తెలంగాణలోని ప్రభుత్వకార్యాలయాల్లో విద్యుత్ దుబారాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వకార్యాలయాల్లో విద్యుత్ దుబారాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మార్చిలోగా అన్ని కార్యాలయాల్లో విద్యుత్ మీటర్లు బిగించాలని అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ నుంచి ప్రీపెయిడ్ మీట్లర్లతో ప్రభుత్వ కార్యాలయాలు బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.