![రోబోటిక్ చేయిని రూపొందించిన భారత సంతతి విద్యార్థి](/styles/webp/s3/article_images/2017/09/3/61438748173_625x300.jpg.webp?itok=9hPOWVJ2)
రోబోటిక్ చేయిని రూపొందించిన భారత సంతతి విద్యార్థి
న్యూయార్క్: అతి త క్కువ ఖర్చుతో రోబోటిక్ చేయిని రూపొందించి భారత సంతతి విద్యార్థి ప్రశంసలు అందుకున్నాడు. సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులో భాగంగా ఈ రోబోటిక్ చేయిని రూపొందించిన నిలయ్ మెహతా.. అమెరికా పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందించే బ్లూ రిబ్బన్ అవార్డును అందుకున్నాడు. కాలిఫోర్నియాలోని ఇర్విన్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న మెహతా ఈ ప్రాజెక్టు కోసం నాలుగు నెలలుగా కష్టపడినట్లు చెప్పాడు. ఆరెంజ్ కంట్రీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్కు అర్హత సాధించి నాలుగు మొదటి బహుమతులు కూడా అందుకున్నాడు. సాధారణంగా కృత్రిమ చేయి 35వేల డాలర్లు(సుమారు రూ.22 లక్షలు ) ఉంటుంది. నిలయ్ రూపొందించిన ఈ రోబోటిక్ ధర కేవలం 260 డాలర్లు(రూ. 16,500) మాత్రమే.