ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ నుంచి సిడ్నీ వరకు మోడీ ఎక్స్ప్రెస్ పేరిట ప్రత్యేక రైలు ఏర్పాటు చేయనున్నారు.
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కోసం ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ నుంచి సిడ్నీ వరకు మోడీ ఎక్స్ప్రెస్ పేరిట ప్రత్యేక రైలు ఏర్పాటు చేయనున్నారు.
మోడీ సభకు పాల్గొనేందుకోసం ఈ ప్రత్యేక రైలులో ఆయన అభిమానులు వెళ్లనున్నారు. 200 మంది అభిమానులు 870 కిలో మీటర్ల దూరం ప్రయాణించి మోడీ సభకు హాజరవుతారు.