హైదరాబాద్ : హైదరాబాద్ కూకట్పల్లి ప్రశాంత్నగర్లో జీపీఎస్ హైడ్రాలిక్ కంపెనీలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రెమిడీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సత్యనారాయణ, మల్లారెడ్డి, శంషుద్దీన్ గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైడ్రాలిక్ కంపెనీకి అనుమతులు ఉన్నాయా, ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ చేపట్టారు.
హైడ్రాలిక్ కంపెనీలో పేలుడు, ముగ్గురికి గాయాలు
Published Sat, Nov 15 2014 12:39 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM
Advertisement
Advertisement