ఆలయానికి వెళ్లిన ఇద్దరు అదృశ్యం | Two children missing | Sakshi
Sakshi News home page

ఆలయానికి వెళ్లిన ఇద్దరు అదృశ్యం

Published Sun, Jun 19 2016 2:24 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

Two children missing

హైదరాబాద్ : జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలిక, బాలుడు అదృశ్యం అయ్యారు. ఏడుకొండలు, సుశీల దంపతుల పిల్లలైన లక్ష్మి కల్యాణి (14), పునీత్ (8) శనివారం సాయంత్రం ఇంటి సమీపంలోని ఓ ఆలయానికి వెళ్లారు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మి తన వెంట తీసుకెళ్లిన సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా వారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement