సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో ఇంటింటి నుంచి చెత్తను తరలించేందుకు పారిశుధ్య కార్మికులకు అందజేసేందుకు ఇంకా మిగిలి ఉన్న 176 స్వచ్ఛ ఆటోలను మంగళవారం(నేడు)మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పంపిణీ చేయనున్నారు. పీపుల్స్ ప్లాజాలో ఉదయం 10.30 గంటల కు జరిగే కార్యక్రమంలో ఈ స్వచ్ఛ ఆటోల పంపిణీతోపాటు 18 కొత్త స్వీపింగ్ మెషిన్లు, 37 రెఫ్యూజ్ కాంపాక్టర్లు, 326 కాంపాక్టర్ బిన్స్ను అందుబాటులోకి తేనున్నారు.