బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా మరో 35 మంది గాయపడ్డారు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని సింధు ప్రావిన్స్లో బస్సు - ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో 35 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తట్టాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. కరాచీ నుంచి బస్సు షదాద్ కోట్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం శనివారం అర్థరాత్రి చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.