మద్యం మత్తులో కత్తితో దాడి | one injured in man attacks with knife | Sakshi

మద్యం మత్తులో కత్తితో దాడి

Jan 10 2017 12:42 PM | Updated on Aug 1 2018 2:31 PM

మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని "డి"కాలనిలో సోమవారం అర్ద రాత్రి చోటుచేసుకుంది.

హైదరాబాద్: మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని "డి"కాలనిలో సోమవారం అర్ద రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న ముగ్గురు వ్యక్తులు సోమవారం రాత్రి మద్యం సేవించారు. అనంతరం క్రికెట్‌ బెట్టింగ్‌ కాశారు. ఈ నేపధ్యంలో దేవేందర్‌(30) అనే వ్యక్తిపై యూసుఫ్‌ కత్తితో దాడి చేశాడు. దీంతో అతనికి ఛాతిపై గాయాలయ్యాయి. గాయపడిన దేవేందర్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. నిందితుడు యూసుఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ దేవేందర్‌ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement