ఇద్దరు సీఎంలపై ఒత్తిడి తేవాలి : మందకృష్ణ | manda krishna madiga speaks over SC classification | Sakshi
Sakshi News home page

ఇద్దరు సీఎంలపై ఒత్తిడి తేవాలి : మందకృష్ణ

Published Wed, Aug 3 2016 3:29 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

manda krishna madiga speaks over SC classification

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అధికార పార్టీకి చెందిన మాదిగ ఎమ్మెల్యేలు  వర్గీకరణ కోసం సీఎంలపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

ఈనెల 10వ తేదీ లోపు 2 రాష్ట్రాల సీఎంలు అఖిలపక్షాలతో కలసి ఢిల్లీ వచ్చేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తున్న దీక్షలో మంగళవారం మాదిగ ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ..మాదిగ హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో మాదిగ ఎమ్మెల్యేలంతా  కలసి రా వా లని, ఈనెల 10న జరగనున్న మహాధర్నాకు హాజరు కావాలని కోరారు. ఆందోళనలో కమ్మరి రాజయ్యతో పాటు ఈదురు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement