
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అధికారికంగా ఈ నెల 15 నుంచి 22 వరకు స్పెయిన్ దేశంలోని మ్యాడ్రిడ్లో మంత్రి పర్యటించనున్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిని అక్కడ మంత్రి అధ్యయనం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment