ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలి: సీపీఎం | english medium course to be started, says cpm | Sakshi

ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలి: సీపీఎం

Feb 22 2016 3:14 AM | Updated on Aug 13 2018 8:10 PM

రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది. తల్లిదండ్రుల కోరిక మేరకు ఇప్పటికే నిర్వహిస్తున్న ఆంగ్ల మాధ్యమం తరగతులను వచ్చే విద్యాసంవత్సరానికి (2016-17) అనుమతించాలని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ గ్రామాల్లోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించి తమ సొంత ఖర్చులతో తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించుకుంటున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement