. తొమ్మిది, పదో తరగతుల వారికి గతంలో మాదిరిగానే ఫార్మేటివ్–3 పరీక్షలు ఉంటాయి. క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ పరీక్షకు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు ప్రశ్నపత్రంతోపాటు ఓఎమ్మార్ షీట్లు కూడా అందిస్తారు. ప్రయివేటు యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు కేవలం ప్రశ్నపత్రాలు మాత్రమే ఇస్తారు. ఓఎమ్మార్ షీట్లు అందించరని ఎస్సీఈఆర్టీ పేర్కొంది. సీబీఏ విధానంలోని పరీక్షలలో 0.25 (సూక్ష్మ) 0.5 (అతిస్వల్ప), 1 (స్వల్ప) ప్రశ్నలతోపాటు 2, 3, 4, 5, 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఆయా సబ్జెక్టుల్లో గరిష్టంగా 20 మార్కులతో ఈ సీబీఏ పరీక్షలను గంట వ్యవధితో నిర్వహిస్తారు. సరి చూసుకోవాలి ఎస్సీఈఆర్టీ అందిస్తున్న ప్రశ్నపత్రాలను, విద్యార్థుల వారీగా చైల్డ్ ఐడీలు, పేర్లతో కూడిన ఓఎమ్మార్ పత్రాలను జిల్లాల ఉమ్మడి పరీక్ష విభాగాల నుంచి ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు సరిచూసుకుని తీసుకువెళ్లి విద్యార్థులకు అందించనున్నారు. ఎవరికైనా ఓఎమ్మార్ పత్రం రాకపోతే వారికోసం బఫర్స్టాక్ నుంచి అందిస్తారు. పరీక్షల అనంతరం ఆయా ఓఎమ్మార్ పత్రాలను సమగ్ర మూల్యాంకనానికి వీలుగా జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగాలకు తరలిస్తారు. పరీక్ష సమయంలో ఓఎమ్మార్ పత్రాలపై చైల్డ్ ఐడీలు, పేర్లు సరిగా ఉన్నాయో, లేదో సరిచూసుకోవాలి. సమగ్ర మూల్యాంకనంతో లోపాల సవరణకు వీలుగా చర్యలు విద్యార్థుల సామర్థ్యాలను సమగ్రంగా విశ్లేషించేందుకు ఈ సీబీఏ పరీక్షలను శాస్త్రీయంగా రూపొందించిన ప్రశ్నలతో ఓఎమ్మార్ పత్రాలతో నిర్వహిస్తున్నామని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి తెలిపారు. ఈ ఓఎమ్మార్ పత్రాలను జిల్లా స్థాయిలో స్కాన్ చేయిస్తారని చెప్పారు. మార్కులను పాఠశాలలకు అందిచరని, కేవలం విద్యార్థుల స్థాయిని అంచనా వేసి భవిష్యత్లో టీచర్లకు, విద్యార్థులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను చేపట్టేందుకు ఉపయోగిస్తామని వివరించారు. సీబీఏ పరీక్షల అనంతరం తరగతుల వారీగా సబ్జెక్టులకు ‘కీ’ విడుదల చేస్తామని, దాని ప్రకారం టీచర్లు ప్రశ్నపత్రాలను దిద్దాల్సి ఉంటుందన్నారు. ఆ మార్కులను రిజిస్టర్లలో, పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉందన్నారు. విద్యార్థుల మార్కులను ప్రోగ్రెస్ కార్డుల్లో నమోదు చేసి తల్లిదండ్రులకు అందిస్తామని, తక్కువ ప్రతిభ చూపిన పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. -
ఏపీలో విద్యా సంస్కరణలు భేష్
సాక్షి, అమరావతి: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంస్కరణలు ఎంతో స్ఫూర్తిదాయకమని, తమ రాష్ట్రాల్లో అమలుకు అవి మార్గదర్శకంగా ఉన్నాయని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసించారు. విద్యారంగ అభివృద్ధి కోసం పనిచేస్తున్న అనేక ప్రఖ్యాత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఐఏఎస్ అధికారులు, విద్యావేత్తలు, నిపుణులు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలను శనివారం సందర్శించారు. అనంతరం విద్యా శాఖ ఉన్నతాధికారులతో సంభాషించారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ రాష్ట్రంలో అమలవుతున్న విద్యా పథకాల గురించి ఈ బృందానికి వివరించారు. సీఎం వైఎస్ జగన్.. విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ.. జగనన్న అమ్మఒడి, మన బడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ తరగతులు, బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు, సీబీఎస్ఈ సిలబస్, ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ తదితర కార్యక్రమాల ద్వారా విద్యా రంగాన్ని పటిష్టం చేశారని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడుతూ.. తాము సందర్శించిన పాఠశాలలు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రశంసించారు. పాఠశాలల్లో పరిశుభ్రత, సంతోషకరమైన అభ్యాస వాతావరణం, మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్, ఉపాధ్యాయుల సృజనాత్మకత, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, టీచర్ మెంటార్లు వినియోగిస్తున్న ‘టీచ్ టూల్’, బోధన అభ్యాస పద్ధతులు, కొత్త యాప్లు.. తదితర కార్యక్రమాలన్నీ బాగున్నాయని మెచ్చుకున్నారు. ఇవన్నీ తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి స్ఫూర్తిగా ఉన్నాయని చెప్పారు. విద్యా రంగ ప్రముఖుల బృందం ఇదీ.. కృష్ణా జిల్లా కోలవెన్ను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పునాదిపాడు, ఈడుపుగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎన్టీఆర్ జిల్లాలోని పటమట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను విద్యా రంగ ప్రముఖుల బృందం సందర్శించింది. ఈ బృందంలో రతీ ఫోర్బ్స్ (డైరెక్టర్ ఫోర్బ్స్ మార్షల్ లిమిటెడ్), వివేక్ రాఘవన్ (ట్రస్టీ, ఆర్జీ మనుధనే ఫౌండేషన్ సీఈఓ ప్రెసిడెంట్, ఎయిర్వైన్ సైంటిఫిక్), నీలేష్ నిమ్కర్ (ఫౌండర్ ట్రస్టీ, క్వెస్ట్), కవితా ఆనంద్ (విద్యాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు), మురుగన్ వాసుదేవన్ (సీఈఓ, లెట్స్ డ్రీమ్ ఫౌండేషన్, మాజీహెడ్, సోషల్ ఇన్నోవేషన్, సిస్కో ఇండియా దక్షిణాసియా), మినాల్ కరణ్వాల్ (సబ్డివిజనల్ మేజిస్ట్రేట్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, నందుర్బార్, మహారాష్ట్ర), ఆకాంక్ష గులాటి (డైరెక్టర్, యాక్ట్ గ్రాంట్స్), ప్రాచీ విన్లాస్ (మైఖేల్ సుసాన్ డెల్ ఫౌండేషన్, డైరెక్టర్, ఇండియా), తరుణ్ చెరుకూరి (సీఈఓ, ఇండస్ యాక్షన్), స్నేహ మీనన్(క్యాటలిటిక్ ఫిలాంత్రోపీ, దస్రా) తదితరులు ఉన్నారు. -
శ్రద్ధ వహిస్తేనే.. సత్ఫలితాలు: సీఎం జగన్
విద్యార్థులు 6వ తరగతిలోకి రాగానే విద్యను సీరియస్ అంశంగా తీసుకుని చదువుపై మరింతగా దృష్టి పెట్టేలా చర్యలు చేపట్టాలి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఏర్పాటు, సబ్జెక్టుల వారీ టీచర్లతో పాటు బోధన కార్యక్రమాలపై అన్ని స్థాయిల్లోనూ అధికారులు, క్షేత్ర స్థాయిలోని సిబ్బంది సీరియస్గా వ్యవహరించాలి. మొక్కుబడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుంది. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని విజయాలు సాధించేలా మన విద్యార్థుల్లో ఇంగ్లిష్ ప్రావీణ్యం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం కేంబ్రిడ్జి, టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ను ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్–ఈటీఎస్ అనే సంస్థ నిర్వహిస్తుంది) లాంటి సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలి. 3వ తరగతి నుంచే పరీక్షలు నిర్వహించి పిల్లలకు సర్టిఫికెట్లు జారీ చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి. అప్పుడు మరిన్ని మంచి ఫలితాలుంటాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను తరచూ సమీక్షించడంతో పాటు, అవి పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇచ్చేలా క్షేత్ర స్థాయి వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద పథకాల్లో ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు మరింత మెరుగు పడేలా బోధనాభ్యసన కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ బోధన, డిజిటల్ తరగతుల ఏర్పాటు తరుణంలో అధికారులు ఆ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరంతర సమీక్ష, పర్యవేక్షణ వల్ల విద్యాకానుక దగ్గర నుంచి పాఠ్యాంశాల వరకు.. మౌలిక సదుపాయాల కల్పన దగ్గర నుంచి గోరుముద్ద వరకు నాణ్యత పెరుగుతుందన్నారు. పిల్లలకు అద్భుతమైన స్కూలు వాతావరణం అందుబాటులో ఉంటుందని, తద్వారా చదువుపై వారు మరింత ఏకాగ్రత చూపగలుగుతారని చెప్పారు. ఏటా విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించాలని, నాణ్యతలో రాజీ ఉండకూడదని ఆదేశించారు. పాఠ్య పుస్తకాల్లో పేపర్ క్వాలిటీగా ఉండేలా చూడాలన్నారు. వచ్చే ఏడాది అందించాల్సిన విద్యా కానుక కిట్లను ఈ విద్యా సంవత్సరం ఆఖరుకే స్కూళ్లకు చేర్చాలని చెప్పారు. మార్చిలో మొదలు పెట్టి ఏప్రిల్ చివరి నాటికి విద్యా కానుక వస్తువులన్నింటినీ స్కూళ్లకు చేరుస్తామని, స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యా కానుక కిట్ అందిస్తామని అధికారులు చెప్పారు. గోరుముద్దలో భాగంగా రాగి మాల్ట్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఐఎఫ్పీల ద్వారా బోధనపై మరింత నిశిత దృష్టి ► ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు వీలుగా ఐఎఫ్పీ(ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్)లను ఏర్పాటు చేస్తు న్నాం. 6వ తరగతి ఆపై ప్రతి తరగతి గదిలోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నాం. వీటి వల్ల బోధన, నేర్చుకోవడం మరింత సులభతరమవుతుంది. 6వ తరగతి కన్నా దిగువ తరగతులకు టీవీ స్క్రీన్లను అందుబాటులోకి తెస్తున్నాం. తర్వాత 8వ తరగతి నుంచి ట్యాబ్లిస్తున్నాం. దీని వల్ల ఇంటి దగ్గర కూడా పిల్లలు ఆడియో, వీడియో, గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ ఉన్న పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశం కల్పించాం. ► వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఐఎఫ్పీ, టీవీ స్క్రీన్లను స్కూళ్లలో ఏర్పాటు చేయాలి. వీటిని ఏర్పాటు చేసినప్పుడే నాడు–నేడు పూర్తవుతుంది. 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ట్యాబులను వచ్చే విద్యా సంవత్సరంలో స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా అందించేలా చర్యలు తీసుకోవాలి. సబ్జెక్ట్ టీచర్లు, పాఠ్య పుస్తకాల్లో అంశాలు, ట్యాబుల్లోని బైజూస్ కంటెంట్, ఐఎఫ్పీ కంటెంట్.. మొత్తంగా పూర్తి సినర్జీతో ఉండాలి. ► టీచర్లకూ ఇంగ్లిష్పై పట్టు పెరిగేందుకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు క్రమంగా ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడంలో మెరుగైన ప్రావీణ్యం సాధించాలి. ట్యాబ్ల వినియోగం, పాఠ్యాంశాలను నేర్చుకుంటున్న తీరుపై పిల్లల తల్లిదండ్రులకు ఫీడ్బ్యాక్ అందించాలి. ► నాడు–నేడులో మొత్తం 11 రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. వీటిలో లోపాలుంటే వెంటనే సరిదిద్దాలి. విద్యార్థులకు అందించే బూట్ల నాణ్యతను పరిశీలిస్తున్న సీఎం జగన్ మార్చి 2 నుంచి పిల్లలకు రాగి మాల్ట్ జగనన్న గోరుముద్దలో భాగంగా వారంలో మూడు రోజులు ఉదయం పూట విద్యార్థులకు రాగి మాల్ట్ అందించాలి. మార్చి 2వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. మరో మూడు రోజులు చిక్కి అందించాలి. ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో రక్తహీనత (ఐరన్ లోపం)ను నివారించవచ్చు. అధికారులు ఏం చెప్పారంటే.. ► సబ్జెక్ట్ టీచర్ విధానంతో అర్హతలున్న టీచర్లు అందుబాటులోకొచ్చారు. ► గతంలో 3, 4, 5 తరగతుల పిల్లలకు సబ్జెక్టుల వారీగా బోధన లేదు. ఇప్పుడు వీరికి మంచి బోధన అందుతోంది. ► ఐఎఫ్పీల కొనుగోలు టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు వెళ్లింది. ► ట్యాబ్ల వినియోగంలో వైఎస్సార్ కడప, విజయనగరం, చిత్తూరు జిల్లాల విద్యార్థులు మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ► మొదటి దశ నాడు–నేడుపై, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఆడిట్ పూర్తయ్యింది. అంగన్వాడీలు, హాస్టళ్లలోనూ నాడు–నేడు ► మొదటి దశలో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసిన ప్రభుత్వం రెండో దశలో 23,221 స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. మూడో దశలో 16,968 స్కూళ్లను మౌలిక వసతులతో తీర్చిదిద్దనుంది. వీటితోపాటు అంగన్వాడీలు, హాస్టళ్లను కూడా నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తోంది. ► సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, విద్యా శాఖ సలహాదారు సాంబశివారెడ్డి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్కుమార్, పాఠశాల మౌలిక వసతుల శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంటర్ విద్య కమిషనర్ ఎంవీశేషగిరిబాబు తదితరులున్నారు. -
సబ్జెక్టు టీచర్లుగా అర్హులైన ఎస్జీటీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ హైస్కూళ్లు, ఇతర ప్రీ హైస్కూళ్లలో 3వ తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. నూతన విధానంలోని స్కూళ్లలో 3వ తరగతి నుంచి సబ్జెక్టుల బోధనకు సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీలు)కు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలని భావించింది. దీనికోసం తగిన అర్హతలున్న 2,095 మంది ఎస్జీటీలతోపాటు మరో 3,714 మంది మొత్తం 5,809 మంది ఎస్జీటీలకు పదోన్నతి ఇవ్వడానికి జీవో నంబర్లు 117, 128 ను విడుదల చేసింది. వీటిపై కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేశారు. కోర్టు ఆదేశాలతో పదోన్నతుల ప్రక్రియ పూర్తికాలేదు. అయితే విద్యార్థులకు సబ్జెక్టు బోధనకు వీలుగా పాఠశాల విద్యా శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. 5,809 మందినీ తాత్కాలికంగా సబ్జెక్టు బోధన చేసేలా చర్యలు చేపట్టారు. కోర్టు కేసులు పరిష్కారమై, వీరికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చే వరకు సబ్జెక్టు బోధన చేస్తారు. ఇందుకు వీరికి నెలకు రూ. 2,500 చొప్పున సబ్జెక్టు టీచర్ అలవెన్స్ ఇస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మెమో జారీచేశారు. -
కోచింగ్కు కుమ్మరిస్తున్నారు!!
సాక్షి, అమరావతి: పిల్లలకు పాఠశాలల చదువులతోపాటు ప్రైవేటు ట్యూషన్లూ ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్నాయి. కరోనాకు ముందు కొంత శాతం మంది పిల్లలకే పరిమితంగా ఉన్న ఈ ట్యూషన్లను ఇప్పుడు 70 శాతం మంది ఆశ్రయిస్తున్నారు. అంతకంతకూ పెరుగుతున్న పోటీ వాతావరణం, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక టీవీలు, ఫోన్లు, ట్యాబ్లకు అతుక్కుపోవడం, ఇంట్లో పిల్లల అల్లరిని భరించలేకపోవడం, తమ పిల్లలు మిగిలినవారికంటే ముందుండాలనే తల్లిదండ్రుల తాపత్రయం వంటి కారణాలతో ప్రైవేటు ట్యూషన్లకు గతంలో కంటే ఇప్పుడు ఆదరణ పెరిగింది. ఉపాధ్యాయులు సైతం తమకు స్కూల్లో వస్తున్న జీతం కంటే ట్యూషన్ల ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దంపతులు ఇద్దరూ టీచర్లే అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎల్కేజీ పిల్లల నుంచి ఇంటర్ వరకు ప్రైవేటు ట్యూషన్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా మ్యాథ్స్, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులను చెప్పగలిగేవారికి మంచి డిమాండ్ ఉంది. భారీగా ఖర్చు చేస్తున్న తల్లిదండ్రులు.. ప్రస్తుతం భార్యాభర్తల్లో చాలామంది ఇద్దరూ ఉద్యోగాలు లేదా ఏదో ఒక పనిచేసేవారే. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులను పట్టించుకోగల తీరిక, సమయం ఉండటం లేదు. ఉన్నా పిల్లల సందేహాలకు సమాధానాలు ఇవ్వగల పరిజ్ఞానం కరువవుతోంది. దీంతో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వారిని ప్రైవేటు ట్యూషన్లకు పంపుతున్నారు. ఇందుకు నెలకు భారీ మొత్తమే అవుతున్నా తల్లిదండ్రులు వెనుకడుగు వేయడం లేదు. ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఏన్యువల్ సర్వే రిపోర్టు ఆన్ ఎడ్యుకేషన్ (అసర్)–2021 నివేదిక ప్రకారం.. తల్లిదండ్రులు పాఠశాలల చదువులపైనే కాకుండా ప్రైవేటు ట్యూషన్లపైన కూడా ఎక్కువ ఖర్చు చేస్తుండటం గమనార్హం. కరోనా తెచ్చిన మార్పు.. కరోనా సమయంలో స్కూళ్లు మూతపడి పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో వారి చదువు సరిగా సాగలేదు. ఆన్లైన్ క్లాసులు కూడా అంతంతమాత్రంగానే సాగాయి. దీంతో పిల్లల అభ్యసనం కొంతమేర దెబ్బతింది. దీన్ని అధిగమించేందుకు తల్లిదండ్రులు ప్రైవేటు ట్యూషన్లను ఆశ్రయిస్తున్నారు. 25 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రథమ్ సంస్థ చేసిన సర్వే ప్రకారం.. 40 శాతం మంది పాఠశాల విద్యార్థులు ట్యూషన్కి వెళ్తుండగా ఇప్పుడా సంఖ్య మరింత పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. 2020 32.5 శాతం, 2018లో 28.6 శాతం ఉండగా ఇప్పుడది రెట్టింపు అయ్యిందని ప్రథమ్ సర్వే పేర్కొంది. పాఠశాలలూ కారణమే.. కాగా ట్యూషన్లు పెరిగిపోవడానికి పాఠశాలల్లో కొందరు టీచర్లు సరిగా బోధించలేకపోవడం కూడా కారణమేనంటున్నారు. పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు బోధనపై కన్నా ఇతర వ్యాపకాలపై దృష్టి పెడుతుండడంతో పిల్లలకు సరైన బోధన అందడం లేదంటున్నారు. ఈ పరిస్థితి నుంచి తమ పిల్లలను గట్టెక్కించేందుకు తల్లిదండ్రులు ట్యూషన్లకు పంపుతున్నారని సర్వే నివేదికలు పేర్కొంటున్నాయి. రిజిస్టర్డ్ ట్యుటోరియల్ సంస్థలు వేళ్ల మీద మాత్రమే ఉండగా అనేక వేల ట్యూషన్ సంస్థలు ప్రతి వీధిలో దర్శనమిస్తున్నాయి. ట్యూషన్ కోసం తన వద్దకు వచ్చే విద్యార్థుల్లో 30 నుంచి 40 శాతం పెరుగుదల ఉందని విజయవాడలో ట్యుటోరియల్ తరగతులు నిర్వహిస్తున్న నిపుణుడొకరు వివరించారు. 1–12 తరగతులకు విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక స్థితిని బట్టి నెలకు 2 వేల నుంచి 5 వేల వరకు ఫీజుగా తీçసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తమ పిల్లలకు మంచిగా చెప్పాలే కానీ అధికమొత్తం ఇచ్చేందుకు కూడా తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారన్నారు. హోమ్ ట్యూషన్లకూ పెరిగిన డిమాండ్.. ఇటీవల కాలంలో ప్రత్యేకంగా పిల్లలకు తల్లిదండ్రులు తమ ఇంటిలోనే హోమ్ ట్యూషన్లు చెప్పిస్తున్నారు. ఇందుకు టీచర్లు భారీగా డిమాండ్ చేస్తున్నా తల్లిదండ్రులు వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా ఆడపిల్లలను ట్యూషన్లకు పంపడం ఇష్టం లేనివారు తమ ఇళ్లవద్దే హోమ్ ట్యూషన్లు చెప్పిస్తున్నారు. -
పాఠశాల విద్యాశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ట్యాబుల మెయింటైనెన్స్కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్ సెంటర్ను కంపెనీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ట్యాబుల్లో ఎలాంటి సమస్య ఉన్నా వారం రోజుల్లో మరమ్మత్తు చేసి లేదా కొత్త ట్యాబ్ను విద్యార్థికి అందించాలని సీఎం ఆదేశించారు. ట్యాబ్ల వాడకం? పాఠాలను నేర్చుకుంటున్న తీరు తదితర అంశాలపై ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అధికారులు వివరించారు. డేటా అనలిటిక్స్ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న తీరుపై నిరంతర పరిశీలన ఉండాలని, దీనికి అనుగుణంగా హెడ్ మాస్టర్, ఎంఈఓలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. తరగతి గదుల డిజిటలైజేషన్లో భాగంగా ఐఎఫ్పీ ప్యానెల్స్ ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి ఐఎఫ్పీ ప్యానెల్స్ ఏర్పాటు కావాలని సీఎం ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దన్న సీఎం.. ఈ డిజిటల్ స్క్రీన్లు వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలని సీఎం అన్నారు. వీటిని ఉపయోగించుకుని ఎలా బోధన చేయాలో టీచర్లకు చక్కటి అవగాహన, శిక్షణ కల్పించాలని సీఎం పేర్కొన్నారు. పిల్లలు అందరి వద్దా డిక్షనరీలు ఉన్నాయా? లేవా? మరోసారి పరిశీలన చేయాలన్న సీఎం.. లేని పిల్లలు అందరికీ డిక్షనరీలు ఇవ్వాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం విద్యా కానుక కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పిల్లలకు విద్యా కానుక అందాలన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ♦పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలి ♦ఏ స్కూల్లో లేకపోయినా వెంటనే టీచర్లు ఉండేలా చూసుకోవాలి ♦సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టడం వల్ల బోధనలో నాణ్యత పెరుగుతుందని, విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగుపడుతుంది ♦డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలని సీఎం ఆదేశం ♦గోరుముద్ద నాణ్యతను నిరంతర పరిశీలన చేయాలి ♦అన్ని స్కూళ్లు, అంగన్వాడీలకు సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే సరఫరా చేయాలని సీఎం ఆదేశాలు ♦నాణ్యత విషయంలో ఎలాంటి రాజీవద్దన్న సీఎం ♦సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక లేబుల్తో ఈ బియ్యాన్ని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, అన్ని గురుకుల పాఠశాలలకు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్నట్టు తెలిపిన అధికారులు ♦ఇప్పుడు ఇస్తున్న ఆహారానికి అదనంగా స్కూలు పిల్లలకు బెల్లంతో రాగి మాల్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశం ♦ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాగిమాల్ట్ సరఫరా చేయాలని ఆదేశం ♦వారానికి మూడు రోజులు పిల్లలకు గ్లాసుడు రాగిమాల్ట్ ♦ఐరన్, కాల్షియం లోపం నివారణకు ఇది ఉపయోగపడుతుందన్న సీఎం ♦నాడు-నేడు కింద బాగుచేసిన పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణపై నిరంతర పరిశీలన ఉండాలన్న సీఎం ♦ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ నిధులను వినియోగించుకుని ఏ సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేపట్టాలన్న సీఎం ♦నాడు-నేడు రెండో దశ పనులనూ సమీక్షించిన సీఎం ♦22 వేలకుపైగా స్కూళ్లలో పనులు నడుస్తున్నాయన్న అధికారులు ♦దాదాపు రూ.1500 కోట్లు విలువైన పనులు ఇప్పటికే జరుగుతున్నాయన్న అధికారులు చదవండి: నేనున్నానని.. మీకేం కాదని.. సీఎం జగన్ తక్షణ సాయం.. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, విద్యాశాఖ సలహాదారు ఏ సాంబశివారెడ్డి, ఇంటర్ మీడియట్ విద్య కమిషనర్ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల మౌలిక వసతులు కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ జీ వీరపాండ్యన్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, నాడు నేడు డైరెక్టర్ (టెక్నికల్) మనోహర్ రెడ్డి మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ (పాఠశాల విద్యాశాఖ) ప్రతాప్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
AP: బడి బయటి పిల్లలంతా బడుల్లోకి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బడి ఈడు పిల్లలందరికీ చదువు చెప్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. బడి బయట ఒక్క విద్యార్థి కూడా లేకుండా గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులతో సమన్వయం చేసుకుని పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. బడికి వెళ్లని బడి ఈడు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా పిల్లలంతా పాఠశాలల్లో చేరేలా చర్యలు చేపడుతున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా రాష్ట్రంలో మొత్తం 1,73,291 మంది పిల్లలను గుర్తించగా ఇందులో ఇప్పటికే 80 శాతానికి పైగా పిల్లలను బడుల్లో చేర్పించారు. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులతో పాటు వారు పనులు చేస్తున్న వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఆ పిల్లలు చదువులు కొనసాగించేలా కూడా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఫలితంగా బడుల్లో చేరికలు గతంలో కన్నా పెరగడమే కాకుండా డ్రాపవుట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. డ్రాపవుట్లకు చెల్లుచీటీ రాష్ట్రంలోని బడిఈడు పిల్లలందరినీ స్కూళ్లలోకి తిరిగి చేర్పిస్తున్న నేపథ్యంలో పిల్లల డ్రాపవుట్లు తగ్గాయి. ప్రాథమిక స్థాయిలో సున్నా స్థాయికి ఈ డ్రాపవుట్లు తగ్గిపోవడం విశేషం. ప్రాథమికోన్నత తరగతుల్లో గతంలో కన్నా తగ్గి 2021–22 నాటికి 1.62 శాతానికి డ్రాపవుట్లు పడిపోయాయి. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలతో 2022–23లో మరింత తగ్గుతాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. సెకండరీ తరగతుల్లో ఒకప్పుడు 22 శాతంగా ఉన్న డ్రాపవుట్ రేటు 2022–23లో భారీగా దిగువకు తగ్గుతోందని వివరించాయి. ఇంటర్మీడియెట్లోనూ పెరిగిన చేరికలు.. ప్రభుత్వ చర్యలతో 1వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న స్కూళ్లలో చేరికలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియెట్ స్థాయిలోనూ విద్యార్థుల చేరికల శాతం పెరుగుతోంది. గత ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే ఈ అంశాలు స్పష్టమవుతున్నాయి. 2018–19లో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల చేరికల సంఖ్య 78,61,899 వరకు ఉండగా 2019–20 నాటికి ఈ సంఖ్య 83,23,103కి చేరింది. ఒక్క ఏడాదిలోనే 4,61,204 మంది అదనంగా చేరడం విశేషం. వీరిలో ఇంటర్మీడియెట్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య 1.5 లక్షల వరకు ఉండడం గమనార్హం. ఇక 2020–21లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల సంఖ్య 84,10,924కు చేరింది. 2021–22లో ఆ సంఖ్య 82,44,647 గా ఉంది. కరోనా తదితర కారణాలతో చాలాకాలం స్కూళ్లు తెరవకపోవడంతో అనేక మంది స్కూళ్లకు రాలేదు. దాంతో 2021–22లో ప్రవేశాల సంఖ్య తగ్గింది. 2022–23కి నాటికి మళ్లీ ఆ సంఖ్య పెరిగినట్లు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన తుది విడత గణాంకాల క్రోడీకరణ జరుగుతోందని, త్వరలోనే అవి విడుదలవుతాయని చెబుతున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ చైల్డ్ ఇన్ఫో కింద సేకరిస్తున్న గణాంకాల ప్రకారం.. 2022–23 విద్యా సంవత్సరంలో ప్రాథమిక తరగతుల నుంచి ఇంటర్మీడియెట్ వరకు 84 లక్షలకుపైగా చేరికలున్నట్లుగా తెలుస్తోంది. ఈ విద్యార్థుల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే కావడం గమనార్హం. మొత్తం విద్యార్థుల్లో 78 శాతం ఈ వర్గాల విద్యార్ధులే. -
పేద పిల్లలకు ట్యాబ్లిస్తే భరించలేరా? ‘ఈనాడుకు ఎందుకీ కడుపుమంటా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్లపై ‘ఈనాడు’, తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా మండిపడింది. పేద పిల్లలకు కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా సాంకేతిక విద్యను ట్యాబ్ల ద్వారా అందిస్తుంటే భరించలేక అవి అడ్డుకుంటున్నాయని ఆక్షేపించింది. వాళ్లు సాంకేతిక విద్య ద్వారా రాణిస్తే మీకు కడుపుమంటా అని ప్రశ్నించింది. వాస్తవాలను కప్పిపుచ్చి అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాయడం, ఆరోపణలు చేయడాన్ని ఖండించింది. పనికిమాలిన తప్పుడు అంశాలతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ వాస్తవాలు ఏమిటో ప్రజల ముందుంచింది. విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్లకు సంబంధించి ‘8.7 అంగుళాల తెరపై వివాదాలు’ అంటూ ‘ఈనాడు’లో వచ్చిన కథనం, ‘సీఎం జగన్కు రూ.221 కోట్ల కానుక’ అంటూ తెలుగుదేశం చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది. అంతేకాక.. టెండర్ల ప్రక్రియలో ఎవరైనా పాల్గొనే అవకాశమున్నప్పటికీ మీరెందుకు పాల్గొనలేదని విద్యాశాఖ వాటిని సూటిగా ప్రశ్నించింది. నిజానికి.. ప్రభుత్వం ఇస్తున్న ట్యాబ్లకు మూడేళ్ల వారంటీతోపాటు పలు ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. అలాగే, టెండర్లలో శాంసంగ్ పాల్గొని ఎల్–1గా నిలిచింది కాబట్టి టెండర్ను ఆ సంస్థకు అప్పగించామని స్పష్టంచేసింది. ఇక వచ్చే ఏడాది కూడా ఐదు లక్షలకు పైగా ట్యాబ్లు అవసరమవుతాయని.. ఇవే స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఉన్న ట్యాబ్లను మూడేళ్ల వారంటీతో రూ.12వేలకు ఈనాడు, తెలుగుదేశం పార్టీలు ఇస్తే కాంట్రాక్టును వారికే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖ సవాల్ చేసింది. రివర్స్ టెండరింగ్తో రూ.187 కోట్లు ఆదా ఇక ట్యాబ్లకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నాలుగు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. రివర్స్ టెండరింగ్తో ప్రభుత్వం రూ.187 కోట్లు ఆదా చేసింది. నిజానికి.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్లలోని స్పెసిఫికేషన్లు, అదనపు సదుపాయాలు అమెజాన్ లాంటి సంస్థలు అందించే ట్యాబ్లలో లేవు. రూ.12,843 ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ ట్యాబ్లలోని స్పెసిఫికేషన్లు, అదనపు సదుపాయాలతో అమెజాన్ లాంటి సంస్థలు ఇచ్చే ట్యాబ్ ధర రూ.3,603 ఎక్కువగా (22 శాతం) ఉంది. అలాగే, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలోనే మండల పాయింట్ల వరకు వాటిని చేర్చేందుకు అయ్యే ఖర్చు కూడా కలిపి ఉంది. ఆరోపణ–1: 8వ తరగతి విద్యార్థులకు అందించిన పీసీ ట్యాబ్ ఖరీదు రూ.11,999. ఆన్లైన్లో ఇదే పరికరాన్ని బల్క్గా కొనుగోలుచేస్తే రూ.9వేలే. ఈ లెక్కన ట్యాబ్ల పంపిణీలో రూ.221 కోట్లు స్వాహా చేశారు. వాస్తవం ఇదీ: ఈ ఆరోపణ నిజం కాదు. ఆన్లైన్ పోర్టళ్లు కూడా బల్క్లో నేరుగా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్ (ఓఈఎం) నుంచి కొనుగోలుచేసి తక్కువ మార్జిన్కు అమ్ముతుంటాయి. అందువల్ల ఆన్లైన్ ధరలు తక్కువగా ఉంటాయనడం నిజంకాదు. అంతేకాక.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పీసీ ట్యాబ్లను అదనపు ఫీచర్లు ఇతర ఐటెమ్లతో కలిపి కొనుగోలు చేసింది. ఇవేవీ ఆన్లైన్ కొనుగోళ్లలో కవర్ కావు. ఆయా వస్తువులు మార్కెట్ ధరకన్నా ఎంతో తక్కువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ వివరాలు.. ఆరోపణ–2: ట్యాబ్ డిస్ప్లే సైజు శ్యామ్సంగ్ కంపెనీకి తగ్గట్లుగా 8.7 అంగుళాల సైజును టెండర్లలో పెట్టారు. 8 అంగుళాలు ఆపైన డిస్ప్లే సైజు ఉండాలనేలా నిబంధనను మార్పు చేయాలని ఇతర కంపెనీలు కోరినా పట్టించుకోలేదు. వారిని పోటీ నుంచి తప్పించేందుకే ఇలా చేశారు. వాస్తవం ఇదీ: ఈ ఆరోపణ కూడా నిజం కాదు. టెండర్ డాక్యుమెంటు పత్రాల్లో స్పెసిఫికేషన్లలో డిస్ప్లే సైజు 8.7 అంగుళాలు లేదా ఆపై, 1,280 800 రిజల్యూషన్లో, టచ్స్క్రీన్ ఉండాలని పేర్కొన్నారు. ఏ ట్యాబ్ అయినా 8.7 అంగుళాల స్క్రీన్సైజు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవి ఆమోదయోగ్యమని స్పష్టంగా ఉంది. ఒరిజినల్ ఎక్విప్మెంటు మాన్యుఫాక్చరర్ల నుంచి 10 అంగుళాల పీసీ ట్యాబ్కు కూడా బిడ్లు స్వీకరించారు. బిడ్ల ఇవాల్యుయేషన్లో టెండర్ కండిషన్లను అనుసరించి ఉన్న వాటిని ఆమోదించారు.. అని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. -
2 నుంచి సమ్మేటివ్ అసెస్మెంటు–1 పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్థులకు జనవరి 2వ తేదీ నుంచి సమ్మేటివ్ అసెస్మెంటు–1 పరీక్షలు పాఠశాల విద్యాశాఖ నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు ఎస్ఏ–1 పరీక్షలు జరుగుతాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఆయా తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇలా.. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు : ఎలిమెంటరీ తరగతులకు (1–5) చెందిన విద్యార్థులకు 4వ తేదీ నుంచి 7 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. ఎలిమెంటరీలోని అన్ని తరగతులకు 4న ఫస్ట్ లాంగ్వేజ్, 5న ఇంగ్లిషు, 6న మేథమెటిక్స్ పరీక్షలుంటాయి. ఇక 7వ తేదీన 3, 4, 5 తరగతుల వారికి ఎన్విరాన్మెంటల్ సైన్సు పరీక్షలుంటాయి. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు: ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంటు–1 పరీక్షలు 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 వరకు 6, 8, 10 తరగతులకు, మధ్యాహ్నం 1.30 నుంచి 4.45 వరకు 7, 9 తరగతులకు పరీక్షలు జరుగుతాయి. 6–10 తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇలా ► జనవరి 2న 6, 8, 10 తరగతులకు ఓఎస్సెస్సీ పేపర్–1 పరీక్ష ఉంటుంది. 7, 9 తరగతులకు కాంపోజిట్ కోర్సు సంస్కృతం, హిందీ, అరబిక్ పర్షియా పేపర్–1 పరీక్ష ► జనవరి 3న 8, 10 తరగతులకు ఓఎస్సెస్సీ పేపర్–2 పరీక్ష, మధ్యాహ్నం 9వ తరగతికి కాంపోజిట్ కోర్సు పేపర్–2 పరీక్ష ► జనవరి 4న ఉదయం, మధ్యాహ్నం 6 నుంచి 10 తరగతులకు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష ► జనవరి 5న 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ► జనవరి 6న 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీషు పరీక్ష ► జనవరి 7న 6, 7, 9, 10 తరగతులకు మేథమెటిక్స్, 8వ తరగతికి సోషల్ స్టడీస్ పరీక్ష ► జనవరి 9న 6 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులకు జనరల్ సైన్సు పరీక్ష ► జనవరి 10న 6, 7, 9, 10 తరగతులకు సోషల్ స్టడీస్ పరీక్ష, 8వ తరగతి విద్యార్థులకు మేథమెటిక్స్ పరీక్ష ► 8వ తరగతి జనరల్ సైన్సు, మేథమెటిక్స్ పరీక్ష పత్రాలు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకు వేర్వేరుగా ఉంటాయి. -
స్కూళ్లలో ఇకపై రెండు సెమిస్టర్ల విధానంలో పాఠ్య పుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాఠశాలల విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2 సెమిస్టర్ల విధానంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023 – 24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు ఈ పాఠ్య పుస్తకాలు అందిస్తారు. 2024 – 25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులకు కూడా ఇదే విధానంలో పాఠ్య పుస్తకాలు అందుతాయి. వీటిని మిర్రర్ ఇమేజ్లో బైలింగ్యువల్ (ద్విభాషా) విధానంలో ముద్రించి ఇస్తారు. ఇలా రెండు సెమిస్టర్ల విధానంలో పుస్తకాలు ఇవ్వడం వల్ల విద్యార్థుల బ్యాగు బరువు సగం మేర తగ్గుతుంది. విద్యార్థులు కూడా సులభంగా చదువుకోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం పాఠశాల విద్యలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎస్సీఈఆర్టీ దశలవారీగా సిలబస్, పాఠ్య పుస్తకాలను సవరిస్తోంది. దీని కోసం దేశ, విదేశాల్లో ఉన్నత విధానాలపై అధ్యయనం చేసింది. ఎన్సీఈఆర్టీ, ఇతర రాష్ట్ర బోర్డుల పాఠ్యాంశాలు, సిలబస్ను సమగ్రంగా అధ్యయనం చేసి ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్కరణలు తీసుకువచ్చారు. 2020 – 2021 విద్యా సంవత్సరం నుండి ’ట్రైమెస్టర్ (మూడు) సిస్టమ్తో ద్విభాషా ఆకృతిలో 1 నుండి 5వ తరగతులకు పాఠ్యపుస్తకాలను, రెండు సెమిస్టర్ విధానంలో 6వ తరగతి పాఠ్య పుస్తకాలను అందించారు. 7, 8 తరగతులకు కూడా 2021 – 22 విద్యా సంవత్సరం నుండి రెండు సెమిస్టర్ విధానంలో పుస్తకాలు ఇచ్చారు. అయితే, వివిధ వర్గాలు, నిపుణుల అభిప్రాయాలను అనుసరించి క్షేత్ర స్థాయిలో కూడా పరిశీలన చేసి టర్మ్ ఆధారిత సిలబస్ పాఠ్య పుస్తకాలలో ఏకరీతి నమూనాను అనుసరించాలని ఎస్సీఈఆర్టీ ఓ నివేదిక ఇచ్చింది. ఈ విధానం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. ఎస్సీఈఆర్టీ నివేదిక అన్ని తరగతులకు రెండు సెమిస్టర్ల విధానంలో పాఠ్య పుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి శనివారం విడుదల చేసిన సర్క్యులర్లో వివరించారు. రెండు సెమిస్టర్ల పుస్తకాలను ఒకేసారి పాఠశాలలు తెరిచే రోజునే విద్యార్థులకు పంపిణీ చేస్తారు. -
Andhra Pradesh: బోధనలో నవశకం
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్యాంశాల బోధనలో మరో కొత్త శకం ఆరంభం కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేలా పాఠశాల విద్యా శాఖ ముందడుగు వేస్తోంది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన డిజిటల్ పాఠ్యాంశాలను అందించడానికి వీలుగా ఉచితంగా ట్యాబ్లను పంపిణీ చేయనుంది. ప్రపంచ ప్రఖ్యాత ఎడ్టెక్ సంస్థ బైజూస్కు చెందిన ఈ–పాఠ్యాంశాలతో కూడిన ట్యాబ్లను రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలోని 8వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ అందించనున్నారు. సీఎం వైఎస్ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 21న ఆయన చేతుల మీదుగా ఈ ట్యాబ్లను అందించనున్నారు. 4వ తరగతి నుంచే బైజూస్ కంటెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 32 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ యాప్ ద్వారా డిజిటల్ పాఠ్యాంశాలను ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. పిల్లల తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్ల ద్వారా వారికి ఈ పాఠాలు అందుబాటులో ఉంచారు. అయితే స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉండకపోవడం, ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన తరుణంలో 8వ తరగతిలోకి వచ్చే పిల్లలందరికీ ప్రభుత్వమే ఉచితంగా ట్యాబ్లు అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ విద్యార్థులు మూడేళ్లలో టెన్త్ పబ్లిక్ పరీక్షలను సీబీఎస్ఈ విధానంలో ఆంగ్ల మాధ్యమంలో రాయాల్సి ఉంటుంది. అందుకు వారిని సన్నద్ధం చేసేందుకు వీలుగా ఉన్నత ప్రమాణాలతో కూడిన కంటెంట్ను ట్యాబ్ల ద్వారా అందిస్తున్నారు. మూడేళ్ల పాటు వారికి ఈ ట్యాబుల ద్వారా బైజూస్ పాఠ్యాంశాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే దాదాపు 4.60 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లు అందించనున్నారు. వీరితోపాటు 8వ తరగతి నుంచి ఆపై తరగతులకు పాఠాలు చెప్పే 60 వేల మంది టీచర్లకు కూడా ఈ ట్యాబ్లను ఉచితంగా ఇస్తున్నారు. రాష్ట్రంలో జూన్ నుంచి దాదాపు 15 వేల స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ప్రతి తరగతి గదిలో ప్రత్యేక టీవీ ద్వారా విద్యార్థులకు మరింత స్పష్టంగా ఈ పాఠ్యాంశాలను వివరించవచ్చు. ట్యాబ్ల విలువ రూ.1,400–1,500 కోట్లు బైజూస్ కంటెంట్తో కూడిన ఈ ట్యాబ్ల విలువ రూ.1,400 కోట్ల నుంచి రూ.1,500 కోట్లు ఉంటుంది. ప్రైవేటుగా ట్యాబ్తో పాటు బైజూస్ యాప్ను తీసుకోవాలంటే దాదాపు రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. ట్యాబ్కు రూ.15 వేలు, కంటెంట్కు రూ.15 వేలకు పైగానే చెల్లించాలి. ప్రస్తుతం 8వ తరగతి పిల్లలకు ఉచితంగా అందించే శ్యామ్సంగ్ ట్యాబ్ ఖరీదు రూ.15 వేలు. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఇక బైజూస్ కంటెంట్ ఒక ఏడాదికి ఒక తరగతికి బయట విద్యార్థులు రూ.15 వేల వరకు చెల్లించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం వల్ల ఆ సంస్థ ఈ కంటెంట్ను విద్యార్థులకు ఉచితంగానే అందిస్తోంది. ఇంటి వద్ద కూడా అభ్యసనానికి వీలు బడిలో నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పిల్లలు చదువుకోవడానికి వీలుగా ప్రభుత్వం ఈ ట్యాబ్లను అందిస్తోంది. నేటి కాలంలో తరగతిలో టీచర్ బోధనతో పాటు మొబైల్ యాప్ లేదా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పిల్లలకు అదనపు సపోర్టు అవసరమవుతోంది. గతంలో పిల్లలకు ప్రత్యేకంగా ట్యూషన్ టీచర్లను పెట్టించడమో లేక ఇంట్లో పెద్ద వారు ప్రత్యేకంగా చదివించడమో ఉండేది. ఇప్పుడు అందుకు అవకాశాలు లేకుండా పోయాయి. డిజిటల్ సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో పాఠ్య పుస్తకాలలో ఉన్న కంటెంట్ కన్నా మిన్నగా మంచి చిత్రాలతో త్రీ డైమన్షన్ ఫార్ములాతో, యానిమేషన్లతో రూపొందించిన కంటెంట్ను అందించడం వల్ల పిల్లలు చాలా సులభంగా పాఠ్యాంశాలను నేర్చుకోగలుగుతారు. ఈ ఉద్దేశంతోనే సీఎం ఈ–కంటెంట్ను పిల్లలకు అందించేలా చర్యలు తీసుకున్నారు. తరగతిలోని టీచర్తో పాటు ఇంకో నైపుణ్యం కలిగిన టీచర్ ద్వారా వారికి అదనంగా బోధన చేయించేలా ట్యాబ్ల ద్వారా ఇచ్చే బైజూస్ కంటెంట్ వినియోగపడుతుంది. విద్యార్థులు తరగతుల్లో చెప్పిన అంశాలను రివైజ్ చేయడం, రిఫ్రెష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థి పురోభివృద్ధే లక్ష్యంగా చర్యలు విద్యార్థులు తమంతట తాము చదువుకొనేలా ఈ కంటెంట్ను రూపొందించారు. సందేహాలుంటే ఒకటికి రెండుసార్లు మళ్లీ వీడియోలను చూసి వాటిని నివృత్తి చేసుకోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా తరగతిలో టీచర్ పాఠాలు చెప్పిన తర్వాత దానిని రివైజ్, రివిజన్ చేసుకోవడానికి, ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటిదగ్గరకు వెళ్లాక సందేహాలు వచ్చినా ట్యాబులోని కంటెంట్ను ఓపెన్చేసి తెలుసుకోవచ్చు. కంటెంట్ కూడా టెక్స్ట్ రూపంలో మాత్రమే కాకుండా వీడియో, ఆడియో చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి చాప్టర్ తరువాత క్వశ్చన్ బ్యాంకు ఉంటుంది. దాదాపు 50 – 60 వరకు వివిధ కసరత్తులతో కూడిన క్వశ్చన్లు ఉన్నాయి. పిల్లలు చదువుకున్న తర్వాత ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తమ స్థాయిని వారే అంచనా వేసుకొనేలా ట్యాబ్లో సెల్ప్ అసెస్మెంట్ విధానం కూడా ఉంది. కింది స్థాయి నుంచి క్రమేణా పై స్థాయిలోకి వెళ్లేలా వివిధ గ్రేడ్లలో ఈ మాక్ పరీక్షల విధానం ఉంది. పిల్లల అభ్యసనంపై సునిశిత పర్యవేక్షణ ఎనిమిదో తరగతి విద్యార్థులు ఈ ట్యాబ్ల ద్వారా నిర్వహించే అభ్యసనాన్ని సునిశితంగా పర్యవేక్షించేలా సాఫ్ట్వేర్ను రూపొందించడం విశేషం. ఒకసారి చార్జింగ్ చేశాక 10 గంటలపాటు బ్యాటరీ బ్యాకప్ ఉంది. ఇంటర్నెట్తో సంబంధం లేకుండా ఆఫ్లైన్లో కూడా విద్యార్థులు ఈ వీడియో పాఠ్యాంశాలను అభ్యసించేలా ప్రీలోడెడ్ కంటెంట్ ఉంటుంది. 3 ఏళ్ల పాటు వీటికి వారంటీ ఉంటుంది. మధ్యలో ఏదైనా సమస్య వస్తే సమీపంలోని కంపెనీ సర్వీస్ సెంటర్కు వెళ్లి సరిచేయించుకోవచ్చు. పదో తరగతి వరకు విద్యార్థులు ఈ ట్యాబ్ ద్వారా పాఠాలు అందుకుంటారు. 8 నుంచి 9, 10 తరగతుల్లోకి విద్యార్థులు చేరగానే కంటెంట్ను ఐడీ ద్వారా అప్లోడ్ చేయిస్తారు. పిల్లలు ఎంత వరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి వివిధ దశల్లో మాక్ టెస్టులు ఉంటాయి. ఆ మేరకు వారికి ట్యాబ్లోని సాఫ్ట్వేర్ బ్యాడ్జిలు (గ్రేడింగ్) ఇస్తుంది. అవాంఛనీయ సైట్లకు ఆస్కారం లేకుండా చర్యలు ఈ ట్యాబ్లలో అవాంఛనీయ సైట్లు రాకుండా ప్రత్యేక సాఫ్ట్వేర్ పెట్టారు. పిల్లలను పక్కదారి పట్టించే ప్రమాదకర సైట్లు ఓపెన్ అవ్వకుండా ప్రత్యేకమైన లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సిమ్ శ్లాట్ను లాక్ చేయడంతో అది ఓపెన్ అవ్వదు. ఆఫ్లైన్లో మాత్రమే బైజూస్ యాప్ ఓపెన్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. గూగుల్ వంటివి ఓపెన్ అయినా వాటిలో కేవలం విద్యార్థులకు అదనపు సబ్జెక్టు అంశాలను నేర్చుకొనేవి మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకున్నారు. 8 భాషల్లో ఈ–కంటెంట్ రూపకల్పన ఈ ట్యాబ్ల్లోని ఈ–కంటెంట్ ఆంగ్లం, తెలుగుతో పాటు 8 భాషల్లో రూపొందించారు. ఆయా తరగతుల్లోని అన్ని టాపిక్స్ ఉన్నాయి. గణితం, సైన్స్లో బైలాజికల్, ఫిజికల్, కెమిస్ట్రీ, సోషల్లో హిస్టరీ, జియాగ్రఫీ, సివిక్స్ పాఠ్యాంశాల్లో పూర్తి స్థాయిలో బోధనా వీడియోలతో రూపొందించారు. విద్యార్థులకు సులభరీతిలో అర్థమయ్యే విధంగా యానిమేషన్, చిత్రాలు, విడియో వాయిస్తో పాఠ్యాంశాలను రూపొందించారు. వీరి స్థాయిని పెంచడానికి, ఆసక్తి పెంపొందించడానికి యాప్లోనే మాక్ టెస్టులు, గత సంవత్సరం ఎగ్జామ్స్ పేపర్స్, సెల్ఫ్ టెస్టులు నిర్వహించుకునేందుకు వీలు కల్పించారు. పిల్లలు ఏ భాష కావాలంటే ఆ భాషలోకి వెళ్లి వీడియోలను చూసి నేర్చుకోవచ్చు. అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ–కంటెంట్తో కూడిన ట్యాబ్లను పంపిణీ చేయిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హైస్కూళ్లలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఈ ఏడాది 1000 స్కూళ్లకు సీబీఎస్ఈ గుర్తింపు వచ్చింది. విద్యార్థులను ఈ విధానానికి సన్నద్ధం చేయడంతో పాటు వారిని ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ట్యాబ్లు, కంటెంట్ వీలు కల్పిస్తుంది. మూడేళ్ల తర్వాత ఇప్పటి 8వ తరగతి పిల్లలు సీబీఎస్ఈ విధానంలో టెన్త్ పరీక్షలు రాసేందుకు ఈ ట్యాబ్, కంటెంట్ బాగా ఉపకరిస్తుంది. – ఎస్.సురేష్కుమార్, పాఠశాల విద్య కమిషనర్ మరింత క్షుణ్ణంగా నేర్చుకోవచ్చు పిల్లలు తరగతిలో చెప్పే పాఠాలను ఇళ్లకు వెళ్లాక కూడా మరింత క్షుణ్ణంగా అభ్యాసం చేసేందుకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలోని 8వ తరగతి విద్యార్థులందరికీ, 8వ తరగతి బోధించే టీచర్లకు.. మొత్తంగా 5.18 లక్షల మందికి ట్యాబ్లు అందిస్తున్నాం. వీటిని ఎలా వాడాలి.. కంటెంట్ను ఎలా చెప్పాలో టీచర్లకు శిక్షణ ఇస్తాం. సీబీఎస్ఈ విధానంలో బోధన చేసేలా ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. – కాటమనేని భాస్కర్, పాఠశాల విద్య కమిషనర్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్) విద్యార్థులకు వరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యాబ్లు అందించడం కచ్చితంగా పెద్ద వరమే. ఉన్నతాధికారులు ప్రవీణ్ ప్రకాష్, కాటమనేని భాస్కర్లు మా స్కూల్కు వచ్చి.. పంపిణీ చేయనున్న ట్యాబ్లను పరిశీలన కోసం విద్యార్థులకు చూపించారు. కంటెంట్ అద్భుతంగా ఉందని పిల్లలు సంతోషపడ్డారు. విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న విప్లవాత్మకమైన మార్పుల ఫలితంగా ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న చిన్న చూపును తుడిచివేసి, కార్పొరేట్ పాఠశాలల తరహలో అభివృద్ధి చేస్తుండటం అభినందనీయం. – బట్టు సురేష్కుమార్, హెచ్ఎం, నిడమానూరు జెడ్పీ పాఠశాల సులభంగా అర్థమవుతున్నాయి కష్టతరమైన పాఠ్యాంశాలు కూడా ఈ ట్యాబ్లో ఉండే వీడియోల ద్వారా సులభంగా అర్థమవుతున్నాయి. పాఠ్యాంశాల వారీగా చిత్రాలు, బొమ్మలు, యానిమేషన్ వీడియోలు చాలా బాగున్నాయి. ఈ ట్యాబ్ ఎలా ఆపరేట్ చేయాలో ఉపాధ్యాయులు వివరించారు. – రిబికా, 8వ తరగతి, నిడమానూరు జెడ్పీ పాఠశాల జగన్మామకు కృతజ్ఞతలు మా భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న జగన్ మామకు కృతజ్ఞతలు. పేదలమైన మేము మంచి చదువులు చదువుకోవాలని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఎంతో విలువైన ట్యాబ్లు, కంటెంట్ అందించి మా విద్యా ప్రమాణాలు పెంపొందిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మంచి ఉత్తీర్ణత సాధిస్తాను. – ఎ. నాగమల్లేష్, 8వ తరగతి, నిడమానూరు జెడ్పీ పాఠశాల కార్పొరేట్ స్కూల్ కంటే గొప్పగా.. ప్రభుత్వం మాకు మంచి విద్య అందించేందుకు అన్ని విధాలుగా సాయం చేస్తోంది. అమ్మ ఒడితో పాటు విద్యాకానుక, గోరుముద్ద పథకాలు ఎంతో అండగా ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ల కన్నా గొప్పగా ఉండేలా ట్యాబ్లు, బైజూస్ కంటెంట్ అందించడం వల్ల మరింత బాగా చదువుకోగలుగుతాం. – తేజస్విని, 8వ తరగతి, నిడమానూరు జెడ్పీ పాఠశాల మరింత బాగా చదువుకుంటాం మేము ఇంగ్లిష్ మీడియం చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మా స్కూలులోనే ఆ మీడియం పెట్టారు. ఇప్పుడు సీబీఎస్ఈ విధానంలో పాఠాలను బోధిస్తున్నారు. మరింత బాగా చదువుకునేందుకు మాకు బైజూస్ కంటెంట్తో ఇస్తున్న ట్యాబ్లు ఎంతో ఉపయోగపడతాయి. – స్నేహిత, 8వ తరగతి, నిడమానూరు జెడ్పీ పాఠశాల -
టీచర్ల బదిలీల్లో మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీలకే పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని స్కూళ్లలోనూ తగినంత సంఖ్యలో టీచర్లు అందుబాటులో ఉండేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. తద్వారా విద్యార్థుల బోధనాభ్యసనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియను చేపట్టిన అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టారు. బదిలీల మేరకు రిలీవ్ అయిన టీచర్ల స్థానాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే వారిని రిలీవ్ చేస్తున్నారు. ఒకే టీచర్ ఉన్న స్కూళ్లో ఆ టీచర్కు బదిలీ అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు ఆ టీచర్ను రిలీవ్ చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఇద్దరు ఉన్న స్కూల్లో ఇద్దరికీ బదిలీ అయితే జూనియర్ టీచర్ను రిలీవ్ చేయరాదని పేర్కొంది. ముగ్గురున్న చోట బదిలీలుంటే జూనియర్లయిన ఇద్దరు టీచర్లను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యేవరకు రిలీవ్ చేయరు. ముఖ్యంగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల స్కూళ్లల్లో టీచర్లు లేరనే మాట రాకుండా.. ముందుగా మారుమూల ప్రాంతాల స్కూళ్లలో ఖాళీలు భర్తీ అయ్యేలా బదిలీల మార్గదర్శకాల్లో ప్రభుత్వం పలు అంశాలను చేర్చింది. జిల్లాల్లోని ప్రస్తుతం భర్తీ అయిన పోస్టులకు సమానంగా ఖాళీలను చూపించి బదిలీ ప్రక్రియను అధికారులు కొనసాగించనున్నారు. మిగిలిన ఖాళీ పోస్టులను అన్ని ప్రాంతాలకూ సమానంగా సర్దుబాటు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉదాహరణకు ఒక జిల్లాలో 5వేల పోస్టులు ఉంటే.. అక్కడ 4,500 మంది టీచర్లు పనిచేస్తుంటే తక్కిన 500 ఖాళీలను ప్రాంతాల వారీగా మొదటి మూడు కేటగిరీలకూ సమానంగా బదలాయిస్తారు. దీనివల్ల ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల స్కూళ్లకు ప్రయోజనం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ మైదాన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల స్కూళ్ల టీచర్లను కూడా బదిలీ చేస్తున్నా.. ఏజెన్సీ ప్రాంతాల స్కూళ్లలో ఒకేసారి ఖాళీలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గిరిజన సమీకృతాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాంతాల్లోని పాఠశాలల టీచర్లు.. నాన్ ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటి చోట్ల ఆయా స్కూళ్లలో టీచర్లు లేరన్న పరిస్థితి రాకుండా ప్రత్యామ్నాయ భర్తీ ఏర్పాట్లు చేశాకే బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేస్తారు. ఐటీడీఏ ప్రాంతాల్లో ఖాళీ టీచర్ పోస్టులు భర్తీకాని పక్షంలో ఐటీడీయేతర ప్రాంతాల్లో బాగా జూనియర్లయిన టీచర్లను ఆయా స్థానాల్లో తాత్కాలికంగా నియమించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే గతంలో ఏజెన్సీ, మారుమూల ప్రాంతాలకు బదిలీ అయిన వారిలో ఎక్కువమంది అనధికారికంగా లేదా అధికారికంగా గైర్హాజరులో ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వారి ఖాళీలను బదిలీల్లో చూపించడం ద్వారా అక్కడి పోస్టుల భర్తీకి ఆస్కారం ఉంటుంది. తప్పనిసరి బదిలీ అవ్వాల్సిన గ్రేడ్–2 హెచ్ఎంలు బదిలీ దరఖాస్తు చేయకున్నా వారిని కేటగిరీ–4లోని మిగులు పోస్టుల్లో నియమిస్తారు. అక్కడ ఖాళీ లేనిపక్షంలో కేటగిరీ–3లోని స్కూళ్ల ఖాళీల్లోకి పంపుతారు. కన్వర్షన్ కోరుకున్న సబ్జెక్టు టీచర్లకు.. కాగా ఇటీవల సబ్జెక్టు టీచర్ల కొరతను పరిష్కరించడానికి ప్రభుత్వం ఆయా సబ్జెక్టులలో అర్హతలున్న వారిని మార్చుకోవడానికి (కన్వర్షన్) అనుమతించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది టీచర్లు ఇలా కన్వర్షన్కు లేఖలు ఇచ్చారు. ఇలా అంగీకారం తెలిపిన వారిని వెంటనే ఆయా సబ్జెక్టుల్లోకి మార్చడంతోపాటు బదిలీకి దరఖాస్తు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ బదిలీల ద్వారా సబ్జెక్టు టీచర్లు దాదాపు అన్ని పాఠశాలలకు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుందని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల్లో మిగులు టీచర్లుగా గుర్తించిన వారందరినీ ప్రభుత్వం అవసరమైన స్కూళ్లలో తాత్కాలికంగా సర్దుబాటు చేసింది. ఇప్పుడు బదిలీల్లో ఆయా పోస్టుల్లో రెగ్యులర్ టీచర్లు నియమితులయ్యే అవకాశం ఉంది. గతంలో కన్నా మెరుగ్గా ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి.. రాష్టంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి గతంలో కన్నా మెరుగ్గా ఉంది. విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలన్న నిబంధన ఉంది. కానీ రాష్ట్రంలో అది 20 కన్నా తక్కువగానే ఉందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (యూడైస్) ప్లస్ గణాంకాల ప్రకారం చూసినా గత ప్రభుత్వాల కన్నా మెరుగ్గా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. (చదవండి: ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి?) -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: టీచర్లు.. టీచింగ్కే
సాక్షి, అమరావతి: విద్యారంగ సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజనం చేకూర్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల సమగ్ర పురోభివృద్ధికి వీలుగా ప్రభుత్వ టీచర్లకు విద్యేతర కార్యక్రమాలను అప్పగించరాదని నిర్ణయించింది. ఈమేరకు ఉపాధ్యాయులను పూర్తిగా విద్యా కార్యక్రమాలకే పరిమితం చేస్తూ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ఉపాధ్యాయులను విద్యేతర కార్యక్రమాల నుంచి తప్పిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ (పాఠశాల విద్య) జీవో 185 జారీ చేశారు. రాష్ట్ర ఉచిత, నిర్బంధ విద్యాహక్కు 2010 చట్టాన్ని సవరిస్తూ ఈ ఉత్తర్వులు వెలువరించారు. తాజా ఉత్తర్వులతో బోధనాభ్యసన ప్రక్రియ, విద్యా సంబంధిత కార్యక్రమాలు సమగ్రంగా కొనసాగి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. స్కూళ్లలో బోధనేతర కార్యక్రమాల బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాల సంక్షేమ, విద్యా అసిస్టెంట్లకు ఇప్పటికే అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.34 లక్షల మంది సచివాలయాల ఉద్యోగులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల మెరుగైన నిర్వహణకు వారి సేవలను వినియోగించుకుంటోంది. తద్వారా టీచర్లు ఇకపై పూర్తిగా బోధనపైనే దృష్టి కేంద్రీకరించేలా చేసి వారి దీర్ఘకాలిక డిమాండ్ను పరిష్కరించింది. విద్యా సంస్కరణలతో.. విద్యా సంస్కరణలతో రాష్ట్రంలో మూడేళ్లుగా పరిస్థితులు సమూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. విద్యాదీవెన, విద్యా కానుక, అమ్మ ఒడి, ఫౌండేషన్ స్కూళ్లు, ఇంగ్లీషు మీడియంతో పిల్లల చదువులకు సర్కారు భరోసా కల్పిస్తోంది. విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా అతి పెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.24 వేల వ్యయంతో స్టడీ మెటీరియల్ను ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4.7 లక్షల మంది విద్యార్థులకు రూ.500 కోట్ల వ్యయంతో ఒక్కొక్కరికి దాదాపు రూ.12 వేల విలువ చేసే ట్యాబ్లను ఉచితంగా అందిస్తోంది. 4 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు బైజూస్ కంటెంట్ను ప్రత్యేక యాప్ ద్వారా ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు తరగతి గదుల్లో టీవీలు, డిస్ప్లే బోర్డుల ద్వారా పాఠ్యాంశాలను సులభంగా గ్రహించేలా చర్యలు తీసుకుంది. ప్రాథమిక స్కూళ్లలో ఇంగ్లీష్ ల్యాబ్లను నెలకొల్పి 11 వేల స్మార్ట్ టీవీలను పంపిణీ చేసింది. ప్రభుత్వ స్కూళ్లను దశలవారీగా సీబీఎస్ఈతో అనుసంధానిస్తోంది. తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేపట్టడంతోపాటు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ద్విభాషా పాఠ్య పుస్తకాలు (బై లింగ్యువల్) అందచేస్తోంది. మనబడి నాడు – నేడు ద్వారా 56,572 ప్రభుత్వ విద్యా సంస్థల్లో రూ.16,450 కోట్ల వ్యయంతో దశలవారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ తీర్చిదిద్దుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని సంక్షేమ, విద్యా సహాయకులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఈ పనుల్లో నాణ్యత పరిశీలన బాధ్యతలను అప్పగించింది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ బడులు, కళాశాలల్లో టాయ్లెట్ కాంప్లెక్స్ల నిర్వహణకు తొలిసారి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన ఘనత మన రాష్ట్రానిదే. రాష్ట్రవ్యాప్తంగా 44,472 ప్రభుత్వ స్కూళ్లలో 45,313 మంది ఆయాలను నియమించి గౌరవ వేతనం చెల్లిస్తోంది. నాడు – నేడు స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 14,500 పీఎంశ్రీ స్కూళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక ఆర్థిక స్తోమత కారణంగా ఏ ఒక్క విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం అమలు చేస్తోంది. క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. జగనన్న విద్యాకానుక కింద బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్కులు, వర్కు బుక్కులు, బ్యాగు, 3 జతల యూనిఫారం, షూ, సాక్సులతోపాటు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని కూడా ప్రభుత్వం విద్యార్ధులకు ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి విద్యతో పాటు మంచి పౌష్టికాహారం కూడా ఎంతో అవసరం. దీన్ని గుర్తించి జగనన్న గోరుముద్ద ద్వారా రోజుకో మెనూతో పోషక విలువలున్న ఆహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందిస్తోంది. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కారాదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్ధిక సాయం చేస్తోంది. ఏ అవసరం వచ్చినా.. టీచర్లను విద్యేతర కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తుండటం వల్ల బోధనాభ్యసన కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగానికి ఏ అవసరం వచ్చినా టీచర్లకే బాధ్యతలు కేటాయించడం వల్ల పిల్లలకు పాఠాలు చెప్పేవారు లేకుండా పోతున్నారు. కొంతమంది టీచర్లు ఇతర విభాగాలకు డిప్యుటేషన్లపై వెళ్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కార్పొరేషన్ల ఛైర్మన్ల పీఏలుగా కూడా టీచర్లు పనిచేసిన పరిస్థితి గతంలో నెలకొంది. ఇలా మొత్తం టీచర్లలో 5 శాతం మంది పాఠశాలలకు దూరం కావడం బోధనపై ప్రభావం చూపుతోంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్లకు విద్యేతర కార్యక్రమాలను అప్పగించరాదని, ఇతర విధుల్లో ఉంటున్న వారిని వెంటనే వెనక్కు రప్పించాలని గడువు విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ గత ఏడాది ఇతర శాఖల్లో డిప్యుటేషన్పై పనిచేస్తున్న వారిని వెనక్కు రప్పించి పాఠశాలల్లో బోధనకు వీలుగా పునర్నియామకం చేసింది. ఇన్నాళ్లకు.. తమకు విద్యేతర కార్యక్రమాలు అప్పగించవద్దని టీచర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇతర బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో లక్ష్యాల మేరకు బోధనాభ్యసన ప్రక్రియలను కొనసాగించలేకపోతున్నామని నివేదించినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రయోజనం ఇలా.. ప్రతి విద్యార్థిపైనా దృష్టి టీచర్లు పాఠశాలల్లో పూర్తిగా విద్యా కార్యక్రమాల్లో నిమగ్నం కావడం వల్ల విద్యార్ధులకు పూర్తిస్థాయిలో బోధన అందుతుంది. టీచర్లు తమ బాధ్యతను సమగ్రంగా నిర్వర్తించడానికి వీలుంటుంది. తరగతిలో ఒక్కో విద్యార్థి అభ్యసనం ఎలా ఉంది? లోపాలు ఏమిటి? అనే అంశాలపై దృష్టి సారించి లోపాలను సరిదిద్దడంపై టీచర్లు దృష్టి సారించగలుగుతారు. ఉన్నత ప్రమాణాలు... పాఠశాలల్లో బోధనాభ్యసన కార్యక్రమాలు మెరుగుపడటం ఉన్నత ప్రమాణాలు సాధించేందుకు దారి తీస్తుంది. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ఫౌండేషనల్ స్కూళ్ల విధానం తెచ్చిన విషయం తెలిసిందే. స్కూళ్ల మ్యాపింగ్ ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించడానికి వీలుగా ఫౌండేషన్ విద్యతో సహా ఆరంచెల స్కూళ్ల విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 3, 4 5 తరగతులను కిలోమీటర్ పరిధిలోని ప్రీ–హైస్కూళ్లు, హైస్కూళ్లతో మ్యాపింగ్ చేపట్టింది. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లతో బోధించేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 4,943 ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలలను 3,557 ప్రీ–హైస్కూల్, ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేశారు. జీవో నెంబర్ 117 ప్రకారం ఇలా మ్యాపింగ్ అయిన హైస్కూళ్లు, ప్రీ హైస్కూళ్లలో 7,928 మంది సబ్జెక్ట్ టీచర్లు అదనంగా అవసరమని గుర్తించారు. ఈ మేరకు సబ్జెక్టు టీచర్ల నియామకానికి వీలుగా 3,095 ఇతర సబ్జెక్టు పోస్టులను అవసరమైన సబ్జెక్టు పోస్టులుగా మార్పు చేశారు. ఇవే కాకుండా 3,993 పోస్టులను సబ్జెక్టులు బోధించే స్కూల్ అసిస్టెంటు పోస్టులుగా అప్గ్రేడ్ చేశారు. వీటిలో 287 స్కూల్ అసిస్టెంట్, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్, గ్రేడ్–2 హెడ్మాస్టర్ పోస్టులుగా, 3,706 ఎస్జీటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేశారు. ఇలా సబ్జెక్టు టీచర్ పోస్టులుగా కన్వర్ట్ అయిన, అప్గ్రేడ్ చేసిన పోస్టులలో టీచర్లను నియమిస్తున్నారు. మ్యాపింగ్తో మిగులు టీచర్ల సర్దుబాటు 3, 4, 5 తరగతులు హైస్కూళ్లకు అనుసంధానంతో మిగులు టీచర్లను మ్యాపింగ్ అయిన స్కూళ్లలో నియమించడం ద్వారా విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంది. స్కూళ్ల పునర్విభజన కసరత్తు తర్వాత ఫౌండేషన్ ప్లస్, ప్రీ–హైస్కూల్, హైస్కూల్లో మిగులు ఉన్నట్లు గుర్తిస్తే తాత్కాలికంగా అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు చేస్తోంది. పదోన్నతులు, ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు ఆర్టీఈ నిబంధనల ప్రకారం స్కూల్ కాంప్లెక్స్లో లేదా అదే మండలంలో సర్దుబాటు చేస్తున్నారు. దీని ప్రకారం ఇప్పటికే 3,726 మంది ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లను తాత్కాలికంగా అవసరమైన ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేశారు. దీనికి సంబంధించి స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ పలుచోట్ల సరిగా అమలు చేయకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నట్లు విద్యాశాఖ గుర్తించి దృష్టి సారించింది. బోధనకు వెళ్లకుంటే చర్యలు తప్పవు బోధనకు ఎక్కడా ఆటంకం లేకుండా ఉండాలని ప్రభుత్వం, విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కొన్ని చోట్ల బోధనకు టీచర్లు విముఖత చూపుతున్నారని, కొన్ని చోట్ల సమన్వయం లోపం వంటి సమస్యలతో బోధన అందడం లేదన్న వార్తలు వస్తున్నాయి. మంగళవారం దీనిపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈఓలు, ఆర్జేడీలతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెబెక్స్ సమావేశం నిర్వహించారు. పలు హైస్కూళ్లలో అవసరమైన సంఖ్యలో టీచర్లను నియమించినా బోధన చేయడం లేదన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. కృష్ణా జిల్లాలోని ఓ హైస్కూలులో 3నుంచి 10వ తరగతి వరకు 19 మంది టీచర్లను నియమించినా కింది తరగతులకు బోధన చేపట్టడం లేదని ఆర్జేడీ వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరించే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. పట్టణ, ఉపపట్టణ ప్రాంతాల్లో మిగులుగా ఉన్న టీచర్లను మారుమూల ప్రాంతాల్లో సర్దుబాటు చేయాలని స్పష్టం చేశారు. హైస్కూలు, మ్యాపింగ్ హైస్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లలో ఎక్కడా టీచర్ల కొరత అనేదే ఉండరాదని, ఆ దిశగా డీఈఓలు సర్దుబాటు చేయాలని సూచించారు. కర్నూలుకు 1,876 పోస్టుల మంజూరు కర్నూలు జిల్లాలో దశాబ్దాలుగా తీవ్ర సమస్యగా మారిన టీచర్ల కొరతను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం అదనపు టీచర్ పోస్టులను మంజూరు చేసింది. జిల్లాకు ఏకంగా వివిధ కేటగిరీలలో 1,876 పోస్టులను కేటాయించింది. ఇతర జిల్లాల్లో మిగులు పోస్టులను ఈ జిల్లాకు మళ్లించడం ద్వారా సమస్యను పరిష్కరించింది. రాష్ట్ర విద్యాహక్కు చట్టం 2010లో అదనపు అంశాలు ఉపాధ్యాయులకు విద్యేతర కార్యక్రమాలను అప్పగించకుండా ఏపీ ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కొన్ని అంశాలను జోడించింది. ఏపీ ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 మార్చి 3న విడుదలైన జీవో 20లో వీటిని చేర్చింది. ఆ జీవోలో ప్రస్తుతం 29 రూల్స్ ఉండగా 30వ రూల్గా ‘డిప్లాయ్మెంట్ ఆఫ్ టీచర్స్ ఫర్ నాన్ ఎడ్యుకేషనల్ పర్పసెస్’ (టీచర్లను విద్యేతర కార్యక్రమాల్లో నియమించడం) కింద దీన్ని పొందుపరిచింది. ► తరగతి గదిలో పిల్లల విద్యా సంబంధిత సామర్థ్యాలను మెరుగుపరచడానికి వీలుగా ఉపాధ్యాయులు బోధన కార్యకలాపాల్లో తమ సమయాన్ని పూర్తిగా కేంద్రీకరించాలి. ఉత్తమ బోధనకు అంకితం కావాలి. ► ఉపాధ్యాయులు సాధ్యమైనంత వరకు పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా సంబంధిత కార్యకలాపాలు మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఇతర విధుల్లో వారిని నియమించరాదు. ► ఏదైనా అనివార్య పరిస్థితులు తలెత్తిన సందర్భాల్లో ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది అందరినీ మోహరించిన తర్వాత మాత్రమే ఉపాధ్యాయులను విద్యేతర కార్యక్రమాల్లో నియమించాలి. ► సెక్షన్ 27 నిబంధనలకు అనుగుణంగా విద్యాహక్కు చట్టం మరింత బలోపేతం -
2, 3 సెమిస్టర్ల పాఠ్యపుస్తకాలు సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన 2, 3 సెమిస్టర్ల పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్ తెలిపారు. జగనన్న విద్యా కానుక కింద అందిస్తున్న ఈ పుస్తకాల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలతో ఆయన మంగళవారం సర్క్యులర్ విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక–3 కింద సెమిస్టర్–2, 3కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు అక్టోబర్ 15 నుంచి 31 వరకు పూర్వపు 13 జిల్లాల గోడౌన్లకు సరఫరా చేసినట్లు తెలిపారు. జిల్లా బుక్ డిపో మేనేజర్లు మండల పాయింట్లకు వీటిని పంపిణీ చేసేందుకు వీలుగా షెడ్యూల్ను కూడా సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు ప్రతి పుస్తకం చేరేలా... సెమిస్టర్–1 పాఠ్యపుస్తకాల సరఫరాలో కొన్ని లోపాలు తలెత్తాయి. ఇప్పుడు అటువంటి సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులకు కమిషనర్ సూచించారు. అన్ని జిల్లాల బుక్ డిపోల మేనేజర్లు సెమిస్టర్–2, 3 పాఠ్యపుస్తకాల అన్ని టైటిళ్లను ఒకే షెడ్యూల్లో అందించాలి. అన్ని మండలాల విద్యాశాఖాధికారులు సెమిస్టర్–2, 3ల అన్ని పాఠ్యపుస్తకాలను తమ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సరఫరా చేయాలి. ప్రతి టైటిల్ బుక్ ప్రతి విద్యార్థికి చేరేలా చూసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు అందరూ తమ స్కూలులో ప్రస్తుత నమోదు ప్రకారం మండల పాయింట్ల నుంచి అన్ని పాఠ్యపుస్తకాల శీర్షికలను తీసుకోవాలి. ఏ పాఠశాలలో అయినా ఆంగ్ల మాధ్యమంలో నమోదు పెరిగి, తెలుగు మాధ్యమంలో తగ్గితే మండల విద్యాధికారి ద్విభాషా పాఠ్యపుస్తకాలను ఆంగ్ల మాధ్యమం విద్యార్థుల కోసం సరఫరా చేయాలి. ఇంకా, మండలాల్లో చేరికలు పెరిగి ఏదైనా కొరత ఏర్పడితే మండల విద్యాధికారి సంబంధిత పత్రాలతో జిల్లా విద్యాధికారికి, జిల్లా బుక్ డిపో మేనేజర్కు తెలియజేసి అవసరమైన శీర్షికలను పొందాలి. ఉర్దూ, తమిళం, కన్నడ, ఒడియా మాధ్యమాల పాఠ్యపుస్తకాలు, సంస్కృతం పాఠ్యపుస్తకాలు కూడా ప్రింట్ అయి జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్లకు సరఫరా అయ్యాయి. జిల్లా విద్యాధికారి, జిల్లా బుక్ డిపో మేనేజర్ ఈ పుస్తకాలను అవసరమైన పాఠశాలలకు సరఫరా చేయాలి. సెమిస్టర్–2, 3ల పాఠ్యపుస్తకాలు మొత్తం నవంబర్ 10వ తేదీలోపు పంపిణీ చేయాలి. ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా బుక్డిపో మేనేజర్లు పాఠ్యపుస్తకాల పంపిణీని పర్యవేక్షించాలి. ఏదైనా మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తిస్తే విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. -
Tholimettu Program: ‘తొలిమెట్టు’తో కొత్త ఒరవడి
‘నేషనల్ అచీవ్మెంట్ సర్వే’ (నాస్) 2017 నవం బర్–2021 ఫలితాలు విద్యార్థులలో కనీస సామర్థ్యాలు కొరవడినట్టు తేల్చింది. భాషలో విద్యార్థులు సుమారు 70 శాతం మంది కనీస స్థాయి లేదా అంత కంటే తక్కువస్థాయి సామ ర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు 2021 నాస్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2020 మార్చి నుండి రెండేళ్ల పాటు కరోనా కారణంగా విద్యారంగం అతలాకుతలం అయింది. దీనివలన తలెత్తిన అభ్యసనా సంక్షోభం విద్యాశాఖ ముందు అనేక సవాళ్లను మిగిల్చింది. పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యసన సంక్షోభాన్ని నివారించి, తరగతి వారీగా భాష, గణితాల సామర్థ్యాలను సాధించడానికి ‘జాతీయ విద్యావిధానం–2020’ అమలులో భాగంగా దేశవ్యాప్తంగా ‘ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ’ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీని ద్వారా ప్రాథమిక స్థాయిలో 11 ఏళ్ల లోపు ఉన్న 5 కోట్ల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ‘తొలి మెట్టు’ అనేపేరుతో 2022 ఆగస్టు 15 నుండి అమలు చేస్తున్నారు. ‘సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలంగాణ విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రాష్ట్రంలోని 52 వేల మంది ఉపాధ్యాయులకు 3 విడతలలో శిక్షణ అందించారు. అందుకే ఈ కార్యక్రమాన్ని 2025 వరకు అమలు అయ్యే విధంగా రూపకల్పన చేశారు. దీనివల్ల రాష్ట్రంలో 11.24 లక్షల విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి తరగతి గదిలో మూడు ముఖ్యమైన విషయాలు చోటు చేసుకోవాలి. 1. తగిన పాఠ్య బోధన సోపానాలు వినియోగించుకుంటూ పీరియడ్ ప్రణాళికను అమలు చేయాలి. 2. అవసరమైన బోధనాభ్యసన సామగ్రితో అభ్యసన ప్రక్రియ కొనసాగాలి. 3. పాఠ్యపుస్తకాన్ని సమర్థంగా వినియోగించాలి. ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి తరగతి గదిలో విద్యార్థితో మాట్లాడించడం, కీలక పదాలను గుర్తింపచేయడం, పఠన కృత్యాలు నిర్వహించడం వంటివి నిర్వహించి అభ్యాసం కల్పించాలి. ఇందుకోసం రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణాసంస్థ కృత్యపత్రాలను కూడా తయారు చేసి ఉపాధ్యాయులకు అందచేస్తుంది. వీటి సహకారంతో పాఠశాల విద్య పూర్తయ్యేసరికి విద్యార్థులంతా ఆయా సబ్జెక్టులలో నిర్దేశించిన సామర్థ్యాలలో అభ్య సన ఫలితాలను సాధించాలి. అప్పుడే గుణాత్మక విద్యను సాధించినట్లుగా భావిస్తారు. ‘తొలిమెట్టు’ కార్యక్రమాల అమలు పర్య వేక్షణ కోసం మండల స్థాయిలోనూ, పాఠశాల సముదాయ స్థాయిలోనూ... నోడల్ అధికారులనూ, విషయ నిపుణులనూ నియమించారు. వీరు పాఠశాలకు వెళ్లి తరగతి గదిలో బోధనను పరిశీలించి ఎక్కడికక్కడ అనుమాన నివృత్తి చేసి, సమీక్షలు నిర్వహిస్తూ ‘తొలిమెట్టు’ విజయవంతం కావడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నచోట కూడా 5 తరగతులకు ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణతో పాటు విద్యాశాఖకు ఎప్పటికప్పుడు పంపించవలసిన నివేదికలను నింపడంతోనే ఒకరికి బాధ్యతలు సరిపోతే మిగిలిన ఒక్కరితో బోధన సాధ్యమేనా? ఏలికలే ఆలోచించాలి. (క్లిక్ చేయండి: విన్నారా? ‘మెదడే’ ప్రమాదకరమట!) మొత్తం మీద జాతీయ విద్యావిధానం–2020 అమలుకు తొలిమెట్టు కార్యక్రమ ఉత్తమ ఫలితాలు అవసరం. తెలంగాణలో తొలిమెట్టు కార్యక్రమం ద్వారా తరగతి గదిలో మార్పు ఎంతవరకు సాధ్యం అనేది వేచి చూడాల్సిందే. (క్లిక్ చేయండి: ప్రాథమిక స్థాయిలో శిక్షణేదీ?) - డాక్టర్ సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు సామాజిక విశ్లేషకులు -
‘సాల్ట్’ అమలు శభాష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ (సాల్ట్) ప్రాజెక్టు అమలు పురోగతి సంతృప్తికరంగా సాగుతోందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చక్కగా అమలు చేస్తోందని కితాబిచ్చింది. పాఠశాల విద్యలో ఏపీ సర్కార్ చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించడానికి ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్లు ఆర్థికసాయం అందిస్తున్న విషయం తెలి సిందే. ఈ నేపథ్యంలో.. ప్రాజెక్టు అమలు ఫలితాల పై ఆ బ్యాంకు అధ్యయనం చేసి నివేదికను వెల్లడించింది. ముఖ్యంగా రాష్ట్రంలో 15 వేలకు పైగా పాఠశాలల్లో అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరిచిందని, తద్వారా కీలకమైన ముందస్తు ఫలితాన్ని రాష్ట్రం సాధించిందని.. ఏపీ సర్కార్ ఈ ప్రాజెక్టును ప్రశంసనీయ స్థాయిలో అమలుచేస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ఇక కరోనా కారణంగా రాష్ట్రంతో పాటు జాతీయంగా కూడా స్థూల ఆర్థికంపై ప్రతి కూల ప్రభావం కొనసాగుతోందని, అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ట్రెజరీ ద్వారా సకాలంలో నిధులు విడుదలవుతున్నాయని.. అమలుచేసే నోడల్ ఏజెన్సీలకు రాష్ట్ర ఖజానా నుంచి నిధులు అందుతున్నాయని పేర్కొంది. ప్రాజెక్టు అమలులో ఊహించిన కీలక ఆవిష్కరణలు, కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని, సాంకేతిక సహాయ ఏజెన్సీల ఏర్పాటులో ప్రభుత్వం నిమగ్నమైందని వివరించింది. కార్యకలాపాల ప్రణాళిక, డెలివరీలో నోడల్ విద్యా సంస్థలకు మద్దతివ్వడానికి అవసరమైన చర్యలు, పనులను నిశితంగా పర్యవేక్షించేం దుకు సాంకేతిక మద్దతును అందించడానికి టాస్క్ టీమ్నూ ఏర్పాటు చేసిందని ఆ నివేదిక పేర్కొంది. కరోనాలోనూ పటిష్టంగా ఏర్పాట్లు గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి కారణంగా ఏపీ సహా దేశవ్యాప్తంగా దాదాపు ఏడాదిపాటు విద్యా సంస్థలు మూతపడినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పటిష్టంగా ఏర్పాట్లుచేసిందని బ్యాంకు పేర్కొంది. పాఠశాలల మూసివేత, పునఃప్రారంభ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వ్యాప్తిచెందకుండా మార్గదర్శకాలు రూపొందించి అమలుచేసినట్లు ప్రపంచ బ్యాంకు ఏపీ సర్కార్ను ప్రశంసించింది. కోవిడ్ సమయంలో ఆన్లైన్, టెలివిజన్, రేడియో, సోషల్ మీడియాను బలోపేతం చేశారని. తక్కువ ఆదాయ కుటుంబాల విద్యార్థులకు రిమోట్ లెర్నింగ్ను బలోపేతం చేసి అందుబాటులోకి తెచ్చిందని బ్యాంకు కొనియాడింది. ప్రపంచ బ్యాంకు ప్రస్తావించిన ప్రధానాంశాలివే.. ► విద్యా సంస్థల నిర్వహణ, సామర్థ్యాన్ని పెంచి తద్వారా ఆశించిన ఫలితాలను సాధించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక మద్దతు ఏజెన్సీలను ఏర్పాటు చేసింది. ► స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్ఈఆర్టీ) మద్దతుతో వృత్తిపరంగా టీచర్ల అభివృద్ధి, అభ్యాస కార్యకలాపాలను అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్నీ ఏర్పాటు చేసింది. ► ప్రాజెక్టు ఫలితాల సాధనకు థర్డ్పార్టీ ఏజెన్సీని, ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణకు ప్రోగ్రామ్ కన్సల్టెన్సీ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసింది. ► అలాగే, ప్రోగ్రాం డెవలప్మెంట్ ఆబ్జెక్టివ్ (పీడీఓ) సాధన దిశగా మొత్తం ప్రాజెక్టు పురోగతి సంతృప్తికరంగా కొనసాగుతోంది. ► ప్రాథమిక విద్యలో అభ్యాస ఫలితాలతో పాటు బోధనా విధానాల్లో నాణ్యత పెంచడం, పాఠశాలల నిర్వహణను మరింత మెరుగుపరచడమే ప్రాజెక్టు ప్రధానాశయం, లక్ష్యం. ఇందులో భాగంగా.. ప్రాథమిక దశలోనే ప్రాజెక్టు అమలు సంతృప్తికరంగా సాగుతోంది. ► పాఠశాలల నిర్వహణ, పనితీరుపై నిరంతరం సమాచారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల కమిటీలను మరింత పటిష్టం చేస్తోంది. -
విద్యపై విషపు రాతలా?
సాక్షి, అమరావతి: ‘వెనుక‘బడి’నా గొప్పలే’ అంటూ ఈనాడు దినపత్రిక సోమవారం వండివార్చిన కథనంలో అన్నీ అసత్యాలేనని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న దుర్బుద్ధితో తప్పుడు కథనాన్ని ప్రచురించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పాఠశాల విద్య) బి. రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ కథనాన్ని రాసిందని, ఇందులో దురుద్దేశమే కాకుండా నేరపూరిత ఆలోచనలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు రాసిన కథనంలోని ప్రతి అంశమూ అసత్యమేనని సవివరంగా స్పష్టంచేశారు. అంశాల వారీగా ఈనాడు తప్పుడు రాతలను రాజశేఖర్ ఎండగట్టారు. ఆయన ఏమన్నారంటే.. వరల్డ్ బ్యాంకు ప్రాజెక్టుపై ఈనాడుకు అవగాహనలేదు.. జాతీయ విద్యా విధానంలో 5+3+3+4 విధానాన్ని కేవలం కరిక్యులమ్ వరకు మాత్రమే అమలుచేయాలని చెప్పిందని.. 3, 4, 5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయాలని ఎక్కడా చెప్పలేదని, ప్రపంచ బ్యాంకు ఒత్తిడికి తలొగ్గి టీచర్ల సంఖ్యను తగ్గించేందుకు విలీనం చేస్తున్నారంటూ ఈనాడు రాసింది. వాస్తవం ఏమిటంటే.. వరల్డ్ బ్యాంకు సహకారంతో అమలవుతున్న ప్రాజెక్టు మీద ఈనాడుకు అవగాహనలేదు. దానిపేరు సాల్ట్ (సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్). గత మూడేళ్లలో చేపట్టిన కార్యక్రమాల్లోని ప్రగతిని గమనించి ఆ ప్రభుత్వాలకు ఆర్థిక సహకారమిచ్చి మరింత ముందుకుపోయేలా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్లను అందిస్తోంది. గతంలో మాదిరిగా తాను ఎలాంటి జోక్యం చేసుకోకుండా కేవలం సాధించే ఫలితాల ఆధారంగా ఆర్థిక సహాయాన్ని అందించే కొత్త విధానాన్ని ప్రపంచబ్యాంకు చేపట్టింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులు 139 మంజూరు చేయగా అందులో ఏపీ ఒక్కటి. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సాధిస్తున్న పురోగతిని గమనించి ప్రపంచబ్యాంకు ఈ ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఇందులో ఎలాంటి షరతుల్లేవు. రాష్ట్ర విద్యారంగ చరిత్రలోనే ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడా రాలేదు. అయితే, ఈనాడులో ప్రపంచ బ్యాంకు ఒత్తిడిచేసి విలీనం చేయిస్తోందని తప్పుడు వార్త రాసింది. ఎన్ఈపీలో విద్యార్థులకు అన్ని సదుపాయాలనూ అందుబాటులోకి తెచ్చేలా వనరులన్నిటినీ వినియోగించుకోవాలని, అందుకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, ఆ దిశగా 5+3+3+4 విధానాన్ని అనుసరించాలని ఎన్ఈపీ 7.5 పేరాలో కేంద్రం స్పష్టంగా చెప్పింది. కానీ, దీనిపై అవగాహన లేకుండా ఈనాడు ప్రజలను తప్పుదోవపట్టించింది. చేరికల అంకెల్లోనూ అడ్డగోలు రాతలే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోయాయని తప్పుడు అంకెలతో కథనం రాశారు. అసలు చేరికల లెక్కలకు సంబంధించి కేంద్రం ప్రామాణికంగా నిర్దేశించిన యూడైస్ ప్లస్ గణాంకాల ఇంకా ఖరారు కాలేదు. ఇష్టమొచ్చిన సంఖ్యలు రాశారు. ఈనెల 14, 15 తేదీల్లో కేంద్ర విద్యాశాఖ దక్షిణాది రాష్ట్రాలతో వర్కుషాపును నిర్వహించాక ఈ గణాంకాలు ఖరారవుతాయి. ఈ ఏడాది లెక్కలు ఇంకా ఖరారుకానందున ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రసంగానికి గత ఏడాది గణాంకాలను అందించాం. యూడైస్ ప్లస్ ఏడాదికి ఒక్కసారే అప్డేట్ అవుతుంది. కానీ, రాష్ట్రంలో చైల్డ్ ఇన్ఫో పేరుతో రోజువారీ అప్డేషన్తో గణాంకాలు నిర్వహిస్తున్నాం. ఎక్కడినుంచో కొన్ని అంకెలను తీసుకుని ఈనాడు ప్రభుత్వంపై విషం చిమ్మింది. ఏ విద్యార్థీ బడిబయట ఉండరాదన్న ఉద్దేశంతో అమ్మఒడి సహ అనేక కార్యక్రమాలను ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రభుత్వం చేస్తోంది. చరిత్రలో ఎవరూ పెట్టని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టిపెట్టింది. ప్రతి పిల్లాడినీ బడిలో చేర్చేలా కసరత్తు చేశాం. రాష్ట్రం ఏర్పాటయ్యాక గణాంకాలు పరిశీలిస్తే.. 2014–15లో 72,32,771 చేరికలు కాగా 2015–16కు 69,07,004కు తగ్గింది. 2016–17లో 68,48,197, 2017–18లో 69,75,526, 2018–19లో 70,43,071లుగా చేరికలు ఉన్నాయి. ఇక 2019–20లో ఆ సంఖ్య 72,43,269లకు 2020–21లో 73,12,852కు పెరిగింది. 2021–22లో 72,45,640కు చేరింది. ఇక 2022–23లో సెప్టెంబర్ 30 వరకు 71,59,441లుగా చేరికలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 86,199 తగ్గింది. ఈ తగ్గడం ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు మైగ్రేషన్వల్ల 16,857, సీజనల్ మైగ్రేషన్వల్ల 38,951, మరణాలవల్ల 1,289 మంది చేరికలు తగ్గాయి. ఇక జనాభా తగ్గుదలవల్ల దేశవ్యాప్తంగా ఒకటో తరగతిలో చేరికలు తగ్గాయి. మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా 29,102 మంది తగ్గారు. సీజనల్ మైగ్రేషన్ అయిన వారిని తిరిగి స్కూళ్లలో చేర్చేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 12వేల మంది చేరారు. చేరికలు ఐదు లక్షలకు పైగా పెరిగాయి ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు చూస్తే.. వాటిపై శ్రద్ధ గత ప్రభుత్వానికి, ఇప్పటికి ప్రభుత్వానికి మధ్యనున్న తేడా తెలుస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో 2014–15లో 41,83,441 మంది పిల్లలుండగా 2015–16లో 39,24,078కు, 2016–17లో 37,57,000లకు, 2017–18లో 37,29,000లకు, 2018–19లో 37,20,988లకు చేరింది. అదే 2019–20లో 38,18,348లకు పెరగ్గా 2020–21లో 43,42,874లకు చేరింది. అంటే ఏకంగా 5 లక్షల మేర చేరికలు అదనంగా పెరిగాయి. 21–22లో 44,29,569లు కాగా 2022–23లో అది 40,31,239లుగా ఉంది. కరోనావల్ల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి చేరికలు పెరిగాయని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే, ఈ చేరికల్లో ఏపీ 14 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇతర రాష్ట్రాలు మనకన్నా తక్కువగా ఉన్నాయి. అసర్ నివేదిక కూడా ఇదే చెబుతోంది. జనాబా తగ్గుదలవల్ల కూడా చేరికలు తగ్గుతున్నట్లు ఎన్సీఈఆర్టీ నివేదిక చెబుతోంది. 2025 నాటికి 14 శాతం మేర తగ్గుతుందని నివేదించింది. ఇక 2019–20లో ప్రభుత్వ స్కూళ్లలో 38,18,348 మంది పిల్లలుండగా ప్రైవేటులో 32,28,681 మంది ఉన్నారు. అదే ప్రస్తుత విద్యాసంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్లలో 40,31,239 మంది పిల్లలున్నారు. అంటే రెండు లక్షల మంది అదనంగా పెరిగారు. అదే ప్రైవేటు స్కూళ్లలో 2019–20తో పోలిస్తే 2,12,407 చేరికలు తగ్గాయి. ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు తగ్గాయని ప్రైవేటులోకి వెళ్లిపోతున్నారని ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. కరోనా పరిస్థితులు తగ్గి ఆర్థిక స్థితి కొంత పెరిగి తిరిగి ప్రైవేటులోకి వెళ్లిపోతున్నారని అనుకున్నా అందరూ ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లడంలేదని ఈ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంతో పాటు పథకాలు, ఇతర కార్యక్రమాలవల్ల తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగింది. ఐఏఎస్ అధికారులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేరుస్తున్నారంటే రాష్ట్రంలో విద్యారంగంలో ప్రమాణాలు ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయో స్పష్టమవుతోంది. ఇక బెండపూడి స్కూలులో ప్రసాద్ అనే టీచర్ చేసిన ప్రయత్నంవల్ల విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. దీన్ని రాష్ట్రంలోని ఇతర స్కూళ్లలోనూ అమలుచేసేలా చర్యలు చేపడుతున్నాం. ఇంత మంచిగా కార్యక్రమాలు జరుగుతూ విద్యారంగం అభివృద్ధి సాధిస్తుంటే వెనుకబడిపోయిందని ఈనాడు తప్పుడు రాతలు రాయడం సరికాదు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వెనుక ఈనాడుకు నేరపూరిత ఉద్దేశాలున్నాయి. ప్రైవేటు స్కూళ్లకు వెళ్లమనా ఈనాడు ఉద్దేశ్యం? ఆంగ్ల మాధ్యమంలో ఒక్క వాక్యాన్నీ చదవలేకపోతున్నారని రాశారు. కానీ, అది అవాస్తవం. ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో తెలుగు మీడియంలో 1,08,543 మంది హాజరైతే 43.97 పాసయ్యారు. ఇంగ్లీషు మీడియంలో 4,22,743 మంది రాస్తే 77.55 శాతం పాసయ్యారు. ఈ పరీక్షలను ఎలాంటి వాతావరణంలో నిర్వహించామో అందరికీ తెలుసు. మాస్కాపీయింగ్ చేసిన వారిని, దానికి సహకరించిన టీచర్లను కూడా సస్పెండ్ చేశాం. ఇంత పకడ్బందీ నిర్వహణలోనూ ఇంగ్లీషు మీడియం పిల్లలు పాస్ అత్యధికంగా ఉంది. ఏదీ రాయడం, చదవడం రాకుండానే ఇంతమంది పాసవుతారా? అన్నది అర్థం చేసుకోవాలి. ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజలను మిస్లీడ్ చేయడం వెనుక ఈనాడు ఉద్దేశమేమిటి? ప్రభుత్వ స్కూళ్లు నిర్వీర్యం అయ్యాయంటూ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లమని పిల్లలకు చెబుతున్నారా? రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ప్రపంచస్థాయి పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. -
వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు పేరే సాల్ట్
-
జగనన్న విద్యా కానుక.. 'ఇక మరింత మెరుగ్గా'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న వివిధ వస్తువులు మరింత నాణ్యంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిర్ణీత ప్రమాణాలకు ఎక్కడా తగ్గకుండా వస్తువులను పంపిణీ చేయించేలా పాఠశాల విద్యా శాఖ దృష్టి సారించింది. జగనన్న విద్యా కానుక వస్తువులకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అక్కడక్కడ తలెత్తిన చిన్న చిన్న లోపాలు కూడా భవిష్యత్తులో ఉండకుండా చూసుకోవాలని నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులందరికీ మరింత నాణ్యమైన వస్తువుల పంపిణీకి ఇప్పటి నుంచే సన్నాహాలు చేపట్టింది. ఏటేటా పెరుగుతున్న నాణ్యత ► గతంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, 2 జతల యూనిఫారం మాత్రమే ఇచ్చేవారు. అదీ విద్యా సంవత్సరం ఆరంభమై ఏడెనిమిది నెలలు గడిచినా అందేవి కావు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారం అందించేలా చర్యలు తీసుకున్నారు. కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు దీటుగా పాఠ్య పుస్తకాలు, యూనిఫారంతో పాటు నోట్సులు, వర్కు బుక్కులు, షూలు, సాక్సులు, బెల్టులు, బ్యాగులు అందించేలా జగనన్న విద్యా కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ► రెండు జతల యూనిఫారం కాకుండా మూడు జతలు అందిస్తున్నారు. దీనికి అదనంగా విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీలను పంపిణీ చేయిస్తున్నారు. 2020–21లో 42,34,322 మంది విద్యార్థులకు రూ.648.10 కోట్లతో, 2021–22లో 45,71,051 మందికి రూ.789.21 కోట్లతో, 2022–23లో 4,740,421 మందికి రూ.931.02 కోట్లతో జగనన్న విద్యా కానుకను అందించారు. మూడేళ్లలో ఈ వస్తువుల కోసం రూ. 2,368.33 కోట్లు వెచ్చించారు. ► అయితే వేలాది స్కూళ్లలో లక్షలాది మంది విద్యార్థులకు పంపిణీకి సంబంధించిన కార్యక్రమం కావడంతో క్షేత్ర స్థాయిలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు తలెత్తడం సహజం. వాటిని ఎప్పటికప్పుడు విద్యా శాఖ అధికారులు పరిష్కరిస్తున్నారు. మౌలికమైన అంశాల్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాటినీ పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు. ► ఇలా ఏటేటా ఈ పథకాన్ని మరింత పగడ్బందీగా అమలు చేసేందుకు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. తాజాగా వారి నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఇకపై మరింత నాణ్యమైన వస్తువులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇకపై మార్పులు ఇలా.. ► అన్ని ఊళ్లలో ఒక్కో తరగతిలో ఒకరో ఇద్దరో పిల్లలు లావుగా ఉండొచ్చు. వారికి యూనిఫాం క్లాత్ సరిపోకపోయి ఉండొచ్చు. ఇకపై ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని అందరికీ సరిపడా రీతిలో మూడు జతల యూనిఫారం క్లాత్ ఇచ్చేందుకు చర్యలు. ► కుట్టు కూలీ మరింత పెంచి ఇచ్చే విషయమూ విద్యా శాఖ పరిశీలన చేస్తోంది. ► బ్యాగుల పరిమాణంపై నిపుణుల సూచనల మేరకు మార్పులు చేయిస్తోంది. 1–5 తరగతుల విద్యార్థులకు మీడియం సైజు, 6–10 తరగతుల విద్యార్థులకు పెద్ద సైజు బ్యాగులు అందించనున్నారు. ఈసారి బ్యాగు వెడల్పు పెంచనున్నారు. ► బ్యాగులో నోట్బుక్కులు, పాఠ్య పుస్తకాలు అన్నీ పట్టేలా కొత్త టెండర్లో స్పెసిఫికేషన్లు సవరించనున్నారు. ► పిల్లల షూ సైజులను తీసుకొనేందుకు మండల స్థాయిలో ఆయా కంపెనీల ద్వారా షూ మేళాలు నిర్వహించేలా చేయడమో, లేదా కూపన్లు అందించి ఆయా కంపెనీల దుకాణాలలో వాటిని రీడీమ్ చేసుకొని షూలు పొందేలా చేయడమో చేయాలని ప్రతిపాదించారు. ► విద్యా కానుక పంపిణీలో జాప్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేకుండా ఇప్పటి నుంచే విద్యా శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. బడ్జెట్ ఎస్టిమేట్లను త్వరగా పూర్తి చేసి ఆర్థిక అనుమతులు పొందడం, టెండర్ డాక్యుమెంట్లు ఫైనల్ చేయడం, టెండర్లను పిలవడం, కంపెనీల ఎంపిక, వర్కు ఆర్డర్ల జారీ, ఒప్పందాలు చేసుకోవడం వంటివి ఈ ఏడాది నవంబర్ చివరికల్లా ముగించాలని భావిస్తున్నారు. ► వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారానికి జిల్లా.. మండల స్థాయికి ఆయా వస్తువులను చేర్చడం. ఏప్రిల్ 15 నాటికి కిట్ల రూపంలో వాటిని సిద్ధం చేయడం. పాఠశాలలు తెరిచే రోజున విద్యార్థులందరికీ వాటిని పంపిణీ చేయించడం. వచ్చే ఏడాది విద్యా కానుక అమలు కోసం రూ.958.34 కోట్లు అవసరమవుతాయని విద్మాయ శాఖ అంచనా వేసింది. తిరుపతికి చెందిన వంశీ అనే విద్యార్థి ఇప్పుడు ఆరవ తరగతి చదువుతున్నాడు. ఒబేసిటీ కారణంగా ఈ విద్యార్థిలావుగా ఉంటాడు. దీంతో ప్రభుత్వం ఈ ఏడాది ఇచ్చిన యూనిఫారంతో మూడు జతల డ్రస్ కుట్టించడం వీలు పడలేదు. రెండు జతలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉండొచ్చు. ఇలా ఒకరిద్దరికి క్లాత్ సరిపోనంత మాత్రాన.. అందరికీ సరిపోలేదని ప్రచారం చేసే ప్రబుద్ధులున్నారు. అందువల్ల ఇకపై ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
AP: మనబడి నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా సర్కారీ స్కూళ్లు
సాక్షి, అమరావతి: విద్యా సంస్కరణల్లో భాగంగా రూ.16 వేల కోట్లకు పైగా వెచ్చించి ప్రభుత్వ విద్యా సంస్థలను నాడు – నేడు ద్వారా కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక సమర్థంగా నిర్వహణపై దృష్టి సారించింది. అభివృద్ధి పనులు చిరకాలం మన్నికతో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు మౌలిక లక్ష్యమైన విద్యా ప్రమాణాలు, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా చర్యలు చేపడుతోంది. అస్తవ్యస్తంగా, దిశానిర్దేశం లేకుండా ఉన్న అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలను గాడిలో పెడుతోంది. ఇవి రెండూ ప్రత్యేక పర్యవేక్షణతో ముందుకు సాగేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు ఇవన్నీ పాఠశాల విద్యాశాఖ అధికారులు, టీచర్లతో సాగగా ఇప్పుడు ఇతర శాఖలకూ బాధ్యతలు అప్పగిస్తోంది. మండల స్థాయిలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను వేర్వేరుగా పర్యవేక్షించేందుకు ఇద్దరు చొప్పున ఎంఈవోలను ప్రభుత్వం నియమిస్తోంది. ఇందుకోసం అదనంగా 692 ఎంఈవో పోస్టులను ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన విషయం తెలిసిందే. టీచర్లకు సాయంగా సచివాలయ సిబ్బంది ఇప్పటివరకు పాఠశాలలకు సంబంధించి విద్యా వ్యవహారాలు, పాలనా వ్యవహారాలను విద్యాశాఖకు చెందిన టీచర్లు, ఎంఈవోలు, ఇతర అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఒకపక్క విద్యా వ్యవహారాలు, మరోపక్క అడ్మినిస్ట్రేటివ్ అంశాల బాధ్యతల వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. మండల విద్యాధికారుల పోస్టులు న్యాయ వివాదాలతో దశాబ్ద కాలంగా భర్తీ కాకపోవడంతో మండల స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వం విద్యారంగంపై రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ లక్ష సాధనలో కీలకమైన క్షేత్రస్థాయి పర్యవేక్షణ కరవైంది. ఈ అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లలో అభివృద్ధి పనులతో పాటు పిల్లల ఆరోగ్య సంరక్షణ, హాజరు, చదువులపై దృష్టి పెట్టే బాధ్యతను సచివాలయాల సిబ్బందికి అప్పగించాలని నిర్ణయించింది. తమ పరిధిలోని పాఠశాలల టీచర్లకు విధి నిర్వహణలో వీరు సహకారం అందించనున్నారు. క్రమ పద్ధతిలో నిరంతరం.. గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్య, సంక్షేమ సహాయకుడు, ఏఎన్ఎం, మహిళా పోలీసులకు స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తోంది. ఎవరెవరు ఏ పనులు చేయాలి? ఎప్పుడెప్పుడు ఆయా స్కూళ్లను పర్యవేక్షించాలో జాబ్ చార్టు రూపొందించింది. స్కూళ్ల పర్యవేక్షణ ఒక క్రమపద్ధతిలో నిరంతర ప్రక్రియగా కొనసాగేలా దీన్ని సిద్ధం చేశారు. కమాండ్ కంట్రోల్కు సమాచారం.. సచివాలయాల సిబ్బంది స్కూళ్లను పరిశీలించిన అనంతరం ఆయా అంశాలను ఆన్లైన్లో నిర్ణీత లాగిన్ ద్వారా వెబ్సైట్లో పొందుపరుస్తారు. వాటికి సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేస్తారు. వారిచ్చే సమాచారం ప్రకారం ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారి వాటిని పరిష్కరిస్తారు. అంశాల తీవ్రతను బట్టి పరిష్కారానికి సమయాన్ని నిర్దేశిస్తారు. దీనిపై పైస్థాయి అధికారులు పునఃపరిశీలన చేస్తారు. ఇదంతా ఎడ్యుకేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్తుంది. వీటితో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నెంబర్ (14417), స్పందన ద్వారా అందే ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు. హాజరుపై సంక్షిప్త సందేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల గైర్హాజరును నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్కూలుకు రాని విద్యార్థుల గురించి తల్లిదండ్రులు, ఆయా తరగతుల టీచర్ల ఫోన్లకు కార్పొరేట్ స్కూళ్ల తరహాలో సంక్షిప్త సందేశాన్ని పాఠశాల విద్యాశాఖ అందిస్తోంది. వరుసగా మూడు రోజుల పాటు స్కూలుకు రాని విద్యార్థి సమాచారాన్ని వలంటీర్ల ఫోన్కూ సంక్షిప్త సందేశాల ద్వారా చేరవేస్తున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చేలా ఈ చర్యలు దోహదం చేస్తున్నాయి. -
AP: ఇక డిజిటల్ బడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి విద్యార్ధికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఫౌండేషన్ స్థాయి నుంచి హైస్కూల్ ప్లస్ స్థాయి వరకు స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే పూర్తి చేసింది. ఫౌండేషన్ నుంచి హైస్కూల్ ప్లస్ వరకు... ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్యావిధానం లేకపోవడంతో 3 నుంచి 6 ఏళ్ల వయసు పిల్లలకు సరైన పూర్వ ప్రాథమిక పరిజ్ఞానం అందడం లేదు. నేరుగా 1వ తరగతిలో చేరుతున్న విద్యార్ధులు స్కూలు వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతోంది. దీనివల్ల ఒకటో తరగతి వయసుకు అలవడాల్సిన అక్షర, సంఖ్యా పరిజ్ఙానం కొరవడుతోంది. ఫలితంగా పై తరగతులకు వెళ్లే కొద్దీ వెనుకబాటుకు గురవుతున్నారు. ప్రథమ్ సంస్థ, న్యాస్, రాష్ట్ర స్థాయి సర్వేల్లో ఇవే అంశాలు వెల్లడయ్యాయి. దీన్ని సరిదిద్దేందుకు పూర్వ ప్రాథమిక విద్యకు వీలుగా ఫౌండేషనల్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థాయి నుంచే చిన్నారులకు డిజిటల్ సాంకేతికతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆసక్తికరంగా బోధనకు ఏర్పాట్లు చేసింది. ఫౌండేషనల్ స్థాయి నుంచి ఇంటర్ స్థాయి అయిన హైస్కూల్ ప్లస్ స్కూళ్ల వరకు డిజిటల్ తరగతుల బోధనను అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ టీచర్లకు శిక్షణ డిజిటల్ పరికరాల ద్వారా విద్యా బోధన, ఉపకరణాల వినియోగంపై పలువురు ప్రభుత్వ టీచర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. డిజిటల్ డివైస్లను సక్రమంగా వినియోగించడంలో 30 శాతం మంది పూర్తిస్థాయిలో విజయవంతమయ్యారు. 20 శాతం మందికి మరికొంత శిక్షణ అవసరమని గుర్తించారు. మిగతా 50 శాతం మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. తొలిదశ స్కూళ్లలో మార్చి నాటికి.. మూడు దశల్లో 45,328 ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేయనున్నారు. తొలిదశ కింద 15,694 స్కూళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తారు. రెండో దశ కింద 2023–24లో 14,331 స్కూళ్లలో, మూడో దశలో 15,303 స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులను సిద్ధం చేస్తారు. తొలిదశ స్కూళ్లలో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటును మార్చి, ఏప్రిల్ నాటికి పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తేనున్నారు. పాఠశాలలకు ఇంటర్నెట్ డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బ్రాడ్ బ్యాండ్/లీజ్డ్ లైన్, టెలిఫోన్ లైన్ విత్ మోడెమ్, యూఎస్బీ మోడెమ్/డాంగిల్/పోర్టబుల్ హాట్స్పాట్, వీఎస్ఏటీ తదితరాల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే 2,658 స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం ఉండగా మూడు నెలల్లో మిగతా స్కూళ్లలోనూ అందుబాటులోకి తేనున్నారు. డిజిటల్ బోధన ఇలా.. తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీ) ఏర్పాటు చేసి డిజిటల్ విద్యాబోధన నిర్వహిస్తారు. విద్యాశాఖ అంచనాల ప్రకారం 45,328 స్కూళ్లలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు రూ.511.28 కోట్లు వ్యయం కానుంది. -
AP: మండలానికి ఇద్దరు ఎంఈవోలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో చేపట్టిన విద్యారంగ సంస్కరణల్లో భాగంగా మరో కీలక నిర్ణయం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. పాఠశాల విద్యా ప్రమాణాలను పెంపొందించేలా ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున మండల విద్యాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం జీవో 154 జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఒక ఎంఈవో విద్యా వ్యవహారాలు (అకడమిక్) పర్యవేక్షించనుండగా మరో ఎంఈవో పరిపాలన (అడ్మినిస్ట్రేటివ్) బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందుకోసం మండల విద్యాధికారుల పోస్టులను రెట్టింపు చేస్తూ కొత్తగా 692 పోస్టులను మంజూరు చేశారు. తద్వారా దశాబ్దాలుగా ఉపాధ్యాయులు నిరీక్షిస్తున్న ఎంఈవో పోస్టుల భర్తీకి మార్గం సుగమం కావడంతోపాటు వివిధ యాజమాన్య స్కూళ్ల వివాదానికి తెర పడింది. ఇది చరిత్రాత్మక ఘట్టమని, గతంలో ఏ ప్రభుత్వమూ సాహసించని విధంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. పటిష్ట విద్యా వ్యవస్థకు పునాది రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పునాది స్థాయి నుంచి బలోపేతం చేస్తూ కీలక సంస్కరణలతో పాటు మౌలిక సదుపాయాలతో పాఠశాలలను తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రైమరీ నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తూ రూ.16 వేల కోట్లతో మనబడి నాడు – నేడు ద్వారా మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. తొలిదశలో ఇప్పటికే 15,715 స్కూళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రెండో విడత స్కూళ్ల పనులు కూడా ప్రారంభించింది. ఫౌండేషన్ విద్య ప్రవేశపెడుతూ ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులమ్ను మార్పు చేయడంతోపాటు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు వీలుగా 1.80 లక్షల మంది ఉపాధ్యాయులకు ఇప్పటికే తర్ఫీదు ఇచ్చింది. విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉండేలా బైలింగ్యువల్ (ద్విభాషా) పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. అత్యున్నత ప్రమాణాలు నెలకొనేలా సీబీఎస్ఈ బోధన అనుసరిస్తోంది. విద్యార్ధులకు జగనన్న విద్యాకానుక అందచేస్తోంది. పోటీ ప్రపంచంలో రాణించేలా డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తోంది. మరోపక్క ప్రఖ్యాత బైజూస్ సంస్థ నుంచి అత్యుత్తమ కంటెంట్ విద్యార్ధులకు ఉచితంగా అందించేలా చర్యలు చేపట్టింది. 4వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్ధులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎనిమిదో తరగతి నుంచే ట్యాబ్లు సమకూరుస్తోంది. ఏటా నాలుగు లక్షల మందికి పైగా విద్యార్ధులతోపాటు టీచర్లకు కూడా ట్యాబ్లను పంపిణీ చేయనుంది. వీటికోసం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధిక బడ్జెట్ను విద్యారంగానికి కేటాయిస్తోంది. మౌలిక సదుపాయాలు పెంచడమే కాకుండా విద్యా ప్రమాణాల్లో గుణాత్మక మార్పుల కోసం ప్రాధాన్యమిస్తోంది. క్షేత్రస్థాయిలో పక్కా పర్యవేక్షణ పాఠశాల విద్యలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలవుతుండడంతో ఎంఈవోలు, ఇన్చార్జ్లపై భారం పెరిగింది. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను ఒక్కరే పర్యవేక్షించడం కష్టంగా మారుతోంది. విద్యారంగ సంస్కరణలు సత్ఫలితాలనివ్వాలంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కీలకం. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలకు వేర్వేరుగా ఎంఈవోలను నియమించాలని నిర్ణయించింది. ప్రతి మండలంలో ఎంఈవో–1, ఎంఈవో–2 పోస్టులుండేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో 679 మండలాల్లో ఒక్కో మండలానికి రెండు చొప్పున 1,358 ఎంఈవో పోస్టులను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం 666 ఎంఈవో పోస్టులుండగా కొత్తగా 692 పోస్టులను మంజూరు చేసింది. దీనికి ప్రతిగా 1,145 క్రాఫ్ట్, డ్రాయింగ్, ఆర్ట్ టీచర్ పోస్టులను సర్దుబాటు చేయనుంది. ఎంఈవో పోస్టులకు స్కేల్ పే రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో హర్షం ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంపై అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నారు. ► మండలానికి రెండు ఎంఈవో పోస్టులు ఏర్పాటు చేస్తూ కొత్తగా 692 ఎంఈవో పోస్టులను మంజూరు చేయడం విద్యాశాఖ చరిత్రలో మరపురాని రోజు. – ఎమ్మెల్సీ కల్పలత ► కొత్తగా 692 ఎంఈవో పోస్టులను మంజూరు చేయడం చరిత్రాత్మకం. నా 23 ఏళ్ల సర్వీసులో ఇది ఎన్నడూ ఊహించనిది. ఉపాధ్యాయులందరికీ సంతోషకరమైన రోజు ఇది. – బి.ప్రతాప్రెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ► విద్య, పరిపాలనా కార్యక్రమాల పర్యవేక్షణకు వీలుగా మండలానికి రెండు ఎంఈవో పోస్టుల ఏర్పాటు శుభవార్త. దీనిద్వారా విద్యారంగ పునాదులు మరింత పటిష్టమవుతాయి. – డి.దేవానందరెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ► కొత్తగా 692 ఎంఈవో పోస్టుల మంజూరుతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వివాదానికి తెర పడుతుంది. ఉపాధ్యాయుల పదోన్నతులకు మార్గం సుగమం కావడంతోపాటు విద్యారంగం బలోపేతం అవుతుంది. – కాకర్ల వెంకటరామిరెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ ► మండలానికి ఇద్దరు ఎంఈవోల నియామకానికి వీలుగా కొత్త పోస్టుల మంజూరు హర్షణీయం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – సీకే వెంకటనాథ్రెడ్డి, గెడ్డం సుధీర్, వైఎస్సార్ టీఎఫ్ ► రెండు ఎంఈవో పోస్టుల ఏర్పాటు హర్షణీయం. ఈ తరహాలోనే అర్బన్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (యూఈవో) పోస్టులను ఏర్పాటు చేయాలి. – టి.వెంకటరెడ్డి, రవి సిద్దార్ధ, ఏపీ ఎంటీఎఫ్ ► ప్రభుత్వ నిర్ణయం ఆనందదాయకం. సర్వీసు రూల్స్ రూపొందించి ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు దామాషా పద్ధతిలో పదోన్నతులు కల్పించాలి. – గిరిప్రసాద్రెడ్డి, మల్లు శ్రీధర్రెడ్డి, ఎం.కృష్ణయ్య, కరుణానిధిమూర్తి, పీఆర్టీయూ ► ఉపాధ్యాయుల దశాబ్దాల కలను సీఎం జగన్ నెరవేర్చారు. – కె.హరికృష్ణ, ఎం.శ్రీనివాసరావు, ఎన్టీఏ ► మండలానికి ఇద్దరు ఎంఈవోల నియామకంతో పాఠశాల విద్య బలోపేతమై విద్యార్ధులకు మేలు జరుగుతుంది. – ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, ఎస్.సింహాచలం (పోర్టో), శ్రావణ్కుమార్, బాలాజీ (ఆపస్) ► దశాబ్దాలుగా టీచర్లు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి వీలుగా రెండు చొప్పున ఎంఈవో పోస్టులను మంజూరు చేయడం సంతోషకరం. సీఎం జగన్కు కృతజ్ఞతలు. – సీహెచ్ కృష్ణమోహన్రావు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం. ► రెండో ఎంఈవో పోస్టు మంజూరు చేయడం మంచి విధానం. ఇందుకోసం ఇతర పోస్టులు రద్దు చేయడం సరికాదు. –జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి, ఏపీటీఎఫ్ ► విద్యారంగంలో 25 ఏళ్లుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు హర్షణీయం. – సరికొండ సతీష్, విద్యారంగ సంస్కరణల వేదిక వికాసం ► ప్రభుత్వ నిర్ణయంతో టీచర్లతోపాటు విద్యా ప్రమాణాలు మెరుగుపడి విద్యార్ధులకు ప్రయోజనం చేకూరుతుంది. – శరత్చంద్ర, సురేష్బాబు, బహుజన్ టీచర్స్ అసోసియేషన్ -
ఉద్యోగాలు 4... దరఖాస్తులు 675!
అనంతపురం: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ పర్యవేక్షణకు సంబంధించి నాలుగు కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తం 675 దరఖాస్తులు అందినట్లు డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధి ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మధ్యాహ్న భోజన పథకం డేటా అనలిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోస్టుకు మొత్తం 166 దరఖాస్తులు, డేటా ఆపరేటర్ ఉద్యోగానికి 199 దరఖాస్తులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించి డేటా అనలిస్ట్కు 122 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్కు 188 మంది దరఖాస్తు చేశారు. (చదవండి: ఆస్తి కోసం అంధురాలిపై హత్యాయత్నం) -
పీజీటీ, టీజీటీలపై కఠిన చర్యలొద్దు
సాక్షి, అమరావతి: మోడల్ స్కూళ్లకు అనుబంధంగా ఉన్న బాలికల హాస్టళ్ల వార్డెన్లు వారాంతపు సెలవు తీసుకున్నప్పుడు ఆ బాధ్యతలను రొటేషన్ పద్ధతిపై నిర్వర్తించేందుకు ముందుకు రాని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ)పై కఠిన చర్యలేవీ తీసుకోవద్దని హైకోర్టు పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. వార్డెన్ విధులు నిర్వర్తించాలని ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. వార్డెన్ విధులకు సిద్ధమైన పీజీటీ, టీజీటీలకే బాధ్యతలు అప్పగించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు రోజున అసలు వార్డెన్ స్థానంలో పీజీటీ, టీజీటీలు పనిచేయాలన్న నిబంధన కఠినమైనదే అయినప్పటికీ, ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ 1996లోని రూల్ 10(ఎ) ప్రకారం యజమాని ఆదేశాలను ఉద్యోగి పాటించి తీరాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. హాస్టళ్ల నిర్వహణకు అవసరమైన పోస్టులను సృష్టించి, అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు తగిన యత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా హాస్టల్ డ్యూటీ నుంచి పీజీటీ, టీజీటీలకు విముక్తి కల్పించాలన్నారు. వార్డెన్లు వారాంతపు సెలవు తీసుకున్నప్పుడు ఆ బాధ్యతలను రొటేషన్ పద్ధతిలో నిర్వర్తించాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ పలువురు పీజీటీ, టీజీటీలు దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ మన్మథరావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది పి.రాజేష్ బాబు వాదనలు వినిపిస్తూ, విద్యా శాఖాధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్ చట్ట విరుద్ధమని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ తరఫున న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులైన పీజీటీ, టీజీటీలు సర్వీసు రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనన్నారు. వారు నెలకో, రెండు నెలలకో ఓ రోజున వార్డెన్గా పని చేయాల్సి ఉంటుందన్నారు. -
నాడు–నేడు దేశానికే ఆదర్శం
ఒంగోలు మెట్రో: ఆధునిక సౌకర్యాల నడుమ పిల్లలు చదువుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మనబడి నాడు–నేడు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. మనబడి నాడు–నేడు రెండో విడతకు సంబంధించిన అవగాహన సదస్సు మంగళవారం ఒంగోలులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధనవంతుల పిల్లలతో సమానంగా పేదల పిల్లలు కూడా ఆధునిక సౌకర్యాలు, తరగతి గదుల్లో విద్యనభ్యసించాలనే ఆశయంతో సీఎం జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారని చెప్పారు. గతంలో విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే.. సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు వేచి ఉండాల్సిన దయనీయ పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. అలాంటి కష్టాలకు ప్రభుత్వం చరమగీతం పాడిందన్నారు. ఇంటర్ విద్య కమిషనర్ ఎంవీ శేషగిరిరావు మాట్లాడుతూ.. నిర్ణీత గడువైన ఆరు నెలల్లోగా పనులు నాణ్యంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పథకం ఆచరణ గురించి ప్రత్యేక సలహాదారు ఆకునూరి మురళి వివరించారు. సమావేశంలో కలెక్టర్ దినేష్కుమార్, సమగ్ర శిక్ష చీఫ్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు, నాడు నేడు నోడల్ అధికారి సుశీల, ఇంటర్ విద్య ఆర్జేడీ సుబ్బారావు, అధికారులు ఎస్వీ సుబ్బారావు, కె.ఆంజనేయులు, సైమన్ విక్టర్, ప్రసాదరావు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ నాడు–నేడు స్కూళ్లలో.. నిరంతర పరిశీలన
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు ద్వారా పనులు పూర్తైన పాఠశాలల్లో నిరంతరం ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. స్కూళ్లలో కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అన్నది పరిశీలన చేయాలని, అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేపట్టాలని నిర్దేశించారు. నెలకు ఒకసారి తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. స్కూళ్ల మెయింటెనెన్స్ ఫండ్ను వినియోగించుకుని నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలన్నారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా తెలియ చేసేందుకు వీలుగా ఏర్పాటైన టోల్ఫ్రీ నంబర్ను అందరికీ తెలిసేలా ప్రదర్శిస్తూ పాఠశాలల్లో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి 14417 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. పాఠశాల విద్య, నాడు–నేడు, విద్యాకానుక, బైజూస్ కంటెంట్తో ట్యాబ్ల పంపిణీ, తరగతి గదుల డిజిటలైజేషన్పై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాకానుక కింద పిల్లలకు ఇచ్చే బ్యాగుల నాణ్యతను ఈ సందర్భంగా సీఎం స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందచేసే బ్యాగులు మరింత నాణ్యంగా, మన్నికగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాడు – నేడు కింద పనులు పూర్తైన స్కూళ్లలో ఆడిట్కు సంబంధించిన వివరాలను అధికారులు అందచేశారు. స్కూళ్లలో సౌకర్యాలకు సంబంధించి గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. స్కూళ్లలో నాడు–నేడు పనులు, ట్యాబ్ల పంపిణీపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ తల్లిదండ్రుల కమిటీలు క్రియాశీలకం స్కూళ్ల నిర్వహణలో తల్లిదండ్రుల కమిటీలను నిరంతరం క్రియాశీలకం చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచూ వారితో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎంఈవోలకు అకడమిక్, స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు మండల విద్యాశాఖ అధికారుల్లో (ఎంఈవో) ఒకరికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణ అంశాల బాధ్యతలను అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులు కూడా భాగస్వాములు కానున్నారు. వెల్ఫేర్–ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ప్రతివారం స్కూళ్లను సందర్శించనున్నారు. నెలకు ఒకసారి ఏఎన్ఎంలు సందర్శించనున్నారు. స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోలతో సహా సచివాలయ సిబ్బంది అప్లోడ్ చేయనున్నారు. అధికారులు వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. ఎవరెవరు ఏం చేయాలో నిర్దిష్టంగా ఎస్వోపీలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. విలేజ్ క్లినిక్ పరిధిలోకి పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత నిర్ధారణ గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత నిర్ధారణను విలేజ్ క్లినిక్ పరిధిలోకి తేవాలని సూచించినట్లు ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేశారు. వీటిపై ఎప్పటికప్పుడు విలేజ్ క్లినిక్స్ పంపే నివేదికలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా అంటువ్యాధులు, రోగాలను చాలావరకు నివారించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. 5,18,740 ట్యాబ్ల కొనుగోలు టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. వీరి కోసం 5,18,740 ట్యాబ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ట్యాబ్ల్లో 8వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి ఇవ్వనున్నారు. ఏటా స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. యూనిఫామ్స్ కుట్టు కూలీ డబ్బులను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. మార్చికి తొలి దశ తరగతి గదుల డిజిటలైజేషన్ తరగతి గదుల డిజిటలైజేషన్లో భాగంగా స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ టీవీలను సమకూర్చటంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. 72,481 స్మార్ట్ టీవీ యూనిట్లు అవసరమని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. దశలవారీగా తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకు దాదాపు రూ.512 కోట్లకుపైగా వ్యయం కానుందని అంచనా. మనబడి నాడు – నేడు తొలిదశ పనులు పూర్తైన స్కూళ్లలో వచ్చే ఏడాది మార్చి నాటికి తరగతి గదుల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని సీఎం జగన్ నిర్దేశించారు. అందుకు అనుగుణంగా నవంబర్లో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. అన్ని చోట్లా ఇంటర్నెట్ అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీలతో సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్లో కూడా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తేవాలని సూచించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంటర్ విద్య కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ.మురళి తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతిలోకి ఉచిత ప్రవేశాలు
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీలు, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 6 శాతం సీట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతి విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తున్నామన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను డీఈవోల ద్వారా ఆయా పాఠశాలల యాజమాన్యాలకు పంపినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు కూడా సమాచారం అందించామన్నారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ నెల 12లోపు ప్రవేశాలు పూర్తి చేయాలన్నారు. ఆ తేదీలోపు చేరని వారు అడ్మిషన్లు కోల్పోతారన్నారు. విద్యార్థుల జాబితాను cse.ap.gov.in/DSE/లో ఉంచామన్నారు. ఈ విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ తదితర సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
ఫోన్ యాప్ ద్వారానే టీచర్ల హాజరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ మినహా అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ సెప్టెంబర్ 1 నుంచి ఇంటిగ్రేటెడ్ అటెండెన్స్ మొబైల్ యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యా శాఖ మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. ఫోన్ యాప్ ద్వారా మాత్రమే ఉపాధ్యాయులు హాజరును వేయాలని తెలిపింది. వీరితోపాటు పాఠశాల విద్యా శాఖ నియంత్రణలో ఉన్న అన్ని కార్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్లో హాజరు నమోదు చేయాలని వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి ఏ కార్యాలయాల్లోనూ మాన్యువల్ హాజరును నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. వికలాంగుల సంక్షేమ శాఖ నిబంధనల ప్రకారం.. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందని వివరించింది. వారు ప్రత్యేకంగా మాన్యువల్ రిజిస్టర్లలో హాజరు నమోదు చేయాలని పేర్కొంది. కాగా, ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని నెల రోజుల్లో అన్ని విభాగాల్లో అమలు చేయనున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతే.. ఆండ్రాయిడ్ ఫోన్లేని టీచర్లు, ఉద్యోగులు తమ హాజరును హెడ్మాస్టర్ లేదా ఇతర ఉపాధ్యాయుల మొబైల్స్ ద్వారా నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉపాధ్యాయులు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్లను బుధవారంలోపు పూర్తి చేయాలని తెలిపింది. యాప్ ద్వారా హాజరు నమోదు.. విద్యా శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, జోన్, జిల్లా కార్యాలయాలు, డైట్స్, ఎంఈవో తదితర కార్యాలయాలకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరు నమోదు కోసం యాప్ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలని పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలు, హెడ్మాస్టర్లను ఆదేశించింది. హాజరును క్రమం తప్పకుండా యాప్ ద్వారా నమోదు చేసేలా చూడాలని పేర్కొంది. -
AP: గుడ్న్యూస్! 10 వేల మందికి పైగా టీచర్లకు పదోన్నతి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదివేల మందికిపైగా ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త అందించనుంది. పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందడంతో టీచర్లకు మేలు చేసే ప్రక్రియకు త్వరలో శ్రీకారం చుట్టనుంది. 10 వేల మందికిపైగా టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా, ప్రధానోపాధ్యాయులుగా, మండల విద్యాశాఖాధికారులుగా, జిల్లా ఉప విద్యాశాఖాధికారులుగా పదోన్నతులు కల్పించనుంది. సెప్టెంబర్ నెల మొదటి వారంలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ చేపట్టేలా షెడ్యూల్ సిద్ధం చేసింది. 7 వేల మంది ఎస్జీటీలకు ఎస్ఏలుగా పదోన్నతి రాష్ట్రంలో విద్యావ్యవస్థను పునాది నుంచి బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఫౌండేషనల్ విద్యా విధానాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్లలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. 3 నుంచి 8 ఏళ్ల మధ్య పిల్లల్లో మేథోపరమైన వికాసం గరిష్టంగా ఉంటుందని పలు శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించిన నేపథ్యంలో వారికి నాణ్యమైన బోధన అందేలా ఏర్పాట్లు చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి ఫౌండేషనల్ స్కూళ్లుగా తీర్చిదిద్దింది. 3 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల పిల్లలను హైస్కూళ్లకు అనుసంధానిస్తూ సబ్జెక్టుల వారీగా బోధనకు చర్యలు తీసుకుంది. అందుకు అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్ చేపట్టింది. విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలను కల్పిస్తూ ఈ చర్యలు తీసుకుంటోంది. మ్యాపింగ్తో ఆయా హైస్కూళ్లు, ప్రీ హైస్కూళ్లలో అవసరమైన అదనపు తరగతి గదులు, ఇతర సదుపాయాలను కల్పిస్తోంది. ఈ స్కూళ్లలో సబ్జెక్టుల బోధనకు స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కావడంతో ఎస్జీటీలలో అర్హులైన వారికి ఎస్ఏలుగా పదోన్నతులు కల్పించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు 7 వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. హెడ్మాస్టర్లను కూడా పూర్తి స్థాయిలో నియమించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 500 హైస్కూళ్లలో హెడ్మాస్టర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో వాటిలో సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించనున్నారు. పదోన్నతుల కోసం అదనంగా 666 ఎంఈవో పోస్టులు మండల విద్యాధికారుల పోస్టులు కొన్ని దశాబ్దాలుగా పూర్తిస్థాయిలో భర్తీకి నోచుకోలేదు. దీనివల్ల ప్రభుత్వం ఎన్ని రకాల విద్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నా పర్యవేక్షణ కొరవడింది. టీచర్లకు అందాల్సిన పదోన్నతులూ నిలిచిపోయాయి. రాష్ట్రంలో 666 మండల విద్యాధికారుల పోస్టులుండగా 421 మంది పనిచేస్తున్నారు. అయితే ఈ పోస్టులన్నీ తమకు సంబంధించినవని, స్థానిక సంస్థల స్కూళ్ల టీచర్లకు కేటాయించవద్దని ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదం పరిష్కారానికి సీఎం జగన్ చొరవ చూపారు. ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున ఎంఈవోలు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఎంఈవో పోస్టులు రెట్టింపై 1,332కి చేరాయి. 666 పోస్టులు ప్రభుత్వ టీచర్లకు, మిగతా 666 పోస్టులు స్థానిక సంస్థల (జడ్పీ) స్కూళ్ల టీచర్లకు కేటాయించారు. ఫలితంగా టీచర్లకు పదోన్నతులు రెట్టింపు అయ్యాయి. అర్హులైన హెడ్మాస్టర్లకు పదోన్నతుల ద్వారా ఈ పోస్టులలో అవకాశం కల్పించనున్నారు. అదనంగా 36 డిప్యుటీ డీఈవో పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా 53 డిప్యూటీ డీఈవో పోస్టులుండగా వీటిపైనా ప్రభుత్వ, స్థానిక సంస్థల టీచర్లకు సంబంధించి వివాదం నెలకొంది. దీంతో ఈ సాకుతో గత ప్రభుత్వాలు పోస్టుల భర్తీ చేపట్టకుండా వదిలేశాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ పోస్టులన్నీ భర్తీ కావాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో పాటు అదనంగా మరో 36 డిప్యూటీ డీఈవో పోస్టుల ఏర్పాటుకు అనుమతిచ్చారు. దీంతో ప్రభుత్వ టీచర్లు, స్థానిక సంస్థల టీచర్లకు న్యాయం చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ 89 డిప్యూటీ డీఈవో పోస్టులలో నిబంధనలను అనుసరించి పదోన్నతులపై అర్హులైన వారిని నియమించనున్నారు. వీటితో పాటు మున్సిపల్ టీచర్లకు సంబంధించిన బాధ్యతలను కూడా ప్రభుత్వం విద్యాశాఖకు అప్పగించిన సంగతి తెలిసిందే. వీరికి సంబంధించిన సర్వీసు అంశాలు, పదోన్నతులు, వేతనాలు, బదిలీలను కూడా పాఠశాల విద్యాశాఖ చేపట్టనుంది. వీరికి కూడా ఎస్ఏలు, హెచ్ఎంలు, ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలుగా పదోన్నతులు లభించనున్నాయి. ఎలాంటి న్యాయపరమైన సమస్యలకు తావు లేకుండా పదోన్నతులను చేపట్టేలా పాఠశాల విద్యాశాఖ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ పదోన్నతుల ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారం నుంచి చేపట్టనుంది. వాటిని ముగించిన అనంతరం టీచర్ల సాధారణ బదిలీలను చేపడుతుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కూడా పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. 22 ఏళ్ల కల సాకారం వేల మంది స్కూల్ అసిస్టెంట్ టీచర్లు తమ సబ్జెక్టుల మార్పుకోసం దాదాపు 22 ఏళ్లుగా ప్రభుత్వానికి విన్నపాలు చేస్తూ వచ్చారు. వారి గోడును గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. సీఎం వారి విన్నపాన్ని సానుకూలంగా పరిష్కరించేలా ఆదేశాలిచ్చారు. ఈమేరకు స్కూల్ అసిస్టెంట్లు తమ అర్హతలను అనుసరించి సబ్జెక్టుల మార్పునకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దీనివల్ల 2,300 మంది టీచర్లకు లబ్ధి చేకూరనుంది. -
కాబోయే భార్య ఎగ్జామ్ ఫెయిల్ అయ్యిందని ఏకంగా స్కూల్నే తగలెట్టేశాడు
కోపంతో ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు చాలా అనర్థాన్ని సృష్టిస్తాయి. ఆ కోపం వారినే కాదు తనతో ఉన్నవారిని కూడా కష్టాలపాల్జేస్తుంది. అచ్చం అలానే ఇక్కడోక వ్యక్తి తన కాబోయే భార్య ఎగ్జామ్ పెయిలైందన్న కోపంతో చేసిన పని కొంతమంది విద్యార్థుల భవితవ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వివారాల్లోకెళ్తే...ఈజిప్టులోని 21 ఏళ్ల యువకుడు తన కాబోయే భార్య చదువుతున్న స్కూల్కి నిప్పుపెట్టాడు. తన కాబోయే భార్య ఎగ్జామ్లో ఫెయిలైందన్న కోపంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఈజిప్టులోని ఘర్బియా గవర్నరేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈజిప్టు రాజధాని కైరోకు ఉత్తరాన ఉన్న మెనోఫియా ప్రావిన్స్లో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. సదరు నిందితుడు విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసుల ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన కాబోయే భార్య ఎగ్జామ్ ఫెయిలవ్వడంతో ఆమె మరో ఏడాది చదువుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. అందువల్ల తమ పెళ్లి వాయిదా పడుతుందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టానని చెప్పుకొచ్చాడు. ఐతే సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి త్వరితగతిన మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రిన్స్పాల్ కార్యాలయం, అడ్మినిస్ట్రేటివ్ భవనం దారుణంగా దెబ్బతాన్నాయని పోలీసులు చెప్పారు. అంతేగాక ఆ స్కూల్లోని కొంతమంది విద్యార్థుల రికార్డులు నాశనమయ్యాయని తెలిపారు. ఐతే అతను ఈ దారుణానికి ఒడిగట్టినప్పుడు చూసిన స్థానికులు అతని గురించి పూర్తి సమాచారం అందించారని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: Lying Down Championship: అలా తిని పడుకుంటే.. డబ్బులొస్తాయ్!) -
AP: 27న స్కూళ్లకు సెలవు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు ఈ నెల 27(నాలుగో శనివారం)ను సెలవు దినంగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్ కె.సురేష్కుమార్ గురువారం సర్క్యులర్ జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల కోసం ఆగస్టు 13వ తేదీ(రెండో శనివారం) నాడు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేశాయి.సెలవు దినంలో స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేసినందున దానికి ప్రత్యామ్నాయంగా 27వ తేదీని సెలవు దినంగా పరిగణించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
502 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ యాజమాన్య పాఠశాలల్లో 502 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి నోటిఫికేషన్లు జారీ చేసింది. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (లిమిటెడ్ రిక్రూట్మెంట్) ద్వారా వీటిని భర్తీ చేయనుంది. గతంలో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లా పరిషత్ (జెడ్పీ), మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్ స్కూళ్లలో 207, మున్సిపల్ స్కూళ్లలో 15, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఈ పోస్టులకు https://cse.ap.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటరాధారితంగా పరీక్షలు ఈ టీచర్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 23 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం కంప్యూటరాధారితంగా జరుగుతాయి. ఇందులో మెరిట్, రిజర్వేషన్లు, ఇతర నిబంధనల ప్రకారం ఆయా పోస్టులను భర్తీ చేస్తారు. ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్), స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్), టీజీటీ (లాంగ్వేజెస్), టీజీటీ (నాన్ లాంగ్వేజెస్), టీజీటీ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ), పీజీటీ (లాంగ్వేజెస్), పీజీటీ (నాన్ లాంగ్వేజెస్), పీజీటీ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్), మ్యూజిక్, ఆర్ట్స్ విభాగాల వారీగా ఈ పరీక్షలుంటాయి. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, ఇతర నిబంధనలను అనుసరించి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జనరల్ మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. -
టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఆరు పేపర్లే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2022–23 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో 136ను విడుదల చేశారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాల విద్యలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సీబీఎస్ఈ టెన్త్లో ప్రస్తుతం పబ్లిక్ పరీక్షలు ఆరు పేపర్లలో మాత్రమే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలనూ అదే రీతిలో ఆరు పేపర్లలోనే నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని ప్రకారం ఇకపై టెన్త్ పరీక్షల్లో ఫిజికల్ సైన్స్ (పీఎస్), బయోలాజికల్ సైన్స్ (ఎన్ఎస్) సబ్జెక్టులు కలిపి ఒక్క పేపర్గానే ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు కూడా ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. 11 పేపర్ల నుంచి ఆరుకు తగ్గింపు.. టెన్త్ పబ్లిక్ పరీక్షలు తొలుత 11 పేపర్లతో ప్రారంభమై ఇప్పుడు ఆరుకు తగ్గాయి. గతంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమల్లో లేనప్పుడు 11 పేపర్లలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరిగేవి. ఆ పరీక్షలకు ముందు నాలుగు యూనిట్ టెస్టులు, రెండు టర్మ్ టెస్టులు నిర్వహించేవారు. సీసీఈ విధానానాన్ని ముందుగా 8వ తరగతి వరకే అమల్లోకి తెచ్చినప్పటికీ.. ఆ తర్వాత 9, 10 తరగతులకూ వర్తింపచేశారు. సీసీఈ విధానంలో విద్యార్థులకు నాలుగు ఫార్మేటివ్ పరీక్షలు, రెండు సమ్మేటివ్ పరీక్షలను నిర్వహించేవారు. అంతేకాకుండా వివిధ ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలతో సీసీఈ విధానం అమలు చేశారు. విద్యార్థులపై పరీక్షల భారం తగ్గించేందుకు.. ఈ నేపథ్యంలో విద్యార్థులను పబ్లిక్ పరీక్షల్లో మరింత నిశితంగా పరీక్షించాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) పాఠశాల విద్యా శాఖకు నివేదికను సమర్పించింది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు సీబీఎస్ఈ.. టెన్త్ పబ్లిక్ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహిస్తోందని నివేదించింది. దీన్ని అనుసరించి రాష్ట్రంలో కూడా ఆరు లేదా ఏడు పేపర్లలో నిర్వహిస్తే సరిపోతుందని తెలిపింది. దీంతో ప్రభుత్వం టెన్త్ పబ్లిక్ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. -
బడులకు మరిన్ని సొబగులు.. నిర్వహణకు ప్రత్యేక అధికారి
నాడు –నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్ల నిర్వహణ చాలా ముఖ్యం. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చాం. అన్ని వసతులు కల్పించాం. ఈ పరిస్థితిలో వాటి నిర్వహణ బాధ్యతలు ఒక ప్రత్యేక అధికారికి అప్పగించడానికి సంబంధించి.. వచ్చే సమీక్ష సమావేశం నాటికి విధి విధానాలు రూపొందించాలి. ఇందుకు ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా రూపొందించాలి. అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించే దిశగా అడుగులు ముందుకు వేయాలి. అత్యుత్తమ బోధనకు ఇది దోహద పడుతుంది. స్కూళ్లకు కాంపౌండ్ వాల్స్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోండి. వీటన్నింటిపై దృష్టి పెట్టండి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఎలాంటి మరమ్మతులు వచ్చినా వెంటనే బాగు చేసేలా ఒక విధానం ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకు ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా అడుగులు ముందుకు వేయాలని, వచ్చే ఏడాది విద్యా కానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరి నాటికి సిద్ధం చేయాలని చెప్పారు. శుక్రవారం ఆయన పాఠశాల విద్యా శాఖ కార్యకలాపాలపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను వెంటనే ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. దశల వారీగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లలకు అందిస్తున్న యూనిఫామ్ నాణ్యతను పరిశీలించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పాఠశాల విద్యా శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో పాఠ్యాంశాలు ► పాఠ్య పుస్తకాలకు సంబంధించిన కంటెంట్.. పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి. దీనివల్ల లిబరల్గా అందరికీ పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. ► వచ్చే ఏడాది విద్యా కానుకకు సంబంధించి ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధం కావాలి. ఈ కిట్లో ఇచ్చే వస్తువులన్నింటినీ ఏప్రిల్ నాటికే సిద్ధం చేసుకోవాలి. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందించడానికి త్వరగా టెండర్లు ఖరారు చేసి, వెంటనే ఆర్డర్ ఇవ్వాలి. ► ప్రభుత్వేతర స్కూళ్లు ఏవైనా ప్రభుత్వ ముద్రణా సంస్థ నుంచి పాఠ్య పుస్తకాలు కావాలనుకుంటే.. నిర్ణీత తేదీలోగా ఎన్ని పుస్తకాలు కావాలో వివరాలు తీసుకుని ఆ మేరకు వాటిని అందించండి. ఎక్కడా పాఠ్య పుస్తకాల కొరత అనేది ఉండకూడదు. బాలికల భద్రతపై అవగాహన ► రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై స్కూళ్లలో విద్యార్థినులకు సరైన అవగాహన కల్పించాలి. ఇందులో భాగంగా గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసు, ఏఎన్ఎం తరచుగా వీరిని కలిసేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మహిళా ఉపాధ్యాయురాలిని కౌన్సెలింగ్ కోసం నియమించాలి. ► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ప్రభుత్వ సలహాదారు (పాఠశాల విద్యా శాఖ) ఏ మురళి, మహిళా.. శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.సిరి, ఎండిఎం డైరెక్టర్ దివాన్, గనుల శాఖ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పేద పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లలో ప్రవేశాలను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న అనగా అనాధ, దివ్యాంగ బాలలు, హెచ్ఐవీ బాధితుల పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాలకు (బీసీ మైనారిటీ, ఓసీ) 6 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలోకి ఆయా పాఠశాలల్లోని 25 శాతం సీట్లలో పేద పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని, లాటరీ పద్ధతిలో ఎంపికలు చేపడతామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీనవర్గాల కుటుంబాలకు వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాల కుటుంబాలకు 1.40 లక్షలు ప్రాతిపదికగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. 16 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. "http://cse.ap.gov.in' వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. ప్రవేశ దరఖాస్తుతో పాటు ఇతర సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. -
బంగారు భవితకు పటిష్ట ‘పునాది’
సాక్షి, అమరావతి: ఓ భవనమైనా.. మనిషి వ్యక్తిత్వమైనా పునాది బాగుంటేనే ఆటుపోట్లను తట్టుకుని కలకాలం నిలబడుతుంది. ఫౌండేషన్ సరిగా లేకుండా ఆ తరువాత భారం మోపితే ఏమవుతుంది? అంత బరువు తట్టుకోలేక కుప్పకూలుతుంది. అందుకనే ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తూ, చిన్నారులను చేయి పట్టి నడిపిస్తూ, సంప్రదాయ విధానంలోని లోపాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీర్ఘకాలంగా మన ప్రాథమిక విద్యా విధానం సరిగా లేకపోవడమే నాసిరకం ప్రమాణాలకు కారణమని అనేక నివేదికలు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఫౌండేషన్ విద్యకు అత్యంత ప్రాధాన్యమిచ్చి పునాది స్థాయి నుంచే బంగారు భవితకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్ది ఉన్నత ప్రమాణాలతో అందరూ ఉచితంగా విద్య అభ్యసించే అవకాశం కల్పిస్తోంది. అత్యుత్తమ మానవ వనరులే లక్ష్యంగా విద్యారంగ సంస్కరణలు చేపట్టింది. తల్లిదండ్రులకు ఏమాత్రం భారం కాకుండా, పిల్లలంతా తప్పనిసరిగా స్కూళ్లకు వచ్చేలా జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, పోషక విలువలతో కూడిన గోరుముద్ద లాంటి పథకాలను అమలు చేస్తూ ప్రాథమిక విద్యను పరిపుష్టం చేస్తోంది. చిన్నారుల్లో మనోవికాసం గరిష్ట దశలో ఉండే సమయంలో సబ్టెక్టు టీచర్లను నియమించి విద్యాభాసం ఆహ్లాదకరంగా కొనసాగేలా జాగ్రత్తలు తీసుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూలింగ్ విధానంలో మార్పులు చేసింది. తొలిసారిగా విద్యార్థి కేంద్రంగా విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఫౌండేషన్ నుంచే ఉత్తమ బోధన అందించడంతోపాటు పైతరగతులకు వెళ్లే కొద్దీ ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. 3 నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధన చిన్నారుల్లో 8 ఏళ్లలోపే మేథో వికాసం పూర్తిస్థాయిలో ఉంటుందని పలు శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్న నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా పునాది విద్య బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తెస్తోంది. విద్యార్ధుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరంచెల విధానంలో స్కూళ్లు ఏర్పాటు చేస్తోంది. కొత్త విధానంలో ఒక్క స్కూలు కూడా మూతపడకుండా, ఏ ఒక్క టీచర్ పోస్టూ తగ్గకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఫౌండేషన్ విద్య బలోపేతంతో పాటు 3వ తరగతి నుంచే విద్యార్ధులకు సబ్జెక్టు టీచర్లతో బోధన నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఫౌండేషన్ స్కూళ్లతో 5+3+3+4 విధానంలో తరగతులు ఏర్పాటవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పీపీ 1, పీపీ 2 తరగతులను ఏర్పాటు చేసి స్కూళ్లకు అనుసంధానిస్తూ పునాది స్థాయి నుంచే అక్షర, సంఖ్యా పరిజ్ఞానానికి బాటలు వేస్తున్నారు. పాత విధానంలో పునాది విద్యపై నిర్లక్ష్యం ఇప్పటివరకు అమలవుతున్న అంగన్వాడీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్, జూనియర్ కాలేజీల విద్యా విధానంలో విద్యార్ధులకు సరైన బోధన అందక సామర్థ్యాలు మెరుగుపడడం లేదు. ఇదే అంశాన్ని పలువురు నిపుణులు రూపొందించిన నివేదికలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా పునాది విద్యకు పాత విధానంలో చోటే లేదు. అంగన్వాడీలను స్కూలింగ్ విధానంలో భాగంగా పరిగణించకపోవడంతో అక్కడ చేరే పిల్లలకు స్కూలు వాతావరణం, అక్షర పరిజ్ఞన నైపుణ్యాలు అలవడే పరిస్థితి లేకుండా పోయింది. నేరుగా ఒకటో తరగతిలో చేరుతున్న చిన్నారులకు ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) ప్రమాణాలు కొరవడటంతో విద్యా ప్రమాణాల్లో వెనుకబడుతున్నారు. పైతరగతులకు వెళ్లే కొద్దీ అందుకు తగ్గ సామర్థ్యాలు సంతరించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రైమరీ స్కూళ్లలో 1నుంచి 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులను ఒకరిద్దరు టీచర్లే బోధించాల్సి రావడంతో విద్యార్ధుల్లో ప్రమాణాలు మెరుగుపడలేదు. నాడు.. దిగజారిన ప్రమాణాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత దిగజార్చారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు క్షీణించాయి. ఈ అంశాలను 2018లో పలు సర్వేలు వెల్లడించాయి. అసర్ నివేదిక ప్రకారం మూడో తరగతి విద్యార్ధుల్లో 22.4 శాతం మంది మాత్రమే రెండో తరగతి పుస్తకాలను చదవగలుగుతున్నారు. 3వ తరగతి విద్యార్ధులలో 38.4 శాతం మాత్రమే తీసివేతలు చేయగలుగుతున్నారు. 5వ తరగతి పిల్లల్లో 39.3 శాతం మందికి మాత్రమే భాగాహారాలు వచ్చు. 8వ తరగతి పిల్లల్లో 47.6 శాతం మంది మాత్రమే భాగాహారాలు చేయగలుగుతున్నారంటే పరిస్థితిని ఊహించవచ్చు. ఇక స్టేట్ లెవల్ అఛీవ్మెంట్ సర్వే (స్లాస్) నివేదిక ప్రకారం రాష్ట్ర విద్యార్ధుల్లో పఠన సామర్థ్యాలు చాలా పేలవంగా ఉండడంతో పాటు ఇతర నైపుణ్యాలు కొరవడ్డాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్ధుల్లో భాషా నైపుణ్యాలు 63.50 శాతం నుంచి 49.40 శాతానికి తగ్గిపోయాయి. మేథమెటిక్స్లో అయితే 69.55 శాతం నుంచి 39.30 శాతానికి కుదించుకుపోయాయి. నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్) ప్రకారం పదో తరగతిలో 60 శాతం విద్యార్ధులకు ప్రధాన సబ్జెక్టులతో పాటు భాషల్లోనూ సరైన సామర్థ్యాలు లేవని తేలింది. టెన్త్ విద్యార్ధులలో ఎక్కువ మంది ఇంగ్లీషు లేదా తెలుగు వాక్యాన్ని తప్పులు లేకుండా చదవడం, రాయడం కూడా రాని పరిస్థితి నెలకొందని వెల్లడించింది. పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్నా టెన్త్లో 95 నుంచి 99 శాతం వరకు ఉత్తీర్ణత నమోదు కావడం నాటి పరీక్షల ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలకు నిదర్శనం. నేడు.. చక్కదిద్దేందుకే కొత్త విధానం రాష్ట్రంలో విద్యారంగం దుస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిద్దుబాటు చర్యలతో నూతన ఫౌండేషన్ విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యార్ధులకు పునాది స్థాయి నుంచే పటిష్ట బోధన అందించడం, పైతరగతులకు వెళ్లే కొద్దీ ఉన్నత ప్రమాణాలతో పరి/ê్ఙనాన్ని పెంపొందించడం కొత్త విధానం ముఖ్య ఉద్దేశం. తద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా అత్యున్నతంగా తీర్చిదిద్దాలన్నది సీఎం జగన్ ఆకాంక్ష. ఈ క్రమంలో అంగన్వాడీలు, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువులు కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. తల్లిదండ్రులపై భారం లేకుండా జగనన్న విద్యాకానుక అందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంతోపాటు అన్ని హైస్కూళ్లలో దశలవారీగా సీబీఎస్ఈ విధానాన్ని అమలుకు సిద్ధమయ్యారు. విద్యార్ధులకు మాధ్యమంతో ఇబ్బంది లేకుండా బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలను సమకూరుస్తున్నారు. ఉచితంగా బైజూస్ కంటెంట్, ట్యాబ్లు ఈ ఏడాదినుంచి విద్యార్థులకు ఆధునిక విద్యా పరి/ê్ఙనాన్ని సమకూరుస్తూ బైజూస్ కంటెంట్ను ప్రత్యేక యాప్ ద్వారా అందించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏటా 8వ తరగతిలోకి వచ్చే నాలుగు లక్షల మందికిపైగా విద్యార్ధులకు ప్రత్యేక ట్యాబ్లను అందించి బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేయనున్నారు. తద్వారా 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. రూ.20 వేలకు పైగా విలువ చేసే బైజూస్ కంటెంట్ను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు ఉచితంగానే అందించేలా ఏర్పాట్లు చేశారు. ఫౌండేషన్ స్కూళ్లలో పీపీ 1, పీపీ 2లకు అంగన్వాడీ టీచర్లతో బోధన తోపాటు 1, 2 తరగతులకు ఎస్జీటీలతో బోధన నిర్వహిస్తారు. గతంలో 1 నుంచి 5 తరగతులుండగా ఇపుడు 1, 2 తరగతుల పిల్లలకు మాత్రమే బోధన వల్ల టీచర్లకు సులభం కావడంతో పాటు పిల్లలకూ ఉత్తమ పరి/ê్ఙనం అందే అవకాశం ఏర్పడింది. ఆరంచెల విధానంలో స్కూళ్లు ► అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని స్కూళ్లకు అనుసంధానించి పీపీ 1, పీపీ 2లతో పాటు 1, 2వ తరగతులతో ఫౌండేషన్ స్కూళ్లుగా మార్పు చేస్తున్నారు. ► పీపీ 1, పీపీ 2లతో పాటు 1–5 తరగతుల వరకు ఉండేలా ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లను నెలకొల్పుతున్నారు. ► స్కూళ్లతో అనుసంధానానికి వీలులేని చోట అంగన్వాడీ కేంద్రాలను పీపీ 1, పీపీ 2లతో కలిపి శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లుగా ఏర్పాటు చేస్తున్నారు. ► ప్రైమరీ స్కూళ్లలో 3, 4, 5వ తరగతులను 250 మీటర్ల నుంచి ఒక కి.మీ. లోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో మ్యాపింగ్ చేయడం ద్వారా 1 నుంచి 7 లేదా 8వ తరగతులతో ప్రీ హైస్కూల్ విధానంలో కొన్ని స్కూళ్లను తీర్చిదిద్దుతున్నారు. ► ప్రైమరీ పాఠశాలల్లోని 3, 4, 5వ తరగతులను కిలోమీటర్ దూరంలో ఉన్న హైస్కూళ్లకు అనుసంధానించడం ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లు కొలువుదీరుతున్నాయి. ► ప్రతి మండలంలో జూనియర్ కాలేజీని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలేజీలు లేని మండలాల్లో హైస్కూళ్లలో 11, 12వ తరగతులను ఏర్పాటుచేసి హైస్కూల్ ప్లస్గా ఏర్పాటు చేస్తున్నారు. దశలవారీగా మ్యాపింగ్ స్కూళ్ల మ్యాపింగ్ను ఒకేసారి కాకుండా దశలవారీగా చేస్తున్నారు. మొదటి దశలో 250 మీటర్ల పరిధిలోని అంగన్వాడీలు, ప్రైమరీ స్కూళ్లు, యూపీ, హైస్కూళ్ల మధ్య మ్యాపింగ్ చేపట్టారు. రెండో విడతలో కిలోమీటర్ లోపు దూరంలోని స్కూళ్లలోని తరగతులకు మ్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలా 5,968 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్ల మధ్య 3, 4, 5 తదితర తరగతుల మ్యాపింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 47 లక్షల మంది విద్యార్ధులుండగా 2.49 లక్షల మంది మాత్రమే మ్యాపింగ్తో పక్కనే ఉండే మరో స్కూల్కి మారతారు. ఆయాస్కూళ్ల మ్యాపింగ్తో ప్రీహైస్కూల్, , హైస్కూళ్లలో చేరే 3, 4, 5 తరగతుల విద్యార్ధులకు మ్యాపింగ్ నేపథ్యంలో తరగతి గదులతోపాటు సదుపాయాలను మెరుగుపర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం నాడు – నేడు ద్వారా యుద్ధప్రాతిపదికన చేపట్టింది. మ్యాపింగ్ అయిన స్కూళ్లతో పాటు ఇతర స్కూళ్లలో 1,69,972 అదనపు తరగతి గదులను ప్రభుత్వం నిర్మిస్తోంది. అదనంగా 8వేలకు పైగా ఎస్ఏ పోస్టులు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధన నిర్వహించేందుకు వీలుగా స్కూల్ అసిస్టెంట్ టీచర్లను సమకూరుస్తున్నారు. మ్యాపింగ్ జరిగిన 3,609 హైస్కూళ్లలో 73,620 మంది స్కూలు అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా ఇప్పటికే 62,935 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో 8 వేలకుపైగా ఎస్జీటీ పోస్టులను ఎస్ఏలుగా అప్గ్రేడ్ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇవి కాకుండా 1,000 హెచ్ఎం పోస్టులను కల్పించేందుకు వీలుగా ఎస్ఏ పోస్టులను అప్గ్రేడ్ చేయనున్నారు. అప్గ్రేడ్ అయిన ఈ పోస్టుల్లో అర్హత కలిగిన టీచర్లకు పదోన్నతి కల్పించి నియమించనున్నారు. నాడు – నేడు ద్వారా రూ.16,450 కోట్లు టీడీపీ హయాంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. కనీస సదుపాయాలు కల్పించకుండా, టీచర్లను నియమించకుండా ప్రభుత్వ పాఠశాలలను అధ్వాన్నంగా మార్చారు. పిల్లలు లేరన్న సాకుతో 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 5 వేల స్కూళ్లను తిరిగి తెరిపించడమే కా>కుండా అన్ని సదుపాయాలతో టీచర్లను సమకూర్చారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ఏకంగా రూ.16,450 కోట్లు వెచ్చిస్తుండడం గమనార్హం. ఈ నిధులతో మొత్తం 62,661 విద్యాసంస్థల్లో సదుపాయాలను సమకూరుస్తోంది. నిశిత పరిశీలన తరువాతే స్కూళ్ల మ్యాపింగ్ వల్ల ఎక్కడా ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా, టీచర్ పోస్టులు తగ్గకుండా చర్యలు తీసుకున్నాం. క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన తరువాతే మ్యాపింగ్ చేపట్టాం. ఆయా స్కూళ్లలో వసతులు, ఇతర సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటివరకు ఐదు వేలకుపైగా స్కూళ్ల మ్యాపింగ్ జరగ్గా కొన్ని చోట్ల మాత్రం ఇబ్బందులు తలెత్తినట్లు ప్రజాప్రతినిధులతో పాటు ఇతర వర్గాలు తెలిపాయి. వాగులు, ప్రధాన రహదారులు దాటాల్సి రావడం, గదులు చాలకపోవడం లాంటి సమస్యలున్నట్లు చెప్పారు. 800 స్కూళ్లలో సమస్యలున్నట్లు సమాచారం అందడంతో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీల పరిశీలన అనంతరం 250 వరకు స్కూళ్లను మ్యాపింగ్ నుంచి ప్రస్తుతానికి మినహాయించాం. 36 వేలకు పైగా తరగతి గదుల నిర్మాణం చకచకా సాగుతోంది. త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయి. సబ్జెక్టు టీచర్లతో బోధనకు వీలుగా అవసరమైన మేరకు స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తున్నాం. – ఎస్.సురేష్కుమార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ -
ప్రభుత్వ స్కూళ్లకే పట్టం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలలు భారీ సంఖ్యలో మూతపడ్డాయని వెల్లడించింది. ఈ మేరకు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో 46.27 లక్షల మంది.. 2020–21 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 4.37 లక్షల మంది విద్యార్థులు ప్రవేశం పొందారని కేంద్ర సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి చెప్పారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 46.27 లక్షలకు చేరిందని వెల్లడించారు. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో చేరినవారు కేవలం 2.5 లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారు. దీంతో కొత్తగా చేరినవారితో కలిపి ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 35.05 లక్షలకు పడిపోయిందని స్పష్టం చేశారు. అలాగే ఏపీలో 2020–21లో కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు తెరిచేందుకు 77 దరఖాస్తులు మాత్రమే రాగా 948 ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయన్నారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల్లో పెరిగిన చేరికలు. 2020–21 విద్యా సంవత్సరంలో తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో 3.20 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరారని కేంద్ర సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. దీంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 39.64 లక్షలకు చేరిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1.54 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందారని.. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 28.96 లక్షలకు చేరిందని తెలిపారు. కాగా తెలంగాణలో 2020–21లో కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు తెరిచేందుకు 528 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా మూతపడలేదని వెల్లడించారు. పాఠశాల విద్యలో ఎన్నో సంస్కరణలు ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాల విద్యపై దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేలా.. వాటిలో సకల వసతులు ఉండేలా.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దడానికి నాడు–నేడు: మనబడి పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనం కింద అందిస్తున్నారు. అదేవిధంగా తమ పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి జగనన్న అమ్మఒడి కింద రూ.15 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. అంతేకాకుండా జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలు, బెల్టు, షూ, యూనిఫామ్, స్కూల్ బ్యాగు తదితరాలను అందిస్తున్నారు. వీటి ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అమాంతం పెరిగాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యావేత్తలు చెబుతున్నారు. -
సంస్కరణలతో పటిష్ట పునాది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా విద్యార్థులే కేంద్రంగా విద్యా విధానాలను అమలు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. దశాబ్దాలుగా అమలుకు నోచుకోని సంస్కరణలను ఈ మూడేళ్లలోనే తీసుకొచ్చామన్నారు. మౌలిక వసతులు, మానవ వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు గట్టిపునాది వేసేందుకే తరగతుల విలీనాన్ని చేపట్టామన్నారు. పాఠశాలల మ్యాపింగ్ మాత్రమే జరుగుతోందని, ఏ ఒక్క స్కూల్ మూతపడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని పలుసార్లు స్పష్టం చేసినప్పటికీ ‘ఈనాడు’ పత్రిక దురుద్దేశంతో తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేసేలా అసత్య కథనాలు ప్రచురిస్తోందన్నారు. విద్యా వ్యవస్థలో వేళ్లూనుకున్న లోపాలకు సరైన చికిత్స చేస్తుంటే దుష్ప్రచారం సరికాదని హితవు పలికారు. సదుపాయాలు కల్పించాకే.. 2021–22లో 2,943 ప్రాథమిక పాఠశాలల తరగతులను 250 మీటర్ల దూరం లోపు ఉన్న 2,800 ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేశామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. 2022–23లో 620 ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలను కిలోమీటరు దూరంలోపు ఉన్న 4,954 ప్రీ హైస్కూళ్లు మ్యాపింగ్ చేసినట్లు వివరించారు. 5,870 పాఠశాలల్లో తరగతులను విలీనం చేస్తే కేవలం 820 స్కూళ్లకు సంబంధించి సమస్యలున్నట్లు శాసన సభ్యులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారన్నారు. దీనిపై అధ్యయనానికి జాయింట్ కలెక్టర్ చైర్మన్గా ఏర్పాటైన ప్రత్యేక కమిటీ క్షేత్రస్థాయిలో ఇబ్బందులను పరిశీలించి నివేదిక అందిస్తుందన్నారు. విలీన ప్రక్రియ సాధ్యంకాని పక్షంలో ఆ పాఠశాలలను యథావిధిగా కొనసాగిస్తామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్య ఉంటే పరిష్కరించిన తర్వాతే తరగతుల విలీనానికి ముందుకెళ్తామన్నారు. 8,232 మంది ఎస్జీటీలకు పదోన్నతి.. కొత్త విద్యావిధానం అమలుతో ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టూ రద్దు కాదని స్పష్టం చేశారు. పైగా 8,232 మంది ఎస్జీటీలకు మేలు చేసేలా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నామన్నారు. అదనంగా పెద్ద సంఖ్యలో హెచ్ఎం పోస్టులకు షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక హెచ్ఎం, పీఈటీతో పాటు కచ్చితంగా 9మంది సబ్జెక్టు టీచర్లు ఉండేలా పటిష్ట చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు వారానికి 36 పీరియడ్లు మించకుండా, వారిపై తరగతుల విలీన ప్రక్రియ భారం పడకుండా చూస్తామన్నారు. నాడు –నేడు ద్వారా ఇప్పటికే 15,715 పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి 32 వేల అదనపు తరగతులను నిర్మించనున్నట్టు చెప్పారు. మాకు విద్యార్థులే ముఖ్యం చరిత్రలో తొలిసారిగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యా విధానాన్ని అమలు చేస్తోందన్నారు. కోవిడ్తో రెండేళ్లు పాఠశాలలు సరిగా తెరుచుకోకపోవడంతో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం పడిపోయిందన్నారు. ఇదే విషయాన్ని అసర్, న్యాస్ రిపోర్టులు సైతం చెబుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా పాఠశాలలను గ్రూపింగ్ చేసి 2025 నాటికి సమస్యను అధిగమించాలని సూచిస్తోందన్నారు. గుజరాత్తో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ బాటలో పయనించేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో సైతం ఈ తరహా విద్యా విధానం అమలవుతోందన్నారు. -
613 డీఎడ్ కాలేజీల గుర్తింపు రద్దు
సాక్షి, అమరావతి: అక్రమాలకు పాల్పడుతున్న 613 ప్రైవేటు డీఎడ్ కాలేజీల గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ డీఎడ్ (డైట్స్) కాలేజీలు 14 ఉండగా ప్రైవేటువి 780 వరకు ఉన్నాయి. గత ఏడాది ఇదే కారణంతో 167 కాలేజీల గుర్తింపును పాఠశాల విద్యా శాఖ రద్దు చేసింది. అవి న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. వీటిలో కొన్ని మళ్లీ ఈ ఏడాది గుర్తింపునకు దరఖాస్తు చేశాయి. అయితే అవి సమర్పించిన పత్రాలు తప్పుడువని తేలడంతో వాటికి గుర్తింపు ఇవ్వలేదు. డీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి డీఈఈసెట్–2022 ప్రవేశ పరీక్షలు ఇటీవల జరిగాయి. వీటికి 5,800 మంది హాజరు కాగా 4,800 మంది అర్హత సాధించారు. ప్రైవేటు కాలేజీల గుర్తింపు రద్దవడంతో ఈసారి డీఎడ్ కౌన్సెలింగ్ను ప్రభుత్వ కాలేజీలకే పరిమితం చేయనున్నారు. ఈ కాలేజీల్లో వివిధ మాధ్యమాలు, సబ్జెక్టుల కోర్సులలో సీట్లు 2 వేల వరకు ఉన్నాయి. గతంలో అర్హులు లేకున్నా అనేక అక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డీఎడ్ ప్రవేశాలు అక్రమాలమయంగా మారాయి. ఏటా కోట్లాది రూపాయలు ముడుపులు వెళ్లేవి. గతంలో ఏటా డీఈఈసెట్కు 60 వేల మంది వరకు దరఖాస్తు చేసేవారు. వీరిలో అర్హత మార్కులు సాధించే వారి సంఖ్య 5 వేల లోపే ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడంతో కాలేజీలు లెక్కకు మించి ఉండేవి. 2014–15 నాటికి రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్ కాలేజీలు 505 ఉండగా వాటిలో 26,350 సీట్లు ఉండేవి. 2018లో వీటి సంఖ్య 869కి చేరింది. 2019కు వచ్చేసరికి 1,043కి పెరిగిపోయింది. సీట్లు 65 వేలకు చేరాయి. డీసెట్ రాసే వారి సంఖ్యే 50వేల లోపు. వారిలో అర్హత సాధించే వారి సంఖ్య 5 వేలకు మించదు. సీట్లు భర్తీ కాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించేవి. దీంతో అర్హత మార్కులు తగ్గిస్తూ ఉత్తర్వులు వెలువడేవి. డీసెట్లో ఓసీ, బీసీలకు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి. అప్పుడే డీఎడ్లో సీటు వస్తుంది. అయితే, ఈమేరకు మార్కులు సాధించే వారు కరువవడంతో కాలేజీలు అప్పటి అధికార పార్టీ నేతలు కొందరికి భారీగా ముడుపులిచ్చేవి. దీంతో అర్హత మార్కులను ఓసీ, బీసీలకు 35 శాతానికి తగ్గించేవారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పూర్తిగా ఎత్తివేసేవారు. అయినా సగానికిపైగా సీట్లు మిగిలేవి. వీటి భర్తీకి యాజమాన్యాలు అడ్డదారులు తొక్కేవి. డీసెట్లో అర్హత సాధించని వారితో పాటు అసలు డీసెట్కు దరఖాస్తు చేయని వారిని కూడా చేర్చుకొనేవి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇలాం టి అక్రమాలపై ఉక్కుపాదం మోపింది. 2020–20 21లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. ఈ బ్యాచ్లో అక్రమ పద్ధతిలో చేరిన దాదాపు 25వేల మంది విద్యార్థులను ప్రభుత్వం పరీక్షలకు అనుమతించలేదు. విద్యార్థ్ధులు నష్టపోరాదన్న మానవతా దృక్పథంతో వారికి ఇటీవల పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు ఆ కాలేజీల అనుమతులను రద్దు చేసింది. -
నాడు నేడు పనుల నాణ్యతలో రాజీ పడొద్దు
సాక్షి, అమరావతి: మన బడి నాడు– నేడు రెండో దశ పనులు వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడొద్దని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన మన బడి నాడు–నేడు పనుల తీరుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన బడి నాడు – నేడు రెండో దశ పనుల కింద 22,344 పాఠశాలలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, 20,757 స్కూళ్ల వివరాలను స్కూల్ ట్రాన్సఫర్మేషన్ మానిటరింగ్ సిస్టం (ఎస్టీఎంఎస్) వెబ్సైట్లో ఉంచామన్నారు. పది రోజుల్లో 100 శాతం పాఠశాలల్లో పనులు ప్రారంభించాలని చెప్పారు. ఇందుకు కావాల్సిన అనుమతులను కలెక్టర్లు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు. 10,891 పాఠశాలలకు రూ.554 కోట్లు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చామని, మిగిలిన వాటికీ నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం మంచి చేయాలనే ఆలోచనతోనే పాఠశాలల విలీనంపై నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా సందేహాలు, సమస్యలు తలెత్తితే స్థానిక అధికారులు స్పందించి సత్యాసత్యాలు తెలుసుకొని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్లు, ఆర్డీవోలకు చెప్పారు. ఈ విషయంలో భేషజాలకు పోవద్దన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు (ఇన్చార్జి) ఎస్.సురేష్ కుమార్, పాఠశాల విద్యా సలహాదారు ఎ.మురళి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీఎన్ దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంగ్లిష్ మీడియం మంచిదేగా..!
తెలుగు మీడియంను రద్దు చేస్తే తప్పు బట్టాలి గానీ ఇంగ్లిష్ మీడియం ఉండటం వల్ల నష్టం ఏముంది? ఇంగ్లిష్ మీడియం కావాలని తల్లి దండ్రులు కోరుకుంటున్నారు. ప్రస్తుత విధానం కొనసాగితే బాగుంటుంది. అంతిమంగా నిర్ణయాన్ని తల్లిదండ్రులకే వదిలేయాలి. – జీవో 117పై వాదనల సందర్భంగా హైకోర్టు వ్యాఖ్య సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు గత నెల 10న జారీ చేసిన జీవో 117 అమలుకు మరో నెల సమయం పడుతుందని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ప్రస్తుతం డేటా సేకరణ మాత్రమే జరుగుతోందని, అంతకు మించి ఏమీ లేదని వివరించారు. ఏ ఒక్క పాఠశాలనూ మూసివేయడం లేదన్నారు. ఫలానా మీడియంలోనే చదవాలని ఏ విద్యార్థినీ ఒత్తిడి చేయడం లేదని శ్రీరామ్ తెలిపారు. ఏ మీడియం ఎంచుకోవాలన్నది విద్యార్థులు, తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేస్తున్నామన్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగానే ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మనబడి నాడు–నేడు పథకం విజయవంతమైందని, దాదాపు 7.30 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది ఏ రాజకీయ నాయకుడో, రాష్ట్ర ప్రభుత్వమో చెప్పిన మాట కాదని, స్వయంగా కేంద్ర ప్రభుత్వం గణాంకాలతో సహా వెల్లడించిదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా మీడియం గురించి ప్రస్తావించలేదని, పిటిషనర్లు ఏవో ఊహించుకుంటూ తెలుగు మీడియం తీసేస్తున్నట్లు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రెండు మీడియంలు అమల్లో ఉంటాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు శ్రీకాకుళంలో తెలుగు, ఇంగ్లీష్, ఒరియా మీడియంలను ప్రవేశపెట్టామని చెప్పారు. కర్నూలులో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలను తీసుకొచ్చామన్నారు. విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయడం లేదని వివరించారు. కొత్త విధానంతో మూతపడే అవకాశం... జీవో 117, తదనుగుణ ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పంగా సత్యవతి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పల్లేటి శేషగిరి, మరో ముగ్గురు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ గంగారావు బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అప్పారి సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్ల పలు పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడిందన్నారు. నూతన విద్యా విధానాన్ని సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దని హైకోర్టు ధర్మాసనం తీర్పునివ్వడంతో ఆ పనిని ప్రభుత్వం ఇప్పుడు పరోక్షంగా చేస్తోందన్నారు. 8వ తరగతి వరకు కేవలం ఒకే మీడియం ఉంటుందని, 9, 10వ తరగతుల్లోనే ఇంగ్లీషు, తెలుగు మీడియంలు ఉంటాయన్నారు. రోస్టర్ ప్రకారం.. ఒక దశలో న్యాయమూర్తి జీవో 117 అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధం కాగా శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. యథాతథస్థితి కొనసాగించాలంటూ ఉత్తర్వులు ఇచ్చేందుకు సైతం న్యాయమూర్తి సిద్ధమయ్యారు. అయితే జీవో 117 విషయంలో ఇప్పటికప్పుడు ఏమీ జరగదని, తమ కౌంటర్ పరిశీలించకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏజీ కోరడంతో న్యాయమూర్తి సమ్మతించారు. కాగా ఈ వ్యాజ్యంలో పిటిషనర్లు చట్ట నిబంధనలను సవాలు చేశారని, రోస్టర్ ప్రకారం ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనమే విచారించాల్సి ఉంటుందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పరిశీలన జరిపిన అనంతరం ఏజీ వాదనతో ఏకీభవిస్తూ ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదించాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. -
ఆరంచెల నూతన విధానంలో స్కూళ్లు ప్రారంభం
సాక్షి, అమరావతి: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభం అయ్యాయి. 2022–23 విద్యా సంవత్సరపు బోధనాభ్యసన కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో సమగ్రంగా కొనసాగించేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్ను కూడా విడుదల చేసింది. ఏ రోజున ఏయే కార్యక్రమాలు చేపట్టాలో అందులో పొందుపరిచింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజునే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద స్టూడెంట్ కిట్ల పంపిణీ ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రూ. 931.02 కోట్లతో ఈ కిట్లను రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల విద్యార్థులందరికీ అందిస్తారు. ప్రభుత్వం స్కూళ్లను ఆరంచెల నూతన జాతీయ విద్యా విధానం కింద మార్పులు చేసింది. నూతన విధానంలోనే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పునాది విద్యను బలోపేతం చేసేందుకు పీపీ1, పీపీ2లతో కూడిన శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూలు, హైస్కూల్ ప్లస్గా ఈ స్కూళ్లు ఉంటాయి. ఇప్పటివరకు విలీన ప్రక్రియ పూర్తయిన ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని హైస్కూళ్లు, ప్రీ హైస్కూళ్లకు తరలించేందుకు విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు కూడా జారీచేసింది. ఈ సంవత్సరంలో 220 రోజుల పాటు స్కూళ్లు పనిచేస్తాయి. పాఠశాలలల ప్రారంభానికి జూన్ 28వ తేదీ నుంచే స్కూల్ రెడీనెస్ కార్యక్రమాన్ని విద్యా శాఖ చేపట్టింది. ప్రతి పాఠశాలను శుభ్రం చేయించడం, మంచినీటి సదుపాయం ఏర్పాటుతో పాటు పరిసర ప్రాంతాలు, గ్రామాల్లోని పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోకి రప్పించేలా గ్రామ సందర్శన కార్యక్రమాలను కూడా నిర్వహించింది. ప్రభుత్వం విద్యా పరంగా అమలుచేస్తున్న కార్యక్రమాలను తల్లిదండ్రులకు వివరించి వారి పిల్లలను బడుల్లో చేర్చేలా ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది బడి ఈడు పిల్లలెవరూ బడి బయట ఉండకుండా 100 శాతం చేరికలు ఉండేలా కార్యాచరణ చేపట్టింది. -
Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ‘గణగణ’
సాక్షి, అమరావతి: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ స్కూల్ రెడీనెస్ కార్యక్రమాన్ని జూన్ 28నుంచే ఆరంభించింది. పాఠశాలల్లో పరిశుభ్రత, ఫర్నిచర్, మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయాలతో పాటు మధ్యాహ్న భోజనం కోసం కిచెన్ షెడ్లు, వంట పరికరాలను సిద్ధం చేసింది. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందించనున్నారు. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5వ తేదీనుంచి నెలాఖరు వరకు విద్యార్థులకు అందచేస్తారు. కొత్త విధానంలో స్కూళ్లు జాతీయ నూతన విద్యావిధానం ప్రకారం ప్రభుత్వ స్కూళ్లను పునర్వ్యవస్థీకరించి ఆరు రకాల విభాగాలుగా ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రారంభించనుంది. పునాది విద్యను బలోపేతం చేయడంలో భాగంగా ఫౌండేషన్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. స్కూళ్ల మెర్జింగ్, టీచర్ల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. విలీనమైన స్కూళ్లలో 3, 4, 5 తరగతుల విద్యార్ధులు సమీపంలోని ప్రీహైస్కూలు, హైస్కూళ్లలోకి వెళ్లనున్నారు. అక్కడ వారికి సబ్జెక్టు టీచర్లతో బోధనతో పాటు హైస్కూళ్లలోని ల్యాబ్లు, ఆటస్థలాలు, లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి. వర్కింగ్ డేస్ 220 ఫౌండేషన్ స్కూళ్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పనిచేస్తాయి. గేమ్స్, రెమిడియల్ తరగతుల కోసం ఆప్షనల్ పీరియడ్ను 3.30 నుంచి 4.30 వరకు కొనసాగిస్తారు. హైస్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పనిచేస్తాయి. ఆప్షనల్ పీరియడ్ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉంటుందని క్యాలెండర్లో పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 220 రోజులు స్కూళ్ల పని దినాలుగా ఉంటాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్ లాంటి సెలవులన్నీ కలిపి 80 రోజులు ఉంటాయి. సమ్మేటివ్, ఫార్మేటివ్, టెన్త్ ప్రీఫైనల్ పరీక్షల తాత్కాలిక తేదీలను కూడా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. పెరుగుతున్న చేరికలు విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. మనబడి నాడు–నేడు కింద రూ.వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. జగనన్న విద్యాకానుక కింద విద్యార్ధుల చదువులకు అవసరమయ్యే వస్తువులను కిట్ల రూపంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఏటా పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేపట్టింది. పాఠశాలలను సిద్ధం చేయడంలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఎడ్యుకేషన్ అసిస్టెంట్లను భాగస్వాముల్ని చేసింది. గోరుముద్ద, ఎంటీఎఫ్ నిర్వహణను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇతర సిబ్బందికి అప్పగించింది. అడ్మిషన్ల కోసం ఇంటింటి సందర్శన చేపట్టి ప్రభుత్వ పథకాలపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలను టీచర్లు నిర్వహిస్తున్నారు. 3, 4, 5 తరగతుల విలీనాన్ని అనుసరించి పిల్లల తరలింపు, టీచర్ల సర్దుబాటు బాధ్యతలను క్షేత్రస్థాయిలో ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఈవోలు చర్యలు చేపట్టారు. ఇవీ 6 విభాగాలు శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2), ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2, 1, 2వతరగతులు) ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2, 1 నుంచి 5వ తరగతివరకు) ప్రీ హైస్కూళ్లు (3వ తరగతి నుంచి 7, 8వ తరగతి వరకు) హైస్కూలు (3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు) హైస్కూలు ప్లస్ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) -
సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైనా రెగ్యులరే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ (జూలై, 2022) పరీక్షలు రాసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురందించింది. ఈ పరీక్షల్లో పాసయ్యే వారిని కంపార్ట్మెంటల్ అని కాకుండా రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణించనుంది. వారికి రెగ్యులర్ విద్యార్థులకు మాదిరిగానే పరీక్షల్లో వచ్చిన మార్కుల ప్రకారం డివిజన్లను కేటాయించనుంది. ఈ మేరకు నిబంధనలు సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మెమో జారీ చేశారు. ఈ ఒక్క విద్యాసంవత్సరానికి మాత్రమే ఈ సడలింపు వర్తించనుందని పేర్కొన్నారు. 2021–22కి సంబంధించి పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలను జూన్ 6న విడుదల చేశారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా స్కూళ్లు సరిగా నడవకపోవడం, ముఖ్యంగా 8, 9 తరగతుల విద్యార్థులకు పాఠాల నిర్వహణ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వారు చాలా వెనుకపడ్డారు. దీంతో పదో తరగతి పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు. విద్యార్థులకు వెసులుబాట్లు.. కోవిడ్తో తలెత్తిన ఇబ్బందులతో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించేలా చర్యలు తీసుకుంది. సాధారణంగా రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిలై సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు ఆయా సబ్జెక్టులలో ఎన్ని మార్కులు సాధించినా కంపార్ట్మెంటల్ పాస్గానే పరిగణిస్తారు తప్ప డివిజన్లను కేటాయించరు. అయితే ఈసారి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపునిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్డ్ పరీక్షలకు పరీక్ష ఫీజు రద్దు జూలై 6 నుంచి 15 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు చెల్లించాల్సి న రుసుమును ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఈసారి రెగ్యులర్ పరీక్షల్లో పాసై కొన్ని సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చినవారికి బెటర్మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశం కూడా కల్పించింది. ఇంటర్మీడియెట్లో తప్ప పదో తరగతిలో ఇలా బెటర్మెంట్ పరీక్షల విధానం లేదు. కానీ కోవిడ్తో విద్యార్థులు ఇబ్బందిపడటంతో వారికి మార్కులను పెంచుకునేందుకు ఈ అవకాశం కల్పించింది. 49, అంత కంటే తక్కువ మార్కులు వచ్చినవారు రెండు సబ్జెక్టుల్లో బెటర్మెంట్ పరీక్షలు రాసుకునేందుకు వీలు కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షల సమయంలోనే ఈ బెటర్మెంట్ విద్యార్థులూ పరీక్షలు రాయనున్నారు. కాగా టెన్త్ విద్యార్థులకు మాదిరిగానే ఇంటర్మీడియెట్ విద్యార్థులను కూడా సప్లిమెంటరీ పరీక్షల్లో కంపార్ట్మెంటల్ పాస్గా కాకుండా రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణించి డివిజన్లు ఇవ్వాలని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. -
Telanagna: 2022-23 విద్యాసంవత్సరం క్యాలెండర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ను 2022-23 సంత్సరానికి గాను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. క్యాలెండర్ను పరిశీలిస్తే.. ►ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలల పనిదినాలు ►ఏప్రిల్ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజు ►వేసవి సెలవులు: ఏప్రిల్ 25, 2023 నుంచి జూన్ 11, 2023 వరకు ►ప్రైమరీ స్కూల్స్: ఉదయం 9am నుంచి 4pm వరకు తరగతులు ►ప్రాథమికోన్నత పాఠశాలలు: ఉదయం 9am నుంచి 4.15pm వరకు తరగతులు ►ఉన్నత పాఠశాలల తరగతులు: ఉదయం 9.30am నుంచి 4.45pm వరకు తరగతులు ►సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు దసరా సెలవులు (14రోజులు) ►జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు (5 రోజులు) -
షేర్డ్ పేరెంటింగ్: విడాకులు తీసుకున్నా విద్యార్థికి తల్లిదండ్రులే
ఇటీవల కోల్కతాలోని ఒక స్కూల్ పిల్లల అడ్మిషన్ ఫామ్లో తల్లిదండ్రులకు ‘మీరు డైవర్సీనా?’ అనే కాలమ్ పెట్టింది. విడాకులు తీసుకుని ఉంటే ఆ ఎడబాటును ఇంటివరకే పరిమితం చేయాలని పిల్లల చదువు విషయంలో సమాన బాధ్యత తీసుకోవాలని విద్యారంగ నిపుణులు చెప్పడమే ఇందుకు కారణం. ‘ఆన్ లైన్ క్లాస్లో అతన్ని రానీయవద్దు’ అని తల్లిగాని ‘స్కూల్ రిపోర్ట్స్ ఆమెకు పంపొద్దు’ అని తండ్రి గాని అనడానికి వీల్లేదని వీరు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువులో ‘భాగస్వామ్య పెంపకం’ తీసుకోకపోతే పిల్లలు ఘోరంగా దెబ్బ తింటున్నారని తేల్చి చెబుతున్నారు. విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు ఈ విషయమైనా సీరియస్గా ఆలోచించాలి. కోల్కతాలోని ‘సౌత్ సిటి ఇంటర్నేషనల్ స్కూల్’ ఈ సంవత్సరం పిల్లల అడ్మిషన్ ఫామ్స్లో తల్లిదండ్రులకు ‘మీరు విడాకులు తీసుకున్నారా/విడిగా ఉంటున్నారా/ సింగిల్ పేరెంటా’ అనే కాలమ్ పెట్టింది. అది తప్పనిసరిగా నింపాల్సిందే. ‘ప్రతి ఏటా పెరుగుతున్న విడాకుల కేసుల దరిమిలా పేరెంట్స్ వచ్చి పిల్లల విషయంలో పెడుతున్న పేచీలే ఇందుకు కారణం’ అని స్కూల్ యాజమాన్యం తెలిపింది. వీరి పద్ధతి ప్రకారం స్కూల్లో పిల్లల్ని వేయాలనుకుంటున్న తల్లిదండ్రులు ‘తాము విడిపోయినా, గొడవలతో దూరంగా ఉంటున్నా, భర్త/భార్య మరణించి సింగిల్గా ఉంటున్నా’ ఆ సంగతి తెలియ చేయాలి. ‘దీనివల్ల మేము మా దగ్గర చదువుతున్న విద్యార్థి గురించి ఎలాంటి శ్రద్ధ పెట్టాలో అవగాహన వస్తుంది’ అని తెలిపింది. అంతేకాదు, విడాకులు తీసుకుని ఉన్నా, మనఃస్పర్థలతో దూరంగా ఉంటున్నా తల్లిగాని తండ్రిగాని పిల్లల్ని స్కూల్లో చేర్పించాలనుకుంటే యాజమాన్యం ఆ విడిపోయిన భాగస్వామికి సమాచారం ఇస్తుంది. ‘మా దగ్గర మీ పిల్లలు చేరుతున్నారు. ఈ సంగతి మీకు తెలుసా? మా స్కూల్లో చేర్పించడం మీకు సమ్మతమేనా?’ అని అడుగుతుంది. సమ్మతి పత్రం తీసుకుంటుంది. అంతే కాదు ‘తండ్రిని పిల్లల్ని చూడనివ్వద్దు అని తల్లి... తల్లిని పిల్లల్ని కలవనివ్వదు అని తండ్రి’ చెప్పినా అందుకు అంగీకరించదు. పిల్లల చదువు, ప్రోగ్రెస్ రిపోర్ట్సు ఇద్దరికీ పంపాల్సిందేనని నిర్ణయించింది. పిల్లల చదువు గురించి వాకబు చేసే హక్కు ఇద్దరికీ ఉంటుందని, క్లాస్ టీచర్తో మాట్లాడవచ్చునని, పేరెంట్స్ మీటింగ్కు హాజరు కావచ్చునని ఈ స్కూలు తెలిపింది. ‘ఇందుకు కారణం మా దగ్గరకు చాలామంది డైవోర్సీలు వచ్చి విడిపోయిన పార్టనర్ని స్కూలు దగ్గరకు రానివ్వొద్దు అని చెప్పడమే. ఇలా చేయడం వల్ల పిల్లల చదువు సరిగ్గా సాగదు. చదువు విషయంలో పిల్లలు తల్లిదండ్రుల సపోర్ట్ కోరుకుంటారు. విద్యారంగ నిపుణులు కూడా అదే చెబుతున్నారు. వారి హక్కును తల్లిదండ్రులు కాదనడానికి లేదు’ అని యాజమాన్యం తెలిపింది. షేర్డ్ పేరెంటింగ్ దీనినే తెలుగులో భాగస్వామ్య పెంపకం అనొచ్చు. భార్యాభర్తలకు తాము విడిపోయే హక్కు ఉంది. విడిపోక తప్పని పరిస్థితులు కొందరికి వస్తాయి కూడా. అంతమాత్రం చేత వారు తల్లిదండ్రులుగా ఉండే బాధ్యతను విస్మరించడానికి వీల్లేదని ఈ షేర్డ్ పేరెంటింగ్ భావన చెబుతోంది. పిల్లల పెంపకం విషయంలో పంచుకోవాల్సిన బాధ్యతలను అలాగే కొనసాగించాలని దీని అర్థం. కలిసి లేని తల్లిదండ్రుల వద్ద పెరుగుతున్న పిల్లలను ఇటీవల అధ్యయనం చేసిన విద్యారంగ నిపుణులు బాల నేరస్తులుగా మారుతున్న వారిలో, డ్రగ్స్కు అలవాటు పడుతున్నవారిలో, స్కూళ్లలో చదువులో వెనుకబడి కుంగిపోతున్నవారిలో విడిపోయిన తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి దగ్గరే పెరుగుతున్న పిల్లలు ఎక్కువమంది ఉండటం గమనించారు. విడాకుల తర్వాత పిల్లల కేర్టేకర్లు మారిన తల్లిగాని తండ్రిగాని తమతో లేని పార్టనర్ మీద పిల్లలకు చెడు మాటలు చెప్పడం, వారిని కలవడానికి పూర్తిగా నిరాకరించడం వ్యక్తిత్వం విషయంలోనే కాదు చదువు విషయంలో కూడా చాలా ప్రభావం చూపుతున్నట్టుగా తెలుసుకున్నారు. విడిపోయిన కోపంతో పిల్లల్ని దూరంగా ఉంచాలని స్కూళ్ల యాజమాన్యాల దగ్గరకు వచ్చి తమ అనుమతి లేకుండా తండ్రి/తల్లిని రానివ్వొద్దని డిమాండ్స్ పెట్టడమే ఇప్పుడు స్కూలు యాజమాన్యాల కొత్త విధానాలకు కారణం అవుతోంది. కలిసే సందర్భాలు ఉండాలి పిల్లల పుట్టిన రోజులు, స్కూల్ డే, పేరెంట్స్ టీచర్ మీటింగ్ సమయాలు... ఇలాంటి సందర్భాల్లో పిల్లల కోసం కలవడం తప్పనిసరి అని ఫ్యామిలీ కౌన్సిలర్లు కూడా సూచిస్తున్నారు. ‘అమ్మా నాన్నా ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోవచ్చు. కాని నా కోసం అప్పుడప్పుడు కలుస్తారు’ అనే చిన్న ఆశ పిల్లల్ని చాలా ఉత్తేజ పరుస్తుంది. విడిపోయిన తల్లిదండ్రులు ఎప్పుడో ఒకసారి పిల్లలతో రెస్టరెంట్కు వెళ్లడం పిల్లలకు తక్కువ వరం కాదు. ఏ విడాకుల్లోనైనా భార్యాభర్తల కంటే ఎక్కువ బాధితులు పిల్లలే. చదువు వారికి అత్యంత ముఖ్యమైన భవిష్యత్ సాధనం. ఆ నిచ్చెనకు అటూ ఇటూ తల్లిదండ్రులు నిలవాల్సిందేనని నిపుణులు చెబుతున్న మాట దూరమైన భార్యాభర్తలు వినదగ్గది. ఆలోచించదగ్గది. చదువులో ఇద్దరూ అవసరమే కలిసి ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులతో చదువుకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్పుకుని వొత్తిడి తగ్గించుకుంటారు. కొన్ని సలహాలు తల్లి ఇస్తే కొన్ని తండ్రి చెప్తేగాని ధైర్యం చిక్కదు. హఠాత్తుగా తల్లిదండ్రులు విడిపోతే ఈ విషయం లో పెద్ద అగాథం వస్తుంది. పిల్లలు పైకి నోరు తెరిచి చెప్పకపోయినా తల్లి దగ్గరో/తండ్రి దగ్గరో హుషారుగా పెరుగుతున్నట్టు కనిపించినా వారి లోలోపల ఎన్నో ఆలోచనల వొత్తిడి ఉంటుంది. అసలే చదువుకు సంబంధించిన వొత్తిడి ఉన్నప్పుడు ఈ వొత్తిడి కూడా పని చేయడం వారి ప్రవర్తనను విపరీతంగా ప్రభావితం చేస్తుంది. ‘కొన్ని అమ్మకు చెప్పుకుందాం. కొన్ని నాన్నకు చెప్పుకుందాం’ అనే ఛాయిస్ వారికి తల్లిదండ్రులు కలిసి ఉన్నా విడిపోయినా తప్పక ఉండాలి. ఏ మాట ఎవరు వింటారో పిల్లలకు తెలుసు. తమ కంఫర్ట్ సాధించుకోవాలనుకుంటారు. ఒక ఆప్షన్ పూర్తిగా కూల్చివేస్తే వారు కుంగిపోతారు. -
AP: పాఠశాల విద్యాశాఖకు మున్సిపల్ స్కూళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యా శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఈ మేరకు జీవో 84 ను విడుదల చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసు విషయాలతో సహా పాఠశాలల పరిపాలన బాధ్యతలను ఇకపై పాఠశాల విద్యా శాఖ చేపడుతుంది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని జిల్లా, మండల పరిషత్ స్కూళ్లు, టీచర్ల బాధ్యతలు అప్పగించిన విధంగానే మున్సిపల్ స్కూళ్లనూ విద్యాశాఖకు అప్పగించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో జెడ్పీ, ఎంపీపీ టీచర్ల సర్వీసుల (ఏకీకృత సర్వీసులు) విలీన ప్రతిపాదన కోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలో మున్సిపల్ టీచర్ల విషయంలోనూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక సర్వీసు రూల్సును జారీచేయనుంది. విద్యా శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకు ఈ స్కూళ్లలోని బోధనేతర సిబ్బంది యధాతథంగా కొనసాగుతారు. స్వీపర్లు, ఇతర కంటింజెంటీ సిబ్బందిని పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకుంటుంది. పాఠశాలల స్థిర, చరాస్తులపై పూర్తి యాజమాన్య హక్కులు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకే ఉంటాయని జీవోలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లæ స్కూళ్లలో 13,948 టీచర్ పోస్టులుండగా 12,006 మంది పనిచేస్తున్నారు. 1,942 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2000 సంవత్సరం వరకు ఈ పాఠశాలల్లో నియామక ప్రక్రియను మున్సిపల్ విభాగమే చూసేది. తరువాత విద్యాశాఖ పరిధిలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)లకు అప్పగించారు. ఇతర విభాగాల టీచర్ల మాదిరిగానే మున్సిపల్ టీచర్లు కూడా 010 పద్దు ద్వారా వేతనాలు అందుకుంటున్నారు. 11 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని స్కూళ్ల పర్యవేక్షణకు విద్యాధికారుల పోస్టులను ఏర్పాటుచేసి సీనియర్ హెడ్మాస్టర్లను తాత్కాలిక ప్రాతిపదికన వాటిలో నియమించారు. మున్సిపాలిటీలలోని స్కూళ్ల అకడమిక్ వ్యవహారాలను చూసేందుకు తాత్కాలికంగా సీనియర్ ఉపాద్యాయులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ స్కూళ్ల పర్యవేక్షణకు ఓ ప్రత్యేక విధానం ఉంది. ఈ విధానం మున్సిపల్ స్కూళ్లలో లేకపోవడంతో పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. పైగా ప్రజలకు మౌలిక సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలను అమలులో నిరంతరం మునిగిపోయే మున్సిపాలిటీలు కీలకమైన విద్యా వ్యవహారాలపై దృష్టి సారించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ స్కూళ్ల పర్యవేక్షణ, నిర్వహణను విద్యా శాఖకు బదలాయించారు. దీని వల్ల మున్సిపల్ టీచర్ల సీనియారిటీకి, పదోన్నతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పైగా ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ ఉపాధ్యాయులకు వర్తించే (నోషనల్ ఇంక్రిమెంట్లు, పీఎఫ్, పదోన్నతులు, బదిలీలు వంటివి) అన్ని ప్రయోజనాలూ మున్పిపల్ టీచర్లకూ అందుతాయని వివరించింది. దీనివల్ల మున్సిపల్ టీచర్లకు ఇప్పటికంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. సర్వీసు అంశాలకు రక్షణ కల్పిస్తూ వీటి పర్యవేక్షణను కూడా ఇకపై పాఠశాల విద్యాశాఖ చూస్తుంది. ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాన్ని పెంపొందిచేలా ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం టీచర్లకు, విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. -
1998 DSC: ఎమ్టీఎస్పై నియామకాలు
సాక్షి, అమరావతి: 1998 డీఎస్సీలో పోస్టుల ఎంపికకు అర్హత సాధించినప్పటికీ, నియామక అవకాశం దక్కని అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. 24 ఏళ్ల వారి కలలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారు. వీరు ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిని మినిమం టైమ్ స్కేలుపై టీచర్లుగా నియమించేందుకు పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ గురువారం మెమో జారీ చేశారు. 1998 డీఎస్సీ ఎలిజిబుల్ అభ్యర్థుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను స్వీకరించనున్నారు. వీరిని 2008 డీఎస్సీ అభ్యర్థులకు మాదిరిగానే ఎమ్.టీ.ఎస్ పై టీచర్ పోస్టుల్లో అడహాక్ పద్ధతిలో నియమిస్తారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్, కేజీబీవీ అకడమిక్ ఇన్స్ట్రక్టర్, మోడల్ స్కూళ్లలో గెస్ట్ లెక్చరర్లు, డీఈవో పరిధిలోని టీచర్ల పూల్లో నియమించనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ను ఆదేశించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 98 డీఎస్సీ ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేసి న్యాయం చేకూర్చడం పట్ల అభ్యర్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయం వల్ల 4,565 మందికి ఇప్పుడు న్యాయం జరగనుందని ఎమ్మెల్సీ కల్పాలతారెడ్డి తెలిపారు. -
కార్పొరేట్ స్కూళ్లలోనూ 'కోటా'
సాక్షి, అమరావతి: పేద విద్యార్ధులకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించేలా చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2022 – 23 విద్యాసంవత్సరం నుంచి దీన్ని పక్కాగా అమలు చేసేలా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. తద్వారా వీటిల్లో ఏటా లక్ష సీట్లు పేద విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం పేద పిల్లలందరికీ కార్పొరేట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించేలా ‘ఇండస్ యాక్షన్’ అనే సంస్థతో పాఠశాల విద్యాశాఖ ఎంవోయూ కూడా కుదుర్చుకుంది. గవర్నెన్స్, టెక్నాలజీ సపోర్టు తదితర అంశాల్లో సంస్థ ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ సంస్థ ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఆర్టీఈ చట్టం అమలుకు తోడ్పాటునిచ్చి లక్షల మంది పేద విద్యార్ధులకు మేలు చేకూర్చింది. ఆర్టీఈపై న్యాయ వివాదాలు.. దేశంలో 6 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యకోసం కేంద్ర ప్రభుత్వం 2009లో జాతీయ విద్యాహక్కు చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంలోని సెక్షన్ 12 (1సి) ప్రకారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్, నాన్ మైనారిటీ, గుర్తింపు పొందిన ప్రతి పాఠశాల యాజమాన్యాలు నర్సరీ, ఎల్కేజీ, లేదా ఒకటో తరగతి నుంచి సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను కేటాయించాలి. చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించి దశాబ్దం దాటినా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010లోనే ఆర్టీఈ చట్టాన్ని నోటిఫై చేసినా విధానపరమైన కారణాలతో పాటు కోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా పేద విద్యార్ధులకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం కోటా అమలుకు నోచుకోలేదు. సీఎం ఆదేశాలతో కోటాపై కదలిక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీఈ చట్టం అమలుపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలకు 25 శాతం కోటా ప్రకారం సీట్లు కేటాయించేలా చర్యలు చేపట్టారు. వరుసగా రెండేళ్లు కరోనా కారణంగా పాఠశాలలు మూతబడిన నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది. తాజాగా ఈ ఏడాది నుంచి కోటా అమలుకు సన్నద్ధమైంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్ తెలిపారు. ఫీజులపై నిర్ణయానికి కమిటీ అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించేందుకు 25 శాతం కోటా తోడ్పడనుంది. ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్ స్కూళ్లలో విద్యను పేద విద్యార్థులు అందుకోలేకపోతున్నారు. ఆర్టీఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం కోటా కింద సీట్లను కేటాయించి ఫీజులను ప్రభుత్వమే యాజమాన్యాలకు చెల్లిస్తుంది. స్కూళ్లు, తరగతుల వారీగా చెల్లించాల్సిన ఫీజులపై పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే కమిటీని నియమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా తరగతుల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని అనుసరించి ప్రైవేట్ స్కూళ్లకు ఫీజులను చెల్లించనున్నారు. ఏటా లక్ష మందికి అవకాశం ఆర్టీఈ చట్టం ప్రకారం 25 శాతం కోటా అమలుతో రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో దాదాపు లక్ష సీట్లు పేద పిల్లలకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది లెక్కల ప్రకారం 9,500 స్కూళ్లలో 35 వేల సీట్లు ఈ విద్యాసంవత్సరంలో పేద పిల్లలకు అందనున్నాయి. -
బడి పిల్లల మధ్యాహ్న భోజనంలో మార్పులకు కేంద్రం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని (ప్రధానమంత్రి పోషక్ పథకం) సమూలంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు పోషక విలువలున్న ఆహారాన్ని అందించేందుకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని సూచించింది. విద్యార్థులందరికీ మధ్యాహ్నం పోషకాలు ఎక్కువగా ఉండే రాగిజావను ఇవ్వాలని, దీంతోపాటే మొలకలు, బెల్లం అందించాలని పేర్కొంది. దీని అమలుకు గల సాధ్యాసాధ్యాలపై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు కోరింది. అయితే, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాల్సిఉందని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అంటున్నారు. దీనికి అదనపు నిధులు ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనా స్పష్టత లేదని విద్యాశాఖలో అదనపు డైరెక్టర్ స్థాయి అధికారి ఒకరు చెప్పారు. గతంలో కూడా మధ్యాహ్నం భోజనంతోపాటు పల్లీ పట్టీ ఇవ్వాలని కేంద్రం సూచించిందని, పెరిగిన ధరల ప్రకారం దీన్ని అమలు చేయడం సాధ్యం కాలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాగిజావను విధిగా ఇవ్వాల్సిందేనని కేంద్రంనుంచి ఒత్తిడి వస్తున్నట్టు చెప్పాయి. ఇప్పుడిచ్చే ఆహారంలో స్వల్ప మార్పులు చేసి రాగిజావ, బెల్లం, మొలకలు అందించే విషయం పరిశీలిస్తున్నామని, దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. జాతీయ సర్వే ప్రకారమే.. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై కేంద్రస్థాయిలో కొన్నేళ్లుగా తరచూ సర్వేలు చేస్తున్నారు. స్కూలు సమయానికి విద్యార్థుల కుటుంబాల్లో సరైన పోషక విలువలున్న ఆహారం అందించడం లేదని సర్వేలో తేలింది. తల్లిదండ్రులు ఉపాధి కోసం హడావిడిగా ఉదయం వెళ్లాల్సి రావడం, విద్యార్థులు కూడా ఇంట్లో ఉన్నదేదో తిని వస్తున్నారని, దీంతో చాలామందిలో పోషకాహార లోపం కన్పిస్తోందని వెల్లడైంది. ఐదేళ్లుగా కనీసం 40 శాతం మంది విద్యార్థులు రక్తహీనత, ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. 32 శాతం మందిలో పోషక విలువలు లోపించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడైంది. వీళ్లంతా ఎక్కువ రోజులు స్కూలుకు హాజరవ్వడం లేదని, ఫలితంగా విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో బడిలోనే పోషకాలతో కూడిన ఆహారం అందించాలని ప్రతిపాదించింది. ఇందులో ప్రధానంగా రాగిజావ ఇవ్వాలని భావిస్తున్నారు. దీన్ని రోజూ ఇవ్వడమా? వారంలో కొన్ని రోజులు ఇవ్వడమా? అనే దానిపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు అంటున్నారు. నిధుల సర్దుబాటు ఎలా? మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులు మంజూరు చేస్తున్నాయి. ఈ పథకానికి ఏటా రూ.550 కోట్లు ఖర్చవుతుంది. ప్రస్తుతం విద్యార్థులకు రోజుకో విధంగా ఆహారం ఇస్తున్నారు. వారానికి మూడు రోజులు గుడ్డు, మిగతా రోజుల్లో ఆకు కూరలు, కాయగూరలు, సాంబార్, కిచిడీ ఇలా పలు రకాలుగా అందిస్తున్నారు. అయితే, కేంద్రం మెనూ ప్రకారం ధరలను నిర్ణయిస్తారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవి ఉండటం లేదని రాష్ట్ర అధికారులు అంటున్నారు. ఒక్కో గుడ్డు ధర దాదాపు రూ.6 ఉంటే.. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం రూ.2 మాత్రమే ఉంటోంది. దీంతో నిధుల సర్దుబాటు సమస్య వస్తోంది. ఇప్పుడు కూడా రాగిజావ, మొలకల కోసం ప్రత్యేక నిధులు అవసరమవుతాయని, లేని పక్షంలో పథకం అమలులో అనేక ఇబ్బందులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. (చదవండి: అంచు చీరలే ఆ‘దారం’)