baghdad
-
ఫుట్బాల్ స్టేడియం సమీపంలో పేలుడు.. 10 మంది యువకులు మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఘోర ప్రమాదం జరిగింది. ఫుట్ స్టేడియం సమీపంలో భారీ పేలుడు సంభవించి 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ గ్యారేజ్లో పేలుడు పదార్థాలున్న వాహనం పేలి మంటలు పక్కనే ఉన్న గ్యాస్ ట్యాంకర్కు వ్యాపించడంతో అది కూడా పేలి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా రోజూ ఫుట్బాల్ ఆడేందుకు స్టేడియానికి వచ్చే యువకులే అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఇరాక్ సైన్యం ప్రకటనలో తెలిపింది. పేలుడుకు గల కరాణాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది. చదవండి: ఆస్పత్రులూ ఖాళీ.. ఖేర్సన్ నుంచి రష్యా సేనల పలాయనం -
హైదరాబాద్ టు బాగ్దాద్
శంషాబాద్: హైదరాబాద్ నుంచి నేరుగా బాగ్దాద్ వెళ్లేందుకు విమాన సర్వీసు ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం 3.17 గంటలకు ‘ఫ్లై బాగ్దాద్ ఎయిర్లైన్స్’కు చెందిన ఐఎఫ్–462 టేకాఫ్ తీసుకుని తొలి విమానం బయలుదేరింది. హైదరాబాద్–బాగ్దాద్ల మధ్య వారానికి రెండు రోజులు ఈ సర్వీసులు కొనసాగుతాయని ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఇక బాగ్దాద్ నుంచి వచ్చేవిమానం ప్రతి ఆదివారం ఉదయం 11.55 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. అదేరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. మంగళవారం బాగ్దాద్ నుంచి వచ్చే విమానం ఉదయం 9.55 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. అదేరోజు ఉదయం 10.55 కు ఇక్కడి నుంచి బాగ్దాద్ బయలుదేరుతుంది. పెరుగుతున్న మెడికల్ టూరిజం ఏటా ఇరాక్ నుంచి 10 శాతానికి పైగా మెడికల్ టూరిస్టులు హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్నారని పర్యాటక మంత్రిత్వశాఖ చెబుతోంది. అంతేగాక ఇరాక్లోని బాగ్దాద్, కర్బలా ప్రాంతాలకు కూడా మనదేశం నుంచి పర్యాటకుల రాకపోకలు పెరిగాయి. ఈ నేపథ్యంలో డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించారు. -
రణరంగంలా మారిన బాగ్ధాద్.. కాల్పుల్లో 15మంది మృతి
బాగ్ధాద్: ఇరాక్ రాజధాని బాగ్ధాద్ రణరంగాన్ని తలపిస్తోంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు షీతె క్లెరిక్ మొఖ్తదా సదర్ ప్రకటించగానే ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. సోమవారం అత్యంత పటిష్ఠ భద్రత ఉండే గ్రీన్ జోన్ను(పార్లమెంటు భవనం) ముట్టడించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రీన్ జోన్లో కొందరు బాంబులతో విరుచుకుపడ్డారు. తుపాకీ కాల్పుల మోత మోగించారు. ఈ ఘటనలో 15 మంది సదర్ మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మంది గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపిందని వార్తలు వచ్చాయి. అయితే ప్రత్యక్షసాక్షులు మాత్రం సదర్ మద్దతుదారులకు, ప్రో-ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేమ్ వర్క్ అనూకుల వ్యక్తులకు మధ్య ఘర్షణలు చెలరేగాయని పేర్కొన్నారు. కో ఆర్డినేషన్ ఫ్రేంవర్క్ సానుభూతిపరులు సదర్ మద్దతుదారులపై కాల్పులు జరిపారని చెప్పారు. ఈ క్రమంలోనే సదర్ సపోర్టర్లు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. మరోవైపు కో ఆర్డినేషన్ ఫ్రేమ్వర్క్ ఈ దాడిని ఖండించింది. సదర్ మద్దతుదారులు సంయమనం పాటించి చర్చలకు రావాలని సూచించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో నిరసనకారులపై భద్రత దళాలు గానీ, పోలీసులు గానీ కాల్పులు జరపకుండా తాత్కాలిక ప్రధాని ముస్తఫా అల్ ఖదేమీ నిషేధం విధించారు. అందరూ శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. బాగ్ధాద్లో పరిణామాలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. పరిస్థితులు చేయి దాటిపోకుండా, హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఉండాలని సూచించింది. అగ్రరాజ్యం అమెరికా కూడా బాగ్ధాద్లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాక్లో ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటుకాక రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారీటీ రాకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే ప్రో-ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేం వర్క్ అన్ని పార్టీలతో కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముస్తఫా అల్ ఖదేమీని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకుంది. దీన్ని మొఖ్తదా సదర్ మద్దతుదారాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదివరకే పలుమార్లు గ్రీన్ జోన్ను ముట్టడించారు. అక్టోబర్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సదర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన విపక్షాలతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. చదవండి: 300 మందితో వెళ్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం -
ఇరాక్లో ఉద్రిక్తతలు.. 3 రోజులుగా పార్లమెంట్లోనే నిరసనకారులు
బాగ్దాద్: ఇరాక్లో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇరాన్ అనుకూల పార్టీలు, షియా గురువు ముఖ్తదా అల్–సదర్ వర్గాల మధ్య రాజధాని బాగ్దాద్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. అల్–సదర్ అనుచరులు మూడు రోజులుగా పార్లమెంట్లో బైఠాయించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటవలేదు. ఇరాన్ అండతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. షియా గురువు అల్–సదర్ అనుచర వర్గం ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది. ఇరాన్ అనుకూల శక్తుల వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం బాగ్దాద్లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. సంక్షోభం మరింత ముదిరేలా కనిపిస్తోంది. -
మెడికల్ టూరిజానికి హబ్గా మారిన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ టూరిజానికి ప్రధాన హబ్గా మారిన హైదరాబాద్ నుంచి ఢాకా, బాగ్దాద్ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆయా నగరాల నుంచి సిటీకి ఎక్కువగా రోగులు వస్తుండటంతో మెడికల్ టూరిస్టుల డిమాండ్, ఆస్పత్రుల విజ్ఞప్తి మేరకు విమానాలు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి ఢాకాకు సర్వీసులు ప్రారంభం కానుండగా త్వరలో బాగ్దాద్కు కూడా మొదలుకానున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇరాక్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం నగరానికి వస్తున్నారు. నేరుగా నగరానికి చేరుకునే సదుపాయం లేక ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా చేరుకుంటున్నారు. దీంతో రోగులు, వారి బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విమానయాన సంస్థలు, జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు కార్పొరేట్ ఆస్పత్రులు వివరించాయి. దీంతో బాగ్దాద్, ఢాకా నుంచి హైదరాబాద్కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఎయిర్పోర్టు అధికారులు చర్యలు చేపట్టారు. చికిత్సలకు తక్కువ ఖర్చు అవుతుండటంతో.. ఒక్క ఢాకా నుంచే రోజూ 100 మందికి పైగా రోగులు హైదరాబాద్లోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు వస్తున్నారు. బాగ్దాద్ నుంచి కూడా దాదాపు ఇదే స్థాయిలో రోగుల తాకిడి ఉంది. గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు అమెరికా, యూరోప్ దేశాల కంటే తక్కువ ఖర్చులతో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో చాలా మంది నగరంలో పేరొందిన ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజానికి కేంద్రబిందువుగా మారింది. నగరానికి ఏటా 50 వేల మంది విదేశీ రోగులు వైద్య చికిత్సల కోసం ఏటా సుమారు 2 లక్షల మంది విదేశీ రోగులు దేశంలోని పలు ఆస్పత్రులకు వస్తారు. వీరిలో 50 వేల మందికి పైగా హైదరాబాద్కే వస్తున్నట్టు అంచనా. కరోనా వల్ల రెండేళ్లుగా రాకపోకలు నిలిచిపోగా ప్రస్తుతం పలు దేశాలకు విమాన సర్వీసులు తిరిగి మొదలవడంతో రోగుల తాకిడి కూడా మొదలైంది. ఆఫ్రికా, ఇథియోపియా, నైజీరియా, ఒమన్, ఖతర్, కంబోడియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, మస్కట్, దోహ, సౌదీ, సూడాన్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్లాండ్, మాల్దీవులు తదితర దేశాల నుంచి రోగులు ఎక్కువగా నగరానికి వస్తారు. కొద్ది రోజులుగా ఢాకా, బాగ్దాద్ల నుంచి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. (చదవండి: స్కిల్, అప్స్కిల్, రీ–స్కిల్ ) -
నేరుగా నగరానికే...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఢాకా, బాగ్దాద్ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆయా నగరాల నుంచి సిటీకి ఎక్కువగా రోగులు వస్తుండటంతో మెడికల్ టూరిస్టుల డిమాం డ్, ఆస్పత్రుల విజ్ఞప్తి మేరకు విమానాలు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి ఢాకాకు సర్వీసులు ప్రారంభం కానుండగా త్వరలో బాగ్దాద్కు కూడా మొదలుకానున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇరాక్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం నగరానికి వస్తున్నారు. నేరుగా నగరానికి చేరుకునే సదుపాయం లేక ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా చేరుకుంటున్నారు. దీంతో రోగులు, వారి బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విమానయాన సంస్థలు, జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు కార్పొరేట్ ఆస్పత్రులు వివరించాయి. దీంతో బాగ్దాద్, ఢాకా నుంచి హైదరాబాద్కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఎయిర్పోర్టు అధికారులు చర్యలు చేపట్టారు. వైద్యానికి తక్కువ ఖర్చు.. ఒక్క ఢాకా నుంచే రోజూ 100 మందికి పైగా రోగులు హైదరాబాద్లోని పలు కా ర్పొరేట్ ఆస్పత్రులకు వస్తున్నారు. బా గ్దాద్ నుంచి కూడా దాదాపు ఇదే స్థాయి లో రోగుల తాకిడి ఉంది. గుండె జబ్బు లు, కాలేయ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు అమెరికా, యూరోప్ దేశాల కంటే తక్కువ ఖర్చులతో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో చాలా మంది నగరంలో పేరొందిన ఆస్పత్రుల కు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజానికి కేంద్రబిందువుగా మారింది. నగరానికి ఏటా 50 వేల మంది.. వైద్య చికిత్సల కోసం ఏటా సుమారు 2 లక్షల మంది విదేశీ రోగులు దేశంలోని పలు ఆస్పత్రులకు వస్తారు. వీరిలో 50 వేల మందికి పైగా హైదరాబాద్కే వస్తున్నట్టు అంచనా. కరోనా వల్ల రెండేళ్లుగా రాకపోకలు నిలిచిపోగా ప్రస్తుతం పలు దేశాలకు విమాన సర్వీసులు తిరిగి మొదలవడంతో రోగుల తాకిడి కూడా మొ దలైంది. ఆఫ్రికా, ఇథియోపియా, నైజీరి యా, ఒమన్, ఖతర్, కంబోడియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, మస్కట్, దోహ, సౌదీ, సూడాన్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్లాండ్, మాల్దీవులు తదితర దేశాల నుంచి రోగు లు ఎక్కువగా నగరానికి వస్తారు. కొద్ది రోజులుగా ఢాకా, బాగ్దాద్ల నుంచి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. -
ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి
బాగ్దాద్: ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమి నివాసంపై డ్రోన్ దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ ఆదివారం తెల్లవారుజామున బాగ్దాద్లోని ప్రధాని నివాసాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇరాక్ ప్రధాని కధిమి ఈ డ్రోన్ దాడి నుంచి తప్పించుకున్నారు. ఇరాక్ మిలటరీ దీన్ని హత్యాప్రయత్నమని పేర్కొంది. బాగ్దాద్లోని పటిష్టమైన గ్రీన్జోన్లో ఉన్న కధిమి నివాసమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ఇరాక్ మిలిటరీ ఓ ప్రకటనలో తెలిపింది. 'నేను క్షేమంగా ఉన్నాను, అంతా ప్రశాంతంగా ఉండాలని' కధిమి తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు దాడికి తామే బాధ్యులమని ఏ సంస్థ ప్రకటించలేదు. చదవండి: (పునీత్ రాజ్కుమార్కు మొదట వైద్యం చేసిన డాక్టర్ ఇంటికి భారీ బందోబస్తు) -
భారీ పేలుడు.. రద్దీమార్కెట్ మొత్తం రక్తసిక్తం
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో మరో మారణ హోమం చోటు చేసుకుంది. ఈద్ లక్క్ష్యంగా చేసుకుని భారీ కుట్రకు పాల్పడ్డారు మిలిటెంట్లు. బాగ్దాద్ శివారు నగరం సద్ర్లోని ఓ రద్దీ మార్కెట్లో భారీ బాంబు పేలుడుకు పాల్పడగా.. ఆ ప్రాంతం రక్తపు ముద్దలతో భీకరంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 35 మంది చనిపోగా, 60 మందికిపైగా గాయపడ్డారు. సద్ర్ సిటీ వహాయిలత్ మార్కెట్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బక్రీద్ కోసం మార్కెట్లకు క్యూ కట్టిన జనాలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రద్దీ మార్కెట్ కావడంతో ఎటు చూసినా తెగిపడిన అవయవాలు, రక్తపు ముద్దలే కనిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. గాయపడ్డ వాళ్లలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఘటనకు స్థానికంగా తయారుచేసిన పేలుడు పదార్థాన్నే ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఈ దాడి తమ పనేనని ఐఎస్ఐఎల్(ఐఎస్ఐఎస్) ప్రకటించుకుంది. ఇరాక్ అధ్యక్షుడు బర్హమ్ సాలి ఈ దాడిని ‘క్రూరమైన నేరం’గా అభివర్ణించాడు. కాగా, ఈ ఏడాదిలో ఈ తరహా దాడి ఇది మూడోది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
మంటల్లో కోవిడ్ ఆస్పత్రి.. 82 మంది మృతి
బాగ్దాద్: మహారాష్ట్రలోని కోవిడ్ ఆస్పత్రుల్లో ప్రమాదాలు స్ఫురించేలా ఇరాక్లోని బాగ్దాద్లో కూడా ఘోరం జరిగింది. బాగ్దాద్లోని ఇబన్ అల్ఖతీబ్ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 82 మంది మృతి చెందారు. మరో 110 మంది కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా బాధితుల కోసం ఉంచిన ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఆస్పత్రిలో మంటలు వ్యాపించాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉన్న అంతస్తులోనే ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో వెంటిలేటర్ మీద ఉన్న 28 మంది రోగులు మంటలకి ఆహుతయ్యారు. మరికొందరు దట్టంగా వ్యాపించిన పొగతో ఊపిరాడక మరణించారు. ఈ ఘటన నిర్లక్ష్యం కారణంగా జరిగిందని తేలడంతో ఆరోగ్య మంత్రి హసన్ అల్ తమిమీని ప్రధాని సస్పెండ్ చేశారు. ప్రమాదం సమయంలో ఆస్పత్రిలో హృదయ విదారక సన్నివేశాలు కనిపించాయి ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న కొందరు రోగులు వాటిని తీసేసి పరుగులు పెట్టే దృశ్యాలు మనసుల్ని కలిచివేశాయి. రోగుల కోసం వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా మంటల్లో చిక్కుకున్నారు. ఆ ఆçస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగితే రక్షించే వ్యవస్థ లేకపోగా, ఫాల్ సీలింగ్లో వినియోగించిన సామగ్రితో మంటలు మరింత విస్తృతంగా వ్యాపించాయని దేశ మానవ హక్కుల కమిషన్ అధికార ప్రతినిధి అలీ అల్–బయతి చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తేవడానికి కొన్ని గంటల సేపు శ్రమించారు. దాదాపు 200 మంది ప్రాణాలను కాపాడారు. -
వరుస పేలుళ్లతో వణికిన బాగ్దాద్
బాగ్దాద్: రెండు ఆత్మాహుతి బాంబు దాడులతో గురువారం ఇరాక్ రాజధాని బాగ్దాద్ వణికి పోయింది. సెంట్రల్ బాగ్దాద్లోని నిత్యం రద్దీగా ఉండే ‘బాబ్ అల్ షార్కి’లో జరిగిన ఈ రెండు వరుస పేలుళ్లలో కనీసం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికి పైగా గాయాల పాలయ్యారు. చెల్లాచెదురుగా పడిన మృతులు, క్షతగాత్రుల దేహాలతో ఘటనాస్థలి హృదయవిదారకంగా మారింది. ఈ పేలుళ్లకు ఇంతవరకు ఏ సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదు. కానీ, అధికారులు మాత్రం ఇది ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్ర సంస్థ పనేనని ధ్రువీకరించారు. ఆర్థిక సంక్షోభంతో పాటు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయన్న వార్తలతో రాజకీయంగా దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతికి సిద్ధమైన వ్యక్తి మొదట, మార్కెట్ మధ్య నిల్చుని తనకు ఆరోగ్యం బాలేదంటూ గట్టిగా అరిచాడని, దాంతో అందరూ ఆయన చుట్టూ మూగారని, అదే సమయంలో ఆ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడని జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ మేజర్ జనరల్ తహసిన్ అల్ ఖఫాజీ వివరించారు. ఆ తరువాత కాసేపటికే మరో వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ స్లీపర్ సెల్ చేసిన దారుణమిదని అన్నారు. -
ఆత్మాహుతి దాడులు: 13 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఆత్మాహుతి దాడులలో దద్దరిల్లింది. గురువారం చోటు చేసుకున్న వరుస సూసైడ్ ఎటాక్స్లో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేకమంది గాయాల పాలయ్యారు. సెంట్రల్ బాగ్దాద్లో రెండు ఆత్మాహుతి పేలుళ్లు కలకలం సృష్టించాయి. తాయరన్ స్క్వేర్లో రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద ఇద్దరు వ్యక్తులు తమను తాము బాంబులతో పేల్చుకున్న ఘటనలో 13 మంది మృతి చెందారని ప్రాథమిక నివేదికలు ద్వారా తెలుస్తోంది. మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్తానిక పోలీసులు వెల్లడించారు. ఇరాక్ రాజధానిలో నగరంలో 2017 తరువాత ఇదే అదిపెద్ద దాడి అని భావిస్తున్నారు. -
ఇరాక్ ఆర్మీ స్థావరంపై ముష్కర దాడి
బాగ్దాద్ : ఇరాక్పై ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పశ్చిమ బాగ్దాద్లోని ఇరాక్ ఆర్మీ స్థావరంపై సాయుధులైన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో11 మంది పౌరులు మరణించారు. సైన్యం సహా మొత్తం 8మంది గాయాలపాలయ్యారని పోలీసు, వైద్య వర్గాల నుంచి సమాచారం. అల్-రద్వానియా ప్రాంతంలోని ఆర్మీ స్థావరంపై జరిగిన దాడిలో దుండగులు గ్రేనెడ్, అధునాతన ఆయుధాలను వాడినట్టు తెలుస్తోంది. ఈ దాడి పాల్పడిన ఉగ్రవాదులు నాలుగు వాహనాల్లో వచ్చారని తెలుస్తోంది. ఉగ్రదాడిపై స్పందించిన ‘ఇరాక్ మిలిటరీ దాడి జరిగింది. ప్రభుత్వ మద్దతు ఉన్న సున్నీ మిలిషియా ఆర్మీపైనా అని ఇందులో నలుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డార’ని అధికార వర్గాలు తెలిపాయి. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ, పోలీసు బృందాలు అపరేషన్ మొదలెట్టినట్టు పోలీసు వర్గాల సమాచారం. -
అమెరికా ఎంబసీపై రాకెట్ దాడి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా ఎంబసీకి సమీపంలో రాకెట్ దాడి జరిగింది. మూడు కత్యూష రాకెట్లు ఎంబసీ హై సెక్యూరిటీ కాంపౌండ్ వద్ద పడ్డాయని ఒకరు చెప్పగా, దాదాపు 5 రాకెట్లు పడ్డాయని మరొక సాక్షి తెలిపారు. అయితే హై సెక్యూరిటీ గ్రీన్ జోన్ వద్ద 5 రాకెట్లు పడ్డాయని ఇరాక్ భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి. అయి తే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపాయి. ఈ ప్రాంతంలో ఇతర దేశాలకు సంబంధించిన ఎంబసీలు కూడా ఉన్నా యి. రెండు రోజుల క్రితమే బాగ్దాద్లో అమెరికా బలగాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. ఇరాన్ జనరల్ సులేమానీని అమెరికా హతమార్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో అస్థిరత నెలకొంది. -
ట్రంప్ తలపై భారీ రివార్డు ప్రకటించిన ఇరాన్..!
టెహ్రాన్ : ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సోలెమన్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశం మరోసారి స్పష్టం చేసింది. ఇరాన్ అధికారిక ఛానెల్ ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చిన వారు 80 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.570 కోట్లు) గెలుచుకోవచ్చని తెలిపింది. దేశంలోని ప్రతి పౌరుడు తలా ఒక డాలర్ చొప్పున పోగుచేసి ఆ మొత్తాన్ని ట్రంప్ ప్రాణాలు తీసిన వారికి రివార్డుగా ఇస్తామని వెల్లడించింది. ‘ఇరాన్ జనాభా 8 కోట్లు. మా దేశ జనాభా ఆధారంగా ట్రంప్ తల నరికి తెచ్చివారికి రివార్డు ప్రకటించాం’అని సదరు టీవీ ఛానెల్ పేర్కొంది. (చదవండి : నిశ్శబ్దంగా చంపేశారు) కాగా, ఇరాక్లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ సైనిక కమాండర్, ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్ మృతిచెందిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మృతితో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా తాజా చర్యతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యకు దిగుతుందోనన్న ఆందోళన నెలకొంది. అయితే, ఇరాన్ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్లో 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని, తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ శనివారం రాత్రి ఆయన ట్వీట్ చేశారు. (చదవండి : మా ప్రతీకారం భీకరం) -
ఎప్పుడో చంపేయాల్సింది
వాషింగ్టన్/బాగ్దాద్/టెహ్రాన్: ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన నాయకుడు, ఆ దేశ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమాని అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్పై గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్కు చెందిన హషద్ అల్ షాబి పారామిలటరీ బలగాల డిప్యూటీ చీఫ్, ఇరాన్కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిమెంట్లు మరణించినట్టు బాగ్దాద్ మీడియా వెల్లడించింది. లెబనాన్ లేదంటే సిరియా నుంచి బాగ్దాద్కు వచ్చినట్టుగా భావిస్తున్న సులేమాని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి రెండు కార్లలో తన సన్నిహితులతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ఇరాక్లో అమెరికా సిబ్బంది రక్షణ కోసమే తాము వైమానిక దాడులకు దిగామని పెంటగాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో సులేమాని మరణించారని ధ్రువీకరించింది. ఎప్పుడో చంపేయాల్సింది: ట్రంప్ విదేశాల్లో నిఘా కార్యకలాపాలు నిర్వహించే ఇరాన్ అల్ ఖుద్స్ చీఫ్ జనరల్ సులేమానిని కొన్నేళ్ల క్రితమే చంపేయాల్సి ఉండేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాక్తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల్లో అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకి, వేలాది మంది అమెరికన్ సిబ్బంది మృతికి సులేమాని కారకుడని ధ్వజమెత్తారు. ఈ మధ్యకాలంలో ఇరాక్లో అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిగిన దాడుల వెనుక సులేమాని హస్తం ఉందని అన్నారు. అమెరికా రాయబారులు ఇతర అధికారులు, సైనికులపై మరిన్ని దాడులకు సులేమాని వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు. సులేమాని మృతి వార్త తెలిసిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్ అమెరికా జాతీయ జెండా ఇమేజ్ని తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. కొద్ది గంటల తర్వాత మరో ట్వీట్లో ‘‘ఇరాన్ ఎప్పుడూ యుద్ధం గెలవలేదు. అలాగే సంప్రదింపుల్ని ఎప్పుడూ వదులుకోలేదు’’అని పేర్కొన్నారు. 2018లో అమెరికా ఇరాన్తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలు చెలరేగాయి. అమెరికాలో ట్రంప్పై అవిశ్వాసం ప్రబలుతోన్న సందర్భంలో ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఈ దాడులకి దిగారన్న విమర్శలు ఉన్నాయి. ఇరాక్ నుంచి వెనక్కి రండి ఇరాక్లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. ఇరాన్ మద్దతున్న మిలిటెంట్లు అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిపిన దాడులతో ఎంబసీలో కార్యకలాపాలు నిలిపివేశామని, పౌరులెవరూ అక్కడికి వెళ్లవద్దని ట్వీట్ చేసింది. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యానికి అమెరికా మరో 3,500 మంది బలగాలను తరలించింది. ఇరాకీల సంబరాలు బాగ్దాద్లో జరిగిన దాడుల్లో జనరల్ సులేమాని మృతి చెందడంతో ఇరాక్లో ప్రభుత్వ వ్యతిరేకులు సంబరాలు చేసుకున్నారు. మరో యుద్ధం భరించలేం: ఐరాస గల్ఫ్లో మరో యుద్ధాన్ని ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ వ్యాఖ్యానించారు. సులేమాని మృతి చెందడంతో అమెరికా, ఇరాన్ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యుటెరస్ పై విధంగా స్పందించారు. ఎవరీ ఖాసీం సులేమాని? 1955లో ఇరాన్లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో సులేమాని జన్మించారు. మొదట్లో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశారు. 1979లోఇరాన్ విప్లవం సమయంలో రివ్యల్యూషనరీ గార్డ్లో చేరారు. 1980లో ఇరాన్, ఇరాక్ యుద్ధంలో పాల్గొని ధైర్యసాహసాలు కలిగిన కమాండర్గా పేరు తెచ్చుకున్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్లో కీలకమైన నిఘా విభాగం అయిన ఖుద్స్ ఫోర్స్కి 1998 సంవత్సరం నుంచి సులేమాని మేజర్ జనరల్గా ఉన్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యాన్ని పెంచడానికి, దానిని బలమైన దేశంగా నిలపడానికి చాలా ఏళ్లుగా శ్రమిస్తున్నారు. సులేమాని విదేశాల్లో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించడంలో దిట్ట. సమయానుకూలంగా మిత్రపక్షాల్ని మార్చేయడంలోనూ, చుట్టుపక్కల ముస్లిం దేశాల్లో షియా అనుకూల ప్రభుత్వ ఏర్పాట్లలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్పై పోరాటంలోనూ సులేమాని ప్రధాన పాత్ర పోషించారు. ఇరాన్ సరిహద్దులు దాటి జరిగే దాడులన్నింటి వెనుక వ్యూహ ప్రతివ్యూహాలు ఆయనే రచిస్తారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయోతల్లా ఖామినేయీ తర్వాత దేశంలో అంతటి శక్తిమంతుడిగా అల్–ఖుద్స్ బలగాల చీఫ్ అయిన జనరల్ సులేమానికి పేరుంది. ఇరాన్ ప్రజలు ఆయనని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. 2017లో టైమ్ మ్యాగజైన్ ఆయనని అత్యంత ప్రభావశీలుర జాబితాలో చేర్చింది.జేమ్స్ బాండ్, ఎర్విన్ రోమెల్, లేడీ గాగా ఒక రూపంలోకి వస్తే అదే సులేమాని అంటూ కీర్తించింది. అయితే ఎన్నో దేశాల్లో మిలటరీ దాడుల వ్యూహకర్త అయిన సులేమానిని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్ సులేమాని చంపేసినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయోతొల్లా అలీ ఖమేనియా హెచ్చరించారు. ఇస్మాయిల్ ఖానీని సులేమాని స్థానంలో ఖుద్స్ బలగాల చీఫ్గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ గుండెకు గాయం చేసిన వారిని విడిచిపెట్టమని తమకు సహకరించే దేశాలతో కలిసి బదులు తీర్చుకుంటామని అధ్యక్షుడు హసన్ రౌహని హెచ్చరించారు. -
కమాండర్ హత్య: వీడియో పోస్టు చేసిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ సైనిక కమాండర్ ఖాసీం సొలెమాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఖాసీం హత్యతో ఇరాకీలు సంబరాలు చేసుకుంటున్నారని, జాతీయ పతాకంతో ఇరాకీ వీధుల్లో కోలాహలం నెలకొందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో ఒక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘స్వేచ్ఛ కోసం ఇరాకీలు వీధుల్లో నృత్యాలు చేస్తున్నారు. జనరల్ సోలెమాన్ లేకపోవడమే అందుకు కారణం’ అని పేర్కొన్నారు. రోడ్డు మీద ఇరాకీలు జాతీయ జెండాతో, ఇతర బ్యానర్లతో పరిగెత్తుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఇరాక్లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ సైనిక కమాండర్, ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్ మృతిచెందారు. వీరిద్దరి మృతితో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిపోయాయి. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు సోలెమన్ను చంపినట్టు అమెరికా ప్రకటించగా.. అమెరికా అవివేక చర్యకు తీవ్ర ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ హెచ్చరించింది. అమెరికా తాజా చర్యతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యకు దిగుతుందోనన్న ఆందోళన నెలకొంది. చదవండి: అమెరికాది అవివేకపు చర్య : ఇరాన్ ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్ -
‘కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం’
టెహ్రాన్: ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సోలేమన్ను హతమార్చిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధినాయకుడు అయాతోల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. సోలేమన్ను అంతం చేసినా.. ఆయన చూపిన బాటలో నడవకుండా ఎవరినీ కట్టడి చేయలేరని వ్యాఖ్యానించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా శుక్రవారం రాకెట్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సోలేమన్ సహా మరో 8 మంది మృతి చెందారు. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. మంగళవారం ఇరాక్లోని బాగ్దాద్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగానే అమెరికా రాకెట్ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేనీ... స్థానిక మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నో ఏళ్లుగా ఇరాన్ మంచి కోసం అవిశ్రాంత కృషి చేసిన సోలేమన్కు నేడు అమరత్వం సిద్ధించింది. ఆయన వెళ్లిపోయాడు గానీ ఆయన చూపిన దారిలో సాగడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆయన రక్తంతో చేతులు తడుపుకొన్న నేరగాళ్లపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుని తీరతాం. మా శత్రువులు ఒక విషయం తెలుసుకోవాలి. మీరిలా చేసినందుకు జీహాద్ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. పవిత్ర యుద్ధంలో మాకోసం విజయం ఎదురుచూస్తోంది’ అని వ్యాఖ్యానించారు. అదే విధంగా సోలేమన్తో పాటు అమరులైన మరికొందరు అధికారుల తరఫున ప్రతీకారం తీర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ మాట్లాడుతూ... ఇస్లామిక్ విలువలను పరిరక్షించేందుకు తమతో పాటు స్వాత్రంత్యం కోరుకునే మరికొన్ని దేశాలు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సోలేమన్ అమరత్వం తమను ఇందుకు కార్యోన్ముఖుల్ని చేసిందని వ్యాఖ్యానించారు. (చదవండి: ఎయిర్పోర్ట్పై రాకెట్ దాడి.. 8 మంది మృతి) చదవండి: ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్ -
అమెరికాది అవివేకపు చర్య : ఇరాన్
టెహ్రాన్ : బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా బలగాలు రాకెట్ దాడి జరపడాన్ని ఇరాన్ అవివేకపు చర్యగా అభివర్ణించింది. ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సోలెమన్ను చంపాడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ దాడి భయంకరమైనదని ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ అన్నారు. అమెరికా చర్యను అంతర్జాతీయ ఉగ్రవాదంగా పేర్కొన్నారు. ఈ వంచన చర్యతో ఎదురయ్యే పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇరాన్లో అమెరికా ప్రయోజనాలను చూస్తున్న స్విస్ దౌత్యకార్యాలయానికి సమన్లు పంపారు. అలాగే మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అమెరికా చర్యను తీవ్రంగా ఖండించారు. సోలెమాన్ హత్యకు తీవ్ర ప్రతీకారం తప్పదని అమెరికాను హెచ్చరించారు. కాగా, శుక్రవారం బాగ్దాద్ ఎయిర్పోర్ట్పై అమెరికా జరిపిన రాకెట్ దాడిలో ఇరాన్ క్వాడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్తోపాటు మరో ఆరుగురు మృతిచెందారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని పెంటగాన్ వెల్లడించింది. చదవండి : ఎయిర్పోర్ట్పై రాకెట్ దాడి.. 8 మంది మృతి ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్ -
ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్
వాషింగ్టన్ : బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడికి పాల్పడింది తామేనని అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమానీని హతమార్చినట్టు ఆ దేశ రక్షణ విభాగం(పెంటగాన్) వెల్లడించింది. ఇరాక్లో అమెరికా అధికారులపై జరిగిన దాడుల్లో సులేమానీ కీలక పాత్ర పోషించాడని పెంటగాన్ ఆరోపించింది. వందలాది మంది అమెరికా, దాని సంకీర్ణ సేనలకు చెందిన సభ్యుల మృతికి సులేమానీ బాధ్యుడని తెలిపింది. విదేశాల్లో ఉన్న అమెరికా అధికారులపై సులేమానీ దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. అలాగే ఈ దాడిని రక్షణాత్మక చర్యగా పేర్కొంది. వైట్ హౌస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. బాగ్దాద్లోని అమెరికా దౌత్య కార్యాలయంపై రెండు రోజుల క్రితం ఇరాన్ మద్ధతు ఉన్న నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రంప్ ఇరాక్కు ప్రత్యేక బలగాలు పంపించారు. సులేమానీని మట్టుబెట్టడంతో అమెరికా రెండు రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. కాగా, సులేమానీ సిరియా నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి రెండు ప్రత్యేక కాన్వాయ్లు ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకున్నాయి. అయితే సులేమానీ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన కొన్ని క్షణాల్లోనే ఈ దాడులు జరిగాయి. అమెరికా జెండాను పోస్ట్ చేసిన ట్రంప్.. బాగ్దాద్ ఎయిర్పోర్ట్పై రాకెట్ దాడిలో సులేమానీ మృతి చెందిన కొద్దిసేపటికే డోనాల్డ్ ట్రంప్ ట్విటర్లో అమెరికా జాతీయ జెండాను పోస్ట్ చేశాడు. దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సులేమానీని మట్టుపెట్టడం ద్వారా అమెరికా విజయం సాధించిందని చెప్పడానికే ఆయన ఈ విధమైన పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, అమెరికా జరిపిన ఈ రాకెట్ దాడిలో ఖాసీం సులేమానీ, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్తోపాటు మరో ఆరుగురు మృతిచెందారు. చదవండి : ఎయిర్పోర్ట్పై రాకెట్ దాడి.. 8 మంది మృతి -
ఎయిర్పోర్ట్పై రాకెట్ దాడి.. 8 మంది మృతి
బాగ్దాద్ : ఇరాక్లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. ఎయిర్ కార్గో టెర్మినల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దాడి చోటుచేసుకుంది. మొత్తంగా మూడు రాకెట్ దాడులు జరిగినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసం కాగా, 8 మంది మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇరాన్, ఇరాక్కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు ఉన్నట్టు ఇరాక్ మీడియా పేర్కొంది. ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్ మృతిచెందినట్టు ఇరాక్ మిలీషియా ప్రతినిధి వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది అమెరికా బలగాలే అని ఇరాక్ పీఎంఎఫ్ ప్రతినిధి అహ్మద్ అల్ అస్సాది ఆరోపించారు. దీనిపై యూఎస్ అధికారులు స్పందిస్తూ.. బాగ్దాద్లో ఇరాన్తో ముడిపడి ఉన్న రెండు లక్ష్యాలపై దాడి జరిగినట్టు తెలిపారు. అయితే మరింత సమాచారం వెల్లడించేందుకు వారు నిరాకరించారు. మరోవైపు.. మూడు రాకెట్లతో బాగ్దాద్ విమానాశ్రయంపై దాడి జరిగిందని ఇరాక్ పారా మిలటరీ గ్రూప్స్ తెలిపాయి. ఈ దాడిలో ఇరాక్ పారా మిలటరీకి చెందిన ఆరుగురు సభ్యులు, ఇద్దరు అతిథులు ఉన్నట్టు వారు పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు, పలువురు నిరసనకారులు బాగ్దాద్లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన అమెరికా.. ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఈ క్రమంలోనే బాగ్దాద్ ఎయిర్పోర్ట్పై రాకెట్ దాడులు జరగడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. అయితే ఇప్పటివరకు ఈ దాడికి పాల్పడింది ఎవరనే దానిపై స్పష్టత లేదు. ఈ దాడులతో మధ్య ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
ప్రతీకారం తీర్చుకోం: ట్రంప్
వాషింగ్టన్: తాను శాంతి కాముకుడినని, తనకు యుద్ధం అంటే ఇష్టం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్పై ప్రతీకారం తీర్చుకోబోమని, యుద్ధం చేసే ఆలోచన లేదని తెలిపారు. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు మంగళవారం ఇరాక్లోని బాగ్దాద్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్లోని పరిస్థితిని చాలా బాగా చక్కదిద్దామని చెప్పారు. ఇరాన్తో యుద్ధం చేసే ఆలోచన ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘యుద్ధం చేయాలన్న ఆలోచన ఇరాన్కు మంచిదని నేను అనుకోవడం లేదు. నేను శాంతి కోరుకుంటున్నాను. యుద్ధం రావాలని అనుకోవడం లేద’ని ట్రంప్ సమాధానం ఇచ్చారు. బాగ్దాద్లో తమ రాయబార కార్యాలయంపై దాడికి ఇరాన్దే పూర్తి బాధ్యత అని, దీనికి ఇరాన్ భారీగా మూల్యం చెల్లించుకుంటుందని అంతకుముందు ట్రంప్ హెచ్చరించారు. ‘ఇది హెచ్చరిక కాదు, ఇది ముప్పు’ అంటూ ట్వీట్ చేశారు. తమ కార్యాలయంపై దాడిని భద్రత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని, సిబ్బంది సురకక్షితంగా ఉన్నారని తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించిన ఇరాక్ ప్రధాని, అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, దాడి జరిగిన వెంటనే బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయానికి అదనపు బలగాలను తరలించినట్టు పెంటగాన్ ప్రకటించింది. మంగళవారం ఇరాక్ ప్రధాని ఆదిల్ అబ్దుల్ ఆల్-మహదితో ఫోన్ మాట్లాడినట్టు వెల్లడించింది. (చదవండి: ఇరాక్లో యూఎస్ ఎంబసీపై దాడి) -
ఇరాక్లో యూఎస్ ఎంబసీపై దాడి
బాగ్దాద్: ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు మంగళవారం ఇరాక్లోని బాగ్దాద్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి, రిసెప్షన్ ప్రాంతాన్ని తగలబెట్టారు. ఇరాన్ మద్దతున్న తీవ్రవాద సంస్థ హషెద్ అల్ షాబికి హిజ్బుల్ బ్రిగేడ్ సాయుధ విభాగం. దానికి ఇరాక్లో, సిరియాలో ఉన్న కీలక స్థావరాలపై అమెరికా ఆదివారం వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో పాతికమందికి పైగా చనిపోయారు. ఆ దాడులకు ప్రతీకారంగానే యూఎస్ రాయబార కార్యాలయంపై సోమవారం దాడి జరిగింది. మిలటరీ యూనిఫాం వేసుకున్న ఆందోళనకారులు ‘ఆక్రమణదారు అమెరికా’ అని ఉన్న ప్లకార్డులు పట్టుకుని ఈ దాడిలో పాల్గొన్నారు. ఆందోళనకారులను చెదర గొట్టడానికి అమెరికా సైనికులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. -
మోడల్ దారుణ హత్య
బాగ్దాద్ : తారా ఫేర్స్ అనే ఇరాకీ మోడల్ దారుణ హత్యకు గురైంది. తన ఇంటి నుంచి పోర్షే వాహనంలో బయల్దేరిన తారా(22)పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కాల్చి చంపారు. కారులో నుంచి ఆమెను కిందకి లాగి తుపాకీ గురిపెట్టి వరుసగా మూడు బుల్లెట్లు తలలోకి దించారు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాల్సిందిగా ఇరాక్ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. కాగా తారా మోడల్గా రాణిస్తూ తనకంటూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తారాకు ఇన్స్టాగ్రామ్లో 2.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే సంప్రదాయాలకు విరుద్ధంగా మోడల్గా పని చేస్తుందన్న కారణంగానే ఛాందసవాదులు తారను అత్యంత దారుణంగా చంపివేశారంటూ ఆమె అభిమానులు ఆరోపిస్తున్నారు. ‘అందరు అమ్మాయిల్లాగే జీవితాన్ని తనకు నచ్చినట్టుగా, సంతోషంగా గడపాలనుకున్న తారాను కొంత మంది ఉగ్రవాదులు కాల్చి చంపారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ గురువారం తారా వాళ్ల టార్గెట్. వచ్చే గురువారం ఇంకెవరో. స్వేచ్ఛగా జీవించాలనుకునే అమ్మాయిలకు ఇక్కడ ఇలా జరగడం సాధారణమైపోయింది కదా. నిజంగా సిగ్గు పడాల్సిన విషయం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఇరాకీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కర్నూలు వాసి బాగ్దాద్లో మృతి
కర్నూలు (ఓల్డ్సిటీ): కర్నూలు నగరానికి చెందిన వ్యక్తి ఆదివారం రాత్రి బాగ్దాద్లో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని అక్కడే ఖననం చేస్తుండటంతో కుటుంబ సభ్యులు కడచూపు దర్శనానికి కూడా నోచుకోలేకపోయారు. పూర్తి వివరాలు.. కర్నూలు నగరం ధర్మపేటకు చెందిన టి.దస్తగీర్ సాహెబ్ (65) ఆర్మీలో 20 ఏళ్లు పనిచేసి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం స్టేట్బ్యాంక్ మార్కెట్యార్డు బ్రాంచ్లో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం బాగ్దాద్ యాత్రకు వెళ్లి అక్కడి పవిత్ర పుణ్యస్థలం మాబుసుభాని (దస్తగీర్) సమాధి వద్ద మృతిచెందాడు. ఇమామ్ గజాలి రహ్మతుల్లా అలై ఖబరస్తాన్లో ఖననం చేశారు. ఈయనకు నలుగురు కుమారులు, కుమార్తె సంతానం. -
ఉగ్రదాడి: 13 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో మరోమారు ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కరాడా సెంట్రల్లో గల ఓ ఐస్క్రీం పార్లర్పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 22 మందికి పైగా గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే పార్లర్లో ప్రజలే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాంబు దాడి అనంతరం ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. గాయాలపాలైన వారి ఆర్తనాదాలు, రోదనలతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
ఆత్మాహుతి దాడులు.. 18 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాగ్దాద్లో పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. అబు షీర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన వరుస దాడుల్లో 18 మంది మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. ముందుగా పోలీస్ చెక్పోస్ట్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో నిండిన కారుతో చెక్ పాయింట్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన అనంతరం.. పోలీస్ స్టేషన్ను లక్ష్యంగా చేసుకొని ఇదే తరహాలో మరోదాడికి పాల్పడ్డారు. మొదటి దాడి తీవ్రత ఎక్కువగా ఉందని అంతర్గత వ్యవహారాలశాఖ అధికారి వెల్లడించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా ఈ ఘటనకు బాధ్యులం తామేనని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని తెలిపారు. ఇటీవల అక్కడి బస్రా ప్రాంతంలో జరిగిన దాడిలో 13 మంది మృతి చెందగా 30 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇరాక్లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తరచుగా ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. -
ఇరాక్లో పేలుళ్లు..13 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పోలీస్ చెక్ పాయింట్ సమీపంలో మానవ బాంబుతో ముష్కరుడు దాడి చేశాడు. ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారని ఇరాక్ పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. బుధవారం రాత్రి పోలీస్ చెక్ పాయింట్ సమీపంలో మానవ బాంబర్ ట్యాంకర్తో దూసుకొచ్చి పేల్చుకున్నాడని పోలీసులు తెలిపారు. పేలుడు దాటికి 15 వాహనాలు దగ్దమయ్యాయి. -
ప్రపంచంలో ఉత్తమ, చెత్త నగరాలివే
లండన్: అత్యున్నత జీవన ప్రమణాలు కలిగివున్న నగరాల జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా మొదటిస్థానంలో నిలిచింది. ప్రముఖ కన్సల్టెంట్ సంస్థ మెర్సర్.. ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో అభిప్రాయసేకరణ నిర్వహించి వెల్లడించిన జాబితాలో వియన్నా వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ జాబితాలో అత్యంత చెత్తనగరంగా బాగ్దాద్ చివరిస్థానంలో నిలిచింది. రాజకీయ స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రైమ్, వినోదం మరియు రవాణా ప్రమాణాలు లాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని మెర్సర్ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో లండన్, పారిస్, టోక్యో, న్యూయార్క్ నగరాలు టాప్ 30లో కూడా చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. వియన్నాతో పాటు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్, న్యూజిలాండ్లోని ఆక్లాండ్, జర్మనీలోని మ్యూనిచ్, కెనడాలోని వాంకోవర్లు వరుసగా టాప్ 5లో నిలిచాయి. ఆసియా నుంచి అగ్రస్థానంలో సింగపూర్(25వ ర్యాంకు) నిలిచింది. అమెరికా నుంచి ఈ జాబితాలో టాప్లో నిలిచిన నగరం శాన్ఫ్రాన్సిస్కో(29వ ర్యాంకు). -
ఇరాక్లో 51 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో గురువారం జరిగిన కారు బాంబు పేలుడులో 51 మంది మృతిచెందారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ బాగ్దాద్లోని మార్కెట్లోకి ఓ కారు వేగంగా దూసుకొచ్చి వెంటనే పేలిపోయింది. ఈ మార్కెట్లో పెద్దసంఖ్యలో గుమిగూడి ఉన్న షియా ముస్లింలు లక్ష్యంగానే ఈ దాడి జరిగింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. పేలుడు జరగగానే మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డట్లు, తీవ్రమైన విధ్వంసం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టమైంది. ‘బయాలోని కారు డీలర్షిప్ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. 51 మంది చనిపోయారు. ప్రమాద తీవ్రత ఆధారంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది’ అని ఇరాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం కూడా ఇదే ప్రాంతంలో.. ఇదే పద్ధతిలో జరిగిన (కారుతో మార్కెట్లోకి దూసుకొచ్చారు) ఉగ్రదాడిలో నలుగురు మృతిచెందారు. బాగ్దాద్ ఉత్తర ప్రాంతంలో బుధవారం జరిగిన దాడిలో 11 మంది పౌరులు మృతిచెందినట్లు ఐసిస్ ఓ ప్రకటనలో తెలిపింది. 2017 ఆరంభం నుంచీ బాగ్దాద్లో తరచూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. కాగా, ఈ ఘటనకు తమదే బాధ్యతంటూ ఐసిస్ అనుబంధ సంస్థ ‘ద అమాక్ ప్రాపగాండా ఏజెన్సీ’ ప్రకటించింది. అఫ్గాన్ లో బాంబు పేలి 12 మంది మృతి కాబూల్: అఫ్గానిస్తాన్ లోని పక్తిక ప్రావిన్సులో ఉగ్రవాదులు రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలి 12 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు విద్యార్థులున్నారు. మృతులంతా ఒక వాహనంలో ప్రయాణిస్తుండగా, బాంబు సమీపానికి వాహనం రాగానే పేలిపోయింది. ఈ తరహా బాంబు దాడులకు పాల్పడే తాలిబన్ లే ప్రస్తుత బాంబును కూడా అమర్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. -
వరుస ఆత్మాహుతి దాడులు; 10 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ మళ్లీ బాంబుదాడులతో దద్దరిల్లింది. శనివారం ఇరాక్ రాజధాని బాగ్దాద్తో పాటు మోసుల్ నగరంలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో కనీసం 10 మంది మరణించగా, మరో 33 మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఇరాక్లో ఐఎస్ ఉగ్రవాదులకు, భద్రత దళాలకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఐఎస్ ఆధీనంలో ఉన్న మోసుల్ను ఇరాక్ భద్రత దళాలు ఇటీవల స్వాధీనం చేసుకున్నాయి. మోసుల్లో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేయడంతో నలుగురు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. మోసుల్లోనే మరో రెండు చోట్ల సూసైడ్ కారు బాంబులను పేల్చారు. -
అక్కడ బాగ్దాద్.. ఇక్కడ ఓరుగల్లు!
► ఒకే తరహా నగరాలన్న లండన్ నిపుణుడు జార్జ్ మైఖేల్ ► ఓరుగల్లు వృత్తాకార నగరం ఎంతో ప్రత్యేకం ► భారత్లో ఇలాంటి నిర్మాణశైలి మరెక్కడా కనిపించదు ► కాకతీయ కీర్తి తోరణాలు చూసే కుతుబ్షాహీలు చార్కమాన్ నిర్మించారని వెల్లడి ► ‘రీడిస్కవరింగ్ తెలంగాణ’ సదస్సులో నివేదిక సాక్షి, హైదరాబాద్: ‘‘వృత్తాకారంలో నగరం.. మూడంచెలుగా ప్రాకారాలు.. ఒక్కోదానికి నలువైపులా నాలుగు ద్వారాలు.. నేరుగా వెళ్లే అవకాశం లేకుండా మలుపులు తిరిగి ప్రవేశించేలా మార్గాలు.. మండల, స్వస్తిక్, యంత్ర పద్ధతులను అనుసరించి దుర్భేద్యంగా తీర్చిదిద్దిన తీరు.. భారతదేశం వెలుపల ఈ తరహా వృత్తాకార నగర నిర్మాణం మళ్లీ ఇరాక్ రాజధాని బాగ్దాద్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ రెండు నగరాల నిర్మాణం ఒకదాని నమూనాపై మరోటి ఆధారపడి తీర్చిదిద్దారన్న భావన కలుగుతుంది..’’ అని లండన్కు చెందిన పురాతత్వ నిపుణుడు డాక్టర్ జార్జ్ మైఖేల్ వెల్లడించారు. అయితే దీనికి శాస్త్రీయ రుజువులు మాత్రం లేవని చెప్పారు. 1980 దశకంలో ఓరుగల్లు నగర నిర్మాణం, కాకతీయుల విశిష్టతపై జార్జ్ మైఖేల్ విస్తృత పరిశోధన జరిపారు. ఆ తర్వాత కూడా మరో రెండు సార్లు వచ్చి అధ్యయనం చేశారు. తాజాగా తెలంగాణ పురావస్తు శాఖ ‘రీడిస్క వరింగ్ తెలంగాణ’ పేరుతో ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొ న్న ఆయన తన నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. దేవా లయాలకు తోరణాలు (ద్వారాలు) ఏర్పాటు చేసినట్టుగా.. ఓరుగల్లు చుట్టూ కీర్తి తోరణాలు ఏర్పాటు చేసిన ఆ రాజుల ఆలోచనను కీర్తించకుండా ఉండలేమన్నారు. పవిత్రంగా భావించే స్వస్తిక్ ఆకృతిలో నగరానికి నాలుగు వైపులా ఏర్పాటు చేసిన ద్వారాల నుంచి సవ్య దిశలో మాత్రమే వెళ్లేలా ఏర్పాట్లు, ఒక్కో ద్వారానికి ఒకటి ప్రతిబింబంలా ఏర్పాటు చేసిన తీరు గొప్ప నిర్మాణ కౌశలానికి నిదర్శనమని ప్రశంసించారు. గొప్ప నగరమిది.. భారతదేశంలోని నగరాల నిర్మాణంలో నాయక్లకు ప్రాధాన్యం ఉండేదని... నగరం, దాని చుట్టూ కోట గోడ, రక్షణగా బురుజులు, ఒక్కో బురుజుకు ఒక్కో నాయక్తో నిరంతర పర్యవేక్షణ ఉండేదని జార్జ్ మైఖేల్ పేర్కొన్నారు. ‘‘కానీ వరంగల్ నగరానికి రక్షణగా వృత్తాకారంలో మూడు కోట గోడల నిర్మాణం ఆశ్చర్యపరుస్తుంది. ఆ తరహా వ్యవస్థలు మరెక్కడా కనిపించవు. నగర నిర్మాణ సమయంలో 72 బురుజులు ఏర్పాటు చేసి 72 మందితో నాయక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 45 బురుజులే కనిపిస్తున్నాయి. ఇక బహమనీలు, ఇతర ముస్లిం రాజులు ఓరుగల్లు నగరాన్ని ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఒక్క కుష్ మహల్ మినహా అంతా ధ్వంస నిర్మాణాలే కనిపిస్తాయి. హిందూ ఆలయాలను కూల్చి ఆ శిథిలాలతో పెద్ద మసీదు నిర్మాణం ప్రారంభించినా, దాన్ని పూర్తి చేయలేదు. ఈ నగరానికి నిర్మించిన కీర్తి తోరణాలను చూసే కుతుబ్షాహీలు హైదరాబాద్లోని చార్మినార్కు నాలుగువైపులా చార్కమాన్లు నిర్మించారు..’’ అని చెప్పారు. ఓరుగల్లు గొప్ప ప్రణాళికాబద్ధ నగరమని, మరోసారి దానిని సందర్శించాలన్న ఆసక్తి ఉందని.. త్వరలోనే వెళ్తానని తెలిపారు. జార్జ్ మైఖేల్ -
కూరగాయల మార్కెట్ వద్ద భారీ పేలుడు
-
కూరగాయల మార్కెట్ వద్ద భారీ పేలుడు
- 11 మంది దుర్మరణం, 35 మందికి తీవ్రగాయాలు - బాగ్దాద్లో మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ శివారు సదర్ పట్టణంలో మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. అక్కడి ప్రధాన కూరగాయ మార్కెట్పై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో కనీసం 11 మంది దుర్మరణం చెందారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతాదళం అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. సదర్ నగరంలోని జమీలా మార్కెట్ ప్రధాన గేటు వద్ద ఈ సంఘటన జరిగింది. పేలుడు పదార్థాలు నింపిన కారును నడుపుకుంటూ ఉగ్రవాది.. మార్కెట్లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే అప్రమత్తమై, కారు ఆపాల్సిందిగా హెచ్చరించాడు. ఎంతకీ వినకపోవడంతో కారుకు గురిపెట్టి కాల్పులు జరిపాడు. అంతలోనే కారులో ఉన్న ఉగ్రవాది తననుతాను పేల్చేసుకున్నాడు. భారీ శబ్ధం, దుమ్ము ఎగిసిపడటంతో కొద్ది నిమిషాలపాటు అక్కడ అల్లకల్లోల పరిస్థితి తలెత్తింది. పేలుడు ధాటికి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. షియాలు అధికంగా నివసించే సదర్ ప్రాంతంలో కొత్త సంవత్సరంలో చోటుచేసుకున్న రెండో దాడి ఇది. జనవరి 2న ఇదే పట్టణంలో ఐసిస్ జరిపిన పేలుళ్లలో 35 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నేటి ఘటనకు బాధ్యతవహిస్తున్నట్లు ఎవ్వరూ ప్రకటించనప్పటికీ, ఇది ముమ్మాటికి సున్నీ తీవ్రవాదుల పనే అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
బాగ్దాద్ లో మరో మారణ హోమం
బాగ్దాద్: కారు బాంబు దాడితో ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి దద్దరిల్లింది. కారు బాంబులో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చి వేసుకోవడంతో 17 మంది మృతి దుర్మరణం చెందారు. పదులమంది తీవ్ర గాయాల పాలైనట్లు పోలీసులు తెలిపారు. బాధితులంతా కూడా దినసరి కూలీలు, శ్రామికులు అని వారు వెల్లడించారు. బాగ్దాద్కు ఈశాన్యంలోని సదర్ నగరంలోని ఓ చోట ప్రతి రోజు కూలి పనులకు వెళ్లేందుకు పెద్దమొత్తంలో గుమికూడి ఉంటుంటారు. వీరిని లక్ష్యంగా చేసుకొని ఓ ఉగ్రవాది కారు నిండా బాంబులతో వెళ్లి ఆత్మాహుతి దాడికి దిగాడు. ఒక్కసారిగా వారి మీదకు తీసుకెళ్లి కారుతో సహా పేల్చేసుకున్నాడు. దీంతో 17మంది శ్రామికులు అక్కడికక్కడే మృత్యువాతపడగా 39మంది గాయాలపాలయ్యారు. గత మూడు రోజుల్లో ఇది రెండో అతిపెద్ద దాడి. శనివారం సెంట్రల్ బాగ్దాద్లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో 27మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం జరిగిన బాంబు దాడిని తామే చేశామని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే, గతంలో జరిగిన బాంబు దాడులన్నీ కూడా ఇస్లామిక్ స్టేట్ జరిపిన విషయం తెలిసిందే. -
బాంబు పేలుళ్లు : 19 మంది మృతి
బగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నిత్యం రద్దీగా ఉండే సెంట్రల్ బాగ్దాద్ మార్కెట్ ప్రాంతంలో శనివారం రెండు బాంబులు పేలాయి. ఈ ఘటనలో 19 మంది వరకు మరణించగా, 43 మంది ప్రజలు గాయపడ్డట్టు ఇరాక్ పోలీసులు తెలిపారు. ఉదయం పూట రద్దీగా ఉండే ఆల్-సైనిక్ ప్రాంతంలోని దుకాణాల వద్ద ఈ బాంబు పేలుళ్లు సంభవించాయని పోలీసులు పేర్కొన్నారు. వీటిలో ఒకటి ఆత్మాహుతి దాడిగా అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇరాక్ అంతర్యుద్ధం తారస్థాయికి చేరుకోవడంతో అక్టోబర్ 17 నుంచి బాగ్దాద్లో హైఅలర్ట్లో ఉంది. గత కొన్ని నెలలుగా జిహాదిస్ట్ గ్రూప్ బాగ్దాద్లో పలు ఘటనలకు పాల్పడుతూ ఇరాక్ను దద్దరిలిస్తోంది. అయితే శనివారం దాడి ఎవరి చేశారన్నది ఇంకా తెలియరాలేదు. దాడులకు బాధ్యులుగా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. -
ఉగ్రవాదుల దాడిలో 24 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు. మోసుల్ పట్టణంలోని సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని శనివారం దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 24 మందిని హతమార్చినట్లు ప్రెస్ టీవీ వెల్లడించింది. కాగా.. శుక్రవారం ఖయ్యరా ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ జరిపిన రెండు కారు బాంబు దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా.. 29 మంది గాయపడిన విషయం తెలిసిందే. మోసుల్కు దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖయ్యరాను ఇరాకీ సేనలు ఆగస్టు చివర్లో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అనంతరం ఆపరేషన్ మోసుల్ను చేపట్టిన ఇరాకీ సేనలకు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురౌతుంది. ప్రస్తుతం మోసుల్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోందని ఇరాక్కు చెందిన అల్మాడా ప్రెస్ వెబ్సైట్ వెల్లడించింది. -
ట్రక్కు బాంబుతో గ్యాస్ స్టేషన్పైకి..
-
గ్యాస్ స్టేషన్పై ట్రక్కు బాంబుతో దాడి.. 80 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పశ్చిమ బాగ్దాద్లోని గ్యాస్ స్టేషన్పై ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడు ట్రక్కు బాంబుతో దాడి చేయడంతో భారీ మొత్తంలో ప్రాణనష్టం చోటుచేసుకుంది. 80మందికిపైగా మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారందరూ షియా భక్తులే. పవిత్ర షియా నగరం కర్బాలా నుంచి వస్తుండగా ఉగ్రవాది ట్రక్కు బాంబుతో విరుచుకుపడ్డాడు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ‘పశ్చిమ బాగ్దాద్ లోని గ్యాస్ స్టేషన్ పై మేం దాడి చేశాం’ అంటూ ఇస్లామిక్ స్టేట్ స్వయంగా ప్రకటించింది. -
బాగ్దాద్ డాక్టర్ అంటూ భారీ మోసం
హైదరాబాద్ : వెబ్సైట్ వేదికగా బాగ్దాలో ప్రముఖ డాక్టర్గా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు నగరానికి చెందిన ఓ లెక్చరర్కు ఎర వేశాడు. 'ఖరీదైన పార్శిల్' పేరు చెప్పి రూ.34.5 లక్షలు దండుకున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి నగరంలోని బేగంపేటలో ఉన్న ఓ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తోంది. ఆమె ఈ ఏడాది ఓ మాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకుంది. ఈ ప్రొఫైల్ను లైక్ చేసిన ఓ వ్యక్తి..ఆమెతో సంప్రదింపులు ప్రారంభించాడు. ఆన్లైన్ చాటింగ్ ద్వారా తాను బాగ్దాద్లో పనిచేస్తున్న ప్రముఖ వైద్యుడినంటూ పరిచయం చేసుకున్నాడు. అనంతరం వివాహానికి సమ్మతమంటూ సందేశం ఇచ్చాడు. పెళ్ళి కోసం అక్కడ నుంచి తిరిగి వచ్చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. పూర్తిగా ఆ మాయగాడి మాటల వల్లో పడిన ఆ యువతి అవన్నీ నిజమని నమ్మారు. తాను బాగ్దాద్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే హైదరాబాద్లో భారీ ఆస్పత్రి నిర్మాణం చేపడతానని, అందుకు అవసరమైన నిధులు తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తాను రావడానికి ముందే తన వద్ద ఉన్న డబ్బును వజ్రాలు, బంగారం రూపంలోకి మార్చి ఎయిర్ కార్గో పార్శిల్ రూపంలో పంపిస్తున్నానంటూ నమ్మబలికాడు. ఈ ఏడాది మర్చిలో ఓ పార్శిల్ను పంపించానంటూ సందేశం ఇచ్చాడు. ఇది జరిగిన రెండుమూడు రోజులకు ముంబై నుంచి కస్టమ్స్ అధికారి చేస్తున్నట్లు బాధితురాలికి ఓ ఫోన్ వచ్చింది. బాగ్దాద్ నుంచి భారీ పార్శిల్ వచ్చిందంటూ చెప్పిన సదరు అధికారి.. దాన్ని క్లియర్ చేయడానికి పన్ను రూపంలో కొంత చెల్లించాలంటూ చెప్పారు. ఆ యువతి ఆ మాటలు నమ్మడంతో ఓ బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చి అందులో నగదు డిపాజిట్ చేయించారు. ఇలా దాదాపు మూడు నెలల పాటు వివిధ ఫోన్ నంబర్ల నుంచి అనేక విభాగాల పేర్లతో ఫోన్లు రావడం, బాధితురాలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేయడం జరిగింది. మొత్తమ్మీద పది బ్యాంకు ఖాతాల్లో రూ.34.5 లక్షలు డిపాజిట్ చేసిన లెక్చరర్ చివరకు తాను మోసపోయానని గ్రహించింది. దీంతో సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన అధికారులు బాధితురాలు నగదు డిపాజిట్ చేసిన పది బ్యాంకు ఖాతాలు గుజరాత్, ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి సైబర్ నేరగాళ్ళు బ్యాంకు ఖాతాలను బోగస్ వివరాలు, నకిలీ చిరునామాలతోనో, దళారుల్ని ఏర్పాటు చేసుకునే తెరుస్తారని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితుల్ని గుర్తించడానికి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. వివిధ మాట్రిమోనియల్ సైట్స్లో ఉన్న వ్యక్తుల ప్రొఫైల్స్ను చూసిన వెంటనే నమ్మవద్దనీ, ఎవరినీ నేరుగా కలవకుండా, పూర్వాపరాలు పరిశీలించకుండా వ్యక్తిగత వివరాలు చెప్పడం, నగదు డిపాజిట్ చేయడం, ఆర్థిక లావాదేవీలు వద్దని హెచ్చరిస్తున్నారు. -
ఇరాక్లో కారు బాంబు దాడి.. ఏడుగురు మృతి
-
ఇరాక్లో కారు బాంబు దాడి.. ఏడుగురు మృతి
ఉగ్రవాదులు కారు బాంబుతో దాడికి పాల్పడటంతో దాదాపు 7 మంది మృతిచెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత జూలైలో బాంబు దాడి జరిగి 300కు పైగా ప్రాణాలను బలిగొన్న ఏరియాకు సమీపంలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. సోమవారం అర్ధరాత్రి కారు బాంబు పేల్చివేయడంతో దాదాపు ఏడుమంది వ్యక్తులు దుర్మరణం పాలవ్వగా, 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అబ్దెల్ మజీత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమీపంలోని కొన్ని షాపులు దగ్ధమయ్యాయి. ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ఈ చర్యకు బాధ్యత వహించలేదని ఇరాక్ అధికారులు వివరించారు. ఐఎస్ఎస్ ఉగ్రసంస్థ గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిందని అధికారులు చెప్పారు. -
బాంబులతో దద్దరిల్లిన బాగ్దాద్
బాగ్దాద్: ఇరాక్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాగ్దాద్ ఉత్తర ప్రాంతం బొలాడ్లోని షీతే ప్రర్ధనామందిరం వద్ద ఉగ్రవాదులు గురువారం రాత్రి ఆత్మాహుతి దాడులకు పాల్పడి.. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 30 మందికి పైగా మృతి చెందగా.. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సహాయక బలగాలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. ఉగ్రదాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కాగా, ఆదివారం బాగ్దాద్లోని రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 185కు పెరిగిందని అధికారులు వెల్లడించారు. వరుస బాంబు పేలుళ్లపై ఇరాక్లో తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి. -
రంజాన్ మాసం.. రక్తసిక్తం
ముస్లింలు నిష్టగా దీక్షలు, భక్తితో ప్రార్థనలు, హృదయంతో దానాలు చేసే పవిత్ర రంజాన్ మాసం రక్తసిక్తంగా మారింది. ఖలీఫా(మతరాజ్యం) స్థాపన పేరుతో హింసోన్మాదాన్ని నానాటికీ విస్తరింపజేస్తోన్న ఉగ్రవాద సంస్థ ఐసిస్.. ఈ ఏడాది రంజాన్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా 800 మందిని అతి దారుణంగా చంపేసింది. భూగోళంలోని దాదాపు అన్ని దేశాల్లో ఐసిస్ నరమేధం కొనసాగుతోంది. ఐసిస్ మూలాలున్న ఆసియా నుంచి ఐరోపా వరకు.. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసుకునే రంజాన్ మాసంలో బీభత్సం సృష్టించడం ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థలకు కొత్తకాకపోయినా ఈ ఏడాది మారణహోమంలో బలైన అమాయకుల సంఖ్య భారీగా ఉండటం విషాదం. ముస్లింలోనే సున్నీ వర్గానికి చెందిన సాయుధులు ఏర్పాటుచేసిన ఐసిస్.. తమ మత భావనలను వ్యతిరేకించే షియాలపై ఎడతెగని దాడులు చేస్తోంది. ఒక్క షియాలేకాక ముస్లింలలోని ఇతర వర్గాలు, ఇతర మతస్తులను సైతం కర్కషంగా చంపేస్తోంది. దాడులకు మిగతా సమయంలో కంటే రంజాన్ మాసమే అనువైనదని ఐసిస్ భావిస్తోంది. ఎందుకంటే సాధారణ దినాల్లోకంటే పవిత్రమాసంలో ప్రతి ముస్లిం విధిగా మసీదుకు వెళతాడు. అలా గుంపుగా చేసిన జనాన్ని చంపడం ద్వారా ఐసిస్ తన లక్ష్యాన్ని సులువుగా నెరవేర్చుకుంటుంది. రంజాన్ మాసంలోని నాలుగు వారాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టిన ఐఎస్.. అమెరికా, ఫిలిప్పీన్స్, యెమెన్, జోర్డాన్, ఇరాక్, లెబనాన్, బంగ్లాదేశ, టర్కీలతో పాటు ఇన్నాళ్లూ మిత్రదేశంగా ఉన్న సౌదీ అరేబియాపై సైతం దాడులు చేసి మొత్తం 800 మందిని అమాయకులను పొట్టనపెట్టుకుంది. రంజాన్ పండుగకు మరో 48 గంటలు సమయం ఉండటంతో ఈ లోపు ఐసిస్ మరింత బీభత్సం సృష్టించే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్ లో ఐసిస్ మాడ్యూల్ ను గుర్తించి, భారీ కుట్రను ముందుగానే భగ్నం చేసిన పోలీసులు.. రంజాన్ పర్వదిన వేడుకలు ముగిసేంతవరకు అప్రమత్తతను ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు మిగతా దేశాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొత్త తరహా దాడులతో ఐసిస్ రెచ్చిపోతూనేఉంది. ఈ ఏడాది రంజాన్ మాసం జూన్ 7న ప్రారంభమైంది. అదేరోజు ఇరాక్ లోని మౌసూల్ పట్టణంలోగల ఓ మసీదుపై ఐసిస్ ఉగ్రవాదులు దాడిచేసి 65 మంది షియాలను పొట్టనపెట్టుకున్నారు. వారం తర్వాత, అంటే జూన్ 14న అమెరికాలోని ఓర్లాండో నైట్ క్లబ్ లో ఐసిస్ ఉగ్రవాది మతీన్ 50 మందిని దారుణంగా కాల్చిచంపాడు. జులై 1న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఒక భారతీయురాలు సహా 20 మందిని చంపేశారు. ఇది జరిగిన కొద్ది గంటలకే బాగ్ధాద్ నగరంలోని షాపింగ్ సెంటర్ లో చోటుచేసుకున్న పేలుళ్లలో 200 మంది మృత్యువాతపడ్డారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవానికి వ్యతిరేకంగా జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిరిగి జులై 4న ముస్లింల రెండో అతిపెద్ద పవిత్ర క్షేత్రం మదీనాలో ఉగ్రదాడి జరిగింది. ఆత్మాహుతి దాడి కారు పార్కింగ్ ప్రదేశంలో జరిగిందికాబట్టి ప్రాణనష్టం తక్కువైంది. అదే జనసమ్మర్థ ప్రదేశంలో జరిగి ఉండేదుంటే ఘోరం ఊహించని విధంగా ఉండేది. ఇవి కాక ఇరాక్, సిరియాల్లో ఐసిస్ దాదాపు 400 మందిని పొట్టనపెట్టుకున్నట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రపంచమంతా ఒక్కటై ఐసిస్ ను నిరోధించకుంటే భవిష్యత్ లో 'రంజాన్ మాసపు సామూహిక ప్రార్థనలు' అని చదువుకోవాల్సి వస్తుందేమో! -
బాంబు పేలుళ్లు.. 165 మంది మృతి
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇరాక్ లో నరమేధం సృష్టించారు. శనివారం అర్థరాత్రి సమయంలో రాజధాని బాగ్దాద్లో వరుస బాంబు పేలుళ్లతో రాక్షసకాండ సాగించారు. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ముష్కర మూక బాంబు దాడులకు తెగబడింది. రద్దీగా ఉన్న వాణిజ్య సముదాయాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడుల్లో 165 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య 125గా బీబీసీ పేర్కొంది. ఎంత మంది మృతి చెందారనేది ఇరాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. రంజాన్ మాసం సందర్భంగా షాపింగ్ మాల్స్ ప్రాంతాలు రద్దీగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్రాడ ప్రాంతంలో జరిగిన మొదటి దాడిలో ఉగ్రవాదులు రిఫ్రిజిరేటర్లు, కారులో పేలుడు పదార్దాలను నింపి పేల్చివేశారు. ఈ ఘటనలో వంద మందిపైగా మందికి పైగా మృతి చెందారు. భారీ పేలుడు దాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా మృతదేహాలతో ఈ ప్రాంతమంతా భీతావహంగా మారింది. అల్ షాబ్ ప్రాంతంలోని మార్కెట్ వద్ద జరిగిన కారుబాంబు దాడిలో ఐదుగురు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన ప్రధాని హైదర్ అల్-అబాదిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నుంచి ఫాజుల్లా నగరాన్ని ఇరాక్ బలగాలు స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. -
బాగ్దాద్ లో బాంబుపేలి 22 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ రక్తసిక్తమైంది. రెండు చోట్ల జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 22 మంది మృతి చెందారు. మరో 70 మంది గాయపడ్డారు. బాగ్దాద్ లోని వాణిజ్య ప్రాంతంమైన అల్ జదీదాలో పేలుడు పదార్థాలతో కూడిన కారును పేల్చడంతో 15 మంది మృతి చెందగా50 మంది గాయపడ్డారు. మరో కారు బాంబును ఉత్తర బాగ్దాద్ లోని తజీలో ఉన్న ఆర్మీ చెక్ పోస్ట్ ను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డారు. ఇందులో ఏడుగురు సైనికులతో సహా 20 మంది గాయపడ్డారు.బాగ్దాద్ లోని ఉగ్రవాదులను చెదరగొడుతున్న సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపినట్టు పోలీసు అధికారి వెల్లడించారు. -
బాగ్దాద్లో పేలుళ్లు: 18 మంది మృతి
బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం మంగళవారం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా... 50 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. బాగ్దాద్ నగరం ఉత్తర ప్రాంతమైన షబాబ్లో ఓ మహిళ జరిపిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించారు. అలాగే రషీద్ ప్రాంతంలో కారు బాంబు పేలుడులో మరో ముగ్గురు మరణించారని చెప్పారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని తెలిపారు. కాగా ఇరాక్లో గత కొన్ని రోజులుగా ఇస్లామిక్ స్టేట్ జిహాద్ గ్రూప్ ఇటువంటి దాడులకు పాల్పడుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ సంస్థే ఈ దారుణానికి పాల్పడి ఉండ వచ్చని సందేహం వ్యక్తం చేశారు. సదరు సంస్థ గత ఆరు రోజులుగా జరిపిన బాంబు పేలుళ్లలో 100 మంది దుర్మరణం పాలైయ్యారని పేర్కొన్నారు. గత గురువారం ఉత్తర బాగ్దాద్లో కారు బాంబు పేలి.. 94 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
కారుబాంబు దాడిలో 24 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. బాగ్దాద్ ఆగ్నేయ ప్రాంతంలో జరిగిన కారుబాంబు దాడి ఘటనలో కనీసం 24 మంది మరణించగా, మరో 35 మంది గాయపడినట్టు ఆస్పత్రి వర్గాలు, పోలీసులు చెప్పారు. షియా వర్గీయులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని స్థానిక పోలీసులు చెప్పగా, భద్రత బలగాలు మాత్రం దుండగులు ఓపెన్ ఎయిర్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. ఈ దాడికి బాధ్యులు ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. కాగా షియాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గతంలో ఇలాంటి దాడులకు పాల్పడ్డారు. -
రెస్టారెంట్లోకి వెళ్లి పేల్చేసుకున్నాడు
బాగ్దాద్: ఇరాక్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆత్మాహుతి దాడికి పాల్పడి 14మంది ప్రాణాలు బలితీసుకున్నారు. దికార్ ప్రావిన్స్లోని ఓ రెస్టారెంట్లో ఈ దాడికి పాల్పడటంతో దాని గోడలన్నీ కూడా రక్తపు చారకలతో నిండిపోయాయి. 14మంది మృతదేహాలు చిద్రంగా మారాయి. మరో 27మంది తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో కాళ్లు చేతులు పూర్తిగా తెగిపోయినవారు కూడా ఉన్నారు. బాగ్దాద్ను కలిపి ఉండే ప్రధాన రహదారిపై ఉన్న రెస్టారెంటును లక్ష్యంగా చేసుకొని అనూహ్యంగా ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి దిగాడని పోలీసులు తెలిపారు. అయితే, ఏ సంస్థకు చెందిన ఈ దాడికి దిగిందో మాత్రం ఇంకా తెలియరాలేదు. -
బాగ్దాద్లో బాంబు పేలుళ్లు.. 70మంది దుర్మరణం
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో రెండు బాంబు పేలుళ్ల ఘటనలో మృతిచెందినవారి సంఖ్య సోమవారానికి 70 కి చేరగా, 100 మంది వరకు గాయపడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. బాగ్దాద్లోని షిటే జిల్లా రెదీ మార్కెట్లో ఆదివారం నిర్వహించిన బహిరంగ మార్కెట్.. రెండు బాంబు పేలుళ్ల ఘటనతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. మార్కెట్లో ముందుగా పేలుడు జరిగిందని, కొద్దిసేపటికి అదే మార్కెట్లో ఓ ఆత్మాహుతి బాంబర్ పేల్చేసుకోవడంతో మార్కెట్ భీతావహంగా మారిందని పోలీసులు చెప్పారు. బాగ్దాద్కు దక్షిణంగా ఉన్న మహమౌదియా పట్టణంలో జరిగిన మరో బాంబుపేలుడు ఘటనలో ముగ్గురు చనిపోయారు. -
ఇరాక్లో పేలుళ్లు.. 59 మంది మృతి
బాగ్దాద్: ఆదివారం నిర్వహించే బహిరంగ మార్కెట్లో రెండు బాంబు పేలుళ్లతో ఇరాక్లోని షిటే జిల్లా రెదీ మార్కెట్ దద్దరిల్లింది. ఈ ఉగ్రదాడిలో 59 మంది పౌరులు మృతిచెందగా, 62 మంది గాయపడ్డారు. మార్కెట్లో ముందుగా పేలుడు జరిగిందని, కొద్దిసేపటికి అదే మార్కెట్లో ఓ ఆత్మాహుతి బాంబర్ పేల్చేసుకోవడంతో మార్కెట్ భీతావహంగా మారిందని పోలీసులు చెప్పారు. బాగ్దాద్కు దక్షిణంగా ఉన్న మహమౌదియా పట్టణంలో జరిగిన మరో బాంబుపేలుడు ఘటనలో ముగ్గురు చనిపోయారు. డోరా పట్టణంలో జరిగిన మరో పేలుడు ఘటనలో నలుగురు మృతిచెందారు. -
ఔను.. మా వాళ్లు కిడ్నాప్ అయ్యారు
బాగ్దాద్: అమెరికా పౌరులు ఇటీవల ఇరాక్లో కిడ్నాప్కు గురయ్యారు. ఈ విషయాన్ని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం ఆదివారం దృవీకరించింది. 'పలువురు అమెరికన్లు కిడ్నాప్కు గురయ్యారు. వారు ఎక్కడున్నారో గుర్తించి, రక్షించడానికి ఇరాక్ అధికారుల సహకారంతో ముందుకుపోతున్నాం' అని రాయబార కార్యాలయ అధికారి ప్రకటించారు. అయితే ఎంతమంది కిడ్నాప్కు గురయ్యారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ముగ్గురు అమెరికన్ కాంట్రాక్టర్లు, ఓ ఇరాకీ ట్రాన్స్లేటర్ బాగ్దాద్ దక్షిణ ప్రాంతంలో శుక్రవారం కిడ్నాప్కు గురైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయం ఈ ప్రకటన చేసింది. విదేశాల్లో ఉన్నటువంటి అమెరికా పౌరుల రక్షణ, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి జాన్ కిర్బీ తెలిపారు. ఐఎస్ ఉగ్రవాదులే ఈ కిడ్నాప్కు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. -
షాపింగ్ మాల్ పై ఉగ్రదాడి
-
షాపింగ్ మాల్ పై ఉగ్రదాడి
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. భారీ ఆయుధ సామాగ్రతో నగరంలోని అల్ జవహర్ షాపింగ్ మాల్ లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. సోమవారం రాత్రి ప్రారంభమైన ఈ మారణకాండలో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులు సహా సహా ఏడుగురు మరణించగా, 30 మందికిపైగా గాయపడ్డారు. ఉగ్రవాదులు మరో 100 మందిని మాల్ లోపల బందీలుగా పట్టుకున్నారు. 'తొలుత షాపింగ్ మాల్ ఎదుట కారు బాంబును పేల్చిన దుండగులు లోనికి ప్రవేశించి కాల్పులు జరిపి పలువురిని బందీలుగా చేసుకున్నారని, బందీల్లో అత్యధికులు మహిళలేనని సైనికాధికారులు వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒంటినిండా బాంబులు ధరించిన దాదాపు 20 మంది ఉగ్రవాదులు మాల్ లోపల ఉన్నారు. వారిలో కొందరు మాల్ పై భాగంలో నక్కి.. బందీలను విడిపించేందుకు లోపలికి వెళ్లజూసిన పోలీసులను పైనుంచి కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఇరాక్ ప్రత్యేక రక్షక బలగాల ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
26మందిని కిడ్నాప్ చేసిన సాయుధులు
బాగ్దాద్: గుర్తు తెలియని కొందరు సాయుధులు 26 మంది ఖతారి హంటింగ్ పార్టీకి చెందిన సభ్యులను కిడ్నాప్ చేశాడు. ఈ విషయాన్ని ఇరాక్ అధికారులు స్పష్టం చేశారు. ఇలా విదేశాలకు చెందినవారు అక్కడ కిడ్నాప్కు గురికావడం గడిచిన మూడు నెలల్లో ఇది రెండోసారి. ముథానా ప్రావిన్స్లో బుధవారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు చెప్పారు. అయితే, వారు ఏ దేశాలకు చెందిన సభ్యులు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, కిడ్నాప్ చేసిన సాయుధుల వివరాలు కూడా ఇంకా తెలియరాలేదని అన్నారు. తెల్లవారు జామున అనూహ్యంగా చాలా ట్రక్కుల్లో ఆయుధాలతో వచ్చిన సాయుధులు ఖతారి హంటింగ్ సభ్యులను చేరుకొని వారిని ఎత్తుకెళ్లిపోయారని వివరించారు. ఈ సభ్యులకు రక్షణగా ఉన్న ఇద్దరు ఇరాక్ అధికారులను కూడా సాయుధులు కిడ్నాప్ చేసినట్లు చెప్పారు. అయితే, దోహా మాత్రం ఈ విషయాన్ని ఇంకా ఆమోదించలేదు. కిడ్నాప్ చేసినవారి డిమాండ్లు ఏమిటనే విషయం ఇంకా తెలియరాలేదు. -
మసీదుపై ఆత్మాహుతి దాడి
బాగ్దాద్: ఇరాక్ లో ఓ ఉగ్రవాది ఘోర మారణకాండకు దిగాడు. రాజధాని బాగ్దాద్ లో ఓ షియా మసీదు ప్రాంగణంలో ఆత్మాహుతిదాడికి పాల్పడటంతో ఎనిమిది మంది పౌరులు ప్రాణాలుకోల్పోగా .. 19మందికి తీవ్ర గాయాలయ్యాయి. మసీదు ప్రాంగణం రక్తపు చారీకలతో నిండిపోయింది. అయితే, ఈ దాడిని ఎవరు చేశారనే విషయం ఇంకా తెలియరాలేదు. ఇరాక్ అధికారులు మాత్రం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఇలాంటి ఆత్మాహుతి దాడులకు పాల్పడతారని చెప్తున్నారు. సాధారణంగా షియా వర్గం ముస్లింలనే ఎప్పుడూ ఇస్లామిక్ స్టేట్ లక్ష్యంగా చేసుకొని వారి సమూహం ఎక్కడ ఉంటే అక్కడ ఆత్మాహుతి దాడులకు పాల్పడుతుంటుంది. గత ఏడాది బాగ్దాద్ లోని పెద్దమొత్తం ప్రాంతాన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆక్రమించుకోగా ఇరాక్ సేనలు చాలాకాలం ప్రతిఘటించి తిరిగి వారిని తిప్పి కొట్టారు. అప్పటి నుంచి జనరద్దీ ప్రాంతాలను, షియాలు ప్రార్ధనలు చేసే మసీదులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారు. -
'నిజమే.. స్మగ్లింగ్ టర్కీ నుంచే జరుగుతుంది'
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పెద్ద మొత్తంలో ఆయిల్ ను టర్కీ నుంచే దొంగ రవాణా చేస్తుందని ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాది అన్నారు. దీనిని ఎలాగైనా ఆపాలని, వారిని నియంత్రించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు. ఇటీవల రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చి వేసిన అనంతరం టర్కీ ప్రధాన వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ కు సహకరించాలనే ఉద్దేశంతోనే సిరియా సరిహద్దుల్లో ఉన్న తమ విమానాన్ని కూల్చివేశారని రష్యా టర్కీపై ఆరోపణలు చేయగా మరో అగ్రరాజ్యం ఆ మాటలను పరోక్షంగా కొట్టి వేసింది. ఇస్లామిక్ స్టేట్ కు టర్కీకి సంబంధాలు ఉన్నట్లు తమ పరిశీలనలో వెల్లడికాలేదని, ఆధారాలు కూడా లభ్యంకాలేదని చెప్పింది. ఈ వ్యాఖ్యలు రష్యాకు ఆగ్రహం తెప్పించగా రష్యాకు మద్దతుగా తాజాగా టర్కీపై ఇరాక్ ఆరోపణలు చేసింది. బాగ్దాద్ పర్యటనకు జర్మన్ కు చెందిన విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్ మీర్ వచ్చిన నేపథ్యంలో ఆయనతో సమావేశమైన అబాది ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ స్టేట్ కు భారీ మొత్తంలో ఆయిల్ స్మగ్లింగ్ టర్కీ ద్వారానే జరుగుతుందని, దానిని నిలువరించగలిగితే కొంత సమస్య తీరినట్లేనని చెప్పారు. -
ఆత్మాహుతి దాడిలో 17 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని బాగ్దాద్లో శుక్రవారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 17 మంది మృతి చెందగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడినట్లు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే ఇది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బాగ్దాద్ నైరుతి ప్రాంతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పోరులో మరణించిన వారి ఙ్ఞాపకార్థం నిర్వహిస్తున్న కార్యక్రమంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. షియా వర్గానికి చెందిన సమూహాలపై ఈ మధ్యకాలంలో ఐఎస్ఐఎస్ దాడులు పెరిగిపోతున్నాయనీ, ఈ డాడి కూడా అందులో భాగమేనని ఇరాక్ అధికారులు వెల్లడించారు. -
ఆత్మాహుతి దాడుల్లో 15 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో గురువారం జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో కనీసం 15 మంది మృతి చెందారు. సెంట్రల్ బాగ్దాద్ లోని వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న పోలీసు చెక్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. బాబ్ అల్-షార్జి ప్రాంతంలో మానవబాంబు జరిపిన దాడిలో 8 మంది పౌరులు, పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. 21 మంది గాయపడ్డారు. అల్-వత్బా స్క్వేర్ వద్ద జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పోలీసులతో సహా ఆరుగురు మృతి చెందారు. 12 మంది క్షతగాత్రులయ్యారు. ఈ దాడులకు తామే బాధ్యులకు ఏ సంస్థా ప్రకటించుకోలేదు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
ట్రక్కుబాంబు బీభత్సం
ఇరాక్లో 67 మంది మృతి బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ భారీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. వేకువజామున నగరంలోని ప్రధాన మార్కెట్ యార్డు రక్తంతో ఎర్రబారింది. ఉగ్రవాదులు ఓ ట్రక్కులో బాంబు పెట్టి పేల్చివేశారు. 67 మందిని పొట్టనపెట్టుకున్నారు. తామే దాడికి పాల్పడ్డామని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు ప్రకటించారు. ఇకపై మరిన్ని దాడుల చేస్తామని హెచ్చరించారు. ముస్లిం జాతి కోసం షియాలపై మరిన్ని బాంబు దాడులు చేస్తామన్నారు. షియా ముస్లిం తెగ ప్రాబల్యం అధికంగా ఉండే ఈ మార్కెట్కు ప్రతి గురువారం ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలుదారులు వస్తుంటారు. ఉదయం కూరగాయలు, పండ్లు, ఇతర సరుకులు రవాణా చేసే పలు ట్రక్కులు మార్కెట్ ప్రాంగణంలోకి వస్తుండగా వాటిల్లో ఒక ట్రక్కు దూసుకువచ్చి ఒక్కసారిగా పేలింది. 67 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 152 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మార్కెట్లోని పలు కార్లు గాలిలోకి ఎగిరిపడ్డాయి. దుకాణాలు బూడిదయ్యాయి. -
'ఆ మారణ హోమం మాదే'
బాగ్దాద్: ఇరాక్లో ట్రక్ బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ముందుముందు ఇలాంటివి చాలా ఉంటాయన హెచ్చరించింది. గురువారం ఉదయం బాగ్దాద్లోని మార్కెట్ ప్రాంతంలో ఓ ట్రక్కు బాంబు పేలుడు సంభవించి మొత్తం 50 మంది ప్రాణాలు కోల్పోగా 200 మంది గాయాలపాలయ్యారు. తొలుత ఈ బాంబు పేలుళ్లకు కారణం ఎవరనే విషయం తేలలేదు. ఈ లోగానే నేరుగా ఇస్లామిక్ స్టేట్ ఆన్ లైన్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ మారణ హోమం చేసింది తామేనని స్పష్టం చేసింది. మృతుల సంఖ్యమరింత పెరిగే అవకాశం ఉంది. -
కారు బాంబు పేలుడు : 120 మంది మృతి!
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని ఖాన్ బని సాద్ ప్రాంతంలో మార్కెట్ వద్ద శుక్రవారం రాత్రి భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 120 మంది మరణించినట్లు తెలుస్తోంది. బాంబు పేలుడు ఘటనలో గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండవచ్చని భద్రత దళాలు వెల్లడించాయి. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని... దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భద్రత దళాలు పేర్కొన్నాయి. ఈ బాంబు పేలుడు దాటికి సమీపంలోని వాహనాలు, షాపులు అగ్నికి ఆహుతయ్యాయని చెప్పారు. బాంబు పేలుడుతో ఖాన్ బని సాద్ ప్రాంతమంతా ఒక్కసారిగా భీతావహంగా మారిందని చెప్పారు. రంజాన్ పండగ సమీపించడంతో మార్కెట్ ప్రాంతమంతా జనాలతో నిండి ఉందని తెలిపారు. మార్కెట్లోని ట్రక్లో బాంబు పేలుడు సంభవించినట్లు చెప్పారు. -
సొంత రాజధానిపై బాంబు జారవిడిచిన సైన్యం
బాగ్దాద్: ప్రాంతంమనది, దేశం మనది అనే విషయం మనకి తెలుస్తుంది తప్ప బాంబులకు తెలియదు కదా! శత్రుదేశాల్లో అయినా.. మాతృదేశాల్లో అయినా పేలిపోవడమే వాటి బాధ్యత. అందుకే విధ్వంసం సృష్టించే వీటిపట్ల ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణనష్టం, ఆస్తి నష్టం చవి చూడాల్సిందే. నిత్యం ఉగ్రవాదులతో పోరాడుతూ వారిని ఎదుర్కొనే క్రమంలో బాంబు దాడులకు దిగే ఇరాక్ సైన్యం చిన్న నిర్లక్ష్యం కారణంగా సొంత రాజధానిలోనే ఓ విధ్వంసాన్ని చూడాల్సి వచ్చింది. బాంబు దాడులకు ఉపయోగించే తమ దేశ సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ఓ బాంబు జారి బాగ్దాద్పై పడి ఏడుగురు మృతిచెందారు. పన్నెండుమందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్మీ విభాగం తెలిపింది. 'సుఖోయ్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఓ బాంబు ఇరుక్కుపోయింది. దానిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా అది జారి బాగ్దాద్లోని జదీదా ప్రాంతంలోగల ఆరు ఇళ్లపై పడింది. దీంతో అక్కడ ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది. రష్యా నుంచే ఇరాక్ ఈ యుద్ధ విమానాలు దిగుమతి చేసుకుంది. -
కారు బాంబు పేలుళ్లు : 19 మంది మృతి
బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగర శివారు ప్రాంతం శనివారం రాత్రి కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో 19 మంది మృతి చెందగా... దాదాపు 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. బాగ్దాద్ పశ్చిమ ప్రాంతంలో వాణిజ్య కేంద్రం వద్ద కారు బాంబు పేలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే దక్షిణ బాగ్దాద్లోని బస్ స్టాప్ వద్ద కారు బాంబు పేలుడులో ముగ్గురు మరణించగా... 15 మంది గాయపడ్డారు. ఇక్కడికి సమీపంలోని మార్కెట్ బయట బాంబుపేలి... ముగ్గురు దుర్మరణం పాలైయ్యారు. షీట్ పట్టణంలోని రెస్టారెంట్స్ వద్ద కారు బాంబు పేలుడు సంభవించగా... నలుగురు మృతి చెందగా...14 మంది గాయపడ్డారు. అయితే ఈ దాడులకు తామే బాధ్యులమంటూ ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. -
పేలిన కారు బాంబులు : 10 మంది మృతి
బాగ్దాద్: కారు బాంబుల పేలుళ్లతో బాగ్దాద్ నగరం గురువారం అర్థరాత్రి దద్దరిల్లింది.ఈ పేలుళ్లలో 10 మంది మరణించగా... 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. మధ్య బాగ్దాద్లోని బాబ్లీ హోటల్ సమీపంలో మొట్టమొదటగా కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఐదు నిముషాల తేడాతో క్రిస్టల్ హోటల్ సమీపంలో మరో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. గత కొనేళ్లుగా జరుగుతున్న విధ్వంసంతో ఇరాక్ దద్దరిల్లుతున్న విషయం విదితమే. ఈ విధ్వంసంలో ఏ ఏడాది మొదటి నుంచి ఇప్పటి వరకు 5,576 మంది పౌరులు మరణించగా, 11,666 మంది మరణించారని యూఎన్ నివేదికలో వెళ్లడించిన సంగతి తెలిసిందే. -
వైమానిక దాడులు: 33 మంది ఐఎస్ తీవ్రవాదులు హతం
బాగ్దాద్: ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని నైనివా ప్రావెన్స్ సింజార్ పట్టణంలో ఇస్లామిక్ తీవ్రవాదులే లక్ష్యంగా సంకీర్ణదళాలు వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 33 మంది ఇస్లామిక్ తీవ్రవాదులు మరణించారని ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నట్లు తెలిపారు. అలాగే తీవ్రవాదులకు చెందిన నాలుగు శిబిరాలతోపాటు ఆరు మిలటరీ వాహనాలు కూడా ధ్వంసమైనాయన్నారు. -
కారు బాంబు పేలుళ్లు: 10 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో 10 మంది మరణించగా... 38 మంది గాయపడ్డారు. క్షతగాత్రలు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పశ్చిమ బాగ్దాద్ మన్షర్ జిల్లా 14వ రమదాన్ వీధిలో రహదారిపై నిలిపి ఉంచిన కారులో బాంబు పేలుడు సంభవించగా... అమిల్లి జిల్లాలోని మరో కారు బాంబు పేలుడు సంభవించింది. అయితే భయ్యా జిల్లాలోని వాణిజ్య ప్రాంతంలో కారులో పేలుడు సంభవించి.. ఓ పౌరుడు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్లో బాంబు పేలుళ్లు, విధ్వంసం కారణంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 5576 మంది పౌరులు మరణించగా, 11666 మంది గాయపడ్డారని యూఎన్ ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పేలుళ్లు సోమవారం చోటు చేసుకున్నాయి. -
మహిళలపై ఐఎస్ఐఎస్ హత్యాచారాలు
బాగ్దాద్ : ఇరాక్లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల నరమేధం కొనసాగుతోంది. కానీ ఆ నరమేధం ఈ సారి సభ్యసమాజం తలదించుకునేలా సాగింది. తమ లైంగికవాంఛ తీర్చలేదని... మహిళలపై తుపాకులు ఎక్కుపెట్టి విచక్షణరహితంగా కాల్చారు. ఆ కాల్పుల్లో ఒకరా ఇద్దరా.. ఏకంగా 150 మంది మరణించారు. మృతుల్లో చిన్నారులు, యువతులు, గర్బవతులు కూడా ఉన్నారు. అందుకు అడ్డు వచ్చిన 91 మంది పురుషులను అతి కిరాతికంగా చంపిశారు. అనంతరం వారందరినీ సామూహికంగా ఖననం చేసినట్లు సమాచారం. ఈ ఘటన ఫాజుల్లా పట్టణంలో చాలా రోజుల క్రితం చోటు చేసుకుందని, ఈ దారుణానికి అల్ అన్బర్ ప్రావిన్స్లోని జీహాదీ నేత అబూ అనాస్ అలి లిబి నేతృత్వంలో వహించారని పాక్ మీడియా కథనాలను ప్రచురించింది. ముస్లిమేతర తెగలలో ముఖ్యంగా యాజిదీ తెగకు చెందిన వారిని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మొదటి నుంచి టార్గెట్ చేస్తున్నారు. జీహాదీలను పెళ్లి చేసుకోవాలని, బానిసల్లా పడి ఉండాలని ఆ వర్గానికి చెందిన మహిళలపై అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. యాజిదీ తెగలో మగవారిని చంపుతూ మహిళలను బానిసలుగా చేస్తున్నారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఆగడాలు తట్టుకోలేక ఫాజుల్లా ప్రాంత ప్రజలు ఇళ్లు విడిచి ఎడారి ప్రాంతాలకు తరలిపోతున్నారని మీడియా ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా వెళ్లిన వారిలో చిన్నారులు చలి తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారని మానవ హక్కుల సంస్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. -
పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్దాద్
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బాగ్దాద్లోని షాబ్ జిల్లాలోని గ్యారేజీలో పార్క్ చేసిన కారులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రత దళాలు క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని భద్రత దళాలు వెల్లడించాయి. అదే జిల్లాలో ప్రయాణికులతో వెళ్తన్న బస్సులో బాంబు పేలింది... ఈ ఘటనలో ఓ పౌరుడితోపాటు ఎనిమిది మంది మరణించారు. ఇటీవల కాలంలో నగరంలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో ఇది ఒకటని భద్రత దళాల ఉన్నతాధికారి వెల్లడించారు. ఇరాక్లో తీవ్రవాదం, విధ్వంసం కారణంగా ఈ ఏడాది మొదటి ఆరునెలలో 5,576 మంది పౌరులు మరణించగా, 11,666 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో వెల్లడించింది. -
బాంబు పేలుడు: అయిదుగురు మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం కారు బాంబు పేలుడుతో దద్దరిల్లింది. మధ్య బాగ్దాద్లోని కర్దా జిల్లాలో నిత్యం జనసమర్థంగా ఉండే ప్రాంతంలో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అయిదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. ఈ నేపథ్యంలో మృతల సంఖ్య మరింత పెరిగి అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇటీవల కాలంలో ఇరాక్లో కారు బాంబు పేలుళ్లు నిత్యకృత్యమైనాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 5576 మంది మరణించారు. 11666 మందికిపైగా గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. -
బాంబు పేలుడు: 14 మంది మృతి
బాగ్దాద్: బాగ్దాద్లోని సదర్ నగరంలో కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మరణించారు. మరో 37 మంది గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో కొందరి పరిస్థతి విషమంగా ఉందని తెలిపారు. మార్కెట్ సమీపంలో పార్క్ చేసి ఉంచిన కారులో ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో మార్కెట్ పరిసర ప్రాంతాలలో జనం రద్దీ అధికంగా ఉందన్నారు. -
బాగ్దాద్లో ఆత్మాహుతి దాడులు.. 13 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఆత్మాహుతి దాడుల్లో కనీసం 13 మంది ప్రజలు మరణించగా, మరో 46 మంది గాయపడ్డారు. బుధవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. న్యూ బాగ్దాద్లోని షియా జిల్లాలో ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలున్న కారుతో పోలీస్ తనిఖీ స్థావరంపై దాడి చేశాడు. ఇదే జిల్లాలో రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్, సినిమా థియేటర్ సమీపంలో మరో ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు. అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి బాగ్దాద్ పర్యటనకు వచ్చిన రోజునే ఈ దాడులు జరిగాయి. -
బాంబు పేలుళ్లు: 32 మంది మృతి
బాగ్దాద్: బాంబు పేలుళ్లతో ఇరాక్ రాజధాని బాగ్దాద్ బుధవారం దద్దరిల్లింది. ఆ పేలుళ్లలో 32 మంది మరణించారు. మరో 108 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ హోం శాఖ మంత్రి గురువారం ఇక్కడ వెల్లడించారు. క్షతగాత్రులు బాగ్దాద్లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. అయితే ఆ బాంబు దాడులకు పాల్పడింది తామేనంటూ ఇంత వరకు ఎవరు ప్రకటించలేదని పేర్కొన్నారు. దేశంలో చెలరేగిన హింస, తీవ్రవాదం వల్ల ఈ ఏడాది జూలై ఒక్క మాసంలోనే దాదాపు 2 వేల మంది పౌరులు మరణించారని ఇరాక్లోని యూఎన్ అసిస్టెన్స్ మిషన్ కార్యాలయం వెల్లడించింది. -
వరుస బాంబు పేలుళ్లు : 18 మంది మృతి
ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్ కారు బాంబులతో దద్దరిల్లింది. నగరంలో శనివారం వివిధ ప్రాంతాల్లో నాలుగు కారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో మొత్తం 18 పౌరులు మరణించారు. మరో 59 మంది పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది మొదటి ఆరునెలలో దేశంలో హింస, తీవ్రవాదాల కారణంగా 5,576 మంది మరణించగా, 11,666 మంది గాయపడ్డారని ఇరాక్లోని యూఎన్ అసిస్టెన్స్ మిషన్, మానవహక్కుల హై కమిషనర్ కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. -
ఇరాక్లో బిక్కు బిక్కు
హెల్ప్లైన్లు ఇవే... ఇరాక్లో యుద్ధం వల్ల వలస కార్మికుల కుటుంబాల సమాచారం తెలుసుకునేందుకు రాజధాని బాగ్దాద్లోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. 009647704444899, 00964770484324 నంబర్లను సంప్రదించాలని భారత రాయబార కార్యాలయ సిబ్బంది ప్రకటన విడుదల చేశారు. రాయికల్ : ఇరాక్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు నాలుగైదు రోజులుగా హోరాహోరీ యుద్ధం జరుగుతుండగా అక్కడి తెలంగాణవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వారిని పనికి వెళ్లనీయకుండా యజమానులు క్యాంపులకే పరిమితం చేస్తున్నారు. రెండు రోజులుగా సెల్ఫోన్, ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో తమ వారి యోగక్షేమాలు తెలియక ఇక్కడ వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల నుంచి 20 వేల మంది కార్మికులు ఉపాధి నిమిత్తం ఇరాక్లోని బాస్రా, బాగ్దాద్, మన్సూరియా ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. యుద్ధ వాతావరణంతో వీరంతా క్యాంపులకే పరి మితమయ్యారు. జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియో జకవర్గాల నుంచి దాదాపు 1000 మంది వరకు ఇరాక్లో ఉంటారు. ఏం జరుగుతోంది? ఇరాక్లో అంతర్యుద్ధం కారణంగా అక్కడ ఉన్న తెలంగాణ ప్రజల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మన వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి కేంద్ర విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపారు. -
నెత్తురోడుతున్న ఇరాక్
* బాగ్దాద్ చేరువలో రెబల్స్ ఇరాక్ సార్వభౌమత్వం * తీవ్ర ప్రమాదంలో ఉందన్న ఐరాస * సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు * తిక్రిత్, మోసుల్ నగరాల్లో చిక్కుకుపోయిన భారతీయులు బాగ్దాద్: ఇరాక్ నెత్తురోడుతోంది. భద్రత బలగాలను, ప్రభుత్వ మద్దతుదారులను ఊచకోత కోస్తూ జీహాదీ తిరుగుబాటుదారులు బాగ్దాద్ దిశగా దూసుకెళ్తున్నారు. పలు ప్రాంతాల్లో జీహాదీలు, ప్రభుత్వ భద్రతాబలగాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇందులో తమదే పైచేయంటూ ఇరు వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే, ‘ఇరాక్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత తీవ్ర ప్రమాదంలో ఉన్నాయ’న్న ఇరాక్లోని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి నికోలాయ్ మ్లదెనోవ్ మంగళవారం చేసిన ప్రకటన సున్నీ తిరుగుబాటుదారులైన ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లెవాంట్(ఐఎస్ఐఎల్)’ దళాల ఆధిక్యతను చెప్పకనే చెబుతోంది. రాజధాని బాగ్దాద్కు 60 కి.మీ.ల చేరువకు చేరుకున్నామని, బాగ్దాద్తో పాటు, షియాల పవిత్రనగరం కర్బలాను త్వరలో స్వాధీనం చేసుకుంటామని తిరుగుబాటుదారులు చెబుతుండగా.. వారిని సమర్థంగా ఎదుర్కొంటున్నామని, గతంలో జీహాదీలు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను కూడా తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నామని ప్రభుత్వ దళాలు ప్రకటిస్తున్నాయి. అయితే, ఇప్పటికే తిక్రిత్, మోసుల్ను స్వాధీనం చేసుకున్న ఐఎస్ఐఎల్ జీహాదీలు.. బాగ్దాద్కు ఉత్తరంగా అనేక ప్రాంతాలపై పట్టు బిగించాయి. షియాలు మెజారిటీగా ఉన్న కిర్కుక్ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాయి. బాగ్దాద్కు దగ్గర్లో ఉన్న బాకుబాను, షియాల ప్రాబల్యం అధికంగా ఉన్న తల్ అఫార్ పట్టణంలో అత్యధిక భాగాన్ని జీహాదీలు అధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటుదారుల బాగ్దాద్ ముట్టడిని ఇరాక్ ప్రభుత్వ భద్రతాదళాలు నిలువరించలేవని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, బఖుబా నుంచి తిరుగుబాటుదారులను తరిమేశామని భద్రతాదళాలు తెలిపాయి. ఇరువర్గాల పోరులో తిరుగుబాటుదారులు, భద్రతాదళాలతో పాటు 50 మందివరకు పౌరులు మరణించారని ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. తిరుగుబాటు కారణంగా వేలాదిగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కాగా, సున్నీ తిరుగుబాటుదారులకు సౌదీ అరేబియా మద్దతిస్తోందంటూ ఇరాక్ మంగళవారం ఆరోపించింది. ఇరాక్లోని షియాల ప్రభుత్వం సున్నీల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించిందని, అందుకే ఈ తిరుగుబాటని సున్నీల రాజ్యమైన సౌదీ అరేబియా ప్రకటించిన మర్నాడే ఇరాక్ ఈ ఆరోపణలు చేసింది. ఒబామా సమాలోచనలు ఇరాక్ పరిస్థితిపై జాతీయ భద్రతకు సంబంధించిన ఉన్నతస్థాయి సలహాదారులతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం చర్చలు జరిపారు. తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేయాలనే విషయంపై అమెరికా తర్జనభర్జనలు పడుతోంది. బాగ్దాద్లోని తమ ఎంబసీ, అక్కడి అమెరికన్ల భద్రత కోసం 275 మంది సైనిక సిబ్బందిని ఇరాక్కు పంపించింది. ఇరాక్కు మద్దతుగా ఇరాన్తో కలసి సైనిక చర్య చేపట్టే విషయాన్ని యూఎస్ తోసిపుచ్చింది. కానీ ఇరాన్తో ఇరాక్ పరిస్థితిపై వియెన్నాలో చర్చలు జరిపింది. మరోవైపు, పలు దేశాలు తమ దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపించుకుంటున్నాయి. కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన భారత్ న్యూఢిల్లీ: ఇరాక్లోని భారతీయుల భద్రత కోసం న్యూఢిల్లీలో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. అక్కడివారి సమాచారం కోసం +91 11 23012113, +91 11 23014104 నంబర్లలో సంప్రదించవచ్చని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇరాక్లో దాదాపు 10 వేలమంది భారతీయులున్నారు. తిక్రిత్లో కేరళకు చెందిన 46 మంది నర్సులు, మోసుల్లో మరో 40 మంది భారతీయులు చిక్కుకుపోయారు. ఈ రెండు నగరాలు తిరుగుబాటుదారుల అధీనంలోనే ఉన్నాయి. భారత ప్రభుత్వ అభ్యర్థనపై అంతర్జాతీయ రెడ్ క్రెసెంట్ సంస్థ సభ్యులు తిక్రిత్లోని భారతీయ నర్సులతో మాట్లాడారు. వారు క్షేమంగానే ఉన్నారని నిర్ధారించారు. ఆ నగరాల నుంచి వారిని తరలించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తోంది. అలాగే, ఇరాక్లోని హింసాయుత ప్రాంతాల్లో చిక్కుకునిపోయిన భారతీయులను రక్షించేందుకు ఇరాకీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేసే విషయంలో సాధ్యాసాధ్యాలను భారత్ ఆలోచిస్తోంది. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఆదేశాల మేరకు అధికారులు అత్యవసరంగా సమావేశమై ఈ విషయంపై చర్చించారు. ఇరాక్ పరిస్థితిని సుష్మాస్వరాజ్ స్వయంగా సమీక్షిస్తున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. బాగ్దాద్లోని భారత దౌత్యకార్యాలయం ఇరాక్ ప్రభుత్వంతో సంప్రదింపుల్లో ఉందన్నారు. ఎందుకీ సంక్షోభం.. ఇరాక్లో 97% ముస్లింలున్నారు. వారిలో 60% - 65% అరబ్ షియాలుంటారు. 15 నుంచి 20 శాతం అరబ్ సున్నీలుంటారు. దాదాపు 17% కుర్దులుంటారు. ఇరాక్లోని కుర్దుల్లోనూ సున్నీలే అత్యధికులు. ఇరాక్లో షియాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండగా, సున్నీలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. దేశ ఉత్తరప్రాంతంలో కేంద్రీకృతమైన కుర్దులు ప్రస్తుత తిరుగుబాటులో పాలుపంచుకుంటున్నారు. సద్దాంహుస్సేన్ పాలన అనంతరం అమెరికా కనుసన్నల్లో నూరి అల్ మాలికి ప్రధానమంత్రిగా బలహీనమైన షియా అనుకూల ప్రభుత్వం ఇరాక్లో ఏర్పడింది. ఆ ప్రభుత్వం మైనారిటీలైన సున్నీలు, కుర్దుల పట్ల నిర్దయగా, వివక్షాపూరితంగా వ్యవహరించడం ప్రారంభించింది. దాంతో వారిలో అసంతృప్తి పెరిగి, తిరుగుబాటుకు దారితీసింది. వారితో సద్దాంహుస్సేన్ ప్రభుత్వంలోని ఆర్మీ అధికారులు, పక్కదేశం సిరియాలోని తిరుగుబాటుదారులు జతకలిశారు. దాంతో ఇరాక్ మున్నెన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. -
ఇరాక్లో అంతర్యుద్ధం తీవ్రం
బాగ్దాద్కు చేరువైన తిరుగుబాటు దళాలు జీహాదీల స్వాధీనంలో మొసుల్,తిక్రిత్ నగరాలు బాగ్దాద్, కర్బాలాలే తదుపరి లక్ష్యమన్న ఐఎస్ఐఎల్ సద్దాం సైన్యాధికారులతో బలోపేతమైన జీహాదీ దళం బాగ్దాద్/లండన్: ఇరాక్ సంక్షోభం ముదురుతోంది. సోమవారం ప్రారంభమైన అంతర్యుద్ధం శనివారం నాటికి మరింత తీవ్రమైంది. అల్ కాయిదా ప్రభావిత సున్నీ జీహాదీ తిరుగుబాటు దళాలు మొసుల్, తిక్రిత్ నగరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. తిరుగుబాటులో దేశ ఉత్తరప్రాంతంలో బలంగా ఉన్న కుర్దులు కూడా పాలుపంచుకుంటున్నారు. ఉత్తర, ఉత్తరమధ్య ఇరాక్లోని అనేక ప్రాంతాలపై పట్టు సాధిస్తూ బాగ్దాద్ను కైవసం చేసుకునే దిశగా జీహాదీ దళాలు ముందుకు కదులుతున్నాయి. బాగ్దాద్కు అవి కేవలం 100 కి.మీల దూరంలో ఉన్నాయని సమాచారం. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మద్దతుదారులైన ఈ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్ఐఎల్)’ దళాలనుఇరాక్ సైన్యం ఎదుర్కోలేకపోతోంది. షియా గిరిజన యోధులు మాత్రం వారిని కొంతవరకు నిలువరిస్తున్నారు. ఐఎస్ఐఎల్ దళాలను ప్రజలు సాయుధులై కలసికట్టుగా ఎదుర్కోవాలని షియాల అత్యున్నత మత పెద్ద అయోతుల్లా అలీ అల్ సిస్తానీ శుక్రవారం పిలుపునిచ్చారు. సున్నీ జీహాదీలను ఎదుర్కొనేందుకు వేలాది షియాలు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు. అలాగే, షియాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న, సుశిక్షితులైన ప్రభుత్వ దళాలున్న బాగ్దాద్ను కేవలం వేలల్లో ఉన్న జీహాదీ తిరుగుబాటుదారులు కైవసం చేసుకోలేరని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బాగ్దాద్కు ఉత్తరంవైపు ప్రభుత్వ సైనికదళాలు కాపలాను కట్టుదిట్టం చేశాయి. చెక్పోస్ట్లు నిర్మించి, సాయుధులను కాపలాగా పెట్టాయి. కాగా, బాగ్దాద్తో పాటు షియాలకు పవిత్ర నగరమైన కర్బాలాలే తమ తదుపరి లక్ష్యమని ఐఎస్ఐఎల్ ప్రతినిధి అబూ మొహమ్మద్ అల్ అద్నానీ ప్రకటించారు. సున్నీలు, కుర్దులు అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రధానమంత్రి నౌరి అల్ మాలికి ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేని పరిస్థితి నెలకొంది. దళాలు పంపించబోం: అమెరికా, బ్రిటన్ తిరుగుబాటుదారులను అణచివేసేందుకు తమ దేశం నుంచి సైనిక దళాలను పంపించడం లేదని అమెరికా, బ్రిటన్లు స్పష్టం చేశాయి. ఇరాక్ తమకు అత్యంత ముఖ్యమైన దేశం అయినప్పటికీ.. ఆ దేశ సంక్షోభాన్ని ఆ దేశస్తులే పరిష్కరించుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. సైనిక దళాలను పంపించడం కాకుండా.. ఇరాక్ ప్రభుత్వానికి సహకరించే ఇతర మార్గాల గురించి ఆలోచిస్తున్నామని అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. ఇరాక్లో అస్థిరతను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని బ్రిటన్ తెలిపింది. అయితే, ఇరాక్ ప్రభుత్వానికి మద్దతుగా తమ దళాలను ఇరాక్ పంపించడం లేదని స్పష్టం చేసింది. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న, జీహాదీలతో పోరాడుతున్న ఇరాక్ ప్రజలకు రూ. 29.84కోట్ల విలువైన సామగ్రిని బ్రిటన్ పంపిస్తోంది. -
కారు బాంబు పేలి 10 మంది మృతి
ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్లో ఆత్మాహుతి దళ సభ్యుడొకరు కారు బాంబు పేల్చేసుకోవడంతో 10 మంది మరణించగా 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాగ్దాద్లోని తూర్పున ఉన్న సదర్ నగరంలో ఓ మార్కెట్ వద్ద అతడు ఈ కారు బాంబు పేల్చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడు కారణంగా సమీపంలో ఉన్న పలు దుకాణాలు, భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ఈ దాడికి పాల్పడింది తామంటూ ఎవరూ చెప్పుకోలేదు. ఈనెల 30వ తేదీన ఇరాక్లో పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగినట్లు భావిస్తున్నారు. 2011 చివర్లో అమెరికా దళాలు ఇరాక్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ దేశంలో ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. -
కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్దాద్
వరుస కారు బాంబు పేలుళ్లతో ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం బుధవారం దద్దరిల్లింది. బాగ్దాద్ జిల్లా నగరంలో అత్యంత జనసమర్థం ఉండే వివిధ ప్రాంతాలలో కారు బాంబు పేలుళ్ల వల్ల 18 మంది మరణించారు. మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఆగంతకులు జరిపిన కాల్పులలో ఇద్దరు పౌరులు మరణించారు. మరో నలుగరు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బాగ్దాద్ నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. అయితే కారు బాంబు పేలుళ్లకు పాల్పడిందని తామే అని ఇప్పటివరకు ఓ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని పోలీసులు వెల్లడించారు. -
బాగ్దాద్లో జంట పేలుళ్లు.. ముగ్గురి మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో శుక్రవారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో ముగ్గురు మరణించగా పదిమంది గాయపడ్డారు. రోడ్డు పక్కనే ఉన్న రెండు బాంబులు శుక్రవారం నాడు సఫారర్త్ జిల్లాలోని అలీ మసీదు సమీపంలో పేలాయి. పశ్చిమ బాగ్దాద్లోని ఈ ప్రాంతంలో ఎక్కువగా సున్నీ తెగకు చెందిన ముస్లింలు ఉంటారని, పోలీసులు తెలిపారు. శుక్రవారం నాడు ఇమాం అలీ మసీదులో ప్రార్థనలు చేసి బయటకు వస్తున్న సున్నీ ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఈ బాంబుదాడులు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. అయితే దీని గురించిన మరిన్ని వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఇరాక్లో హింసాత్మక సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ వరకు జరిగిన సంఘటనలలో ఏడు వేల మంది ఇరాకీలు మరణించగా 16 వేల మందికి పైగా గాయపడ్డారు. -
ఇరాక్లో బాంబు పేలుళ్లు: 11 మంది మృతి
ఇరాక్లో నిన్న వేర్వేరుగా జరిగిన బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు, ఆగంతకుల తుపాకి కాల్పుల ఘటనల్లో 11 మంది మరణించారని పోలీసులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. మరో 35 మంది గాయపడ్డారని తెలిపారు. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. కాగా క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. మృతులు, గాయపడిన వారిలో భద్రత సిబ్బంది, దేశ పౌరులు ఉన్నారని చెప్పారు. ఇరాక్లో నిత్యం ఎక్కడోఅక్కడ రక్తమోడడం పట్ల యూఎన్ మిషన్ అసిస్టెంట్ మిషన్ ఆఫ్ ఇరాక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు ఇరాక్లో జరిగిన ఆత్మాహుతి దాడులు, పలు బాంబు పేలుళ్లలో 7 వేల మంది దుర్మణం పాలైయ్యారని, అలాగే 16 వేల మంది గాయాలపాలైయ్యారని యూఎన్ మిషన్ అసిస్టెంట్ మిషన్ ఆఫ్ ఇరాక్ తాజా గణాంకాలతో సహా వివరించింది. -
అక్టోబర్ హింసాకాండలో 979 మంది ఇరాకీయులు మృతి
ఇరాక్లోని వివిధ ప్రాంతాల్లో గత నెలలో జరిగిన హింసాకాండలో మొత్తం 979 మంది మరణించారని యూఎన్ అసిస్టెంట్ మిషన్ ఫర్ ఇరాక్ (యూఎన్ఏఎంఐ) శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయా దుర్ఘటనలల్లో మొత్తం19 వందల మంది గాయపడ్డారని తెలిపింది. మృతుల్లో 852 మంది పౌరులు, 127 మంది భద్రత సిబ్బంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. గాయడినవారిలో 1793 మంది పౌరులుకాగ, 109 మంది భద్రత సిబ్బంది ఉన్నారని చెప్పింది. అయితే ఇరాక్ రాజధాని నగరమైన బాగ్దాద్ నగరం విధ్వంసకాండలో అతలాకుతలమైందని వెల్లడించింది. మొత్తం మృతుల్లో సగం మంది బాగ్దాద్ వాసులనే అని పేర్కొంది. అయితే దేశంలో ఏదో ఓ మూల రక్తపాతం జరుగుతునే ఉందని యూఎన్ఏఎంఐ ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో హింసాకాండను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేయాలని దేశ నాయకులకు యూఎన్ఏఎంఐ ఈ సందర్బంగా విజ్ఞప్తి చేసింది. -
ఇరాక్లో ఆత్మాహుతి దాడి, 21 మంది మృతి
ఇరాక్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో కనీసం 21 మంది మరణించగా, మరో 46 మంది గాయపడినట్టు బుధవారం ఆ దేశ భద్రత అధికారులు తెలిపారు. టార్మియా పట్టణంలో మంగళవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఆర్మీ దుస్తులు ధరించి ఓ నాయకుడి నివాసం వద్ద బాంబులు పేల్చుకున్నారు. ఈ సంఘటనలో 14 మంది మరణించగా, 25 మంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో షేక్ సయీద్ జాసిమ్ అనే నాయకుడు ఇచ్చిన విందుకు ఆర్మీ, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరణించినవారిలో ఆయన కుమారుడితో పాటు ఆర్మీ, పోలీసు అధికారులు ఉన్నారు. మరో ప్రాంతంలో పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణ నష్టం జరిగింది. -
ఇరాక్లో కారు బాంబు పేలుడు:14 మంది మృతి
ఇరాక్లోని సమర్రానగరంలో మార్క్ట్ వద్ద నిన్న సాయంత్రం కారు బాంబు పేలుడు సంభవించన ఘటనలో 14 మంది మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు నగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నారు.ఈద్- అల్- అదా పండగ సమీపిస్తున్న నేపథ్యంలో నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు మార్కెట్ వద్ద ఉన్న సమయంలో పేలుడు సంభవించింది. ఆ శబ్దానికి భయపడి ప్రజలు భయంతో పలు వైపులకు పరుగులు తీశారని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. ఇరాక్లో ఇటీవల కాలంలో బాంబుపేలుళ్లు, ఆత్మాహుతి దాడులు నిత్యకృత్యమైపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వివిధ సంఘటనల్లో 6 వేలమంది పౌరులు మరణించారని, 14 వేల మంది గాయపడ్డారని యూఎన్ అసిస్టెన్స్ మిషన్ పేర్కొంది. -
ఇరాక్లో వరుస బాంబు పేలుళ్లు: 27 మంది మృతి
ఇరాక్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. సోమవారం జరిగిన వరుస కారు బాంబు పేలుళ్లలో 27 మంది మరణించగా, మరో 129 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 12 కార్లలో బాంబులు అమర్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం తొమ్మిది చోట్ల బాంబులు పేలాయి. ఇరాక్లో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో హింస చెలరేగుతోంది. ఆదివారం జరిగిన తిరుగుబాటు దాడుల్లో 55 మంది ప్రజలు మరణించారు. జనవరి-ఆగస్టు మధ్య దాదాపు ఐదు వేల మంది పౌరులు మరణించి ఉంటారని అంచనా. -
ఇరాక్ హింసాత్మక ఘటనల్లో 44 మంది మృతి
ఇరాక్లో జరిగిన వివిధ హింసాత్మక ఘటనల్లో 44 మంది మృతి చెందారు. 133 మంది మృతి చెందారని పోలీసులు, అధికారులు తెలిపారు. బాగ్దాద్లోని షాలా ప్రాంతంలో ఉన్న ఓ పాపులర్ కేప్ సమీపంలో రోడ్డు పక్కన బాంబు పేలడంతో 3 ముగ్గురు మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు. దక్షిణ బాగ్దాద్లో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో స్థానిక నాయకుడు, అతడి భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆల్-డెబిస్ ప్రాంతంలో కారు బాంబు పేలడంతో ఇద్దరు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. ఆబు సేదా పట్టణంలో ఇద్దరు రైతులను కాల్చి చంపారు. 12 కారు బాంబు పేలుళ్లతో సహా వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల ఘటనల్లో కనీసం 31 మంది మృత్యువాత పడ్డారు. 95 మంది గాయపడ్డారు. -
ఇరాక్లో హింస: 45 మంది మృతి
ఇరాక్లో నిన్న దేశావ్యాప్తంగా జరిగిన హింసలో 45 మంది మరణించారని, మరో 63 మంది గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఇక్కడ వెల్లడించారు. గాయపడిన క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నిన్న ఉదయం బాగ్దాద్లోని కస్రా ప్రాంతంలో తిమిమి మసీద్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహుతికి పాల్పడ్డాడని, ఆ ఘటనలో 30 మంది మరణించరన్నారు. 55 మంది గాయపడ్డారని తెలిపారు. అలాగే నైనివా ఉత్తర ప్రావెన్స్లో ఆగంతకుడు జరిపిన తుపాకి కాల్పుల్లో నలుగురు సైనికులు మరణించారు. వారిలో ఓ ఆధికారి కూడా ఉన్నారన్నారు. మౌసులలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిపై ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే కుప్పకులారన్నారు. మౌసుల నగరంలోని తూర్పు ప్రాంతంలో నాలుగు మృతదేహలను భద్రత దళాలు కనుగొన్నాయి. మృతదేహాల తలలు, గుండెలపై తుపాకి గుళ్లు తగిలిన అనవాళ్లు ఉన్నట్లు గమనించామన్నారు. బురుజ్ పట్టణం సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. -
ఇరాక్లో కారు బాంబు పేలుళ్లు: 56 మంది మృతి
ఇరాక్లో దాడులు నిత్యకృత్యం అయిపోయాయి. మధ్య, తూర్పు ఇరాక్ ప్రాంతాల్లో వరుసగా నిన్న చోటు చేసుకున్న దాడులల్లో 56 మంది మరణించారని పోలీసులు తెలిపారని స్థానిక మీడియా బుధవారం ఇక్కడ వెల్లడించింది. ఆ దాడుల్లో దాదాపు170 మంది వరకు గాయాలపాలైయ్యారని వివరించింది. వారంతా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించింది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలోనే మంగళవారం సాయంత్రం 12 కారు బాంబు పేలుళ్ల సంభవించాయి. వాటిలో రెండు ఈశాన్య బాగ్దాద్ సమీపంలోని హుస్సేయినీ ప్రాంతంలోని నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ వద్ద పేలాయని తెలిపింది. అలాగే నిత్యం జనసమర్థంగా ఉండే నగరంలోని వివిధ ప్రాంతాల్లో కారు బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయని వివరించింది. అలాగే దక్షిణ బాగ్దాద్లోని అరబ్ జుబొర్ శివారు ప్రాంతంలో ఓ కుటుంబంపై ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో మొత్తం ఐదుగురు మరణించారని పేర్కొంది. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. -
రక్తమోడిన ఇరాక్: 45 మంది మృతి
ఇరాక్ దేశం ఆదివారం బాంబుల మోత, తుపాకుల గుళ్ల వర్షంతో రక్తమోడింది. దాంతో పలు ప్రాంతాల్లో దాదాపు 45 మంది మృతి చెందారు. మరో 113 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాలలోని ఆసుపత్రుల్లో గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. వారిలో కిందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఇరాక్ దేశంలో హింస పెచ్చురిల్లింది. దీంతో బాంబు పేలుళ్లు, తుపాకుల కాల్పులు నిత్యకృత్యమైనాయి. ఈ మేరకు స్థానిక వార్తా పత్రిక సోమవారం తెలిపింది. -
బాంబులతో దద్దరిల్లిన ఇరాక్: 10 మంది మృతి
ఇరాక్లోని వివిధ ప్రాంతాలు నిత్యం బాంబు పేలుళ్లతో దద్ధరిల్లుతుందని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. నిన్న చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ల వల్ల దాదాపు 10 మంది మరణించారని తెలిపింది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించింది. దియాల ప్రావెన్స్లో అత్యంత రద్దీగా ఉండే మీడియా కేంద్రం సమీపంలో రోడ్డు పక్కన ఉంచిన బాంబు పేలి ఐదుగురు మరణించగా, 11 మంది తీవ్ర గాయాలపాలైయ్యారని చెప్పింది. అలాగే సదియహ్ పట్టణంలోని మార్కెట్ వద్ద ఉంచిన బాంబు విస్పోటనంలో ముగ్గురు మరణించారని,11 మంది గాయపడ్డారని చెప్పింది. మకదాదియ నగరంలో ఓ పోలీసుపై కొందరు ఆగంతకులు జరిపిన కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మరణించాడని తెలిపింది. ఫల్లజ నగరంలో పార్క్ చేసిన కారు పేలి ముగ్గురు గాయపడ్డారని పోలీసు వర్గాలు వెల్లడించాయని పేర్కొంది. హమామ్ అలీ పట్టణం పోలీస్ ఉన్నతాధికారి బాంబు పేలుడు ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నారని, అయితే కొద్దిపాటి గాయాలు ఆయనకు తగిలాయని వెల్లడించింది. బాంబు పేలుళ్ల వల్ల పోలీసు జీపులు ధ్వంసమైన ఘటనలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని మీడియా పేర్కొంది. -
ఇరాక్లో బాంబు పేలుళ్లు: 25 మంది మృతి
ఇరాక్లోని వివిధ ప్రాంతాల్లో గురువారం బాంబుల పేలుళ్లు సంభవించి దాదాపు 25 మంది మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఈ ఘటనలో మరో 47మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. భద్రత దళాలు లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు పేలుళ్లు జరిగాయని చెప్పారు. గాయపడిన వారంతా దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. రమదాలోని ఆర్మీ చెక్పోస్ట్పై ఆత్మహుతి జరిపిన దాడిలో 10 మంది సైనికులు మరణించగా, నలుగురు పౌరులు గాయపడ్డారని తెలిపారు. అలాగే డుజైల్లో నగరంలో రోడ్డు పక్కన ఉన్న బాంబు పేలుడు సంభవించడంతో ఆ సమీపంలో పెళ్లి వేడుకలకు హాజరైన అతిథుల్లో ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో 21 మంది గాయాలపాలు అయ్యారు. అస్లాహ్ లోని ఇరాకీ ఆర్మీ చెక్ పోస్ట్పై ఆగంతకుడు జరిపిన తుపాకి కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. బాత్ నగరంలో రోడ్డు పక్కన బాంబు పేలి శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న ఇద్దరు సైనికులు దుర్మరణం చెందారు. మరో నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడడారు. ముసలా నగర తూర్పు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. వీటితోపాటు తాల్ అఫర్లో కారు బాంబు పేలి ఎనిమిది మంది మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. కిర్క్లోని ప్రభుత్వ కార్యాలయం వద్ద పార్కింగ్లో ఉంచిన కార్ విస్పోటనంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. -
ఇరాక్ కారు బాంబు పేలుళ్లలో 33 మంది మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్ గురువారం కారు బాంబు పేలుళ్లతో నెత్తురోడింది. ఈ దాడుల్లో 33 మంది మృతిచెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఖాజీమియ్యా ప్రాంతంలోని బస్టాండ్ వద్ద కారు బాంబు పేలుడులో 8 మంది మృతిచెందగా అల్లావీ ప్రాంతంలో జరిగిన మరో కారు బాంబు పేలుడులో ఆరుగురు మృత్యువాతపడ్డారు. తూర్పు బాగ్దాద్లో జరిగిన ఇంకో కారుబాంబు పేలుడులో ఆరుగురు మృతిచెందారు. మరో మూడు చోట్ల జరిగిన పేలుళ్లలో మరో 13 మంది మరణించారు.