కీసర-యాదాద్రి బైపాస్ వద్దు: జూలకంటి | Kisara-yadadri do not want to bypass: JULAKANTI | Sakshi
Sakshi News home page

కీసర-యాదాద్రి బైపాస్ వద్దు: జూలకంటి

Published Sat, Jun 18 2016 2:41 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

కీసర-యాదాద్రి బైపాస్ వద్దు: జూలకంటి - Sakshi

కీసర-యాదాద్రి బైపాస్ వద్దు: జూలకంటి

సాక్షి, హైదరాబాద్: కీసర నుంచి యాదాద్రికి నాలుగు లేన్ల బైపాస్ రోడ్డు వేయాలన్న ఆలోచనను సీఎం కేసీఆర్ విరమించుకోవాలని సీపీఎం నేత  జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుత రోడ్డునే విస్తరించాలని, కొత్తగా బైపాస్ వేయడం వల్ల ఆర్థిక భారంతోపాటు 4, 5 గ్రామాల రైతులు నష్టపోతారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బైపాస్ నిర్మాణం పేరిట దాదాపు వెయ్యి ఎకరాల మేర రైతులు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ భూమి కూడా విలువైనదని, పరిహారం కింద రైతులకు రూ.4, 5 లక్షలు చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 15 రోజులుగా రైతులు నిరసనలు తెలుపుతున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement