బోటు మునిగి 71 మంది గల్లంతు | 71 missing three days after boat sinks in Indonesia | Sakshi
Sakshi News home page

బోటు మునిగి 71 మంది గల్లంతు

Published Wed, Dec 23 2015 11:07 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

బోటు మునిగి 71 మంది గల్లంతు - Sakshi

బోటు మునిగి 71 మంది గల్లంతు

జకార్తా : ఇండోనేషియా దక్షిణ స్లువేసి ప్రావిన్స్లో బోటు మునిగిన సంఘటనలో 71 మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదని ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. వారి కోసం అన్వేషణతోపాటు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా బోటులో ప్రయాణిస్తున్న మరో 47 మందిని మాత్రం సిబ్బంది కాపాడారని చెప్పారు.

శనివారం  118 మంది ప్రయాణికులతో ఇండినోషియా దక్షిణ స్లువేసిలోని కొలకొ నుంచి సీవా నౌకాశ్రయానికి వెళ్తుండగా బోటు సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement