టీఆర్‌ఎస్ కార్యకర్తలకు ప్రజాధనమా?: బీజేపీ | TRS activists and public funds? : BJP | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ కార్యకర్తలకు ప్రజాధనమా?: బీజేపీ

Published Tue, Mar 8 2016 2:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

TRS activists and public funds? : BJP

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రికి రూ.5 వేల కోట్లు కేటాయించడం ద్వారా టీఆర్‌ఎస్ కార్యకర్తల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే కుట్ర జరుగుతోందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. కేబినెట్ ఏ ప్రయోజనాల కోసం మం త్రులకు రూ.25 కోట్లు, సీఎంకు రూ.5 వేల కోట్లు కేటాయించిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేసేందుకు ఈ నిధులను కేటాయించుకున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కాగ్‌కు ఫిర్యాదుచేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement