Ramesh Babu
-
జైలుకు వెళ్లడానికి కారణం ఇదే.. 14 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు ప్రముఖ నిర్మాత
టాలీవుడ్లో కొమరంపులి, ఖలేజా వంటి బిగ్ చిత్రాలను నిర్మాత సింగనమల రమేష్బాబు తాజాగా ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఒక కేసు విషయంలో దాదాపు 70 రోజుల పాటు జైలులో కూడా ఆయన ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ మీడియా ముందుకు ఎందుకొచ్చారు..? అనే విషయం గురించి ఆయన ఇలా చెప్పారు. ''నేనొక ఫిల్మ్ ఫైనాన్షియర్ని. సినిమా అంటే పాషన్తో నిర్మాతగా మారాను. సినిమా నాకు తల్లి లాంటిది. మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి.. ఇలా పలువురు వ్యక్తులకు అమ్మానని నాపై కేసు పెట్టారు. 14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశాను. అది తప్పుడు కేసని తేలింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. తప్పుడు కేసులు కోర్టు ముందు నిలబడవు. నా న్యాయపోరాటం గెలిచింది' అని నిర్మాత శింగనమల రమేష్ బాబు అన్నారు . ‘కొమరంపులి’, ‘ఖలేజా’ లాంటి బిగ్ స్టార్ చిత్రాలని నిర్మించిన ఆయన ఓ కేసు నిమిత్తం 14 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు ఇటీవల ఆయన్ని నిర్దోషిగా తేల్చి, కేసు కొట్టి వేసింది. ఈ క్రమంలోనే ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. రమేష్ బాబు.. మీపై కేసు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? నాకు ఎలాంటి కక్ష సాధింపులు లేవు. ఏదైనా న్యాయపరంగానే పోరాటం చేస్తా.భవిష్యత్లో సినిమాల్లో కొనసాగుతారా ? నేనొక ఫిల్మ్ ఫైనాన్షియర్ని.. సినిమా అంటే పాషన్తో నిర్మాతగా మారాను. సినిమా నాకు తల్లి లాంటిది. భవిష్యత్తులోనూ ఇదే రంగంలో కొనసాగుతా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ హీరోలుగా చేశారు. హిట్ అందుకున్నారు. ఇప్పుడు డైరెక్షన్ రైటింగ్ చేయాలని అనుకుంటున్నారు. నేను కూడా నిర్మాతగా చేస్తా. ఫైనాన్షియర్గానూ చేస్తాను.మీ మీద కేసు పెట్టింది ఎవరు..? వాళ్లకు సినీ రంగంతో సంబంధం ఉందా..? నాపై కేసు పెట్టిన వాళ్లు ఇండస్ట్రీ చెందిన వారు కాదు.అగ్ర హీరోల చిత్రాలను నిర్మించి నష్టపోయారా? అప్పట్లో సినిమాలు ఆరు నెలలు, లేదా సంవత్సరంలోగా పూర్తయ్యేవి. కానీ నా దురదృష్టం కొద్ది నేను తెరకెక్కించిన కొన్ని పెద్ద హీరోల చిత్రాలు దాదాపు మూడేళ్ల సమయం చిత్రీకరణలోనే గడిచిపోయింది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఆ రెండు చిత్రాలకు రూ.100 కోట్ల వరకూ నష్టపోయా.అసలు మీపై పెట్టిన కేసు ఏమిటి..?రూ.14 కోట్లు మోసం చేశానని నా మీద అభియోగం మోపారు. మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి.. ఇలా పలువురు వ్యక్తులకు అమ్మానని కేసు పెట్టారు. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. ఇప్పటికీ ఆ ఆస్తులు నా పేరు మీదే ఉన్నాయి. మీ స్టొరీనే సినిమా కథలా వుంది.. సినిమా చేసే అవకాశం ఉందా ? వెబ్ సిరీస్ చేస్తే వెయ్యి ఎపిసోడ్లు పెట్టొచ్చు. అయితే, నా కథ ఎవరు చూస్తారు(నవ్వుతూ)ఫైనాన్స్ బిజినెస్ ఎంత లాభదాయకం ? మేము సంపాదించింది ఫైనాన్స్ బిజినెస్ వలనే. నాన్న గారి నుంచి అది నాకు వచ్చింది. ఐతే సినిమా మేకింగ్ అనేది ఎప్పటికీ ఓ జూదమే. ఆ గ్యాంబ్లింగ్ వలనే నాకు రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది. అయితే ప్రజెంట్ సినిమా నిర్మాణం బావుందని వింటున్నాను. నిర్మాతకు పది రూపాయలు మిగులుతాయని బయట అంటున్నారు. ఈ జర్నీలో మీరు నేర్చుకున్న పాఠం ? 24 క్రాఫ్ట్స్ మన గ్రిప్లో ఉన్నప్పుడే సినిమా తీయాలి.ఖలేజా సినిమాకి సి కళ్యాణ్ గారు ఒక పార్టనర్ కావడానికి కారణం ? కాదండీ.., నా డబ్బుతో ఆయన సినిమా పూర్తి చేశారు. కష్టాల్లో వున్నప్పుడు నాకు దేవుడే సపోర్ట్గా వున్నారు. ఎలాంటి సినిమాలు చేయాలని వుంది ? కథనే నా హీరో. కథని నమ్ముకొని సినిమా చేస్తాను. పెద్ద సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు అన్ని రకాల సినిమాలు చేయాలని వుంది. తర్వలోనే ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వుండే అవకాశం వుంది. -
పవన్ కల్యాణ్, మహేశ్ బాబు సినిమాలతో రూ.100 కోట్ల నష్టం: టాలీవుడ్ నిర్మాత సంచలన కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత సింగనమల రమేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇద్దరు పెద్ద హీరోలతో తీసిన సినిమాల వల్ల దాదాపు రూ.100 కోట్లు నష్టపోయినట్లు ఆయన తెలిపారు. తాజాగా ఏర్పాటు ప్రెస్మీట్లో మాట్లాడిన నిర్మాత మహేశ్ బాబు ఖలేజా, పవన్ కల్యాణ్ కొమరం పులి చిత్రాల గురించి మాట్లాడారు. ఆ రెండు సినిమాలతో వచ్చిన నష్టం గురించి ఆయన వెల్లడించారు.కొమరం పులి, ఖలేజా లాంటి చిత్రాలతో భారీగా నష్టపోయినట్లు సింగనమల రమేశ్ వెల్లడించారు. ఆ రోజుల్లో కేవలం ఏ సినిమా అయినా ఏడాదిలోపే పూర్తి చేసేవాళ్లమని చెప్పుకొచ్చారు. నా దురదృష్టం వల్లనేమో కొమరం పులి, ఖలేజా సినిమాలు నిర్మించడంలో ఎక్కువ టైమ్ తీసుకొవాల్సి వచ్చిందన్నారు. ఈ రెండు ఆలస్యమవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని రమేశ్ అన్నారు. ఈ రెండు సినిమాలతో నష్టపోయినా నాకు.. ఏ హీరో కూడా సపోర్ట్ చేయలేదన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి అయ్యో పాపం అని.. కనీసం పలకరించిన పాపాన పోలేదని నిర్మాత రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.కాగా.. 2011లో గచ్చిబౌలిలో హైదరాబాద్ వ్యాపారవేత్తను బెదిరించి రూ.12 కోట్లు స్వాహా చేశారని రమేష్ బాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో జనవరి 31 2025న రమేష్ బాబును కోర్టు నిర్దోషిగా తేల్చింది. అందువల్లే ఆయన తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు. కొమరం పులి, ఖలేజా సినిమాల పైన 100 కోట్లు నష్టపోయాను.హీరోలు కనీసం 'అయ్యో పాపం' అని కూడా అనలేదు- Singanamala Ramesh (Producer and Film Financier) pic.twitter.com/6KQtgFCaBZ— idlebrain.com (@idlebraindotcom) February 5, 2025 -
‘నువ్వు మా పాలేరువి రా’
రామవరప్పాడు: ‘ఒరేయ్.. తోలు తీస్తా, నువ్వు ఎవడవిరా మాకు చెప్పడానికి.. ఉద్యోగం నుంచి తీయించేస్తా, మా కింద పాలేరువి’ అంటూ జనసేన నేత చలమలశెట్టి రమేష్ ఎనికేపాడు పంచాయతీ కార్యదర్శి విద్యాధర్ను బూతులు తిట్టడం తీవ్ర దుమారం రేపింది. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు శివాలయం పల్లాల్లో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగా, మహత్మా గాంధీ విగ్రహాల ఆవిష్కరణలో మంగళవారం జనసేన నాయకులు రణరంగం సృష్టించారు. ఈ విగ్రహాల ఆవిష్కరణకు హాజరైన చలమలశెట్టి రమేష్ రంకెలేస్తూ వీధి గూండా మాదిరి పంచాయతీ కార్యదర్శిని బూతులు తిట్టి, కాలర్ పట్టుకుని తొయ్యడం కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై ఈ రీతిగా చేయడాన్ని పలువురు గ్రామస్తులు ప్రశ్నించడంతో గొడవ కాస్తా పెద్దదైంది. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల జనసేన పారీ్టలో చేరిన గ్రామానికి చెందిన టంకసాల సుబ్బారావు, ఆయన కుమారుడు ఉపసర్పంచ్ టంకసాల శివ ప్రసాద్ వంగవీటి మోహన్ రంగా, గాంధీ విగ్రహాల ఏర్పాటుకు పూనుకున్నారు. బీసీ నాయకుడైన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని జనసేన మండల నాయకుడు పొదిలి దుర్గారావు సూచించారు. అయితే టంకసాల సుబ్బారావు, టంకసాల శివప్రసాద్లు ఎవరికి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి రంగా, గాంధీ విగ్రహాల ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు. ఈ విగ్రహాల ఆవిష్కరణకు నియోజకవర్గ జనసేన నేత చలమలశెట్టి రమేష్ను ఆహ్వనించారు. గ్రామంలోని జనసేన నాయకులకు గాని, పక్క గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలకు గాని సమాచారం ఇవ్వకుండా ఆవిష్కరణ పూర్తి చేశారు. దీనిని జనసేన పార్టీలోని మరో వర్గం ప్రశ్నించడంతో ఘర్షణ ప్రారంభమైంది. రెండు వర్గాలు ఒకరినొకరు దూషించుకుంటూ తీవ్ర స్థాయిలో తోసుకున్నారు. ఈ గొడవ గురించి సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి విద్యాధర్ ఘటనా స్థలానికి చేరుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించగా.. రెచ్చిపోయిన చలమలశెట్టి రమేష్ కార్యదర్శిపై విరుచుకుపడ్డారు. షర్టు కాలర్ పట్టుకొని దుర్భాషలాడారు. బుజ్జగిస్తున్న కూటమి నాయకులు గ్రామస్తుల మధ్య ప్రభుత్వ ఉద్యోగికి తీవ్ర అవమానం జరగడంతో కార్యదర్శి విద్యాధర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కూటమి నాయకులు కలుగజేసుకుని బుజ్జగిస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని కేసుల వరకూ వెళ్ల వద్దని సముదాయించారు. దీంతో తనపై జరిగిన దాడిని వివరిస్తూ మండలాధికారులకు విద్యాధర్ ఫిర్యాదు చేశారు. -
శ్రీహరి రావు హత్యపై పవన్ వ్యాఖ్యలకు సింహాద్రి రమేష్ బాబు కౌంటర్
-
పంచకర్ల సిఫార్సులకు బాబ్జీ గండి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మొన్నటికి మొన్న పోలీసుశాఖ బదిలీల్లో మాట చెల్లుబాటు కాలేదని మథనపడిన పంచకర్ల రమేష్ బాబుకు రెవెన్యూ బదిలీలల్లోనూ అదే నగుబాటు ఎదురైంది. పెందుర్తి తహసీల్దారు పోస్టింగ్లో పంచకర్ల చెప్పిన పేరును కాకుండా తాజాగా గండి బాబ్జీ చెప్పిన వ్యక్తికి పోస్టింగ్ దక్కడం చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల క్రితం సీఐల పోస్టింగ్ల విషయంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో అలిగి గన్మెన్లను సైతం వెనక్కి పంపి.. ఆ తర్వాత మిన్నకుండిపోయిన పంచకర్ల తాజా తహసీల్దార్ల బదిలీల్లో కనీసం స్పందించకుండా మౌనం వహించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తన మాట చెల్లుబాటు కాకపోవడంపై ఆయన లోలోన రగిలిపోతున్నారు. అయినప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా బహిరంగంగా వ్యాఖ్యానించకుండా తమ పార్టీ అధిష్టానం వద్ద విన్నవించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే గతంలో కూడా సీఐల బదిలీల విషయంలో అధిష్టానానికి చెప్పినప్పటికీ స్పందన లేకపోవడంతో... ఈసారీ అదే పరిస్థితి ఉంటుందని ఆయన సన్నిహితులు వాపోతున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంచకర్ల అయినప్పటికీ... గండి బాబ్జీ మాటే చెల్లుబాటు అయ్యేలా టీడీపీ నేతల నుంచి వచ్చిన ఆదేశాలతోనే జిల్లా ఉన్నతాధికారులు ఆయన సిఫార్సులకే పెద్ద పీట వేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా ఎంపీ భరత్ జోక్యం చేసుకుని గండి బాబ్జీకి ప్రాముఖ్యత ఇవ్వాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు ఇచ్చిన ఆదేశాలతోనే ఈ వ్యవహారమంతా నడుస్తోందని టీడీపీలో చర్చ నడుస్తోంది.పాత తేదీలతో ఆదేశాలు..!వాస్తవానికి ఉద్యోగుల బదిలీల గడువు ప్రక్రియ సెప్టెంబరు 15వ తేదీ నాటికి పూర్తి కావాలి. విజయవాడ వరదల నేపథ్యంలో 23కు వరకు బదిలీల ప్రక్రియ చేపట్టారు. గండి బాబ్జీ ప్రతిపాదనలకు పెద్ద పీట వేయాలని ఎంపీ భరత్ ఆదేశాల మేరకు బదిలీల గడువు ముగిసిన తరువాత పాత తేదీలతో (సెప్టెంబరు 22వ తేదీ) పోస్టింగ్లు ఇస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆదేశాలు మాత్రం 26వ తేదీ రాత్రి బయటకు రావడం గమనార్హం. అంతేకాకుండా ఏఎస్వో సర్కిల్–1లో సీనియర్ చెకింగ్ ఇన్స్పెక్టర్గా కొద్దిరోజుల క్రితం పోస్టింగ్ ఇచ్చిన బంటు రమణను మార్చాలంటూ బియ్యం మాఫియా పట్టుబట్టడంతో ఆయనకు విశాఖ ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పోస్టింగ్ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన డి.జానకిని విశాఖ ఏఎస్వో కార్యాలయంలో సీనియర్ చెకింగ్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరికీ కూడా బదిలీల గడువు ముగిసిన తర్వాత పాత తేదీలతో పోస్టింగ్లు ఇవ్వడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.బాబ్జీకి భరత్ సపోర్టు... !వాస్తవానికి విశాఖ దక్షిణ సీటును ఆశించిన గండి బాబ్జీ.. ఆ సీటు దక్కకపోవడంతో పార్టీ మారుదామని భావించారు. అయితే ఎక్కడి నుంచి పిలుపు లేకపోవడంతో మిన్నకుండిపోయారు. అనంతరం ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సమావేశంలో మాడుగుల సీటు లభించిన బండారుకు ఇక పెందుర్తిలో పనులేమీ చేయవద్దనే అర్థంలో వ్యాఖ్యానించారు. అయితే అక్కడితో ఆగకుండా పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల మాట కూడా చెల్లుబాటు కాకుండా చక్రం తిప్పడం ప్రారంభించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన సీఐల పోస్టింగ్ల విషయంలోనూ గండి బాబ్జీ సిఫార్సు చేసిన వారినే నియమించారు. దీనిని నిరసిస్తూ తన గన్మెన్లను వెనక్కి పంపుతున్నట్టు నేరుగా పోలీస్బాస్కు పంచకర్ల స్పష్టం చేశారు. అయినప్పటికీ సానుకూల స్పందన రాకపోవడంతో మిన్నకుండిపోయారు. ఇక తాజాగా పెందుర్తి తహసీల్దార్ పోస్టింగ్ విషయంలోనూ గండి బాబ్జీ మాటే చెల్లుబాటు కావడంతో పంచకర్ల షాక్ తిన్నారు. వాస్తవానికి పెందుర్తి తహసీల్దార్గా ప్రస్తుతం ఉన్న కె.వేణుగోపాల్ స్థానంలో మరొకరిని నియమించాలని పంచకర్ల భావించారు. అయితే, ఎవరిని నియమించాలనే విషయంలో మాత్రం పంచకర్ల నుంచి ఎటువంటి ప్రతిపాదనలను జిల్లా ఉన్నతాధికారులు కోరకపోవడం గమనార్హం. మరోవైపు పద్మనాభం తహసీల్దార్గా ఉన్న ఆనంద్కుమార్కు పెందుర్తిలో పోస్టింగ్ ఇవ్వాలని గండి బాబ్జీ నుంచి జిల్లా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు వెళ్లాయి. గండి బాబ్జీ చెప్పిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఎంపీ భరత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గండి బాబ్జీ ప్రతిపాదనలు, ఎంపీ భరత్ ఆదేశాల మేరకు పెందుర్తి తహసీల్దార్గా ఆనంద్కుమార్కు పోస్టింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా డీటీ, సర్వేయర్లు, ఎంపీడీవో పోస్టింగ్ విషయంలోనూ పంచకర్ల మాటకు విలువ లేకుండా పోయింది. ఎంపీడీవో రమేష్ నాయుడును కొనసాగించాలని పంచకర్ల కోరినప్పటికీ కనీసం పరిగణనలోనికి తీసుకోకపోవడం ఆయనకు చిర్రెత్తుకొచ్చినట్టు తెలుస్తోంది. -
ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే అసంతృప్తి.. గన్మెన్ల సరెండర్
సాక్షి,అనకాపల్లిజిల్లా: కూటమి ప్రభుత్వంపై పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు అసంతృప్తి వ్వక్తం చేశారు. ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ తన ఇద్దరు గన్మెన్లను సరెండర్ చేశారు. తాను సిఫారసు చేసిన కాపు సామాజికవర్గం సీఐకి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలోని పరవాడ పోలీస్ స్టేషన్కు కాపు సామాజికవర్గానికి చెందిన సీఐని రమేష్బాబు సిఫారసు చేశారు. రమేష్బాబు సిఫారసును పక్కన బెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మల్లిఖార్జున్కి మంత్రి నారా లోకేష్ పోస్టింగ్ ఇప్పిచ్చినట్లు సమాచారం. కాగా, జనసేన ఎమ్మెల్యేల సిఫార్సులను టీడీపీ నాయకులు పక్కన బెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
అల్లు అర్జున్ను టార్గెట్ చేసిన మరో జనసేన నేత
సాక్షి, కృష్ణా జిల్లా: జనసేన నేతలు అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ చెలరేగిపోతున్నారు. ఆయనపై మరో జనసేన నేత నోరు పారేసుకున్నారు. అల్లు అర్జున్ ఓ కమెడియన్ అంటూ ఆ పార్టీ గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్బాబు నోటి దురుసు ప్రదర్శించారు. ‘‘చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు అండతో ఇండస్ట్రీకి వచ్చావు. మెగా ఫ్యామిలీని విమర్శించే స్థాయి నీకు లేదు. నీ బాబు అల్లు అరవింద్ పిల్లికి బిక్షం కూడా పెట్టడు. నీ స్థాయిని మరచి మాట్లాడుతున్నావు’’ అంటూ వ్యాఖ్యానించారు.‘‘చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లుకడిగి నీళ్లు నెత్తిన చల్లుకుని తప్పుని సరిచేసుకో. అలా చేయని పక్షంలో డిసెంబర్ లో రిలీజ్ అయ్యే నీ సినిమాలను అడ్డుకుంటాం. గన్నవరం నియోజకవర్గంలో నీ సినిమా ఒక్క థియేటర్లోకూడా విడుదలయ్యే పరిస్థితి ఉండదు.’’ అని చలమశెట్టి హెచ్చరించారు.కాగా, ‘అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’ అంటూ తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
‘నేను - కీర్తన’ ట్రైలర్ రిలీజ్
చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘నేను - కీర్తన’. రిషిత - మేఘన హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు, శోభారాణి, పద్మినీ నాగులపల్లి, గిడుగు కాంతికృష్ణ, వాసిరెడ్డి స్పందన పాల్గొని, "నేను - కీర్తన" చిత్రం చిమటా రమేష్ బాబుకు హీరోగా తిరుగులేని పునాది వేయాలని అభిలషించారు.రమేష్ బాబు మాట్లాడుతూ.. ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. తన సోదరుడు నటించిన సినిమా అని అనడం లేదని, "నేను-కీర్తన" పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చిత్ర సమర్పకురాలు చిమటా జ్యోతిర్మయి పేర్కొన్నారు. నిర్మాత చిమటా లక్ష్మీ కుమారి మాట్లాడుతూ... "ఎన్నో వ్యయప్రయాసలతో మల్టీ జోనర్ ఫిల్మ్ గా రూపొందించిన "నేను - కీర్తన" కచ్చితంగా నిరుపమాన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
Panchakarla Ramesh Babu: పంచకర్ల మైనింగ్ డాన్
పెందుర్తి: ‘‘యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన పంచకర్ల రమేష్ బాబు భారీ ఎత్తున అక్రమ తవ్వకాలకు పాల్పడ్డాడు. యలమంచిలి, అచ్యుతాపురం ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ చేసి రోజుకు రూ.6 లక్షలు సంపాదించాడు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి దోపిడీలు, దందాలకు పాల్పడ్డాడు. ఇలాంటి వ్యక్తినా మీరు గెలిపిస్తారు.. రమేష్ బాబు లాంటి అవినీతి పరుడ్ని గెలిపించి మీరు చాలా తప్పు చేశారు’’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు 2019 ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రస్తుత జనసేన పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఐదేళ్ల పాటు యలమంచిలిని దోచుకున్నాడని 2019 ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కల్యాణ్ ఆరోపించారు. అదే పంచకర్లకు పెందుర్తిలో పవన్ కల్యాణ్ సీటు ఇచ్చారు. దీంతో ఇక్కడి నేతలు పవన్ కల్యాణ్ అప్పట్లో పంచకర్లపై చేసిన విమర్శలను గుర్తు చేసుకుంటున్నారు. అక్రమాలే అజెండా రాజకీయాల్లో వలస పక్షిగా ముద్ర వేసుకున్న పంచకర్ల రమేష్ బాబు టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు యలమంచిలిలో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు. పవన్ కల్యాణ్ లెక్క ప్రకారం రోజుకు రూ.6 లక్షలు చొప్పున ఐదేళ్లలో రూ.కోట్లలో సంపాదించారని చెప్పినా.. రాంబిల్లిలోని పంచదార్ల కొండను పిండి చేసి అంతకు మించి దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాల్లో కంపెనీల ఏర్పాటు సమయంలో భూములు ఇచ్చిన రైతులకు పరిహారం విషయంలో పంచకర్ల, అతని అనుచరులు చేతివాటం ప్రదర్శించారు. తప్పుడు పత్రాలతో బినామీలను సృష్టించి రైతులకు అందాల్సిన పరిహారాన్ని పంచకర్ల గ్యాంగ్ కాజేశారని స్వయంగా యలమంచిలి టీడీపీ నాయకులే ఆరోపించారు. అప్పట్లో స్థానిక టీడీపీ నాయకులను పక్కన పెట్టి మండలానికో షాడో పంచకర్లను తయారు చేసి ఆయా దందాలకు పాల్పడినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఆగడాలు అప్పటి నుంచే.. 2009లో ప్రజారాజ్యం తరఫున పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత 2011 నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా అవతారం ఎత్తారు. ఆ క్షణం నుంచే పంచకర్ల, అతని అనుచరుల అసలు రూపం బయటకు వచ్చింది. అధికారులను తమ దారికి తెచ్చుకుని రౌడీయిజంతో పాటు భూ కబ్జాలకు పాల్పడ్డారు. పెందుర్తి కేంద్రంగా ఎన్నో దందాలకు పాల్పడ్డారు. ఆ సమయంలో పంచకర్ల అనుచరుడు ఒకరు ఏకంగా పోలీసుల భూమికే గురి పెట్టాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పోలీస్ క్వార్టర్ల నిర్మాణానికి కేటాయించారు. అప్పటి పంచకర్ల అనుచరుడు గొర్లె అప్పారావు దానిపై కన్నేశాడు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఏకంగా పోలీసులకు కేటాయించిన స్థలాన్నే ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ అప్పారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆట కట్టించారు. అప్పట్లో రమే‹Ùబాబు పేరు చెప్పుకుని సెటిల్మెంట్లు చేయడం, బెదిరింపులకు పాల్పడం వంటి ఘటనలు కో కొల్లలు. ఒక రకంగా చెప్పాలంటే పెందుర్తి నియోజకవర్గంలో రౌడీయిజానికి పంచకర్ల రమే‹Ùబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.అనుచరుల రౌడీయిజం ఈ ఏడాది ఏప్రిల్ 14న జీవీఎంసీ 88వ వార్డు సతివానిపాలెంలో జరిగిన విందు కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడుపై పంచకర్ల రమేష్ అనుచరుడు గల్లా శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డాడు. స్థానికులు వచ్చి అడ్డుకోవడంతో ముత్యాలనాయుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బాధిత కార్పొరేటర్ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఇలా పెందుర్తి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అనుచరుల రౌడీయిజం పెచ్చు మీరుతోంది. తమకు నచ్చని వారిపై హత్యాయత్నాలు, భౌతికదాడులకు పాల్పడుతున్నారు. ప్రత్యర్థులను సోషల్ మీడియా వేదికగా అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. కులాల పేరుతో వేధిస్తున్నారు. ‘మేం వస్తే మీ సంగతి తేలుస్తాం’ అంటూ బెదిరింపులకు పాల్పడుతుండడంపై ఇక్కడి ప్రజలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి నాయకుడికి ఓటుతోనే చెక్ పెట్టాలని రాజకీయ విశ్లేషకులు, పెందుర్తి ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.మళ్లీ పంచకర్ల గ్యాంగ్ హడావుడి పెందుర్తి ఎమ్మెల్యేగా జనసేన నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమే‹Ùబాబు అనుచరులు ఆగడాలు మొదలు పెట్టారు. 2023 నవంబర్ 12 దీపావళి రోజు పెందుర్తి మండలం చింతగట్ల సర్పంచ్ భర్త, రాష్ట్ర అయ్యారక వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గనిశెట్టి కనకరాజుపై జనసేన నాయకులు రెచ్చిపోయారు. బీరు బాటిళ్లు..పదునైన ఆయుధాలతో కనకరాజుపై దాడికి పాల్పడ్డారు. స్థానికులు స్పందించి రక్తపు మడుగులో ఉన్న కనకరాజును ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. జనసేన నాయకులు మాడిస హరీ‹Ù, చందక గోవిందరాజు, దాసరి గణే‹Ùలను నిందితులుగా గుర్తించి పెందుర్తి పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 2న అరెస్ట్ చేశారు. -
డ్యాన్స్తో కుర్చీ మడత పెట్టేసిన 'మహేశ్ బాబు' అన్న కూతురు
మహేశ్బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం 'గుంటూరుకారం'. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం యూత్ నుంచి కుటుంబ ప్రేక్షకుల వరకు మెప్పించింది. మొదట ఈ సినిమా బాగాలేదని అన్నవారితోనే కొన్నిరోజుల తర్వాత మళ్లీ చూసి.. అరే సినిమా బాగుందే అనే కితాబు ఇచ్చారు. నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని భారీగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని కుర్చీ మడత పెట్టి అనే పాట ఒక రేంజ్లో హిట్ అయింది. ఈ పాట నుంచి మిలియన్ల కొద్ది రీల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ లిస్ట్లోకి మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కూతురు భారతి కూడా చేరింది. భారతి ఘట్టమనేని చేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన బాబాయ్ మహేశ్ పాటకు భారతి వేసిన స్టెప్పులు ఇన్స్టాగ్రామ్లో దుమ్మురేపుతున్నాయి. ఇప్పటికే ఇదే పాటకు మహేశ్ కూతురు సితార కూడా ఒక రీల్ చేసింది. అప్పుడు కూడా సితార వేసిన స్టెప్పులకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ తన అన్న కూతురు భారతి కూడా కుర్చీ మడత పెట్టేసింది. ప్రస్తుతం ఆమె ఫారిన్లో చదువుకుంటున్నట్లు సమాచారం. రమేశ్ బాబు కూడా తన తండ్రి కృష్ణతో కలిసి పలు సినిమాల్లో కనిపించారు. చివరిగా ఎన్కౌంటర్ అనే చిత్రంలో తండ్రితో కలిసి నటించిన రమేశ్బాబు తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ కొంత కాలం తర్వాత తన సోదరుడు అయిన మహేశ్తో కలిసి అర్జున్, అతిథి చిత్రాలను నిర్మించాడు. కానీ ఆయన పిల్లలు భారతి, జయ కృష్ణ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కానీ తాజాగా భారతి చేసిన డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శ్రీలీల రేంజ్లో దుమ్మురేపిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతలా ఆమెపై పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్న ఆ సాంగ్ను మీరూ చూసేయండి. View this post on Instagram A post shared by Bhar Ghats (@bharathighattamaneni) -
రామోజీరావు తప్పుడు వార్తలు మానుకోవాలి: ఎమ్మెల్యే
-
Michaung Cyclone: భారీ వర్షాలతో నీట మునిగిన వరి పంట
-
కృష్ణ తనయుడు రమేశ్ బాబు సినిమాల్లో ఎంట్రీ.. హీరోగా ఆ సినిమాతోనే!
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. సినీరంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఆయనకు తగ్గట్టుగానే కుమారులు సైతం ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మహేశ్ బాబు, రమేశ్ టాలీవుడ్లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే గతేడాది అనారోగ్యంతో పెద్దకుమారుడు రమేశ్ బాబు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే రమేశ్ బాబు సినిమాల్లోకి రావడంపై సూపర్ స్టార్ కృషి ఎంతో ఉంది. రమేశ్ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ఏది? ఆ తర్వాత ఏయే సినిమాలు చేశారో తెలుసుకుందాం. (ఇది చదవండి: అక్కినేని నాగచైతన్య సింప్లిసిటీ.. సిబ్బంది బైక్పై రైడ్!) రమేశ్ బాబు మొదట పరిచయమైంది అల్లూరి సీతారామరాజుతోనే. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించారు. 1974లో వచ్చిన ఈ చిత్రంలో యంగ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. ఆ తర్వాత దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్ చిత్రాల్లోనూ బాలనటుడిగా మెప్పించారు. అయితే కృష్ణ కెరీర్ అద్భుతంగా సాగుతున్న రోజుల్లోనే తన కుమారుడు రమేశ్ బాబును హీరోగా పరిచయం చేశారాయన. అయితే హీరోగా రమేశ్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది మాత్రం 1987లో వచ్చిన సామ్రాట్ చిత్రం ద్వారానే. ఈ సినిమాకు వి.మధుసూదన రావు దర్శకత్వం వహించగా.. హనుమంతరావు , ఆదిశేషగిరి రావు నిర్మాతలుగా వ్యవహరించారు. తన కుమారుడిని సామ్రాట్ ద్వారానే వెండితెరకు సూపర్ స్టార్ పరిచయం చేశారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్పైనే నిర్మించారు. అయితే ఈ మూవీ 1983లో రిలీజైన హిందీ సినిమా బేతాబ్ రీమేక్గా తెరకెక్కించారు. సరిగ్గా ఈ రోజు సామ్రాట్ మూవీ విడుదల కాగా.. నేటికి 36 ఏళ్లు పూర్తయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సోనమ్ హీరోయిన్గా నటించింది. నటి శారద కీలక పాత్ర పోషించిగా.. ఈ మూవీకి అప్పట్లోనే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. (ఇది చదవండి: లెస్బియన్స్గా యంగ్ హీరోయిన్స్.. ఓటీటీలో దూసుకెళ్తోన్న మూవీ!) అయితే ఈ సినిమా తర్వాత రమేశ్ బాబు దాదాపుగా 15 చిత్రాల్లో నటించారు. ఓకే ఏడాదిలో చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు చిత్రాలతో పాటు శాంతి ఎనతు శాంతి అనే తమిళ మూవీలో నటించారు. అయితే హీరోగా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక పోయారు. నిర్మాతగా మారి హిందీలో సూర్యవంశం, తెలుగులో అర్జున్, అతిథి, దూకుడు, ఆగడు సినిమాలు నిర్మించారు. మరోవైపు తన తమ్ముడు మహేశ్ బాబు టాలీవుడ్లో సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. -
మీరు దయతలిస్తే మళ్లీ గెలుస్తా!
సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల: ‘ఓట్ల సమయంలో మందు, డబ్బులు పంచడం నాకు రాదు. అలాంటి అలవాటు నాకు లేదు. రాబోయే ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు దయతలిస్తే మళ్లీ గెలుస్తా. అప్పుడు కూడా ఓ తమ్ముడిగా.. అన్నగా.. బిడ్డగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా. బీద, బిక్కిలను కడుపులో దాచుకుని పనిచేస్తా..’అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పేదల గోసలు ఎరిగిన కేసీఆర్ లాంటి నాయకుడిని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ బంధు పథకాన్ని మంత్రి ప్రారంభించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 600 మందికి ఈ పథకం కింద చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడలో ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రమేశ్బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీ బంధు నిరంతర ప్రక్రియ ‘రాష్ట్రంలోని అర్హులైన పేదవారు అడగకపోయినా సీఎం కేసీఆర్ వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుంచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయిన పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు అందర్నీ ఆదుకుంటున్నారు. కేసీఆర్ కిట్టు నుంచి ఆసరా పెన్షన్ల వరకు అన్ని విధాలా ఆదుకునే మనసున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్. గడిచిన 9 ఏళ్లు సంక్షేమానికి స్వర్ణయుగంలా మారింది. బీసీ బంధు పథకాన్ని ప్రతి నియోజకవర్గంలో 300 మందికి అందిస్తున్నాం. ఈ పథకంలో రూ.లక్ష లబ్ధి పొందిన 14 బీసీ కులాల పేదలు మళ్లీ ఆ డబ్బులను చెల్లించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది రుణం కాదు. కేవలం కులవృత్తులను ప్రోత్సహించేందుకు ఇస్తున్న గ్రాంట్ మాత్రమే. అర్హులందరికీ అందించే వరకు ఈ పథకం కొనసాగుతుంది. శతాబ్దాల పేదరికాన్ని పోగొట్టేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి అందించి వారి పెళ్లిళ్లకు సాయం చేశాం. రైతుబంధు, రైతు బీమా, నేతన్నలకు బీమా పథకాలను అమలు చేస్తున్నాం. చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఒడవదు. మళ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల వాళ్లు ఓట్లు అడగడానికి వస్తే.. మాకు ఎంతో చేసిన బీఆర్ఎస్ను కాదని మీకు ఓట్లు ఎందుకు వేయాలని నిలదీయండి. రాష్ట్రంలోని ఏ ఒక్క పేదవర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రభుత్వం సాయం చేస్తూ వారి బతుకులను బాగు చేస్తుంది. గృహలక్ష్మి పథకంలో అర్హులకు ఇళ్లను మంజూరు చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది..’అని కేటీఆర్ హామీ ఇచ్చారు. వచ్చే నెలలో మెడికల్ కాలేజీ ప్రారంభం ‘వచ్చే నెలలో సిరిసిల్లలో మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో 150 మంది డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటారు. అన్ని రోగాలకు ప్రత్యేక వైద్యులతో మెరుగైన వైద్యం అందుతుంది. చిన్నరోగం నుంచి క్యాన్సర్ వరకు ఉచితంగా వైద్యసేవలు జిల్లాలో పేద ప్రజలకు అందుతాయి..’అని మంత్రి చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళాచక్రపాణి, రామతీర్థం మాధవి పాల్గొన్నారు. -
దోస్త్ మేరా దోస్త్
-
జనసేన నేత ఆకుల ఉమేష్పై కేసు
చిలమత్తూరు: మద్యం సేవించడానికి కర్ణాటకలోని బాగేపల్లికి వెళ్లిన హిందూపురం జనసేన నాయకుడు ఆకుల ఉమేష్, అతని స్నేహితుల బృందం తప్పతాగి అమడగూరు మండలానికి చెందిన రమేష్బాబుపై దాడి చేసి గాయపరిచారు. అతని వద్ద ఉన్న బంగారాన్ని చోరీ చేశారు. దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు బాగేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... ఈ నెల 23న కంటి వైద్య పరీక్షల కోసం రమేష్బాబు అనే వ్యక్తి బెంగళూరుకు వెళ్తూ బాగేపల్లి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై ఓ ధాబా వద్ద భోజనానికి ఆగాడు. ఆ సమయంలో తాగి ఉన్న ఆకుల ఉమేష్, అతని మిత్ర బృందం రమేష్బాబుపై దాడిచేసి అతని ఒంటిపై 16 తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు జనసేన నాయకులపై 323, 363, 392, 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బాగేపల్లి సీఐ రవికుమార్ తెలిపారు. కేసులో ఆకుల ఉమేష్ ఏ–1 నిందితుడు కాగా, లోకేష్ అనే వ్యక్తి ఏ–2, చిలమత్తూరు మండలానికి చెందిన జనసేన నాయకుడు ప్రవీణ్ ఏ–3, భాస్కర్ ఏ–4గా పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఉమేష్ హిందూపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఇతనిపై హిందూపురంలో కూడా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. -
బార్బర్ షాపులో పనిచేసి, ఎన్ని వేల కోట్ల ఖరీదైన కార్లు కొన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు
-
ఒకపుడు తినడానికి లేదు..ఇపుడు 600 లగ్జరీ కార్లు..‘బిలియనీర్ బాబు’ స్టోరీ చూస్తే..!
బెంగళూరు రమేష్ బాబు లేదా ‘ఇండియన్ ' బిలియనీర్ బార్బర్’. 600 కార్ల కలెక్షన్ను గమనిస్తే ఎవరైనా ఔరా అనక తప్పదు. అందులోనూ అన్నీ ఖరీదైన కార్లే. ఎక్కువ భాగం బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్ రోవర్ రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ బ్రాండ్సే.బిలియనీర్ బాబుగా పాపులర్ అయిన రమేష్ బాబు ఒకప్పుడు కడు పేదవాడే. ఒక పూట తింటే రెండోపూటకు కష్టమే. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కూలిపనులకెళ్లాడు. జీవితం గడవడానికి అమ్మకు తోడుగా చాలా ఉద్యోగాలు చేశాడు. మరి బిలియనీర్గా ఎలా అవతరించాడు..? రమేష్ బాబు తండ్రి గోపాల్ బెంగళూరులో క్షురకుడుగా పని చేసేవారు. రమేష్ ఏడేళ్ల వయస్సులోనే తండ్రి కన్నుమూశారు. దీంతో తల్లి ముగ్గురు పిల్లలున్న కుటుంబానికి బెంగళూరులోని బ్రిడ్జ్ రోడ్లోని చిన్న బార్బర్ షాప్ ఒక్కటే జీవనాధారం. కేవలం 40-50 రూపాయలతో పిల్లల్ని పోషించేది. పిల్లల్ని చదివించింది. బట్టలు, పుస్తకాలు, ఫీజులు, అన్నింటికీ వినియోగించేది. మరోవైపు బార్బర్షాప్ను నిర్వహించలేక రోజుకు రూ.5 అద్దెకు ఇచ్చేయడంతో పరిస్థితి మరింత దుర్భరమైంది. ఒక్కపూట భోజనంతో సరిపెట్టుకునే వారు. 13 సంవత్సరాల వయస్సులో న్యూస్ పేపర్ డెలివరీ,మిల్క్ హోమ్ డెలివరీలాంటి ఎన్నో పనులు చేసిన కుటుంబ పోషణలో తల్లి ఆసరాగా ఉండేవాడు. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ 10వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి, చివరికి తండ్రి పాత దుకాణం 'ఇన్నర్ స్పేస్' లో బార్బర్గా పని చేయడం ప్రారంభించాడు. పట్టుదలతో కష్టించి పనిచేశాడు. అది త్వరలోనే ట్రెండీ స్టైలింగ్ అవుట్లెట్గా మారిపోయింది. హెయిర్స్టయిలిస్ట్గా బాగా పేరు గడించాడు. ఆ తర్వాత రమేష్ బాబు 1993లో తన మామ దగ్గర కొంత డబ్బు తీసుకుని మారుతీ ఓమ్నీ వ్యాన్ కొనుగోలు చేశాడు. ఈ కారు ఈఎంఐ చెల్లించేలేక ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించాడు. అలా తన తల్లి పనిచేసే కుటుంబానికి చెందిన ఇంటెల్ కంపెనీ ఉద్యోగులను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకొచ్చే పని తీసుకుని ట్రావెల్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అది లాభసాటిగా ఉండటంతోపాటు, పర్యాటక రంగానికి ప్రభుత్వంప్రోత్సాహంతో 2004లో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని లాంచ్ చేసి లగ్జరీ కార్ రెంటల్ అండ్ సెల్ఫ్ డ్రైవ్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ముప్పై ఏళ్లుగా సేవలందిస్తూ, ఖరీదైన కార్లను సేకరిస్తూనే ఉన్నాడు. అలా 600కు పైగా కార్లు అతని గారేజ్లో ఉన్నాయి.దాదాపు అన్నీ బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లంటేనే అతని వ్యాపారాన్ని అర్థం చేసుకోవచ్చు. వీటితోపాటు వ్యాన్లు, మినీబస్సులు కూడా ఉన్నాయి. తొలి లగ్జరీ కారు మెర్సిడెస్ ఈ కాస్ల్ సెడాన్ అతని తొలి లగ్జరీ కారు. దీని ధర రూ.38 లక్షలు. ప్రస్తుతం 3 కోట్ల ఆర్ఆర్ ఘోస్ట్, 2.6 కోట్ల ఖరీదైన మేబ్యాచ్ అతని ట్రావెల్స్లో ఉన్నాయి. రమేష్ బాబు కంపెనీ ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో నడుస్తుంది. అదే సమయంలో, అతని వ్యాపారం కొన్ని ఇతర దేశాలలో కూడా విస్తరించింది. దాదాపు 300 పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు. బిగ్బీ, ఆమీర్ ఖాన్ లాంటి సెలబ్రిటీ కస్టమర్లు రమేష్ అన్ని కార్లను డ్రైవ్ చేయగలడు. అతని క్లయింట్ల జాబితా అంతా సెలబ్రిటీలు, బిలియనీర్లే. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్ లాంటి వారితోపాటు, ప్రముఖ రాజకీయ నాయకులు ధనిక పారిశ్రామికవేత్తలు కూడా వారు పట్టణంలో ఉన్నప్పుడు కార్లను అద్దెకు తీసుకుంటారట. రోజుకు వసూలు చేసే అద్ద 50వేల రూపాయలకు పై మాటే. అన్నట్టు ఇప్పటికీ తన వృత్తిని వదులుకోకపోవడం విశేషం. బిలియనీర్ బాబు మెర్సిడెస్ లేదా రోల్స్ రాయిస్లోని తన దుకాణానికి వెళ్తాడు. నిజంగా రమేష్ బాబు కథ స్ఫూర్తిదాయకం. 2 బిలియన్ డాలర్ల నెట్వర్త్తో ప్రపంచంలోనే రిచెస్ట్ బార్బర్గా ఫోర్బ్స్ గుర్తించింది. -
ఒకే ఏడాది రెండు విషాదాలు..తీవ్ర దుఃఖంలో మహేశ్
సూపర్ స్టార్ మహేశ్బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి ఇందిరాదేవి(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కాగా ఈ ఏడాది జనవరిలోనే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో జనవరి 8న తుదిశ్వాస విడిచారు. దీంతో ఒకే ఏడాదిలో సూపర్ స్టార్ ఇంట్లో రెండు తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి. అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే, తల్లి దూరం అవ్వడం మహేశ్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. మహేశ్కు తల్లిపై ఎనలేని ప్రేమ ఉండేది. నమ్రతతో వివాహం జరిగే వరకు తల్లి చాటు బిడ్డగానే పెరిగాడు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో మహేశ్ బాబే స్వయంగా చెప్పారు. సందర్భం వచ్చినప్పుడల్లా తల్లితో తనకున్న అనుబంధాన్ని వెల్లడించేవాడు. ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళితే తల్లి చేయి పట్టుకొని పక్కనే ఉండేవాడు. ఇందిరాదేవికి కూడా చిన్న కొడుకు మహేశ్ అంటే చాలా ఇష్టం ఉండేది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఇందిరాదేవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కీలక నేత రాజీనామా
జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గ్రూపు తగాదాలు.. అన్నదమ్ముల కొట్లాటలు.. పార్టీ పెద్దల తీరుతో ద్వితీయశ్రేణి నేతల తీవ్ర అసంతృప్తులతో సతమతమవుతున్న ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీ కీలక నాయకుడు, దర్శి టీడీపీ ఇన్చార్జి పమిడి రమేష్ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. పార్టీ కోసం తాను ఎంత కష్టపడినా అధినేత గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దర్శి టీడీపీలో ముసలం మొదలైంది. ఇప్పటికే దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిన ఆ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పమిడి రమేష్ పరోక్షంగా ప్రకటించడంతోపాటు, అధిష్టానం తాను కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు లేదనే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఒంగోలు నగర శివారులో జరిగిన మహానాడుతో రాష్ట్రవ్యాప్తంగా పారీ్టలో ఉత్సాహం నింపాలనే టీడీపీ అధినేత చంద్రబాబు విపరీతమైన ప్రచారాలు చేసినా ఫలితాలు ఇవ్వడం లేదన్నది ఈ సంఘటనతో రుజువైంది. జిల్లాలో ఇప్పటికే పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో గ్రూపుల గోల టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. అసలే పార్టీని ప్రజలు విశ్వసించని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పార్టీ అధినేత నుంచి ఇన్చార్జి వరకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఆందోళనలు చేయకుండా పర్సనల్ విషయాలను తెరపైకి తెచ్చి రాజకీయాలు చేయడం పట్ల ఆ పార్టీలోనే తీవ్ర అసంతృప్తి మొదలైంది. 2020 నవంబరు నుంచి దర్శి నియోజకవర్గ ఇన్చార్జిగా పమిడి రమేష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరిగి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బును ఖర్చు చేస్తూ వచ్చారు. ఇంత చేస్తున్నా పార్టీ అధిష్టానం తనను గుర్తించడం లేదని సన్నిహితుల వద్ద పలు మార్లు వాపోయినట్టు సమాచారం. ఇదిలా ఉండగా మహానాడు తరువాత పారీ్టలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. పార్టీ అధినేత సైతం పట్టించుకోకపోవడంతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేయడంతో ఇక దర్శి నియోజకవర్గంలో టీడీపీ క్లోజ్ అనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ బాధ్యతలు మోసేవారు కరువడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 75 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్చార్జిలు లేరని స్వయంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో దర్శికి కూడా ఇన్చార్జి లేకుండా పోవడం ఆపార్టీ దీన స్థితికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ సీపీలోకి మాజీ ఎమ్మెల్యేలు: దర్శి నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావుతోపాటు, 2012లో దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సైతం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దీంతో దర్శిలో టీడీపీకి నాయకత్వం వహించే దిక్కే లేకుండా పోయింది. 2020 నవంబరులో పమిడి రమేష్ టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో గ్రూపుల గోలతో నెట్టుకుంటూ వచ్చారు. అయితే టీడీపీ అధిష్టానం తీరుతో ఆవేదన చెంది ఇన్చార్జి పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆపార్టీ వర్గాల్లో చర్చ నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, చీరాల, దర్శి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, గిద్దలూరు వంటి నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్చార్జిలు ఉన్నారా.. లేరా అన్నట్లుగా పరిస్థితి నెలకొని ఉంది. మహానాడు సూపర్ హిట్ అంటూ జబ్బలు చరుచుకుంటున్న ఆ పార్టీ.. మహానాడు నిర్వహించిన జిల్లాలోనే కనీస బలం కూడా పెంచుకోకపోవడం గమనార్హం. జిల్లాలో రోజురోజుకూ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శి టీడీపీకి దిక్కెవరు..? దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పమిడి రమేష్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ద్వితీయ శ్రేణి నేతల్లో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా గ్రూపు రాజకీయాలకు భయపడి ఎవరూ ముందుకు రావడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. దర్శి టీడీపీలో చెలరేగిన జ్వాలను చల్లార్చాలని ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. పార్టీ పెద్దల తీరుమారకపోతే సొంతపార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా ప్రజలు సైతం ఛీత్కరించుకుంటున్న పరిస్థితి నెలకొంది. -
నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు.. మహేశ్బాబు ఎమోషనల్
సూపర్ స్టార్ మహేశ్బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్రబృందం.. శనివారం (మే 7) హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ను గ్రాండ్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ తో పాటు కీర్తి సురేష్, పరశురామ్, వీరితో పాటు జీనియస్ డైరెక్టర్ సుకుమార్, వంశీ పైడి పల్లి కూడా సందడి చేశారు. (చదవండి: రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. రాసి పెట్టుకోండి) ఈ సందర్భంగా మహేశ్ బాబు తన అన్నయ్య రమేశ్బాబుని తలచుకొని ఎమోషనల్ అయ్యాడు. ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. చాలా మారాయి. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు ( కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్బాబు అన్నయ్య రమేశ్ బాబు అనారోగ్యంతో ఈ ఏడాది జనవరి 8న మృతి చెందారు. ఆ సమయంలో మహేశ్బాబు కరోనా బారిన పడడంతో చివరి చూపు కూడా నోచుకోలేదు). కానీ ఏది జరిగినా, ఏది మారినా మీ (ఫ్యాన్స్) అభిమానం మాత్రం మారలేదు.. అలానే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకెళ్లి పోవడానికి..’ అంటూ మహేశ్బాబు ఎమోషనల్ అయ్యారు. -
అన్నయ్య పెద్దకర్మకు హాజరైన మహేశ్ బాబు.. కన్నీటి పర్యంతం !
Mahesh Babu Attends Rituals Of His Brother Ramesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. 56 ఏళ్ల రమేశ్ బాబు అనారోగ్యంతో జనవరి 8న రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఘట్టమనేని కుటుంబ సభ్యులకు మహేశ్ బాబుకు కరోనా వచ్చి రమేశ్ బాబు చివరిచూపుకు నోచుకోకపోవడం మరింత కలిచివేసింది. ఈ విషయం అభిమానులను కూడా ఎంతో బాధపెట్టింది. అయితే ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న మహేశ్ బాబు శనివారం (జనవరి 22) సోదరుడు రమేశ్ బాబు పెద్దకర్మకు హాజరయ్యారు. (చదవండి: రమేశ్బాబు మృతిపై మహేశ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్) ఈ కార్యక్రమంలో తన అన్నయ్య మరణించిన రోజు రాలేకపోయినందుకు ఎంతో బాధపడినట్లు తెలుస్తోంది. అన్నయ్యతో మహేశ్ బాబు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. అన్నయ్య రమేశ్ బాబు అంటే మహేశ్ బాబుకి ఎనలేని ప్రేమ. ఈ విషయాన్ని అనేకసార్లు ప్రస్తావించిన మహేశ్.. రమేశ్ బాబు చనిపోయినప్పుడు భావోద్వేగంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే రమేశ్ బాబు పెద్దకర్మకు ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. (చదవండి: రమేశ్బాబు మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టిన కృష్ణ) -
రమేష్ బాబు అంత్యక్రియలు ఫొటోలు
-
రమేశ్ బాబు మృతి.. 'హీరో' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్
Ramesh Babu Passed Away,Hero Movie Pre Release Event Cancelled: సూపర్స్టార్ కృష్ణ మనువడు, గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా నటించిన చిత్రం హీరో. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా ఈనెల 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నేడు(ఆదివారం) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది. అయితే సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు గట్టమేని రమేష్ బాబు కన్నుమూసిన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న హీరో చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా గల్లా అరుణకుమారి, సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ఇప్పటివరకు చూడని రమేశ్ బాబు అన్సీన్ ఫోటోలు
Ramesh Babu Movies List: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు (56)ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రాత్రి(శనివారం) 10గంటల ప్రాంతంలో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 1965, అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరలకు మొదటి సంతానంగా జన్మించిన రమేశ్ బాబు‘అల్లూరి సీతారామరాజు’సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత కృష్ణ ఓ లీడ్ రోల్లో నటించి, నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’లో చిన్నప్పటి ఎన్టీఆర్గా కనిపించారు. అలా బాలనటుడిగా కొన్ని సినిమాలు చేసిన అనంతరం ‘సామ్రాట్’(1987)సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆ తర్వాత ‘చిన్ని కృష్ణుడు, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, అన్నాచెల్లెలు, ఆయుధం’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించారు.రమేశ్కు భార్య మృదుల, కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి ఉన్నారు. -
రమేశ్బాబు భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు ఫొటోలు
-
కన్నకొడుకు భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన కృష్ణ
Super Star Krishna Cried After Seeing Ramesh Babu For Last Time, Video Viral: సూపర్స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతితో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్లోని మహా ప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. అయితే అంతకుముందు పద్మాలయ స్టూడియోస్లో రమేశ్ బాబు భౌతికకాయాన్ని కాసేపు ఉంచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సహా పలువురు ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. అయితే కొడుకును కడసారి చూసేందుకు అక్కడికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ కుమారుడి భౌతికకాయన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. 56 ఏళ్ల వయసులోనే కొడుకు చనిపోవడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. -
మహాప్రస్థానంలో ముగిసిన రమేశ్ బాబు అంత్యక్రియలు
Ramesh Babu Last Rites Performed In Maha Prasthanam: సూపర్స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు (56)అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ చితికి నిప్పు పెట్టి తుది వీడ్కోలు పలికారు. కోవిడ్ నిబంధనలతో అతికొద్దిమందితో అంత్యక్రియలు పూర్తి చేశారు. నటుడు నరేష్, తమ్మారెడ్డి భరద్వాజ సహా కొందరు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కోవిడ్ కారణంగా ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న మహేశ్ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు.కాగా కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సోదరుడి మృతిపై మహేశ్బాబు తీవ్ర భావోద్వేగం.. ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu pens an emotional note mourning the demise of his elder brother Ramesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు(56)మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. ఇక అన్నయ్య మృతిపై తొలిసారి స్పందించిన మహేశ్ బాబు తన ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేసుకున్నారు. 'మీరు నాకు స్ఫూర్తి, నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం. నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు. మీరు నాకోసం ఎంతో చేశారు. నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య. ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కాగా కోవిడ్ కారణంగా ప్రస్తుతం మహేశ్ బాబు హోంక్వారంటైన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అంతిమ కార్యక్రమాలకు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
రమేష్ బాబు అంత్యక్రియలు
-
రమేశ్బాబు మరణవార్త విని షాకయ్యాను: చిరంజీవి
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. 'రమేశ్బాబు మరణవార్త విని షాకయ్యాను. ఎంతో బాధ కలిగింది. కృష్ణగారికి, మహేశ్బాబు కుటుంబం మొత్తానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి.. ఈ విషాదంలో నుంచి కోలుకునేందుకు ఆ భగవంతుడు రమేశ్ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశాడు. కాగా కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేశ్బాబు శనివారం(జనవరి 8) రాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే! Shocked and deeply saddened by the demise of Shri.G.Ramesh babu. My heartfelt condolences to Shri.Krishna garu ,@urstrulyMahesh and all the family members. May the Almighty give strength to the family to cope with the tragic loss. — Chiranjeevi Konidela (@KChiruTweets) January 9, 2022 కృష్ణ, ఇందిరల మొదటి సంతానం రమేశ్బాబు. తండ్రి కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’(1974) సినిమాలో చిన్నప్పటి సీతారామరాజుగా తెరంగేట్రం చేశారు. వి. మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్’(1987)తో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘చిన్ని కృష్ణుడు, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, అన్నాచెల్లెలు, ఆయుధం’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించారు. ‘బజారు రౌడీ’, ‘అన్నాచెల్లెలు’చిత్రాలు రమేశ్ కెరీర్లో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. 1997లో ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన ‘ఎన్కౌంటర్’ రమేశ్బాబుకి చివరి చిత్రం. ఆ తర్వాత నిర్మాతగా మారిన ఆయన మహేశ్ ‘అతిథి’సినిమాను నిర్మించారు. మహేశ్ ‘దూకుడు’, ‘ఆగడు’చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. -
రమేశ్ బాబు అంతిమ సంస్కారాలకు మహేశ్ వస్తాడా?
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు(56)మృతితో టాలీవుడ్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. ఈ రోజు (జనవరి9) మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో రమేశ్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రమేశ్ బాబు భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం కూడా ఉంచేలా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంత్యక్రియలు త్వరగా ముగించాలని భావిస్తున్నారు. రమేశ్ బాబు అంతిమ కార్యక్రమాలకు ఎక్కువమంది హాజరు కాకపోవడమే మంచిదని కృష్ణ ఫ్యామిలీ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే.. సోదరుడి కడసారి చూసేందుకు మహేశ్ బాబు వస్తాడా రాడా అనే సందేహం అందరిలో నెలకొంది. ఇటీవల మహేశ్ బాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఆయన అంతిమ కార్యక్రమాలకు హాజరుకాకపోవచ్చుననే సంకేతాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా.. మరోవైపు సోదరుడి మరణంతో మహేశ్బాబుకు మరింత బాధపడుతున్నారు. (చదవండి: హీరో మహేశ్ బాబు ఇంట్లో విషాదం.. రమేశ్బాబు కన్నుమూత) -
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూత
-
'రమేష్బాబు మృతి మాకు తీరని లోటు'
సూపర్స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్బాబు మృతి పట్ల ఘట్టమనేని కుటుంబం విచారం వ్యక్తం చేసింది. ''రమేష్బాబు మృతి మాకు తీరని లోటు. రమేష్బాబు మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం రమేష్బాబు భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించనున్నాం. ప్రస్తుత పరిస్థితుల దృష్యా శ్రేయోభిలాషులందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతున్నాం. అంతక్రియల సమయంలో గుమిగూడకుండా ఉండాలి.'' అని పేర్కొంది. Official statement from The Ghattamaneni family. https://t.co/bFWZgUAlNn pic.twitter.com/uUV8d7wh58 — BA Raju's Team (@baraju_SuperHit) January 8, 2022 కాగా రమేష్బాబు మృతి పట్ల సినీపరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు రమేశ్బాబు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ''రమేష్బాబు మృతిపట్ల ఆయన కుటుంబానికి నా ప్రగాడ సానభూతి. రమేష్బాబు మృతి కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా'' - దర్శకుడు మెహర్ రమేశ్ ''నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్బాబు గారు కన్నుమూశారని తెలిసి దిగ్ర్బాంతికి లోనయ్యాను. వారి కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రముఖ నటులు కృష్ణగారి నట వారసత్వాన్ని కొనసాగించి అనంతరం చిత్ర నిర్మాణంలో వచ్చి మంచి విజయాలు సాధించారు. రమేష్బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను'' - సినీహీరో పవన్ కళ్యాణ్ -
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు రమేశ్బాబు సినీ జ్ఞాపకాలు ( ఫొటోలు)
-
హీరో మహేశ్ బాబు ఇంట్లో విషాదం..
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పతికి తరలించారు. అయితే అప్పటికే (రాత్రి 10గం. ప్రాంతంలో) రమేశ్బాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నప్పటి సీతారామరాజుగా తెరంగేట్రం.. 1965, అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరలకు మొదటి సంతానంగా జన్మించారు రమేశ్బాబు. తండ్రి çకృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’(1974) సినిమాలో చిన్నప్పటి సీతారామరాజుగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత కృష్ణ ఓ లీడ్ రోల్లో నటించి, నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’లో చిన్నప్పటి ఎన్టీఆర్గా కనిపించారు. ‘దొంగలకు దొంగ, అన్నదమ్ముల సవాల్’వంటి చిత్రాల్లో బాల నటుడిగా అలరించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘నీడ’లో తొలిసారిగా టీనేజ్ ప్రధాన పాత్ర చేశారు. రమేశ్ సోదరుడు మహేశ్బాబుకు బాలనటుడిగా ఇదే తొలి చిత్రం. దాసరి ‘పాలు నీళ్లు’లోనూ రమేశ్ ప్రధాన పాత్రలో కనిపించారు. వి. మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్’(1987)తో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘చిన్ని కృష్ణుడు, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, అన్నాచెల్లెలు, ఆయుధం’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించారు. ‘బజారు రౌడీ’, ‘అన్నాచెల్లెలు’చిత్రాలు రమేశ్ కెరీర్లో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. 1997లో ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన ‘ఎన్కౌంటర్’రమేశ్బాబుకి చివరి చిత్రం. ఆ తర్వాత 1999లో వచ్చిన హిందీ చిత్రం ‘సూర్యవంశమ్’(తెలుగు ‘సూర్యవంశం’చిత్రానికి రీమేక్) చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. తర్వాత తండ్రి పేరుతో కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థను ప్రారంభించి, సోదరుడు మహేశ్బాబు హీరోగా ‘అర్జున్’(2004) చిత్రంతో పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. ఆ తర్వాత మహేశ్తోనే ‘అతిథి’సినిమాను నిర్మించారు. మహేశ్ ‘దూకుడు’, ‘ఆగడు’చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. రమేశ్కు భార్య మృదుల, కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి ఉన్నారు. రమేశ్ హఠాన్మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తండ్రి, సోదరుడితో... తండ్రి కృష్ణతో ‘కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, ఆయుధం, ఎన్కౌంటర్’చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు రమేశ్. తమ్ముడు మహేశ్తో ‘బజారు రౌడీ, ‘ముగ్గురు కొడుకులు’చిత్రాల్లో నటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అందువల్లే రమేశ్ బాబుకు నటించాలన్న ఆసక్తి పోయింది: కృష్ణ
Krishna About Namrata Shirodkar: సూపర్ స్టార్ మహేశ్బాబు తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదం పంచుతూనే మరోవైపు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అయితే అతడు పెద్ద స్టార్ అవుతాడని తమకెప్పుడో తెలుసంటున్నారు మహేశ్ తండ్రి, సీనియర్ నటుడు కృష్ణ. కృష్ణ సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పోరాటం' సినిమాలో తనయులు మహేశ్ బాబు, రమేశ్ బాబు ఇద్దరూ బాగా నటించారన్నారు. కానీ ఆ తర్వాత రమేశ్ కెరీర్లో మంచి సినిమాలు పడలేదన్నారు. అందుకే రమేశ్ బాబుకు నటించాలన్న ఆసక్తి సన్నగిల్లిందని చెప్పుకొచ్చారు. ఇక తన కోడలు నమ్రత సినిమాలు, బిజినెస్ పట్టించుకోదని, అన్నీ తన కొడుకే చూసుకుంటాడని తెలిపారు. ఆయన ఇంకా ఏమేం మాట్లాడారో తెలియాలంటే కింది వీడియో చూసేయండి.. -
కొత్త గేట్ ఏర్పాటుకి ప్రతిపాదనలు పంపుతాం
-
కొత్త గేట్ ఏర్పాటుకి ప్రతిపాదనలు పంపుతాం
సాక్షి, గుంటూరు: పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేట్ వద్ద పనులు కొనసాగుతున్నాయని, సాయంత్రానికి స్డాప్ లాక్ గేట్ ఏర్పాటు పూర్తి చేస్తామని ఎస్ఈ రమేష్ బాబు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు నాలుగు ఎలిమెంట్స్ ఒకదానిపై ఒకటి ఏర్పాటు చేశాం. ఇంకా ఏడు ఎలిమెంట్స్ని సాయంత్రానికి పెట్టి స్టాప్ లాగ్ గేట్ని పూర్తి చేస్తాం. ఇదే సమయంలో గత మూడు రోజులుగా ఎత్తిన 17 గేట్లని ఒక్కొక్కటిగా మూసివేస్తున్నాం. ఇప్పటివరకు ఏడు గేట్లు మూసేశాం. ఆ తర్వాత మిగిలిన పది గేట్లని మూసివేసి అవుట్ ఫ్లో నిలిపివేస్తాం. ప్రస్తుతం సాగర్ నుంచి 27 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుంది. రోజుకి మూడు టీఎంసీలు వచ్చినా పది రోజులలో ప్రాజెక్ట్ వద్ద నీటి నిల్వ సామర్ద్యం యధావిధిగా 45 టీఎంసీలకు చేరుకుంటుంది. కొత్త గేట్ ఏర్పాటుకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతా’’మని అన్నారు. -
61 వేల కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించిన లోక్అదాలత్కు అనూహ్య స్పందన లభించింది. వివిధ కోర్టుల్లో పెండింగ్లో దాదాపు 61 వేల కేసులను పరిష్కరించారు. ఇందులో 1,400 సివిల్, 52,420 వేల క్రిమినల్, విచారణ దశలో ఉన్న 7,180 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.60.52 కోట్లు పరిహారంగా అందించారు. హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్రావు, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ అభిషేక్రెడ్డి నిర్వహించిన లోక్అదాలత్లో 203 కేసులు పరిష్కరించినట్లు అథారిటీ కార్యదర్శి రమేష్బాబు తెలిపారు. అలాగే సిటీ సివిల్ కోర్టులో నిర్వహించిన లోక్అదాలత్లో 634 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.19.66 కోట్లు పరిహారంగా అందించినట్లు అథారిటీ చైర్మన్, చీఫ్ జడ్జి సుమలత, కార్యదర్శి మురళీమోహన్ తెలిపారు. సికింద్రాబాద్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో 120 కేసులను పరిష్కరించి రూ.5.90 కోట్లు పరిహారంగా అందించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు పర్యవేక్షణలో ఈ అదాలత్ నిర్వహించినట్లు లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి జి.అనుపమా చక్రవర్తి శనివారం తెలిపారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి... ‘వారిద్దరూ భార్యాభర్తలు. అభిప్రాయ భేదాలు రావడంతో 15 ఏళ్ల కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడాకులు పొందారు. కాలక్రమంలో వారి పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు వారిద్దరూ మళ్లీ ఒక్కటవ్వాలని భావించారు. మళ్లీ వివాహం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టులోనే మళ్లీ వారు పిటిషన్ వేశారు. వీరిద్దరి మధ్య ఒప్పందం చేశాం. మళ్లీ పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో జీవించాలని అనుకున్న వారి కోరిక తీరనుంది’అని లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి మురళీమోహన్ తెలిపారు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్లో పనిచేసిన శ్రీనిజ సర్టిఫికెట్లు పోగొట్టిన ఘటనలో ఆ బ్యాంకు అధికారులను ఒప్పించి సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ రూ.1.15 లక్షల పరిహారాన్ని ఇప్పించింది. -
రమేష్ బాబు కేసు: వేగం పెంచిన పోలీసులు
సాక్షి, కృష్ణా: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబుపై రెండో రోజు విచారణ కొనసాగుతోంది. అగ్ని ప్రమాద ఘటనలో పది మంది మృతిపై పోలీసులు విచారణలో వేగం పెంచారు. డాక్టర్ రమేష్ విచారించేందుకు హైకోర్టు అనుతించడంతో మంగళవారం రెండో రోజు ఏడీసీపీ లక్ష్మీపతి విచారిస్తున్నారు. సూర్యారావుపేట పోలీసు స్టేషన్కు చేరుకొన్న రమేష్ను న్యాయవాది సమక్షంలో నేటి సాయంత్రం 5గంటల వరకు ఏడీసీపీ విచారించనున్నారు. ఈరోజు విచారణలో కీలక అంశాలపై వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేశారన్న మృతుల బంధువుల ఆరోపణపై నిజాలు రాబట్టేందుకు ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. లోపభూయిష్టంగా, నిబంధనలు పాటించకుండా కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహించారన్న అభియోగంపై విచారణ సాగుతోంది. చదవండి: రమేష్ బాబు విచారణకు హైకోర్టు అనుమతి -
స్వర్ణ ప్యాలెస్ ఘటన: మూడు రోజులపాటు కొనసాగనున్న విచారణ
-
స్వర్ణ ప్యాలెస్ ఘటన: రమేష్బాబు విచారణ
సాక్షి, విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రమేష్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేష్బాబుపై సోమవారం పోలీసు విచారణ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం న్యాయవాది సమక్షంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తున్నారు. మూడు రోజుల కస్టడీ కోరిన పోలీసులు మేష్ బాబుపై ప్రశ్నల వర్షం కురిపించడానికి బెజవాడ పోలీసులు ఇప్పటికే అనేక ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో హోటల్ యాజమాన్యానికి రమేష్బాబుకు అగ్రిమెంట్ ఉందా.. లేదా..?. ఘటన జరిగిన వెంటనే పోలీసు విచారణకు సహకరించకుండా ఎందుకు వెళ్లిపోయారు..?. అగ్నిప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు సరైన సమాధానం చెప్పకుండా ఎక్కడకు వెళ్లారు..?. ఇప్పటి వరకు రమేష్బాబునును ఎవరు నడిపించారు..? అంటూ ఇలా అనేక ప్రశ్నలను సంధించే అవకాశం ఉంది. కోవిడ్ లేకపోయినా, లక్షణాలు ఉన్నాయంటూ రోగులను భయపెట్టి లక్షల రూపాయలు నగదు దోచుకున్నారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపైనా విచారించనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకంటే అధికంగా డబ్బులు వసూళ్లు చేశారనే ఆరోపణలపైనా పోలీసులు విచారణ కొనసాగించనున్నారు. సీఆర్పీసీ 41, 160 కింద నోటీసులు ఇచ్చినా ఎందుకు స్పందించలేదనే విషయంపైనా పోలీసులు వివరణ కోరనున్నారు. హోటల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదనే కోణంలోనూ మూడు రోజుల కస్టడీలో భాగంగా విచారణ కొనసాగనుంది. కాగా, ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో 10 మంది చనిపోగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు డాక్టర్ రమేశ్ బాబు సహా పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు కస్టడీకి డాక్టర్ రమేష్బాబు
సాక్షి, అమరావతి: విజయవాడ స్వర్ణాప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై గవర్నర్పేట పోలీసులు నమోదు చేసిన కేసులో రమేష్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేష్బాబు చివరికి దిగొచ్చారు. ఈ కేసులో పోలీసుల ముందు హాజరయ్యేందుకు అంగీకరించారు. దీంతో రమేష్బాబును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు దర్యాప్తు అధికారికి ఎట్టకేలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు దర్యాప్తు అధికారి అయిన అదనపు డిప్యూటీ కమిషనర్ ముందుహాజరు కావాలని రమేష్బాబును ఆదేశించింది. ఆ మూడురోజుల్లో ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు అదనపు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో రమేష్బాబును విచారించాలని సూచించింది. విచారణ సమయంలో డాక్టర్ రమేష్బాబుతో న్యాయవాదిని అనుమతించాలని, థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించరాదని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్ రెండురోజుల కిందట ఉత్తర్వులు జారీచేశారు. స్వర్ణాప్యాలెస్లో రమేష్ ఆస్పత్రి నిర్వహించిన కోవిడ్ కేంద్రంలో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన అగ్నిప్రమాదంలో 10మంది మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై గవర్నర్పేట పోలీసులు రమేష్ ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లిన డాక్టర్ రమేష్బాబు.. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఆగస్టు 25న విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్.. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దర్యాప్తును ఆపేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపట్టింది. దర్యాప్తు జరగాల్సిందేనని స్పష్టం చేస్తూ.. దర్యాప్తునకు సహకరించాలని డాక్టర్ రమేష్బాబును ఆదేశించింది. హైకోర్టులో పోలీసుల పిటిషన్ ఇదిలావుండగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు కొనసాగించిన పోలీసులు ఇటీవల హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తాము పలు డాక్యుమెంట్లు సమర్పించాలంటూ నోటీసులు జారీచేసినా డాక్టర్ రమేష్బాబు స్పందించడం లేదని, అందువల్ల ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో రమేష్బాబు పోలీసులకు సహకరిస్తానని, విచారణకు హాజరవుతానని హైకోర్టుకు తెలిపారు. దీంతో రమేష్బాబును మూడురోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. -
రమేష్ బాబు విచారణకు హైకోర్టు అనుమతి
సాక్షి, అమరావతి : విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబును విచారించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. అతన్ని కస్టడియల్ విచారణకు అనుమతిని మంజూరు చేస్తూ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. దీంతో నిందితుడుని అదుపులోకి తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ పొలీసులు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు విచారించనున్నారు. రమేష్ బాబు న్యాయవాది పరివేక్షణలో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్ (రమేష్ హాస్పిటల్)లో మంటలు చెలరేగి 10 మంది చనిపోయి 20 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. (రమేష్ ఆస్పత్రిపై సుప్రీంకు ఏపీ సర్కార్) కాగా స్వర్ణ ప్యాలెస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి గవర్నర్పేట పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమేష్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేశ్బాబు, చైర్మన్ ఎం.సీతారామ్మోహనరావులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు వారిపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనాడి రమేష్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే విచారణకు అనుమతి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా... తాజాగా మంజూరు చేసింది. దీంతో స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ఇన్ని రోజులు తప్పించుకు తిరిగిన రమేష్ బాబు పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నారు. -
ప్రకాశం బ్యారెజ్ 70 గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ: కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్కు గంటగంటకూ 7 లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వరద పెరుగుతోంది. ఈస్టన్, వెస్టన్ కెనాల్స్కు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం 16.7 అడుగులకు చేరింది. దీంతో అధికారులు సోమవారం 70 గేట్లను ఎత్తి సముద్రానికి నీటిని విడుదల చేసి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహాం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, సింహాద్రి, రమేష్ బాబు, కలెక్టర్ ఇంతియాజ్ బ్యారేజ్ వద్ద పరిస్థితులను సమీక్షించి అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు, వరదలు వస్తుండటంతో జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయన్నారు. ఫ్లడ్ మేనేజ్మెంట్ అధికారుల శ్రమ మంత్రి అభినందనీయం అన్నారు. నీటి కొరత లేకపోవడంతో పంటలు సంవృద్ధిగా పండి రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. కానీ తెలుగు దేశం పార్టీ నేతలు వరదలని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి మండిపడ్డారు. -
అక్రమాల ఆసుపత్రి
సాక్షి, అమరావతి బ్యూరో/పటమట: అత్యాధునిక వైద్యం పేరుతో రోగుల నుంచి అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్న రమేష్ ఆస్పత్రి యాజమాన్యం యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడింది. రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పోతినేని రమేష్బాబు గత సర్కారు అండదండలతో ధనార్జనే లక్ష్యంగా అడ్డదిడ్డంగా నిర్మాణాలు చేపట్టారు. క్యాంటీన్ ‘సెట్’ చేశారు.. ► విజయవాడలోని లయోలా కళాశాల ప్రాంగణంలో 1988లో ఆరు పడకలతో ప్రారంభమైన రమేష్ ఆస్పత్రి పార్కింగ్ స్థలంలో నిర్మాణాలు చేపట్టటంతోపాటు సెట్బ్యాక్ స్థలంలో క్యాంటీన్ ఏర్పాటు చేసింది. బందరు రోడ్డు బ్రాంచ్ ఆస్పత్రిలో ఏకంగా రోడ్డుపైనే ర్యాంపుల నిర్మాణం చేపట్టారు. సెట్బ్యాక్ నిబంధనలు పాటించలేదు. ► ఆస్పత్రి, నర్సింగ్హోం, క్లినిక్స్ లాంటి వాటికి బిల్టప్ ఏరియాలో 20 శాతం స్టాఫ్ పార్కింగ్కు, 10 శాతం సందర్శకుల పార్కింగ్కు కేటాయించాలి. రమేష్ ఆస్పత్రి నిర్వాహకులు పార్కింగ్ కోసం రోడ్లను వినియోగిస్తున్నారు. ► 10–15 మీటర్ల ఎత్తున్న ఆస్పత్రులకు 2.5 మీటర్లు సెట్బ్యాక్ వదలాల్సి ఉండగా రమేష్ ఆస్పత్రిలో 1.5 మీటర్లు మాత్రమే ఉంది. ఫలితంగా అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు తిరిగేందుకు అవకాశం లేదు. చివరకు మరుగుదొడ్లలోనూ.. ► పార్కింగ్కు కేటాయించిన స్థలాన్ని స్టోర్ రూంగా వినియోగిస్తున్నారు. ► ప్రధాన ఆసుపత్రి ఎదురుగా ఉన్న పోస్టాఫీస్ వద్ద డ్రైనేజీని మూసివేసి పార్కింగ్కు వాడుతున్నారు. ఇక్కడ అనధికారికంగా నిర్మించిన అంతస్తుకు ఎలాంటి అనుమతులు లేవు. ► మినీ సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఏర్పాటు చేయకుండా ఆస్పత్రి వ్యర్థాలను నేరుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి(యూజీడీ)కి కలిపేస్తున్నారు. ► బ్రాంచ్ ఆస్పత్రిలో ఒక్క కనెక్షన్కే పన్ను చెల్లిస్తుండగా అందులో సుమారు 20 టాయిలెట్లు ఉన్నాయి. ప్రధాన ఆస్పత్రిలోనూ ఒక్క కనెక్షనే తీసుకుని 30 పైగా టాయిలెట్లకు పన్ను చెల్లించడం లేదు. చివరకు మరుగుదొడ్ల పన్నును కూడా ఆసుపత్రి యాజమాన్యం ఎగ్గొట్టింది. గుట్టుగా బయోవేస్ట్ డంపింగ్.. ► రమేష్ హాస్పిటల్స్లో రోజుకు సగటున రెండు టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఆస్పత్రులు విడుదల చేసే బయోవేస్ట్ను పర్యావరణశాఖ అనుమతులున్న ఏజెన్సీ ద్వారా డిస్పోజ్ చేయాలి. లేదా ఆస్పత్రి ఆవరణలోనే భూమిలో కలిసేలా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి. రమేష్ ఆస్పత్రి యాజమాన్యం అలాంటి ఏర్పాట్లేమీ చేయకపోగా గుట్టుగా వీఎంసీ డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. ఉల్లంఘనలపై కఠిన చర్యలు ‘ఆస్పత్రికి అనుమతులపై పరిశీలన జరుగుతోంది. బందరు రోడ్డు విస్తరణలో నిర్వాసితులకు ఇచ్చిన రాయితీలను పరిశీలిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవు. అక్రమాలు నిర్థారణ అయితే కూల్చివేస్తాం’ – సూరజ్, ఇన్చార్జి సిటీ ప్లానర్ రమేష్ ఆస్పత్రి ఘటన నిందితులకు రిమాండ్ పొడిగింపు విజయవాడ లీగల్: విజయవాడ రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలోని ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అరెస్టు అయిన ముగ్గురు నిందితులకు వచ్చే నెల ఒకటో తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పి.శ్రీసత్యాదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్ (రమేష్ హాస్పిటల్)లో మంటలు చెలరేగి 10 మంది చనిపోయి 20 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసులో గవర్నర్పేట పోలీసులు డాక్టర్ కొడాలి రాజగోపాలరావు, డాక్టర్ కూరపాటి సుదర్శన్, మేనేజర్ పల్లపోతు వెంకటేష్లను ఈనెల 9న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఈనెల 21 వరకు రిమాండ్ విధించారు. రిమాండ్ ముగియడంతో మచిలీపట్నం సబ్జైలులో ఉన్న నిందితులకు న్యాయమూర్తి వీడియో లింకేజి ద్వారా వచ్చే నెల ఒకటో తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా స్వర్ణ ప్యాలెస్ ఘటనలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయమని కోరుతూ రమేష్ హాస్పిటల్స్ అధినేత దాక్టర్ పి.రమేష్బాబు ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి.. ఏపీపీ కౌంటర్ వేసేందుకు సమయం కోరడంతో కౌంటర్, వాదనల నిమిత్తం సోమవారానికి పిటిషన్ను వాయిదా వేశారు. -
నాపై కేసును కొట్టేయండి
సాక్షి, అమరావతి: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద దుర్ఘటనకు సంబంధించి గవర్నర్పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమేష్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేష్బాబు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అగ్నిప్రమాదంలో కోవిడ్ రోగులు మృతి చెందిన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. స్వర్ణ ప్యాలెస్లో కోవిడ్ రోగులకు చికిత్స చేసేందుకు జిల్లా వైద్యాధికారి అనుమతి ఇచ్చారన్నారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేస్తే తన పరువు పోతుందని, ఆసుపత్రి ప్రతిష్ట దెబ్బతింటుందని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఇదే అభ్యర్థనతో రమేశ్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ ఎం.సీతారామమోహనరావు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టు విచారణ జరపనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా విజయవాడ లీగల్: తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయమని కోరుతూ రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్బాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తూ ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి ఏపీపీ కౌంటర్ దాఖలు నిమిత్తం వాయిదా వేశారు. గవర్నర్పేట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు లేనందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని డాక్టర్ రమేష్బాబు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం, హోటల్ స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాన్ని ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. -
వైస్సార్సీపీలో చేరిన టీడీపీ తిరుపతి అధ్యక్షుడు
సాక్షి, తిరుపతి: పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పిలుపు\నిచ్చారు. తుమ్మలగుంటలోని తెలుగుతల్లి విగ్రహం నుంచి వేదాంతపురం వరకు స్థానిక యువత బుధవారం చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆధ్యర్యంలో తిరుపతి రూరల్ టీడీపీ అధ్యక్షుడు చెరుకుల జనార్థన్ యాదవ్, అతని అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వారికి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జనార్థన్ యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చెవిరెడ్డి పోరాట పటిమ తనను ఆకర్షించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. కృష్ణా జిల్లా: మోపిదేవి మండల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అవనిగడ్డ రమేష్ బాబు అధ్వర్యంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. 70 కుటుంబాలకు చెందిన కార్యకర్తలను ఎమ్మెల్యే రమేష్బాబు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన 100 కుటుంబాలకు చెందిన టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
అవనిగడ్డలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి సింహాద్రి రమేష్ బాబు ప్రచారం
-
అనర్గళ విద్యా ‘సాగరు’డు
సాక్షి, కరీంనగర్: రాజకీయాల్లో తలపండిన నేతలు.. కాకలు తీరిన యోధులు.. ఒక్కసారైనా రాజ్యాంగపరంగా ప్రాధాన్యత ఉన్న గవర్నర్ పదవి చేపట్టాలని ఆశిస్తారు. అలాంటి రాజ్యాంగపరమైన పదవిలో రాణిస్తున్నారు చెన్నమనేని విద్యాసాగర్రావు (77). మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న విద్యాసాగర్రావు 2014 ఆగస్ట్ 30న మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. విద్యాసాగర్రావు మూడుసార్లు శాసనసభ్యుడిగా, రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా.. ఐదేళ్లు కేంద్ర మంత్రిగా పని చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి గవర్నర్ స్థాయికి ఎదిగిన రెండో వ్యక్తి విద్యాసాగర్రావు. మొదటి వ్యక్తి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. పిట్టకథలు, వాగ్దాటితో ఆకట్టుకునే ‘సాగర్జీ’ ప్రస్థానంపై కథనం.. విద్యార్థి దశలో రచన, రాజకీయం.. విద్యాసాగర్రావు ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతుండగా విద్యార్థి నాయకుడిగా వర్సిటీ స్థాయి ఎన్నికల్లో పాల్గొన్నారు. బీఎస్సీ ఎల్ఎల్బీ చదివారు. ఇందిర ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయి జైలుకెళ్లారు. జైలులో ఉండగా పలు కథలు, వ్యాసాలు రాశారు. విద్యాసాగర్రావు సోదరుడు చెన్నమనేని రాజేశ్వర్రావు కమ్యూనిస్టు నేతగా ఉండగా విద్యాసాగర్రావు మాత్రం ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా పనిచేశారు. 1983లో తొలిసారి కరీంనగర్ జిల్లా చొప్పదం డిలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1985లో మెట్పల్లి నుంచి పోటీచేసిన విద్యాసాగర్రావు ఆపై 1989, 1994 ఎన్నికల్లో వరుస విజయా లు సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా, శాసనసభలో శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 1998లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి 12వ లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. అప్పట్లో వాజ్పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో 1999లో వచ్చిన ఎన్నికల్లో రెండోసారి ఎంపీ అయ్యారు. వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కేసీఆర్పై పోటీ.. 2004 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉద్యమ నేతగా కరీంనగర్ నుంచి కేసీఆర్ పోటీ చేయగా అప్పటికే సిట్టింగ్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న విద్యాసాగర్రావు మూడోసారి బరిలో దిగారు. తెలంగాణ వాదం బలంగా ఉండటంతో విద్యాసాగర్రావు ఓటమిపాలయ్యారు. 2009లో వేములవాడ ఎమ్మెల్యేగా పోటీచేసిన విద్యాసాగర్రావు తన సోదరుడు రాజేశ్వర్రావు, తనయుడు రమేశ్బాబు చేతిలో ఓటమిపాలయ్యా రు. బాబాయిని ఓడించిన అబ్బాయిగా రమేశ్బాబు వార్తల్లో నిలిచారు. 2014లో కరీంనగర్ లోక్సభ నుంచి పోటీ చేసిన విద్యాసాగర్రావు మరోసారి ఓటమిపాలయ్యారు. మహారాష్ట్ర గవర్నర్గా.. తెలంగాణ ప్రాంత సీనియర్ బీజేపీ నేతగా గుర్తింపు పొందిన విద్యాసాగర్రావు 2014లో బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి రావడంతో మహారాష్ట్ర గవర్నర్గా 2014 ఆగస్టు 30న బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో మరణించిన సందర్భంగా తమిళనాట నెలకొన్న నాటకీయ పరిణామాలను నిశితంగా గమనించిæనాటి తమిళనాడు ఇంఛార్జి గవర్నర్గా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. మాటల మరాఠీ.. విద్యాసాగర్రావుకు మాటల మాం త్రికుడని పేరు. వేదికలపై అనర్గళంగా మాట్లాడుతూ కుల సంఘాల పేర్లను ఉచ్చరిస్తారు. ప్రసంగం మధ్యలో పిట్టకథలు చెబుతూ సభికులను ఆకట్టుకుంటారు. అసెంబ్లీ వేదికగా సాగే చర్చల్లోనూ తనదైన శైలిలో సాధికారంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. సభ ఏదైనా తన వాగ్ధాటితో మెప్పిస్తారు. విద్యాసాగర్రావును ముద్దుగా ‘సాగర్జీ’ అంటారు. ప్రసంగం మధ్యలో చమత్కారాలు, తెలంగాణ నుడికారాలు, సామెతలు చెబుతూ రక్తికట్టిస్తారు. ఇంతట ‘మాటల నేత’ ప్రస్తుతం గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కమాటా మాట్లాడకుండా గంభీరంగా ఉండటం విశేషం. కుటుంబమంతా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నాగారానికి చెందిన చెన్నమనేని శ్రీనివాస్రావు–చంద్రమ్మ దంపతుల చిన్నకొడుకుగా 1942 ఫిబ్రవరి 12న జన్మించిన విద్యాసాగర్రావు పాఠశాల స్థాయి నుంచే చురుకైన వక్త. ఆయన భార్య వినోద. పిల్లలు వివేక్, వినయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. చిన్నబ్బాయి వికాస్ డాక్టర్. విద్యాసాగర్రావు పెద్దన్నయ్య రాజేశ్వర్రావు సీనియర్ రాజకీయ నేత కాగా మరో అన్నయ్య పద్మవిభూషణ్ హన్మంతరావు ఆర్థికవేత్త. ఇంకో అన్నయ్య వెంకటేశ్వర్రావు కమ్యూనిస్టు నాయకుడు. విద్యాసాగర్రావు సోదరి కుమారుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రస్తుత కరీంనగర్ ఎంపీ కాగా సోదరుడు రాజేశ్వరరావు కొడుకు రమేశ్బాబు వేములవాడ శాసనసభ్యుడిగా ఉన్నారు. సొంత డబ్బుతో స్కూలు, చెరువు.. నాగారంలోని రెండున్నర ఎకరాల భూమిని గురుకుల విద్యాలయానికి దానంగా ఇచ్చారు. గ్రామం లోని 85 మంది రైతులకు రూ.1.32 కోట్ల సొంత ఖర్చులతో బోర్లు వేయించారు. 105 మంది పేద బీడీ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఇళ్లు కట్టించారు. 1993లో నాగారంలో రూ.60 లక్షలతో తొలి ఊట చెరువు నిర్మించారు. తల్లి చంద్రమ్మ పేరిట ట్రస్ట్ పెట్టి సిరిసిల్లలో సాగునీటి కాలువలు తవ్వించారు. కార్గిల్ వీరుల స్మారకార్థం 2000లో కార్గిల్ లేక్ను ఏర్పాటు చేశారు. - వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల -
మత్స్యకారులను మోసం చేసిన పెందుర్తి ఎమ్మెల్యే
అంతా నా ఇష్టం.. ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టుగా ఉంది పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీరు. అధికారం చేతిలో ఉంది కదా అనిఏదైనా చేయొచ్చు అనేలా ఆయన వ్యవహరిస్తున్నారు. పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందాలకు ఎమ్మెల్యేనిస్సిగ్గుగా తూట్లు పొడిచేసి నిబంధనలకు తిలోదకాలిచ్చేశారు. అందిన కాడికి దండుకుని ఫార్మా ఉద్యోగాలనుపప్పు బెల్లాల మాదిరిగా పచ్చ చొక్కాల వారికి పంచిపెట్టేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్హులైన పేదోళ్లపొట్ట కొట్టారు. సాక్షి, విశాఖపట్నం: ఇది పదేళ్ల కిందట మాట.. పరవాడ ఫార్మాసిటీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల మత్స్యసంపద దెబ్బతింది. ముత్యాలమ్మపాలెం, దిబ్బపాలెం, జాలరి పేట గ్రామాల మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో వారంతా ఫార్మాసిటీ వద్ద ఆందోళనకు దిగి పైపులైన్లు కోసేశారు. అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, ఫార్మాసిటీ యూని యన్ పెద్దల సమక్షంలో ఒప్పందం జరి గింది. ఆయా మత్స్యకార గ్రామాలకు చెందిన 600 మంది యువతకు పార్టీలకతీతంగా ఉద్యోగాలు కల్పిస్తామని ఫార్మాసిటీ పెద్దలు అంగీకరించారు. ఆ మేరకు అప్పటి ఆర్డీవో, తహసీల్దార్, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇరువర్గాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కూడా ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యేగా ఆ ఒప్పంద పత్రంలో సంతకం చేశారు. ఆ తర్వాత పరిణామాలతో ఈ ఉద్యోగాల కోసం అనేక దఫాలుగా పోరాటాలు జరిగాయి. ఆందోళనలు జరిగినప్పుడల్లా నాటి ఒప్పందం మేరకు ఉద్యోగాలిస్తామని ఫార్మాసిటీ పెద్దలు చెప్పుకుంటూవచ్చారు. అధికారులు కూడా అదే రీతిలో మత్స్యకార యువతను ఊరడిస్తూ వచ్చారు. తీరా ఉద్యోగాల కల్పన దగ్గరకు వచ్చేసరికి అధి కారులు ‘పచ్చ’పాతం చూపించారు. పార్టీల కతీతంగా ఆయా గ్రామాల్లో ఆందోళన జరిగిన సమయానికి ఉన్న నిరుద్యోగ యు వతకు ఉపాధి కల్పించాల్సి ఉంది. కానీ బండారు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పట్లో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్, టీడీపీ ఉండేవి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ, టీడీపీ సానుభూతి పరులున్నారు. అంతే కాదు..ఆయా గ్రామాలన్నీ నిన్న మొన్నటి వరకు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఏలుబడిలో ఉన్నవే. ఈ కారణంగా ఉద్యోగాలు ఎప్పుడు కల్పించినా.. ఇరువర్గాలకు చెందిన నిరుద్యోగులకు గ్రామసభ తీర్మా నం మేరకు అవకాశాలు కల్పిస్తామని యూనియన్ పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ మేరకు తొలి విడతగా 100 ఉద్యోగాల కల్పనకు ఫార్మాసిటీ కంపెనీలు ఒకే చెప్పాయి. అంతే అప్పటివరకు పార్టీలకతీతంగా ఉద్యోగాల కల్పిస్తామన్న ఎమ్మెల్యే బండారు ఒక్కసారిగా స్వరం మార్చారు. తానిచ్చిన వారికే ఉద్యోగాలు కల్పించాలంటూ జేఎన్పీసీ మాన్యుఫ్యాక్టరింగ్ అసోసియేషన్, జవహర్లాల్ నెహ్రూ రాంకీ ఫార్మాసిటీ కంపెనీల యాజ మాన్యాలౖపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. కొన్ని కంపెనీల ప్రతినిధులు గ్రామసభల తీర్మానం మేరకు జాబితాలు వస్తే ఇస్తామని తేల్చి చెప్పినా.. తాను చెప్పిందే ఫైనల్ అన్నట్టుగా ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పించడం సరికా దని.. పార్టీలకతీతంగా అందరికీ ఉద్యోగాలు కల్పించాలంటూ వైఎస్సార్ సీపీ, ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రవీణ్కుమార్, జేసీ సృజన, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, తేజ్భరత్లకు జాబితాలందజేశారు. తప్పకుండా గ్రామసభలు పెట్టి అన్ని వర్గాల వారికి ఒకేలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఆచరణ లోకి వచ్చేసరికి ఎమ్మెల్యే బండారు ఒత్తిళ్లకు తలొగ్గారు. జీ హుజూర్ అంటూ ఆయన ఇచ్చిన జాబితానే పార్మాసిటీ యూనియన్ పెద్దలకు పంపించారు. ఎమ్మెల్యే సిఫార్సు చేసిన జాబితాను తప్ప మరే ఇతర జాబితాలను పట్టించుకోవద్దని, గతంలో తాము పంపిన జాబితాలను కూడా పక్కన పెట్టేయాలని ఆర్డీవో తేజ్ భరత్ స్వయంగా లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి లోనే ఎమ్మెల్యే బండారు సమర్పించిన జాబి తా మేరకు పచ్చచొక్కా కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పిస్తూ పార్మాసిటీ నియామక ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా ఈ ఉద్యోగాల కల్పన విషయంలో జన్మభూమి కమిటీ సిఫార్సులు అవసరం లేదు. పూర్తిగా గ్రామసభ తీర్మానం మేరకే కల్పించాల్సి ఉంది. కానీ ఇక్కడ కూడా జన్మభూమి కమిటీ చక్రం తిప్పింది. ఎమ్మెల్యే బండారు, ఆయన తనయుడు అప్పలనాయుడు తరఫున కమిటీ సభ్యులు తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లతో జాబితాను సిద్ధం అధికారులకు పంపారు. ఒప్పందం మేరకు ఆందోళన జరిగిన సమయంలో నిరుద్యోగులుగా ఉన్న యువతకు ప్రాధాన్యమివ్వాలి. కానీ బండారు ఇచ్చిన జాబితాలో ఆయా గ్రామాలకు చెందిన టీడీపీ సానుభూతి పరులతో పాటు ఇతర గ్రామాలకు చెందిన వారిని కూడా స్థానికులుగా చూపించినట్టు తెలుస్తోంది. పైగా ఒకటి రెండు కుటుంబాలకు చెందిన వారికే ఎక్కువ మందికి ఉద్యోగాల కల్పనకు సిఫార్సు చేయడం విమర్శలకు తావిస్తోంది. మరో పక్క ఉద్యోగాలకల్పన పేరిట భారీగా వసూళ్లకు పాల్పడినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూళ్లు సాగించినట్టుగా అధికార పార్టీలోనే చర్చ జరుగుతోంది. చాలా అన్యాయం నాటి ఒప్పందం మేరకు గ్రామసభ తీర్మానం చేసి పార్టీలకతీతంగా దెబ్బతిన్న గ్రామాల నిరుద్యోగులకు ఫార్మాసిటీలో ఉద్యోగాలు కల్పించాలి. కానీ అలా కాకుండా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధికారులు, ఫార్మాసిటీ యూనియన్ పెద్దలపై ఒత్తిళ్లు తీసుకొచ్చి గ్రామసభ పెట్టకుండానే ఓ జాబితాను పంపించారు. ఆయన చర్యల వల్ల అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా పోయాయి. ఈ విషయంలో అర్హులకు న్యాయం జరిగేలా న్యాయపోరాటం చేసేందుకు కూడా వెనుకాడబోం.– బొంది అచ్చిబాబు,మండల ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ -
మన వేములవాడ సుపరిపాలనకు నిలువెత్తు సాక్ష్యం
సాక్షి,వేములవాడ: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత నాలుగున్నర ఏళ్ల సుపరిపాలనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న సారు.. కేసీఆర్ సారు.. ఆయన సర్కారు అన్నట్లు ప్రజలు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని టీఆర్ఎస్ అభ్యర్థి రమేశ్బాబు అన్నారు. ఈ నెల 7న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ మేరకు శుక్రవారం అర్బన్ మండలంలోని చీర్లవంచ, గుర్రంవానిపల్లి, గ్రామాలతోపాటు తన నివాసంలో చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ప్రతిభ యూత్ సభ్యులు, కోనరావుపేట మండలానికి మర్తనపేట గ్రామానికి చెందిన హమాలీ సంఘం, వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామ అంబేడ్కర్ యూత్క్లబ్ సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, ముంపు గ్రామాలను ఆదుకునేందుకు పరిశ్రమల స్థాపన చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారంతా రమేశ్బాబు గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
పాపకు తలలో పదేపదే ర్యాష్! మా పాపకు పదకొండు నెలల వయస్సు. తల మీద విపరీతమైన ర్యాష్తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్గారికి చూపించి చికిత్స చేయిస్తే తగ్గింది గానీ మళ్లీ పదే పదే తిరగబెడుతోంది. మా పాపకు ఉన్న సమస్య ఏమిటి? – ఎమ్. శారద, సామర్లకోట మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. అలాగే కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలిక సమస్యగానే చెప్పవచ్చు. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడుపైన పొరల్లా ఊడటం, కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపించడం జరుగుతుంది. దీనికి కారణం ఫలానా అని నిర్దిష్టంగా చెప్పలేకపోయినా... కొన్నిసార్లు ఎమ్. పర్పూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనక భాగానికి, చెవుల వరకు వ్యాపిస్తుంది. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు. చికిత్స : ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, శాల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న కీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటివి చేయాలి. దాంతో ఈ సమస్య నయమవుతుంది. అలాగే ఈ సమస్యతో ప్రభావితమైన భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం కూడా చాలా ముఖ్యం. బాబుకుతరచూతలనొప్పి..ఏం చేయాలి? మా బాబు వయసు తొమ్మిదేళ్లు. తరచూ తలనొపితో బాధపడుతున్నాడు. ఇంతకుముందు చాలా అరుదుగా వచ్చేది. కాని ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. మధ్యలో కొంతకాలం బాగానే ఉంటోంది. మళ్లీ మళ్లీ తలనొప్పి వస్తోంది. మా బాబు విషయంలో తగిన సలహా ఇవ్వండి. – జి. సుబ్రహ్మణ్యమూర్తి, వరంగల్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్ హెడేక్)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్. ఇది పెద్దల్లో అంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్తో పాటు టెన్షన్ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్ వల్ల వస్తున్న తలనొప్పి అని భావించవచ్చు. అయితే ఈ మైగ్రేన్లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో వెలుతురు చూడటానికి ఇష్టపడకపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది తీవ్రంగా ఉండే కొంతమందిలో దీని వల్ల శరీరంలోని కొన్ని అవయవాలు బలహీనంగా మారడం కూడా కనిపించవచ్చు. చికిత్స : ∙చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం ∙నుదిటిపై చల్లటి నీటితో అద్దడం ∙నొప్పి తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు (ఉదాహరణకు ఎన్ఎస్ఏఐడీ గ్రూప్ మందులు) వాడటం ∙నీళ్లు ఎక్కువగా తాగించడం ∙ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం. పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్ను చాలావరకు తగ్గించవచ్చు. అయితే ఇది చాలా తరచూ వస్తుంటే మాత్రం ప్రొఫిలాక్టిక్ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ సలహా మేరకు కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోవడం అవసరం. మా బాబు ఎదుగుదల నార్మల్గానే ఉందా? మా బాబుకు 15 నెలలు. పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. అయితే వాడు ఇంకా సపోర్ట్ తీసుకోకుండా నడవలేకపోవడం, ముద్దుమాటలాడకపోవడం చూస్తే వాడి ఎదుగుదలలో ఏవైనా లోపాలున్నాయేమోనని అప్పుడప్పుడూ అనిపిస్తోంది. దాంతో తీవ్ర వేదనకు గురవుతున్నాం. పిల్లల వికాసం ఏయే సమయాల్లో ఎలా ఉంటుందో విపులంగా వివరించండి. – సువర్ణకుమారి, కాకినాడ మీ బాబు ఎదుగుదల విషయంలో కాస్త నిదానంగా ఉన్నాడంటూ మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే... మీరలా అనుకోవడానికి కారణలేమీ కనిపించడం లేదు. ప్రతి పిల్లవాడి ఎదుగుదల, వికాసం వేర్వేరుగా ఉంటాయి. పిల్లల డెవలప్మెంట్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఫలానా పిల్లలు ఫలానా సమయంలోనే ఫలానా నైపుణ్యాలను నేర్చుకుంటారని చెప్పడం కుదరదు. కొంతమంది చాలా త్వరగా నడుస్తారు, మాట్లాడతారు. మరికొందరు కాస్త ఆలస్యంగా. అయితే ఎవరు ఎప్పుడు ఆ నైపుణ్యాలు నేర్చుకుంటారన్నది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు... నెలలు నిండకముందే పుట్టడం, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి ఏవైనా సమస్యలు రావడం, పుట్టాక జాండీస్, ఇన్ఫెక్షన్స్ వంటివి రావడం, కొన్ని జన్యుపరమైన కారణాలు, పిల్లలను పెంచే ప్రక్రియలో తల్లిదండ్రులు ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండటం, కవల పిల్లలు కావడం వంటి అనేక అంశాలు వాళ్ల ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నడక: సాధారణంగా పిల్లలు 11 నుంచి 16 నెలల మధ్య నడవడం ప్రారంభిస్తారు. కొందరు ఆలస్యంగా నడవడం మొదలుపెట్టవచ్చు. 18 నెలల పిల్లలు నడవడంతో పాటు ఏదైనా వస్తువులు పట్టుకుని లాగడం, వస్తువులను దూరంగా నెట్టడం, బుక్ చేతికి ఇచ్చినప్పుడు పేజీలు తిప్పడం, క్రేయాన్స్ వంటివి ఇస్తే వాటితో నేలమీద, గోడల మీద రాయడం, నేల మీదే దృష్టిపెట్టి పరుగెత్తడం వంటివి సులభంగా చేస్తుంటారు. రెండేళ్లు వచ్చే సరికి తలుపులు తెరవడం, సొరుగులు లాగడం, చేతులు కడుక్కోవడం, మెట్లు ఎక్కడం లాంటివి చేస్తుంటారు. అయితే ఈ పనులు చేయడంలోనూ పిల్లవాడికీ, పిల్లవాడికీ మధ్య తేడాలుంటాయి. మాటలు: ఇక మాటల విషయానికి వస్తే 15 నెలలు నిండిన చిన్నారులు ముద్దుమాటలతో పాటు, ఒకటి రెండు శబ్దాలు పలకడం చేస్తుంటారు. 18 నుంచి 24 నెలల వయసుకు వాళ్లు 15–20 పదాలు పలకడంతో పాటు తల్లిదండ్రుల సూచనలకు రెస్పాండ్ అవుతుంటారు. 18–20 నెలల వయసు వచ్చేటప్పటికి కొద్దిగా కూడా మాటలు రాకపోతే, చుట్టుపక్కల శబ్దాలకు ఏమాత్రం రెస్పాండ్ కాకపోతే... అప్పుడు అలాంటి పిల్లలకు డెవలప్మెంట్ డిలే ఉన్నట్లుగా పరిగణిస్తాం. అలాంటి పిల్లల్లో వినికిడి లోపాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక మీ బాబు విషయానికి వస్తే... అతడు కొన్ని శబ్దాలను పలకడం, కొన్ని వస్తువుల ఆసరాతోనైనా నిలబడటం వంటివి చేస్తున్నాడు. ఇతరత్రా సమస్యలేమీ లేవు. డెవలప్మెంట్ డిలేని సూచించే లక్షణాలేమీ కనిపించడం లేదు. అయితే ఇలా డెవలప్మెంట్ డిలే ఉన్నట్లు అనుమానించే పిల్లల విషయంలో క్రమం తప్పకుండా ఫాలో అప్లతో పాటు క్లోజ్ అబ్జర్వేషన్ చాలా ప్రధానం. ఒకవేళ నిజంగానే గ్రాస్ డెవలప్మెంట్ డిలే ఉంటే త్వరగా కనుక్కుని అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవడం (అర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్) ద్వారా వాళ్లను సరిచేయడానికి అవకాశం ఉంది. మీరు మీ పీడియాట్రీషియన్తో తరచూ ఫాలోఅప్లో ఉండండి. మీ పీడియాట్రీషియన్ సూచనలను తప్పక పాటించండి. - డా. రమేశ్బాబు దాసరి ,సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
హీరోగా సూపర్ స్టార్ మనవడు..?
డాషింగ్ హీరోగా టాలీవుడ్ ను ఏలిన సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇప్పటికే మహేష్ బాబు టాలీవుడ్ను ఏలేస్తున్నాడు. గతంలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా పలు చిత్రాల్లో హీరోగా ఆకట్టుకున్నా.. తరువాత వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం అదే ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు, నవీన్ విజయకృష్ణ వంటి యువ నటులు హీరోలుగా నిలదొక్కుకునేందుకు శ్రమిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నిజం సినిమాతో బాలనటుడిగా పరిచయం అయిన జయకృష్ణ త్వరలోనే కథానాయకుడిగా తెరకు పరిచయం కానున్నాడు. ఇప్పటికే నటన, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటిలో జయకృష్ణ శిక్షణ తీసుకుంటున్నాడు. -
నేడు పీజీఈసెట్ తొలి జాబితా విడుదల
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థుల తొలి జాబితాను బుధవారం(16న) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పీజీఈసెట్– 2017 కోకన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్బాబు మంగళవారం తెలిపారు. పీజీఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని, కళాశాలల ఎంపికకు ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులు తమ పేర్లను http:// www. osmania. ac. in/ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. -
పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు
వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు మేడిపెల్లి: పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. గురువారం మండలంలోని గోవిందారం, మన్నెగూడెం, భీమారం, మేడిపెల్లి గ్రామాలలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే మిషన్ భగీరథ పథకం కింద మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. అలాగే మేడిపెల్లిలో సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టిస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిందని ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టిస్తున్నట్లు చెప్పారు. మండలానికి మొదటి దశలో 5 గ్రామాలను ఎంపిక చేసి 75 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. రెండవ దశలో కూడా నియోజకవర్గానికి 1000 ఇళ్లు వచ్చినట్లు తెలిపారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. మిషన్ భగీరథ కింద ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందన్నారు. కథలాపూర్ మండలం కలిగోటలో గల సూరమ్మ చెరువును మినీ రిజర్వాయర్గా మార్చేందుకు రూ.195 కోట్లు మంజూరయినట్లు తెలిపారు. మండలంలోని మన్నెగూడెం జెడ్పీఎస్ఎస్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, సబ్ కలెక్టర్ ముషారఫ్ఆలీ, జడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, మార్కెట్ కమిటి చైర్మన్ ముక్కెర గంగాధర్, పోరుమల్ల సింగిల్ విండో చైర్మన్ మిట్టపెల్లి భూమరెడ్డి, తహశీల్దార్ వెంకటేశ్, ఎంపీడీవో హరికిషన్, పీఆర్ఏఈ గోపాల్, ఏవో త్రివేదిక, సర్పంచ్లు తోకల నర్సయ్య, గౌరి భూమయ్య, ఉత్కం లక్ష్మి, వీరబత్తిని ఆంజనేయులు, ఎంపీటీసీలు బాలసాని రవిగౌడ్, కళ్ళెం భూమేశ్వరి, కుందారపు అన్నపూర్ణ, నాయకులు సుధవేని గంగాధర్గౌడ్, రవి, ఎండీ గాజీపాష, కుందారపు రవి, సాగర్, ప్రభాకర్, నారాయణరెడ్డి, భగవంతం,శంకర్, రాంరెడ్డి, గంగారాం, సురేశ్, చారీ, జలందర్రావు, రాజేందర్, అధికారులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి పీజీఈసెట్
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ హైదరాబాద్: పీజీఈసెట్– 2017 (ఇంజనీరింగ్ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలు) రేపటి (29వ తేదీ) నుంచి ప్రారంభంకానున్నట్లు పీజీఈసెట్ కన్వీనర్ డాక్టర్ రమేశ్బాబు తెలిపారు. ప్రవేశ పరీక్షల కోసం తొలిసారి ఆన్లైన్ పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. జూన్ 1 వరకు జరిగే ఈ పరీక్షలకు 1.30 నిమిషాల ముందు గానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అభ్య ర్థులకు సూచించారు. పరీక్ష రాసిన రోజు రాత్రి 8 గంటలకు జవాబు పత్రాన్ని డౌన్లోడ్ చేసు కోవచ్చ న్నారు. నిమిషం ఆలస్య మైనా పరీక్షకు అనుమ తించబోమన్నారు. ఫలితాలను జూన్ 12న విడుదల చేస్తామన్నారు. -
ఓ బార్బర్.. 150 లగ్జరీ కార్లకు యజమాని
బెంగళూరు: అతనికి ఓ రోల్స్ రాయ్స్, 11 మెర్సిడెజ్, 10 బీఎండబ్ల్యూ, 3 ఆడి, 2 జగ్వార్ కార్లు ఉన్నాయి. ఈ మధ్య జర్మనీ నుంచి మేబ్యాచ్ కారు కొనుగోలు చేశాడు. దీని ఖరీదు అక్షరాలు 3.2 కోట్ల రూపాయలు. బెంగళూరులో ఇలాంటి కార్లు మూడు మాత్రమే ఉన్నాయి. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, మరో బిల్డర్ తర్వాత ఈ కారు కొన్నది ఆయనే. ఈ ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తుంటాడు. ఇంతకీ ఆయన ఎవరంటే.. ఓ బార్బర్. ఓ హెయిర్ కట్ చేస్తే 75 రూపాయలు తీసుకుంటాడు. ఓ బార్బర్ దగ్గర ఇన్ని ఖరీదైన కార్లు ఉన్నాయంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అయినా ఇది అక్షరాలా నిజం. బెంగళూరులోని 45 ఏళ్ల రమేష్ బాబు అనే బార్బర్ ఆదర్శనీయమైన విజయగాథ ఇది. ఓ బార్బర్ గా కెరీర్ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదుగుతూ 150 లగ్జరీ కార్లకు యజమాని అయ్యారు. అయినా ఇప్పటికీ ఆయన రోజూ సెలూన్ లో పనిచేస్తారు. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీకి ఆయన యజమాని. కోట్లాది రూపాయల కంపెనీకి యజమాని అయినా రమేష్ తన మూలాలను మరచిపోలేదు. రోజూ సెలూన్లో కనీసం ఐదు గంటలు పనిచేస్తారు. రెగ్యులర్గా వచ్చే కస్టమర్లకు ఆయనే హెయిర్ కట్ చేస్తారు. గత 30 ఏళ్లుగా ఆయన దినచర్య ఇది. సెలూన్లో పనిచేయడం ఆయన వృత్తిలో ఓ భాగం మాత్రమే. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ ద్వారా ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తూ బిజినెస్ చేస్తుంటారు. ఆయన ఖరీదైన రోల్స్ రాయ్స్ కారులో తిరుగుతుంటారు. గత నెలలో మేబ్యాచ్ కారును కొనుగోలు చేశారు. మాల్యా, మరో బిల్డర్ దగ్గర తర్వాత ఈ మోడల్ కారు తనవద్దే ఉందని రమేష్ గర్వంగా చెబుతారు. 'నాకు దేవుడి దయ ఉంది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. ప్రతి లగ్జరీ కారునూ కొనుగోలు చేయాలన్నది నా కల. వీటిని డ్రైవింగ్ చేస్తుంటే థ్రిల్గా ఉంటుంది. నేనెప్పుడూ నా మూలాలను మరవను. నాన్న చనిపోయాక పేదిరకం అనుభవించాం. అమ్మ ఎన్నో కష్టాలుపడి మమ్మల్ని పోషించారు. అందుకే నేను ఇప్పటికీ సెలూన్లో పనిచేస్తుంటా' అని రమేష్ చెప్పారు. ఆయన తొమ్మిదో ఏట ఉన్నప్పుడు తండ్రి మరణించారు. పదోతరగతి పూర్తయ్యాక చదువుకు స్వస్తి చెప్పి తండ్రిలా బార్బర్గా కెరీర్ ప్రారంభించారు. సెలూన్లో పనిచేస్తూనే 1994లో ఓ మారుతి వ్యాన్ తీసుకుని అద్దెలకు ఇవ్వడం ప్రారంభించారు. ఇదే ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ లగ్జీరీ కార్లకు యజమాని అయ్యారు. -
రేషన్ డీలర్ల ఆమరణ దీక్ష భగ్నం
హైదరాబాద్: రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్య క్షుడు బత్తుల రమేశ్బాబు చేస్తున్న నిరశన దీక్షను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. రమేశ్ బాబుతోపాటు సంఘ నాయకులను బలవంతం గా అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసుస్టేషన్కు తరలిం చారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.30 వేల వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని రమేశ్బాబు సోమవారం నుంచి ఆమరణ దీక్షకు దిగారు. మంగళవారం పోలీసులు బలవంతపు అరెస్టులకు దిగారు. డీలర్లు అరెస్టు లను ప్రతిఘటిస్తూ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో డీలర్ల ప్రతిఘటనల మధ్య దాదాపు 40 మంది డీలర్ల నాయకులను, డీలర్లను అరెస్టు చేశారు. రెండో రోజు దీక్షకు పలువురి మద్దతు: రమేశ్ బాబు రెండో రోజు దీక్షకు పలు పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, టీటీడీపీ ప్రధాన కార్య దర్శి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాములు, టీపీసీసీ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి, మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు దీక్షా శిబి రాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. దీక్షలను ద్దేశించి ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రెండు రోజులుగా దీక్షలు చేస్తున్నా డీలర్ల డిమాండ్లపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం దుర్మార్గమన్నారు. డీలర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే డీలర్లు రోడ్డెక్కే పరిస్థితి వచ్చేది కాదని గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని, హెల్త్కార్డులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలర్ల పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు ప్రసాదుగౌడ్, గోపాలకృష్ణ, నందగోపాల్, బి కృష్ణహరి, దినేశ్, అరుణ్కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
అంబరాన్నంటిన బాలోత్సవ్
► వ్యర్థానికి అర్థం చెప్పిన చిన్నారులు ► ఆలోచింపజేసిన కార్యక్రమాలు ► ఆకట్టుకున్న ప్రదర్శనలు సాక్షి, కొత్తగూడెం: బాలల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి.. వారిలోని ప్రతిభా పాటవాలను చాటిచెప్పేందుకు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహిస్తున్న బాలల పండగ బాలోత్సవ్కు రెండో రోజైన శుక్రవారం అనూహ్య స్పందన లభించింది. దాదాపు 7 రాష్ట్రాలకు చెందిన బాలబాలికలు వివిధ అంశాల్లో తమ ప్రతిభను చాటేందుకు బాలోత్సవ్ను వేదికగా చేసుకున్నారు. కొత్తగూడెం క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన 14 వేదికలపై జూనియర్, సీనియర్ విభాగాలకు పోటీలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం కథారచన, భరతనాట్యం, కూచిపూడి, నీతిపద్యాలు, ఏకపాత్రాభినయం, ఫోక్ డాన్స, ఫ్యాన్సీ డ్రెస్, స్పెల్బీ, సినీ, లలిత, జానపద గీతాలు, క్విజ్, లేఖారచన, వ్యర్థంతో అర్థం, నాటికలు నిర్వహించారు. అనేక మంది విద్యార్థులు వ్యర్థ వస్తువులతో అద్భుతాలు సృష్టించి వేదికపై ప్రదర్శించడం, వాటి ప్రయోజనాలను వివరణాత్మకంగా విశ్లేషించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎందుకూ పనికిరావనుకున్న అరటి తొక్కలను ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న అంశాన్ని ఇల్లెందు మండలం మాదారం పాఠశాలకు చెందిన విద్యార్థులు వివరించారు. అరటి తొక్కను రెండు రోజులపాటు నానబెట్టి, అనంతరం పెరట్లో పెరుగుతున్న మొక్కలకు ఔషధంగా వేస్తే అవి అద్భుతంగా పెరుగుతాయని వివరించిన తీరు ఆకట్టుకుంది. ఇక చెత్త కాగితాలతో తమకేం పని అనుకునే వారికి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో.. పాల్వంచకు చెందిన డీఏవీ పాఠశాల విద్యార్థులు వివరించారు. చిత్తు కాగితాలు, వాడి పడేసిన ఇంజక్షన్ బాటిళ్లతో చీకటి గదుల్లో వెలుగులు నింపవచ్చని నిరూపించారు. వీటిని బెడ్ ల్యాంప్లుగా ఎలా చేయాలో చూపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాలబాలికలు చేసిన జానపద, కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ ఖమ్మంలోని జాన్సన్ కిడ్స పాఠశాలకు చెందిన విద్యార్థి చేసిన నృత్యం ఆకట్టుకుంది. అలాగే ఓ చిన్నారి ‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా.. రక్తబంధం విలువ నీకు తెలియ దురా’ పాటకు చేసిన నృత్యం ఆకట్టుకుంది. పలువురు చిన్నారులు ఫ్యాన్సీ డ్రెస్, తమ వేషభాషల తో, హావభావాలతో ఇచ్చిన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరింపజేశాయి. బాలోత్సవ్ కన్వీనర్ రమేష్బాబు అన్ని వేదికలను పర్యవేక్షిస్తూ.. కార్యక్రమాలను వీక్షించారు. -
18న రోబోటిక్, అవయవ మార్పిడి సర్జరీలపై సదస్సు
విజయవాడ (లబ్బీపేట) : ఏస్టర్ రమేష్ అకడమిక్ అలయన్స్ ఆధ్వర్యంలో నిష్ణాతులైన వైద్యులతో వైద్య విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని భావించామని, ఆ క్రమంలో ఈనెల 18న జాతీయస్థాయిలో 16 మంది నిష్ణాతులైన వైద్య నిపుణులతో సదస్సు నిర్వహించనున్నట్లు రమేష్ ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.రమేష్బాబు చెప్పారు. బుధవారం విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో రమేష్బాబు మాట్లాడుతూ.. ఈ సదస్సులో రోబోటిక్ సర్జరీలు, అవయవ మార్పిడి శస్త్రచికిత్సపై సింపోజియం నిర్వహించడంతోపాటు ప్రస్తుత వైద్య విధానాల్లో ఆధునిక పద్ధతులపై వైద్యులకు అవగాహన కలిగించనున్నట్లు వెల్లడించారు. ఏపీలోని ఆరు జిల్లాల నుంచి వైద్యులు పాల్గొంటారని, ప్రారంభోత్సవంలో వైద్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని వివరించారు. చిన్న గాటుతో రోగి త్వరగా కోలుకునే చికిత్సలు ఇప్పుడు రోబోటిక్ సర్జరీల రూపంలో అభివృద్ధి చెందిన దేశాల్లో అందుబాటులో ఉన్నాయని, వాటిని ఇప్పుడిప్పుడే మన దేశానికి తీసుకొస్తున్నామని చెప్పారు. నవ్యాంధ్రలో ఏస్టర్ రమేష్ ఆస్పత్రి ఈ పరిజ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా అవలంబించాలని సంకల్పించినట్లు వెల్లడించారు. గుండె, కిడ్నీ, లివర్ వంటి అవయవ మార్పిడి చికిత్సలు, మినమల్ యాక్సస్ గుండె బైపాస్ సర్జరీలు, కాస్మోటిక్ సర్జరీలు, గ్యాస్ట్రో ఇంటెసై్టనల్ అంకాలజీ సర్జరీలు గుంటూరు, విజయవాడల్లో తర్వలోనే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా సర్జరీలపై ఈ సదస్సులో అవగాహన కలిగించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆస్పత్రి జీఎం డాక్టర్ సుదర్శన్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, ఏజీఎం డాక్టర్ జె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మెదక్ డీఈఓకు సన్మానం
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ జిల్లా విద్యాధికారి(డీఈఓ)గా నియమితులైన మెదక్ పట్టణానికి చెందిన శివ్వ రమేష్ బాబును శనివారం ఘనంగా సన్మానించారు. శనివారం డీఈఓను ఆయన ఇంట్లో కలిసి కౌన్సిలర్ ఆర్కె శ్రీనివాస్ కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో మచ్చలేని వ్యక్తిగా ఉన్న రమేష్బాబు ఎంతోప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. లెక్చరర్గా, డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్గా, డిప్యూటీ ఈఓగా పనిచేసిన రమేష్బాబు డీఈఓగా ప్రమోషన్ పొందడం మెదక్ పట్టణానికే గర్వకారణమన్నారు. రమేష్బాబు మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తొడుపునూరి శివరామకృష్ణ, కొండశ్రీనివాస్, నరెందర్, బిక్షపతి, టిన్ను తదితరులు పాల్గొన్నారు. -
రేస్కోర్సులో లైంగిక వేధింపులు..
- మీడియాను ఆశ్రయించిన బాధితురాళ్లు రాజమండ్రి రేస్కోర్సులో పని చేస్తున్న మహిళా ఉద్యోగులను అక్కడ క్యాషియర్గా పని చేస్తున్న వ్యక్తి లైంగికంగా వేధిస్తుండటంతో.. విసిగిపోయిన ఉద్యోగినులు రోడ్డెక్కారు. హైదరాబాద్ మలక్పేట్ రేస్కోర్ట్కు అనుబంధ సంస్థ అయిన ‘క్వారియే రేస్కోర్ట్ రాజమండ్రి’లో క్యాషియర్గా పని చేస్తున్న రమేష్ బాబు అనే వ్యక్తి తమను లైగికంగా వేధిస్తున్నాడని రేస్కోర్సులో పని చేస్తున్న ఉద్యోగినులు మిడియాతో వాపోయారు. ఈ అంశంపై పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అందుకే ప్రజల దృష్టికి తీసుకురావడానికి మీడియాను ఆశ్రయించామని 20 మంది బాధితురాళ్లు మీడియాకు తెలిపారు. -
చెక్ బౌన్స్ కేసులో ప్రభుత్వ ఉద్యోగికి జైలుశిక్ష
చెక్బౌన్స్ కేసులో ప్రభుత్వ ఉద్యోగిని చింతపల్లి ఝాన్సీకి విజయవాడ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు ఓ సంవత్సరం జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు స్పెషల్ మేజిస్ట్రేట్ టి.రమేష్బాబు ఇటీవల తీర్పు వెలువరించారు. తను ప్రభుత్వ ఉద్యోగినని, తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్నానని, తనపై ఆధారపడిన కుమార్తె ఉన్నారని, అందువల్ల తనపై దయ చూపాలంటూ ఝాన్సీ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఝాన్సీ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించాల్సిన కారణాలు ఏమీ కనిపించడం లేదని, ఆమెకు విధించిన రూ.5 లక్షల జరిమానాలో రూ.4.90 లక్షలను ఫిర్యాదుదారు పరిహారంగా పొందవచ్చునని రమేష్బాబు తన తీర్పులో పేర్కొన్నారు. కాగా.. విజయవాడ, భవానీపురానికి చెందిన వి.ఎస్.సిహెచ్.శేఖర్ నుంచి గొల్లపూడి గ్రామానికి చెందిన ఝాన్సీ తన కుటుంబ అవసరాల నిమిత్తం 2009లో రూ.4.75 లక్షలను అప్పుగా తీసుకున్నారు. ఇందుకు ప్రామిసరీ నోటు కూడా ఇచ్చారు. అయితే అప్పు చెల్లించని నేపథ్యంలో శేఖర్ చేసిన విజ్ఞప్తి మేరకు అప్పులో కొంత భాగం చెల్లించేందుకు ఝాన్సీ 2012లో రెండు చెక్కులు ఇచ్చారు. బ్యాంకులో తగిన నిధులు లేవంటూ వాటిని బ్యాంకు అధికారులు తిరస్కరించారు. దీంతో ఝాన్సీకి శేఖర్ లీగల్ నోటీసు పంపారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆయన కోర్టులో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం (ఎన్ఐ యాక్ట్) కింద కేసు దాఖలు చేశారు. దీనిపై స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపింది. తన సంతకాలను స్కాన్ చేసి శేఖర్ తప్పుడు హామీ పత్రాలు సృష్టించారన్న ఝాన్సీ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అవి తప్పుడు పత్రాలు కావని, ఝాన్సీ స్వయంగా సంతకం చేసిన ప్రామిసరీ నోటని కోర్టు తేల్చింది. తాను సంతకం చేసిన ఖాళీ చెక్కులను, ప్రామిసరీ నోటును ఎవరో దొంగతనం చేశారన్న ఝాన్సీ వాదనలను సైతం కోర్టు తిరస్కరించింది. ఆమె చెబుతున్నవన్నీ అబద్ధమని తేల్చింది. అన్ని సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్ఐ యాక్ట్ ప్రకారం ఝాన్సీ నేరం రుజువైందని, అందువల్ల ఆమె శిక్షార్హురాలని కోర్టు తేల్చింది. ఆమెకు జైలుశిక్ష, జరిమానా విధించింది. -
కన్నతల్లిని గొడ్డలితో నరికాడు
మద్యానికి బానిసైన కన్నతల్లిని ఓ వ్యక్తి అంతంచేశాడు. విశాఖ జిల్లా పాడేరు మండలం లగిశపల్లిలో ఈ ఘటన జరిగింది. మసాడ సింహాచలం (40) అనే మహిళ మద్యానికి బానిసైంది. అలవాటు మానుకోవాలని కుమారుడు రమేష్బాబు తల్లికి చాలాసార్లు నచ్చజెప్పాడు. అయినా ఆమె ఆ అలవాటు వీడలేదు. దీంతో శనివారం రాత్రి రమేష్బాబు మద్యం సేవించి కన్నతల్లిని గొడ్డలితో నరికాడు. తీవ్ర గాయాలతో సింహాచలం మృతి చెందింది. ఈ ఘటన తర్వాత నిందితుడు పాడేరు పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. -
రేపటి నుంచి ‘బాలోత్సవ్-14’
* వేదిక కానున్న కొత్తగూడెం * ఆరు రాష్ట్రాల నుంచి ఎంట్రీలు... * 18 వేలమంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం కొత్తగూడెం: జాతీయ స్థాయి బాలల పండుగ బాలోత్సవ్కు ఖమ్మం జిల్లా కొత్తగూడెం వేదిక కానుంది. మూడు రోజులపాటు జరగనున్న బాలోత్సవ్కు ఆరు రాష్ట్రాల నుంచి 18 వేల మంది విద్యార్థులు తరలి రానున్నారు. ది కేసీపీ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో కొత్తగూడెం క్లబ్లో ఈనెల 7, 8, 9 తేదీల్లో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సింగరేణి డెరైక్టర్ (పా) టి.విజయ్ కుమార్, ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్, వాగ్గేయకారుడు అంద్శై సినీ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణతోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.మొత్తం 24 అంశాలను 40 విభాగాలుగా చేసి పోటీలు నిర్వహిస్తున్నారు. 12 వేదికలు ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. పోటీల్లో గెలుపొందిన ప్రతి విభాగంలో మొదటి మూడు స్థానాలతోపాటు రెండు ప్రత్యేక బహుమతులు, ఇందులో పాల్గొన్న ప్రతి పాఠశాలకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. కీర్తిపతాకను ఎగురవేద్దాం: రమేష్బాబు బాలోత్సవ్ను ఘనంగా నిర్వహించి కొత్తగూడెం పట్టణ కీర్తి పతాకాన్ని దేశ నలుమూలలా చాటి చెబుదామని బాలోత్సవ్ కన్వీనర్, ప్రముఖ వైద్యులు వాసిరెడ్డి రమేష్బాబు అన్నారు. బుధవారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లాడుతూ.. 23 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ బాలల పండుగ మండల స్థాయి నుంచి నేడు జాతీయ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఏడాదికేడాది బాలోత్సవ్లో మార్పులు రావడం హర్షణీయమన్నారు. మొదట నాలుగు కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ బాలోత్సవ్ నేడు 24 అంశాల్లో 40 విభాగాలతో నిర్వహించే స్థాయికి చేరుకుందన్నారు. ఇప్పటికే ఢిల్లీ, ఛత్తీస్గఢ్, పాండిచ్చేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ పాఠశాలల నుంచి ఎంట్రీలు వచ్చాయని, సుమారు 18 వేల మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలను కల్పించినట్లు రమేష్బాబు చెప్పారు. -
పాలలో వెన్న శాతం పెంచండిలా..
వర్గల్: పాలలోని వెన్న శాతాన్ని బట్టి డెయిరీ నిర్వాహకులు ధరను నిర్ణయిస్తారు. సాధారణంగా పాడి గేదెలతో (బర్రెలు) పోల్చినపుడు ఆవు పాలలో వెన్న శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బర్రె పాలకు ధర ఎక్కువగా ఉంటుంది. పాడి పశువుల మేతలో జాగ్రత్తలు తీసుకుంటే పాలలో సరైన వెన్న శాతం వస్తుందని వర్గల్ మండల పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్బాబు, 9849457404 అన్నారు. అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పశువుల మేతలో 30 నుంచి 50 శాతం పప్పుజాతి పశుగ్రాసాలు ఉండేలా చూడాలి. ఇందుకోసం పూతదశలో ఉన్న గ్రాసం వినియోగించాలి. గ్రాసాన్ని పెద్ద సైజు ముక్కలుగా కోసి పశువులకు అందించాలి. మేతలో పచ్చగడ్డితోపాటు ఎండు గడ్డి ఉండేలా చూసుకోవాలి. దీంతో నమలడం, నెమరు వేసే సమయం పెరిగి లాలాజలం వృద్ధిచెందుతుంది. ఎండుగడ్డి ఎక్కువగా ఇవ్వాల్సివస్తే పత్తి చెక్కను రాత్రి నానపెట్టి ఉదయం అందించాలి. తద్వారా ప్రొటీన్లు బాగా లభ్యమవుతాయి. కొబ్బరి, వేరుశెనగ, పొద్దుతిరుగుడు చెక్కతో వెన్న శాతం బాగా వృద్ధి చెందుతుంది. దాణాను ఉదయం, సాయంత్రం రెండు సార్లు కాకుండా కొద్దికొద్దిగా రోజుకు 4,5 పర్యాయాలు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. -
తుప్పు వదిలించేందుకు రూ. 35 కోట్లు
నిర్వహణ లేనిప్రకాశం బ్యారేజీ క్రస్ట్ గేట్లు కృష్ణా నదిపై విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీ క్రస్ట్ గేట్ల నిర్వహణలో నిర్లక్ష్యం ఫలితంగా.. వర్టికల్ గేట్లు తుప్పు పట్టి పెచ్చులు రాలిపోతున్నాయి. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఈ గేట్లకు రూ. 35 కోట్లతో మరమ్మతులు చేపట్టనున్నట్లు కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ రమేష్బాబు గురువారం హైదరాబాద్లో తెలిపారు. పటేల్ అండ్ కంపెనీకి ఈ మరమ్మతు కాంట్రాక్టు ఇచ్చినట్లు వెల్లడించారు. సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: కృష్ణా నదిపై విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీ క్రస్ట్ గేట్ల నిర్వహణలో నిర్లక్ష్యం ఫలితంగా.. వర్టికల్ గేట్లు తుప్పు పట్టి పెచ్చులు రాలిపోతున్నాయి. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఈ గేట్లకు రూ. 35 కోట్లతో మరమ్మతులు చేపట్టనున్నట్లు కృష్ణా డెల్టా చీఫ్ ఇంజ నీర్ రమేష్బాబు గురువారం హైదరాబాద్లో తెలిపారు. పటేల్ అండ్ కంపెనీకి ఈ మరమ్మతు కాంట్రాక్టు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం డ్యాం భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ఈ మరమ్మతు పనులు సెప్టెంబర్ నుంచి మొదలై జనవరికల్లా ముగుస్తాయని కృష్ణా జిల్లా నీటిపారుదలశాఖ ఎస్ఈ శ్రీనివాస్ విజయవాడలో మీడియాకు వివరించారు. 12 ఏళ్ల కిందట కొత్త గేట్ల ఏర్పాటు... ప్రకాశం బ్యారేజీకి 25 అడుగుల వెడల్పు, 12.2 అడుగుల ఎత్తు కలిగిన 70 వర్టికల్ (నిలువు) గేట్లు ఉన్నాయి. 1957లో బ్యారేజీ నిర్మాణం జరగ్గా అప్పట్లో ఏర్పాటు చేసిన గేట్లను 2002 తొలగించి ప్రస్తుతం ఉన్న గేట్లను బిగించారు. నిబంధనల ప్రకారం వారానికోసారి వీటి పనితీరును పరిశీలిస్తూ అవసరమైనపుడు స్వల్ప మరమ్మతులు జరుపుతూ ఉండాలి. ప్రతి మూడేళ్లకోసారి వీటికి పెయింటింగ్ పనులు, ఇతరత్రా వెల్డింగ్ వర్కులు చేపట్టాలి. ఈ పనులన్నీ సీతానగరంలోని ప్రభుత్వ పీడబ్ల్యూడీ వర్క్షాప్ ఇంజనీర్లు నిర్వహించాలి. కృష్ణా సర్కిల్ నీటిపారుదల శాఖ అధికారులు వీరికి నిధుల కేటాయింపు జరిపితే.. పీడబ్ల్యూడీ వర్క్షాప్ సిబ్బంది మెయింటెనెన్స్ పనులు చేపడుతుంటారు. మెయింటెనెన్స్ లేక తుప్పుపట్టిన గేట్లు... అయితే ఈ మెయింటెనెన్స్ పనులేవీ సక్రమంగా జరగలేదని తెలుస్తోంది. కేవలం కింది స్థాయి సిబ్బంది గేట్లను పరిశీలించినపుడు డ్రెయిన్ హోల్స్కు అడ్డుపడ్డ చెత్తాచెదారాన్ని తొలగించడం మినహా చేసిందేమీ లేనట్లు కని పిస్తోంది. ఫలితంగా గేట్లకు మధ్యనున్న ఐరన్ గడ్డర్ల మధ్య ఉండే డ్రెయిన్ హోల్స్ మూసుకుపోయి అంగుళం మేర ఎత్తులో నీటి నిల్వలు పెరిగి అన్ని గేట్లకు దిగువ వైపున తుప్పు ఎక్కువైంది. దీని కారణంగా గేట్ల పటిష్టత కోసం బిగించిన క్రాస్ స్టిఫ్నెర్స్ చాలా చోట్ల దెబ్బతిన్నాయి. పలు గేట్ల కింద రబ్బర్ చానళ్లు, సీళ్లు తొలగిపోయి నీరు స్వల్పంగా లీకవుతోంది. ప్రమాదం లేకపోయినా.. ఈ పరిస్థితుల్లో సర్కారు ఆదేశాల మేరకు బుధవారం ప్రకాశం బ్యారేజీ క్రస్ట్ గేట్లను పరిశీలించిన నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శి వేదవ్యాస్తో కూడిన నిపుణుల బృందం గురువారం తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం బ్యారేజీకి గానీ, గేట్లకు గానీ చెప్పుకోదగ్గ ప్రమాదమేమీ లేకపోయినప్పటికీ, ఇప్పటినుంచైనా గేట్లకు పీరియాడికల్ మెయింటెనెన్స్ అవసరమని ఆ నివేదికలో స్పష్టంచేసింది. దీంతో గేట్లకు ఉన్న తుప్పును తొలగించడంతో పాటు దెబ్బతిన్న స్టిఫ్నెర్స్, హేంగలర్స్, డ్రెయిన్హోల్స్, గడ్డర్లకు మరమ్మతులను సెప్టెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మరమ్మతుల కోసం బ్యారేజీలో నీటి స్థాయిని తగ్గించాల్సి ఉంటుంది కాబట్టి నీటి విడుదలను నిలిపివేయాలని సాగర్ డ్యాం అధికారులను కోరామని తెలిపారు. అలాగే ఎగువ నుంచి నీటిని పులిచింతల రిజర్వాయర్లో నిల్వ చేయాలని డ్యాం ఎస్ఈకి లేఖ రాశామన్నారు. -
రికవరీ ఏదీ?
సాక్షి ప్రతినిధి, కడప: వలస జీవితాలకు స్వస్తి పలికి స్వగ్రామాల్లోనే ఉపాధి పనుల ద్వారా కూలీలకు భృతి కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం కొంతమంది సిబ్బందికి కల్పతరువుగా మారింది. అందివచ్చిన అవకాశాన్ని ఫీల్డ్అసిస్టెంట్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్నా రికవరీ చేయకుండా జిల్లా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు రూ.7.5 కోట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓలు స్వాహా చేశారంటే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. అందుకు నిదర్శనం వీరబల్లి ఫీల్డ్అసిస్టెంట్ ఉదంతం. చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించిన పీడీ.. జిల్లాలో ఇప్పటివరకు 8సార్లు సోషల్ ఆడిట్ నిర్వహించారు. అందులో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిని గుర్తించి రికవరీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు సుమారు రూ. 7.5 కోట్లు అక్రమాలకు పాల్పడినట్లు రుజువైంది. అందులో సుమారు రూ.2.5 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. మిగిలిన మొత్తం రికవరీలో జాప్యం జరుగుతోంది. అందుకు కారణం మండల స్థాయిలో ఉండే ఏపీఓలేనని తెలుస్తోంది. ఉపాధి హామీ పథకంపై వీరబల్లి మండలంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. అనంతరం రూ.18.53 లక్షల రికవరీకి డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం ఆదేశించారు. మే 24న ఆమేరకు ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఐదుమంది ఫీల్డ్అసిస్టెంట్లపై ఆర్ఆర్ యాక్టు ప్రయోగించి రిక వరీ చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అందులో రమేష్బాబు అనే ఫీల్డ్ అసిస్టెంట్ ఒక్కరే రూ.16లక్షలు స్వాహా చేశారు. ఇప్పటి వరకూ స్థానిక ఏపీఓ చిన్నపాటి చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఉన్నతాధికారులకు మాత్రం ఫీల్డ్అసిస్టెంట్ పరారీలో ఉన్నట్లు రికార్డులు పొందుపర్చినట్లు సమాచారం. అయితే రమేష్బాబు యథేచ్ఛగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసి దర్జాగా స్థానిక రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. అధికారపార్టీ అండతో స్వాహా మొత్తంలో చిల్లిగవ్వ కూడా రికవరీ కాకుండా చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. రమేష్బాబు వ్యవహారం పరిశీలిస్తాం... పీడీ బాలసుబ్రమణ్యం జిల్లాలో ఉపాధి సొమ్ము స్వాహాపై రికవరీ చేస్తున్నాం. సోషల్ ఆడిట్లో తప్పు చేశారని తేలిన సిబ్బందిపై చర్యలకు సిఫార్సు చేస్తున్నాం. ఏ ఒక్కరినీ వదలడంలేదు. వీరబల్లి ఫీల్డ్అసిస్టెంట్ రమేష్బాబు వ్యవహారాన్ని పరిశీలిస్తా. తన ఆదేశాలను ఏపీఓ ఎందుకు అమలు చేయలేదో పరిశీలిస్తాను. -
బిటెక్ లవ్స్టోరీ మూవీ స్టిల్స్
-
బీటెక్ ప్రేమకథ
టెన్త్ క్లాస్, ఇంటర్ ప్రేమకథల సీజన్ అయిపోయినట్టుంది. ఇప్పుడు బీటెక్ ప్రేమకథతో ఓ సినిమా రూపొందుతోంది. యల్లారెడ్డి దర్శకత్వంలో ఇందుజ క్రియేషన్స్ పతాకంపై గుడ్లైఫ్ మూవీ క్రియేషన్స్ సమర్పణలో వనజ, రేణుక నిర్మిస్తున్న చిత్రం ‘బీటెక్ లవ్స్టోరీ’. రమేశ్బాబు, శ్రీకాంత్, అంజలి, గెహనా వశిష్ట్ ఇందులో హీరో హీరోయిన్లు. కృష్ణుడు, శ్రావణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఫీల్ గుడ్ లవ్స్టోరీ ఇది. టైటిల్తో పాటు కథాంశం కూడా యూత్కి కనెక్ట్ అవుతుంది. చిన్నిచరణ్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలైట్. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. హాస్యానికి పెద్ద పీట వేశామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జీఎల్ బాబు, సహ నిర్మాత: బద్రీనాథ్, పర్యవేక్షణ: శ్యామ్. -
మహిళ దారుణ హత్య
కొత్తకోట రూరల్ : జాతీయ రహదారి నుంచి 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న రాణిపేట గ్రామ శివారులో గుర్తు తెలియని వివాహిత దారుణ హత్యకు గురైంది. బుధవారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అదే గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్రెడ్డి తన పొలానికి వెళ్లగా ఓ మహిళ వివస్త్రగా పడిఉండటం గమనించాడు. వెంటనే రైతు సర్పంచు బాలయ్యకు ఫోన్చేసి చెప్పాడు. ఆయన కొత్తకోట పోలీసులకు సమాచారం అందించడంతో వనపర్తి డీఎస్పీ శ్రీనువాస్రావు, కొత్తకోట సీఐ రమేష్బాబు, ఎస్ఐలు రాఘవేందర్, గోపాల్లు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. దుండగులు మహిళను అత్యాచారం చేసి అతి దారుణంగా తలపై బండరాయితో మోది హతమార్చారు. అంతటితో ఆగకుండా ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మహిళ వయసు సుమారు 25 నుండి 30 ఏళ్లలోపు ఉండవచ్చని, మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీపంలో బీరుసీసాలు, వాటర్ప్యాకెట్లు పడి ఉన్నాయి. పరిసర ప్రాంతంలో మహిళకు సంబంధించిన దుస్తులు, ఇతర వస్తువులు ఎక్కడా కనిపించలేదు. హత్య చేసిన వారు తెలివిగా బట్టలను మాయం చేశారు. మృతి చెందిన మహిళ గృహిణియా, ఇంకెవరైనా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రమేష్బాబు తెలిపారు. సంఘటన స్థలంలో లభించిన వాటర్ ప్యాకెట్లు గద్వాల ప్రాంతం జమ్మిచెడ్ ప్రాంతంలో తయారైనట్టు గుర్తించామని, మృతురాలెవరో గుర్తిస్తే కేసు ఛేదించడం సులభమవుతుందని తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
బాబాయ్.. అబ్బాయ్.. ఓ మేనల్లుడు
రాజకీయాల్లో బంధాలు...అనుబంధాలు మిథ్య. కరీంనగర్ జిల్లాలో బీజేపీ సీనియర్ నేత సిహెచ్.విద్యాసాగర్రావు కుటుంబంలో ఇలాంటి పోరే కొనసాగుతోంది. 2009 ఎన్నికల్లో వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విద్యాసాగర్రావు పోటీ చేశారు. ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్రావు కుమారుడైన చెన్నమనేని రమేష్బాబు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. బాబాయ్, అబ్బాయ్ల పోటీలో అబ్బాయినే విజయం వరించింది. ఆ సమయంలోనే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి విద్యాసాగర్రావు మేనల్లుడు, బోయిన్పల్లి వినోద్కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ మరోసారి ఈ ముగ్గురు ఎన్నికల బరిలో దిగారు. కరీంనగర్ లోకసభ అభ్యర్థులుగా బీజేపీ నుంచి విద్యాసాగర్రావు, టీఆర్ఎస్ నుంచి వినోద్కుమార్ పోటీపడుతుండగా, వేములవాడ అసెంబ్లీ స్థానంలో చెన్నమనేని రమేశ్బాబు ఈసారి టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. అసెంబ్లీ బరిలో అబ్బాయి చేతిలో ఓడిపోయిన విద్యాసాగర్రావు, ఇపుడు మేనల్లుడి సవాలు నెగ్గుకొస్తారా.. అనేది ఆసక్తిగా మారింది. -న్యూస్లైన్,కరీంనగర్ సిటీ -
విజయం మనదే
అవనిగడ్డ, న్యూస్లైన్ : సమష్టిగా పాటుపడితే విజయం మన ముంగిట వాలుతుందని రాష్ట్ర మాజీ మంత్రి, బందరు పార్లమెంటు వైఎస్సార్సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు. పార్టీ శ్రేణులను కలుసుకునేందుకు అవనిగడ్డ వచ్చిన సారథికి నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు ఘన స్వాగతం పలికారు. సోమవారం కోడూరు మండల పరిధిలోని విశ్వనాథపల్లి, పిట్టల్లంక గ్రామాలు, అవనిగడ్డలో సింహాద్రి రమేష్బాబుతో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం రమేష్ స్వగృహంలో ఆయన పార్టీ పరిస్థితిపై నాయకులతో చర్చించారు. సారథి మాట్లాడుతూ త్వరలో జరుగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బందరు పార్లమెంటు, అసెంబ్లీల బరిలో ఉన్న అభ్యర్థుల విజయంకోసం సమష్టిగా పాటుపడదామని పిలుపునిచ్చారు. జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే అందరి లక్ష్యం కావాలని, ఆ దిశగానే పార్టీ శ్రేణులు పురోగమించేలా నాయకులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కడవకొల్లు నరసింహారావు, గోవాడ రాము, ఇంకొల్లు శేషగిరిరావు, కటికల కిషోర్, రాధా-రంగా మిత్రమండలి దివియూనిట్ అధ్యక్షుడు రాజనాల మాణిక్యాలరావు, చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి, నాగాయలంక మండలాల కన్వీనర్లు చండ్ర వెంకటేశ్వరరావు, వేమూరి వెంకట్రావు, అరజా నరేంద్రకుమార్, విశ్వనాథపల్లి సత్యనారాయణ, పార్టీ నాయకులు సింహాద్రి వెంకటేశ్వరరావు, బడే వెంకటేశ్వరరావు, మద్ది చిన్నా, భోగాది శేషగిరి, గాజుల శ్రీనివాసరావు, బచ్చు భద్రయ్య, తోట కృష్ణాంజనేయులు, కామిశెట్టి శివనాగేశ్వరరావు పాల్గొన్నారు. చిట్టిబాబు, శివరావ్ను కలిసిన సారథి... స్థానిక సోషల్క్లబ్ వద్ద పార్టీ నాయకులు గుడివాక శివరావ్, యాసం చిట్టిబాబుతో బందరుపార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి పార్థసారథి సమావేశమయ్యారు. పార్టీ జిల్లా స్టీరింగ్కమిటీ సభ్యులు గాజుల మురళీకృష్ణ, కోసూరు గోపీచంద్, పొన్నూరు నాంచారయ్య, రావి చిట్టిబాబు, మాజీ ఎంపీపీ దిడ్ల ప్రసాద్, సనకా శేషుబాబు, ముళ్లపూడి శ్రీనివాసరావు, గుడివాక నాగమల్లిఖార్జునరావు (పద్మాయ్), తదితరులు పాల్గొన్నారు. మా మద్దతు మీకే.. ఎన్ని పార్టీలు వచ్చిన మా గ్రామస్తులంతా వైఎస్సార్ సీపీకే మద్దతుగా ఉంటామని డీసీసీ మాజీ చైర్మన్ విష్టుబోట్ల సూర్యన్నారయణ పార్థసార థికి హామీ ఇచ్చారు. విశ్వనాథపల్లిలో ఆయన నివాస గృహంలో పార్థసారధి, రమేష్బాబు మర్యాద పూర్వకంగా సూర్యనారాయణను కలుసుకున్నారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుడివాక శివరావు,కడవకొల్లు నరసింహరావు, యలవర్తి శ్రీరామూర్తి, పీ రాజబాబు పాల్గొన్నారు. -
వరి చేలకు తెగుళ్లు
మాడుగుల, న్యూస్లైన్: ఈ ఏడాది వర్షాలు అనుకూలించక ఆలస్యంగా రబీ వరినాట్లు వేసుకున్న రైతులకు ఆదిలోనే చుక్కెదురైంది. వరిచేలు ఏపుగా ఎదుగుతున్నాయని ఆశపడిన రైతులకు ప్రస్తుతం వరిచేలు తెగుళ్ళు బారిన పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులకు ఏ పురుగుమందులు ఎలావాడాలో తెలియక నానాఅవస్థలు పడుతున్నారు.దీన్ని ఆసరాగా తీసుకుని వ్యాపారులు తమకు ఏది లాభసాటిగా ఉంటే అదే మందు వాడాలని సలహా ఇస్తున్నారు. గతంలో 500 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందు రూ.190 ఉండేది. కానీ ప్రస్తుతం అదే మందు రూ.270-300కు అమ్ముతున్నారు. రై తులు పురుగుల మందు షాపు యజ మానుల సలహా మేరకు మందులు వాడుతున్నారు. వర్షాలు లు అనుకూలించక పోవడంతో తెగుళ్ళు సోకుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.మండలంలో సుమారు ఆరువేల ఎకరాల్లో రబీ ఎకరాలలో వరి సాగు చేయగా పెద్ద మొత్తంలో పంటలకు తెగుళ్ళు సోకాయని తెలుస్తోంది. ప్రస్తుతం రెండు వేల ఎకరాల్లో పంట పొట్టదశకు చేరుకుంది. పతిఏటా అతివృష్టి అనావృష్టి కారణాల వలన పంటలకు తెగుళ్ళు సోకి తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వం అందిస్తున్న పంట నష్టాలు కూడా తమకు ఆందటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయమై వ్యవసాయాధికారి రమేష్బాబు వివరణ కోరగా ప్రస్తుతం రబీ వరికి అగ్గి తెగుళ్ళు వచ్చే ప్రమాదం ఉందని, దీని నివారణకు ట్రైసైక్లోజోన్ అనే మందును ఆరు గ్రాములు లీటరు నీటిని కలిపి ఎకరాకు 120 గ్రాముల మందును పిచికారి చేయాలన్నారు. ఆకులపై పురుగులుంటే మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. -
హైబ్రిడ్ రకాలతో మంచి ఫలితాలు
యాంత్రీకరణ కూడా అవసరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కార్యక్రమాల వివరణ జెడ్ఆర్ఈఏసీ సమావేశాలు ప్రారంభం అనకాపల్లి, న్యూస్లైన్: అధిక వర్షాలను తట్టుకోగలిగే ఎంటీయూ 1121 వరివంగడం ఉపయోగించుకోవాలని, హైబ్రిడ్ రకాలతో మంచి ఫలితాలు వస్తాయని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ వర్సిటీ డీన్ టి.రమేష్బాబు సూచించారు. అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం జూబ్లీ హాల్లో సోమవారం నుంచి 2013-14 ఖరీఫ్, రబీ సీజన్కు సంబంధించిన ఉత్తర కోస్తా మండలి పరిశోధనా, విస్తరణ సలహా మండలి సమావేశాలు మొదలయ్యా యి. ఏడీఆర్ కె.వీరభద్రరావు అధ్యక్షతన జరిగి న ఈ సమావేశాలను జిల్లా వ్యవసా య శాఖ సంయుక్త సంచాలకులు ఎన్.సి.శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసిన లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన రమేష్బాబు మా ట్లాడుతూ జిల్లాలో యాంత్రీకరణ చా లా తక్కువగా ఉందని తెలిపారు. డ్ర మ్ సీడర్, శ్రీవరి సాగు వల్ల అధిక దిగుబడులు వస్తున్నందున ఆ పద్ధతులనే అవలంబించాలని సూచించారు. మొ క్కజొన్న, పొద్దు తిరుగుడు, నువ్వు సా గు చేసినప్పుడు అవి భూమి నుంచి ఎక్కువ పోషకాలు తీసుకుంటాయని చెప్పారు. దీని వల్ల అనంతరం సాగుచేసే వరిలో దిగుబడులు తగ్గుతాయని చెప్పారు. చిరుధాన్యాల సాగును ప్రో త్సహించాలని, హైబ్రీడ్ వరి, హైబ్రీడ్ చెరకుపై పరిశోధనలు జరగాలని పరిశోధనా విభాగానికి సూచించారు. పత్తిలో మొక్కల సాంధ్రత ఎక్కువ చే యడం ద్వారా అధిక దిగుబడులు సా ధించవచ్చన్నారు. వరిలో ఇనుము, జింక్ ధాతువులను చొప్పించడం ద్వా రా ఆరోగ్యవంతమైన వరి మనకు లభిస్తుందని చెప్పారు. టీబీజీ 104 అనే మినుము రకం కూడా పల్లాకు తెగులును తట్టుకుంటుందని చెప్పారు. వి శిష్ట అతిథిగా విచ్చేసిన నైరా వ్యవసా య కళాశాల అసోసియేట్ డీన్ ఎ.సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ సా గు ఖర్చులు తగ్గించుకుని వ్యవసా యం చేయాలని రైతులకు పిలుపుని చ్చారు. ఉత్తర కోస్తా భూముల్లో భాస్వ రం అధికంగా ఉన్నందున ఎరువులు తక్కువగా వినియోగించాలని సూచిం చారు. విత్తన శుద్ధి, రసాయన కలుపు మందులు వాడడం వల్ల కూలీల కొరతను అధిగమించవచ్చని చెప్పారు. వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ మాట్లాడుతూ వరి విస్తీర్ణం రోజుకు రోజుకూ పెరుగుతోందని, అధిక వర్షాల వల్ల దిగుబడులు బాగా పడిపోయాయని పేర్కొన్నారు. పంటల్లో పురుగులు, తెగుళ్ల బాధలు అధికంగా ఉన్నాయని, తక్కు వ కాలపరిమితి కలిగిన రకాలను, నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను వినియోగించాలని కోరారు. విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సం చాలకులు జి.లీలావతి మాట్లాడుతూ మొక్కజొన్న గింజలు ఎండబట్టే డ్రయ ర్స్ రావాలని ఆకాంక్షించారు. బయోఫెర్టిలైజర్స్ను ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జేడీ తరపున విచ్చేసిన కె.రామారావు మాట్లాడుతూ గత ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. వరిలో ఎకరానికి 15 బస్తాల దిగుబడి రావడంతో రైతులు నష్టపోయారని చెప్పారు. అంతకుముందు ఏడీఆర్ కె.వీరభద్రరావు ఉత్తర కోస్తా మండలంలో గత సంవత్సరం చేపట్టిన పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలను పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిం చారు. ముందుగా చెరకు ప్రధాన శాస్త్రవేత్త కె.ప్రసాదరావు సమావేశంలోని సభ్యులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో మూడు జిల్లాలకు చెందిన ఏరువాక కేంద్రం ప్రతినిధు లు, వ్యవసాయ శాఖ అధికారులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
జర్మనీ బాబు.. జెండా లేని శీను
ఒకరిని పౌరసత్వం కేసు వెంటాడుతోంది. వురొకరు ఏ పార్టీ జెండా పట్టుకోవాలే తెలియుక తికవుకపడుతున్నారు. వరుసగా రెండుసార్లు హోరాహోరీ తలపడ్డ ఈ పాత ప్రత్యర్థులిద్దరూ ఈసారి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వేవుులవాడ నియోజకవర్గంలో ఈ చిక్కువుుడి నెలకొంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నవునేని రమేష్బాబు జర్మనీలో ప్రొఫెసర్గా పనిచేశారు. అక్కడి ఉద్యోగం వదులుకొని స్వదేశానికి తిరిగొచ్చారు. తండ్రి సిహెచ్.రాజేశ్వర్రావు వారసత్వంగా రాజకీయూల్లోకి అడుగుపెట్టారు. వచ్చీ రాగానే 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యవుంలో భాగంగా ఏడాది వ్యవధిలోనే పదవికి రాజీనావూ చేసి టీఆర్ఎస్లో చేరారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వురోసారి గెలుపొందారు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఆయునతో హోరాహోరీ తలపడ్డ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్. ఎంపీటీసీ సభ్యుడి నుంచి ఎంపీపీగా, జెడ్పీటీసీ సభ్యుడిగా ఎదిగి అంచెలంచెలుగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి నిలిచి రెండుసార్లు రమేష్బాబుకు గట్టి పోటీ ఇచ్చారు. 2009లో కేవలం 1821 ఓట్లతో ఓడిపోయూరు. ఫలితాలు వెలువడ్డాక జర్మనీ నుంచి తిరిగొచ్చిన రమేష్బాబుకు జారీ చేసిన భారత పౌరసత్వం చట్ట ప్రకారం చెల్లదని, ఆయున ఎన్నికను రద్దు చేయూలని ఆది శ్రీనివాస్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. నాలుగేళ్ల విచారణ అనంతరం ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడింది. రమేష్బాబు ఎమ్మెల్యే పదవితో పాటు భారత పౌరసత్యం రద్దు చేసి, ఓటర్ల జాబితాలో పేరు తొలగించాలని ఎనిమిది నెలల కిందట హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రరుుంచారు. ఎమ్మెల్యేగా కొనసాగేందుకు స్టే జారీ చేసిన సుప్రీంకోర్టు.. ఎమ్మెల్యేలకు ఉండే ఓటుహక్కు వూత్రం ఆయనకు లేదని సూచించింది. అందుకే గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికలకు రమేష్బాబు దూరంగా ఉన్నారు. అక్కడ ఓటు వేసే హక్కు కోల్పోయూరు. దీంతో ఈసారి సాధారణ ఎన్నికల్లోనే ఆయున పోటీ చేస్తారా.. లేదా అనేది చర్చనీయూంశంగా వూరింది. కానీ... తానే పోటీలో ఉంటానని రమేష్బాబు ఇటీవల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయుకుల సవూవేశాలన్నింటా బహిరంగంగా ప్రకటించారు. అయితే.. కోర్టు కేసు ఏ దశలోనైనా ప్రతిబంధకంగా వూరుతుందా? అనే సందేహం గులాబీ శ్రేణులను వెంటాడుతోంది. ఆది శ్రీనివాస్ వురో తీరుగా చిక్కుల్లో పడ్డారు. గతంలో రెండుసార్లు అధికార పార్టీ తరఫున పోటీలో ఉన్న ఆయన ఈసారి పార్టీల్లో బెర్త్ వెతుక్కుంటున్నారు. వుహానేత వైఎస్సార్ వురణానంతరం కాంగ్రెస్ను వదిలి ఆయున వైఎస్సార్సీపీలో చేరారు. కొంతకాలంగా దూరంగా ఉంటున్న శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్లో చేరుతున్నారని, బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. రెండుచోట్ల సానుకూల స్వాగతం లభించకపోవటంతో వెనుకడుగు వేశారు. స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ప్రచారంలో నివుగ్నవుయ్యూరు. పొత్తుల సమీకరణాల్లో ఏదో ఒక పార్టీ తరఫున టిక్కెట్టు తనకు లభిస్తుందని, అప్పటి దాకా వేచి చూసే ధోరణి ఎంచుకున్నారు. దీంతో ఆయున ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ జెండా పట్టుకుంటారనేది ప్రశ్నార్థకంగా వూరింది. ప్రధాన పార్టీలకు చెందిన పాత ప్రత్యర్థులు ఇద్దరూ ఎవరికివారుగా తంటాలు పడుతున్న తీరు ఈ నియోజకవర్గంలో రక్తి కట్టిస్తోంది. -
చేతులు కాలాక..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఉంది మన జిల్లా నేతల రాజీనామాల పర్వం. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకూ అధికార పీఠాన్ని వదలకుండా ఆఖరి నిముషం వరకూ పైరవీలు, పనులు చేసుకున్న అమాత్యులు మంగళవారం రాజీనామా అస్త్రాలను సంధించారు. విశాఖ లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి పురందేశ్వరి,అనకాపల్లి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావులు కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గంటాతో పాటు పీఆర్పీ నుంచి కాంగ్రెసుకు వచ్చిన పంచకర్ల రమేష్బాబు(పెందుర్తి), ముత్తంశెట్టి శ్రీనివాస్ (భీమిలి), చింతలపూడి వెంకట్రామయ్య(గాజువాక) కూడా అదే బాట పట్టారు. యలమంచలి శాసనభ్యుడు యూవీ రమణమూర్తి (కన్నబాబు) తాను కూడా పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజన అంశంపై తాను రాజీనామా చేయనని గతంలో చెప్పిన పురందేశ్వరి మరో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొని మంగళవారం రాత్రి కాంగ్రెస్ను వీడుతున్నట్లు ప్రకటించారని తెలిసింది. రాష్ట్ర మంత్రి గంటా మాత్రం రాజీనామా విషయంలో ఆదినుంచి ఊగిసలాడుతూ వచ్చారు. విభజన ప్రకటన చేస్తే చాలు మంత్రి పదవిని వదిలేస్తానని ఆర్నెళ్ల క్రితం హడావుడి చేసిన గంటా తరువాత అదిగో..ఇదిగో అంటూ కాలయాపన చేశారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా ముద్ర పడిన ఈ నాయకుడు సమైక్య ముసుగులో తమను వంచించారని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. పాయకరావుపేటలో ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన కూడా చేపట్టారు. రెండు రోజుల క్రితం పలు నామినేటెడ్ పదవులకు సిఫార్సులు చేసిన గంటా, ఎంవీపీ కాలనీలో వుడా చేపడుతున్న ఆడిటోరియానికి శంకుస్ధాపన కూడా చేశారు. విశాఖ డెయిరీలో సోలార్ ప్రాజెక్టును ప్రారంభించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాక కూడా సమైక్యవాదులను మభ్యపెట్టి పనులు పూర్తి చేసుకొన్న ఆయన మంగళవారం కాస్త తెలివిగా అందరికంటే ముందుగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి అనకాపల్లిలోని తన కార్యాలయం వద్ద ఉన్న సోనియా ఫ్లైక్సీలను తనవర్గీయులతోనే తగలపెట్టించారనే విమర్శలున్నాయి. విశాఖలో తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గంటా ఏర్పాట్లుచేసుకొన్నప్పటికీ ఏయూ విద్యార్ధుల ఆందోళన కారణంగా వాయిదా పడింది. విద్యార్ధులు మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంతో గంటా వెనకడుగువేశారు. రాజీనామా చేసిన కొనసాగుతున్న ప్రొటోకాల్.. మంత్రిగా గంటా శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం రాజీనామా చేసిన తరువాత కూడా ప్రొటోకాల్ కొనసాగింది. ఢిల్లీ నుంచి రాజీనామా లేఖను గవర్నర్కు ఫ్యాక్స్ చేసిన విమానంలో విశాఖ వచ్చిన ఆయనకు ప్రొటోకాల్ ప్రకారమే అధికారులు స్వాగతం పలికారు. బల్బుకారులో, ప్రభుత్వం సమకూర్చిన సెక్యూరిటీ, సహాయకులతో కలసే ఇంటికి వెళ్లారు. -
‘అంగన్వాడీ’ సమస్యలు పరిష్కరించండి
ఖలీల్వాడి,న్యూస్లైన్ : అంగన్వాడీ ఉద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన ఎంపీలు,ఎమ్మెల్యేలు ఇప్పుడు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతుంటే పట్టించుకోవడంలేదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. అంగన్వాడీ కార్యకర్తలు మూడు రోజు లుగా చేస్తున్న నిరవధిక దీక్షలను భగ్నం చేసినా, ఉద్యమం ఆపేదిలేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద చేపట్టిన దీక్షలను శుక్రవారం ఉదయం 6గంటల సమయంలో పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో కూర్చున్న వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. అంతకుమందు అంగన్వాడీ కార్యకర్తలకు సాగర్తో పాటు జిల్లా కార్యదర్శి పెద్ది వెం కట్ రాములు ఆధ్వర్యంలో ధర్నాచౌక్ నుంచి ర్యాలీగా వెళ్లి సంఘీభావం తెలిపారు. అనంతరం దీక్ష భగ్నానికి నిరసనగా స్థానిక బస్టాండ్ వద్ద సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు రాస్తారోకో, మాన వహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. కేవలం ఐదేళ్లు పనిచేసి ఎమ్మెల్యేలు నెలకు రూ. 15వేల పెన్షన్ తీసుకుంటుంటే, ఐసీడీఎస్ సంస్థలో వయసంతా గడిచిపోయినా పెన్షన్ సౌకర్యం కల్పించలేక పోవడం సిగ్గుచేటన్నా రు. వెంటనే అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉ ద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆ యన హెచ్చరించారు.