కంటోన్మెంట్‌లో పారిశుధ్య కార్మికుల ధర్నా | Sewerage labour protests at GHMC circle office in Boinapally | Sakshi
Sakshi News home page

కంటోన్మెంట్‌లో పారిశుధ్య కార్మికుల ధర్నా

Published Fri, Aug 7 2015 10:45 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

కంటోన్మెంట్‌లో పారిశుధ్య కార్మికుల ధర్నా

కంటోన్మెంట్‌లో పారిశుధ్య కార్మికుల ధర్నా

హైదరాబాద్ : పారిశుధ్య కార్మికునిపై ఓ వ్యక్తి దాడి చేయడాన్ని నిరసిస్తూ... కంటోన్మెంట్లోని కార్మికులు శుక్రవారం ధర్నాకు దిగారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గురువారం రోడ్డుపై చెత్తవేస్తున్న వ్యక్తిని పారిశుధ్య కార్మికుడు రమేష్ అడ్డుకున్నాడు. దాంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో రమేష్పై సదరు వ్యక్తి దాడి చేశాడు.

దాంతో కలత చెందిన పారిశుధ్య కార్మికుడు ఈ విషయాన్ని తోటి కార్మికులతో చెప్పాడు. దాంతో వారు శుక్రవారం ధర్నాకు దిగారు. బోయినపల్లి పరిథిలోని ఐదు సర్కిళ్లకు చెందిన మొత్తం 750 మంది కార్మికులు విధులను బహిష్కరించి సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement