ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ ఫీజు గడువు పెంపు | Open school SSC and Inter fee Deadline increment | Sakshi

ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ ఫీజు గడువు పెంపు

Feb 28 2017 1:17 AM | Updated on Sep 5 2017 4:46 AM

ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌/మే నెలల్లో నిర్వహించే ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు మార్చి 8లోగా ఫీజు చెల్లించాలని సొసైటీ తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌/మే నెలల్లో నిర్వహించే ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు మార్చి 8లోగా ఫీజు చెల్లించాలని సొసైటీ తెలిపింది. ఒక్కో పేపరుకు రూ. 25 ఆలస్య రుసుముతో 9 నుంచి 13వ తేదీ వరకు, రూ. 50 ఆలస్య రుసుముతో 14 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చని పేర్కొంది.

ఫీజును మీసేవా/ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల్లోనే చెల్లించాలని స్పష్టం చేసింది. ఎస్సెస్సీ పరీక్ష కోసం ఒక్కో పేపరుకు రూ. 100, ఇంటర్‌కు ఒక్కో పేపరుకు రూ. 150 చెల్లించాలని సొసైటీ డైరెక్టర్‌ వెంకటేశ్వరవర్మ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement