పాతబస్తీలో పలు మామిడిపండ్ల గోదాములపై పోలీసులు గురువారం దాడి చేశారు.
హైదరాబాద్ : పాతబస్తీలో పలు మామిడిపండ్ల గోదాములపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ సందర్భంగా గోదాముల్లో పండ్లను రసాయనాలతో పండిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పండ్ల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీస్ స్టేషన్కి తరలించారు. అతడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.