
సాక్షి, అమరావతి: కరోనా క్లిష్ట సమయంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ స్కూల్ విధానంలో చదువుతున్న టెన్త్, ఇంటర్ విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో 1.68 లక్షల మంది ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులు పాస్ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఓపెన్ స్కూల్ విద్యార్థులను పైరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి: ఓపెన్ స్కూల్ విద్యార్థులంతా పాస్)
Comments
Please login to add a commentAdd a comment