చైనాలోకి భారత దళాలు | China accuses Indian troops of 'crossing boundary' in Sikkim section, puts Mansarovar Yatra on hold | Sakshi

చైనాలోకి భారత దళాలు

Jun 28 2017 2:23 AM | Updated on Sep 5 2017 2:36 PM

చైనాలోకి భారత దళాలు

చైనాలోకి భారత దళాలు

భారత దళాలు చైనా భూభాగంలోకి వచ్చాయని నిందిస్తూ చైనా మంగళవారం నిరసన వ్యక్తం చేసింది. సైనికులు వెంటనే వెనక్కు వెళ్లాలంది.

చైనా ఆరోపణ
బీజింగ్‌: భారత దళాలు చైనా భూభాగంలోకి వచ్చాయని నిందిస్తూ చైనా మంగళవారం నిరసన వ్యక్తం చేసింది. సైనికులు వెంటనే వెనక్కు వెళ్లాలంది. తాజా ఘర్షణాత్మక వాతావరణానికి చూపే పరిష్కారంపైనే భవిష్యత్తులో భారతీయులను మానస సరోవర్‌ యాత్రకు అనుమతించాలా లేదా అనేది ఆధారపడి ఉంటుందని చైనా పేర్కొంది. ప్రస్తుతానికి భద్రతా కారణాల వల్లనే మానస సరోవర్‌ యాత్రకు వచ్చిన భారతీయులను అనుమతించలేదని చైనా తెలిపింది.

‘మా ప్రాంత సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ అంశంలో భారత్‌ కూడా చైనాతో కలిసి నడుస్తుందనీ, చైనా భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయ సైనికులను వెంటనే వెనక్కు పిలుస్తుందని ఆశిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూకాంగ్‌ చెప్పారు. న్యూఢిల్లీలోనూ, బీజింగ్‌లోనూ దౌత్యపరంగా తమ నిరసన, వైఖరిని భారత్‌కు తెలియజేశామని ఆయన వెల్లడించారు. ‘భారత యాత్రికులకు సౌకర్యాలు, భద్రత కల్పించడానికి చైనా ఇప్పటివరకు ఎంతో చేసింది. తాజాగా భారత దళాలు చైనా భూభాగంలోకి ప్రవేశించి, రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకున్నాయి. అయితే భద్రతా కారణాల వల్లనే ప్రస్తుతం భారతీయ యాత్రికులను చైనా మీదుగా వెళ్లనీయడం లేదు’ అని కాంగ్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement