త్వరలో మా అభ్యర్థిని ప్రకటిస్తాం | ysr congress party to contest Warangal By-Elections, says ponguleti srinivasa reddy | Sakshi
Sakshi News home page

త్వరలో మా అభ్యర్థిని ప్రకటిస్తాం

Published Tue, Oct 27 2015 5:40 PM | Last Updated on Thu, Aug 9 2018 4:45 PM

త్వరలో మా అభ్యర్థిని  ప్రకటిస్తాం - Sakshi

త్వరలో మా అభ్యర్థిని ప్రకటిస్తాం

హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ నిర్ణయించింది.  ఈ మేరకు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ ఉప ఎన్నికపై చర్చించారు.

భేటీ అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం తప్పదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన అన్నారు. తమ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని, విజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement