
నిందితుడి ఊహాచిత్రం విడుదల
హైదరాబాద్: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద బుధవారం ఉదయం అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన నిందితుడి ఊహా చిత్రాన్ని వెస్ట్ జోన్ పోలీసులు విడుదల చేశారు. నిందితుడు వదిలి వెళ్లిన బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మెహిదీపట్నంలోని ఓ సూపర్ మార్కెట్లో సరుకులు కొన్నాడు. బ్యాగులో దొరికిన బిల్లు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత నెల 13న సూపర్ మార్కెట్లో అగంతకుడు వస్తువులు కొన్నాడు. అక్కడి సిసి కెమెరాల పుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ పుటేజ్లను పోలీసులు నిత్యానందరెడ్డికి చూపించారు.
**