ఐదుగురు మిలిటెంట్లు హతం
Published Fri, Sep 30 2016 8:09 AM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM
అల్జీర్స్: అల్జీరియా ఆర్మీ ఐదుగురు మిలిటెంట్లను మట్టుపెట్టింది. రాజధాని అల్జీర్స్కు 480 కి.మీ దూరంలో ఉన్నబోట్నా ప్రావిన్స్ తాజాల్ట్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులపై దాడులు చేసిన సైన్యం మిలిటెంట్ల దగ్గరున్న ఆరు బంకర్లు, భారీ ఎత్తున ఆయుధాలు, మైన్స్లను ధ్వంసం చేసింది. గత ఐదునెలలుగా ఆర్మీ 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. దాడులు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Advertisement
Advertisement