రేపటి నుంచి పీజీఈసెట్‌ | PG ECET - 2017 from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి పీజీఈసెట్‌

Published Sun, May 28 2017 1:58 AM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

PG ECET - 2017 from tomorrow

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ  

హైదరాబాద్‌: పీజీఈసెట్‌– 2017 (ఇంజనీరింగ్‌ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలు) రేపటి (29వ తేదీ) నుంచి ప్రారంభంకానున్నట్లు పీజీఈసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ రమేశ్‌బాబు తెలిపారు. ప్రవేశ పరీక్షల కోసం తొలిసారి ఆన్‌లైన్‌ పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. జూన్‌ 1 వరకు జరిగే ఈ పరీక్షలకు 1.30 నిమిషాల ముందు గానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అభ్య ర్థులకు సూచించారు.

పరీక్ష రాసిన రోజు రాత్రి 8 గంటలకు జవాబు పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసు కోవచ్చ న్నారు. నిమిషం ఆలస్య మైనా పరీక్షకు అనుమ తించబోమన్నారు. ఫలితాలను జూన్‌ 12న  విడుదల చేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement