బాగ్దాద్లోని సదర్ నగరంలో కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మరణించారు.
బాగ్దాద్: బాగ్దాద్లోని సదర్ నగరంలో కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మరణించారు. మరో 37 మంది గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో కొందరి పరిస్థతి విషమంగా ఉందని తెలిపారు. మార్కెట్ సమీపంలో పార్క్ చేసి ఉంచిన కారులో ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో మార్కెట్ పరిసర ప్రాంతాలలో జనం రద్దీ అధికంగా ఉందన్నారు.