
లండన్కు రైలు..18 రోజులు..12,000 కి.మీ
బీజింగ్: బ్రిటన్కు చైనా తన తొలి గూడ్సు రైలును ప్రారంభించింది. జిజియాంగ్ ప్రావిన్స్లోని యివు అనే హోల్ సేల్ మార్కెట్ పట్టణం నుంచి లండన్కు తన తొలి రైలును ప్రారంభించినట్లు అక్కడి వార్తా సంస్థ తెలిపింది. ఈ రైలు దాదాపు 7,500 మైళ్లు (12,000 కిలోమీటర్లు) 18 రోజులపాటు ప్రయాణించనుంది. అంతేకాదు ఈ రైలు ఎన్నో దేశాలను దాటి వెళ్ల నుంది.
కజకిస్తాన్, రష్యా, బెలారస్, పోలాండ్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా వెళ్లి లండన్ చేరుకోనుంది. గతంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ రైలు ప్రారంభమైంది. చైనాతో మరోసారి సంబంధాలు పెట్టుకోవడం స్వర్ణంగా మిగిలిపోతుందని బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే అభివర్ణించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన నేపథ్యంలో చైనాతో ఈ సంబంధాలు తమకు చాలా లబ్ధిని చేకూరుస్తాయని ఆమె అన్నారు.