Spain
-
వెరైటీ పండుగ: ‘లాస్ ఫల్లాస్' బొమ్మలను తయారు చేసి మరీ..!
ప్రపంచ బొమ్మల ప్రియులకు ‘లాస్ ఫల్లాస్’ పండుగ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. ఇది స్పెయిన్ లోని వాలెన్సియాలో జరిగే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ వేడుక. ఇది ప్రతి ఏడాది మార్చి 15 నుంచి 19 వరకు జరుగుతుంది. ఈ పండుగలో ప్రధానంగా భారీ కార్టూన్లాంటి బొమ్మలను తయారు చేసి, వాటిని ప్రదర్శిస్తారు. ఆ బొమ్మలను అక్కడివారు ‘ఫల్లాస్’ అని పిలుస్తారు. పండుగ చివరిరోజున ఈ బొమ్మలను తగలబెడతారు.ఫల్లాస్ల తయారీనే ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. చెక్క, కార్డ్బోర్డ్, కాగితం, స్టెరోఫోమ్ వంటి మండే పదార్థాలతో, స్థానిక కళాకారులు ఏడాది పొడవునా శ్రమించి, వీటిని తయారు చేస్తారు. ఈ బొమ్మల్లో హాస్యం, వ్యంగ్యం, సమకాలీన సంఘటనలను ప్రతిబింబించే అంశాలు ఉంటాయి. ఈ బొమ్మల ప్రదర్శనలో పోటీలు కూడా జరుగుతాయి. ఈ ఫెస్టివల్ జరిగే ఐదురోజుల్లో మధ్యాహ్నం పూట, రాత్రి పూట కనుల విందుగా బాణసంచా కాలుస్తారు. చివరి రోజైన మార్చి 19న జరిగే బొమ్మల దహనాన్ని ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. దాన్ని ‘లా క్రెమా’ అని పిలుస్తారు. మొదటిగా పెద్దలు తయారు చేసిన బొమ్మలు కాల్చి, తర్వాత పిల్లల బొమ్మలను కాలుస్తారు. అలా కాల్చడంతో చెడు దహనమైందని భావిస్తారు. ఈ పండుగలో సంగీత కార్యక్రమాలు, సంప్రదాయ దుస్తుల ప్రదర్శనలు, బహిరంగ భోజనాలు, వీథుల్లో పలు బృందాల కవాతులు.. అక్కడి కళా సాంస్కృతిక పరంపరకు ప్రతీకగా నిలుస్తాయి. (చదవండి: ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..! శాస్త్రవేత్తలకే అంతుపట్టని మిస్టరీ అది..) -
మన ఆటలో వేగం పెరగాలి
న్యూఢిల్లీ: అరంగేట్ర మ్యాచ్లోనే అనూహ్య గోల్తో అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు యువ ఫార్వర్డ్ సాక్షి రాణా... అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగించేందుకు ఆటలో వేగం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ సందర్భంగా స్పెయిన్తో మ్యాచ్ ద్వారా 17 ఏళ్ల సాక్షి రాణా సీనియర్ స్థాయిలో అరంగేట్రం చేసింది. భువనేశ్వర్ వేదికగా ప్రపంచ ఏడో ర్యాంకర్ స్పెయిన్తో జరిగిన పోరులో సాక్షి తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఆ మ్యాచ్లో భారత్ 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడినప్పటికీ... సాక్షి మాత్రం చక్కటి ‘ఫీల్డ్ గోల్’తో తనదైన ముద్ర వేసింది. జూనియర్ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో సీనియర్ జట్టుకు ఎంపికైన సాక్షి రాణా... మొదటి మ్యాచ్లోనే గోల్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ‘సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసేందుకు చాన్నాళ్లుగా ఎదురుచూశా.తొలి మ్యాచ్లో సీనియర్ ప్లేయర్లు ఎంతగానో సహకరించారు. అంతర్జాతీయ స్థాయిలో మొదటి పోరును ఆస్వాదించమని సూచించారు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలిగా’ అని సాక్షి వెల్లడించింది. స్పెయిన్తో మ్యాచ్లో ప్రత్యర్థి ప్లేయర్ల నుంచి సర్కిల్లో బంతి చేజిక్కించుకున్న సాక్షి దానిని గోల్గా మలిచింది. ‘తొలి మ్యాచ్లోనే గోల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దాని కోసం తీవ్రంగా శ్రమించా. మ్యాచ్ సమయంలో నా చేతికి బంతి దొరికినప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించా. అదే అదునుగా షాట్ కొట్టా. దీంతో ఒక్కసారిగా అందరూ అరవడం ప్రారంభించారు. అప్పుడుగోల్ కొట్టానని అర్థమైంది’ అని సాక్షి చెప్పింది. ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో భాగంగా స్పెయిన్, జర్మనీ జట్లపై ఆడిన సాక్షి... విదేశీ ప్లేయర్లతో పోటీపడాలంటే ఆటలో మరింత వేగం పెంపొందించుకోవాలని సాక్షి అభిప్రాయపడింది. ‘అంతర్జాతీయ స్థాయి లో రాణించాలంటే మరింత వేగం, చురుకుదనం పెంచుకోవాలని అర్థమైంది. ఫార్వర్డ్గా అది నాకు మరింత కీలకం. అందుకే ఇప్పుడు దానిపై దృష్టి సారించా. ప్రొ హాకీ లీగ్కు స్టాండ్బై ప్లేయర్గా ఎంపికయ్యా. చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ తొలి మ్యాచ్ ఆడుతున్నావు అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. నిన్ను మాత్రమే జట్టుకు ఎంపిక చేయలేదు... నీ ఆటను కూడా సెలెక్ట్ చేశాం... మైదానంలో విజృంభించు అని కోచ్ వెన్నుతట్టారు.దీంతో ఆత్మవిశ్వాసంతో ఆడగలిగాను’ అని సాక్షి చెప్పింది. గతేడాది జూనియర్ ఆసియా కప్లో పసిడి పతకం గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన సాక్షి... ఈ ఏడాది చిలీ వేదికగా జరగనున్న జూనియర్ ప్రపంచకప్లో యువ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. -
భారత హాకీ జట్లకు నిరాశ
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ రెండో రౌండ్ మ్యాచ్ల్లో భారత పురుషుల, మహిళల జట్లకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ల్లో భారత పురుషుల జట్టు 1–4 గోల్స్ తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీ జట్టు చేతిలో... భారత మహిళల జట్టు 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయాయి. జర్మనీతో జరిగిన మ్యాచ్లో భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (13వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. జర్మనీ తరఫున ఫ్లోరియన్ స్పెర్లింగ్ (7వ నిమిషంలో), థీస్ ప్రింజ్ (14వ నిమిషంలో), మైకేల్ స్ట్రుతోఫ్ (48వ నిమిషంలో), రాఫెల్ హార్ట్కోప్ (55వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు తరఫున బల్జీత్ కౌర్ (19వ నిమిషంలో), సాక్షి రాణా (38వ నిమిషంలో), రుతుజా (45వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. స్పెయిన్ జట్టుకు సోఫియా (21వ నిమిషంలో), లూసియా (52వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఎస్తెల్ (25వ, 49వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించింది. -
భారత హాకీ జట్లకు మిశ్రమ ఫలితాలు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ల్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ముందుగా భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 1–2తో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడిపోగా... అనంతరం భారత పురుషుల జట్టు 2–0 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టుపై విజయం సాధించింది. భారత జట్టు తరఫున మన్దీప్ సింగ్ (32వ నిమిషంలో), దిల్ప్రీత్ సింగ్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్–భారత్ మహిళల జట్ల మధ్య మ్యాచ్లో నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (53వ నిమిషంలో), రుతుజా (57వ నిమిషంలో)... ఇంగ్లండ్ తరఫున పెయిజ్ గిలోట్ (40వ నిమిషంలో), టెసా హొవార్డ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత ఆరో షాట్లో రెండు జట్ల క్రీడాకారిణులు విఫలమయ్యారు. ఏడో షాట్లో భారత ప్లేయర్ లాల్రెమ్సియామి గురి తప్పగా... ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ హామిల్టన్ బంతిని లక్ష్యానికి చేర్చడంతో భారత్కు ఓటమి ఖరారైంది. -
అబ్బాయిల ఓటమి...అమ్మాయిల గెలుపు
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రొ లీగ్లో భారత జట్టు పరాజయం పాలైంది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ 1–3 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడింది. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భారత జట్టు చేతిలో ఎదురైన పరాజయానికి స్పెయిన్ బదులు తీర్చుకున్నట్లైంది. భారత్ తరఫున సుఖ్జీత్సింగ్ (25వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. స్పెయిన్ తరఫున బోర్జా లాకల్లె (28వ నిమిషంలో), ఇగ్నాషియా కొబొస్ (38వ ని.లో), బ్రూనో అవిలా (56వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. భారత జట్టు పదే పదే దాడులు చేసినా స్పెయిన్ రక్షణ పంక్తి సమర్థవంతంగా అడ్డుకుంది. తొలి క్వార్టర్లో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా... గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్ను ఇరు జట్లు మరింత దూకుడుగా ప్రారంభించాయి. ఈ క్రమంలో సుఖ్జీత్ సింగ్ గోల్తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లగా... మూడు నిమిషాల వ్యవధిలోనే గోల్ కొట్టిన స్పెయన్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వరుసగా రెండు క్వార్టర్స్లో ఒక్కో గోల్ బాదిన స్పెయిన్ మ్యాచ్ను చేజిక్కించుకుంది. ఆదివారం మరోసారి స్పెయిన్తో భారత్ ఆడనుంది. హోరాహోరీ పోరులో భారత అమ్మాయిల విజయం ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ లీగ్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం హోరాహోరీగా సాగిన తొలి పోరులో భారత్ 3–2 పాయింట్ల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. కళింగ స్టేడియంలో జరిగిన పోరులో తమకన్నా మెరుగైన ర్యాంక్ ఉన్న ఇంగ్లండ్ జట్టుపై భారత్ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కనబర్చింది. భారత్ తరఫున వైష్ణవి (6వ నిమిషంలో), దీపిక (25వ ని.లో) నవ్నీత్ కౌర్ (59వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. వైష్ణవి, దీపిక పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచగా... ఆట ఆఖరి నిమిషంలో అదిరిపోయే ఫీల్డ్గోల్తో నవ్నీత్ జట్టుకు విజయాన్ని అందించింది. ఇంగ్లండ్ తరఫున డార్సీ బౌర్నె (12వ నిమిషంలో), ఫియానా క్రాక్లెస్ (58వ ని.లో) చెరో గోల్ కొట్టారు. ఎఫ్ఐహెచ్ ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్.. వైష్ణవి గోల్తో తొలి క్వార్టర్లోనే ఖాతా తెరిచింది. అయితే కాసేపటికే ఏడో ర్యాంక్లో ఉన్న ఇంగ్లండ్ స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్లో దీపిక గోల్తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్... సునాయాసంగానే మ్యాచ్ గెలిచేలా కనిపించింది. ఈ క్రమంలో గోల్కీపర్ సవిత పూనియా కొన్ని చక్కటి సేవ్లతో ప్రత్యర్థికి స్కోరు చేసే అవకాశం ఇవ్వలేదు. చివర్లో ఇంగ్లండ్ స్కోరు సమం చేసినా... నిమిషం వ్యవధిలోనే మరో గోల్ కొట్టిన భారత్ విజయం సాధించింది. ఆదివారం జరగనున్న మ్యాచ్లో మరోసారి ఇంగ్లండ్తో భారత అమ్మాయిల జట్టు తలపడుతుంది. -
‘ప్రతీ మ్యాచ్ గెలవడమే లక్ష్యం’
భువనేశ్వర్: వచ్చే ఏడాది హాకీ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధించేందుకు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో ప్రతీ మ్యాచ్ గెలవాలనుకుంటున్నామని భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పేర్కొన్నాడు. లీగ్లో మంచి ప్రదర్శన కనబర్చి అగ్రస్థానంలో నిలవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని హర్మన్ప్రీత్ అన్నాడు. లీగ్లో భాగంగా శనివారం తొలి పోరులో స్పెయిన్తో భారత్ తలపడుతుంది. అనంతరం ఆదివారం స్పెయిన్తో మరో మ్యాచ్ ఆడుతుంది. ఈ నెల 18న, 19న జర్మనీతో 21, 22న ఐర్లాండ్తో... 24, 25న ఇంగ్లండ్తో మ్యాచ్లు ఆడుతుంది. ‘హాకీ ఇండియా లీగ్ నుంచి మా శిక్షణ సాగుతూనే ఉంది. ఫిట్నెస్ కాపాడుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆటగాళ్లంతా మంచి ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని ప్రొ లీగ్లో అన్నీ మ్యాచ్లు గెలవడమే మా ప్రధాన లక్ష్యం’ అని హర్మన్ప్రీత్ అన్నాడు. 2026 ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా హాకీ వరల్డ్ కప్ జరగనుంది. ‘హాకీ ఇండియా లీగ్ ద్వారా దేశవాళీ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. వారిని సక్రమంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో మరింత మంచి ప్లేయర్లుగా ఎదుగుతారు. స్పెయిన్ గట్టి ప్రత్యర్థి, వారిని తక్కువ అంచనా వేయడం లేదు. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెడతాం’అని హర్మన్ప్రీత్ పేర్కొన్నాడు. -
వేధిస్తాడు.. మొరటోడు
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విధానాలను ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల స్పెయిన్లో ‘గోయా’అవార్డ్ల ప్రదానోత్సవంలో రిచర్డ్కు జీవితకాల సాఫల్యత పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా రిచర్డ్ మాట్లాడుతూ ట్రంప్ విధాన నిర్ణయాలు, ట్రంప్ చుట్టూ ఉన్న నేతాగణాన్ని ప్రస్తావించారు. గిరిజనులు అడవుల్లో గిరిజనేతరుల ఆధిపత్యాన్ని కోరుకోరు అనే అర్థంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడో అనాలోచిత ట్రైబలిజం అమెరికాలో మొదలవుతోంది. ఇతరులతో పోలిస్తే మేం ప్రత్యేకం అన్న ధోరణి పెరుగుతోంది. అలాంటి ఆలోచనలను తుంచేయాల్సిన ప్రజాప్రతినిధులే ఈ ఆలోచనలకు అంటుకట్టడం విషాదకరం. ఇప్పుడు అమెరికాలో చీకటిరోజులు మొదలయ్యాయి. అందర్నీ అవహేళన చేస్తూ వేధించే మొరటు మనిషి ట్రంప్ ఏలుబడిలో ఉన్నాం. ఈయన విషయంలో ఒక్క అమెరికాలో మాత్రమే కాదు యావత్ ప్రపంచదేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. అధికారం, పెట్టుబడిదారుల సంకర వివాహమిది. బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వ ఖజానానే దోచేసే బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులు కొలువైన ప్రభుత్వమిది. ఇది మానవళికే ప్రమాదకరం. ఇతరుల పట్ల దయ లేని పరిణతి సాధించని సంపన్న మూకలు ట్రంప్ చుట్టూ చేరారు. ఇలాంటి వ్యక్తుల కలయిక ఎంతో వినాశకరం’’అని రిచర్డ్ ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికాలో ఉండే రిచర్డ్ ఇటీవలే తన భార్య అలెజాండ్రా సిల్వాతో కలిసి స్పెయిన్కు మకాం మార్చారు. -
నేను నటినే!
కార్లా సోఫియా గాస్కాన్... ఆస్కార్ నామినేషన్స్లో మొట్టమొదటి ట్రాన్స్గా స్థానం దక్కించుకొని, చరిత్ర సృష్టించింది. మ్యూజికల్ క్రైమ్ ఫిల్మ్ ‘ఎమీలీయా పెరెజ్’ చిత్రంలో టైటిల్ క్యారెక్టర్ పోషించి, ఉత్తమ నటిగా కార్లా ఆస్కార్కు ఎన్నికైంది. మొత్తం ప్రపంచ చలన చిత్ర పరిశ్రమనే తనవైపు తిప్పుకున్న, కార్లా పుట్టింది స్పెయిన్లోని ఆల్కోబెండాస్లో. పదహారేళ్ల వయసులో నటుడిగా ఎంట్రీ ఇచ్చి, లండన్లో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకొని నటిగా మారింది. హాస్య చిత్రం ‘ది నోబుల్ ఫ్యామిలీ’ విజయంతో ఇక వెనుతిరిగి చూడలేదు. వరుస సినిమాలు, సిరీస్లు చేస్తూ ఎప్పటికప్పుడు తన సత్తా చాటుతూనే ఉంది. 2024లో విడుదలైన ‘ఎమిలియా పెరెజ్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటు, ఉత్తమ నటిగా ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు’, ‘యూరోపియన్ ఫిల్మ్ అవార్డు’లను సాధించింది. ఇప్పుడు ఇదే సినిమాకు ఆస్కార్ బరిలోనూ నిలిచింది. అయితే, కాలం మారినా, సమాజం మారలేదు అన్నట్లు సోషల్ మీడియాలో ‘ఆమె ‘ఉత్తమ నటి’ లేదా ‘ఉత్తమ నటుడు’గా నామినేట్ చేశారో తెలియటం లేదు’ అని ప్రశ్నించిన ఒక అభిమానికి కార్లా ‘‘మేడమ్, నేను నటిని! సినిమాల్లో రాక్షసుడిగా, కుక్కగా ఇలా ఏ పాత్రలో నటించినా, నేను ‘నటి’గానే నామినేట్ అవుతాను’’ అని స్పందించింది. -
ప్రొ లీగ్తో భారత హాకీ జట్ల ఆట షురూ
భువనేశ్వర్: భారత హాకీ జట్లు ఈ సీజన్ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్తో ప్రారంభించనున్నాయి. భారత్ అంచె పోటీలు వచ్చేనెల 15 నుంచి భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరుగుతాయి. ఇందులో తొలిరోజు భారత పురుషుల జట్టు స్పెయిన్తో పోటీపడనుండగా, మహిళల జట్టు ఇంగ్లండ్ను ‘ఢీ’ కొట్టనుంది. ప్రస్తుతమైతే భారత జాతీయ క్రీడాకారులంతా (మహిళలు, పురుషులు) హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)తో బిజీగా ఉన్నారు. రూర్కేలా, రాంచీలలో జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్ టోర్నీలో భారత ప్లేయర్లు ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతరం ఫిబ్రవరిలో భారత జట్ల అంతర్జాతీయ సీజన్ ఆరంభం కానుంది. వచ్చే నెల 15 నుంచి 25 వరకు జరిగే భారత్ అంచె ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ పోటీల్లో పురుషుల జట్టు స్పెయిన్, ఇంగ్లండ్, జర్మనీ ఐర్లాండ్లతో ముఖాముఖి పోటీల్లో తలపడుతుంది. అమ్మాయిల జట్టు ఇంగ్లండ్తో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్లతో పోటీపడుతుంది. ఒక్కో జట్టుతో రెండేసి లీగ్ మ్యాచ్లు ఆడుతుంది. మ్యాచ్లన్నీ కళింగ స్టేడియంలోనే నిర్వహిస్తారు. భారత్ అంచెకంటే ముందు ఆస్ట్రేలియాలో ఎఫ్ఐహెచ్ తొలి అంచె మొదలవుతుంది. సిడ్నీలో ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు జరిగే ఆసీస్ అంచె పోటీల్లో భారత జట్లకు మ్యాచ్ల్లేవు. ‘ఆస్ట్రేలియాలో మ్యాచ్లు ముగిసిన వెంటనే రోజుల వ్యవధిలోనూ భారత్ అంచె పోటీలు మొదలవుతాయి. హాకీని ఆదరించే భారత్లో ఈ పోటీలు రసవత్తరంగా సాగుతాయి.11 రోజుల పాటు 24 మ్యాచ్లు జరుగనున్నాయి. ఇది ముగిసిన తర్వాత తుది అంచె పోటీలు సాంటియాగో డెల్ ఈస్టెరోలో జరుగుతాయి. దీంతో అన్ని జట్లకు ఎనిమిదేసి మ్యాచ్లు పూర్తవడంతో ఫైనల్స్కు చేరే నాకౌట్ జట్లేవే తేలిపోతాయి. గత సీజన్లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు, నెదర్లాండ్స్ మహిళల జట్టు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ టైటిల్స్ నెగ్గాయి. -
కల్లోల కడలిలో.. పడవలోనే కాన్పు
వలస బతుకుల దుర్భర దైన్యానికి దర్పణం పట్టే ఉదంతమిది. వలసదారులతో కిక్కిరిసిన పడవలో ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు పడింది. ఆఫ్రికా నుంచి స్పెయిన్కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కొద్దిసేపట్లో స్పెయిన్ పాలనలోని స్వయం ప్రతిపత్తి ప్రాంతం కానరీ దీవులకు చేరతారనగా నొప్పులు ఎక్కువయ్యాయి. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పడవే ప్రసూతి గదిగా మారింది. చుట్టూ ఉత్కంఠగా వేచి చూస్తున్న వలసదారుల నడుమే పండంటి బాబు ఈ లోకంలోకి వచ్చాడు. తర్వాత పది నిమిషాలకే నేవీ బోటులో ఆ పడవను చుట్టుముట్టిన కోస్ట్ గార్డులు వలసదారుల మధ్యలో రక్తమయంగా కనిపించిన పసిగుడ్డును చూసి నిర్ఘాంతపోయారు. తల్లీబిడ్డలను హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగానే అన్నారు. వలస పడవలో నిస్త్రాణంగా పడి ఉన్న తల్లి పక్కన మరొకరి చేతిలో నవజాత శిశువును చూసిన క్షణాలను కోస్ట్ గార్డ్ సిబ్బంది కెమెరాలో బంధించారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. క్రైస్తవులకు పర్వదినమైన ఎపిఫనీ రోజునే ఈ ఘటన జరగడం విశేషం. ఆ రోజున ప్రధానంగా బాలలకు బోలెడన్ని కానుకలివ్వడం సంప్రదాయం. అలాంటి పండుగ రోజున వలస దంపతులకు ఏకంగా బుల్లి బాబునే దేవుడు కానుకగా ఇచ్చాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
గూగుల్ స్ట్రీట్ ఫొటోతో మర్డర్ మిస్టరీ వీడింది!
గూగుల్ మ్యాప్ ఫొటో ఓ హంతకుడిని పట్టించిన ఘటన స్పెయిన్లో జరిగింది. సోరియా ప్రావిన్స్లోని తజుకో పట్టణ వీధులను గత ఏడాది నుంచి గూగుల్ యాప్ చిత్రించడం మొదలు పెట్టింది. అందులో కనిపించిన ఒక ఫొటో చివరికి హత్య కేసు తాలూకు దోషుల్ని పట్టించింది.క్యూబాకు చెందిన జార్జి అనే 33 ఏళ్ల వ్యక్తి 2023 అక్టోబర్లో అదృశ్యమయ్యాడు. తానో మహిళను కలిశానని, స్పెయిన్ నుంచి వెళ్లిపోతున్నానని చివరిసారిగా బంధువుకు జార్జి ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. తర్వాత అతడు కనబడకుండా పోవడంతో సదరు బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఒక వ్యక్తి తన కారు డిక్కీలోకి పెద్ద ప్లాస్టిక్ సంచిని లోడ్ చేస్తున్న చిత్రం ఇటీవల గూగుల్ స్ట్రీట్ వ్యూలో పోలీసుల కంట పడింది. అనుమానం వచ్చి విచారించగా ఓ మహిళ తన మాజీ బాయ్ఫ్రెండ్తో కలిసి జార్జిని హత్య చేసినట్లు తేలింది. దాంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ రిమాండ్కు తరలించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ చదవండి: వింత ఆచారం.. నేలపై పాకుతూ వెళుతూ.. -
భావోద్వేగంతో‘బుల్’ గుడ్బై
22 గ్రాండ్స్లామ్లు... 36 మాస్టర్ సిరీస్–1000 ట్రోఫీలు... 25 ఏటీపీ–500 టైటిల్స్... 10 ఏటీపీ–250 టైటిల్స్... 2 ఒలింపిక్ స్వర్ణాలు... 209 వారాల పాటు వరల్డ్ నంబర్వన్...1250 రాకెట్లు...300 కిలోమీటర్ల స్ట్రింగ్...16500 మీటర్ల ఓవర్గ్రిప్... ఇదీ కోర్టులో రాఫెల్ నాదల్ టెన్నిస్ ప్రయాణం! సుదీర్ఘంగా సాగిన ఈ అద్భుత ప్రస్థానం ముగిసింది. స్వదేశంలో, సొంత అభిమానుల సమక్షంలో ‘స్పెయిన్ బుల్’ నాదల్ కెరీర్ చివరి మ్యాచ్ ఆడేశాడు. ఆఖరి పోరులో పరాజయం పలకరించినా... ఈ మ్యాచ్ తుది ఫలితంకంటే అతని నిష్క్రమణే టెన్నిస్ ప్రపంచాన్ని భావోద్వేగంలో ముంచింది... కన్నీళ్లపర్యంతమవుతూ నాదల్ అభిమాన ఆటకు గుడ్బై చెప్పాడు.మలాగా (స్పెయిన్): ప్రపంచ టెన్నిస్ను శాసించిన దిగ్గజాలలో ఒకడైన రాఫెల్ నాదల్ రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్కు వీడ్కోలు పలికాడు. గతంలోనే ప్రకటించినట్లుగా డేవిస్కప్ టోర్నీలో జాతీయ జట్టుకు చివరిసారి ప్రాతినిధ్యం వహించిన తర్వాత అతను రిటైరయ్యాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 1–2తో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. స్పెయిన్ తరఫున తొలి సింగిల్స్లో బరిలోకి దిగిన నాదల్పై 6–4, 6–4 స్కోరుతో బొటిక్ వాన్ డి జాండ్షుల్ప్ విజయం సాధించాడు. ఆ తర్వాత రెండో సింగిల్స్లో అల్కరాజ్ 7–6 (7/0), 6–3తో గ్రీక్స్పూర్ను ఓడించి 1–1తో సమం చేశాడు. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్లో నెదర్లాండ్ జోడీ వాన్ డి జాండ్షుల్ప్–వెస్లీ కూల్హాఫ్ 7–6 (7/4), 7–6 (7/3) స్కోరుతో స్పెయిన్ ద్వయం అల్కరాజ్–మార్సెల్ గ్రానోలర్స్ను ఓడించింది. స్పెయిన్ నిష్క్ర మణతో నాదల్కు ఇదే చివరి పోరుగా మారింది. నాదల్ మ్యాచ్ను తిలకించేందుకు కుటుంబసభ్యులందరూ వచ్చారు. అంతా అతనే... మ్యాచ్ ఆరంభానికి ముందు స్పెయిన్ జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో 38 ఏళ్ల నాదల్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. సుమారు 10 వేల మంది ప్రేక్షకులతో స్టేడియం అంతా ఎరుపు వర్ణం పులుముకున్న తర్వాత అతను ఆటలోకి అడుగు పెట్టాడు. కోర్టులో ప్రతి షాట్కు అభిమానులు ‘రా...ఫా...రా...ఫా....’ అంటూ జేజేలు పలుకుతూ ప్రోత్సహిస్తుండగా అతను పోటీ పడ్డాడు. అయితే ఊహించినట్లుగానే గతంలోలా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన అతను వరుస సెట్లలో ఓడిపోయాడు. నాదల్ కొట్టిన ఫోర్హ్యాండ్ నెట్ను తాకడంతో అతని ఓటమి ఖాయమైంది. స్పెయిన్ ఓటమి తర్వాత నాదల్ స్టేడియం అంతా కలియతిరిగాడు. ఆటగాళ్లు, కోచ్లను కౌగిలించుకొని భావోద్వేగభరితమైన అతను అభిమానుల చప్పట్ల హోరు మధ్య ప్రసంగం పూర్తి చేసుకొని వీడాడు.వరుసగా 19 ఏళ్ల పాటు...2024: 02023: 02022: 4 2021: 2 2020: 2 2019: 4 2018: 52017: 62016: 2 2015: 3 2014: 4 2013: 10 2012: 4 2011: 3 2010: 7 2009: 52008: 8 2007: 6 2006: 5 2005: 11 2004: 1 మొత్తం 92రాఫెల్ నాదల్ 2004లో తొలిసారి ఏటీపీ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. పోలాండ్లోని సొపోట్ నగరంలో జరిగిన ఐడియా ప్రొకామ్ ఓపెన్ టోర్నీలో నాదల్ విజేతగా నిలిచాడు. ఆ ఏడాది నుంచి వరుసగా 19 ఏళ్లపాటు (2022 వరకు) నాదల్ కనీసం ఒక్క టైటిల్ అయినా సాధిస్తూ వచ్చాడు. గాయాల కారణంగా 2023లో, ఈ ఏడాది నాదల్ టైటిల్ గెలవలేకపోయాడు.అంకెల్లో నాదల్ కెరీర్1080 సింగిల్స్ విభాగంలో గెలిచిన మ్యాచ్లు 227 సింగిల్స్ విభాగంలో ఓడిన మ్యాచ్లు 910 ఏటీపీ ర్యాంకింగ్స్లో టాప్–10లో కొనసాగిన వారాలు 209 ప్రపంచ నంబర్వన్గా కొనసాగిన వారాలు 92 కెరీర్ మొత్తంలో నెగ్గిన సింగిల్స్ టైటిల్స్ 63 క్లే కోర్టులపై గెలిచిన సింగిల్స్ టైటిల్స్ 22 మొత్తం నెగ్గిన గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (ఫ్రెంచ్ ఓపెన్: 14, ఆ్రస్టేలియన్ ఓపెన్: 2; వింబుల్డన్: 2, యూఎస్ ఓపెన్: 4) 2 గెలిచిన ఒలింపిక్స్ స్వర్ణాలు (2008 బీజింగ్ ఒలింపిక్స్ సింగిల్స్; 2016 రియో ఒలింపిక్స్లో డబుల్స్) 4 డేవిస్కప్ టీమ్ టైటిల్స్(2004, 2009, 2011, 2019)కెరీర్లో సంపాదించిన మొత్తం ప్రైజ్మనీ13,49,46,100 డాలర్లు (రూ. 1138 కోట్లు)భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టంగా ఉంది. అయితే ప్రశాంతమైన మనసుతో వీడ్కోలు పలుకుతున్నా. నా విజయాల సంఖ్య, టైటిల్స్, రికార్డుల గురించి అందరికీ తెలుసు. అయితే ఒక చిన్న ఊరు మలొర్కా నుంచి వచ్చిన ఒక మంచి వ్యక్తిగా, తన కలలు నేర్చుకునేందుకు ఎంతో కష్టపడిన ఒక చిన్న కుర్రాడిగా నేను గుర్తుండిపోవాలని కోరుకుంటాను. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. నా కెరీర్లో ఎంతో మంది మిత్రులను సంపాదించుకోగలిగాను. డేవిస్ కప్లో తొలి మ్యాచ్ను ఓటమితో మొదలు పెట్టిన నేను ఇప్పుడూ ఓడి ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చాను. నా చివరి మ్యాచ్ చాలా కఠినంగా అనిపించింది. నిజానికి ఎవరూ ఇలాంటి క్షణం రావాలని కోరుకోరు. నేను టెన్నిస్ ఆడే విషయంలో అలసిపోలేదు. కానీ నా శరీరం అలసిపోయింది. ఇక ఆడటం సాధ్యం కాదని చెప్పేసింది. కాబట్టి నేను వాస్తవాన్ని అంగీకరించాలి. నిజాయితీగా చెప్పాలంటే ఒక హాబీగా మొదలు పెట్టిన ఆటలో ఇంత గొప్ప కెరీర్ నిర్మించుకోగలగడాన్ని నేను గొప్పగా భావిస్తున్నా. పైగా నేను ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ కాలం ఆడగలిగాను. – వీడ్కోలు ప్రసంగంలో రాఫెల్ నాదల్ -
‘వరద’ వైఫల్యాలపై స్పెయిన్లో భారీ నిరసనలు
వరదల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్పెయిన్లో లక్షలాది మంది రోడ్డెక్కారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ వాలెన్సియాలో శని, ఆదివారాల్లో ఆందోళనకు దిగారు. వాలెన్సియా రీజనల్ హెడ్ కార్లోస్ మజోన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. దాదాపు 1,30,000 మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. వాలెన్సియా సిటీ హాల్ను బురదతో నింపేశారు. కురీ్చలు, వస్తువులకు నిప్పు పెట్టారు. పలుచోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. వాలెన్సియా, పరిసర ప్రావిన్సుల్లో ఇటీవల కుండపోత వర్షాలకు వరద ముంచెత్తి 200 మందికి పైగా మరణించడం తెలిసిందే. 80 మందికి పైగా గల్లంతయ్యారు. వేలాది మంది నిర్వాసితులయ్యారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వీధులు బురద, శిథిలాల్లో కూరుకుపోయి ఉన్నాయి. స్పెయిన్ వాతావరణ సంస్థ అక్టోబర్ 25 నుంచే ఈ ప్రాంతానికి తుపాను హెచ్చరికలు జారీ చేసినా వరదలు మొదలయ్యే దాకా వాలెన్సియా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయలేదు. వారి అలసత్వం వల్లే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని జనం మండిపడుతున్నారు. గత వారం పైపోర్టా పట్టణాన్ని సందర్శించిన స్పెయిన్ రాజు, రాణిపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అనంతరం ప్రధాని పెడ్రో సాంచెజ్పై గుడ్లు తదితరాలు విసిరి నిరసన తెలిపారు. – వాలెన్సియా -
కిల్లర్స్.. గెటౌట్!
వాలెన్సియా: ఇటీవలి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వాలెన్సియా నగరంలో స్పెయిన్ రాజ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం వరద బాధిత ప్రాంతంలో పర్యటనకు వచి్చన రాజు ఫిలిప్ పైకి వరద బాధితులు బురద విసురుతూ దూషించారు. వాలెన్సియా శివారులోని పైపోరా్టకు చేరుకున్న సమయంలో రాజు వెంట ఉన్న ప్రభుత్వాధికారులు స్థానికులతో మాట్లాడుతుండగా, కొందరు బిగ్గరగా ‘గెటౌట్! గెటౌట్!, కిల్లర్స్!’అంటూ కేకలు వేశారు. రాచకుటుంబీకులు, అధికారులపైకి గుడ్లు, బురద విసిరేందుకు ప్రయతి్నంచగా రక్షక సిబ్బంది గొడుగులతో వారిని కాపాడారు. పోలీసులు నిరసనకారులను వెనక్కి నెట్టేశారు. ఈ సమయంలో కింగ్ ప్రశాంతంగా బాధితులతో సంభాíÙంచేందుకు ప్రయతి్నంచారు. ఓ వ్యక్తి ఆయన భుజంపై తల ఆనించి, రోదించారు. రాజు వెంట రాణి లెటిజియా, వాలెన్సియా ప్రాంత ప్రెసిడెంట్ కార్లో మజోన్ ఉన్నా రు. గ్లవుజులతోపాటు ముంజేతిపై పడిన బురదతోనే రాణి స్థానికులతో మాట్లాడారు. ప్రధాని పెడ్రో సాంచెజ్ రాజు వెంట ఉన్నదీ లేనిదీ తెలియరాలేదు. ఇటీవలి భీకర వరదల్లో 200మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ముందస్తు హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం విఫలమవ్వడం వల్లే ఇంతటి స్థాయిలో నష్టం జరిగిందని జనం ఆగ్రహంతో ఉన్నారు. -
ఇదేమీ రాజకీయ సభకాదు.. సాయం చేసేందుకు వచ్చిన ప్రభం‘జనం’
స్పెయిన్లో ఇటీవలి భారీ వర్షాలు, వరదల్లో 210 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, చాలా మంది జాడ తెలియకుండా పోయారు. ఒక్క వలెన్సియాలోనే 155 మంది చనిపోయారు. సునామీ స్థాయిలో సంభవించిన తుపాను కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించడం తెలిసిందే. ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక పనులకు చేపట్టింది. వేలాదిగా ఆర్మీని రంగంలోకి దించింది. వరదలతో దెబ్బతిన్న వలెన్సియా నగర వీధుల్లో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్న ప్రజలు..సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటామంటూ స్వచ్ఛందంగా తరలివచ్చిన వారితో శుక్రవారం వలెన్సియాలోని సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కల్చరల్ కాంప్లెక్స్ ఆవరణ కిక్కిరిసిపోయిందిలా..! స్పెయిన్ను వణికించిన వరదలుభారీ వర్షంతో ఆకస్మికంగా సంభవించిన వరదలతో స్పెయిన్ అతలాకుతలమైంది. తూర్పు, దక్షిణ స్పెయిన్లో భారీ వర్షాలు పడటంతో వరదలు వచ్చాయి. తద్వారా భారీ సంఖ్యలో కుటుంబాలు వీధిన పడ్డాయి. వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి.ఆకస్మిక భారీ వరదలకు మృత్యువాత పడ్డ వారి సంఖ్య 210కి చేరింది. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీయగా, శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు.. గల్లంతు అయిన వారి కోసం బంధువులు పడే ఆందోళనలతో ఎక్కడ చూసినా విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. -
210కి పెరిగిన స్పెయిన్ వరద మృతులు
మాడ్రిడ్: స్పెయిన్లో ఆకస్మిక భారీ వరదలకు బలైన వారి సంఖ్య 210 దాటింది. చాలామంది గల్లంతయ్యారు. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీస్తున్నాయి. శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు, నేలకూలిన చెట్లు, కూలిన విద్యుత్ లైన్లు, గల్లంతైనవారి గురించి ఆత్మీయుల ఆందోళనలు... ఇలా ఎక్కడ చూసినా ఈ విషాద దృశ్యాలే కనబడుతున్నాయి. ఆకస్మిక తుఫాను కలిగించిన భారీ నష్టం సునామీ అనంతర పరిణామాలను తలపిస్తోందని స్థానికులు వాపోతున్నారు.Rescuer rescuing a women and her pet dog from flooded area in Spain.There is severe flash floor occurred serval region in Spain. The worst affected area is Valencia which records highest rainfall in 28 years. The death toll from the flood in Valencia alone has risen to 92.… pic.twitter.com/nUOcwBM4nW— Eagle EyE (@mkh_nyn) October 31, 2024 🤯The worst flood in the last 37 years: at least 72 people died in Spain, dozens went missing, RTVE.Three days of mourning have been declared in the country. There is still no normal access to some areas. pic.twitter.com/KLQQSuniCa— Nurlan Mededov (@mededov_nurlan) October 30, 2024Catastrophic flooding in Spain.#Flood#Spain pic.twitter.com/32Vwotrv4F— Jennifer Coffindaffer (@CoffindafferFBI) October 30, 2024⚠️Devastating images aftermath flood in the Alfafar in the province of Valencia, Spain63 reported deaths so far in Spain due to catastrophic floods…#Valencia #Spain pic.twitter.com/rnsexKKI3P— Culture War (@CultureWar2020) October 30, 2024 -
స్పెయిన్లో వర్ష బీభత్సం
బార్సెలోనా: కుండపోత వర్షాలు, వడగళ్ల వానలతో స్పెయిన్ అతలాకుతలమవుతోంది. ఆకస్మిక వరదలు మంగళవారం దేశ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. కనీసం 95 మందికి పైగా బలైనట్టు సమాచారం. ఒక్క వాలెన్సియా ప్రాంతంలోనే బుధవారం ఒక్క రోజే మృతుల సంఖ్య 62కు చేరినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికే పలువురి మృతదేహాలు దొరికినట్టు తెలిపారు. ఎంతోమంది గల్లంతైనట్టు చెప్పారు. పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అక్కడ మరెంతో మంది మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల భారీగా పెరిగేలా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 320 మి.మీ. వర్షం పడింది! దాంతో మలగా నుంచి వాలెన్సియా దాకా ఎక్కడ చూసినా నదులుగా మారిన రోడ్లు, కూలిన గోడలు, కొట్టుకుపోతున్న కార్లతో ఎక్కడ చూసినా పరిస్థితి భీతావహంగా కనిపిస్తోంది. అపార్ట్మెంట్ల గ్రౌండ్ ఫ్లోర్లన్నీ నీట మునిగిపోయాయి. ఇళ్లలోని సామాన్లన్నీ వరద పాలై కొట్టుకుపోతున్నాయి. స్పెయిన్ ఇంతటి వరదల బారిన పడటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. వరదలో చిక్కిన వారిని హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా కాపాడుతున్నారు. ప్రభావి త ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసర సైనిక బృందం నుంచి వెయ్యి మంది సిబ్బందిని నియోగించారు. ఎడతెరిపి లేని వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గురువారం తీవ్ర వర్షసూచనలున్నాయి.This is SPAIN, most of you have been here.Demand #ClimateAction & don’t put up with #FossilFuel company misinformation.Flash floods in Spain leave at least 51 people dead.https://t.co/UEO9y7iPl3 pic.twitter.com/WqBikKltbM— Dr Jill Belch (@JillBelch) October 30, 2024రవాణా కుదేలుఆకస్మిక వరదల దెబ్బకు ఏకంగా పలు నదులపై బ్రిడ్జిలే కొట్టుకుపోయాయి. దాంతో స్పెయిన్ అంతటా రవాణా వ్యవస్థ కుదేలైంది. రైలు, విమాన సేవలు ప్రభావితమయ్యాయి. మలగా సమీపంలో 300 మంది పై చిలుకు ప్రయాణికులతో వెళ్తున్న హైస్పీడ్ ట్రెయిన్ పట్టాలు తప్పింది. దాంతో వాలెన్సియా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్కూళ్లు, పార్కులను మూసేస్తున్నట్లు, క్రీడా కార్యక్రమాలను నిలిపేస్తున్నట్లు వాలెన్సియా సిటీ హాల్ తెలిపింది. అండలూసియాలో కొన్ని ప్రాంతాల్లో రెండో అతి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వరదల్లో చాలా మంది గల్లంతయ్యారని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ అన్నారు. బాధితులను ఉద్దేశించి ఆయన టీవీలో మాట్లాడారు.నిన్నటిదాకా కరువు...స్పెయిన్ కొన్నేళ్లుగా తీవ్ర కరువు పరిస్థితుల బారిన పడింది. తాజాగా గత సీజన్లో కొనసాగిన కరువు దెబ్బ నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలోనే ఇలా వరదలు వచ్చి పడ్డాయి. వెచ్చని మధ్యధరా జలాలపై చల్లని గాలి కారణంగా ‘కోల్డ్ డ్రాప్’తో ఏర్పడ్డ క్యుములోనింబస్ మేఘాలు ఈ ఆకస్మిక వర్షాలకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి విపరీత సంఘటనలు తరచుగా, తీవ్రస్థాయిలో జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.SPAIN — The death toll from devastating flash floods in Spain’s eastern region of Valencia has risen to 51, with heavy rains submerging roads and sweeping away cars. The torrents, which followed an intense downpour, overwhelmed local infrastructure, turning town streets into… https://t.co/VwIMQh2FMq pic.twitter.com/yxHl0upKi8— News is Dead (@newsisdead) October 30, 2024క్రెడిట్స్: News is Dead Our thoughts are with Spain in the wake of the tragic flash floods. We extend our deepest condolences to those who have lost loved ones and express our gratitude to the rescuers working tirelessly to aid those affected. 🇪🇸 pic.twitter.com/c3RRSwH8OQ— EPP (@EPP) October 30, 2024 -
స్పెయిన్ను వణికిస్తున్న ఆకస్మిక వరదలు
మాడ్రిడ్ : భారీ వర్షానికి ఆకస్మికంగా సంభవించిన వరదలు స్పెయిన్ దేశాన్ని వణికిస్తున్నాయి. మంగళవారం తూర్పు, దక్షిణ స్పెయిన్లో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా భారీ సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయిలయ్యాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.ఓ వైపు వర్షం.. మరోవైపు వరద ధాటికి లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారి జాడ కోసం బాధిత కుటుంబ సభ్యులు అన్వేషిస్తున్నారు. బురద నీరు ముంచెత్తడంతో రైలు, విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది.దీంతో స్పెయిన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రమాదంలో చిక్కుకున్న వారిని సంరక్షించేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సాయంతో బాధితుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. తాజాగా, పదుల సంఖ్యలో మృతదేహాల్ని గుర్తించి బాధితుల కుటుంబాలకు సమాచారం అందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఆకస్మిక వరదలపై ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ దేశ ప్రజల్ని అప్రమత్తం చేశారు. ప్రయాణాల్ని వాయిదా వేసుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర సేవలు మినహా ఇతర అన్నీ రంగాలకు చెందిన కార్యకలాపాల్ని గురువారం వరకు మూసివేయాలని ఆదేశించారు. ఇక వరద ప్రభావాన్ని అంచనా వేసేలా కేంద్ర క్రైసిస్ కమిటీ ఉన్నతాధికారులకు ప్రధాని అప్రమత్తం చేశారు. -
ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న రోడ్రి
స్పానిష్ ఫుట్బాలర్, మాంచెస్టర్ సిటీ మిడ్ ఫీల్డర్ రోడ్రీ ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్-2024 అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం రోడ్రీతో రియల్ మాడ్రిడ్కు చెందిన వినిసియస్ జూనియర్, జూడ్ బెల్లింగ్హమ్తో పోటీ పడ్డారు. మాంచెస్టర్ సిటీ గత సీజన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలవడంతో రోడ్రీ కీలకపాత్ర పోషించాడు. అలాగే స్పెయిన్ ఈ ఏడాది యూరో టైటిల్ గెలవడంలోనూ కీ రోల్ ప్లే చేశాడు. ఇంగ్లీష్ క్లబ్ నుంచి బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న తొలి ఫుట్బాలర్ రోడ్రీనే. మహిళల విషయానికొస్తే.. ఈ ఏడాది బాలన్ డి'ఓర్ అవార్డు స్పెయిన్ కే చెందిన ఐటానా బొన్మాటీకి దక్కింది. బొన్మాటీ బార్సిలోనా క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తుంది. ఉత్తమ యువ ఫుట్బాలర్ అవార్డు విషయానికొస్తే.. ఈ అవార్డు లామిన్ యామల్కు దక్కింది. ఉత్తమ పురుషుల జట్టుగా రియల్ మాడ్రిడ్, ఉత్తమ మహిళల జట్టుగా బార్సిలోనా అవార్డులు దక్కించుకున్నాయి. పారిస్లో ఈ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
రక్షణ రంగంలో కొత్త అధ్యాయం
వడోడర: భారత ప్రైవేట్ రక్షణ విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ఆరంభమైంది. భారత్లోనే తొలి ప్రైవేట్ సైనిక, సరకు రవాణా విమానం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు గుజరాత్లోని వడోదర పట్టణంలోని టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ వేదికైంది. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్తో కలిసి భారత ప్రధాని మోదీ సోమవారం ఈ ప్లాంట్లో సీ295 రకం సైనిక రవాణా విమాన తయారీని ప్రారంభించారు. అక్కడి విడిభాగాల ఎగ్జిబిషన్ను ఇరునేతలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ భారత్, స్పెయిన్ భాగస్వామ్యం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంచేయడమే కాకుండా మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. కొత్త ఫ్యాక్టరీని అందుబాటులోకి తెచి్చన ఎయిర్బస్, టాటా బృందాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్లో విదేశీ సరకు రవాణా విమానం తయారీ కలను సాకారం చేసిన వ్యాపార జగజ్జేత రతన్ టాటాకు ఘన నివాళులు’’ అని అన్నారు. కొత్త పని సంస్కృతికి నిదర్శనం ‘‘ నూతన భారత దేశ కొత్తతరహా పని సంస్కృతికి సీ295 ఫ్యాక్టరీ ప్రతిబింబింగా నిలవనుంది. 2022 అక్టోబర్లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటినుంచి ఉత్పత్తిదాకా భారత వేగవంతమైన ఉత్పాదకతకు నిదర్శనం ఈ కర్మాగారం’’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత స్పానిష్ రచయిత ఆంటోనియో మకాడో కవితలోని ‘మనం లక్ష్యం సాధించేందుకు ముందుకెళ్తుంటే మార్గం దానంతట అదే ఏర్పడుతుంది’ అనే వాక్యాన్ని మోదీ గుర్తుచేశారు. ‘‘కొత్తగా మొదలైన టాటా–ఎయిర్బస్ ఫ్యాక్టరీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దేశీయంగా 18,000 విమాన విడిభాగాల తయారీని ఈ ఫ్యాక్టరీ సుసాధ్యం చేయనుంది. భవిష్యత్తులో భారత పౌరవిమానయాన రంగానికి అవసరమైన విమానాల తయారీకి ఈ ఫ్యాక్టరీ బాటలువేస్తోంది’’ అని మోదీ అన్నారు.స్పెయిన్లో యోగా, ఇండియాలో ఫుట్బాల్ ‘‘ఇరుదేశాల ప్రజల మధ్య బంధమే దేశాల మధ్య బంధాన్ని బలీయం చేస్తోంది. యోగా స్పెయిన్లో తెగ పాపులర్. ఇక స్పానిష్ ఫుట్బాల్ను భారతీయులూ బాగా ఇష్టపడతారు. ఆదివారం రియల్ మాడ్రిడ్తో మ్యాచ్ లో బార్సిలోనా బృందం సాధించిన ఘనవిజయం గురించి భారత్లోనూ తెగ చర్చ జరుగుతోంది. ఆహారం, సినిమా లు, ఫుట్బాల్.. ఇలా ప్రజల మధ్య బంధం దేశాల మధ్య పటిష్ట బంధానికి కారణం. 2026 ఏడాదిని ‘ఇండియా–స్పెయిన్ ఇయర్ ఆఫ్ కల్చర్, టూరిజం, ఏఐ’గా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం సంతోషకరం’’ అని మోదీ అన్నారు.బంధం బలీయం: స్పెయిన్ అధ్యక్షుడు ‘‘1960లలోనే ప్రఖ్యాత స్పెయిన్ క్లాసిక్, జాజ్ సంగీత కళాకారుడు పాకో డిలూసియా, భారతీయ సంగీత దిగ్గజం పండిత్ రవిశంకర్ రెండు దేశాల సంగీత ప్రియులను ఒక్కటి చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, స్నేహబంధాలకు ఈ ఫ్యాక్టరీ గుర్తుగా నిలుస్తుంది’ అని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ అన్నారు.40 విమానాల తయారీ ఇక్కడే ఎయిర్బస్ సీ295 రకం మధ్యశ్రేణి రవాణా విమానాన్ని తొలుత స్పెయిన్కు చెందిన సీఏఎస్ఏ ఏరోస్పేస్ సంస్థ డిజైన్చేసి తయారుచేసేది. ప్రస్తుతం ఇది యూరప్ బహుళజాతి ఎయిర్బస్ సంస్థలో భాగంగా ఉంది. యుద్ధంలో బాంబులతోపాటు అవసరమైన సందర్భాల్లో వైద్య పరికరాలు, విపత్తుల వేళ బాధితుల తరలింపునకు, తీరప్రాంతాల్లో గస్తీ, నిఘా కోసం సైతం పలురకాలుగా వినియోగించుకోవచ్చు. ఎయిర్బస్ సంస్థతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తంగా సీ295 రకం 56 విమానాలను సైన్యానికి అప్పగించనున్నారు. వీటిలో 16 విమానాలను స్పెయిన్లోని సవీలేలో తయారుచేసి ఎయిర్బస్ నేరుగా నాలుగేళ్లలోపు భారత్కు పంపనుంది. మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వారి ఆధ్వర్యంలో వడోదరలోని తయారీయూనిట్లో తయారుచేస్తారు. -
స్పెయిన్ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్ షో
వడోదర: స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ భారత్ పర్యటనలో ఉన్నారు. ఆయన సోమవారం గుజరాత్లోని వడోదర నగరానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్లు వడోదర నగరంలో ఓపెన్ జీపులో రోడ్షో నిర్వహించి, రోడ్డు పక్కన నిలుచున్న ప్రజలకు అభివాదం చేశారు.వడోదర విమానాశ్రయం నుంచి నగరంలోని టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ వరకు 2.5 కి.మీ పొడవునా ఈ రోడ్ షో కొనసాగింది. అనంతరం ఇద్దరు ప్రధానులు టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. మోదీ శాంచెజ్లు 'టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్' సెంటర్కి వెళ్లినప్పుడు కళాకారులు వారికి ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక సమావేశం కోసం లక్ష్మీ విలాస్ ప్యాలెస్కు వెళ్లే ముందు ఇద్దరు నేతలు సంయుక్తంగా 'టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్' కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్ను సి-295 విమానాల తయారీ కోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ నిర్మించింది. వడోదరలోని ఈ కాంప్లెక్స్లో 40 విమానాలను తయారు చేయనున్నారు. #WATCH | Vadodara, Gujarat: Prime Minister Narendra Modi, President of the Government of Spain, Pedro Sanchez hold a roadshow in VadodaraThe two leaders will inaugurate the Final Assembly Line Plant of C295 aircraft at Vadodara today(Source: ANI/DD News) pic.twitter.com/bLO4N4o0G0— ANI (@ANI) October 28, 2024భారతదేశంలో ఈ 40 విమానాలను తయారు చేసే బాధ్యత టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్కు అప్పగించారు. ఈ కాంప్లెక్స్ భారతదేశంలో సైనిక విమానాల కోసం మొదటి ప్రైవేట్ సెక్టార్ ఫైనల్ అసెంబ్లీ లైన్. ఇందులో విమానాల తయారీ, వాటి భాగాలను అసెంబ్లింగ్ చేయడం, వాటిని పరీక్షించడం వంటివి ఉంటాయి. అంతేకాకుండా విమానాల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పిస్తారు. కాగా లక్ష్మీ విలాస్ ప్యాలెస్ను సందర్శించిన అనంతరం మోదీ అమ్రేలీకి వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం 2:45 గంటలకు దుధాలలో భారత్ మాతా సరోవరాన్ని ప్రారంభించనున్నారు.ఇది కూడా చదవండి: మల్టీ-అసెట్ ఫండ్స్తో దీపావళి కాంతులు -
మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలో తెలుగు శాస్త్రవేత్త
పట్టుమని 200 కుటుంబాలు నివాసమున్న గ్రామం. నగర శివారులో ఉన్నా... కాంక్రీట్ జంగిల్ పోకడలు కనిపించవు. పదో తరగతి వరకూ గ్రామంలో బేల్దారి పనులు, నగరంలో పండ్ల విక్రయంతో తల్లిదండ్రులకు చేదోడు. చిరుప్రాయం నుంచే శారీరక మార్పులతో సహ విద్యార్థుల చిన్నచూపు. వ్యక్తి వెనుక సూటిపోటి మాటలు... అవమానకర వ్యాఖ్యలు. కట్ చేస్తే.. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఫార్మా రంగ శాస్త్రవేత్త... ట్రాన్స్ఫ్యూజన్ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచ దేశాలు గుర్తించేలా మిస్ వరల్డ్ రన్నరప్.. స్ఫూర్తిదాయక జీవనంతో పలువురికి ఆదర్శం. నవంబర్లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ విజేత దిశగా అడుగులు. ఇది అనంతపురం జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్ హన్నా రాథోడ్ విజయ ప్రస్థానం. చదువుతో ఆమె సాధించిన ఒక్క గెలుపు కుటుంబాన్నే కాదు.. ఏకంగా జిల్లా కీర్తిప్రతిష్టలను పెంచింది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవనం ఆమె మాటల్లోనే... అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి గ్రామం. నాన్న మల్లేష్, అమ్మ పద్మావతికి మూడో సంతానంగా పుట్టాను. ఓ అన్న, అక్క ఉన్నారు. నాకు ఆనంద్బాబు అని పేరుపెట్టారు. అమ్మ, నాన్న అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్లో పండ్ల వ్యాపారం చేసేవారు. పేదరికం కారణంగా పస్తులతో గడిపిన రోజులెన్నో చూశా. దీంతో బడికి వెళ్లే సమయంలోనే ఏ మాత్రం వీలు చిక్కినా ఊళ్లో కూలి పనులకు, అమ్మ, నాన్నతో కలసి పండ్ల వ్యాపారం చేస్తూ వచ్చా. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు నాలో శారీరక మార్పులు గుర్తించా. సమాజానికి తెలిస్తే బయటకు గెంటేసి హేళన చేస్తారేమోనని భయపడ్డా. దీంతో ఎవరితోనూ చెప్పుకోలేదు. చిన్న కొడుకు కావడంతో మా అమ్మ నన్ను ఎంతో గారాబంతో పెంచుతూ వచ్చింది. నా వెనుక గేలి చేసేవారు సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న వివక్ష నన్ను చాలా భయపెట్టేది. ఇలాంటి సమయంలో కేవలం చదువు ఒక్కటే నా సమస్యకు చక్కటి పరిష్కారమని గుర్తించాను. దీంతో పట్టుదలగా చదువుకుంటూ క్లాస్లో టాపర్గా నిలుస్తూ వచ్చా. ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మీడియం చదివిన నేను ఆ తర్వాత అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ–ఫార్మసీ చేశా. అక్కడ చాలా మంది స్నేహితులు ఉండేవారు. వారిలో కొందరు నా ముందు ఏమీ అనకపోయినా... నా వెనుక చెడుగా మాట్లాడుకునేవారని తెలిసి బాధపడ్డాను. జన్యుపరమైన లోపాన్ని ఎవరూ గుర్తించలేదు. గేలి చేసినా కుంగిపోలేదు. పట్టుదలతో బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ పూర్తి చేశా. పెళ్లి ప్రయత్నాల నుంచి బయటపడి ఎం–ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో ఎంఎస్ చేయాలని అనుకున్నా. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా రెండేళ్లు పనిచేశా. అదే సమయంలో జూనియర్ ఫార్మసీ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చిన డబ్బును దాచుకుని విదేశీ విద్యావకాశాలపై అన్వేషిస్తూ వచ్చా. ఈ లోపు అనంతపురం కలెక్టరేట్లో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలియగానే చాలా మంది అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయకూడదని భావించిన నేను.. విదేశాలకు వెళ్లిపోతే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయనుకున్నా. అదే సమయంలో విదేశీ విద్యావకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్ష రాసి మెరుగైన ఫలితాలతో స్పెయిన్లో ఎంఎస్ సీటు దక్కించుకున్నా. కోర్సు పూర్తి కాగానే అక్కడే బయో ఇంజినీరింగ్ సొల్యూషన్స్లో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం వచ్చింది. శాస్త్రవేత్తగా స్థిరపడిన తర్వాత 2021లో ట్రాన్స్ఫ్యూజన్ ఆపరేషన్ చేయించుకుని హన్నారాథోడ్గా పేరు మార్చుకుని ఇంట్లో వారికి విషయం చెప్పా. చదువే సెలబ్రిటీని చేసింది ట్రాన్స్జెండర్ల జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. మన వ్యక్తిత్వం చెదరకుండా కాపాడుకోవాలి. ఎలాంటి వ్యక్తికైనా ప్రతికూల కాలమంటూ ఉంటుంది. నిరాటంకంగా అవరోధాల్ని అధిగమించి విజయం సాధిస్తే ఈ సమాజమే గౌరవప్రదంగా చూస్తుంది. మనం కోరకుండానే వచ్చే జన్యుపరమైన లోపాలకు కుంగిపోరాదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ధర్మాన్ని, దైవాన్ని నిందించడం కూడా పొరబాటే. అసలు ప్రతికూలతల్లో కూడా అనుకూలతను వెదికి అనుకూలంగా మలచుకునే యుక్తిని సాధించగలగాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. నా జీవితమే ఇందుకు నిదర్శనం. చదువే ననున్న సెలబ్రిటీని చేసింది. ఈ స్థాయికి నేను ఎదగడంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు వివరిస్తూ తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ మూడు భాషల్లో పుస్తకం రచిస్తున్నా. త్వరలో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తా. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రతిభ గతేడాది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో మిస్ వరల్డ్ ట్రాన్స్–2023 పోటీలు జరిగాయి. అక్కడే పనిచేస్తున్న నాకు ఈ విషయం తెలిసి భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు దరఖాస్తు చేసుకున్నా. దీంతో నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. ఈ పోటీలో ఏకంగా రన్నరప్గా నిలవడంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దీంతో సేవా కార్యక్రమాలు చేపట్టి ట్రాన్స్ సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించాను. ఆ దిశగా తొలి ప్రయత్నం చేశాను. ఇందుకోసం స్పెయిన్లోని కొన్ని కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపాను. ట్రాన్స్ సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్న వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి నవంబర్లో న్యూఢిల్లీలో మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. ఈ పోటీల్లో పాల్గొనడానికే ఇండియాకు వచ్చా. ఇక్కడ మా ఊరి ప్రజలు నన్ను చూసి చాలా సంతోష పడ్డారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనే చీఫ్ గెస్ట్. ఇంతకంటే గౌరవం ఏమి కావాలి? -
రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం
టెన్నిస్ దిగ్గజం, స్పానిష్ బుల్ రఫెల్ నదాల్ ప్రొఫెషనల్ టెన్నిస్కు గుడ్బై చెప్పాడు. ఈ విషయాన్ని అతను సోషల్మీడియా ద్వారా షేర్ చేశాడు. తన కెరీర్ మొత్తంలో మద్దతుకు నిలిచిన వారికి నదాల్ కృతజ్ఞతలు తెలిపాడు. నదాల్ వచ్చే నెలలో (నవంబర్) జరుగబోయే డేవిస్ కప్లో చివరిసారి స్పెయిన్ తరఫున బరిలోకి దిగనున్నట్లు ప్రకటించాడు. 38 ఏళ్ల నదాల్ తన సుదీర్ఘ కెరీర్లో 22 గ్రాండ్స్లామ్ టైటిళ్లు సాధించాడు. నదాల్కు మట్టి కోర్టు వీరుడిగా పేరుంది. నదాల్ సాధించిన గ్రాండ్స్లామ్ టైటిల్స్ఆస్ట్రేలియా ఓపెన్ (2009, 2022)-2ఫ్రెండ్ ఓపెన్ (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022)- 14వింబుల్డన్ (2008, 2010)-2యూఎస్ ఓపెన్ (2010, 2013, 2017, 2019)-4 -
పదకొండేళ్ల తర్వాత ప్రపంచం ముందుకు షూమాకర్!
రేసింగ్ రారాజు మైకేల్ షూమాకర్ పదకొండేళ్ల తర్వాత తొలిసారి బయట కనిపించినట్లు సమాచారం. తన కూతురు గినా పెళ్లి సందర్భంగా ఈ దిగ్గజ డ్రైవర్ ప్రపంచం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. యూకేకు చెందిన మెట్రో సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా ఏడుసార్లు ఫార్ములా వన్ చాంపియన్గా నిలిచిన షూమాకర్ 2013లో ఘోర ప్రమాదానికి గురయ్యాడు.ఫ్రాన్స్లో ఆల్ఫ్ పర్వతాల్లో కుటుంబంతో కలిసి స్కీయింగ్ చేస్తుండగా.. పట్టుతప్పి పడిపోయాడు. ఈ క్రమంలో బండరాయికి తల బలంగా తగలడంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. పేరుకు బతికి ఉన్నాడే గానీ పూర్తిగా అచేతనంగా మారిపోయాడు. ఆ తర్వాత అతడి మళ్లీ పూర్తిస్థాయిలో కోలుకోనే లేదనే వార్తలు వచ్చాయి.అయితే, తాజాగా తన కుమార్తె గినా వివాహ బంధంలో అడుగుపెడుతున్న వేళ షూమాకర్ బయటకు వచ్చినట్లు కథనాలు రావడం అతడి అభిమానులకు ఊరటనిచ్చాయి. కాగా గినా అథ్లెట్. గుర్రపుస్వారీలో ఆమెకు అనుభవం ఉంది. ఇక గినా పెళ్లి విషయానికొస్తే.. తన చిరకాల స్నేహితుడు ఇయాన్ బెత్కెను ఇటీవలే వివాహమాడింది. మూడు రోజుల క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేసింది.అయితే, అందులో షూమాకర్ సహా మిగతా కుటుంబ సభ్యులెవరూ లేకపోవడం గమనార్హం. ఇక స్పెయిన్లోని మాలోర్కాలో గల లగ్జరీ విల్లాలో గినా వెడ్డింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కాగా జర్మనీకి చెందిన 55 ఏళ్ల షూమాకర్ కుమారుడు మిక్ షూమాకర్ కూడా ఎఫ్1 రేసింగ్లో పాల్గొన్నాడు. -
వింత ఉద్యోగం: పెళ్లిళ్లు చెడగొట్టడమే పని, భారీ ఆదాయం కూడా!
సమాజంలో ఒకపుడు పెళ్ళిళ్ల పేరయ్యలకు, ఇపుడు మ్యారేజ్ బ్యూరోలకున్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలనేది మ్యారేజ్ బ్రోకర్స్ ఆచరించే కామన్ సూత్రం. ప్రస్తుతం ఇదో పెద్ద వ్యాపారంగా మారిపోయింది. కానీ డబ్బులు తీసుకొని మరీ పెళ్లిళ్లను చెడగొట్టే (మ్యారేజ్ బ్రేకింగ్) ఉద్యోగం గురించి విన్నారా? ఇలాంటి జాబ్కూడా ఒకటి ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరీ కథనాన్ని చదవాల్సిందే!కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ప్రపంచంలోని వివిధ రకాల ఉద్యోగాల గురించి విన్నాం. వీటిలో కొన్ని సాధారణ ఉద్యోగాలు మరికొన్ని విచిత్రమైనవి, గొప్పవి, గౌరవనీయమైనవి, కష్టతరమైనవి ఇలా రకరకాలు. కానీ స్పెయిన్ దేశానికి చెందిన ఎర్నెస్టో (Ernesto ) అనే వ్యక్తి ఒక వింత పనిలో బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఇందుకు భారీగా డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు. ఆడిటీ సెంట్రల్ వెబ్సైట్ ప్రకారం ఈ విచిత్రమైన జాబ్ గురించి ఎర్నెస్టో స్వయంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఇదేం చోద్యం రా బాబూ అంటూ నెటిజనులు విస్తుపోతున్నారు. దీంతో ఇతగాడు స్పెయిన్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు.డబ్బు కోసమే ఈ పనిచేస్తున్నా కొంతమంది పెళ్లి తరువాత సుఖంగా కాపురాలు చేసుకుంటోంటే, మరి కొంతమందికి మాత్రం అదొక పీడకలగా మారిందట. అందుకే చాలా మంది క్లయింట్లు తమ మ్యారేజ్ని బ్రేక్ చేయమని తనను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నాడు ఎర్నెస్టో. ఇందులో తన ఖాతాదారులనుంచి కనీసం రూ. 46,135 వసూలు చేస్తాడు. పెళ్లి ఎలా చెడగొడతాడంటేఫీజు తీసుకున్న తర్వాత రోజునుంచి మనోడి పని షురూ అవుతుంది. అమ్మాయి, అబ్బాయి వివరాలు తీసుకుంటాడు. సరిగ్గా పెళ్లి జరుగుతున్న సమయానికి అక్కడ వాలిపోతాడు. అతిథులందరి ముందు అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో ఒకర్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు. పారిపోదాం రమ్మంటూ ఆస్కార్ లెవల్లో నటిస్తూ నానా హంగామా చేస్తాడు. దెబ్బకి పెళ్లికి కేన్సిల్. క్లయింట్ ఖుష్.అదిరిపోయే ట్విస్టు కూడా ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సమయంలోఅవతలివాళ్లు ఇతడిని కొట్టినా, చెంపదెబ్బ కొట్టినా అదనపు ఛార్జీ చెల్లించుకోవాలి. ప్రతి స్లాప్కి,4600 రూపాయలు అదనంగా తీసుకుంటాడు. అందుకే ఎక్కువ దెబ్బలు తినే ప్రయత్నం చేస్తాడట. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు తనను ఈ పని చేయమని వేడుకుంటారని చెబుతున్నాడు ఎర్నెస్టో. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పెళ్లిళ్ల సీజన్లో మనోడి డిమాండ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుందట.ఇదీ చదవండి : డ్రీమ్ వెడ్డింగ్: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్ -
స్పెయిన్కు పరారైన... వెనిజులా విపక్ష నేత
వెనిజులాలో నికొలస్ మదురో నియంత పాలనకు ముగింపు ఖాయమని ఆశించిన ఆ దేశ ప్రజలకు మరింత నిరాశ కలిగించే పరిణామమిది. అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల సంయుక్త అభ్యరి్థగా మదురోతో తలపడ్డ ఎడ్మండో గొంజాలెజ్ తాజాగా దేశం వీడి స్పెయిన్లో ఆశ్రయం పొందారు. జూలైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వాస్తవ విజేత గొంజాలెజేనని విపక్షాలతోపాటు పలు విదేశీ ప్రభుత్వాలు కూడా పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గొంజాలెజ్కు ఆశ్రయం కలి్పంచేందుకు స్పెయిన్ అంగీకరించిందని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రొడ్రిగెజ్ ప్రకటించారు. దీనిపై గొంజాలెజ్ గానీ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో గానీ స్పందించలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మచాడోపై మదురో ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో ఆఖరి దశలో గొంజాలెజ్ రంగంలోకి దిగడం తెలిసిందే. అయితే, వెనిజులా వీడాలన్నది గొంజాలెజ్ నిర్ణయం మాత్రమేనని, తాము పంపిన ఎయిర్ఫోర్స్ విమానంలో తమ దేశం చేరుకున్నారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆయన వినతి మేరకే ఆశ్రయం కలి్పంచామని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ చెప్పారు. ‘వెనిజులా ప్రజల హక్కుల కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. గొంజాలెజ్ వెనిజులా హీరో. ఆయన భద్రత బాధ్యతను స్పెయిన్ తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. వెనిజులాకు రావడానికి కొద్ది రోజుల ముందే రాజధాని కారకాస్లోని తమ రాయబార కార్యాలయంలో గొంజాలెజ్ తలదాచుకున్నారని వెల్లడించారు. ఓటరు జాబితాను ఫోర్జరీ చేశారంటూ వచి్చన ఆరోపణలపై విచారణకు రావాలంటూ మూడు పర్యాయాలు సమన్లు పంపినా హాజరు కాలేదని దేశ అటార్నీ జనరల్ గొంజాలెజ్పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఆయన స్పెయిన్ రాయబార కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచి్చంది. మడురో నిరంకుశ విధానాలతో ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు స్పెయిన్లో ఆశ్రయం పొందారు. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 45 వేల మంది వెనిజులా నుంచి స్పెయిన్కు వలస వెళ్లారు. 2022 గణాంకాల ప్రకారం వెనిజులా వాసులు కనీసం 2.12 లక్షల మంది స్పెయిన్లో ఉంటున్నారు. – కారకాస్ -
అలనాటి అద్భుతం.. 5,600 ఏళ్ల నాటి సమాధుల దిబ్బ
కొత్త రాతియుగానికి చెందిన సమాధుల దిబ్బ ఒకటి స్పెయిన్లో వెలుగు చూసింది. 5,600 ఏళ్ల నాటి ఈ కట్టడంలో అత్యంత భారీ పరిమాణంలో ఉన్న 32 ఏక శిలలను ఉపయోగించడం విశేషం! అవి ఒక్కోటీ కనీసం రెండు జెంబో జెట్ విమానాలంత తూగుతాయట. కొత్త రాతియుగం నాటి అద్భుతంగా చెప్పుకునే బ్రిటన్లోని స్టోన్హెంజ్లో వాడిన రాళ్లకంటే ఇవి పరిమాణంలో చాలా పెద్దవి. వీటిలో అతి పెద్ద రాయి అయితే ఏకంగా 150 టన్నుల బరువుంది. ఇది అతి పెద్ద జీవి అయిన నీలి తిమింగలం బరువుతో సమానం. స్టోన్హెంజ్లోని అతి పెద్ద శిల కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ! ఇక 32 రాళ్లూ కలిపి 1,140 టన్నులుంటాయట. ఇవి సగటున 25 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ఇది దక్షిణ స్పెయిన్లోని మెంగా ప్రాంతంలో ఒక చిన్న గుట్టపై ఉన్న ఈ కట్టడాన్ని మెంగా డోల్మెన్గా పిలుస్తున్నారు. అంటే సమాధుల దిబ్బ అని అర్థం. అయితే ఇది సమాధి కాకపోవచ్చని, బహుశా ప్రార్థనా స్థలం కావచ్చని కూడా ఒక అభిప్రాయముంది. నిర్దిష్టమైన వరుసలో రాళ్లను నిటారుగా నిలిపి, వాటిపై రాళ్లను పరచడం ద్వారా దీన్ని నిర్మించారు. ఇంత భారీ శిలలను గుట్టపైకి తీసుకెళ్లేంతటి ఇంజనీరింగ్ పరిజ్ఞనం ఆనాటి మనుషులకు ఎలా తెలుసన్నది అంతుచిక్కడం లేదన్నారు స్పెయిన్లోని సెవిల్లే యూనివర్సిటీ పూర్వచరిత్ర విభాగ ప్రొఫెసర్ లియొనార్డో గ్రాకా సంజున్. దీనిపై వెలువరించిన పరిశోధన పత్రానికి ఆయన సహ రచయిత. ఈ పేపర్ను జర్నల్ సైన్స్లో తాజాగా ప్రచురించారు. ‘‘ఇది ప్రపంచంలోని పురాతన రాతి కట్టడాల్లోకెల్లా అతి గొప్ప అద్భుతం. కొత్త రాతియుగపు మానవుల శాస్త్ర సాంకేతిక ప్రజ్ఞకు అత్యుత్తమ తార్కాణం’’ అని పరిశోధన బృందం అంటోంది. ‘‘మనిషి అప్పుడప్పుడే వ్యవసాయం నేర్చుకుంటున్నాడు. అన్ని అవసరాలకూ రాతినే వాడుతున్నాడు. లోహపు పనిముట్ల కాలం ఇంకా రాలేదు. మనిషి కనీసం భాష కూడా నేర్వని కాలమది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే ఈ డోల్మెన్ నిర్మాణం ఎంత గొప్ప ఘనతో అర్థమవుతుంది’’ అని చెప్పుకొచి్చంది. వారికి అప్పటికే రాళ్ల లక్షణాలు, కోణాలతో పాటు భౌతిక శాస్త్రం గురించిన అవగాహన కూడా ఉండి ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు.కచ్చితమైన కొలతలు..ఈ నిర్మాణంలో చుట్టూ నిటారుగా పేర్చిన రాళ్లు లోపలివైపుకు నిర్దిష్ట కోణంలో వాలి ఉన్నాయి. దాంతో లోపలి ఖాళీ భాగం కింద విశాలంగా, పైకప్పుకు వెళ్లేకొద్దీ చిన్నగా ఉంది. వాటిపై ఐదు భారీ రాళ్లను పైకప్పుగా పరిచారు. ఎండ, వాన, చలి వంటివాటిని తట్టుకునేందుకు వీలుగా రాళ్ల మధ్య దట్టమైన మట్టి పూత పూశారు. ‘‘కొలతలన్నీ కచ్చితత్వంతో కూడుకుని ఉన్నాయి. ఇలా కట్టాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనేక పరికరాలు కూడా తప్పనిసరి’’ అని పరిశోధన బృందం చెప్పుకొచి్చంది. నిర్మాణంలో వాడిన రాళ్లను అక్కడికి 850 మీటర్ల దూరంలోని క్వారీ నుంచి తొలిచి తరలించినట్టు తేల్చారు. -
‘భారత్కు స్వదేశీ కోచ్ ఉంటేనే మేలు’
న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ జట్టుకు భవిష్యత్తులో స్వదేశీ కోచ్ ఉంటేనే బాగుంటుందని భారత జట్టు కొత్త హెడ్ కోచ్ మనొలొ మార్క్వెజ్ అభిప్రాయపడ్డారు. ఇగోర్ స్టిమాక్ స్థానంలో స్పెయిన్కు చెందిన 55 ఏళ్ల మార్క్వెజ్ను ఇటీవల హెడ్ కోచ్గా నియమించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘స్పెయిన్ తర్వాత ఎక్కువగా గడిపింది భారత్లోనే. అందుకేనేమో కొన్నేళ్ల క్రితం భారత్కు హెడ్ కోచ్ కావాలని గట్టిగా అనుకున్నాను. అది అప్పుడు కల. కానీ ఇప్పుడు ఆ కల నిజమైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు. అయితే భారత్ భిన్న రాష్ట్రాల సమ్మిళితం కాబట్టి స్వదేశీ కోచ్ ఉంటేనే బాగుంటుందని, స్థానిక భాషలు, అంశాలపై ఆయనకు పట్టు ఉంటుందని మార్క్వెజ్ వివరించారు. ‘భారత్ కోచ్గా జట్టు స్థాయి పెంచడమే మా లక్ష్యం. వ్యక్తిగతంగా ఆటగాళ్లు, సమష్టిగా జట్టు మెరుగయ్యేందుకు ప్రణాళికలు రచిస్తాం. ఇప్పటికిప్పుడు దీని ఫలితాలు రాకపోవచ్చు. దీనికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుత లక్ష్యమైతే ఆసియా కప్–2027కు అర్హత సాధించడం. ఆసియా కప్ క్వాలిఫయర్స్కు ముందు భారత్ ఆరేడు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతుంది’ అని అన్నారు. -
‘బ్లీడింగ్ ఐస్’ వ్యాధి అంటే..! సోకితే అంతేనా..!
కొన్ని రకాల వ్యాధులు చాపకింద నీరులా నెమ్మదిగా వస్తాయి. మనం కూడా పెద్ద సమస్య కాదని, లైట్గా తీసుకుంటాం. అది కాస్త మనం చూస్తుండగానే సీరియస్గా మారి ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి వ్యాధి బారినపడి ఇక్కడొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన స్పెయిన్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..స్పెయిన్లో 74 ఏళ్ల వ్యక్తి ప్రాణాంతకమైన క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(సీసీహెచ్ఎఫ్) బారిన పడి మరణించాడు. దీనిని "బ్లీడింగ్ ఐస్ వ్యాధి" అని కూడా పిలుస్తారు. ఇది వైరల్ వ్యాధి. దీని కారణంగా మరణాల రేటు సుమారు 40% వరకు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఆ వ్యక్తి మాడ్రిడ్కు నైరుతి దిశలో వంద మైళ్ల దూరంలో ఉన్న టోలెడోలో టిక్ కాటుకు గురవ్వడంతో జూలై 19న మోస్టోల్స్ ప్రాంతంలోని రే జువాన్ కార్లోస్ విశ్వవిద్యాలయ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ వైద్యులు అతడి పరిస్థితిని గుర్తించిన తర్వాత హై-డిపెండెన్సీ ఐసోలేషన్ యూనిట్కు తరలించారు. మొదట్లో పరిస్థితి నిలకడగా ఉన్నా..తర్వాత.. తర్వాత అతడి పరిస్థితి క్షీణించి మరణించడం జరిగింది. దీన్ని క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(సీసీహెచ్ఎఫ్) సంబంధిత మరణంగా పేర్కొన్నారు. అంతేగాదు వైద్యులు అప్రమత్తమై ఈ ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తిని అరికట్టేలా తదుపరి కేసుల్లో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్యులు ఈ టిక్ బోర్న్ వ్యాధి ఎబోలా మాదిరిగా ఉంటుందని, డబ్ల్యూహెచ్ఓ జాబితా చేసిన తొమ్మిది వ్యాధికారక క్రిములకు సంబంధించినదని, అంటువ్యాధిలాంటిదని వెల్లడించారు. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అంటే..క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ (CCHF) అనేది టిక్ కాటు ద్వారా మానవులకు వ్యాపించే అరుదైన వైరల్ వ్యాధి. జంతువులను వధించిన వెంటనే, తక్షణమే వైరమిక్ జంతు కణజాలాలతో (వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించిన జంతు కణజాలం) సంపర్కం ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఇది అంటువ్యాధులకు కారణమవుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికా, బాల్కన్లు, మధ్యప్రాచ్యం, ఆసియాలలో ఉంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధిని తొలిసారిగా 1944లోక్రిమియన్ ద్వీపకల్పంలో గుర్తించారు. అందువల్లే దీనికి క్రిమియన్ హెమరేజిక్ ఫీవర్ అని వైద్యులు నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ వ్యాధిని 1956లో కాంగో బేసిన్లో గుర్తించడం జరిగింది. దీంతో ఈ వ్యాధికి ఈ రెండు ప్రాంతాల మీదుగా క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అనే పేరుని పెట్టారు నిపుణులు.ఈ వ్యాధి లక్షణాలు..తీవ్ర జ్వరంతీవ్రమైన తలనొప్పివెన్ను, కీళ్ల నొప్పులుకడుపు నొప్పి, వాంతులుఎర్రటి కళ్ళు , ఎర్రబడిన ముఖంనోటి పైకప్పు మీద ఎర్రటి మచ్చలుకామెర్లుమానసిక స్థితి, ఇంద్రియ అవగాహనలో మార్పులుఆందోళననిద్రమత్తురక్తస్రావం.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం..ఆస్పత్రిలో చేరిని వారిలో దాదాపు 50% మంది మరణిస్తారని పేర్కొంది. నివారణటిక్ కాటును నివారించడానికి డీఈఈటీ కలిగిన క్రిమి వికర్షకాన్ని ఉపయోగించండి.సీసీహెచ్ఎఫ్ ఉన్న జంతువులను నిర్వహించేటప్పుడు చేతి తొడుగులు, పొడవాటి చేతులు, ప్యాంటు ధరించండి.సోకిన జంతువులు లేదా వ్యక్తుల శరీర ద్రవాలు మీపై ప్రసరించకుండా జాగ్రత్త పడండి. (చదవండి: అక్కడ భర్త జీతం అంతా భార్య చేతిలో పెట్టాల్సిందేనట..!) -
భారత ఫుట్బాల్ టీమ్ హెడ్ కోచ్గా మనోలో మార్క్వెజ్
భారత ఫుట్బాల్ టీమ్కు కొత్త కోచ్ వచ్చాడు. స్పెయిన్కు చెందిన మనోలో మార్క్వెజ్ను టీమ్ హెడ్ కోచ్గా నియమిస్తున్నట్లు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) శనివారం ప్రకటించింది. 55 ఏళ్ల మార్క్వెజ్ ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టీమ్ ఎఫ్సీ గోవాకు కోచ్గా వ్యవహరిస్తున్నారు.అయితే 2024–25 సీజన్లో ఆయన ఇటు భారత జట్టుతో పాటు అటు ఎఫ్సీ గోవా కోచ్గా కూడా రెండు బాధ్యతలను నిర్వర్తిస్తారని ఏఐఎఫ్ఎఫ్ వెల్లడించింది. కోచ్గా యూఈఎఫ్ఏ ప్రొ లైసెన్స్ ఉన్న మార్క్వెజ్ పదవీకాలంపై ఫెడరేషన్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు.వియత్నాం, లెబనాన్లతో వచ్చే అక్టోబరులో జరిగే మూడు దేశాల టోర్నీనుంచి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారు. 2020 నుంచి భారత్లో మార్క్వెజ్ కోచింగ్ కొనసాగుతోంది. ఎఫ్సీ గోవాకు కోచ్గా మారక ముందు ఐఎస్ఎల్లో ఆయన హైదరాబాద్ ఎఫ్సీకి కోచ్గా పని చేశారు.మార్క్వెజ్ నేతృత్వంలోనే 2021–22లో హైదరాబాద్ ఐఎస్ఎల్ చాంపియన్గా నిలవడం విశేషం. స్పెయిన్లో కోచ్గా మార్క్వెజ్ అపార అనుభవం ఉంది. పలు స్థానిక క్లబ్లతో పాటు లా లిగా జట్టు లాస్ పామాస్కు కూడా కోచ్గా పని చేశారు. -
Euro Cup: ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన స్పెయిన్.. తొలి జట్టుగా
పుష్కర కాలం తర్వాత స్పెయిన్ జట్టు అంతర్జాతీయ ఫుట్బాల్ వేదికపై మళ్లీ మెరిసింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ టోర్నీలో స్పెయిన్ రికార్డుస్థాయిలో నాలుగోసారి చాంపియన్గా నిలిచింది. అంతేకాదు రెండు అత్యంత అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకుంది.భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఫైనల్లో అల్వారో మొరాటో సారథ్యంలోని స్పెయిన్ 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. స్పెయిన్ తరఫున నికో విలియమ్స్ (47వ ని.లో), మికెల్ ఒయర్జబాల్ (86వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఇంగ్లండ్ జట్టుకు పాల్మెర్ (73వ ని.లో) ఏకైక గోల్ అందించాడు.ఆట 68వ నిమిషంలో కెప్టెన్ అల్వారో మొరాటో స్థానంలో సబ్స్టిట్యూట్గా వచ్చిన ఒయర్జబాల్ సహచరుడు మార్క్ కుకురెల్లా క్రాస్ పాస్ను లక్ష్యానికి చేర్చి స్పెయిన్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 90వ నిమిషంలో ఇంగ్లండ్ ప్లేయర్ మార్క్ గుయెహి హెడర్ షాట్ను గోల్ పోస్ట్ ముందు స్పెయిన్ డిఫెండర్ డాని ఓల్మో హెడర్ షాట్తో అడ్డుకోవడం కొసమెరుపు.తొలి జట్టుగా చరిత్రఈ గెలుపుతో స్పెయిన్ జట్టు 66 ఏళ్ల టోర్నీ చరిత్రలో అత్యధికంగా నాలుగుసార్లు విజేతగా నిలిచిన జట్టుగా గుర్తింపు పొందింది. గతంలో స్పెయిన్ 1964, 2008, 2012లలో యూరో టైటిల్ను సాధించింది.జర్మనీ జట్టు మూడుసార్లు (1972, 1980, 1996) విజేతగా నిలిచింది. 1966లో ఏకైక ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన తర్వాత మరో అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేకపోయిన ఇంగ్లండ్ జట్టుకు వరుసగా రెండోసారి యూరో టోర్నీలో నిరాశ ఎదురైంది. 2021 యూరో ఫైనల్లో ఇటలీ చేతిలో ఓడిన ఇంగ్లండ్కు ఈసారి స్పెయిన్ షాక్ ఇచ్చింది.బంతిని 63 శాతం తమ ఆధీనంలో ఉంచుకొని ఇంగ్లండ్ ఆటగాళ్లను కట్టడి చేసింది. ఏకంగా 60 సార్లు ఇంగ్లండ్ గోల్పోస్ట్ వైపునకు వెళ్లిన స్పెయిన్ 15 సార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించింది. మరోవైపు హ్యారీ కేన్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు 31 సార్లు స్పెయిన్ గోల్పోస్ట్ వైపునకు వెళ్లి తొమ్మిదిసార్లు గోల్ లక్ష్యంగా షాట్లు సంధించింది.విజేతకు రూ. 72 కోట్ల 89 లక్షలుస్పెయిన్ టీనేజ్ స్టార్, 17 ఏళ్ల లమీన్ యమాల్ ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’... స్పెయిన్కే చెందిన రోడ్రి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు గెల్చుకున్నారు. ఫైనల్ విజేత స్పెయిన్ జట్టుకు 80 లక్షల యూరోలు (రూ. 72 కోట్ల 89 లక్షలు), రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు 50 లక్షల యూరోలు (రూ. 45 కోట్ల 56 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. ఓవరాల్గా రూ. 253 కోట్ల ప్రైజ్ మనీ స్పెయిన్కు దక్కింది.స్పెయిన్ అరుదైన రికార్డులు ఇవే1. యూరో టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్ల్లోనూ గెలుపొంది విజేతగా నిలిచిన తొలి జట్టుగా స్పెయిన్ రికార్డు నెలకొల్పింది. 2. ఒకే యూరో టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా స్పెయిన్ గుర్తింపు పొందింది. ఫ్రాన్స్ (14 గోల్స్; 1984లో) పేరిట ఉన్న రికార్డును స్పెయిన్ తాజాగా తిరగరాసింది. 🔝 performance 🔝 tournament Nico Williams is the real deal 👏@Vivo_GLOBAL | #EUROPOTM pic.twitter.com/lPu38RWoX0— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024 -
యూరో కప్ విజేతకు ఘన స్వాగతం.. మాడ్రిడ్ దద్దరిల్లిపోయింది! వీడియో
యూరో కప్-2024 విజేత స్పెయిన్కు ఆపూర్వ స్వాగతం లభించింది. ట్రోఫీతో స్వదేశానికి చేరుకున్న స్పెయిన్ జట్టుకు అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. తమ సొంత గడ్డపై అడుగుపెట్టిన స్పెయిన్ జట్టు.. తొలుత ఆ దేశ రాజు ఫెలిపే VI, అతని కుటుంబాన్ని కలిశారు.ఆ తర్వాత రాజధాని మాడ్రిడ్లో ఓపెన్-టాప్ బస్ పరేడ్లో స్పెయిన్ ఆటగాళ్లు పాల్గోనున్నారు. తమ ఆరాధ్య జట్టుకు ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున మాడ్రిడ్లోని సిబిలెస్ స్క్వేర్ వద్దకు చేరుకున్నారు.అభిమానుల కేరింతల మధ్య స్పెయిన్ జట్టు బస్ విక్టరీ పరేడ్ జరిగింది. స్పెయిన్ ఆటగాళ్లు ట్రోఫీతో ఫ్యాన్స్కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ను 2-1 తేడాతో ఓడించిన స్పెయిన్ యూరోకప్ ఛాంపియన్స్గా నిలిచింది. స్పెయిన్కు ఇది నాలుగో యూరో కప్ టైటిల్ కావడం గమనార్హం. 1964, 2008, 2012 యూరో కప్ టైటిల్స్ను స్పెయిన్ సొంతం చేసుకుంది. 🎉🇪🇦 ¡Ojo al ambientazo en Cibeles para recibir a los #C4MPEONES de la #EURO2024!📹 @ernestoasc_ pic.twitter.com/piTQDDiqKm— MARCA (@marca) July 15, 2024 -
నాలుగోసారి యూరోకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ ఫుట్బాల్ జట్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
యూరో కప్ విజేతగా స్పెయిన్.. ప్రైజ్ మనీ ఎన్ని వందల కోట్లంటే?
దాదాపు నెల రోజుల పాటు ఫుట్బాల్ అభిమానులను ఉర్రూతలూగించిన యూరో కప్-2024కు ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం రాత్రి స్పెయిన్- ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్తో ఈ టోర్నీ ముగిసింది. యూరోకప్ విజేతగా స్పెయిన్ నిలిచింది.ఫైనల్లో 2-1 తేడాతో ఇంగ్లండ్ను ఓడించిన స్పెయిన్.. నాలుగో సారి టైటిల్ను ముద్దాడింది. ఈ క్రమంలో విజేత స్పెయిన్ ప్రైజ్ మనీ ఎంత? రన్నరప్ ఇంగ్లండ్కు ఎంత దక్కుతుంది? ప్లేయర్ ఆఫ్ది టోర్నీ ఎవరన్న ఆంశాలపై ఓ లుక్కేద్దాం.విజేత స్పెయిన్కు ఎన్ని కోట్లంటే?యూరో కప్ విజేత స్పెయిన్కు ప్రైజ్ మనీ రూపంలో మొత్తం 30.4 మిలియన్ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ. 253 కోట్ల ప్రైజ్ మనీ స్పెయిన్కు దక్కింది. అన్ని మ్యాచ్ల్లో గెలిచి ఛాంపియన్స్గా నిలిచినందుకు బోనస్+ గ్రూప్ స్టేజ్ విజయాలు+ క్వార్టర్-ఫైనల్ + సెమీ-ఫైనల్+ ఫైనల్+ టోర్నీలో పాల్గోనే రుసుము మొత్తం కలిపే రూ. 253 కోట్ల నగదు బహుమతిగా స్పెయిన్కు లభించనుంది.రన్నరప్ ఇంగ్లండ్కు ఎంతంటే?రన్నరప్ ఇంగ్లండ్కు ప్రైజ్ మనీ రూపంలో మొత్తం 27.25మిలియన్ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ.227 కోట్ల ప్రైజ్ మనీ ఇంగ్లండ్కు దక్కింది. గ్రూప్ స్టేజ్ విజయాలు+ క్వార్టర్-ఫైనల్ + సెమీ-ఫైనల్+ టోర్నీలో పాల్గోనే రుసుము+ రౌండ్ 16 మొత్తం ప్రైజ్మనీ కలిపి ఇంగ్లండ్కు రూ.227 కోట్ల నగదు బహుమతిగా అందనుంది. ఇక సెమీఫైనల్కు చేరిన ఫ్రాన్స్, నెదర్లాండ్స్కు చెరో రూ. 101 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.యంగ్ ప్లేయర్ ఆఫ్ది టోర్నీ: లామిన్ యమల్ (స్పెయిన్)ఈ టోర్నీలో లామిన్ యమల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.17 ఏళ్ల యమల్ ఒక గోల్తో పాటు 4 అసిస్ట్లు చేశాడు. ఈ యువ ప్లేయర్ కచ్చితంగా ఫ్యూచర్ స్టార్ అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: రోడ్రి (స్పెయిన్)స్పెయిన్ తరఫున మిడ్ఫీల్డ్లో రోడ్రి అదరగొట్టాడు. స్పెయిన్ విజేతగా నిలవడంలో రోడ్రిది కీలకపాత్ర. గోల్డెన్ బూట్ విజేతలు వీరే..యూరో కప్-2024 గోల్డన్ బూట్ విజేతలగా ఆరుగురు నిలిచారు. మొత్తం ఆరు మంది ఆటగాళ్లు సమంగా 3 గోల్స్ చేసి సంయుక్తంగా గోల్డన్ బూట్ అవార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, స్పెయిన్ అటాకింగ్ మిడ్ఫీల్డర్ డాని ఓల్మో, జార్జియా మిడ్ ఫిల్డర్ జార్జెస్ మికౌతాడ్జే, కోడి గక్పో, ఇవాన్ ష్రాంజ్,జమాల్ ముసియాలా ఉన్నారు. -
'స్పెయిన్'దే యూరో కప్.. ఇంగ్లండ్కు మళ్లీ నిరాశే (ఫోటోలు)
-
‘యూరో’ చాంపియన్గా స్పెయిన్
యూరో ఫుట్బాల్ కప్-2024 ఛాంపియన్స్గా స్పెయిన్ జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ను 2-1 తేడాతో ఓడించిన స్పెయిన్.. నాలుగో సారి యూరో కప్ టైటిల్ను ముద్దాడింది. స్పెయిన్ విజయంలో మైకెల్ ఓయర్జాబల్ కీలక పాత్ర పోషించాడు.చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో 86వ నిమిషంలో గోల్కొట్టిన ఓయర్జాబల్ స్పెయిన్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో 86వ నిమిషంలో గోల్కొట్టిన ఓయర్జాబల్ స్పెయిన్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ ఫైనల్ మ్యాచ్ ఫస్ట్హాఫ్ నీవా నేనా అన్నట్లు సాగింది. ఇరు జట్లు కూడా తొలి ఆర్ధ భాగంలో ఒక్క గోల్కూడా సాధించలేకపోయాయి. ఫస్ట్హాప్ ముగిసే సమయానికి ఇరు జట్లు 0-0గా నిలిచాయి. ఆ తర్వాత సెకెండ్ హాఫ్లో 46వ నిమిషంలో నికో విలియమ్స్ అద్భుత గోల్తో స్పెయిన్ ఖాతా తెరిచాడు. ఇంగ్లండ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటకి గోల్ సాధించడంలో విఫలమైంది. ఈ క్రమంలో మ్యాచ్ 60 నిమిషంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సెమీఫైనల్ హీరో వాట్కిన్స్ వచ్చాడు. అతడు వచ్చిన కూడా ఫలితం మాత్రం మారలేదు. ఇంగ్లీష్ జట్టు నిరాశలో కూరుకుపోయిన వేళ మిడ్ఫీల్డర్ కోల్ పామర్ 73వ నిమిషంలో సంచలన గోల్తో తమ జట్టుకు తొలి గోల్ను అందించాడు.దీంతో స్కోర్లు 1-1తో సమమయ్యాయి. మళ్లీ ఇంగ్లండ్ కమ్బ్యాక్ ఇవ్వడంతో స్పెయిన్ కాస్త ఒత్తడికి గురైంది. అయితే సెకెండ్ హాఫ్ సమయం ముగుస్తున్నప్పటికి గోల్ మాత్రం ఇరు జట్లు సాధించలేకపోయాయి. దీంతో పెనాల్టీ షుటౌట్ తప్పదని అంతా భావించారు.కానీ మ్యాచ్ 86వ నిమిషంలో ఓయర్జాబల్ సూపర్ గోల్తో స్పెయిన్కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. స్పెయిన్కు ఇది నాలుగో యూరో కప్ టైటిల్ కావడం గమనార్హం. 1964, 2008, 2012 యూరో కప్ టైటిల్స్ను స్పెయిన్ సొంతం చేసుకుంది. 🇪🇸 Spain are champions of Europe 🏆#EURO2024 pic.twitter.com/Ch0AF0iPWl— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024 -
ఫుట్బాల్ జోష్
ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానులను గంటల వ్యవధిలో రెండు ఆసక్తికర సమరాలు అలరించబోతున్నాయి. జర్మనీలోని బెర్లిన్ వేదికగా జరిగే యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్, స్పెయిన్ తలపడనున్నాయి. స్పెయిన్ గతంలో మూడు సార్లు విజేతగా నిలవగా...ఇంగ్లండ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. మరో వైపు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగే కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనాను కొలంబియా ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో అర్జెంటీనా ఏకంగా 15 సార్లు టైటిల్ నెగ్గగా...కొలంబియా ఒక సారి ట్రోఫీని సొంతం చేసుకుంది. -
EURO CUP 2024: సెమీస్లో ఫ్రాన్స్ ఓటమి.. ఫైనల్లో స్పెయిన్
యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో స్పెయిన్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్.. ఫ్రాన్స్పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలి అర్ద భాగంలోనే మూడు గోల్స్ నమోదయ్యాయి. 8వ నిమిషంలో రాండల్ కోలో ముఆని గోల్ సాధించి ఫ్రాన్స్కు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం స్పెయిన్ ఆటగాళ్లు 21వ నిమిషంలో లామిన్ యమాల్, 25వ నిమిషంలో డానీ ఓల్మో గోల్స్ సాధించారు. రెండో అర్ద భాగంలో ఫ్రాన్స్ ఎంత ప్రయత్నించినా.. స్పెయిన్ ఆధిక్యతను తగ్గించలేక పోయింది. ఫలితంగా ఓటమిపాలైంది. లామిన్ యమాల్ యూరో కప్ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన గోల్ స్కోరర్గా రికార్డుల్లోకెక్కాడు.ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ రేపు (జులై 11) జరుగనుంది. ఈ మ్యాచ్లో విజేత జులై 15న జరిగే ఫైనల్లో స్పెయిన్తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
సెమీస్ సమరం.. స్పెయిన్తో ఫ్రాన్స్ ఢీ! ఫైనల్ బెర్త్ ఎవరిదో?
‘యూరో’ కప్ ఫుట్బాల్ టోర్నీ-2024 తొలి సెమీఫైనల్కు సర్వం సిద్దమైంది. మంగళవారం అలియాంజ్ ఎరీనా వేదికగా జరగనున్న సెమీఫైనల్-1లో ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ సెమీస్ పోరులో గెలిచి ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. స్పెయిన్ ఫైనల్కు చేరుతుందా?అయితే ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి జోరు మీదున్న స్పెయిన్కు సెమీస్ ముందు గాయాలు, కార్డ్ సస్పెన్షన్ల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కీలక మ్యాచ్కు ముందు రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ ఇద్దరూ సస్పెండ్ అయ్యారు. మరోవైపు , యువ మిడ్ఫీల్డర్ పెడ్రీ టోని క్రూస్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో డిఫెన్స్లో రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ స్ధానాలను నాచో, జీసస్ నెవాస్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పెడ్రీ ప్రత్యామ్నాయంగా వచ్చిన డాని ఓల్మో ప్లేయింగ్లో తన స్దానాన్ని సుస్థిరం చేసుకోనున్నాడు.స్పెయిన్ జోరును ఫ్రాన్స్ అడ్డుకుంటుందా?ఇక సెమీస్కు ముందు ఫ్రాన్స్ టీమ్లో ఎటవంటి గాయాలు, కార్డ్ సస్పెన్షన్లు లేవు. జట్టు మొత్తం క్లియర్గా ఉంది. కానీ ఫ్రాన్స్ సెమీస్కు వచ్చినప్పటికి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గోల్స్ సాధించడంలో ఫ్రాన్స్ తమ మార్క్ చూపించలేకపోయింది. కెప్టెన్ కైలియన్ ఎంబాపే గాయం కావడం ఫ్రాన్స్ను కాస్త దెబ్బతీసింది. అతడు తిరిగి జట్టులోకి వచ్చినప్పటి మునపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. సెమీఫైనల్లోనైనా ఎంబాపే సత్తాచాటుతాడో లేదో వేచి చూడాలి. కాగా సెమీఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ 11 గోల్స్ చేయగా... ఫ్రాన్స్ కేవలం మూడు గోల్స్ మాత్రమే సాధించింది. -
యూరో కప్-2024 సెమీస్ బెర్తులు ఖరారు..
జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ ఫుట్బాల్ టోర్నీ-2024లో సెమీఫైనల్ బెర్త్లు అధికారకంగా ఖరారయ్యాయి. శనివారం రాత్రి స్విట్జర్లాండ్తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో విజయం సాధించిన ఇంగ్లండ్ మూడో జట్టుగా సెమీస్కు అర్హత సాధించగా.. ఆదివారం జరిగిన మ్యాచ్లో టర్కీని ఓడించి నెదర్లాండ్స్ నాలుగో జట్టుగా సెమీస్లో అడుగుపెట్టింది.ఇంగ్లండ్-స్విట్జర్లాండ్ మ్యాచ్ నిర్ణీత సమయానికి 1-1తో సమమైంది. కానీ పెనాల్టీ షూటౌట్లో ఇంగ్లండ్ 5 గోల్స్ చేయగా స్విస్ జట్టు 3 గోల్స్కే పరిమితమై ఓటమి చవి చూసింది. మరోవైపు నాలుగో క్వార్టర్స్ మ్యాచ్లో నెదర్లాండ్స్ 2-1తో టర్కీని ఓడించింది.కాగా యూరో కప్ సెమీఫైనల్లో నెదర్లాండ్స్ అడుగుపెట్టడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా ఇప్పటికే ఫ్రాన్స్, స్పెయిన్ తమ సెమీఫైనల్స్ బెర్త్లను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో స్పెయిన్తో ఫ్రాన్స్; బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో నెదర్లాండ్స్ తలపడతాయి. -
కారు కనిపించని ఊరు.. ఎక్కడుందో తెలుసా!?
స్పెయిన్లోని అతి చిన్న నగరం ‘సిటీ ఆఫ్ ఫ్రియాస్’. స్పెయిన్కు వచ్చే పర్యాటకులు దీనిని పెద్దగా పట్టించుకోరు గాని, ఈ ఊరికి చాలా విశేషాలే ఉన్నాయి. పదో శతాబ్దికి చెందిన ఈ నగరంలో ఆనాటి రాజు రెండో జువాన్ నిర్మించిన రాతికోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. మునిసిపాలిటీ నిర్వహణలో ఉన్న ఈ ఊరు సాంకేతికంగా పట్టణమే అయినా, పేరులో మాత్రం ‘సిటీ’ ఉండటంతో స్పెయిన్లోని అతి చిన్న నగరంగా గుర్తింపు పొందింది.చిన్నా చితకా పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా కార్లు విరివిగా తిరిగే పరిస్థితులు ఉన్నా, ఈ ఊర్లో మాత్రం కార్లు కనిపించవు. ఇక్కడి ప్రజలు తమ ఊరిలో కార్లను నిషేధించారు. అందువల్ల మోటారు శబ్దాల రొద లేకుండా ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఊరి జనాభా దాదాపు మూడువందల మంది మాత్రమే! ఈ విశేషాలు తెలిసిన కొద్దిమంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ ఊళ్లోని పురాతనమైన ‘ఇగ్లేషియా డి సాన్ విన్సెంటె మార్టిర్’ కేథలిక్ చర్చి, ‘ఫ్యూంటే డి లాస్ తేజాస్’ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణలు.ఈ ఫౌంటెన్ నుంచి నీరు కిందకు పడేటప్పుడు సంగీత స్వరాలు వినిపిస్తాయి. ఈ ఊళ్లో చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటళ్లు, సెలూన్లు, మాంసం కొట్లు, ఫ్యాన్సీ దుకాణాలు, బేకరీ, ఫార్మసీ దుకాణాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి ‘హోటల్ రూరల్ ఫ్రియాస్’ పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. పురాతన యూరోపియన్ విశేషాలను తిలకించాలనుకునే పర్యాటకులు ఇక్కడ బస చేయవచ్చు. ఈ హోటల్లో బస చేయడానికి రోజుకు 79 పౌండ్లు (రూ.8,411) చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ యూరోపియన్ హోటళ్లతో పోల్చుకుంటే ఈ ధర తక్కువే!ఇవి చదవండి: అబ్బే! ప్రాణహాని ఉందని కాదు! -
Euro Cup 2024: సెల్ఫ్ గోల్తో ఓడిన ఇటలీ
గెల్సెన్కిర్చెన్ (జర్మనీ): యూరో కప్ ఫుట్బాల్ టోరీ్నలో డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ జట్టుకు చుక్కెదురైంది. మాజీ విజేత స్పెయిన్తో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో ఇటలీ 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది.మరోవైపు.. వరుసగా రెండో విజయంతో స్పెయిన్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. ఆట 55వ నిమిషంలో స్పెయిన్ ఫార్వర్డ్ అల్వారో మొరాటో హెడర్ షాట్ను ఇటలీ గోల్కీపర్ గియాన్లుగి డొనారుమా నిలువరించాడు.అయితే ఇటలీ గోల్కీపర్ నిలువరించిన బంతి ఇటలీ డిఫెండర్ రికార్డో కాలాఫియోరి కాలికి తగిలి తిరిగి గోల్పోస్ట్లోకి వెళ్లింది. దాంతో ఇటలీ సెల్ఫ్ గోల్తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇతర మ్యాచ్ల్లో ఆస్ట్రియా 3–1తో పోలాండ్ జట్టుపై, ఉక్రెయిన్ 2–1తో స్లొవేకియాపై గెలిచాయి. చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా సూపర్... -
సింపుల్గా భలే అందంగా ఉంది.. మౌనీ రాయ్ సూపర్ హాట్! (ఫొటోలు)
-
స్పెయిన్లో భర్తతో కలిసి చిల్ అవుతున్న మౌనీ రాయ్ (ఫొటోలు)
-
French Open 2024: నాదల్కు షాక్
పారిస్: తరచూ గాయాలబారిన పడటం... పూర్తిస్థాయి ఫిట్నెస్ లేకపోవడం... వెరసి మట్టికోర్టులపై మకుటంలేని మహరాజుగా వెలుగొందిన స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్కు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోరీ్నలో ఊహించని పరాజయం ఎదురైంది. 2005 నుంచి ఈ టోర్నీలో ఆడుతూ ఏకంగా 14 సార్లు విజేతగా నిలిచిన 37 ఏళ్ల నాదల్ మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రపంచ నాలుగో ర్యాంకర్, గత మూడేళ్లుగా ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్ చేరిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ పక్కా ప్రణాళికతో ఆడి నాదల్ ఆట కట్టించాడు. 3 గంటల 5 నిమిషాలపాటు సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జ్వెరెవ్ 6–3, 7–6 (7/5), 6–3తో నాదల్ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్లో జ్వెరెవ్ ఎనిమిది ఏస్లు సంధించడంతోపాటు నాదల్ సరీ్వస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. జ్వెరెవ్ సరీ్వస్ను కేవలం రెండుసార్లు బ్రేక్ చేసిన నాదల్ 30 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. గాయం కారణంగా గత ఏడాది ఈ టోరీ్నకి దూరంగా ఉన్న నాదల్ తాజా ఓటమితో చివరిసారి ఫ్రెంచ్ ఓపెన్లో ఆడినట్లు భావించాలి. సుమిత్ నగాల్ ఓటమి ఫ్రెంచ్ ఓపెన్లో తొలిసారి ఆడుతున్న భారత నంబర్వన్ సుమిత్ నగాల్ పోరాటం మొదటి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ ఖచనోవ్ (రష్యా)తో జరిగిన మ్యాచ్లో సుమిత్ 2–6, 0–6, 6–7 (5/7)తో ఓడిపోయాడు. మరోవైపు ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో సినెర్ 6–3, 6–3, 6–4తో యుబ్యాంక్స్ (అమెరికా)పై గెలిచాడు. స్వియాటెక్ ముందంజ మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో స్వియాటెక్ 6–1, 6–2తో లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్)పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–1తో జూలియా అవ్దీవా (రష్యా)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీíÙయా) 6–3, 6–2తో సాచియా వికెరీ (అమెరికా)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో మసరోవా (స్పెయిన్)పై విజయం సాధించారు. 3: ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో నాదల్ను ఓడించిన మూడో ప్లేయర్గా జ్వెరెవ్ నిలిచాడు. గతంలో సోడెర్లింగ్ (స్వీడన్; 2009లో ప్రిక్వార్టర్స్లో) ఒకసారి... జొకోవిచ్ (సెర్బియా; 2015 క్వార్టర్ ఫైనల్లో, 2021 సెమీఫైనల్లో) రెండుసార్లు ఈ టోర్నీ లో నాదల్ను ఓడించారు. 2016లో గాయం కారణంగా నాదల్ మూడో రౌండ్ నుంచి వైదొలిగాడు.3: గ్రాండ్స్లామ్ టోరీ్నలలో నాదల్ తొలి రౌండ్లో ఓడిపోవడం ఓవరాల్గా ఇది మూడోసారి మాత్రమే. ఇంతకుముందు నాదల్ 2016 ఆ్రస్టేలియన్ ఓపెన్లో, 2013 వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లో ఓటమి పాలయ్యాడు. -
పాలస్తీనా స్వతంత్ర దేశం
టెల్ అవీవ్: పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని తాము గుర్తిస్తున్నామని బుధవారం ప్రకటించాయి. ఈ నెల 28న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి. నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాల తాజా ప్రకటనను పాలస్తీనియన్లు స్వాగతించారు. పాలస్తీనా దేశాన్ని ఇప్పటికే భారత్ సహా దాదాపు 140 దేశాలు అధికారికంగా గుర్తించాయి. అంటే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన మొత్తం దేశాల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. తాజాగా మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరడం విశేషం. శాంతి, సామరస్యం కోసమే.. తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ను కలిపి ప్రత్యేక పాలస్తీనాను దేశంగా గుర్తించాలని లక్షలాది మంది పాలస్తీనియన్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1967లో జరిగిన మిడిల్ఈస్ట్ యుద్ధంలో ఆ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ప్రస్తుతం తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగుతోంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించకపోతే మధ్యప్రాచ్యంలో శాంతి, సామరస్యం నెలకొల్పడం సాధ్యం కాదని నార్వే ప్రధాని జోనస్ గహర్ పేర్కొన్నారు. ఐర్లాండ్కు, పాలస్తీనాకు ఇదొక చరిత్రాత్మకమైన, ముఖ్యమైన రోజు అని ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ వ్యాఖ్యానించారు. తమ నిర్ణయం ఇజ్రాయెల్సహా ఎవరికీ వ్యతిరేకం కాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పష్టంచేశారు. హంతకులకు, రేపిస్టులకు బంగారు పతకాలా? పాలస్తీనాను ఒకదేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చేసిన ప్రకటన పట్ల ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు దేశాల నుంచి తమ రాయబారులను వెనక్కి పిలిపించింది. తమ దేశంలో ఉన్న నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది. తద్వారా తమ నిరసనను తెలియజేసింది. హమాస్ హంతకులకు, రేపిస్టులకు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ బంగారు పతకాలు బహూరిస్తున్నాయని, ఈ పరిణామాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ పేర్కొన్నారు. -
ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
టెల్ అవీవ్: గాజాలో హమాస్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతునే ఉంది. హమాస్ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రయాల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, నార్వే దేశాలలోని తమ రాయబారులు స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు దేశాలు పాలస్తీనియన్లకు ప్రత్యేక దేశం హోదాకు గుర్తింపు ఇవ్వాలని అభిప్రాయపడిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడారు. ‘‘నిస్సందేహంగా నేను ఐర్లాండ్, నార్వే దేశాలకు స్పష్టమైన సందేశం పంపతున్నా. మా దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు హాని కలిగించే పరిస్థితులపై అస్సలు మౌనంగా ఉండము. మేము సాధించే లక్ష్యాలను ఐర్లాండ్, నార్వే దేశాలు అడ్డుకోలేవు. మా దేశ పౌరులకు భద్రత పునరుద్ధరిస్తాం. హమాస్ను అంతం చేసి, బంధీలను ఇంటికి చేరుస్తాం, ఇంతకు మించి ఏం జరగబోదు’’ అని ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టం చేశారు.మరోవైపు స్పెయిన్ దేశాన్ని కూడా ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. తమ దేశం కూడా పాలస్తీనాను మే 28 నుంచి ప్రత్యేక దేశంగా గుర్తిస్తుందని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ బుధవారం వెల్లడించారు. దీంతో ఐర్లాండ్, నార్వేల వలే స్పెయిన్పై కూడా చర్యలు ఉంటాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది.‘‘స్పానీష్ ప్రజల మెజార్టీ సెంటిమెంట్లను పరిగణలోకి తీసుకుంటున్నాం. వచ్చే మంగళవారం(మే 28). మంత్రుల కౌన్సిల్ సమావేశంలో పాలస్తీనా ప్రత్యేక దేశం గుర్తింపు విషయంలో ఆమోదం తెలుపుతాం. శాంతి, న్యాయంల కోసం ఆ నిర్ణయం మాటాలను నుంచి కార్యరూపం దాల్చుతుంది’’ అని పెడ్రో శాంచెజ్ తెలిపారు. -
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
ఉల్కాపాతం.. ఈ పేరు చాలామందికి తెలియంది కాదు. ఆకాశం నుంచి ప్రకాశవంతంగా దూసుకొస్తూ.. భూమ్మీద మీద పడే సమయంలో అవి మెరుస్తూ అద్భుతాన్ని తలపిస్తుంటాయి. అయితే.. తాజాగా శనివారం రాత్రి అలాంటి అనుభూతిని పొందారు స్పెయిన్, పోర్చుగల్ ప్రజలు. స్పెయిన్, పొరుగు దేశం పొర్చుగల్ ప్రజలు శనివారం రాత్రి ఆకాశంలో అరుదైన కాంతిని వీక్షించారు. నీలి రంగులో మెరుస్తూ ఉల్క ఒకటి భూమ్మీదకు రయ్మని దూసుకొచ్చింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాహనాల్లో వెళ్లే వాళ్లు, పార్టీలు చేసుకునేవాళ్లు.. అనుకోకుండా ఆ దృశ్యాలను బంధించారు. Tires, Cascais, Portugal. ☄️#Tires #Cascais#Portugal #Fireball #Meteor #meteoro #meteorito #España#Spainpic.twitter.com/HDtnhQEYG7— Mr. Shaz (@Wh_So_Serious) May 19, 2024అవి చూసి భూమ్మీదకు సూపర్ పవర్ ఏదైనా దూసుకొచ్చిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు పలువురు. తోక చుక్కలు, ఉల్కాపాతంను కనివినీ ఎరుగని ఒక జనరేషన్ అయితే.. ఈ దృశ్యాల్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఇది ఏలియన్ల పనేనా?.. సూపర్ పవర్ ఏదైనా భూమ్మీదకు వచ్చిందా? అంటూ తమదైన ఎగ్జయిట్మెంట్ను ప్రదర్శిస్తోంది. A meteor lit up the sky with bright light during the night in Portugal and Spain.Source: X#Meteor #Spain #Portugal #Fireball #Sky #DTNext #DTnextNews pic.twitter.com/09Ma6GO0sg— DT Next (@dt_next) May 19, 2024అయితే ఆ ఉల్క ఎక్కడ పడిందనేదానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కొందరు మాత్రం కాస్ట్రో డెయిర్లో పడిందని, మరికొందరేమో పిన్హెయిరోలో పడిందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. JUST IN: Meteor spotted in the skies over Spain and Portugal.This is insane.Early reports claim that the blue flash could be seen darting through the night sky for hundreds of kilometers.At the moment, it has not been confirmed if it hit the Earth’s surface however some… pic.twitter.com/PNMs2CDkW9— Collin Rugg (@CollinRugg) May 19, 2024 రెండు వారాల కిందటే.. అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు ఉల్క పడొచ్చని అంచనా వేశారు. హెలీ తోకచుక్క నుంచి వెలువడే శకలాల కారణంగా రాబోయే రోజుల్లో ఉల్కాపాతం ఎక్కువే ఉండొచ్చని వాళ్లు అంచనా వేస్తున్నారు. -
స్పెయిన్ వరుడు, కర్ణాటక వధువు
కర్ణాటక: మనసుపడితే మూడుముళ్ల పండుగకు జాతిభేదాలతో పనేముంది. కొన్నిసార్లు దేశ సరిహద్దులు కూడా దాటి జంటలు ఒక్కటవుతాయి. ఇదే కోవలో స్పెయిన్ యువకుడు, మండ్య యువతి ప్రేమ బంధాన్ని పెళ్లితో సుస్థిరం చేసుకున్నారు. వివరాలు.. జిల్లాలోని కేఆర్ పేటె పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి రవీంద్రనాథ కుమార్తె దీక్షిత కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్లో యోగా టీచర్గా పనిచేస్తోంది. స్పెయిన్లోని బార్సిలోనాకు చెందిన జాన్ వైడల్ ఆశ్రమానికి వస్తుండేవాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమ మొగ్గ తొడిగింది. పెద్దలకు చెప్పగా రెండు కుటుంబాలు పెళ్లికి సమ్మతించారు. దీంతో మంగళవారం కెఆర్ పేటెలోనే సంప్రదాయ రీతిలో వివాహ వేడుక జరిగింది. వరుని తల్లిదండ్రులు, తోబుట్టువులు సంప్రదాయ దుస్తులు ధరించి హాజరయ్యారు. -
కొడుకు కల సాకారం కోసం...ఒక టీవీ నటి సాహసం, వైరల్ స్టోరీ
అమ్మ ఎపుడైనా అమ్మే. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. మాతృత్వపువిలువ, కన్నపేగు మమకారం తెలుసు. అందుకే కేన్సర్తో చనిపోయిన కొడుకుకల సాకారం కోసం పెద్ద సాహసానికి పూనుకుంది. 68 ఏళ్ల వయసులో ఒక టీవీ స్టార్ కొడుకు వీర్యంతో వారసురాలికి జన్మనిచ్చిన ఘటన సంచలనంగా మారింది. సహజంగా పిల్లలకు కనే అవకాశం లేనపుడో, మరేకారణాల రీత్యానో సరోగసీని ఆశ్రయిస్తుంటారు. కానీ కొడుకు కోసం సరోగసీని ఎందుచుకుంది స్పెయిన్ దేశానికి చెందిన టీవీ నటి అనా బ్రెగాన్. ఈమెకు అలెస్ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు. అయితే దురదృష్టవశాత్తూ కేన్సర్తో 27 ఏళ్లకే కన్నుమూశాడు. అయితే మరణానికి ముందు అలెస్కు తండ్రి కావాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకే తన స్పెర్మ్ను భ్రద (ఫ్రీజ్) పర్చుకున్నాడు. ముందస్తు ప్రమాదాన్ని ఊహించాడో ఏమో, విధి ఫలితమో గానీ కొన్నాళ్లకు కేన్సర్ బారిన పడ్డాడు. తన కల నెరవేరకుండానే చనిపోయాడు. అయితే తండ్రి కావాలన్న ఆశతో అఎస్ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రశీదు ఆధారంగా అనా ఓబ్రెగాన్ తెలుసుకుంది. అంతే తల్లి మనసు తన కొడుకు కలసాకారం కోసం ఆరాటపడింది. దీనికి సంబంధించిన 2023లో వైద్యులను సంప్రదించింది. అన్ని పరీక్షల అనంతరం సరోగసికీ ఓబ్రెగాన్ శరీరం సహకరిస్తుందని వెల్లడించారు. దీంతో ప్రాణాలకు తెగించి మరీ కొడుకు వీర్య కణాలతో గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపాయికి అనిత అని పేరుపెట్టుకుంది. ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఈ విషయాలను స్వయంగా అనా ఇన్స్టాలో ఫోటోలతో సహా షేర్ చేసింది. “అనితా, నీకు ఏడాది నిండింది. అగాధమైన చీకటిలో మునిగిపోయి, విపరీతమైన బాధతో ఛిద్రమైపోయిన నా హృదయాన్ని కాంతితో నింపేశాయ్... నీ చిరునవ్వు, ముద్దు ముద్దుమాటలు, నీ బుడిబుడి అడుగులు ఇవి చాలు నాకు.. మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూసాడో అదే ప్రేమతో నన్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఎవరూ నన్ను అలా చూడలేదు. ” అని పోస్ట్ చేసింది. ఇది నెటిజనుల చేత కంటతడిపెట్టిస్తోంది. View this post on Instagram A post shared by Ana_Obregon Oficial (@ana_obregon_oficial) -
స్పెయిన్లో శిక్షణకు జ్యోతి యర్రాజీ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల రజత పతక విజేత, ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్పెయిన్లో 45 రోజుల ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. జ్యోతికి సంబంధించి విమాన ప్రయాణాలు, వసతి, శిక్షణ ఇతరత్రా ఖర్చులన్నీ మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) భరిస్తుందని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ సహా, ఈ సీజన్లో అత్యున్నత ప్రదర్శన కనబరిచేందుకు ఎంఓసీ పథకంలో ఆమెతో పాటు పలువురు అథ్లెట్లకు ఆర్థిక చేయూత ఇవ్వనున్నారు. వైజాగ్కు చెందిన 24 ఏళ్ల జ్యోతి గత ఆసియా క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్లో రజత పతకం గెలిచింది. మరో తెలుగుతేజం, స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు కూడా మరింత మెరుగైన శిక్షణ కోసం ఆరి్థక సాయం అందించే ప్రతిపాదనకు ఎంఓసీ ఆమోదం తెలిపింది. -
సత్తుపల్లి అమ్మాయి.. స్పెయిన్ అబ్బాయి
ఖమ్మం: వారి ప్రేమ ఖండాంతరాలు దాటి వివాహ బంధంతో ఏకమైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన విద్యాభారతి కళాశాల డైరెక్టర్ మందడపు సత్యనారాయణ – సుజని దంపతుల కుమార్తె లావణ్య నాలుగేళ్లుగా స్పెయిన్ దేశంలోని బార్సిలోనలో ఓ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగంలో స్టాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు అదే కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన స్పెయిన్ దేశానికి చెందిన మార్క్ మన్సిల్లాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇరుపక్షాల తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించారు. సత్తుపల్లిలోని శ్రీసాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో బుధవారం అర్ధరాత్రి 12.53 నిమిషా లకు ఈ ప్రేమ జంట పెళ్లితో ఒకటయ్యారు. ఇవి చదవండి: శ్రీలంక అమ్మాయి.. కరీంనగర్ అబ్బాయి ఒక్కటయ్యారు -
స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు!
గతేడాది కనీసం 65 దేశాలలో రైతులు నిరసనలు చేపట్టారు. ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగుమతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతిరేకంగా సాగాయి. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి స్వేచ్ఛా మార్కెట్లే కారణం. మార్కెట్లకు విజ్ఞత ఉంటే, రైతులు నష్టపోవడానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో చెప్పడానికి రైతుల నిరసనలు నిదర్శనం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులకు కూడా అనుసరణీయ మార్గం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇదే సమయం. భారతదేశంలో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల తిరగబడటాన్ని ప్రపంచం గమ నిస్తోంది. 2023 జనవరి నుండి కనీసం 65 దేశాలలో రైతులు నిరస నలు చేపట్టారు. కనీవినీ ఎరుగని నిరసనల వెల్లువ వెనుక కారణాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, వాటన్నింటినీ కలిపే సాధారణ సూత్రం ఒకటే: నియంత్రణ లేని మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం.రైతులు తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఉపయోగించే పదాలు ఒక దేశం నుండి మరొక దేశానికి భిన్నంగా ఉండవచ్చు. కానీ అంత ర్లీన సందేశం ఒకటే: వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో మార్కెట్లు విఫలమయ్యాయి. భారతదేశ రైతులు కనీస మద్దతు ధరను చట్ట బద్ధమైన హక్కుగా కోరుకుంటుండగా, యూరోపియన్ రైతులు తమ ఉత్పత్తులకు సరైన విలువను డిమాండ్ చేస్తున్నారు. కెన్యాలో బంగా ళాదుంపల ధర పతనం, నేపాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉండటంతో పాటు జర్మనీ, ఫ్రాన్స్ , బెల్జియంతో సహా యూరప్లోని అనేక దేశాలలో ఉత్పత్తి వ్యయం పెరగడం, చౌక దిగుమతులు, ఉత్పత్తి ధరలు పడిపోవడాన్ని కూడా నిరసనలు హైలైట్ చేశాయి. స్పెయిన్ లోని రైతులు నాలుగు లక్షల లీటర్ల పాలను వీధుల్లో పారబోశారు. మలేషియా సాగుదారులు తక్కువ వరి ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఫ్రాన్స్ లో, అధ్యక్షుడు మాక్రాన్ తో ఇటీవల జరిగిన సమావేశంలో చిన్న రైతుల ప్రముఖ సంస్థ అయిన ‘కాన్ఫెడరేషన్ పేసన్’... రైతులకు సామాజిక రక్షణ కల్పించడంతో సహా హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధర కంటే తక్కువ ధరకు కొనుగోళ్లను అనుమతించకూడదనే వాగ్దానాన్ని కోరింది. వాణిజ్య సరళీకరణను కూడా రైతులు వ్యతిరేకించారు.జర్మనీ, ఫ్రాన్స్ , రొమేనియా, ఇటలీ, పోలాండ్లలో రైతులు ఉక్రె యిన్ నుండి వచ్చే చౌక దిగుమతులకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వ హించారు. పైగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని కోరుతున్నారు. వారు హైవేలను అడ్డుకున్నారు, దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువెళుతున్న ట్రక్కులను నిలిపివేశారు, చాలా చోట్ల దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ఫ్రాన్స్ లో, చౌకైన చేపల దిగుమతులకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు, మత్స్యకారులు ఓడరేవుల వద్ద నిరసన తెలిపారు. ఇది వ్యవ సాయ జీవనోపాధిని నాశనం చేస్తుందని వారు చెప్పారు. భారతదేశం విషయానికి వస్తే, ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ వైదొలగా లని నిరసన తెలుపుతున్న రైతులు తమ డిమాండ్ను పునరుద్ఘాటించారు. ‘డౌన్ టు ఎర్త్’ మ్యాగజైన్ సంకలనం ప్రకారం, యూరప్లోని 24 దేశాలు రైతు నిరసనలను ఎదుర్కొంటుండగా, ఆఫ్రికాలో 12, ఆసియాలో 11, దక్షిణ, ఉత్తర, మధ్య అమెరికాల్లో ఎనిమిదేసి దేశాలు, ఓషియానియాలో రెండు దేశాలు గత సంవత్సరం రైతు ప్రదర్శనల వల్ల ప్రకంపించిపోయాయి. ఐరోపాలో, స్వతంత్ర పాన్–యూరోప్ మీడియా నెట్వర్క్ అయిన ‘యూరాక్టివ్’ 2024 జనవరి–ఫిబ్రవరిలో తాజా దశ నిరసనలపై చేసిన అధ్యయనం... రైతులకు న్యాయమైన, లాభదాయకమైన ధర కోసం బలమైన డిమాండ్ ఉంటోందని తెలిపింది. ప్రధానంగా ఫ్రాన్స్ , జర్మనీ, స్పెయిన్, ఇటలీ నుండి ఈడిమాండ్ వెలువడింది. బెల్జియం రైతులు ఆహార గొలుసు విధానంలో కూడా రక్షణ కోరుకుంటున్నారు. నికర సున్నా ఉద్గారాలను సాధించే ప్రయత్నంలో యూరోపియన్ కమిషన్ విధించడానికి ప్రయత్నిస్తున్న కఠినమైన పర్యావరణ నిబంధనలపై కూడా వారి కోపం నిర్దేశితమైంది. వ్యవసాయ రంగంపై వాణిజ్య ప్రభావం యూరోపియన్ యూనియన్ రైతులకు ఆందోళన కలిగిస్తోంది. జర్మన్ రైతుల ప్రద ర్శనలు... వ్యవసాయ వాహనాలకు ఇంధనంపై పన్ను మినహాయింపులను ఉపసంహరించుకోవడం గురించి సాగాయి (దీనిని జర్మనీ దశలవారీగా రద్దు చేయడానికి అంగీకరించింది); ‘నైట్రేట్ డైరెక్టివ్’ లాంటి కఠినమైన పర్యావరణ నిబంధన లతోపాటు తక్కువ ధరలను భర్తీ చేయడానికి ప్రోత్సాహకాల డిమాండ్పై దృష్టి సారించాయి. సారాంశంలో, ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలలో చాలా వరకు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగు మతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతి రేకంగా ఉన్నాయి. వ్యవసాయాన్ని మార్కెట్ల చేతుల్లోకి వదిలేయడం వల్ల వ్యవ సాయ రంగానికి మేలు జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరస నలే ఇందుకు నిదర్శనం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఉద్దేశపూర్వ కంగా ఆహార ధరలు తక్కువగా ఉండేలా చూసుకున్న ఆధిపత్య ఆర్థిక ఆలోచనకు భారతీయ వ్యవసాయం బలయ్యింది. ఇది కాలం చెల్లిన విధానం. మారుతున్న వాస్తవాలకు అనుగుణంగా ఆర్బీఐ తన స్థూల ఆర్థిక విధానాలను పునఃసమీక్షించే సమయం ఆసన్నమైంది. 2022– 23 గృహ వ్యయ సర్వే ప్రకారం, ప్రతి కుటుంబం మీద గృహం, ఆరోగ్యం, విద్యపై నిరంతరం పెరుగుతున్న వ్యయంతో భారం పడి నప్పటికీ, ఆహారంపై ఖర్చు గణనీయంగా తగ్గింది. కఠినమైన స్థూల ఆర్థిక నియంత్రణ నుండి వ్యవసాయ ధరలకు అవసరమైన దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను నొక్కిచెప్పిన క్షణం, దానికి బలమైన వ్యతిరేకత వస్తుంది. ‘ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది, తద్వారా మార్కెట్ వక్రీకరణలు జరుగుతాయని మేము హెచ్చరించాము’ అంటూ గ్యారెంటీ ధర కావాలని రైతులు పునరుద్ఘాటించినప్పుడల్లా విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఒక కార్పొరేట్ వైఫల్యం ఫలితంగా కోవిడ్ మహమ్మారి సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 57 శాతం పెరిగి, 2023లో 53 శాతం చుట్టూ చేరిన ప్పుడు మాత్రం అదే ఆర్థిక ఆలోచన స్పష్టంగా నిశ్శబ్దంగా ఉంది. వ్యవసాయ ధరలను స్థిరీకరించడానికి అనేక దశాబ్దాలుగా అనేక ప్రోత్సాహకాలు, దేశీయ మద్దతు యంత్రాంగాలు ప్రయత్నించిన ప్పటికీ, వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ కష్టాలు ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతున్నాయి. వ్యవసాయంలో మార్కెట్ సంస్క రణలు అరువు తెచ్చుకున్న అమెరికాలో కూడా స్వేచ్ఛా మార్కెట్ రూపకల్పన అనేది చిన్న రైతులను వ్యవసాయం నుండి ఎలా బయటకు నెట్టిందో, వారిని కష్టాల బాటలో ఎలా వదిలివేసిందో, పొలంలో విధ్వంసాన్ని ఎలా సృష్టించిందో ‘నాసా’ మాజీ శాస్త్రవేత్త వేదవ్రత పెయిన్ దర్శకత్వం వహించిన ‘డెజా వు’ డాక్యుమెంటరీ చూపిస్తుంది. కాబట్టి స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి ఇదే కారణం. మార్కెట్లకు విజ్ఞతఉంటే, సమర్థతకు ప్రతిఫలమివ్వగలిగితే, వ్యవసాయం నష్టపోయే ప్రతిపాదనగా ఉండటానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంతలోప భూయిష్టంగా ఉందో చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరసనలు నిదర్శనం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇది సమయం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులుఅందరికీ వర్తించే మార్గం. మార్కెట్లు తదనుగుణంగా సర్దుబాటు అవుతాయి. - వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు , దేవీందర్ శర్మ - ఈ–మెయిల్: hunger55@gmail.com -
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్స్ అల్కరాజ్, స్వియాటెక్
ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) టైటిల్ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండోసారి విజేతగా నిలిచింది. కాలిఫోరి్నయాలో జరిగిన ఫైనల్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–6 (7/5), 6–1తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించగా... స్వియాటెక్ 6–4, 6–0తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 2016లో జొకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు సాధించిన ప్లేయర్గా అల్కరాజ్ నిలిచాడు. అల్కరాజ్ కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతలుగా నిలిచిన అల్కరాజ్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... స్వియాటెక్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Spain: అపార్ట్మెంట్లలో చెలరేగిన మంటలు.. నలుగురు మృతి
మాడ్రిడ్: స్పెయిన్లోని వాలెన్సియా పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండు 14 అంతస్తుల అపార్ట్మెంట్లలో చెలరేగిన మంటలు చెలరేగిన ఘటనలో నలుగురు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో పిల్లలు, ఫైర్ సిబ్బంది ఉన్నారు. మరో 14 మంది జాడ తెలియడం లేదు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది క్రేన్ల సాయంతో అపార్ట్మెంట్లలో చిక్కుకున్నవారిని రక్షించారు. తొలుత ఒక అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్కు వ్యాపించాయి. భారీ అగ్ని జ్వాలలు, పొగ ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. భవన నిర్మాణంలో వాడిన సామగ్రి కారణంగానే మంటలు వేగంగా వ్యాపించినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంచేజ్ అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. BREAKING: Entire multi-storey building on fire in Valencia, Spain pic.twitter.com/sTXMm6KY4p — Insider Paper (@TheInsiderPaper) February 22, 2024 ఇదీ చదవండి.. రష్యాలోని భారతీయులకు కేంద్రం కీలక సూచన -
లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్బాలర్కు జైలు శిక్ష.. భారీ జరిమానా
లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్బాలర్కు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది స్పానిష్ కోర్టు. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో బ్రెజిల్ మాజీ ఫుట్బాలర్ డానీ అల్వెస్కు (40) నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 13 కోట్ల జరిమానా విధించింది స్పెయిన్లోని బార్సిలోనా కోర్టు. 2022 డిసెంబర్ 31న అల్వెస్.. సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో (నైట్ క్లబ్లో) పాటు అనుమతి లేకుండా లైంగిక చర్యకు పాల్పడ్డాడని రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ కేసులో అల్విస్ను ఈ ఏడాది జనవరి 20న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి అతను రిమాండ్లోనే ఉన్నాడు. అల్విస్ బెయిల్ ప్రయత్నాలను కోర్టు తిరస్కరించింది. తాను నిరపరాధినన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో అల్వెస్ భార్య స్టేట్మెంట్ను కూడా కోర్టు పట్టించుకోలేదు. అల్వెస్ ఫుట్బాల్ కెరీర్ విషయానికొస్తే.. 2006 నుంచి 2022 వరకు బ్రెజిల్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అల్వెస్.. 126 మ్యాచ్లు ఆడి 8 గోల్స్ చేశాడు. అల్వెస్.. రైట్ బ్యాక్ స్థానంలో ఆడతాడు. ఇతను వివిధ సమయాల్లో బార్సిలోనా, పీఎస్జీ, జువెంటస్, సాపాలో క్లబ్ల తరఫున ఆడాడు. అల్వెస్.. 2022 ఫిఫా వరల్డ్కప్లో చివరిసారిగా బ్రెజిల్కు ప్రాతినిథ్యం వహించాడు. -
తవ్వకాల్లో రెండు వేల ఏళ్ల నాటి కాంస్య చెయ్యి..దానిపై మిస్టీరియస్..!
స్పెయిన్లోని ఉత్తర ప్రాంతాల్లో జరిపిన తవ్వాకాల్లో శాస్త్రవేత్తలు రెండు వేల ఏళ్ల నాటి కాంస్య చెయ్యిని గుర్తించారు. దానిపై మిస్టిరియస్ లిపి ఉంది. ఆ లిపి ఏంటన్నది శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఆ కాంస్య చెయ్యిపై కొన్ని చిహ్నాలతో ఈ లిపి ఉన్నట్లు తెలిపారు. అది ఇనుపయుగం నాటి చారిత్రక స్థానిక తెగ గురించి అనుమానాలు తలెత్తాయి. నాడు వారు ఉపయోగించిన వాడుక భాష, తదితరాల గురించి అనుమానాలు లెవనెత్తాయి. ఆ లిపి అర్థమయ్యితే వాస్కోన్ తెగ రహస్యాలను కొంత వరకు తెలుసుకోగలుగుతామని అన్నారు. ఆ చేతిపై ఉన్న శాసనం పురాతన పాలియోహిస్పానిష్ భాషలతో ఆనుసంధానించి చూడాల్సి ఉందన్నారు. వాస్కోన్ తెగల గురించి కథకథలుగా వినడమే గానీ ఆధారాలు లేవు. ఇప్పుడి ఈ కాంస్య చెయ్యి వారు ఉండేవారనేందుకు ఆధారంగా ఉంటుంది. ఈ కాంస్య చేయి వారి అధునాత సాంస్కృతిక పద్ధతులకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది ఒకరకంగా వాస్కోన్ భాష, సంస్కృతులు గురించి తెలుసుకునేందుకు పురికొల్పొతోందన్నారు. అంతేగాదు ఈ పరిశోధన స్పెయిన్ గొప్ప చరిత్ర, గత వైభవం గురించి లోతుగా తెలుసుకునేందుకు మార్గం సుగమం చేస్తుందన్నారు శాస్త్రవేత్తలు. స్పెయిన్ దేశీయ భవనం వద్ద ఈ కాంస్య చెయ్యిని గుర్తించినట్లు తెలిపారు. ఈ కళాఖండంపై చెక్కబడిన వచనం అపోట్రోపిక్గా వ్యాఖ్యానించారు. ఇది అదృష్టాన్ని ప్రార్థించే టోకెన్ అని ఈ పురాతన తవ్వకాలకు సంబంధించిన ప్రాజెక్టులో పనిచేస్తున్న పరిశోధకులు అన్నారు. ఈ కాంస్య చేతికి ఆచార లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత ఉందని భావిస్తున్నారు. పురాతన కాలంలో, ఐబీరియన్లు తమ ఖైదీల కుడి చేతులను చేధించేవారిని తెలిసింది. అయితే కాంస్య చేయి కూడా కుడి చేతిగా ఉన్నప్పటికీ, ఈ కళాఖండంపై ఉన్న చిహ్నాలు ఏదో ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
FIH Pro League: ‘షూటౌట్’లో భారత్ విజయం
FIH Pro League 2023-24- భువనేశ్వర్: పురుషుల ప్రొ హాకీ లీగ్ టోర్నీలో భారత జట్టు నాలుగో విజయం అందుకుంది. స్పెయిన్తో సోమవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా సడెన్డెత్ ‘షూటౌట్’లో 8–7తో గెలిచింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున జర్మన్ప్రీత్ సింగ్ (1వ ని.లో), అభిషేక్ (35వ ని.లో)... స్పెయిన్ తరఫున జోస్ బస్టెరా (3వ ని.లో), బొర్యా లకెలా (15వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. స్కోర్లు సమమయ్యాక విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘ షూటౌట్’లో తొలి ఐదు ప్రయత్నాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యారు. దాంతో ‘సడెన్డెత్’ షూటౌట్ను నిర్వహించారు. ‘సడెన్డెత్’లో స్పెయిన్ ప్లేయర్ మిరాలెస్ తీసుకున్న మూడో షాట్ను భారత గోల్కీపర్ శ్రీజేష్ నిలువరించాడు. ఆ వెంటనే భారత్ తరఫున లలిత్ ఉపాధ్యాయ్ గోల్ చేయడంతో టీమిండియా విజయం ఖరారైంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో భారత్ ఐదు మ్యాచ్ల ద్వారా 10 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. రేపు జరిగే మ్యాచ్లో నెదర్లాండ్స్తో భారత్ ఆడుతుంది. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ బోణీ చెన్నై: ప్రైమ్ వాలీబాల్ లీగ్లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు గెలుపు బోణీ కొట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్లో బ్లాక్ హాక్స్ 7–15, 12–15, 15–10, 15–11, 20–18తో ముంబై మెటోర్స్ జట్టును ఓడించింది. తొలి రెండు సెట్లు ఓడిపోయిన బ్లాక్ హాక్స్ ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకొని వరుసగా మూడు సెట్లు నెగ్గి విజయాన్ని అందుకుంది. భ్లాక్ హాక్స్ విజయంలో అష్మతుల్లా, హేమంత్, లాల్ సుజన్ కీలకపాత్ర పోషించారు. గుల్వీర్ సింగ్కు స్వర్ణం టెహ్రాన్: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. సోమవారం జరిగిన పురుషుల 3000 మీటర్ల రేసులో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ (8ని:07.48 సెకన్లు) పసిడి పతకం గెలిచాడు. మహిళల 3000 మీటర్లలో అంకిత (9ని:26.22 సెకన్లు) రజత పతకం సాధించింది. ఈ పోటీల్లో భారత్కు మొత్తం నాలుగు స్వర్ణాలు, ఒక రజతం లభించాయి. -
భారత్ శుభారంభం
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీని భారత జట్టు ఘనంగా మొదలు పెట్టింది. శనివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 4–1 గోల్స్ తేడాతో స్పెయిన్పై విజయం సాధించింది. భారత్ తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (7వ నిమిషం, 20వ ని.) రెండు గోల్స్ సాధించగా...జుగ్రాజ్ సింగ్ (24వ ని.), లలిత్ ఉపాధ్యాయ్ (50వ ని.) ఒక్కో గోల్ చేశారు. స్పెయిన్ ఆటగాళ్లలో మిరాలెస్ మార్క్ (34వ ని.) ఏకైక గోల్ కొట్టాడు. మాజీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్కు ఇది 350వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. నేడు జరిగే తమ తర్వాతి మ్యాచ్లో నెదర్లాండ్స్తో భారత్ తలపడుతుంది. -
స్పెయిన్ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి
మలికిపురం: స్పెయిన్ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి దిండి రిసార్ట్స్లో ఇరు కుటుంబాల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన సంజనా కోటేశ్వరి స్పెయిన్లో ఉద్యోగం చేస్తోంది. అదే దేశంలో ఓ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్న రొసిజ్ఞాని, సంజనా మనసులు కలిశాయి. ఇరుకుటుంబాల నుంచి గ్రీన్సిగ్నల్ రావడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 3.36 గంటలకు (తెల్లారితే గురువారం) దిండి రిసార్ట్స్లో వీరి వివాహం ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. స్పెయిన్ నుంచి వరుడు, వరుడి తల్లిదండ్రులు, మేనత్త, సోదరి, బావతో పాటు 40 మంది బంధువులు ఈ నెల 1న దిండి రిసార్ట్స్కు చేరుకున్నారు. ఆ రోజు నుంచి తెలుగు సంప్రదాయాల ప్రకారం వివాహ ఘట్టాలను శాస్త్రోక్తం గా జరిపించారు. పెళ్లికి హాజరైన స్పెయిన్ మహిళలు నిండైన చీరలు, మగవారు కుర్తా పైజమా వంటి సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. వధువు సంజనా కోటేశ్వరి చిన్నాన్న, అంబాజీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈవో కుంపట్ల అయ్యప్పనాయుడు. ఆయనే స్థానికంగా పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కఠినమైన శిక్షణలో మొదటి దశ దాటిన స్పెయిన్ యువరాణి
స్పెయిన్ సింహాసనానికి కాబోయే వారసురాలు ప్రిన్సెస్ లియోనోర్. అక్టోబర్ నెలతో ఆమెకు 18 ఏళ్లు నిండాయి. ఆ సందర్భంలో తన దేశ రాజ్యాంగానికి విధేయతతో ప్రమాణం చేసింది. సమయం వచ్చినప్పుడు రాణిగా అడుగులు వేసేందుకు ఆమె వారసత్వానికి పునాది వేసింది. అందుకు ఆమె మూడేళ్ల పాటు కఠినమైన శిక్షణ తీసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో లియోనోర్ ఇప్పటికే తొలి అడుగులు వేశారు. తన శిక్షణకు సంబంధించిన మొదటి దశను అదిగమించి తదుపరి దశలోకి ఆమె ఎంట్రీ ఇచ్చింది. తాజాగా తన తల్లిదండ్రులైన క్వీన్ లెటిజియా, కింగ్ ఫెలిపే ఇద్దరూ కలిసి తమ పెద్ద కుమార్తె అయిన లియోనోర్ను స్పెయిన్లోని అరగోన్లోని జనరల్ మిలిటరీ అకాడమీ ఆఫ్ జరాగోజా వద్ద వదిలివేశారు. స్పెయిన్ సింహాసనానికి వారసురాలు, కాబోయే రాణి అయిన 18 ఏళ్ల యువరాణి లియోనోర్, దేశ దేశాధినేతగా తన భవిష్యత్తు కోసం సిద్ధం చేయడానికి అధికారికంగా మూడు సంవత్సరాల కఠనమైన సైనిక శిక్షణను తీసుకునేందుకు ఆమె రెడీ అయ్యారు. సైనిక్ స్కూల్లో చేరుతున్న సమయంలో తన తల్లిదండ్రులతో పాటు 16 ఏళ్ల సోదరి ప్రిన్సెస్ సోఫియాతో కలిసి అకాడమీకి వచ్చినప్పుడు ప్రిన్సెస్ లియోనార్ చాలా సంతోషంగా అక్కడ కనిపించారు. ఆమె తండ్రి కింగ్ ఫెలిపే సైనిక యూనిఫాం ధరించి, సైన్యం, నావికాదళం, స్పెయిన్ వైమానిక దళానికి చెందిన కెప్టెన్ జనరల్గా ఆమెకు సెల్యూట్ చేశాడు. కింగ్ ఫెలిపే స్పానిష్ సాయుధ దళాలకు సుప్రీం కమాండర్గా పనిచేస్తున్నాడు. ఆయన కూడా గతంలో బోర్బన్ సింహాసనాన్ని అందుకుంటున్న సమయంలో జనరల్ మిలిటరీ అకాడమీ ఆఫ్ జరాగోజాలో శిక్షణ పొందాడు. ప్రిన్సెస్ లియోనార్ అమ్మగారు అయిన క్వీన్ లెటిజియా కూడా అక్కడ సంతోషంగా కనిపించింది. లియోనార్ను గట్టిగా కౌగిలించుకుంది. ఆ సమయంలో లియోనార్ ఒక అధికారితో కరచాలనం చేస్తున్నప్పుడు ఒక తల్లిగా ఎంతో గర్వంగా చూసింది. తన కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికిన తర్వాత, యువరాణి అడుగులు అకాడమీ వైపు మెల్లిగా పడ్డాయి. ఆ సమయంలో తన సొంత సూట్కేస్ను కూడా ఆమె తీసుకుళ్లింది. యువరాణి అయినా కూడా అందరిలా ఎంట్రీ పుస్తకంలో తన పేరుతో పాటు సంతకం చేసి లోపలికి వెళ్లింది. లియోనార్ తన ప్రాథమిక విద్యను శాంటా మారియా డి లాస్ రోసేల్స్ స్కూల్లో పొందింది. ఆమె మాధ్యమిక విద్య పూర్తయిన తర్వాత, ఆమె యునైటెడ్ కింగ్డమ్లోని వేల్స్లోని UWC అట్లాంటిక్ కాలేజీలో ఇంటర్నేషనల్ బాకలారియాట్ ప్రోగ్రామ్ను అభ్యసించింది. ఆ తర్వాత, 17 ఆగస్టు 2023న, లియోనార్ జనరల్ మిలిటరీ అకాడమీలో తన మూడేళ్ల సైనిక శిక్షణను ప్రారంభించింది. మొదటి స్టేజీ దాటుకున్న ఆమె తాజాగా కఠినమైన శిక్షణ తీసుకునేందకు సిద్ధం అయింది. లియోనార్ 2023-2024 విద్యా సంవత్సరానికి లేడీ క్యాడెట్గా శిక్షణ పొందుతుందని అక్కడి అధికారులు తెలిపారు. మరుసటి సంవత్సరం, ప్రిన్సెస్ లియోనార్ నేవీలో శిక్షణ పొందుతారు. మారిన్ నావల్ మిలిటరీ స్కూల్లో మిడ్షిప్మ్యాన్గా జువాన్ సెబాస్టియన్ డి ఎల్కానో ట్రైనింగ్ షిప్లో పని చేస్తుంది. ఆ తర్వాత 2025 నుంచి 2026 వరకు శాన్ జేవియర్ జనరల్ ఎయిర్ అకాడమీకి ఎన్సైన్ విద్యార్థిగా చేరి అక్కడ ఎయిర్ అండ్ స్పేస్ ఆర్మీతో తన కోర్సులను పూర్తి చేస్తారు. స్పెయిన్ సింహాసనానికి వారసురాలిగా ఎంపిక అయ్యేందకు ఈ తీవ్రమైన శిక్షణ తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే ఆమె తండ్రి కింగ్ ఫెలిప్ కూడా అనేక మిలిటరీ అకాడమీలలో శిక్షణ పొందాడు. సైన్యం, నేవీ నుంచి హెలికాప్టర్ పైలట్ వింగ్లలో తన పనితీరును కనపరిచారు. ఇంత కఠినమైన శిక్షణను ఆమె దాటుకుంటే ఆమె ఒక రికార్డును కూడా సొంతం చేసుకుంటుంది. లియోనార్ సింహాసనాన్ని అధిరోహిస్తే.. ఆమె 1833 నుంచి 1868 వరకు పాలించిన తన 4వ తరం నానమ్మ అయిన ఇసాబెల్లా II తర్వాత స్పెయిన్ మొదటి రాణి అవుతుంది. సుమారు 160 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబం నుంచి ఒక మహిళ మరోసారి యువరాణిగా అడుగుపెట్టబోతుంది. భవిష్యత్లో లియోనోర్.. స్పానిష్ సాయుధ దళాలకు సుప్రీం కమాండర్గా పని చేసే బాధ్యత కూడా దక్కుతుంది. లియోనోర్ సైనిక శిక్షణ ప్రాముఖ్యత గురించి స్పానిష్ రక్షణ మంత్రి మార్గరీటా రోబుల్స్ ఇలా అన్నారు, "యువరాణి జీవితంలో ఇదొక ముఖ్యమైన ఘట్టం... మన దేశం నాయకత్వం సంబంధించి ఇదొక ముఖ్యమైన అడుగు" అని తెలిపారు. లియోనోర్ మూడేళ్ల పాటు శిక్షణ అనంతరం స్పెయిన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, స్పేస్ కమాండ్లో లెఫ్టినెంట్గా ఉంటారు. అలాగే నేవీలో ఎన్సైన్గా ఉంటారు. స్పెయిన్ సింహాసనాన్ని అధిష్టించడానికి ముందు వారి వారసులు సైనిక అనుభవాన్ని పొందడం గొప్ప రాజ సంప్రదాయం. బెల్జియం యువరాణి ఎలిసబెత్ 2020-2021 విద్యా సంవత్సరాన్ని బ్రస్సెల్స్లోని రాయల్ మిలిటరీ అకాడమీలో గడిపారు, స్వీడన్కు చెందిన క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా 2022లో స్వీడిష్ సాయుధ దళాలతో శిక్షణను పొందారు. ప్రిన్సెస్ లియోనార్ అక్టోబర్ 31, 2005న స్పెయిన్లోని మాడ్రిడ్లో ప్రస్తుత చక్రవర్తి, కింగ్ ఫెలిపే VI, క్వీన్ లెటిజియా దంపతులకు జన్మించారు. ఆమెలో దాగి ఉన్న విశేషమైన తెలివితేటలు స్పానిష్ ప్రజల హృదయాలను దోచుకున్నాయి, రాజ కుటుంబం ప్రతిష్టను నిలబెట్టే వారసురాలు పుట్టిందని వారు సంబరపడ్డారు. ప్రత్యేకించి ఆమె తాత, మాజీ రాజు జువాన్ కార్లోస్ వివాదాల తర్వాత 2014లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆమె తండ్రి సింహాసనాన్ని అధిష్టించారు. తాజాగా లియోనోర్కు స్పానిష్ కిరీటం అందనుంది. వారి కుటుంబ నిబంధనల ప్రకారం ఆమె శిక్షణ పొంది భవిష్యత్లో స్పైయిన్ రాణిగా అవతరించడమే కాకుండా దేశ పరిరక్షణలో భాగం పంచుకోనుంది. View this post on Instagram A post shared by Princesa Leonor💕Infanta Sofía (@leonorandsofia) La Princesa de Asturias, acompañada por los Reyes y la Infanta Sofía, firma en el libro de honor de la Academia General Militar, donde hoy dará comienzo a su formación castrense. ➡️https://t.co/1hhg1pw3f3 pic.twitter.com/g95HgK5pnq — Casa de S.M. el Rey (@CasaReal) August 17, 2023 -
Alex Baty: బ్రిటన్లో పాపం పసివాడు!
అనగనగా అలెక్స్ బాటీ. ఓ 11 ఏళ్ల పాల బుగ్గల పసివాడు. సొంతూరు బ్రిటన్లోని గ్రేటర్ మాంచెస్టర్. తల్లి, తాతయ్య విదేశీ యాత్రకు వెళ్దామంటే సంబరంగా వాళ్లతో కలిసి స్పెయిన్ బయల్దేరాడు. ఆ యాత్ర ఏకంగా ఆరేళ్లకు పైగా సాగుతుందని అప్పుడతనికి తెలియదు పాపం! ఎందుకంటే అప్పట్నుంచీ అతను బ్రిటన్ తిరిగి రానే లేదు. సరికదా, ఆచూకీ కూడా తెలియకుండా పోయాడు! అతనే కాదు, నాటినుంచీ అతని తల్లి, తాతయ్య కూడా నేటికీ పత్తా లేరు!! ఈ ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బ్రిటన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కూడా చేశారు. అలెక్స్ కోసం యూరప్ అంతటా వెదికీ వెదికీ అలసిపోయారు. ఇక తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. అదుగో, అలాంటి స్థితిలో మూడు రోజుల క్రితం అనుకోకుండా ఫ్రాన్స్లో దొరికాడు అలెక్స్. ఈ లాస్ట్ అండ్ ఫౌండ్ స్టోరీ ఇప్పుడు బ్రిటన్ అంతటా టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది! ఇలా దొరికాడు... వాయవ్య ఫ్రాన్స్లోని టౌలోస్ అనే కొండ ప్రాంతంలో గత బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ 17 ఏళ్ల కుర్రాడు హోరు వానలో తడుస్తూ, హైవే పక్కగా పేవ్మెంట్పై ఒంటరిగా నడుస్తూ పోతున్నాడు. అటుగా వెళ్తున్న ఫాబియన్ అసిడినీ అనే ఓ ట్రక్ డ్రైవర్ కంటపడ్డాడు. అది మారుమూల ప్రాంతం, పైగా ఎవరూ బయట తిరగని వేళ కావడంతో అనుమానం వచి్చన ఆ డ్రైవర్ మనవాణ్ని దగ్గరికి తీశాడు. తొలుత బెదురు చూపులతో మారుపేరు చెప్పినా, అనునయించి అడిగేసరికి అసలు పేరు, తాను తప్పిపోయిన వృత్తాంతంమొత్తం చెప్పుకొచ్చాడు. ‘కొన్నేళ్ల కింద మా అమ్మే నన్ను కిడ్నాప్ చేసింది’ అంటూ ముక్తాయించాడు. దాంతో బిత్తరపోయిన అసిడినీ వెంటనే అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాడు. వాళ్లు బ్రిటన్కు సమాచారమివ్వడం, ఫొటో చూసిన నానమ్మ అలెక్స్ను గుర్తు పట్టడం, ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకుని ఆనందబాష్పాలు రాల్చడం చకచకా జరిగిపోయాయి. ఏం జరిగిందంటే... అలెక్స్ అమ్మానాన్నలు చాన్నాళ్ల క్రితమే విడిపోయారు. అలెక్స్ కోరిక మేరకు కోర్టు అతన్ని నానమ్మ సంరక్షణలో ఉంచింది. ఆమె అనుమతి లేకుండానే 11 ఏళ్ల అలెక్స్ను తల్లి, తాతయ్య కలిసి విహారయాత్ర పేరిట 2017లో స్పెయిన్ తీసుకెళ్లారు. అప్పటినుంచీ ముగ్గురూ అయిపు లేకుండా పోయారు. పెద్దవాళ్లిద్దరూ అప్పటికి కొంతకాలంగా ఆధ్యాతి్మక బాట పట్టినట్టు దర్యాప్తులో తేలింది. తమతో పాటు అలెక్స్ కూడా ఆ ప్రత్యామ్నాయ జీవనం గడపాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకుని స్పెయిన్లో ఓ ఆరామం వంటి ప్రదేశానికి వెళ్లినట్టు పోలీసులు ముక్తాయించారు. తాము తొలుత ఓ విలాసవంతమైన ఇంట్లో ఒక రకమైన ఆధ్యాతి్మక సమూహంతో కలిసి కొన్నేళ్ల పాటు గడిపామన్న అలెక్స్ తాజా వాంగ్మూలం కూడా దీన్ని ధ్రువీకరించింది. తర్వాత అమ్మ, తాతయ్య ఇద్దరూ అలెక్స్ను తీసుకుని 2021లో ఫ్రాన్స్లో ప్రత్యామ్నాయ జీవన శైలికి పేరున్న పైరెనీస్ ప్రాంతానికి మారినట్టు భావిస్తున్నారు. అలెక్స్ దొరికిన చోటు కూడా అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది. ఆ జీవన విధానం తనకు నచ్చక నానమ్మ చెంతకు చేరేందుకు తప్పించుకుని వచ్చేశానని అలెక్స్ చెప్పుకొచ్చాడు. అతన్ని ఒకట్రెండు రోజుల్లో నానమ్మ దగ్గరికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతని అమ్మ, తాతయ్యలపై కిడ్నాపింగ్ కేసు ఇప్పటికీ పెండింగ్లోనే ఉండటం విశేషం! తాజా వివరాల ఆధారంగా వారిని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు బ్రిటన్ పోలీసులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్కు స్పెయిన్ షాక్
కౌలాలంపూర్: జూనియర్ పురుషుల అండర్–21 ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత్కు ఊహించని ఫలితం ఎదురైంది. గురువారం వరుసగా రెండో విజయం సాధించి దర్జాగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని ఆశించిన యువ భారత్ గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్లో 1–4 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండో విజయంతో స్పెయిన్ జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్లో దక్షిణ కొరియాపై 4–2తో నెగ్గి శుభారంభం చేసిన భారత జట్టుకు రెండో మ్యాచ్లో స్పెయిన్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఆట తొలి నిమిషంలోనే పాల్ క్యాబిర్ వెర్డెల్ గోల్తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 18వ నిమిషంలో ఆండ్రెస్ రాఫి గోల్తో స్పెయిన్ ఆధిక్యం 2–0కు పెరిగింది. 33వ నిమిషంలో రోహిత్ గోల్ సాధించడంతో భారత్ ఖాతా తెరిచింది. అయితే స్పెయిన్ జోరు తగ్గించకుండా ఆడుతూ ఎనిమిది నిమిషాల తర్వాత మూడో గోల్ చేసింది. పాల్ క్యాబిర్ వెర్డెల్ గోల్తో స్పెయిన్ 3–1తో ముందంజ వేసింది. మ్యాచ్ చివరి నిమిషంలో ఆండ్రెస్ రాఫి గోల్తో స్పెయిన్ 4–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత జట్టుకు ఈ మ్యాచ్లో ఏడు పెనాల్టీ కార్నర్లు రాగా కేవలం ఒక దానిని సహాకీ టోర్నీ నియోగం చేసుకుంది. మరో మ్యాచ్లో దక్షిణ కొరియా 4–1తో కెనడాను ఓడించి క్వార్టర్ ఫైనల్ రేసులో నిలిచింది. శనివారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో కెనడాతో భారత్; కొరియాతో స్పెయిన్ తలపడతాయి. కొరియా–స్పెయిన్ మ్యాచ్ తర్వాతే భారత జట్టు మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ స్పెయిన్ చేతిలో కొరియా ఓడితే భారత్ తమ మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంటే చాలు క్వార్టర్ ఫైనల్ చేరుకుంటుంది. ఒకవేళ స్పెయిన్పై కొరియా గెలిస్తే మాత్రం భారత్ భారీ తేడాతో కెనడాపై తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. -
మగబిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంట!ఒకే బిడ్డను ఇద్దరు గర్భంలో..
ఓ స్వలింగ జంట మగ బిడ్డకు జన్మనివ్వడమే ఓ మిరాకిల్ అనేకుంటే.. ఏకంగా ఇద్దరు కలిసి ఒక బిడ్డనే కడపున మోయడం మరింత విశేషం. ఈఘటన ఐరోపాలో చోటు చేసుకుంది. ఇది ఎలా సాధ్యం అనిపిస్తోంది కదా!. ఫెర్టిలిటి సెంటర్ని సంప్రదించి బిడ్డల్ని కనే ప్రయత్నం చేశారనుకున్నా.. ఇద్దరూ గర్భంలో మోయడం ఏంటీ అనే డౌటు వస్తుంది కదా!. గతంలో తొలిసారిగా ఓ స్వలింగ జంట ఇలానే ఒకే బిడ్డను ఇద్దరూ మోసి చరిత్ర సృష్టించారని ఈ స్వలింగ జంట రెండోదని అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఏంటా కథా కమామీషు చూద్దాం!. స్పెయిన్లో మజోర్కాలోని పాల్మాలో ఎస్టీఫానియా(30), అజహారా(27) అనే స్వలింగ జంట అక్టోబర్ 30న ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వారిద్దరూ మహిళలే. పిల్లల్ని కనాలని ఆశపడ్డారు. ఇద్దరు మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించాలనుకున్నారు. అందుకోసం ఓ ఫెర్టిలిటి సెంటర్ని సంప్రదించారు. ముందుగా ఎస్టీఫానియా మహిళ గర్భంలో స్పెర్మ్ని ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందేలా చేశారు. ఐదు రోజుల అనంతరం ఆ పిండాన్ని అజహారా గర్భంలో పెట్టారు. అలా ఇద్దరూ ఒకే బిడ్డను మోసి మాతృత్వపు అనుభూతిని పొందారు. ఇందుకోసం సుమారు రూ. 4 లక్షలు ఖర్చుపెట్టి మరీ తమ కలను సాకారం చేసుకున్నారు. అంతేగాదు ఇద్దరూ ఒకరిపట్ల ఒకరూ కేర్ వహిస్తూ తమ అనుబంధం మరింత బలపడింది అనేందుకు చిహ్నంగా ఒకే బిడ్డకు జన్మనిచ్చాం. ఆ ఆలోచన మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటూ ఆనందంగా చెబుతున్నారు ఇరువురు. ఈ వైద్య విధానాన్ని ఇన్వోసెల్గా పిలిచే సంతానోత్పత్తి చికిత్స అంటారు. ఇలా ఇంతకుమునుపు 2018లో టెక్సాస్లో ఓ స్వలింగ జంట(ఇద్దరు మహిళలు) ఒకే బిడ్డను మోసి.. ప్రపంచంలోనే తొలి స్వలింగ జంటగా నిలిచారు. సంతానం లేనివాళ్లకే గాక పిల్లల్ని కనడం సాధ్యం కానీ ఇలాంటి స్వలింగ జంటలకు ఈ సరికొత్త వైద్య విధానం ఓ వరం. వైద్యవిధానం సరికొత్త ఆవిష్కరణలతో అభివృద్ధిని, ప్రగతిని సాధిస్తోందనడానికి ఈ ఘటనే ఓ నిదర్శనం (చదవండి: కోవిడ్ కొత్త వ్యాక్సిన్ ఆ క్యాన్సర్ని రానివ్వదు! అధ్యయనంలో వెల్లడి) -
స్పెయిన్ ప్రధానిగా మళ్లీ పెడ్రో సాంచెజ్
మాడ్రిడ్: స్పెయిన్ ప్రధాని పీఠాన్ని సోషలిస్ట్ పార్టీకి చెందిన మరోసారి పెడ్రో సాంఛెజ్ అధిష్టించనున్నారు. గురువారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో 350 మందికి గాను 179 మంది ఎంపీలు ఆయనకు మద్దతు తెలిపారు. కేటలోనియా వేర్పాటు ఉద్యమ నేత చార్లెస్ పిడ్గెమాంట్కు క్షమాభిక్ష ప్రకటించేందుకు పెడ్రో సాంఛెజ్ అంగీకరించడం.. బదులుగా వేర్పాటువాద పార్టీలు ఆయన ప్రభుత్వంలో చేరేందుకు అంగీకరించడంతో మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నూతన ప్రభుత్వంలో రెండు కేటలోనియా వేర్పాటువాద పార్టీలు సహా మొత్తం ఆరు చిన్న పార్టీలు భాగస్వాములు కానున్నాయి. జూలై 23న జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. 2017లో స్పెయిన్ నుంచి విడిపోతున్నట్లు కేటలోనియా వేర్పాటువాదులు ప్రకటించడంతో దేశంలో సంక్షోభం ఏర్పడింది. వేర్పాటువాద నేత చార్లెస్ పిడ్గెమాంట్ను ప్రభుత్వం నేరగాడిగా ప్రకటించింది. -
అంత పెద్ద పేరా.. కుదరదు
మాడ్రిడ్: స్పెయిన్లోని ఓ రాచకుటుంబానికి చెందిన రాకుమారుడు తన కుమార్తెకు ఏకంగా 157 అక్షరాలతో సుదీర్ఘంగా ఉండే వెరైటీ పేరు పెట్టారు. స్పెయిన్లోని ఆల్బా రాజ్య వారసుడు, 17వ హ్యూస్కర్ డ్యూక్ ఫెర్నాండో ఫిట్జ్–జేమ్స్ స్టువర్ట్, సోఫియా దంపతులకు ఇటీవల కూతురు జన్మించింది. ఫెర్నాండో ఆమెకు ప్రత్యేకంగా ఉండే ఏకంగా 25 పదాలు, 157 అక్షరాలతో కూడిన.. పొడవాటి పేరు పెట్టారు. అదేమిటంటే.. సోఫియా ఫెర్నాండా డొలొరెస్ కయెటనా టెరెసా ఏంజెలా డీ లా క్రుజ్ మికేలా డెల్ శాంటిసిమో సక్రామెంటో డెల్ పర్పెటువో సొకొర్రో డీ లా శాంటిసిమా ట్రినిడాడ్ వై డీ టొడొస్ లాస్ సాంటోస్’. ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ పేరును అధికారికంగా రిజిస్టర్ చేసేందుకు స్పెయిన్ అధికారులు మాత్రం అంగీకరించడంలేదు. నిబంధనలకు లోబడి చిన్నగా ఉండే పేరును కూతురికి పెట్టుకోవాలని, అప్పుడే రికార్డుల్లో నమోదు చేస్తామని రాకుమారుడికి అధికారులు సూచించారు. దీనిపై రాకుమారుడు స్పందించాల్సి ఉంది. -
గోల్ఫ్ కోర్సుల రంధ్రాల మూసివేత ఎందుకు? స్పెయిన్లో ఏం జరుగుతోంది?
స్పెయిన్లోని పర్యావరణ కార్యకర్తలు కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఐరోపా దేశాలు తీవ్రమైన కరువుతో తల్లడిల్లుతున్న నేపధ్యంలో స్పెయిన్కు చెందిన పర్యావరణ కార్యకర్తలు నీటిని పొదుపు చేయడానికి నూతన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మాడ్రిడ్, వాలెన్సియా, ఇబిజా, నవర్రాతో సహా ఆరు రాష్ట్రాలలో గోల్ఫ్ కోర్సుల రంధ్రాలను మూసివేశారు. గోల్ఫ్ కోర్స్ చుట్టూ ఉన్న పచ్చటి ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రతిరోజూ 22,000 గ్యాలన్లకు పైగా నీరు అవసరమని వారు చెబుతున్నారు. కరువు కారణంగా స్పెయిన్ రైతులు తమ పంటలకు తగినంత నీరు అందకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దేశంలో గోల్ఫ్ కోర్సుల కంటే పంట పొలాలకు నీటి అవసరం అధికమని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. సీఎన్ఎన్ తెలిపిన వివరాల ప్రకారం పర్యావరణ కార్యకర్తలు ప్రస్తుతం 10 గోల్ఫ్ కోర్స్ల రంధ్రాలను మూసివేశారు. మైదానంలో కొన్ని గుంతలలో మొక్కలు నాటడమే కాకుండా కొన్నింటిని సిమెంటుతో మూసివేశారు. ఎక్స్టింక్షన్ రెబెల్లియన్ (ఎక్స్ఆర్) సంస్థ సభ్యులు పర్యావరణ కార్యకర్తలతో కలిసి ఈ పనులు చేపట్టారు. కరువు సంక్షోభం మధ్య నీటి వృథాను అరికట్టేందుకు గోల్ఫ్ కోర్స్ల రంధ్రాలను మూసివేయడం తప్పనిసరి అని ఎక్స్టింక్షన్ రెబెల్లియన్ గ్రూప్ పేర్కొంది. దేశమంతా కరువుతో తల్లడిల్లిపోతున్నప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఉన్నతవర్గం వారు గోల్ఫ్ కోర్సుల పేరుతో నీటిని వృథా చేయడం తగదన్నారు. సంపన్నుల అనవసర కార్యకలాపాల వల్ల వనరులు వృథా అవుతున్నాయని వారు ఆరోపించారు. కొన్ని నెలలుగా స్పెయిన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నదులు, చెరువులు, ఇతర నీటి వనరులలోని నీటిశాతం నిరంతరం తగ్గతూవస్తోంది. ఈ నేపధ్యంలోనే శాన్ రోమన్ డి కా సౌ రిజర్వాయర్ నీటి మట్టం 1990 నుండి కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో రిజర్వాయర్లో మునిగిపోయిన పాత చర్చి పూర్తిగా కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం స్పెయిన్లో కరువు పరిస్థితులు మరింతగా పెరగనున్నాయి. ఇది కూడా చదవండి: యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? -
గుండెపోటు నాటకంతో 20 రెస్టారెంట్లకు టోకరా: చివరికి ఏమైందంటే...?
రెస్టారెంట్ బిల్లు ఎగ్గొట్టేందుకు గుండె పోటు డ్రామాలు ఆడడం అలవాటుగా మార్చుకున్నాడో ప్రబుద్ధుడు. ఇలా ఒకటీ, రెండూ కాదు ఏకంగా 20 రెస్టారెంట్లలో ఇదే తంతు కొనసాగించాడు. కానీ మోసం ఎల్లకాలం సాగదు కదా. ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు. ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పెయిన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. డైలీ లౌడ్ ప్రకారం ఖరీదైన రెస్టారెంట్కు వెళ్లడం, కడుపునిండా లాగించేయడం ఆనక మూర్ఛపోయినట్టు నటించి, గుండె నొప్పి అంటూ నైలపై దొర్లి దొర్లి హడావిడి చేయడం ఇదీ ఇతగాడి తంతు. స్పెయిన్లోని బ్లాంకా ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్లలో ఫ్యాన్సీ డిన్నర్ తింటాడు. సరిగ్గా బిల్లు కట్టే సమయానికి గుండెపోటు అంటూ భయంకరమైన డ్రామాకు తెర తీస్తాడు. ఇతగాడి నాటకాన్ని పసిగట్టిన సిబ్బంది అప్రమత్తమై, ఈ కేటుగాడి ఫోటోను ఆ ప్రాంతంలోని అన్ని రెస్టారెంట్లకు పంపించి వారిని కూడా అలర్ట్ చేశారు. (టీవీ మహిళా జర్నలిస్టు హత్యకేసు: ఆ దుర్మార్గులదే ఈ పని!) దీన్ని గమనించని మనోడు ఒక లగ్జరీ రెస్టారెంట్లో యథావిధిగా సుష్టిగా భోంచేశాడు. ముందుగానే అక్కడి సిబ్బంది బిల్లు ఇచ్చారు. దీంతో సుమారు రూ. 3,081 బిల్లు చెక్కు ఇచ్చి వెళ్లి పోదామని చూశాడు. పాత బిల్లు సంగతి ఏంటని నిలదీశారు. అయితే హోటల్ గదికి వెళ్లి డబ్బులు తెస్తానని చెప్పాడు. సిబ్బంది అతన్ని వదిలి పెట్టలేదు. నాటకం మొదలు పెట్టాడు. గుండెనొప్పి వస్తోంది ఆంబులెన్స్ని పిలవాలంటూ హంగామా చేశాడు. కానీ వాళ్లు ఆంబులెన్స్కు బదులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతగాడి మోసానికి చెక్ పడింది. అతని ఫోటోను అన్ని రెస్టారెంట్లకు పంపి, అరెస్ట్ చేయించామని స్థానిక రెస్టారెంట్ మేనేజర్ మీడియాకు తెలిపారు. గత ఏడాది నవంబరు 22 నుంచి ఈ వ్యక్తి ఈ నగరంలోనే ఉంటున్నాడట. (భీకర పోరు: సాహో ఇండియన్ సూపర్ విమెన్, వైరల్ వీడియో) -
మెరి‘సాయి దివ్య’ ప్రయోగాలు
తెనాలి: తెనాలికి చెందిన బుల్లి ఉపగ్రహాల రూపశిల్పి కొత్తమాసు సాయిదివ్య మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాను రూపొందించిన క్యూబ్శాట్–బీడబ్ల్యూశాట్ను స్పెయిన్ దేశంలో అక్కడి బీ2 స్పేస్ కంపెనీ సాయంతో బుధవారం స్ట్రాటో ఆవరణలోకి ప్రయోగించారు. ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగంంలో పీహెచ్డీ స్కాలర్ అయిన సాయిదివ్య ప్రయోగించిన పేలోడ్లలో ఇది మూడోది కావటం విశేషం. 280 గ్రాముల ఈ పేలోడ్ను ఇక్కడి తన సొంత ‘ఎన్–స్పేస్టెక్’ అనే సంస్థలో తన బృందంతో కలిసి ఆమె తయారుచేశారు. ఇదీ నేపథ్యం శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో రీసెర్చ్ స్కాలర్గా పనిచేస్తున్న కొత్తమాసు సాయిదివ్య బాపట్ల ఇంజినీరింగ్ కాలేజిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేశారు. కేఎల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్స్లో ఎంటెక్ చేశారు. తన థీసిస్లో భాగంగా తన నివాసంలోనే ‘ఎన్–స్పేస్టెక్’ అనే సొంత కంపెనీని ఆరంభించారు. అంతరిక్ష సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావ టం, తక్కువ ఖర్చుతో బుల్లి ఉపగ్రహాల తయారీని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. తొలిగా లక్ష్యశాట్ పేరుతో క్యూబ్శాట్ను తయారుచేసి, గతేడాది మార్చిలో యునైటెడ్ కింగ్డమ్ నుంచి బీ2 స్పేస్ సహకారంతోనే స్ట్రాటో ఆవరణలోకి విజయవంతంగా ప్రయోగించారు. ఎక్కువ ఎత్తుకు వెళ్లగలిగిన బెలూన్ సాయంతో పంపిన 400 గ్రాముల లక్ష్యశాట్, భూతలం నుంచి 26 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి, స్ట్రాటో అవరణలో కొన్ని గంటల ఉండగలిగింది. ప్రైవేట్ ర్యాకెట్ ప్రయోగంలో భాగస్వామి తర్వాత కొద్దినెలల్లోనే దేశంలో జరిగిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంలో సాయిదివ్య భాగస్వామి కాగలిగారు. స్కై రూట్ అనే ప్రైవేటు సంస్థ విక్రమ్–ఎస్ రాకెట్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సబ్ ఆర్బిట్లోకి ప్రయోగించారు. ఆ రాకెట్ తీసుకెళ్లిన మూడు పేలోడ్లలో తెనాలిలో సాయిదివ్య రూపొందించిన లక్ష్యశాట్–2 పేలోడ్ ఒకటి కావటం గమనించాల్సిన అంశం. స్ట్రాటో ఆవరణలో అధ్యయనానికి బీడబ్ల్యూశాట్ ఆ క్రమంలోనే సాయిదివ్య తమిళనాడుకు చెందిన శక్తిప్రియ, బాపట్ల, కాకినాడలకు చెందిన రెహమాన్, ఉత్తేజ్తో కలిసి బీడబ్ల్యూశాట్ను తయారుచేశారు. మయన్మార్ దేశంలోని ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు శాటిలైట్ టెక్నాలజీపై వీరు ఇక్కణ్ణుంచే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ బోధనలో భాగంగానే తయారుచేసిన బీడబ్ల్యూశాట్ను మయన్మార్ తీసుకెళ్లి అక్కడి విద్యార్థులకు ప్రదర్శించారు. డిమాన్స్ట్రేషన్ ఇచ్చారు. అనంతరం బీ2 స్పేస్ కంపెనీ సహకారంతో స్పెయిన్లో ప్రయోగించారు. తాజా పేలోడ్తో స్ట్రాటో ఆవరణంలోని ఉష్ణోగ్రత, తేమ, ఆల్డిట్యూడ్ ప్రెషర్, యూవీ ఇంటెన్సిటీ, ఎంత వెలుతురు ఉంది అనే డేటా సేకరణ వీలవుతుందని బుధవారం సాయంత్రం సాయిదివ్య స్థానిక విలేకరులకు తెలిపారు. స్కైరూట్ సంస్థతో కలిసి త్వరలో జరగనున్న విక్రమ్–1 రాకెట్ ప్రయోగంలో భాగస్వామ్యం కానున్నట్టు చెప్పారు. రాకెట్లో ప్రయోగించే ఐయూ క్యూబ్శాట్ పేలోడ్ రూపకల్పనలో ఉన్నట్టు వివరించారు. తన తొలి పేలోడ్ నుంచి ఇప్పటివరకు తన భర్త రఘురామ్, అత్తమామలు కొత్తమాసు కుమార్, చంపకవల్లి, తండ్రి కేఎన్ ప్రసాద్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. -
నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం..13 మంది సజీవ దహనం
మాడ్రిడ్: స్పెయిన్లోని ముర్సియా నగరంలోని ఓ నైట్ క్లబ్లో సంభవించిన అగ్ని ప్రమా దంలో 13 మంది సజీవ దహనమ య్యారు. మరో నలుగురు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. ప్రముఖ టియేటర్ నైట్ క్లబ్లో ఉదయం 6 గంటల సమయంలో మొదలైన మంటలు భవనమంతటా వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. లోపల మరికొంత మంది చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవనం పైకప్పు కూలుతుందనే భయంతో ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారని చెప్పారు. -
సంగీత మమకారం
క్షణం తీరిక లేని పనుల్లో అభిరుచులు చిన్నబోతుంటాయి. ఎందుకంటే సమయాభావం వల్ల వాటి జోలికి వెళ్లం. అయితే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అభిరుచుల విషయంలో రాజీ పడదు. సమయం చేసుకొని, చూసుకొని వాటికి న్యాయం చేస్తుంది. దీదీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రసంగించే వక్త మాత్రమే కాదు బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. చక్కగా ఆడుతుంది. కవిత్వం రాస్తుంది. పాటలు పాడుతుంది. బొమ్మలు గీస్తుంది. ఆమె మానసిక బలానికి ఈ సృజనాత్మక శక్తులే కారణం కావచ్చు. అధికార పర్యటనలో భాగంగా ఇటీవల స్పెయిన్కు వెళ్లిన మమతా బెనర్జీ, ఒకవైపు సమావేశాలలో పాల్గొంటూనే మరోవైపు తనలోని ఆర్టిస్ట్ను అధికారులకు పరిచయం చేసింది. పియానోపై రవీంద్రుడి సంగీతాన్ని వినిపించింది. అంతకుముందు మాడ్రీడ్ వీధుల్లో అకార్డియన్పై ‘హమ్ హోంగే’ గీతాన్ని ప్లే చేసింది. ఈ వీడియోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. -
Video: చీరకట్టు, స్మార్ట్ వాచ్తో మమతా బెనర్జీ జాగింగ్..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 12 రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్, స్పెయిన్కు వెళ్లారు. ప్రస్తుతం స్పెయిన్లోని మాడ్రిడ్లో పర్యటిస్తున్నారు. తాజాగా అక్కడ ఆమె జాగింగ్ చేస్తూ కనిపించారు. చీర కట్టులో.. స్మార్ట్ వాచ్ ధరించి, రబ్బరు చెప్పులు వేసుకుని మరీ.. మాడ్రిడ్ పార్క్లో మమతా బెనర్జీ జాగింగ్ చేశారు. దీదీతో పాటు ఆ దేశానికి వెళ్లిన బృందం కూడా జాగింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్స్టాలో పోస్టు చేశారు. ‘మార్నింగ్ రిఫ్రెష్. ఉదయమే జాగింగ్ చేస్తే రోజుకు కావాల్సిన శక్తి వస్తుంది. అందరూ ఫిట్గా, ఆరోగ్యంగా ఉండండి’ అంటూ ఆమె ఆ పోస్టుకు కామెంట్ కూడా చేశారు. కాగా సాధారణంగా ప్రతి రోజూ ట్రెడ్మిల్పై జాగ్ చేస్తుంటారు. గతంలోనూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ.. వివిధ సందర్భాల్లో చెప్పుకొస్తూ ఉంటారు. ఓసారి ఆమె డార్జిలింగ్ కొండల్లో 10 కిలోమీటర్లు జాగింగ్ చేసి ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. 12 రోజుల పాటు దుబాయ్, స్పెయిన్ పర్యటనకు వెళ్లిన దీదీ ప్రముఖ స్పానిష్ ఫుట్బాల్ లీగ్ అయిన లా లిగా అధ్యక్షుడితో చర్చలు జరపనున్నట్లు సమాచారం. లా లిగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్లో ఒకటి. చదవండి: జోరు వానలో ల్యాండింగ్.. ముంబైలో విమాన ప్రమాదం View this post on Instagram A post shared by Mamata Banerjee (@mamataofficial) View this post on Instagram A post shared by Mamata Banerjee (@mamataofficial) -
ముద్దు వివాదం.. పదవికి రాజీనామా చేసిన ఫుట్బాల్ ఫెడరేషన్ చీఫ్
ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో తమ దేశ స్టార్ ఫుట్బాలర్ జెన్నిఫర్ హెర్మోసోను బలవంతంగా ముద్దు పెట్టుకుని వివాదాల్లో చిక్కుకున్న స్పెయిన్ ఫుట్బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశాడు. కొద్ది రోజుల కిందట ఫిఫా రుబియాలెస్పై వేటు వేసింది. తాజాగా రుబియాలెసే స్వయంగా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పెయిన్ ఫుట్బాల్ ఫెడరేషన్కు సమర్పించాడు. కాగా, స్పెయిన్ మహిళల ఫుట్బాల్ జట్టు జగజ్జేతగా అవతరించిన అనంతరం మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా రుబియాలెస్.. జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో రుబియాలెస్.. జెన్నిఫర్తో పాటు మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. రుబియాలెస్ నుంచి ఊహించని ఈ ప్రవర్తన చూసి జెన్నిఫర్తో పాటు అక్కడున్న వారంతా షాక్కు గురయ్యారు. ఈ ఉదంతంపై స్పెయిన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో రుబియాలెస్ తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశాడు. ఈ ఏడాది ఆగస్ట్లో జరిగిన ఫిఫా మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్పై 1-0 గోల్స్ తేడాతో గెలిచి జగజ్జేతగా అవతరించింది. -
ఈ చీజ్ ధర వింటే ..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
ఫొటోలో కనిపిస్తున్న చీజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్. ఉత్తర స్పెయిన్కి చెందిన విలక్షణమైన ఈ చీజ్ పేరు కాబ్రేల్స్ బ్లూ చీజ్. ఇటీవల ప్రిన్సిపాలిటీ ఆఫ్ అస్ట్యూరీయస్లో జరిగిన స్థానిక చీజ్ ఫెస్టివల్లో 2.2 కిలోల ఈ కాబ్రేల్స్ బ్లూ చీజ్ని వేలం వేయగా, రూ. 27 లక్షలు ధర పలికి ప్రపంచ రికార్డును కరిగించింది. సాధారణంగా బ్లూ చీజ్ని పచ్చి ఆవుపాలతో తయారు చేస్తారు. కానీ ఈ కాబ్రేల్స్ బ్లూ చీజ్ని మాత్రం మేకపాలు, గొర్రెపాలు కలిపి తయారు చేస్తారట! అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న సున్నపురాయి గుహలలో ఎనిమిది నెలల పాటు నిల్వ చేస్తారు. ‘అందుకే దీనికి ఇంతటి అద్భుతమైన రుచి’ అంటున్నారు చీజ్ ఫెస్టివల్ అతిథులు. (చదవండి: చూడటానికి చిన్న "క్యూఆర్ కోడ్"..వ్యాపారంలో ప్రకంపమే సృష్టిస్తోంది!) -
జీ-20: కోవిడ్ కారణంగా మరో నేత మిస్.. పుతిన్, జిన్పింగ్ సహా..
ఢిల్లీ: రేపటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సదస్సు జరుగనుంది. కాగా, కోవిడ్ కారణంగా మరో నేత జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదు. స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్కు కోవిడ్ పాజిటివ్గా తేలడంతో జీ-20 సదస్సుకు ఆయన హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో, మరో కీలక నేత సమావేశాలకు దూరమయ్యారు. వివరాల ప్రకారం.. జీ-20 సమావేశాలకు స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ హాజరు కావడం లేదు. తాజాగా ఆయనకు కోవిడ్ పాజిటివ్గా తేలడంతో సమావేశాలకు రావడంలేదని తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా శాంచెజ్..‘గురువారం నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్గా తేలింది. దీంతో, ఢిల్లీలో జరగబోయే జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదు. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. జీ-20 సమావేశాల్లో స్పెయిన్ తరఫున వైఎస్ ప్రెసిడెంట్ నాడియా క్వాలినో శాంటామారియా, విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బరేస్ ప్రాతినిధ్యం వహిస్తారని’ చెప్పారు. అలాగే, యూరోపియన్ యూనియన్(ఈయూ) సహకారం ఉంటుందన్నారు. Esta tarde he dado positivo en COVID y no podré viajar a Nueva Delhi para asistir a la Cumbre del G-20. Me encuentro bien. España estará magníficamente representada por la vicepresidenta primera y ministra de Asuntos Económicos y el ministro de Exteriores, UE y Cooperación. — Pedro Sánchez (@sanchezcastejon) September 7, 2023 ముగ్గురు కీలక నేతలు గైర్హాజరు.. ఇదిలా ఉండగా.. ఢిల్లీ కేంద్రంగా జరుగనున్న జీ-20 సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి నేతలు హాజరుకానున్నారు. ఇక, ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూడా హాజరు కావడం లేదు. తాజాగా కోవిడ్ కారణంగా స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ జీ-20 సమావేశాల్లో పాల్గొనడం లేదు. దీంతో, ముఖ్యమైన మూడు దేశాల నుంచి అధ్యక్షులు సమావేశాలకు హాజరు కావడం లేదు. ► మరోవైపు.. ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం నేడే హస్తినకు చేరుకోనుంది. ► జీ20 సదస్సు కోసం అందరికంటే ముందే భారత్కు చేరుకుంటున్న కీలక నేత రిషి సునాక్. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని అయిన సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి ఈయనకు సాదర స్వాగతం పలకనున్నారు. ‘భారత్ జీ20కి సారథ్య బాధ్యతలు వహిస్తున్న ఈ ఏడాదికాలంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం. ఆయన నాయకత్వంలో ప్రపంచ యవనికపై భారత్ సాధిస్తున్న విజయాలు అద్వితీయం’అని రిషి సునాక్ శ్లాఘించారు. ఇది కూడా చదవండి: ఇండియా-భారత్ పేరు మార్పుపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..? -
బలవంతపు ముద్దుకు తగిన మూల్యం.. ఫెడరేషన్ చీఫ్పై సస్పెన్షన్ వేటు
స్పెయిన్ ఫుట్బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ తమ దేశ స్టార్ క్రీడాకారిణి జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఉదంతం అనంతరం స్పెయిన్లో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో రుబియాలెస్పై ఫిఫా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ ప్రాథమికంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటుందని ఫిఫా పేర్కొంది. సస్పెన్షన్తో పాటు రుబియాలెస్పై క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని తెలిపింది. కాగా, స్పెయిన్ మహిళల ఫుట్బాల్ జట్టు జగజ్జేతగా అవతరించిన అనంతరం మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా రుబియాలెస్.. జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం తెలిసందే. ఆ సమయంలో రుబియాలెస్.. జెన్నిఫర్తో పాటు మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. రుబియాలెస్ నుంచి ఊహించని ఈ ప్రవర్తన చూసి జెన్నిఫర్తో పాటు అక్కడున్న వారంతా షాక్కు గురయ్యారు. ఈ ఉదంతంపై స్పెయిన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఓ మహిళలను అయిష్టంగా చుంబించడం సమర్ధనీయం కాదని స్పానిష్ ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ఉదంతం స్పెయిన్లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ రంగంలోకి దిగారు. రుబియాలెస్ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని సూచించారు. క్రీడా శాఖకు సంబంధించిన స్పానిష్ హై కౌన్సిల్ రుబియాలెస్పై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఫిఫా జోక్యం చేసుకుని రుబిమాలెస్పై తూలెసస్పెన్షన్ వేటు వేసింది. -
ఫుట్బాల్ క్రీడాకారిణికి ముద్దు పెట్టిన ఫెడరేషన్ చీఫ్.. స్పెయిన్లో రచ్చ రచ్చ
2023 మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ను స్పెయిన్ తొలిసారిగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆగస్ట్ 20న జరిగిన ఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్ను 1-0 గోల్స్ తేడాతో మట్టికరిపించి జగజ్జేతగా ఆవిర్భవించింది. అయితే మ్యాచ్ అనంతరం ఆ దేశ ఫుట్బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ సొంత క్రీడాకారిణుల పట్ల వ్యవహరించిన తీరు స్పెయిన్లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా లూయిస్.. స్వదేశీ స్టార్ ఫుట్బాలర్ జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని వల్గర్గా బిహేవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో స్పెయిన్లో నిరసనలు హోరెత్తాయి. దీంతో లూయిస్ ఓ మెట్టుకిందికి దిగొచ్చి సదరు క్రీడాకారిణిలకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. అయినా స్పెయిన్లో నిరసనలు శాంతించలేదు. ఔ లూయిస్ ఉద్దేశపూర్వకంగా తప్పుచేసి, సారీ చెబితే సరిపోతుందా అంటూ నిరసనకారులు స్వరాలను పెంచారు. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ జోక్యం చేసుకున్నారు. లూయిస్ నామమాత్రం సారీ చెబితే సరిపోదని నిరసనకారులతో స్వరం కలిపారు. ముద్దు వివాదంపై లూయిస్ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, ఫెడరేషన్ అధ్యక్షుడిపై చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని చేతులు దులుపుకున్నాడు. దీంతో క్రీడా శాఖకు సంబంధించిన స్పానిష్ హై కౌన్సిల్ రంగంలోకి దిగింది. స్పెయిన్ ప్రభుత్వం కాని సాకర్ కౌన్సిల్ కాని లూయిస్పై చర్యలు తీసుకోకపోతే తాను చర్యలకు ఉపక్రమిస్తానని కౌన్సిల్ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి స్పెయిన్లో ముద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారుతుంది. -
FIFA: జట్టును జగజ్జేతగా నిలిపి.. తీవ్ర విషాదంలో మునిగిపోయి!
FIFA Women's World Cup Spain vs England- Olga Carmona: జట్టును విశ్వవిజేతగా నిలిపి స్పెయిన్లో సంబరాలకు కారణమైన మహిళా ఫుట్బాల్ జట్టు కెప్టెన్ ఓల్గా కర్మోనా.. వ్యక్తిగతంగా తీరని శోకంలో మునిగిపోయింది. టైటిల్ సాధించామనే సంతోషంలో ఉండగానే తండ్రి ఇకలేడనే విషాదకర వార్త వినాల్సి వచ్చింది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓల్గా తండ్రి శుక్రవారమే మరణించారు. నైతిక స్థైర్యానిచ్చి.. అయితే, ఓల్గా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ విషయాన్ని ఆమె వద్ద దాచారు. కెరీర్ పరంగా అత్యంత ముఖ్యమైన మ్యాచ్ ఆడాల్సి ఉన్న తరుణంలో తండ్రి చనిపోయాడన్న వార్తను ఆమెకు తెలియనీయలేదు. అంతేకాదు.. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు శనివారమే ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆమెకు నైతిక స్థైర్యానిచ్చారు. ఒకే ఒక్క గోల్తో స్పెయిన్ను జగజ్జేతగా నిలిపిన ఓల్గా సంబరాలు చేసుకున్న తర్వాత.. ఈ విషాదకర వార్తను ఆమెకు తెలియజేశారు. నువ్వు గర్వపడతావని తెలుసు నాన్నా ఈ నేపథ్యంలో తండ్రిని తలచుకుంటూ ఓల్గా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘ఎవరూ సాధించలేనిది గెలిచి.. అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచేలా నాకు శక్తిని అందించావు. నువ్వు ఎక్కడున్నా నీ చల్లని చూపులు నా మీద ఉంటాయని తెలుసు. నన్ను చూసి నువ్వు గర్వపడతావని తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి నాన్నా’’ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఉద్వేగపూరిత పోస్టు పెట్టింది. అంచనాలు లేకుండా బరిలో దిగి కాగా ఏమాత్రం అంచనాలు లేకుండా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన స్పెయిన్ మహిళల ఫుట్బాల్ జట్టు చివరకు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన మహిళల ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ ఫైనల్లో స్పెయిన్ 1–0 గోల్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఆట 29వ నిమిషంలో ఓల్గా కర్మోనా చేసిన గోల్తో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లింది. జగజ్జేతగా నిలిపి.. ఆట 68వ నిమిషంలో స్పెయిన్కు పెనాల్టీ కిక్ రూపంలో రెండో గోల్ చేసే అవకాశం వచ్చింది. అయితే జెన్నీ హెర్మోసో కొట్టిన పెనాల్టీ షాట్ను ఇంగ్లండ్ గోల్కీపర్ మేరీ ఈర్ప్స్ ఎడమ వైపునకు డైవ్ చేస్తూ అడ్డుకుంది. మూడో ప్రయత్నంలో తొలిసారి ఈ మెగా టోర్నీలో ఫైనల్ చేరిన ఇంగ్లండ్ జట్టు స్కోరు సమం చేసేందుకు చివరి నిమిషం వరకు తీవ్రంగా శ్రమించింది. కానీ స్పెయిన్ డిఫెన్స్ పటిష్టంగా ఉండటంతో ఇంగ్లండ్కు నిరాశ తప్పలేదు. నిర్ణీత 90 నిమిషాల తర్వాత ఇంజ్యూరీ టైమ్ రూపంలో మరో 15 నిమిషాలు అదనంగా ఆడించారు. ఈ ఉత్కంఠభరిత నిమిషాలను అధిగమిస్తూ స్పెయిన్ తమ ఆధిక్యాన్ని కాపాడుకొని చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. రెండో ప్లేయర్గా.. స్వీడన్తో జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ తరఫున 89వ నిమిషంలో ఓల్గా కర్మోనా రెండో గోల్ చేసి తమ జట్టును ఫైనల్కు చేర్చింది. 2015లో కర్లీ లాయిడ్ (అమెరికా) తర్వాత ఒకే ప్రపంచకప్లో సెమీఫైనల్లో, ఫైనల్లో గోల్ చేసిన ప్లేయర్గా ఓల్గా కర్మోనా గుర్తింపు పొందింది. చదవండి: జైలర్ సినిమా చూశాడు.. దుమ్ము రేపాడు! అట్లుంటది సంజూతో Y sin saberlo tenía mi Estrella antes de que empezase el partido. Sé que me has dado la fuerza para conseguir algo único. Sé que me has estado viendo esta noche y que estás orgulloso de mí. Descansa en paz, papá 🌟❤️🩹 pic.twitter.com/Uby0mteZQ3 — Olga Carmona (@7olgacarmona) August 20, 2023 -
Foot Ball World Cup: జగజ్జేతగా స్పెయిన్.. ఫైనల్లో ఇంగ్లండ్పై విజయం
ఫిఫా మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్-2023 టోర్నీలో స్పెయిన్ జట్టు విజేతగా నిలిచింది. సిడ్నీ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 20) జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ను 1-0 గోల్స్ తేడాతో మట్టికరిపించి, తొలిసారి జగజ్జేతగా నిలిచింది. మ్యాచ్ 29వ నిమిషంలో ఓల్గా క్యార్మోనా అద్భుతమైన గోల్ చేసి స్పెయిన్ను గెలిపించింది. ఈ మ్యాచ్లో హాట్ఫేవరెట్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ స్థాయి మేర రాణించలేక ఓటమిపాలైంది. ప్రపంచకప్ ఫైనల్కు తొలిసారి అర్హత సాధించిన స్పెయిన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. మరోవైపు ఇంగ్లండ్కు కూడా ఇదే తొలి ఫైనల్ కావడం విశేషం. కెప్టెన్ ఓల్గా క్యార్మోనా సెమీఫైనల్లో, ఫైనల్ మ్యాచ్ల్లో ఒక్కో గోల్ చేసి స్పెయిన్ను గెలిపించింది. సెమీఫైనల్లో చేసిన గోలే ఓల్గా క్యార్మోనాకు అంతర్జాతీయ కెరీర్లో తొలి గోల్ కావడం విశేషం. -
స్పెయిన్లో విజృంభిస్తున్న కార్చిచ్చు.. 3 వేల ఇళ్లు బుగ్గిపాలు!
స్పెయిన్ దేశంలోని కెనరీ దీవుల్లోగల అడవుల్లో కార్చిచ్చు కలకలం రేపుతోంది. అగ్నికీలలు నియంత్రణ లేకుండా శరవేగంగా వ్యాపించడంతో.. సమీపంలో నివసిస్తున్న ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. శనివారం వరకు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కార్చిచ్చు దాదాపు 11,000 ఎకరాల విస్తీర్ణం వరకు దీని మంటలు వ్యాపించాయని, పరిస్థితి మరింత దిగజారుతుందని అధికారులు చెప్పారు. అధికారులు ఈ మంటలను ఆర్పేందుకు 10 హెలికాఫ్టర్ల సాయంతో తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ.. ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. కెనరీ దీవుల్లోని లా పాల్మా కొండపైన ఈ కార్చిచ్చు మొదలైంది. అక్కడ ఓ అగ్నిపర్వతం బద్దలవడమే ఈ కార్చిచ్చుకు ప్రధాన కారణం. దీని వలన ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే అనేక అరటి తోటలు, రోడ్లు, నీటిపారుదల వ్యవస్థలతో పాటు దాదాపు 3,000 భవనాలు బుగ్గిపాలైనట్లు అధికారులు అంచనా వేశారు. చెలరేగుతున్న అడవి మంటలు కారణంగా ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు కానరీ దీవుల ప్రాంతీయ అధ్యక్షుడు ఫెర్నాండో క్లావిజో చెప్పారు. కొందరు ప్రజలు తమ ఇళ్లను వీడేందుకు అంగీకరించలేదని.. వారు పరిస్థితిని అర్థం చేసుకుని, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఎండ వేడిమిలో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని, అయితే తమ వంతు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు చెప్పుకొచ్చారు. చదవండి: ‘పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం’.. ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వరుని స్టేట్మెంట్ -
అల్కరాజ్ అద్భుతం
లండన్: వింబుల్డన్లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్గా 24వ గ్రాండ్స్లామ్ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్ జొకోవిచ్ కోరిక నెరవేరలేదు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) చేతిలో రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బి యా) ఓడిపోయాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన పోరులో అల్కరాజ్ 1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4 స్కోరుతో జొకోవిచ్పై నెగ్గాడు. 2022లో యూఎస్ ఓపెన్ సాధించిన అల్కరాజ్కు ఇది రెండో గ్రాండ్స్లామ్ టైటిల్. ఈ ఏడాది వరుసగా ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి జోరు మీదున్న 36 ఏళ్ల జొకోవిచ్ మూడో గ్రాండ్స్లామ్ తుది పోరులో ఓటమితో నిరాశగా నిష్క్రమించాడు. విజేత అల్కరాజ్కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్ జొకో విచ్కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. హోరాహోరీగా... అంచనాలకు తగినట్లుగా జొకోవిచ్ దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు. 5–0తో దూసుకుపోయాడు. అదే జోరులో తొలి సెట్ను దక్కించుకున్నాడు. రెండో సెట్లో హోరాహోరీ సమరం సాగింది. అల్కరాజ్ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో జొకోవిచ్ కూడా ప్రతీ పాయింట్ కోసం శ్రమించాల్సి వచ్చింది. స్కోర్లు 4–4, 5–5, 6–6తో సమమవుతూ వచ్చాయి. టైబ్రేక్లో చివరకు బ్యాక్హ్యాండ్ విన్నర్తో పాయింట్ నెగ్గిన అల్కరాజ్ సెట్ను గెలుచుకున్నాడు. ఈ సెట్ 85 నిమి షాలు సాగడం విశేషం. ఈ సెట్ నాలుగో గేమ్లో 29 షాట్ల ర్యాలీతో స్టేడియం హోరెత్తింది. పట్టు కోల్పోయిన జొకో... రెండో సెట్ గెలిచిన ఉత్సాహంలో అల్కరాజ్ మూడో సెట్లో తన జోరును కొనసాగించాడు. 3–1తో అతను ముందంజ వేశాడు. అయితే ఐదో గేమ్ ఈ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా సాగింది. 27 నిమిషాల పాటు 13 ‘డ్యూస్’లతో సాగిన ఈ గేమ్లో ప్రతీ పాయింట్ కోసం ఇద్దరు ఆటగాళ్లు తీవ్రంగా పోరాడారు. ఈ గేమ్ను గెలుచుకొని 4–1తో ఆధిక్యంలో నిలిచిన అల్కరాజ్కు మరో రెండు గేమ్లు గెలుచుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఓడితే టైటిల్ కోల్పోయేస్థితిలో నాలుగో సెట్ బరిలోకి దిగిన జొకోవిచ్ తన స్థాయి ఆటను ప్రదర్శించి సెట్ సాధించాడు. నిర్ణాయక చివరి సెట్లో 1–1తో సమంగా నిలిచిన తర్వాత మూడో గేమ్లో జొకోవిచ్ సర్విస్ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్లను నిలబెట్టుకొని విజయం ఖరారు చేసుకున్నాడు. -
39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్-21 చాంపియన్ ఇంగ్లండ్
అండర్-21 యూరోపియన్ చాంపియన్షిప్ విజేతగా ఇంగ్లండ్ అవతరించింది. 1984 తర్వాత ఇంగ్లండ్ మళ్లీ చాంపియన్గా నిలవడం ఇదే. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత స్పెయిన్తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 1-0తో విజయం సాధించింది. ఇంగ్లండ్ తరపున వచ్చిన ఏకైక గోల్ కర్టిస్ జోన్స్ ఆట 45+4వ నిమిషం(అదనపు)లో గోల్ అందించాడు. ఇక రెండో అర్థభాగంలో స్పెయిన్ అదే పనిగా గోల్ పోస్టులపై దాడులు చేసింది. అయితే ఇంగ్లండ్ గోల్కీపర్ జేమ్స్ ట్రాఫర్డ్ రెండుసార్లు స్పెయిన్ పెనాల్టీ కిక్లు గోల్ చేయకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. దీంతో టోర్నీలో ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా ఇంగ్లండ్ యూరో అండర్-21 విజేతగా నిలవడం విశేషం. 🏴 Trafford at the death! 😱#LastMinuteMoments | #U21EURO | @Hublot pic.twitter.com/YJNCJBJyV5 — #U21EURO (@UEFAUnder21) July 8, 2023 England's crowning moment 🏆🎉#U21EURO pic.twitter.com/DnsTcDdihc — #U21EURO (@UEFAUnder21) July 8, 2023 చదవండి: #BjornBorg: 18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం IND vs AFG: టీమిండియా అభిమానులకు గుడ్న్యూస్.. ఆ సిరీస్కు ముహూర్తం ఖరారు! -
టేకాఫ్ కష్టమని 19 మంది ప్రయాణికులను దింపేసిన విమాన సిబ్బంది
మాడ్రిడ్: టేకాఫ్ తీసుకోవడానికి వీల్లేనంత ఎక్కువ బరువుందని 19 మంది ప్రయాణికులను విమానం నుంచి దించేశారు..! ఈ ఘటన స్పెయిన్లో చోటుచేసుకుంది. స్పెయిన్లోని లాంజారోట్ నుంచి యూకేలోని లివర్పూల్కు ఈజీ జెట్కు చెందిన విమానం బుధవారం రాత్రి 9.45కు బయలుదేరాల్సి ఉంది. విమానంలో బరువు ఎక్కువగా ఉండటానికి తోడుగా రన్వే పొడవు తక్కువగా ఉండటం, అననుకూల వాతావరణ పరిస్థితులతో టేకాఫ్ కష్టంగా ఉందంటూ పైలట్ ప్రకటించారు. టేకాఫ్ తీసుకోవడం ప్రమాదకరమంటూ వారికి తెలిపారు. దీనికి ఏకైక పరిష్కారం బరువు కొద్దిగా తగ్గడమేనని వివరించారు. సుమారు 20 మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా దిగిపోతే వారికి బహుమానంగా 500 పౌండ్లు ఇస్తామని ప్రకటించారు. తర్వాత విమానంలో పంపిస్తామని సర్దిచెప్పి 19 మంది ప్రయాణికులను విమాన సిబ్బంది కిందికి దించారు. దీంతో, రెండు గంటల ఆలస్యంగా విమానం బయలుదేరింది. చదవండి: వీడు హీరో అయితే.. ఏ మిషనైనా పాజిబుల్! -
వీడియో: వరద బీభత్సం.. ప్రాణాల కోసం కార్లపైకి ఎక్కి..
మ్యాడ్రిడ్: ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు మనుషులైనా, జంతువులైనా విలవిలాడాసిందే. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసిన సమయంలో మానవాళికి పెను ప్రమాదం ఏర్పడుతుంది. తాజాగా యూరప్ దేశం స్పెయిన్లో ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. స్పెయిన్లో వానలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల ప్రకారం.. స్పెయిన్ ఈశాన్య ప్రాంతంలోని జరాగోజా నగరంలో వరద బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వరద పోటెత్తడంతో వాహనదారులు తమ వాహనాల్లోనే చిక్కుకుపోయారు. ఎటూ కదల్లేక నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. కొందరు కార్లు దిగి వాటిపైకెక్కి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే వరద ధాటికి కొందరు కార్లతో సహా కొట్టుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. No place is safe anymore. #ClimateCrisis#Zaragoza #Spainpic.twitter.com/1ps15OrfTu — Parents For Future #UnsereGenerationUnserJob (@parents4future) July 6, 2023 మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో స్పెయిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా.. రానున్న రోజుల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. Zaragoza, Spain pic.twitter.com/U66YJEMvg1 — Danijel Višević (@visevic) July 8, 2023 Heavy rains have caused extensive damage in the province of Zaragoza, Spain#rains #Zaragoza #spainflood pic.twitter.com/SDBkKmyCsZ — IPNA (@irannewsvideo) July 8, 2023 This is scary. Beware. The monsoon will soon be upon us. #monsoon #accidents #flooding #waterlogged #cars #rains #dandeli #spain #madrid pic.twitter.com/oIQrkdYLBa — Zahid H Javali (@zahidjavali) June 19, 2023 ఇది కూడా చదవండి: డచ్ రాజకీయ మలుపు: మిత్ర పక్షాలకు నచ్చని నిర్ణయం ప్రధాని ఎందుకు తీసుకున్నట్లు! -
హైహిల్స్తో రన్నింగ్ చేసి..గిన్నిస్ రికార్డు సృష్టించాడు!
పరుగు పందెం అంటే ఏంటో అందరికీ తెలిసిందే. కానీ హైహిల్స్తో హైస్పీడ్గా పరుగు తీయడం అంత ఈజీ కాదు. కానీ ఇక్కడొక వ్యక్తి ఆ అడ్వెంచర్ని చాలా సునాయాసంగా చేసి ప్రపంచ గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. వివరాల్లోకెళ్తే..స్పెయిన్కి చెందిన 34 ఏళ్ల సీరియల్ రికార్డ్ బ్రేకర్ క్రిస్టియన్ రాబర్టో లోపేజ్ రోడ్రిగ్జ్ ఈ రికార్డుని సాధించాడు. అతను సుమారు 2.76 అంగుళాల స్టిలెట్టో హీల్స్ ధరించి కేవలం 12.82 సెకన్లలో 100 మీటర్లు పరుగెత్తి ఈ రికార్డు సృష్టించాడు. గతంలో 2019లో 14.02 సెకన్లలో 100 మీటర్లని హైహిల్స్తో పరుగెత్తిన ఆండ్రీ ఓర్టోల్ఫ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు రోడ్రిగ్జ్. ఈ మేరకు అతను మాట్లాడుతూ..ఇలా పరుగెత్తడం తనకొక సవాలని, ఇలాంటి రేసులను ఎన్నో అవలీలగా సాధించానని చెబుతున్నాడు. అంతేగాదు తనలాంటి టైప్ 1 మధుమేహ వ్యాధిగ్రస్తులు.. మధుమేహం లేని వ్యక్తుల కంటే అన్ని పనులు చురుగ్గా చేయగలరని నిరూపించేందుకే తాను ఈ రికార్డు సాధించినట్లు చెప్పుకొచ్చాడు. రోడ్రిగ్జ్ గతంలో కళ్లకు గంతలు కట్టుకని సుమారు 100 మీటర్లు ముందుకు, వెనుకకు వేగంగా పరుగెత్తి రికార్డు సృష్టించాడు కూడా. అలాగే కళ్లకు గంతలు కట్టుకుని సుమారు 100 మీటర్లు వేగంగా పరిగెడుతూ.. అదే సమయంలో మూడు వస్తువులతో గారడీ చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఆలస్యం కానిదే ఏది కాదేమో! ఓ వ్యక్తి ఆన్లైన్ ఆర్డర్ పెడితే..ఏకంగా..) -
ఇదేం స్పీడ్ బాబోయ్.. కేవలం 30 సెకన్లలో ముగిసిన స్థానిక ఎన్నికలు!
స్పెయిన్లోని ఓ గ్రామంలో స్థానిక ఎన్నికలు పూర్తవడానికి 30 సెకన్ల సమయం కూడా పట్టలేదట. అదేంటి ఎన్నికలంటే పెద్ద తతంగం. రోజంతా ఓటింగ్ జరిగినా 60 నుంచి 80 శాతం పోలింగ్ కావడం కూడా కష్టమే. పోలింగ్ సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా అది సరిచేసేందుకు గంటల తరబడి సాగే వ్యవహారం. ఒక్కోసారి అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగిన ఘటనలు కూడా చేసే ఉంటాం. అలాంటి ఆ గ్రామంలో అర నిమిషంలో స్థానిక ఎన్నికలు పూర్తయ్యాయి. వినడానికి విడ్దూరంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవమే. ఇంతకు తక్కువ సమయంలో ఓటింగ్ పూర్తవడానికి కారణమేమంటే... లా రియోజా ప్రావిన్స్లోని విల్లారోయా అనే గ్రామంలో ఓటు హక్కు ఏడు మందికి మాత్రమే ఉంది. దీంతో అతి తక్కువ సమయంలో ఎన్నికల అధికారులు ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేయగలుగుతున్నారు. ఈ ఏడాది గ్రామస్థులు తమ ఓటు హక్కును కేవలం 29 సెకన్లలో వినియోగించుకున్నారు. గతంలో ఉన్న 32 సెకన్ల రికార్డును ఈ సారి బద్దలు కొట్టగలిగారు. ఈ ఎన్నికలపై స్థానిక మేయర్ సాల్వడార్ పెరెజ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రామస్థులు ఓట్లు ఎవరికి వేశారో తెలియదు గానీ తన గెలుపుపై ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. తమ గ్రామంలో ఓటర్లకి ఓటు ఎలా వేయాలనేదానిపై శిక్షణ పొందారని అందుకే పోలింగ్ ప్రక్రియ అంత వేగంగా ముగుస్తోందని చెప్పారు. కాగా, ఆయన 1973 నుంచి ఆ గ్రామానికి మేయర్గా ఎన్నికవుతూ ఉన్నారు. ఇటీవల జరిగిన స్పెయిన్ స్థానిక ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తారు. చదవండి: ప్రపంచంలోని దోమలన్నింటినీ అంతం చేస్తే ఏమవుతుంది?... శాస్త్రవేత్తల సమాధానం ఇదే.. -
ఇంటి పనిలో భర్తలు సహకరించడం లేదా? యాప్ను లాంచ్ చేసిన ప్రభుత్వం!
లంకంత ఇల్లు. ఇంటికి సరిపోయేంత జనం. బండెడు చాకిరీ నవ్వుతు చేస్తున్నాం. సంసారాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నాం. మేం ఇల్లు, పిల్లలు, ఆఫీస్ ఇలా ఊపిరి సలపనంత పనితో సతమతమవుతున్నాం. భర్తలు సైతం ఇంటి పని, వంట పని పిల్లలు స్కూల్ బాధ్యతల్ని చూసుకుంటే బాగుంటుంది. కానీ అది కలగానే మిగిలిపోతుందంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఈ తరుణంలో స్పెయిన్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చూపేందుకు టెక్నాలజీ సాయం తీసుకుంది. ఇంటి పని, వంట పనిలో భర్త సాయం చేస్తున్నారా? లేదా అని పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించింది.ఆ యాప్ ఇంట్లో భార్యలకు భర్తల సహకారం ఎలా ఉందో గుర్తిస్తుంది. జెనీవాలో జరిగిన సమావేశంలో స్పెయిన్ విదేశాంగ కార్యదర్శి నాజీల రోడ్ర్గెజ్ ఉచితంగా ఓ యాప్ను ప్రవేశ పెట్టినట్లు ప్రకటించారు. ఇంట్లో బాధ్యతల్ని మోసే మహిళల ‘మానసిక భారాన్ని’ పరిష్కరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మహిళలకు ఇంట్లోని ఇతర కుటుంబసభ్యుల సహకారం అవసరం. తద్వారా ఇంటి బాధ్యతల్ని సమానంగా పంచుకునేలా అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంట్లో భార్య, భర్తల్లో ఎవరు ఎక్కువ పనిచేస్తున్నారు? ఎవరు తక్కువ పనిచేస్తున్నారనే విషయాల్ని మేం లాంచ్ చేసిన యాప్ ఇట్టే కనిపెట్టేస్తుందని అన్నారు. అయితే, ఈ యాప్తో ముందుకు వచ్చిన స్పెయిన్ నిర్ణయం పట్ల పలువురు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి యాప్స్ వల్ల ఇంటి పని ఎగ్గొట్టే భర్తలు ఇబ్బందుల్లో పడతారని అంటున్నారు. మొత్తానికి ఈ యాప్ ఆలోచన బాగుంది. కానీ ఇంట్లో పనికి సహకరించిన భర్తలపై స్పెయిన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే విషయంపై నాజీల రోడ్ర్గెజ్ స్పష్టత ఇవ్వలేదు. -
ప్రపంచ రికార్డు: 50 ఏళ్ల వయసు, 500 రోజులు ఒక్కత్తే.. గుహలో...
స్పెయిన్ అథ్లెట్ 50 ఏళ్ల బీట్రస్ ఒక ఆరోగ్య ప్రయోగంలో భాగంగా 500 రోజులు గుహలో ఒక్కత్తే గడిపి మొన్న (శుక్రవారం) బయటకు వచ్చింది. బయట నుంచి మాత్రమే నిపుణుల పర్యవేక్షణ ఉన్నా 260 అడుగుల లోతు గుహలో అదరక బెదరక జీవించింది. ఎక్కువ రోజులు గుహలో ఒంటరిగా జీవించిన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న బీట్రస్ కథా కమామీషు... ‘లోపలకు వెళ్లాక రెండు నెలల వరకూ లెక్క బెట్టాను. ఆ తర్వాత రోజుల్ని లెక్క బెట్టుకోవడం మానేశాను. సహాయక బృందం లోపలికి వచ్చి నన్ను బయటకు తెచ్చే వరకు ఏ 160 రోజులో ఉన్నాననుకున్నాను. కాని 500 రోజులు ఉన్నాను. కాలం ఇట్టే గడిచిపోయింది’ అంది బీట్రస్ ఫ్లెమినీ. తన 48వ ఏట నవంబర్ 21, 2021 తేదీన స్పెయిన్లోని గ్రనాడా పట్టణం సమీపంలో ఉన్న ఒక గుహలోకి బీట్రస్ అడుగుపెట్టింది. మళ్లీ 50వ ఏట ఏప్రిల్ 14, 2023న బయటకు వచ్చింది. ఒకటిన్నర సంవత్సరం గుహలో ఒక్కత్తే గడిపింది. ‘ఈ కాలంలో బయట ఏం జరిగిందో నాకు తెలియదు’ అందామె. గ్రనడా యూనివర్సిటీ, అల్మేరియా యూనివర్సిటీలోని శాస్త్ర నిపుణులు గుహలలో, పర్వతారోహణలో ఒక్కరిగా చిక్కుకుపోయినప్పుడు మనిషి ‘సర్కేడియన్ రిథమ్’ (వెలుతురు, చీకటిని బట్టి మానవ శరీర, మానసిక స్థితుల్లో 24 గంటల్లో వచ్చే మార్పు) అధ్యయనం చేయడానికి బీట్రస్ను గుహలోకి పంపారు. క్యాలెండర్, గడియారం ఏమీ ఇవ్వలేదు. 60 పుస్తకాలు, వెయ్యి లీటర్ల నీరు, స్టవ్, ఆమె కదలికలను బయటి నుంచి గమనించడానికి సెన్సర్స్ను తీసుకొని ఆమె లోపలికి వెళ్లింది. ‘నేను నాతో మాట్లాడుకుంటూ గడిపాను, వ్యాయామం, టోపీలు అల్లడం, పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం... వీటితో టైమ్ సరిపోయింది. ఒక్కోసారి భ్రాంతి కలిగేది’ అని తెలిపింది. ఆమె ద్వారా వచ్చిన రీడింగ్స్ను శాస్త్రజ్ఞులు ఇప్పుడు క్రోడీకరించే పనిలో పడ్డారు. Athlete Beatriz Flamini spent almost two years alone in an underground cave. And she makes it sound pretty relaxing... Follow us on Gab: https://t.co/IuhLFQBQPc pic.twitter.com/e7nlKR9Kyc — RT (@RT_com) April 15, 2023 -
Spain Masters 2023 Final: సింధుకు నిరాశ
మాడ్రిడ్: ఈ ఏడాది ఫైనల్ చేరిన తొలి టోర్నీలో విజేతగా నిలిచి తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా తున్జంగ్ (ఇండోనేసియా) కేవలం 29 నిమిషాల్లో 21–8, 21–8తో సింధును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. గతంలో సింధుతో ఆడిన ఏడుసార్లూ ఓడిపోయిన మరిస్కా ఎనిమిదో ప్రయత్నంలో తొలిసారి గెలుపొందడం విశేషం. ఫైనల్లో సింధు ఏదశలోనూ మరిస్కాకు పోటీనివ్వలేకపోయింది. విన్నర్ మరిస్కాకు 15,750 డాలర్లు (రూ. 12 లక్షల 93 వేలు), రన్నరప్ సింధుకు 7,980 డాలర్లు (రూ. 6 లక్షల 55 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
PV Sindhu: అదరగొట్టిన సింధు.. సెమీస్లో! శ్రీకాంత్ మాత్రం..
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–14, 21–17తో మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. ఈ క్రమంలో శనివారం జరిగే సెమీ ఫైనల్లో యో జియా మిన్ (సింగపూర్)తో సింధు ఆడుతుంది. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. టాప్ సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 18–21, 15–21తో ఓడిపోయాడు. చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. -
Madrid Spain Masters: క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్
మాడ్రిడ్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–14, 21–16తో ప్రపంచ 38వ ర్యాంకర్ పుత్రి కుసుమ వర్దిని (ఇండోనేసియా)పై 36 నిమిషాల్లో విజయం సాధించింది. ఈ గెలుపుతో గత వారం స్విస్ ఓపెన్లో కుసుమ వర్దిని చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో భారత్కే చెందిన అష్మిత చాలిహా 15–21, 15–21తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో ఓడిపోగా... గాయం కారణంగా మాళవిక బన్సోద్ తన ప్రత్యర్థి కరోలినా మారిన్ (స్పెయిన్)కు వాకోవర్ ఇచ్చింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 21–15, 21–12తో భారత్కే చెందిన సాయిప్రణీత్పై గెలుపొందాడు. భారత్కే చెందిన కిరణ్ జార్జి 17–21, 12–21తో మాగ్నస్ జొహాన్సెన్ (డెన్మార్క్) చేతిలో, ప్రియాన్షు రజావత్ 14–21, 15–21తో తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, సమీర్ వర్మ 15–21, 14–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ఆరతి (భారత్) జోడీ 12–21, 13–21తో రుయ్ హిరోకామి–యునా కాటో (జపాన్) ద్వయం చేతిలో... పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జంట 16–21, 20–22తో షున్టారో మెజకి–హరుయ నిషిద (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
అతికష్టం మీద గట్టెక్కిన శ్రీకాంత్.. సింధు శుభారంభం
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అతికష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని దాటాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 21వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–11, 25–27, 23–21తో ప్రపంచ 32వ ర్యాంకర్ సితికోమ్ థమాసిన్ (థాయ్లాండ్)పై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 65 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణాయక మూడో గేమ్లో శ్రీకాంత్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాచుకోవడం గమనార్హం. 19–15తో ఆధిక్యంలో నిలిచిన శ్రీకాంత్ ఒక్కసారిగా వరుసగా ఐదు పాయింట్లు చేజార్చుకోవడంతో థమాసిన్ 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే శ్రీకాంత్ స్కోరును 20–20తో స్కోరును సమం చేశాడు. ఆ వెంటనే థమాసిన్ మరో పాయింట్ సాధించి 21–20తో ఆధిక్యంలోకి వచ్చాడు. కానీ శ్రీకాంత్ పట్టుదలతో ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి 23–21తో గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో సాయిప్రణీత్ (భారత్) 21–16, 18–21, 21–12తో జాన్ లూడా (చెక్ రిపబ్లిక్)పై, ప్రియాన్షు రజావత్ (భారత్) 18–21, 21–16, 21–11తో విక్టర్ స్వెండ్స్న్ (డెన్మార్క్)పై, కిరణ్ జార్జి (భారత్) 21–16, 21–14తో మిథున్ మంజునాథ్ (భారత్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. అయాటో ఎండో–యుటా టకె (జపాన్)లతో జరిగిన తొలి రౌండ్లో సాతి్వక్–చిరాగ్ తొలి గేమ్లో 9–11తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగారు. సింధు శుభారంభం మహిళల సింగిల్స్లో భారత స్టార్ పీవీ సింధుతోపాటు వర్ధమాన క్రీడాకారిణిలు ఆకర్షి కశ్యప్, మాళవిక, అషి్మత ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో సింధు 21–10, 21–14తో జెన్జిరా స్టాడెల్మన్ (స్విట్జర్లాండ్)పై, ఆకర్షి 12–21, 21–15, 21–18తో ఆరో సీడ్ మిచెల్లి లీ (కెనడా)పై, మాళవిక 21–19, 16–21, 21–9తో కిసోనా సెల్వదురై (మలేసియా)పై, అష్మిత 21–12, 22–20తో లియోనైస్ హ్యుట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 18–21, 16–21తో రెనా మియారా–అయాకో సకురమాటో (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ఇంటి పనికే పరిమితమైన భార్యకు కోటి రూపాయాలు చెల్లించమన్న కోర్టు!
ఇటీవల కాలంలో జంటలు పలు కారణాల రీత్యా విడిపోతుండటం చూస్తున్నాం. ఐతే విడిపోయేటప్పుడూ భర్త మాత్రం పెద్ద మొత్తంలో భార్యకు భరణం చెల్లించాల్సిందే. అది అందరికీ తెలిసిందే. ఇక్కడమ మాత్రం కోర్టు చాలా విచిత్రమైన అంశం లేవనెత్తి..గొప్ప తీర్పు ఇచ్చింది. ఇక్కడొక జంట ఏవో కారణాల రీత్యా విడాకుల కోసం కోర్టు మెట్లేక్కారు. అయితే ఆ కోర్టు భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. అలా ఇలాకాదు ఇన్నాళ్లు తనకు జీతభత్యం లేకుండా ఇంటి పనిచేసి, కుటుంబాన్ని చూసినందుకు కోటీ రూపాయాలు చెల్లాంచమంటూ ఆదేశించింది. ఈఘటన స్పెయిన్లో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే...ఓ జంట విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. పెళ్లై ఇన్నేళ్లైనా.. ఆమె ఎలాంటి జీతం భత్యంలేని కుటుంబ సేవకు అంకితమైంది కాబట్టి ఆమెకు వివాహం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ కార్మికుడు ఇచ్చే కనీస వేతనం ప్రకారం ఇవ్వాల్సిన మొత్తం కోటి రూపాయాల లెక్కించింది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇన్నేళ్ల భాగస్వామ్యంలో ఆమెకంటూ ఎలాంటి సంపాదన లేదు. ముఖ్యంగా ఇంటి పనుల్లోనే నిమగ్నమైంది. ఇంటిని, కుటుంబాన్ని చూసుకోవడమే సరిపోయింది. పిల్లలకు నెలవారి భత్యంతో సహా ఆమె వివాహం జరిగిన సంవత్సరం 1995 నుంచి 2020 వరకు ఆమెకు రోజువారి కూలికి చెల్లించే వేతనం చట్టం ప్రకారం అయినా ఆమెకు చెల్లించాల్సిన మొత్తం లెక్కించి ఇవ్వాల్సిందిగా కోర్టు ఆ భర్తను ఆదేశించింది. ఈ మేరకు సదరు మహిళ మాట్లాడుతూ.. "నా భర్త బయట ఉద్యోగం చేసేందుకు అనుమతించ లేదు. ఇంటికే పరిమితం చేయడమే గాక తమ స్వంత జిమ్లోనే పనిచేసేందుకు అనుమతించేవాడు. తనను కుంటుంబం, ఇల్లు వాటికే పరిమితం అయ్యేలా చేశాడు. నిజంగా నన్ను ఇంకేమి చేయలేని స్థితిలోకి తీసుకొచ్చేశాడు. నిజంగా ఈ తీర్పు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది సరైనదే అని ఆనందంగా చెబుతోందామే". (చదవండి: తీవ్ర విషాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు) -
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో 40 శాతం మహిళలే.. స్పెయిన్ కీలక నిర్ణయం
ఒక దేశ పురోగతిని ప్రభావితం చేసే అంశాల్లో లింగ సమానత్వం ముఖ్యమైంది. మానవ వనరుల్లో సగభాగమైన మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న దేశాలు ఆర్థికంగానే కాకుండా అన్నీ రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. లింగ వివక్ష కనబరుస్తున్న దేశాలు చతికిలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్ దేశంలో లింగ సమానత్వంలో మరో అడుగు ముందుకు వేసింది. కంపెనీ బోర్డ్లలో మహిళల నియామకంపై కొత్త చట్టాన్ని అమలు చేయనున్నట్లు ఫార్చ్యూన్ నివేదిక తెలిపింది. స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ వివరాల మేరకు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు స్పెయిన్ అధికార పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో మహిళల ప్రాధాన్యతపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని సాంచెజ్ తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 7న జరిగే కేబినెట్ మీటింగ్లో కంపెనీ బోర్డ్లలో 40 శాతం మహిళలు ప్రాతినిథ్యం వహించేలా కొత్త చట్టం అమలు చేసేందుకు కేబినేట్ సమావేశంలోని సభ్యులు ఆమోదం తెలపనున్నారని చెప్పారు. ఈ చట్టం ప్రకారం.. చట్టం ప్రకారం 250 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు, 50 మిలియన్ యూరోలు ($53 మిలియన్లు) వార్షిక టర్నోవర్ ఉన్న ప్రతి లిస్టెడ్ సంస్థ తప్పనిసరిగా 40 శాతం మహిళలు బోర్డ్ ఆఫ్ డైరక్టర్లగా నియమించాలని స్పష్టం చేశారు. ఇక తమ ప్రభుత్వం స్త్రీవాదానికి అనుకూలంగా మాత్రమే కాకుండా, మొత్తం స్పానిష్ సమాజానికి ప్రభుత్వం అనుకూలంగా ఉంది అని ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ అన్నారు. -
అంతర్జాతీయ టీ20 మ్యాచ్.. కేవలం 2 బంతుల్లోనే ఖేల్ ఖతం, అత్యంత చెత్త రికార్డులు
స్పెయిన్-ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో అత్యంత చెత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు ఐజిల్ ఆఫ్ మ్యాన్ 8.4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఐజిల్ ఆఫ్ మ్యాన్ ఇన్నింగ్స్లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయకపోగా.. ఏకంగా 6 మంది డకౌట్ అయ్యారు. ఐజిల్ ఆఫ్ మ్యాన్ ఇన్నింగ్స్లో ఒక్క బౌండరీ కూడా నమోదు కాకపోగా.. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 4గా ఉంది. జోసఫ్ బుర్రోస్ 4 పరుగులు చేయగా.. జార్జ్ బుర్రోస్, లూక్ వార్డ్, జాకబ్ బట్లర్ తలో 2 పరుగులు చేశారు. ఐజిల్ ఆఫ్ మ్యాన్ ఆటతీరు ఎంత చెత్తగా సాగిందో ఈ గణంకాలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. స్పెయిన్ బౌలర్లలో మహ్మద్ కమ్రాన్ (4-1-4-4), అతీఫ్ మెహమూద్ (4-2-6-4) తలో 4 వికెట్లు పడగొట్టగా, లోర్న్ బర్న్స్ (0.4-0-0-2) 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 11 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్పెయిన్.. కేవలం 2 బంతుల్లోనే ఆటను ముగించింది. తొలి బంతిని జోసఫ్ బుర్రోస్ నో బాల్ వేయగా.. ఆ తర్వాత రెండు బంతులను అవైస్ అహ్మద్ సిక్సర్లుగా మలిచి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ పలు చెత్త రికార్డులకు వేదికైంది. పురుషుల అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో అత్యల్ప స్కోర్ (10 ఆలౌట్), ఛేదనలో ఫాస్టెస్ట్ రన్రేట్ (39), బంతుల తేడా పరంగా విజయం (118 బంతులు) లాంటి చెత్త రికార్డులు ఈ మ్యాచ్లో నమోదయ్యాయి. -
స్పెయిన్లో సెలబ్రేషన్
ఫారిన్ టూర్కు వెళ్లారు మహేశ్బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూ΄÷ందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ ముగిసింది. ముఖ్యంగా హాస్పిటల్ బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాతి షెడ్యూల్ త్వరలో ఆరంభం కానుంది. ఈ గ్యాప్లో ఫ్యామిలీతో కలిసి మహేశ్ స్పెయిన్ వెళ్లారని సమాచారం. ఫిబ్రవరి 10 (శుక్రవారం) మహేశ్, నమ్రతల పెళ్లి రోజు. మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కోసమే స్పెయిన్కు వెళ్లి ఉంటారని ఊహించవచ్చు. -
'22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు'
లైంగిక వేధింపుల కేసులో బ్రెజిల్ స్టార్, సీనియర్ ఫుట్బాలర్ డానీ అల్వెస్ను పోలీసులు గత వారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త బ్రెజిల్తో పాటు యావత్ ఫుట్బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆటను విపరీతంగా ప్రేమించే డానీ అల్వెస్లో ఇలాంటి కోణం కూడా ఉందా అని అభిమానులు నివ్వెరపోయారు. అయితే అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలేవరకు బెయిల్ ఇవ్వొద్దని స్పానిష్ కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం డానీ అల్వెస్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. డానీ అల్వెస్ మాజీ భార్య డానా డినోర్హా మాత్రం అతనికి మద్దతుగా నిలబడింది. ఒక టెలివిజన్ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ''డానీ ఈ పని చేశాడంటే నేను నమ్మను. ఎందుకంటే మా ఇద్దరికి 22 ఏళ్ల పరిచయం ఉంది. 10 ఏళ్ల పాటు కలిసి జీవించాం. అతని వ్యక్తిగత జీవితం ఎలా సాగిందన్న దానిపై నాకు పూర్తి క్లారిటీ ఉంది. కచ్చితంగా తప్పు చేసి ఉండడన్న నమ్మకం నాకుంది. అయితే డానీ అల్వెస్ అరెస్ట్ నన్ను, నా పిల్లలను మానసిక ఒత్తిడిలోకి నెట్టేసింది. మాకు ఇది కష్టకాలం కావొచ్చు.. అతను నిర్దోషిగా బయటకు వస్తాడని మాత్రం చెప్పగలను. డానీ అల్వెస్ తరపు లాయర్ను సంప్రదించా. కేసుపై వర్క్ చేస్తున్నట్లు ఆమె చెప్పినట్లు'' తెలిపింది. డానీ అల్వెస్ అరెస్ట్ విషయానికి వస్తే.. డిసెంబర్ 31న స్పెయిన్లో బార్సిలోనా నైట్ క్లబ్లో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఆమె అనుమతి లేకుండా లోదుస్తుల్లో చేతులు పెట్టాడు. ఈ విషయాన్ని స్పానిష్ మీడియా కథనంగా ప్రసారం చేసింది. ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డానీపై కేసు నమోదు చేశారు. అయితే అల్వెస్ మాత్రం''ఆ సమయంలో తాను ఆ క్లబ్లో కొంతమందితో కలిసి ఉన్నానని, కానీ తాను ఏ తప్పు చేయలేదని ఈ ఫుట్బాలర్ తెలిపాడు. నేను డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాను. అంతేతప్ప ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించలేదు. ఆ మహిళ ఎవరో నాకు తెలియదు. అలాంటప్పుడు నేను ఆమెతో అసభ్యకరంగా ఎలా ప్రవర్తించగలనని'' పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. బ్రెజిల్ తరపున 2006లో అంతర్జాతీయ ఫుట్బాల్లో అరంగేట్రం చేసిన డానీ అల్వెస్ జట్టు తరపున 126 మ్యాచ్లు ఆడి ఎనిమిది గోల్స్ చేశాడు.ఇక 2022లో ఖతర్లో జరిగిన ఫిఫి వరల్డ్ కప్ ఆడిన బ్రెజిల్ జట్టులో డానీ సభ్యుడు. క్వార్టర్ ఫైనల్లో కామెరూన్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించాడు. బ్రెజిల్ తరఫున వరల్డ్ కప్లో ఆడిన పెద్ద వయస్కుడిగా డానీ గుర్తింపు సాధించాడు. ఇక 2008 నుంచి 2016 వరకు బార్సిలోనా క్లబ్కు ఆడిన డానీ 2021-22 సీజన్లో స్పానిష్ క్లబ్కు ఆడాడు. ప్రస్తుతం మెక్సికన్ క్లబ్ అయిన పుమాస్ యూనమ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. "Dani would never, ever, ever do this. Never. I'm telling you because I've known him for 22 years and I've been married to him for ten." Dana Dinorah, Dani Alves' ex-wife, has gone on television to defend the Brazilian footballer amid sexual assault allegations. pic.twitter.com/LUESGNsLya — Football España (@footballespana_) January 23, 2023 చదవండి: లైంగిక వేధింపులు.. కటకటాల్లో స్టార్ ఫుట్బాలర్ ఫుట్బాల్ చరిత్రలోనే తొలిసారి.. -
వరుసగా 12వసారి సెమీస్లో ఆస్ట్రేలియా
భువనేశ్వర్: పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో ఆ్రస్టేలియా జట్టు వరుసగా 12వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. స్పెయిన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆ్రస్టేలియా 4–3 తో గెలిచింది. ఆసీస్ తరఫున హేవార్డ్ (33వ, 37వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జెలెవ్స్కీ (32వ ని.లో), ఫ్లిన్ ఒగిల్వీ (30వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఒకదశలో ఆ్రస్టేలియా 0–2తో వెనుకబడినా ఏడు నిమిషాల వ్యవధిలో నాలుగు గోల్స్ సాధించింది. మరో క్వార్టర్ ఫైనల్లో బెల్జియం 2–0తో న్యూజిలాండ్ను ఓడించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. -
వచ్చే ఏడాదిలోగా కేబుల్ కార్ అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పర్యాటకుల సౌలభ్యం కోసం వచ్చే ఏడాది కల్లా ఆధునాతన కేబుల్ కార్ను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం స్పెయిన్ పర్యటనలో భాగంగా కేబుల్ కార్ను పరిశీలించి అందులో తిరిగారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడు తూ ఎత్తైన కొండలపై కొలువైన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చారిత్రక భువన గిరి కోట, దుర్గం చెరువు లాంటి అనువైన పర్యాటక ప్రదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో అధునాతన కేబుల్ కార్ను ప్రవేశపెట్టేలా చూస్తున్నామని వివరించారు. పర్యాటక ప్రదేశాలను విదేశీ పర్యాట కులకు పరిచయం చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. -
24 ఏళ్లపాటు కోమాలోనే.. కన్నుమూసిన సైక్లిస్ట్
క్రీడారంగంలో ఊహించని ఓ విషాదం చోటుచేసుకుంది. 24 ఏళ్ల పాటు కోమాలో ఉండిపోయిన స్పెయిన్ సైక్లిస్ట్ రాల్ గార్సియా అల్వరేజ్ శుక్రవారం కన్నుమూశాడు. అల్వరేజ్ టీనేజ్ వయసులోనే ప్రొఫెషనల్ సైక్లిస్ట్గా మారాడు. తన 17 ఏళ్ల వయసులో వెంటా మగుల్లో-బి మెలెరో జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందమే అతని సైక్లింగ్ కెరీర్కు చివరిది కానుందని ఊహించలేదు. స్పెయిన్లోని మాడ్రిడ్ వద్ద ఎత్తైన కొండమీద సైక్లింగ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. గంటకు 50మీటర్ల వేగంతో తన టీమ్తో కలిసి సైక్లింగ్ చేశాడు. ఈ దశలో సైకిల్ పట్టుతప్పడంతో ఐదు మీటర్ల లోతులోకి పడిపోయాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో పాటు చాతికి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అల్వరేజ్ను ఎయిర్లిఫ్ట్ చేసి మాడ్రిడ్లోని ఒక ఆసుపత్రికి తరలించారు. దాదాపు నాలుగున్నర గంటలు సర్జరీ నిర్వహించి అతన్ని కాపాడినప్పటికి శాశ్వత కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు పేర్కొన్నారు. కొన్నేళ్ల పాటు ఆసుపత్రి బెడ్పైనే ఉండిపోయిన గార్సియాలో కదలిక లేకపోవడంతో కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. అయితే అల్వరేజ్పై ఉన్న ప్రేమతో అతన్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అల్వరేజ్ తల్లి అతనికి సేవలందించింది. అలా 24 ఏళ్ల పాటు కోమాలో ఉండిపోయిన అల్వరేజ్ తాజాగా 42 ఏళ్ల వయసులో శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చదవండి: Alexander Zverev: టెన్నిస్ స్టార్కు వింత అనుభవం.. -
Australian Open 2023: జొకోవిచ్ అలవోకగా...
మెల్బోర్న్: కోవిడ్ టీకా వేసుకోనందున... గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడే అవకాశం కోల్పోయిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఈసారి అలవోక విజయంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–0తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై గెలుపొందాడు. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ తొమ్మిది ఏస్లు సంధించి, కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. కార్బెలాస్ సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. నెట్ వద్దకు 26 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచిన ఈ మాజీ నంబర్వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో వరుసగా 22వ విజయాన్ని నమోదు చేశాడు. ఈ టోర్నీలో 2019, 2020, 2021లలో విజేతగా నిలిచిన జొకోవిచ్ గతేడాది బరిలోకి దిగలేదు. ముర్రే మారథాన్ పోరులో... మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్లో అత్యధికంగా ఐదుసార్లు రన్నరప్గా నిలిచిన ప్రపంచ మాజీ నంబర్వన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే తొలి రౌండ్లో అతికష్టమ్మీద విజయం అందుకున్నాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ మాటియో బెరెటిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 49వ ర్యాంకర్ ఆండీ ముర్రే 6–3, 6–3, 4–6, 6–7 (7/9), 7–6 (10/6)తో గెలుపొందాడు. 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ముర్రే 10 ఏస్లు సంధించి, 34 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు బెరెటిని 31 ఏస్లు సంధించినా, ఏకంగా 59 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. నెట్ వద్దకు 39 సార్లు దూసుకొచ్చిన ముర్రే 23 సార్లు పాయింట్లు గెలుపొందగా... బెరెటిని 49 సార్లు నెట్ వద్దకు వచ్చి 32 సార్లు పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కూడా శ్రమించి గెలుపొందాడు. ‘లక్కీ లూజర్’ యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)తో జరిగిన తొలి రౌండ్లో జ్వెరెవ్ 4–6, 6–1, 5–7, 7–6 (7/3), 6–4తో గెలిచాడు. 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జ్వెరెవ్ 21 ఏస్లు కొట్టాడు. 46 అనవసర తప్పిదాలు చేసిన ఈ జర్మనీ స్టార్ ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 7–6 (8/6), 6–7 (5/7), 6–3తో టొమాస్ మచాచ్ (చెక్ రిపబ్లిక్)పై, ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 6–3, 6–4, 6–2తో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై, ఎనిమిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–4, 6–2, 4–6, 7–5తో బాసిలాష్విలి (జార్జియా)పై విజయం సాధించారు. ముగురుజాకు షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో 2020 రన్నరప్, ప్రపంచ మాజీ నంబర్వన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం) 3–6, 7–6 (7/3), 6–1తో ముగురుజాను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో రెండో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యునీషియా) 7–6 (10/8), 4–6, 6–1తో తామర జిదాన్సెక్ (స్లొవేనియా)పై, నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–0తో కేథరీన్ సెబోవ్ (కెనడా)పై, ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో తెరెజా మార్టిన్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. -
సంచలనం.. మాజీ వరల్డ్ నెంబర్ వన్కు బిగ్షాక్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో సంచలనం నమోదైంది. స్పెయిన్ క్రీడాకారిణి.. మాజీ వరల్డ్ నెంబర్వన్ గార్బిన్ ముగురజా తొలిరౌండ్లోనే వెనుదిరిగింది. మహిళల సింగిల్స్ విభాగంలో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ముగురజా.. బెల్జియంకు చెందిన 26వ సీడ్ ఎలిస్మార్టెన్స్ చేతిలో 3-6, 7-6(3), 6-1 తేడాతో ఓటమి పాలైంది. తొలి సెట్ను 6-3తో సొంతం చేసుకున్న ముగురజా రెండో సెట్లో మాత్రం తడబడింది. ఎలిస్ మార్టెన్ నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో సెట్ టైబ్రేక్కు దారి తీసింది. టై బ్రేక్లో మార్టెన్ విజయం సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడోసెట్లో మాజీ నెంబర్వన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 1-6 తేడాతో ఎలిస్ మార్టెన్ సెట్ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్లోనూ విజయం సాధించింది. ఇక ముగురజా గతంలో ఫ్రెంచ్ ఓపెన్తో పాటు వింబుల్డన్ను గ్రాండ్స్లామ్ టైటిల్స్ను దక్కించుకుంది. ఇక 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో రన్నరప్గా నిలిచింది. Comeback complete ✅@elise_mertens holds off Muguruza 3-6 7-6(3) 6-1.#AusOpen • #AO2023 pic.twitter.com/prPvmXPxc2 — #AusOpen (@AustralianOpen) January 17, 2023 ఇతర మ్యాచ్ల విషయానికి వస్తే.. నాలుగో సీడ్ కరోలిన్ గార్సియా కెనడాకు చెందిన అన్సీడెడ్ కాథరిన్ సెబోవ్పై 6-3, 6-0తో విజయం సాధించి రెండో రౌండ్కు చేరుకుంది. ఇక సొంతగడ్డపై ఫెవరెట్గా కింబర్లీ బిర్రెల్.. 31వ సీడ్ కాయా కనేపిని 7-6(4), 6-1తో ఓడించి రెండోరౌండ్లో అడుగుపెట్టింది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో డొమినిక్ థీమ్కు చుక్కెదురైంది. తొలి రౌండ్లో ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ చేతిలో 6-3, 6-4,6-2 తేడాతో వరుస సెట్లలో ఖంగుతిన్నాడు. -
Hockey World Cup 2023: 48 ఏళ్ల కల నెరవేరేనా!
ఎప్పుడో 1975లో... భారత హాకీ జట్టు అజిత్పాల్ సింగ్ నాయకత్వంలో ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా నాటి మేటి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. ట్రోఫీ గెలవడం సంగతేమో గానీ ఆ తర్వాత 11 ప్రపంచ కప్లు జరిగినా మన టీమ్ కనీసం సెమీ ఫైనల్ కూడా చేరలేకపోవడం నిరాశ కలిగించే అంశం. వరుసగా రెండో సారి మనమే ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో భారత జట్టు రాత మారుతుందా... కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి కాంస్యం సాధించిన మన టీమ్ అదే జోరును చూపిస్తుందా అనేది ఆసక్తికరం. భువనేశ్వర్: భారత గడ్డపై మరో విశ్వ సంబరానికి సమయం ఆసన్నమైంది. 15వ హాకీ వరల్డ్ కప్ నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఒడిషాలోని రెండు వేదికలు భువనేశ్వర్, రూర్కెలాలలో 17 రోజుల పాటు మొత్తం 44 మ్యాచ్లు జరుగుతాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్లో అర్జెంటీనాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. తొలి రోజే బరిలోకి దిగనున్న భారత్... స్పెయిన్ను ఎదుర్కోనుంది. భువనేశ్వర్లోని కళింగ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉండగా... కొత్తగా ఈ టోర్నీ కోసం మరో పెద్ద హాకీ స్టేడియాన్ని రూర్కెలాలో నిర్మించారు. 24 మ్యాచ్లు భువనేశ్వర్లో, 20 మ్యాచ్లు రూర్కెలాలో జరుగుతాయి. మొత్తం 16 జట్లు బరిలోకి దిగుతుండగా వాటిని నాలుగు పూల్లుగా విభజించారు. ముందుగా తమ గ్రూప్లో ఇతర మూడు జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘క్రాస్ ఓవర్స్’, క్వార్టర్స్, సెమీస్ ఉంటాయి. జనవరి 29న ఫైనల్ నిర్వహిస్తారు. నేటి మ్యాచ్లు అర్జెంటీనా X దక్షిణాఫ్రికా (మ.గం. 1.00 నుంచి) ఆస్ట్రేలియా X ఫ్రాన్స్ (మం.గం. 3.00 నుంచి) ఇంగ్లండ్ X వేల్స్ (సా.గం. 5.00 నుంచి) భారత్ X స్పెయిన్ (సా.గం. 7.00 నుంచి) పూల్ల వివరాలు ‘ఎ’ – అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ‘బి’ – బెల్జియం, జర్మనీ, జపాన్, కొరియా ‘సి’ – చిలీ, మలేసియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ ‘డి’ – భారత్, స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్ * ప్రపంచకప్ను అత్యధికంగా పాకిస్తాన్ (4 సార్లు) గెలవగా...నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా చెరో 3 టైటిల్స్ సాధించాయి. జర్మనీ రెండు సార్లు విజేతగా నిలవగా...భారత్, బెల్జియం ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి. -
సత్తా చాటిన తెలంగాణ గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చెస్ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ తన కెరీర్లో మరో అంతర్జాతీయ టోర్నీ టైటిల్ను సాధించాడు. స్పెయిన్లో జరిగిన సన్వే సిట్గెస్ ఓపెన్ అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్లో 18 ఏళ్ల రాజా రిత్విక్ చాంపియన్గా అవతరించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత రాజా రిత్విక్ 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 30 దేశాల నుంచి 120 మంది అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో రిత్విక్ అజేయంగా నిలిచాడు. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థి అయిన రిత్విక్ ఈ టోర్నీలో ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రముఖ కోచ్ ఎన్.రామరాజుకు చెందిన రేస్ చెస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న రిత్విక్... ఈ టోరీ్నలో ముగ్గురు గ్రాండ్మాస్టర్లు ఆధిబన్, అరవింద్ చిదంబరం (భారత్), స్వెన్ ఫ్రెడరిక్ (జర్మనీ)పై గెలిచి మరో గ్రాండ్మాస్టర్ అర్జున్ కల్యాణ్ (భారత్)తో గేమ్ను ‘డ్రా’గా ముగించాడు. -
ఆ గ్రామానికి యజమాని కావాలట.. కారుచౌకగా అమ్మేస్తున్నారు!
స్పెయిన్ నైరుతి ప్రాంతంలోని ఒక ఊరు కారుచౌకగా అమ్మకానికి ఉంది. సాల్టో డి క్యాస్ట్రో అనే ఊరి ధర 2.60 లక్షల యూరోలు మాత్రమే! అంటే, రూ.2.24 కోట్లు అన్నమాట. బ్రిటన్లోని సగటు ఇంటి ధర కంటే ఈ ఊరి ధర చాలా తక్కువ. పోర్చుగీసు సరిహద్దుల్లో ఉన్న ఈ ఊరి నుంచి మాడ్రిడ్ నగరానికి మూడు గంటల్లో చేరుకోవచ్చు. ఈ ఊళ్లో 44 ఇళ్లు, ఒక హోటల్, ఒక చర్చి, ఒక స్కూలు, మునిసిపల్ స్విమింగ్ పూల్, బ్యారక్స్ బిల్డింగ్ ఉన్నాయి. ఇన్ని వసతులు ఉన్నా, ఈ ఊరు దాదాపు ముప్పయ్యేళ్లుగా ఖాళీగానే ఉంది. నిజానికి ఇక్కడ సాల్టో డి క్యాస్ట్రో ఊరిని ఒక విద్యుదుత్పాదక సంస్థ తన ఉద్యోగులు, కార్మికుల కోసం నిర్మించింది. ఊరికి దగ్గర్లోనే రిజర్వాయర్ ఉంది. ఇక్కడ జలవిద్యుత్తు ప్రాజెక్టు పూర్తికావడంతో, ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఇక్కడి నుంచి తరలిపోయారు. అప్పటి నుంచి ఊరు ఖాళీగానే ఉంటోంది. జనాలు లేని ఈ ఊరిని తిరిగి జనావాసంగా మార్చడానికి ఇరవయ్యేళ్ల కిందటే స్పెయిన్ ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేసినా, అవేవీ సఫలం కాలేదు. చివరకు ఈ ఊరిని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఇదివరకు 6.5 మిలియన్ యూరోల (రూ.560.63 కోట్లు) ధర నిర్ణయించగా, కొనడానికి ఎవరూ రాలేదు. ఆ తర్వాత విడతల వారీగా ధర తగ్గిస్తూ వచ్చినా ఫలితం లేకపోయే సరికి, ఇప్పుడు కారుచౌకగా ఊరిని తెగనమ్మేందుకు సిద్ధపడ్డారు. -
నేషన్స్ కప్ మహిళల హాకీ టోర్నీ విజేత భారత్
వాలెన్సియా: తొలిసారి నిర్వహించిన నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో సవితా పూనియా నాయకత్వంలోని టీమిండియా 1–0 గోల్ తేడాతో ఆతిథ్య స్పెయిన్ జట్టును ఓడించింది. ఆరో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను గుర్జీత్ కౌర్ గోల్గా మలిచింది. ఈ విజయంతో భారత్ 2023–2024 ప్రొ లీగ్కు నేరుగా అర్హత సాధించింది. టైటిల్ నెగ్గిన భారత జట్టు సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున హాకీ ఇండియా నగదు పురస్కారం ప్రకటించింది. చదవండి: FIFA WC 2022: మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే -
FIH Hockey Nations Cup: అదరగొట్టిన అమ్మాయిలు.. సెమీ ఫైనల్ దిశగా భారత్
FIH Hockey Nations Cup: నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. స్పెయిన్లో సోమవారం జరిగిన పూల్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్లో టీమిండియా 2–1 గోల్స్ తేడాతో 2018 ఆసియా క్రీడల చాంపియన్ జపాన్పై గెలిచింది. భారత్ తరఫున సలీమా టెటె (5వ ని.లో), బ్యూటీ డుంగ్డుంగ్ (40వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టుకు రుయ్ తకషిమా (49వ ని.లో) ఏకైక గోల్ అందించింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంటే భారత్ సెమీఫైనల్ చేరుతుంది. చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! -
Winter: వేడినీటి బుగ్గల్లో స్నానాలు.. ముల్లంగి, తామరతూళ్లు తింటే..!
Funday Cover Story- Worldwide Winter Festivals: శీతకాలం చిరుచలితో మొదలై, గజగజ వణికించే స్థాయికి చేరుతుంది. చలిపంజా దెబ్బకు జనాలు రాత్రివేళ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకే వెనుకాడుతారు. శీతకాలం రాగానే, అప్పటివరకు అలమరాల అట్టడుగున పడివున్న చలిదుస్తులు ఒంటిమీదకు వస్తాయి. వీథుల్లో చలిమంటల సందడి మొదలవుతుంది. చలితీవ్రత పెరిగే కొద్ది, మనుషులకు వణుకూ పెరుగుతుంది. చలిలో ఆరుబయటకు వచ్చేవాళ్లు ఒద్దికగా చేతులు కట్టుకుని చలిని కాచుకుంటారు. చలికాలంలో కొన్నిచోట్ల తెరిపిలేని హిమపాతంతో నేలంతా మంచుతో నిండిపోతుంది. శీతకాలం మొదలయ్యే వేళ దీపావళి, శీతకాలం తారస్థాయిలో ఉండేటప్పుడు మకరసంక్రాంతి వేడుకలను మనం జరుపుకొంటాం. శీతకాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు వారి వారి సంప్రదాయ వేడుకలను జరుపుకొంటారు. వ్యవసాయ పనులు ముగిసి, కాస్త తీరిక దొరికే కాలం కావడంతో సంబరాలు చేసుకుంటారు. కాలానికి తగినట్లుగా ప్రత్యేకమైన వంటకాలను ఆగరిస్తారు. ఆరుబయటకు చేరి ఆట పాటలతో శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. వివిధ దేశాల్లో జరుపుకొనే శీతకాల సంబరాలను, వాటి విశేషాలను తెలుసుకుందాం... షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్ స్కాట్లాండ్లోని షెట్లాండ్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు ముగిసినప్పటి నుంచి మూడునెలల వరకు సుదీర్ఘంగా కొనసాగే చలిమంటల వేడుక ‘షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్’. స్థానికంగా ఈ వేడుకలను ‘అప్ హెలీ ఆ’ అంటారు. షెట్లాండ్ రాజధాని లెర్విక్లో ఈ వేడుకల్లో భాగంగా జనవరి మూడో మంగళవారం రోజున జనాల ఆట పాటలతో వాద్యాల హోరుతో భారీ ఊరేగింపు జరుగుతుంది. వైకింగ్ల పొడవాటి పడవలను అనుకరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులు ధరించి, మేళతాళాలతో ఈ ఊరేగింపులో పాల్గొంటారు. తొలినాళ్లలో తారుపీపాలకు నిప్పుపెట్టి స్లెడ్జిబళ్ల మీద మంచునిండిన వీథుల్లోకి లాక్కొచ్చేవారు. ఇటీవలికాలంలో తారుపీపాలకు నిప్పుపెట్టడం వంటి పనులు మానేసి, ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకుని, వేడుకలు జరుపుకొంటున్నారు. వెనిస్ కార్నివాల్ ఇటలీలోని వెనిస్ నగరంలో శీతకాలం ముగుస్తూ ఉండే సమయంలో జరిగే ఉత్సవం ఇది. క్రైస్తవుల ఉపవాస దినాలైన ‘లెంట్’ రోజుల్లోని ‘యాష్ వెన్స్డే’ నుంచి మొదలయ్యే వెనిస్ కార్నివాల్ ‘ష్రోవ్ ట్యూస్డే’ వరకు మూడువారాల పాటు జరిగే ఈ వేడుకల్లో భారీ ఎత్తున జనాలు పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి సుమారు ముప్పయి లక్షలకు పైగా జనాలు వెనిస్ వీథుల్లో జరిగే ఊరేగింపుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో రకరకాల మాస్కులు ధరించి తిరుగుతూ సందడి చేస్తారు. ఈ వేడుకల్లో భాగంగా వెనిస్ కూడళ్లలో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ముఖాలకు మాస్కులు ధరించడాన్ని రోమన్ చక్రవర్తి 1797లో నిషేధించడంతో చాలాకాలం ఈ వేడుకలు కనుమరుగయ్యాయి. ఇటలీ ప్రభుత్వం సాంస్కృతిక పునరుద్ధరణలో భాగంగా 1979 నుంచి పునఃప్రారంభించడంతో వెనిస్ కార్నివాల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే స్థాయికి చేరుకుంది. లా ఫాలాస్ వాలెన్షియా స్పెయిన్లోని వాలెన్షియా నగరంలోను, చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల్లోను ఈ వేడుకలు ఏటా మార్చి 1 నుంచి 19 వరకు జరుగుతాయి. ఈ వేడుకల్లో మార్చి 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు సెయింట్ జోసెఫ్ స్మారకార్థం ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీథుల్లో చలిమంటలను వెలిగించి ఆటపాటలతో జనాలు కాలక్షేపం చేస్తారు. మార్చిలో శీతకాల సంబరాలేమిటా అనుకోకండి. అక్కడ మార్చిలోనూ మంచు కురుస్తూనే ఉంటుంది. చలిమంటల ముందు సేదదీరుతూ విందు వినోదాలు, గానా భజానాలతో జనం ఉల్లాసంగా గడుపుతారు. ఈ రోజుల్లో ప్రత్యేకంగా తయారు చేసే బిర్యానీ మాదిరి ‘ప్యేలా’ అనే వంటకాన్ని సామూహిక విందుల్లో వడ్డిస్తారు. దీని తయారీలో బియ్యం, మేక, గొర్రె, కుందేలు, కోడి, చేపలు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారు. లా ఫాలెస్ వాలెన్షియాను ‘యునెస్కో’ వారసత్వ వేడుకగా గుర్తించింది. నయాగరా వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ నయాగరా జలపాతం మామూలుగా చూస్తేనే కళ్లకు మిరుమిట్లు గొలుపుతుంది. ఇక శీతకాలంలో రాత్రివేళ ఈ జలపాతం వద్ద ఆరుబయట చేసే విద్యుద్దీపాలంకరణలు చూస్తే, రంగు రంగుల నక్షత్రాలు కళ్లముందే కదలాడినట్లుంటుంది. నయాగరా జలపాతం వద్ద కెనడాలో ఏటా శీతకాలం పొడవునా ‘వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్’ వేడుకలను దేదీప్యమానంగా నిర్వహిస్తారు. ఈసారి నవంబర్ 12న మొదలైన ఈ వేడుకలు ఫిబ్రవరి 20 వరకు కొనసాగనున్నాయి. విద్యుద్దీప కాంతుల వెలుగులో ధగధగలాడే నయాగరా అందాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా పలు వినోద కార్యక్రమాలు, బాణసంచా ప్రదర్శనలు కూడా జరుగుతాయి. హార్బిన్ ఐస్ అండ్ స్నో స్కల్ప్చర్ ఫెస్టివల్ చైనాలో ఏటా శీతకాలంలో జరిగే అంతర్జాతీయ హిమశిల్పకళా వేడుకలు ఇవి. హీలోంగ్జియాంగ్ ప్రావిన్స్లోని హార్బిన్ నగరంలో జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి దాదాపు రెండుకోట్ల మంది వరకు వస్తారు. ప్రపంచంలోనే అత్యంత భారీ హిమశిల్పాలు ఈ ఉత్సవాల్లో కొలువుదీరుతాయి. హార్బిన్ నగరంలోని కూడళ్లలోను, నగరం మీదుగా ప్రవహించే సోంఘువా నదీ తీరంలోను భారీ ఎత్తున హిమశిల్పాలను ఏర్పాటు చేస్తారు. సైబీరియా మీదుగా వీచే చలిగాలుల వల్ల సోంఘువా నదిలోని నీళ్లు గడ్డకట్టిపోతాయి. నదిలో నుంచి వెలికితీసిన భారీ మంచుదిమ్మలతోనే స్థానిక కళాకారులు శిల్పాలను చెక్కి, ప్రదర్శనకు ఉంచుతారు. చైనాలో ఈ వేడుకలు 1963 నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఏటా డిసెంబర్ చివరి వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు జరిగే ఈ వేడుకల ద్వారా చైనా ప్రభుత్వానికి పర్యాటక ఆదాయం దండిగానే లభిస్తుంది. టోజి మత్సురి జపాన్లో జరుపుకొనే శీతకాల వేడుకలు ‘టోజి మత్సురి’. ఈ వేడుకలనే ‘టోజిసాయి’ అని కూడా అంటారు. మంచు కురిసే ప్రాంతాల్లో ఆరుబయట గుడారాలు వేసుకుని, వాటి ముందు చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో గడుపుతారు. ‘ఓన్సెన్’ అనే వేడినీటి బుగ్గల్లో స్నానాలు చేస్తారు. నిజానికి ఈ వేడినీటి బుగ్గల్లో ఏడాది పొడవునా స్నానాలు చేస్తుంటారు గాని, శీతకాలం తప్పనిసరిగా వీటిలో స్నానం చేయడం ఆరోగ్యకరమని జపానీయులు నమ్ముతారు. గతించిన పెద్దలను తలచుకుంటూ చెరువుల్లో దీపాలను విడిచిపెడతారు. శీతకాలంలో గుమ్మడి, క్యారెట్, ముల్లంగి, తామరతూళ్లు తినడం శుభప్రదమనే నమ్ముతారు. ముఖ్యంగా తామరతూళ్లతో తయారుచేసే రెన్కాన్ చిప్స్ను చిన్నాపెద్దా ఇష్టంగా తింటారు. రేక్జావిక్ వింటర్ లైట్స్ ఫెస్టివల్ ఐస్లాండ్లోని రేక్జావిక్ నగరంలో ఏటా శీతకాలంలో వింటర్ లైట్స్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. నగరంలోని చారిత్రిక కట్టడాలు, మ్యూజియమ్లు, పార్కులు, ఈతకొలనులు, మైదానాలు వంటివాటిని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. నగరంలోని వేడినీటి బుగ్గలలో జనాలు ఈతలు కొడతారు. వేడుకలు జరిగేంత కాలం రాత్రివేళల్లో మ్యూజియమ్లన్నీ సందర్శకుల కోసం తెరిచే ఉంచుతారు. కూడళ్లలో ఏర్పాటు చేసే తాత్కాలిక వేదికలపైనా, నగరంలోని రంగస్థలాలపైన సంగీత, నృత్య, వినోద కార్యక్రమాలు కోలాహలంగా సాగుతాయి. హ్వాషియోన్ సాన్షియోనియో ఐస్ ఫెస్టివల్ దక్షిణ కొరియాలోని గాంగ్వన్ డో ప్రావిన్స్లో ఏటా శీతకాలంలో ఐస్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. హ్వాషియోన్ నగరంలో గడ్డకట్టిన నదిపై రకరకాల క్రీడలు, వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. నది ఎగువ ప్రాంతంలోని సాన్షియోనియో వద్ద మంచుదిమ్మల మీద ఏర్పడిన రంధ్రాల గుండా చేపలను పట్టే పోటీలను నిర్వహిస్తారు. భారీస్థాయి మంచుశిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొరియన్ ప్రభుత్వం ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏటా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ వేడుకలు తిలకించేందుకు దేశ విదేశాల నుంచి 15 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు. డ్రాగన్ కార్నివాల్ స్లోవేనియా రాజధాని ల్యూబ్లీయానలో ఏటా శీతకాలంలో జరిగే సంప్రదాయ వేడుక డ్రాగన్ కార్నివాల్. పురాతన పేగన్ సంస్కృతికి ఆనవాలుగా కొనసాగే ఈ వేడుకల్లో భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు. వేలాది మంది చిత్రవిచిత్రమైన మాస్కులు, రంగు రంగుల దుస్తులు ధరించి పాల్గొంటారు. భారీసైజులోని ఆకుపచ్చని డ్రాగన్ బొమ్మను మోసుకుంటూ ఊరేగిస్తారు. సంప్రదాయ వాద్యపరికరాలను మోగిస్తూ, నాట్యం చేస్తూ నగర వీథుల్లో సందడి చేస్తారు. పదమూడో శతాబ్దిలో పేగన్, క్రైస్తవ సంస్కృతులు పరస్పరం కలగలసిపోయిన నాటి నుంచి డ్రాగన్ కార్నివాల్ జరుగుతూ వస్తోందని చెబుతారు. నలభైరోజుల లెంట్ ఉపవాస దినాలకు ముందుగా, జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సంబరాన్ని నిర్వహిస్తారు. కలోన్ వింటర్ కార్నివాల్ జర్మనీలోని కలోన్ నగరంలో ఏటా వింటర్ కార్నివాల్ వేడుకలు భారీ స్థాయిలో జరుగుతాయి. పదకొండో నెల పదకొండో తేదీన– అంటే, ఏటా నవంబర్ 11న ఉదయం 11.11 గంటల నుంచి ‘కార్నివాల్’ సీజన్ మొదలవుతుంది. వీథుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో నిర్వహించే ఊరేగింపులతో ఈ వేడుకలు జనవరి 6 వరకు కొనసాగుతాయి. ఈ రోజుల్లో ‘ఫ్యాట్ థర్స్డే’ నుంచి ‘యాష్ వెన్స్డే’ వరకు వారం రోజులను ‘క్రేజీ డేస్’ అంటారు. ఈ వారం రోజుల్లోనూ మరింత భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. పిల్లలూ పెద్దలూ వీథుల్లోకి చేరి, ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. వివిధ దేశాల నుంచి వచ్చే బ్యాండ్ బృందాలు, నృత్యబృందాలు ఊరేగింపుల్లో పాల్గొంటాయి. కలోన్ కార్నివాల్లో పాల్గొనేందుకు ముఖ్యంగా యూరోప్ నలుమూలల నుంచి జనాలు పెద్దసంఖ్యలో వస్తారు. సప్పోరో స్నో ఫెస్టివల్ జపాన్లోని సప్పోరో నగరంలో ఏటా ఫిబ్రవరిలో జరిగే వేడుక ఇది. మంచుగడ్డ కట్టే పరిస్థితుల్లో మంచుతో శిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. ఈసారి 2023 ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. సప్పోరో నగరంలోని ఓడోరి పార్క్, సుసుకినో, సుడోమ్ సహా పలు ప్రదేశాలు ఈ వేడుకల్లో హిమశిల్ప ప్రదర్శనలకు వేదికలుగా నిలుస్తాయి. ఓడోరి పార్క్లో హిమశిల్పాల పోటీలు కూడా జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలలకు చెందిన కళాకారులు వందలాదిగా ఇక్కడకు వస్తుంటారు. సప్పోరో స్నో ఫెస్టివల్ 1950లో తొలిసారిగా ఒకరోజు కార్యక్రమంగా మొదలైంది. అప్పట్లో ఆరుగురు హైస్కూల్ విద్యార్థులు ఓడోరి పార్క్లో చేరి, మంచుతో శిల్పాలు మలచి సందర్శకులను ఆకట్టుకున్నారు. జపాన్ సైనిక దళాలు కూడా 1955 నుంచి ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రారంభించడంతో ఇవి వారంరోజుల వేడుకలుగా మారాయి. అనతికాలంలోనే ఈ వేడుకలు అంతర్జాతీయ ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి హిమశిల్పాలను తిలకించడానికి దేశవిదేశాల నుంచి ఏటా దాదాపు పాతిక లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. సెయింట్ పాల్ వింటర్ కార్నివాల్ అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర రాజధాని సెయింట్ పాల్లో ఏటా శీతకాలంలో భారీ కార్నివాల్ జరుగుతుంది. ఈ కార్నివాల్ వెనుక ఒక కథ ఉంది. న్యూయార్క్కు చెందిన ఒక పాత్రికేయుడు సెయింట్ పాల్ను ‘మరో సైబీరియా’గా పోలుస్తూ కథనం రాశాడు. శీతకాలంలో ఇక్కడ మనుషులు బతకలేరని అతను రాశాడు. ఈ కథనం స్థానికులకు కోపం తెప్పించింది. శీతకాలంలో కూడా సెయింట్ పాల్లో మనుషులు బతుకుతారని, అంతేకాదు, ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలూ జరుపుకొంటారని రుజువు చేసేందుకు 1885లో మాంట్రియల్ సరిహద్దుల్లో ఒక మంచుసౌధాన్ని నిర్మించి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు 1937 వరకు ఒక క్రమం లేకుండా జరుగుతూ వచ్చాయి. తిరిగి 1946 నుంచి ఏటా క్రమపద్ధతిలో నిర్వహించడం ప్రారంభమైంది. ఈ వేడుకల కోసం భారీ హిమసౌధాన్ని సిద్ధం చేస్తారు. వీథుల్లో పరేడ్లు, రాత్రివేళల్లో కాగడాల ఊరేగింపులు, సంగీత నృత్య కార్యక్రమాలు, హిమశిల్పాల తయారీ పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్యూబెక్ వింటర్ కార్నివాల్ కెనడాలోని క్యూబెక్ నగరంలో ఏటా ఫిబ్రవరిలో పదిరోజుల పాటు వింటర్ కార్నివాల్ జరుగుతుంది. ఈసారి ఫిబ్రవరి 3 నుంచి 12 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. క్యూబెక్లో 1893 నుంచి జరుగుతూ వస్తున్న ఈ కార్నివాల్లో పాల్గొనేందుకు కెనడా, అమెరికా, యూరోప్ల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నగరంలో పగలూ రాత్రీ కూడా కోలాహలంగా ఊరేగింపులు జరుగుతాయి. వాద్యపరికరాలను మోగిస్తూ, విచిత్రవేషధారణలతో వేలాది మంది ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మంచుశిల్పాల ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. Funday Cover Story: అత్యధిక దూరం వలసపోయే పక్షి ఏదో తెలుసా? -
స్పెయిన్లో రైలు ప్రమాదం.. 150 మందికి పైగా గాయాలు
స్పెయిన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 155 మంది ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 39 మంది వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. బార్సిలోనా సమీపంలోని మాంట్కాడా స్టేషన్ వద్ద బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. ఉదయం 8 గంటల సమయంలో స్టేషన్లో పార్క్ చేసిన ఉన్న రైలును వెనక నుంచి వచ్చిన మరో రైలు ఢీకొట్టిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు చాలా నెమ్మదిగా కదులుతుండటం వల్ల ఎవరికి తీవ్ర గాయాలు అవ్వలేదని చెప్పారు. రైలులో నిలబడి ఉన్న వారు ఎక్కువ గాయపడినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. .ఈ ఘటన కారణంగా సదరు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు దిశలలో రైలు ట్రాఫిక్ నిలిపివేశారు. చదవండి: జిన్పింగ్ సౌదీ పర్యటనతో..టెన్షన్లో పడిన అమెరికా -
వికారాబాద్: వింత పరికరంపై వీడిన మిస్టరీ
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత పరికరం మిస్టరీ వీడింది. అదేంటో చూసేందుకు జనం ఎగబడి పోయారు. అయితే.. ఆ పరికరం స్పెయిన్ దేశానికి చెందిందిగా ధృవీకరించారు సైంటిస్టులు. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ ప్రయోగం నిర్వహించినట్లు తెలుస్తోంది. స్పెయిన్ టూరిజంలో జనాలను తరలించే పరికరంగా దీనిని గుర్తించారు. టాటా కన్సల్టెన్సీ వాళ్ళు రూపొందించిన ప్రయోగం దినివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పూర్తిగా భారత ప్రభుత్వం సహాకారంతో నిర్వహించిన ప్రయోగం. ఇక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ దేశంలో టూరిజం లో భాగంగా జనాలను తరలించేందుకు ఉపయోగపడుతుంది. బెలున్ సహాయంతో ప్రయోగించాం. దీనిని పూర్తిగా ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేయడంతో జనాలు లేనివద్దనే దీగేలా చూశాం అని సైంటిస్టులు ప్రకటించారు. -
భారత చెస్ 77వ గ్రాండ్మాస్టర్గా ఆదిత్య
ముంబైకి చెందిన 16 ఏళ్ల ఆదిత్య మిట్టల్ భారత చెస్లో 77వ గ్రాండ్మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. స్పెయిన్లో జరుగుతున్న ఎలోబ్రెగట్ టోర్నీలో ఆరో రౌండ్లో ఫ్రాన్సిస్కో (స్పెయిన్)పై ఆదిత్య గెలిచి జీఎం నార్మ్ ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్ను అందుకున్నాడు. జీఎం కావాలంటే ఓ చెస్ ప్లేయర్ మూడు జీఎం నార్మ్లతోపాటు 2500 ఎలో రేటింగ్ పాయింట్లను సాధించాలి. ఆదిత్య 2021లో తొలి జీఎం నార్మ్, 2022లో మిగతా రెండు జీఎం నార్మ్లు సంపాదించాడు. చదవండి: టీ 20 అండర్ 19 వరల్డ్ కప్లో మన చిచ్చర పిడుగులు IND Vs BAN: బంగ్లాదేశ్తో రెండో వన్డే.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే? -
FIFA: మొరాకో సంచలనం.. స్పెయిన్కు షాక్! చెత్త రికార్డు.. టోర్నీ నుంచి అవుట్
FIFA World Cup 2022 Morocco Vs Spain- దోహా: ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో 2010 విజేత స్పెయిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇంటిముఖం పట్టింది. ఆఫ్రికా ఖండానికి చెందిన ప్రపంచ 22వ ర్యాంకర్ మొరాకో జట్టు మొండి పట్టుదలతో ఆడి ఏడో ర్యాంకర్ స్పెయిన్ను ఓడించి తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫిఫా వరల్డ్కప్-2022లో భాగంగా ప్రిక్వార్టర్స్లో ఈ రెండు జట్లు నిర్ణీత సమయంలో... ఆ తర్వాత అదనపు సమయంలోనూ గోల్స్ చేయలేకపోయాయి. దాంతో ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’లో స్పెయిన్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. వరుసగా మూడు షాట్లను లక్ష్యానికి పంపించలేకపోయారు. షూటౌట్లో ఇలా సరాబియా తొలి షాట్ గోల్పోస్ట్ బార్కు తగిలి పక్కకు వెళ్లగా... సోలెర్ రెండో షాట్ను.. బుస్క్వెట్స్ మూడో షాట్ను మొరాకో గోల్కీపర్ యాసిన్ బోనో నేర్పుతో నిలువరించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. ప్రపంచకప్లో నాలుగుసార్లు పెనాల్టీ షూటౌట్లలో ఓడిన జట్టుగా స్పెయిన్ నిలిచింది. పోర్చుగల్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ విజేతతో ఈనెల 10న క్వార్టర్ ఫైనల్లో మొరాకో తలపడుతుంది. మొరాకో ఘనత ► ప్రపంచకప్ చరిత్రలో క్వార్టర్ ఫైనల్ చేరిన నాలుగో ఆఫ్రికా దేశం మొరాకో. గతంలో కామెరూన్ (1990లో), సెనెగల్ (2002లో), ఘనా (2010లో) ఈ ఘనత సాధించాయి. చదవండి: Virender Sehwags son: క్రికెట్లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ.. ఢిల్లీ జట్టుకు ఎంపిక var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో మ్యాచ్లు తుది అంకానికి చేరుకుంటున్నాయి. మంగళవారం పోర్చుగల్, స్విట్జర్లాండ్.. మొరాకో, స్పెయిన్లు చివరి ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లు ఆడనున్నాయి. దీంతో ప్రీక్వార్టర్స్ దశ ముగియనుంది. ఇక క్వార్టర్ ఫైనల్లో ఎవరు ఎవరితో తలపడబోతున్నారనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే ఈసారి ఫెవరెట్స్లో ఒకటిగా బరిలోకి దిగిన అర్జెంటీనా క్వార్టర్స్కు దూసుకెళ్లింది. మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్ అని ఊహాగానాలు వస్తున్న వేళ కచ్చితంగా టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో అర్జెంటీనా ముందుకు సాగుతుంది. డిసెంబర్ 10న జరిగే క్వార్టర్ ఫైనల్స్లో నెదర్లాండ్స్తో అమితుమీ తేల్చుకోనుంది. ఇక మెస్సీ ఈ వరల్డ్కప్లో ఇప్పటివరకు మూడు గోల్స్ నమోదు చేశాడు. ఓవరాల్గా ఫిఫా వరల్డ్కప్స్లో తొమ్మిది గోల్స్ కొట్టాడు. ఇక మెస్సీ ఫిఫా వరల్డ్కప్ గెలిచే అవకాశాలు ఉన్న నాలుగు జట్ల పేర్లను రివీల్ చేశాడు. మెస్సీ ఏంచుకున్న నాలుగు జట్లలో అర్జెంటీనాతో పాటు బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్లు ఉన్నాయి. ''నేను ఆడుతుంది అర్జెంటీనాకు కావడంతో మా జట్టు తొలి ఫెవరెట్ అని చెప్పలేను. అర్జెంటీనా ఎప్పుడూ బెస్ట్ టీమ్స్లో ఒకటిగా ఉంటుంది. మేము బెస్ట్ టీమ్స్లో ఒకటని మాకు తెలిసినా.. దానిని ఫీల్డ్లో నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో దానిని మరోసారి నిరూపించుకున్నాం. మాకంటే బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్లు బాగా ఆడుతున్నాయి. కామెరూన్ చేతుల్లో ఓడినా బ్రెజిల్ కూడా బాగా ఆడుతోంది. ఇప్పటికీ ఫేవరెట్స్లో ఒకటి. ఫ్రాన్స్ కూడా బాగానే ఉంది. జపాన్ చేతుల్లో ఓడినా స్పెయిన్నూ తక్కువ అంచనా వేయలేం. వాళ్లు ఏం చేయాలో వాళ్లకు బాగా తెలుసు. వాళ్ల నుంచి బాల్ను దూరంగా తీసుకెళ్లడం కష్టం. స్పెయిన్ టీమ్ బాల్ను ఎక్కువ సేపు తమ నియంత్రణలో ఉంచుకుంటారు. వాళ్లను ఓడించడం కష్టం" అని పేర్కొన్నాడు. చదవండి: FIFA: మ్యాచ్ సమయంలో మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వింత దీవి.. ఆరు నెలలకోసారి దేశం మారుతుంది
ఇదో వింతదీవి. ప్రతి ఆరునెలలకు చెరో దేశంలో ఉంటుంది. మనుషులెవరూ ఉండని ఈ చిన్నదీవి పేరు ఫీజంట్ దీవి. దీని విస్తీర్ణం 2.17 ఎకరాలు మాత్రమే! స్పెయిన్–ఫ్రాన్స్ సరిహద్దుల నడుమ బిడసోవా నదిలో ఉన్న ఈ దీవి ఏడాదిలో ఒక ఆరునెలలు స్పెయిన్ అధీనంలోను, మరో ఆరునెలలు ఫ్రాన్స్ అధీనంలోను ఉంటుంది. ఒక దీవి రెండు దేశాల అధీనంలో చెరో ఆరునెలలు కొనసాగడం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఫీజంట్ దీవి ఇలా కొనసాగడం వెనుక చాలా చరిత్రే ఉంది. మనుషులే లేని ఈ దీవిపై ఆధిపత్యం కోసం స్పెయిన్–ఫ్రాన్స్ దేశాల మధ్య పదిహేడో శతాబ్దిలో హోరాహోరీ పోరాటమే జరిగింది. రెండు దేశాల మధ్య ముప్పయ్యేళ్ల పాటు యుద్ధం కొనసాగింది. యుద్ధకాలంలో పరిష్కారం కోసం పదకొండేళ్ల వ్యవధిలో ఇరవైనాలుగు చర్చా సమావేశాలు జరిగాయి. చివరకు ఈ దీవి ఆధిపత్యాన్ని చెరో ఆరునెలలూ పంచుకునేలా ఉభయ దేశాలూ 1659లో ఒక ఒప్పందానికి వచ్చాయి. అప్పటి నుంచి ఈ ఫీజంట్ దీవి ఒక ఆరునెలలు స్పెయిన్ అధీనంలోను, మరో ఆరునెలలు ఫ్రాన్స్ అధీనంలోను కొనసాగుతోంది. ఈ దీవి ఏటా ఫిబ్రవరి 1 నుంచి జూలై 31 వరకు స్పెయిన్ అధీనంలోను, ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు ఫ్రాన్స్ అధీనంలోను ఉంటుంది. చదవండి: జపాన్లోనే అత్యంత ప్రమాదకర ఆలయం చెట్టు నుంచి పుట్టిన శిశువు.. సరస్సు లోతును కనిపెట్టలేదట -
FIFA: 2 గోల్స్.. అంతా తలకిందులు! దురదృష్టం అంటే జర్మనీదే! టోర్నీ నుంచి అవుట్
FIFA World Cup Qatar 2022: ఫిఫా వరల్డ్కప్-2022లో జర్మనీకి ఊహించని షాక్ తగిలింది. నాలుగు సార్లు చాంపియన్గా నిలిచిన ఈ మేటి జట్టు ఈసారి కనీసం నాకౌట్ దశకు కూడా చేరలేకపోయింది. కోస్టారికాపై ఘన విజయం సాధించినప్పటికీ... జపాన్ కారణంగా దురదృష్టకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అసలేం జరిగిందంటే.. Germany Vs Costa Rica: గ్రూప్-ఇలో భాగమైన జర్మనీ శుక్రవారం నాటి మ్యాచ్లో కోస్టారికాను 4-2తో ఓడించింది. అయితే, ఈ జట్టు ప్రిక్వార్టర్స్ చేరే క్రమంలో.. ఇదే గ్రూపులో ఉన్న జపాన్- స్పెయిన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో అనూహ్య రీతిలో జపాన్, స్పెయిన్ను 2-1తో ఓడించింది. దీంతో జర్మనీ నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయి. జర్మనీ అవుట్.. ఎందుకంటే.. Japan Vs Spain: తాజా విజయంతో ఈ టోర్నీలో రెండు మ్యాచ్లు గెలిచిన జపాన్ ఆరు పాయింట్లతో గ్రూప్- ఇ టాపర్గా నిలిచింది. ఇక జర్మనీ, స్పెయిన్ ఒక్కో విజయం సాధించి.. రెండేసి పాయింట్లు సంపాదించినప్పటికీ జర్మనీకి పరాభవం తప్పలేదు. ఈ రెండు జట్ల పాయింట్లు సమానంగా ఉన్నప్పటికీ గోల్స్ విషయంలో జర్మనీ(6 గోల్స్) వెనుకబడింది. తాజాగా జపాన్తో ఒక గోల్ చేయగలిగిన స్పెయిన్ మొత్తంగా 9 గోల్స్తో జర్మనీని వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. నిజానికి జపాన్ గనుక ఈ మ్యాచ్లో ఓడి ఉంటే.. జర్మనీ, స్పెయిన్ రౌండ్ 16కు అర్హత సాధించేవి. స్పెయిన్తో మ్యాచ్లో రెండు గోల్స్ చేసిన జపాన్ ఖాతాలో మొత్తంగా ఉన్నవి నాలుగు గోల్సే. అయినప్పటికీ గెలుపుతో ఆరు పాయింట్లు కొట్టేసి ముందడుగు వేసింది. కాబట్టి జర్మనీని దురదృష్టం వెంటాడిందని చెప్పొచ్చు. ఇక గ్రూప్-ఇ టాపర్గా జపాన్, రెండో స్థానంలో ఉన్న స్పెయిన్ ప్రిక్వార్టర్స్కు చేరుకోగా.. జర్మనీ ఇంటిబాట పట్టింది. ఇక నవంబరు 23 నాటి మ్యాచ్లో మొదట జర్మనీని(1-2తో) ఓడించిన జపాన్.. తాజాగా స్పెయిన్ ఓడించింది. దీంతో జర్మనీ పాలిట జపాన్ శాపంగా మారిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా! KL Rahul: టీమిండియా వైస్ కెప్టెన్ పెళ్లి డేట్ ఫిక్స్! సెలవు మంజూరు చేసిన బీసీసీఐ! -
ప్రపంచంలో బెస్ట్ సిటీ ‘వెలెన్సియా’.. టాప్ 10 నగరాలివే..
న్యూయార్క్: మూడు ఖండాల నుంచి మూడు నగరాలు ఇంటర్నేషన్స్ సంస్థ తాజా సర్వేలో అత్యుత్తమ సిటీల జాబితాలో నిలిచాయి. ప్రవాసులు నివసించడానికి 2022లో ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో స్పెయిన్లోని వెలెన్సియా టాప్లో నిలిచింది. అద్భుతమైన జీవన ప్రమాణాలుంటాయని జీవన వ్యయం భరించే స్థాయిలో ఉంటుందని, ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని సర్వేలో అత్యధికులు వెలెనికా నగరానికి ఓటు వేశారు. ఆ తర్వాత స్థానంలో దుబాయ్, మూడో స్థానంలో మెక్సికో సిటీ నిలిచాయి. 181 దేశాల్లో నివసిస్తున్న 11,970 మంది ప్రవాసుల అభిప్రాయాలను తెలుసుకొని ఈ జాబితాకు రూపకల్పన చేశారు. టాప్ 10 నగరాలివే.. 1. వెలెన్సియా (స్పెయిన్): జీవన ప్రమాణాలు, అల్ప జీవన వ్యయం, మంచి వాతావరణం. 2. దుబాయ్: పని చేయడానికి అనుకూలం, ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేయొచ్చు. 3. మెక్సికో సిటీ: ఫ్రెండ్లీ నగరం. 4. లిస్బన్ (పోర్చుగల్): అద్భుత వాతావరణం. 5. మాడ్రిడ్ (స్పెయిన్): సాంస్కృతిక అద్భుతం. 6. బాంకాక్: సొంత దేశంలో ఉండే ఫీలింగ్. 7. బాసిల్ (స్విట్జర్లాండ్): ఆర్థికం, ఉపాధి, జీవన ప్రమాణాల్లో ప్రవాసుల సంతృప్తి 8. మెల్బోర్న్ (ఆస్ట్రేలియా): అన్నింటా బెస్ట్. 9. అబుదాబి: ఆరోగ్యం రంగట్లో టాప్. ప్రభుత్వోద్యోగుల పనితీరు అద్భుతం. 10. సింగపూర్: మంచి కెరీర్. రోమ్ (ఇటలీ), టోక్యో (జపాన్), మిలన్ (ఇటలీ), హాంబర్గ్ (జర్మనీ), హాంగ్కాంగ్ ప్రవాసుల నివాసానికి అనుకూలంగా ఉండవని సర్వే పేర్కొంది. -
FIFA World Cup Qatar 2022: జర్మనీ... డ్రాతో గట్టెక్కింది!
దోహా: ప్రపంచకప్ ఫుట్బాల్ చరిత్రలో జర్మనీది ఘనచరిత్రే! బ్రెజిల్ అంతటి మేటి జట్టు జర్మనీ. బ్రెజిల్ ఐదుసార్లు గెలిస్తే... జర్మనీ నాలుగుసార్లు ప్రపంచకప్ను అందుకుంది. అంతేకాదు గెలిచినన్ని సార్లు రన్నరప్గా నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానంలో నిలిచింది. ఇలా పాల్గొన్న ప్రతీ మెగా ఈవెంట్లోనూ సత్తా చాటుకున్న మేటి జట్టు గత టోర్నీలో తొలి రౌండ్ దాటకపోవడమే పెద్ద షాక్ అనుకుంటే మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటుంది. స్పెయిన్తో జరిగిన లీగ్ పోరులో జర్మనీ 1–1తో డ్రాతో గట్టెక్కింది. స్పెయిన్ తరఫున సబ్స్టిట్యూట్ అల్వారో మొరాటా (62వ ని.లో), జర్మనీ జట్టులో సబ్స్టిట్యూట్ ఫుల్క్రుగ్ (83వ ని.లో) గోల్ చేశారు. ఇప్పుడు ఒక ఓటమి, ఒక డ్రాతో ఉన్న జర్మనీ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోస్టారికాను ఓడిస్తేనే సరిపోదు. మిగతా జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. ఈ గ్రూపులో ఆఖరి లీగ్ పోటీల్లో కోస్టారికాతో జర్మనీ... జపాన్తో స్పెయిన్ తలపడతాయి. ఈ రెండు మ్యాచ్లు గురువారమే జరుగనున్నాయి. దీంతో ఇంకో రెండు రోజుల్లో ఏ రెండు ముందుకో, ఏ రెండు ఇంటికో తేలిపోతుంది. -
వన్షజ్, దేవిక, రవీనా పసిడి పంచ్...
ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి. స్పెయిన్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో పురుషుల 63.5 కేజీల విభాగంలో హరియాణా కుర్రాడు వన్షజ్... మహిళల 52 కేజీల విభాగంలో పుణే అమ్మాయి దేవిక ఘోర్పడే, 63 కేజీల విభాగంలో రవీనా పసిడి పతకాలు గెలిచారు. ఫైనల్స్లో వన్షజ్ 5–0తో దెముర్ కజై (జార్జియా)పై, దేవిక 5–0తో లౌరెన్ మెకీ (ఇంగ్లండ్)పై, రవీనా 4–3తో మేగన్ డెక్లెయిర్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. పురుషుల 54 కేజీల ఫైనల్లో ఆశిష్ 1–4తో యుటా సకాయ్ (జపాన్) చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. -
ఏడు నెలల అజ్ఞాతం.. ఫ్యామిలీకి పెద్ద సర్ప్రైజ్
మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదంటారు పెద్దలు. కానీ, గొప్ప విజయాలు ఆగిపోయేది ప్రయత్న లోపం వల్లే!. అది గ్రహించిన ఓ వ్యక్తి.. కష్టంతో తాను అనుకున్నది సాధించాడు. అదీ ఏడు నెలల కఠోర సాధన.. ఇంటికి, స్నేహితులకు దూరంగా అజ్ఞాతవాసంలో ఉంటూ! ఐర్లాండ్ కోర్క్కు చెందిన బ్రయాన్ ఓ కీఫ్ఫె.. పాతికేళ్ల ఈ యువకుడు అతిబరువు సమస్యతో బాధపడేవాడు. 2021లో అతని బరువు అక్షరాల 154 కేజీలు. బరువు తగ్గేందుకు అతగాడు ఎంతో ప్రయత్నించాడు. ఏదీ వర్కవుట్ కాలేదు. అసలు సమస్య ఏంటో అతనికి అర్థమైంది. అది ఇంటి ఫుడ్.. తాను ఎలా ఉన్నా ఫర్వాలేదనుకుంటూ అభిమానించే అయినవాళ్లు. వెంటనే అందరికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దేశం విడిచాడు. సముద్రాలు దాటాడు.. స్పెయిన్కు చేరుకున్నాడు. బరువు బాగా తగ్గిపోవాలి. అతని ముందు ఒకే ఒక్క టార్గెట్. ఆ లక్ష్య సాధనలో కఠోర ప్రయత్నాలకు దిగాడు. ఏడు నెలలపాటు విరామం లేకుండా వ్యాయామాలు చేశాడు. ఆ క్రమంలో ఎన్నో గాయాలు. అయినా ప్రయత్నం ఆపలేదు. వాకింగ్, రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.. ఇలా అన్నింటిని ప్రయత్నించాడు. నెమ్మది నెమ్మదిగా వర్కవుట్లకు సమయం పెంచుకుంటూ పోయాడు. ఒకానొక టైంలో భారీ కాయంతోనే ఐదు కిలోమీటర్లను 35 నిమిషాల్లోపు పూర్తి చేశాడు కూడా. మరోవైపు బ్రయాన్ డైట్లోనూ ఎన్నో మార్పుల చేసుకున్నాడు. కేలరీలను తగ్గించుకున్నాడు. రోజుకు ఐదు గంటలపాటు వ్యాయామం చేసే స్టేజ్కి చేరాడు. ఏడు నెలల కఠోర ప్రయత్నం తర్వాత అతని బరువు 91 కేజీలకు చేరింది. అంటే.. 63 కేజీల బరవు తగ్గాడన్న మాట. ఆ రూపాన్ని అద్దంలో చూసుకుని మురిసిపోయాడు అతను. ఈ ఏడు నెలల కాలంలో తల్లిదండ్రులకు, స్నేహితులకు దూరంగా ఉన్నాడతను. కేవలం క్షేమసమాచారాలను ఫోన్ ద్వారా తెలియజేశాడే తప్ప.. వాళ్లతో వీడియో కాల్స్ సంభాషణలు, తాను ఎలా కష్టపడుతున్నాడనేది చూపించే ప్రయత్నం చేయలేదు. ఎందుకు వాళ్లను వీడాడో అసలు కారణమే చెప్పలేదట!. ఏడు నెలల తర్వాత బరువు తగ్గిన బ్రయాన్ ఇంటికి చేరాడు. బరువు తగ్గిన అతని రూపం.. ఇంట్లో వాళ్లను షాక్కు గురి చేసింది. స్నేహితులను సర్ప్రైజ్ చేసింది. ఆనందం పట్టలేకపోయారంతా. ఇప్పుడు బ్రయాన్.. తగ్గిన బరువును అలాగే కొనసాగించే ప్రయత్నంలో ఉన్నాడు. అంతేకాదు.. తన ప్రయత్నాలను వివరిస్తూ తనలాంటి మరికొందరికి సోషల్ మీడియా ద్వారా సలహాలు ఇస్తున్నాడు. -
దిగ్గజం పీలే సరసన స్పెయిన్ మిడ్ ఫీల్డర్
ఫిఫా వరల్డ్కప్లో భాగంగా బుధవారం స్పెయిన్, కోస్టారికా మధ్య జరిగిన మ్యాచ్లో గోల్స్ వర్షం కురిసింది. మ్యాచ్లో అన్ని గోల్స్ చేసింది స్పెయిన్ ఆటగాళ్లే కావడం విశేషం. మ్యాచ్లో స్పెయిన్ 7-0 తేడాతో కోస్టారికాపై విజయం సాధించింది. స్పెయిన్ తరఫునఫెర్రాన్ టోరెస్ రెండు గోల్స్ చేయగా, ఓల్మో, అసెన్సియో, గవి, సోలెర్, మోరాటా తలో ఒక్క గోల్ చేశారు. ఈ మ్యాచ్ ద్వారా స్పెయిన్ మిడ్ ఫీల్డర్ గవి కొత్త రికార్డ్ను క్రియేట్ చేశాడు. వరల్డ్ కప్లో గోల్ కొట్టిన మూడో పిన్న వయస్కుడిగా నిలిచాడు. వరల్డ్ కప్లో గోల్ కొట్టిన అతి పిన్నవయస్కుల జాబితాలో బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే మొదటి స్థానంలో ఉన్నాడు. 1958 వరల్డ్ కప్లో పీలే స్వీడన్పై 17 సంవత్సరాల 249 రోజుల్లో గోల్ కొట్టాడు. ఆ తర్వాత 1930 ఆరంభ ఫిఫా వరల్డ్కప్లో మెక్సికన్ ప్లేయర్ రోసెస్(18 సంవత్సరాల 93 రోజులు) రెండో స్థానంలో నిలిచాడు . బుధవారం కోస్టారికాతో జరిగిన మ్యాచ్లో గోల్ కొట్టిన గవి (18 సంవత్సరాల 110 రోజులు) పిన్న వయస్కుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇక వరల్డ్ కప్ల పరంగా కోస్టారికాపై గెలుపు స్పెయిన్కు అతి పెద్ద విజయం. 2010 వరల్డ్కప్లో విజేతగా నిలిచిన స్పెయిన్ .. 2018లో రౌండ్ 16లో వెనుదిరిగింది. ఆ వరల్డ్కప్లో స్పెయిన్ పదో స్థానంలో నిలిచింది. చదవండి: అంతర్యుద్ధంతో కుటుంబం విచ్చిన్నం; అన్న ఘనాకు.. తమ్ముడు స్పెయిన్కు -
అంతర్యుద్ధంతో కుటుంబం విచ్చిన్నం; అన్న ఘనాకు.. తమ్ముడు స్పెయిన్కు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని మ్యాచ్లు డ్రాగా ముగుస్తే.. కొన్ని చివరి వరకు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఇక టైటిల్ ఫేవరెట్స్ అయిన అర్జెంటీనా, జర్మనీలకు సౌదీ అరేబియా, జపాన్లు షాకివ్వడం అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇక బుధవారం కోస్టారికాతో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ గోల్స్ వర్షం కురిపించింది. ఏకండా 7-0 తేడాతో కోస్టారికాపై విజయం సాధించింది. నికో విలియమ్స్(స్పెయిన్) ఇదిలా ఉంటే స్పెయిన్ జట్టుకు ఆడుతున్న నికో విలియమ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతని గతం ఎంతో సంఘర్షణతో కూడుకున్నది. నికోల్ విలియమ్స్ కుటుంబం ఘనాకు చెందినవాళ్లు. అయితే అతను పుట్టకముందే లిబేరియన్ అంతర్యుద్ధం కారణంగా కుటుంబం మొత్తం స్పెయిన్కు వలస వెళ్లింది. నికోల్ తండ్రి అంతర్యుద్ధానికి బయపడి కాలి నడకతోనే స్పెయిన్కు చేరుకున్నాడు. అప్పటికే నికోల్ విలియమ్స్కు ఒక అన్న ఉన్నాడు. అతనే ఇనాకి విలియమ్స్. అతను కూడా ఫుట్బాలర్గా కొనసాగుతున్నాడు. ఇక్కడ విచిత్రమేంటంటే.. తమ్ముడు నికో విలియమ్స్ స్పెయిన్కు ఆడుతుంటే.. అన్న ఇనాకి విలియమ్స్ మాత్రం తన స్వంత దేశమైన ఘనాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇద్దరు ఒక్క క్లబ్కే(అథ్లెటిక్ బిలాబో) ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ ఫుట్బాలర్గా మారిన తర్వాత ఇనాకి విలియమ్స్ ఘనాకు వెళ్లిపోయాడు. అతని కుటుంబం మాత్రం స్పెయిన్లోనే ఉంది. కుటుంబంతోనే ఉన్న నికో విలియమ్స్ ఫుట్బాల్ ఆడుతూ ఆ తర్వాత స్పెయిన్ జాతీయ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఇక తొలి ఫిఫా వరల్డ్కప్ ఆడుతున్న నికో విలియమ్స్.. తన అన్న ఇనాకి విలియమ్స్పై స్పందించాడు. ఇనాకి విలియమ్స్(ఘనా) ''ఇద్దరం వేరే జట్టుకు ఆడుతుండొచ్చు.. కానీ మా బంధం మాత్రం ఎప్పుడు ఒకటే. అన్న నాకు నిరంతరం ఆటలో మెళుకువలు చెబుతూనే ఉంటాడు. అతనిచ్చే ధైర్యమే నన్ను మంచి ఫుట్బాలర్ను చేసింది. ఈ వరల్డ్కప్లో ఇద్దరం ఎదురుపడతామే లేదో తెలియదు కానీ అన్నకు ప్రత్యర్థిగా ఒక మ్యాచ్ ఆడే అవకాశం ఫిఫాలో వస్తే బాగుండు'' అని చెప్పుకొచ్చాడు. ఇక స్పెయిన్-కోస్టారికా మ్యాచ్ ముగిసిన తర్వాత నికో విలియమ్సన్, ఇనాకి విలియమ్సన్లు ఒకరినొకరు హగ్ చేసుకోవడం అందరిని ఆకట్టుకుంది. కాగా ఇనాకి విలియమ్స్ ఘనాకు ఆడుతుండగా.. గురువారం పోర్చుగల్తో ఘనా అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: FIFA WC: ఇదెక్కడి ఆచారమో ఏంటో.. ఆకట్టుకున్న జపాన్ జట్టు -
FIFA World Cup Qatar 2022: స్పెయిన్ ‘సెవెన్’ స్టార్ ప్రదర్శన
దోహా: ఫుట్బాల్ ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్స్లో ఒక జట్టయిన స్పెయిన్ భారీ విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో 2010 విశ్వవిజేత స్పెయిన్ 7–0 గోల్స్ తేడాతో కోస్టారికా జట్టును చిత్తుగా ఓడించింది. స్పెయిన్ తరఫున ఫెరాన్ టోరెస్ (31వ, 54వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... డానీ ఓల్మో (11వ ని.లో), మార్కో అసెన్సియో (21వ ని.లో), గావి (74వ ని.లో), కార్లోస్ సోలెర్ (90వ ని.లో), అల్వారో మొరాటా (90+2వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తమ ప్రపంచకప్ చరిత్రలో స్పెయిన్కిదే అతిపెద్ద విజయం. ఆ జట్టు ప్రపంచకప్ మ్యాచ్లో ఏడు గోల్స్ చేయడం ఇదే తొలిసారి. కోస్టారికాతో మ్యాచ్లో స్పెయిన్ సంపూర్ ఆధిపత్యం చలాయించింది. 82 శాతం బంతి స్పెయిన్ ఆధీనంలో ఉండటం వారి ఆధిపత్యానికి నిదర్శనం. స్పెయిన్ ప్రత్యర్థి గోల్పోస్ట్ లక్ష్యంగా ఎనిమిది షాట్లు కొట్టగా... కోస్టారికా ఒక్కసారి కూడా స్పెయిన్ గోల్పోస్ట్ లక్ష్యంగా షాట్ కొట్టలేకపోయింది. స్పెయిన్ ఆటగాళ్లు ఏకంగా 1,043 పాస్లు పూర్తి చేశారు. ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టు కూడా ఒక మ్యాచ్లో ఇన్ని పాస్లు పూర్తి చేయలేదు. కోస్టారికా ఆటగాళ్లు 231 పాస్లతో సరిపెట్టుకున్నారు. ప్రపంచకప్ మ్యాచ్లో తొలి అర్ధభాగంలో స్పెయిన్ మూడు గోల్స్ చేయడం 1934 తర్వాత ఇదే తొలిసారి. 1934లో బ్రెజిల్పై తొలి అర్ధభాగంలో స్పెయిన్ మూడు గోల్స్ సాధించింది. క్రొయేషియా 0 మొరాకో 0 గత ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీ రన్నరప్ క్రొయేషియాను మొరాకో నిలువరించింది. బుధవారం గ్రూప్ ‘ఎఫ్’లో జరిగిన లీగ్ మ్యాచ్ 0–0తో డ్రాగా ముగిసింది. సీనియర్ స్ట్రయికర్, క్రొయేషియా కెప్టెన్ మోడ్రిచ్ ఖాతా తెరిచేందుకు గట్టి ప్రయత్నాలే చేసిన మొరాకో ఆటగాళ్లు అడ్డుగోడ కట్టేయంతో గోల్ నమోదు కాలేదు. -
Bruce Lee: నమ్మిందే బ్రూస్లీ ప్రాణం తీసిందా?
మార్షల్ ఆర్ట్స్.. ఈ పేరు వినగానే కళ్ల ముందర మెదిలే రూపం బ్రూస్ లీ. తరాలు మారుతున్న మార్షల్ ఆర్ట్స్పై ఆసక్తికనబరిచే యువతకు ఆయనే ఆదర్శం. ఒకవైపు డిష్యుం.. డిష్యుంలతో పాటు నటుడిగానూ అశేష అభిమానులను సంపాదించుకున్నారాయన. అయితే.. కేవలం 32 ఏళ్ల వయసులోనే చనిపోయి.. అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసి వెళ్లిపోయారు. ఆ టైంలో ఆయన మరణంపై రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. కానీ, మెదడు వాపు కారణంగానే ఆయన చనిపోయారని వైద్యులు ఆ టైంలో ప్రకటించారు. అయితే.. ఇప్పుడు సుమారు యాభై ఏళ్ల తర్వాత ఆయన మరణానికి కారణం చర్చలోకి వచ్చింది. మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ మరణంపై తాజాగా మరో ప్రకటనపై చేశారు పరిశోధకులు. అదీ ఓ అధ్యయనం నిర్వహించి మరీ!. 1973 జులైలో సెరెబ్రల్ ఎడిమా అనే వ్యాధితో బ్రూస్లీ మరణించినట్లు ఆయన్ని పరిశీలించిన వైద్యులు ప్రకటించారు. సెరెబ్రల్ ఎడిమా అంటే మెదడు వాపు. పెయిన్కిల్లర్స్ అతిగా వినియోగించడం వల్ల మెదడు కణాలు వాపు ఎక్కినట్లు వైద్యులు భావించారు. కానీ.. బ్రూస్లీ మరణం వెనుక.. మంచి నీళ్లు ఉన్నాయన్నది ఇప్పుడు స్పెయిన్ సైంటిస్టులు చెప్తున్న మాట. అవును.. అతిగా నీళ్లు తాగడం వల్లే బ్రూస్లీ మరణించారని స్పెయిన్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం నిర్వహించి మరీ ప్రకటించారు. హైపోనాట్రేమియా.. అతిగా నీరు తాగడం వల్ల శరీరంలో అవసరానికి మించిన సోడియం స్థాయిలు కరిగిపోతాయి. ఈ స్థితి వల్లే బ్రూస్లీ సెరెబ్రల్ ఎడిమా బారిన పడినట్లు స్పెయిన్ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనం ద్వారా వెల్లడించారు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల సోడియం లెవల్స్ తగ్గిపోయి.. శరీరంలోని కణాలు, ముఖ్యంగా మెదడులో కణాలు వాపు చెందుతాయి. అదే బ్రూస్లీ మరణానికి దారితీసి ఉంటుందని ఇప్పుడు స్పెయిన్ సైంటిస్టులు చెప్తున్నారు. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం, గంజాయి లాంటి మాదకద్రవ్యాల వల్ల అతిగా దాహం వేయడం, ఆల్కహాల్ అలవాట్లతో అధిక నీటిని బయటకు పంపించే సామర్థ్యాన్ని కిడ్నీలు కోల్పోవడం వంటివి ఈ పరిస్థితికి దారితీస్తాయని స్పెయిన్ సైంటిస్టుల అధ్యయనం వెల్లడించింది. నీరు ఎక్కువగా తాగడం ముప్పే! బీ వాటర్ మై ఫ్రెండ్.. బ్రూస్ లీ తరపున విపరీతంగా వైరల్ అయ్యే కోట్ ఇది. పలు పుస్తకాల్లోనూ ఈ ప్రస్తావన ఉంటుంది. రోజూవారీ జీవితంలో ఆయన మంచి నీటికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు వాటిని చదివితే తెలుస్తుంది. అంతేకాదు.. ఓ మనిషి మంచి నీటిలా బతకాలంటూ ఆయన పేరు మీద ఓ ఫిలాసఫీ కూడా ప్రచారంలో ఉంది. కానీ, అంతలా నమ్మిన మంచి నీరే ఆయన ప్రాణం తీయడం ఇక్కడ విశేషం. అయితే అందుకు ‘అతి’ ప్రధాన కారణం అయ్యింది. నీరు అధికంగా తీసుకోవడం వల్ల మరణం సంభవిస్తుందా? అవును.. అలాంటి కేసులు మెడికల్ హిస్టరీలో బోలెడు నమోదు అయ్యాయి. చాలా ఎక్కువ నీటి వినియోగం ఇంట్రాక్రానియల్ ఒత్తిడిని (ICP)కి కారణం అవుతుంది. ఇది రకరకాల లక్షణాలకు, ఒక్కోసారి పరిస్థితులు తిరగబడి ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తుంది. అసలు ఎంత తాగాలి.. ఒక వ్యక్తి తన మూత్రపిండాలు(కిడ్నీల) మూత్రం ద్వారా తొలగించగల దానికంటే ఎక్కువ నీటిని తీసుకుంటే 'ఓవర్హైడ్రేషన్' 'వాటర్ ఇంటాక్సికేషన్' సంభవిస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. హైపోనాట్రేమియా, సెరిబ్రల్ ఎడెమా సందర్భాల్లో ఒక్కోసారి అధికంగా నీరు తీసుకున్న గంటలో కూడా మరణం సంభవించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎంత నీరు తీసుకోవాలి?.. కొందరు రెండు, కొందరు మూడు, కొందరు ఐదు లీటర్లు అంటూ చెప్తుంటారు. కానీ, శాస్త్రీయంగా దీనికంటూ ఓ పరిమితి లేదు. కానీ, గంటలో లీటర్ లోపు నీటిని మాత్రమే తీసుకోవాలని కొన్నిసార్లు సూచిస్తుంటారు వైద్య నిపుణులు. తద్వారా కిడ్నీలపై ఒత్తిడి ఉండదని చెప్తున్నారు. అంతేకాదు.. అతిగా నీటిని తీసుకోవడం మూలంగా మానసిక అనారోగ్యం కూడా సంభవించవచ్చని చెప్తున్నారు. -
పూర్వ వైభవంపై జర్మనీ దృష్టి
ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 109 మ్యాచ్లు ఆడిన జట్టుగా బ్రెజిల్తో సమానంగా జర్మనీ నిలిచింది. బ్రెజిల్ ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిస్తే, జర్మనీ నాలుగుసార్లు ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. అయితే 2014లో నాలుగోసారి ప్రపంచ చాంపియన్గా నిలిచిన తర్వాత జర్మనీ ఆటలో తిరోగమనం కనిపిస్తోంది. 2018 ప్రపంచకప్లో జర్మనీ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అనంతరం యూరో టోర్నీలోనూ జర్మనీ ప్రిక్వార్టర్ ఫైనల్ను దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో ‘ఖతర్’లో జర్మనీ ప్రయాణం ఎంతవరకు సాగుతుందో చెప్పలేని స్థితి. –సాక్షి క్రీడా విభాగం జర్మనీ మాజీ చాంపియన్ స్పెయిన్తో మ్యాచ్ను మినహాయిస్తే... గ్రూప్ ‘ఇ’లోని ఇతర జట్లయిన కోస్టారికా, జపాన్లపై జర్మనీ విజయం సాధిస్తే తదుపరి దశకు అర్హత పొందడం ఖాయమనుకోవాలి. గుండోగన్, జమాల్ ముసియాలా, కాయ్ హవెర్ట్, లెరాయ్, మార్కో రెయిస్ కీలక ఆటగాళ్లు. ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: నాలుగుసార్లు చాంపియన్ (1954, 1974, 1990, 2014). ‘ఫిఫా’ ర్యాంక్: 11. అర్హత ఎలా: యూరోప్ క్వాలిఫయింగ్ లో గ్రూప్ ‘జె’ విజేత. స్పెయిన్ సమన్వయంతో ఆడటంలో స్పెయిన్ ఆటగాళ్లు సిద్ధహస్తులు. గత ఆరేళ్లలో ఆ జట్టు ఆడిన మ్యాచ్ల్లో రెండు గోల్స్ తేడాతో ఓడిపోయిన ఒక్క మ్యాచ్ కూడా లేదు. ఈ ప్రపంచకప్లో తమ గ్రూప్లో జర్మనీతో మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది. పెద్రీ, ఫెరాన్ టోరెస్, మొరాటా, సిమోన్ కీలక ఆటగాళ్లు. ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: చాంపియన్ (2010). ‘ఫిఫా’ ర్యాంక్: 7. అర్హత ఎలా: యూరోప్ క్వాలిఫయింగ్లో గ్రూప్ ‘బి’ విజేత. జపాన్ వరుసగా ఏడో ప్రపంచకప్లో ఆడుతున్న జపాన్ మూడుసార్లు గ్రూప్ దశలో నిష్క్రమించగా, మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఆసియా క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో జపాన్ ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లోనూ గెలిచింది. మంగోలియాపై 14–0తో, మయన్మార్పై 10–0తో నెగ్గిన జపాన్ రెండో రౌండ్లో ఏకంగా 46 గోల్స్ కొట్టి కేవలం రెండు గోల్స్ సమర్పించుకుంది. మూడో రౌండ్లో రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్ బెర్త్ను ఖరారు చేసుకుంది. దైచి కమాడా కీలక ఆటగాడు. జర్మనీ, స్పెయిన్లతో మ్యాచ్ ఫలితాలే ఈసారి జపాన్ ప్రస్థానాన్ని నిర్ణయిస్తాయి. ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్ ఫైనల్ (2002, 2010, 2018). ‘ఫిఫా’ ర్యాంక్: 24. అర్హత ఎలా: ఆసియా క్వాలిఫయింగ్లో మూడో రౌండ్ గ్రూప్ ‘బి’ రన్నరప్. కోస్టారికా ఆరోసారి ప్రపంచకప్లో ఆడుతున్న కోస్టారికా అద్భుతంగా రాణిస్తే తప్ప ఈసారి గ్రూప్ దశను దాటే అవకాశాలు కనిపించడంలేదు. జర్మనీ, స్పెయిన్లలో ఒక జట్టును ఓడిస్తే తప్ప కోస్టారికా ముందుకు వెళ్లడం కష్టమే. అర్సెనల్ జట్టుకు ఆడే జోయల్ క్యాంప్బెల్ కీలక ఆటగాడు. ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (2014). ‘ఫిఫా’ ర్యాంక్: 31. అర్హత ఎలా: ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్–ఓసియానియా క్వాలిఫయింగ్ ప్లే ఆఫ్ మ్యాచ్ విజేత. -
అమ్మకానికి గ్రామం.. ధర రూ.2.1 కోట్లు.. మరీ అంత తక్కువెందుకంటే?
మ్యాండ్రిడ్: చాలా మందికి ఒక ఇల్లు లేదా విల్లా కొనుగోలు చేయలానే కల ఉంటుంది. కానీ, ఎవరికైనా ఒక గ్రామాన్ని కొనుగోలు చేయాలనుంటుందా? బాగా డబ్బు ఉన్న వాళ్లు రెండు మూడు ప్రాంతాల్లో నివాస గృహాలు కొనుగోలు చేయటం సహజమే. అయితే, ఒక గ్రామం మొత్తం అమ్మకానికి ఉంటే.. అది కేవలం ఒక ఇంటి ధరకే వస్తే..? ఆ ఆలోచనే నమ్మశక్యంగా లేదు కదా! స్పానిస్లోని ఓ గ్రామం ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. దాని ధర కేవలం 227,000 యూరోలు(రూ.2,16,87,831) మాత్రమే. సాల్టో డీ కాస్టో అనే ఈ గ్రామం జమోరా రాష్ట్రంలో పోర్చుగల్ సరిహద్దుల్లో ఉంటుంది. మ్యాండ్రిడ్ నుంచి కేవలం మూడు గంటల ప్రయాణం మాత్రమే. ఆ గ్రామంలో 44 ఇళ్లు, ఒక హోటల్, ఒక చర్చి, ఒక స్కూలు, ఒక మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయి. 2000 తొలినాళ్లలో ఓ వ్యక్తి ఆ గ్రామాన్ని కొనుగోలు చేసి.. దానిని ప్రధాన టూరిస్ట్ ప్రాంతంగా మార్చాలనుకున్నాడు. అయితే, ఆర్థిక సంక్షోభంతో అది సాధ్యం కాలేదు. రాయల్ ఇన్వెస్ట్ యజమానికి రోని రోడ్రిగౌజ్ ఇప్పటికీ అక్కడ పర్యాటకం అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నారు. ఐడియాలిస్టా అనే స్పానిస్ స్థిరాస్తి రిటైల్ వెబ్సైట్లో ఈ గ్రామాన్ని అమ్మకాన్ని ఉంచారు. తాను పట్టణవాసినని, గ్రామం నిర్వహణను చూసుకోలేకపోతున్నందునే అమ్మకాని పెట్టినట్లు యజమాని పేర్కొన్నారు. ఈ గ్రామంపై పెట్టుబడి పెడితే 100 శాతం అభివృద్ధి సాధించవచ్చని, అందుకు 2 లక్షల యూరోలకు మించి ఖర్చు కాదని తెలిపారు. వెబ్సైట్లో ఈ ప్రాపర్టీని ఇప్పటి వరకు 50వేల మంది వీక్షించారు. బ్రిటన్, ఫ్రాన్స్ బెల్జియం, రష్యాల నుంచి 300 మందికిపైగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: USA Airshow: ఎయిర్ షోలో ఘోర ప్రమాదం.. ఆకాశంలోనే ఢీకొన్న యుద్ధ విమానాలు -
పెళ్లిలో తలెత్తిన గొడవ...నలుగురు మృతి
అందంగా జరుపుకోవాల్సిన వివాహ వేడుక విషాదంగా మారింది. ఇంకాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా చిన్న రగడ మొదలైంది. అది కాస్త తీవ్రంగా పరిణమంచి నలుగు వ్యక్తులు మృతికి దారితీసింది. వివరాల్లోకెళ్తే...స్పెయిన్లోని మాడ్రిడ్లో ఓ రెస్టారెంట్లో వివాహం జరగబోతోంది. ఇంతలో ఏమైందో ఏమో ఇరు వర్గాల మధ్య చిన్న గొడవ చోటుచోసుకుంది. అది కాస్త మరింత రసాభాసగా మారింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అనుహ్యంగా ఒక కారు పెళ్లికి వచ్చిన అతిథులపైకి దూసుకు వచ్చింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఐతే దాడికి పాల్పడిన కారుని రెస్టారెంట్కి 50 కి. మీ సమీపంలోనే పోలీసులు గుర్తించారు. ఆ కారులో ఉన్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. మరోకరు పరారిలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గరులో ఒకరు తండ్రి, మిగతా ఇద్దరు అతని పిల్లలుగా గుర్తించారు. దీంతో మరోకరు కూడా ఈ ఘటనలో పాల్గొని ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు గాలించడం ప్రారంభించారు. (చదవండి: 9 రోజుల పాటు గనుల్లో చిక్కుకున్న కార్మికులు...కాఫీ ఫౌడర్, నీళ్లే ఆహారంగా..) -
చైనా ఎంత పనిచేసింది.. పలు దేశాల్లో విమానాశ్రయాలు బంద్!
డ్రాగన్ కంట్రీ చైనాకు చెందిన భారీ రాకెట్ శిథిలాలు నియంత్రణ కోల్పోయి భూమిపైకి వేగంగా దూసుకొస్తున్నాయి. కాగా, చైనా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ (సీజెడ్-5బీ) అక్టోబర్ 31న నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం, నియంత్రణ కోల్పోవడంతో రాకెట్ శిథిలాలు భూమిపై పడనున్నాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్లోని పలు విమానాశ్రయాలను మూసివేశారు. వివరాల ప్రకారం.. అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న స్పేస్ స్టేషన్కు 20 టన్నుల బరువున్న మెంగ్టియన్ లాబొరేటరీ క్యాబిన్ మాడ్యూల్ను లాంగ్ మార్చ్ 5బీ ద్వారా పంపించారు. ఈ క్రమంలో లాంగ్ మార్చ్ నియంత్రణ కోల్పోవడంతో రాకెట్ శిథిలాలు.. అట్లాంటిక్ మహా సముద్రంలో కూలవచ్చని యూరోపియన్ యూనియన్ స్పేస్ సర్వైలెన్స్ అండ్ ట్రాకింగ్ సర్వీస్ అంచనా వేసింది. ఇందులో భాగంగానే ఉత్తర స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ ఇటలీలో కూడా రాకెట్ శిథిలాలు కూలే ముప్పు ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో అప్రమత్తమైన స్పెయిన్.. దేశంలోని పలు విమానాశ్రయాలను మూసివేసింది. దీంతో, టార్రాగోనా, ఇబిజా, రియస్లో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, ఫ్రాన్స్లోని మార్సెయిల్ విమానాశ్రయంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. విమానాల బంద్ కావడంతో యూరప్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రాకెట్లోని కొన్ని భాగాలు శుక్రవారం, మరి కొన్ని భాగాలు శనివారం భూమిపై పడే అవకాశం ఉంది. Parece que esto iba en serio, fijaros como se ha vaciado el espacio aéreo en la trayectoria de reentrada del #CZ5B. Reflexión: ¿Nadie pondrá límites y exigirá a las agencias espaciales desorbitar estas fases monstruosas de cohete (éste de 17,5 Tm!) de manera controlada? pic.twitter.com/oHzBp6KefN — Dr. Josep M. Trigo ⭐🎗#PlanetaryDefense #DART HERA (@Josep_Trigo) November 4, 2022 -
వీసా తిరస్కరణ.. వరల్డ్ చాంపియన్షిప్కు భారత రెజ్లర్లు దూరం
స్పెయిన్లోని పొంటెవెడ్రాలో జరగనున్న అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియనషిప్కు 21 మంది భారతీయ రెజ్లర్లు దూరమయ్యారు. వీసా గడువు ముగియడంతో స్పెయిన్ ఎంబసీ 21 మందికి వీసాలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సోమవారం ప్రారంభమైన ఛాంపియన్షిప్ కోసం 30 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. అందులో కేవలం తొమ్మిది మందికి మాత్రమే వీసాలు మంజూరయ్యాయి. చాంపియన్షిప్కు మిస్ అయిన 21 మందిలో అండర్-20 మహిళా ప్రపంచ ఛాంపియన్ యాంటిమ్ పంఘల్ ఉండడం గమనార్హం. ''ఇంతకముందెన్నడూ ఇలా జరగలేదు. భారత ప్రభుత్వ క్లియరెన్స్తో పాటు ప్రపంచ పాలక సంస్థ (UWW) నుంచి ఆహ్వానం అందించినప్పటికి మా రెజ్లర్లకు వీసాలు నిరాకరించబడ్డాయి. సాధ్యమైనంత త్వరగా పాస్పోర్ట్లను విడుదల చేయమని అభ్యర్థన చేసిన తర్వాత లేఖలు తిరస్కరణకు గురయ్యాయి. ఇది నిజంగా విచిత్రం.'' అని భారత రెజ్లింగ్ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ పీటీఐకి తెలిపారు. -
భారత ఎకానమీపై స్పానిష్ పేపర్ కార్టూన్ దుమారం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై స్పెయిన్కు చెందిన ప్రధాన పత్రిక అవమానకర కథనం కలకలం రేపింది. భారత ఆర్థిక వృద్ధిపై కథనాన్ని ప్రకటించిన ‘లా వంగార్డియా’ పత్రిక‘పాములు ఆడించే వ్యక్తి’ ప్రతిబింబించే కార్టూన్ను పబ్లిష్ చేసింది. అక్టోబర్ 9న వీక్లీ పత్రిక మొదటి పేజీలో ఈ కార్టూన్ ప్రచురితమైంది. ఇది దేశంపై జాతివిద్వేషాన్ని వెళ్లగక్కడం తప్ప మరోకటి కాదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ‘ది హవర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ’ పేరిట భారత ఆర్థిక వ్యవస్థ స్థితిని వర్ణించడంపై బెంగళూరు సెంట్రల్ బీజేపీ లోక్సభ ఎంపీ పీసీ మోహన్ సీరియస్గా స్పందించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా తమను పాముల్ని ఆడించేవాళ్లగా చూపడం మూర్ఖత్వమేనని మండిపడ్డారు. అంతేకాదు బలమైన ఆర్థిక వ్యవస్థగా ఇండియాకు గ్లోబల్గా గుర్తింపు ఉందని గుర్తుచేశారు. విదేశీ మనస్థత్వాలనుమార్చాలనే ప్రయత్నం కాస్త కష్టమేనని పేర్కొన్నారు. మరోవైపు రచయిత రజత్ సేథి కూడా దీనిపై స్పందించారు. భారత ఆర్థికవృద్ధిని ప్రపంచం గమనిస్తోంది. అయినా జాత్యహంకార వ్యంగ్య చిత్రాలు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచమంతా గమనిస్తోంది. కానీ భారత్ను ఇంకా సాంప్రదాయ కార్టూన్లతో చూపించడం చాలా అవమానకరం. కార్టూన్తో దేశాన్ని అవమానించడం చాలా దారుణమని స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జిరోధా సీఈవో నితిన్ కామన్ వ్యాఖ్యానించారు. పాములు పట్టే దేశంగా అభివర్ణించడం సరైంది కాదని ఆయన ట్వీట్ చేశారు. ఎకానమీతో పాటు, శాస్త్రసాంకేతిక రంగాల్లో ఇండియా దూసుకుపోతున్నా భారత్ను పాములు పట్టే దేశం అంటూ అవమానకర కార్టూన్ను ప్రచురించడం సరికాదని అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. "The hour of the Indian economy," says La Vanguardia, a leading Spanish daily. Quite cool that the world is taking notice, but the cultural caricaturing, a snake charmer to represent India, is an insult. Wonder what it takes for this to stop; maybe global Indian products? pic.twitter.com/YY3ribZIaq — Nithin Kamath (@Nithin0dha) October 13, 2022 -
45 ఏళ్ల తర్వాత నానమ్మను కలిసిన వ్యక్తి.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!
ఇతరులను సంతోషంగా ఉండాలంటే డబ్బులు, నగలు, ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనస్పూర్తిగా చేసే చిన్న చిన్న పనులు సైతం ఎదుటి వారిలో కొండంత ఆనందాన్ని తీసుకొస్తాయి. వారితో గడిపే కాస్త సమయం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాంటి ఓ అందమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన నానమ్మను కలిసేందుకు ఓ వ్యక్తి స్పెయిన్ నుంచి సౌత్ అమెరికాలోని బొలివియాకు ప్రయాణించాడు. నానమ్మను కలవడంలో ఆశ్యర్యపోవాల్సింది ఏముంది అనుకుంటున్నారా.. ఎందుకంటే ఆ వ్యక్తి ఆమెను చూసి 45 ఏళ్లు అవుతోంది. చిన్నతనంలో అన అనే మహిళ అతన్ని తన సొంత కొడుకులా చూసుకుంది. అయితే కొన్నాళ్లకు అతను దూరంగా వెళ్లిపోయాడు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత మహిళను కలవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెపై ఉన్న ప్రేమ అతన్ని స్పెయిన్ నుంచి బొలివియాకు తీసుకువచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత నానమ్మను చూసేందుకు ఏకంగా 8 వేల కిలోమీటర్లకు పైగా ట్రావెల్ చేశాడు. బామ్మ దగ్గరకు వెళ్లి తనెవరో చెప్పిన వెంటనే ఆమె పట్టరాణి సంతోషంతో ఉద్వేగానికి లోనైంది. వెంటనే అతన్ని ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకుంది. తన జర్నీని వ్యక్తి మెత్తం రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిని చూసిన ఎవరైనా భావోద్వేగానికి గురవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోపై నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. వీడియో ఎంతో అందంగా ఉందని, దీనిని చూస్తుంటే తమ కంట్లో నీళ్లు వస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. These heartwarming nanny reunions get me every time, @GoodNewsCorres1 ❤️, you got me again. pic.twitter.com/xK35MGL6oy — ☮️💙 Lena L Chen 💙☮️ (@LenaLChen) September 28, 2022 -
యువకుడి అసాధారణ బిజినెస్.. సినిమాలో హీరోలా..
మాడ్రిడ్: స్పెయిన్లో ఓ యువకుడు అసాధారణమైన ‘బిజినెస్’ చేస్తున్నాడు.. కొంత రుసుము తీసుకొని కోరుకున్న వారికి తన ‘సేవలు’ అందిస్తున్నాడు.. ఇంతకీ అతను అందిస్తున్న సేవలు ఏమిటో తెలుసా? సినిమాలో డబ్బు కోసం ఇతరుల నేరాలను తనపై వేసుకొని జైలుపాలయ్యే హీరో తరహాలో అతను వ్యవహరిస్తున్నాడు!! అంటే డ్రైవింగ్ తప్పిదాలకు పాల్పడే వ్యక్తుల నుంచి కాస్త ఫీజు వసూలు చేసి ఆ నేరాలను తనపై వేసుకుంటున్నాడు! తద్వారా వారి డ్రైవింగ్ లైసెన్సులతోపాటు డ్రైవింగ్ రికార్డులను పదిలంగా ఉంచుతూ తనపై మచ్చ వేసుకుంటున్నాడు! అలాగే వారిని ప్రభుత్వ జరిమానాల బారి నుంచి తప్పిస్తున్నాడు. ఇలా ఇప్పటివరకు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు 100 మంది వాహనదారుల నేరాలను తనపై వేసుకున్నాడు. ఇందుకోసం ‘ఖాతాదారుల’ నుంచి రూ. 6 వేల నుంచి రూ. 16 వేల వరకు వసూలు చేస్తున్నాడు. స్పెయిన్ మోటారు వాహన చట్ట నిబంధనల ప్రకారం ఒక్కో వాహనదారుడికి లైసెన్స్ జారీ చేసే సమయంలో 12 పాయింట్లు కేటాయిస్తారు. సెల్ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్ తదితర నేరాలకు పాల్పడే వాహనదారుల నుంచి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు వసూలు చేయడంతోపాటు వారి నిర్ణీత పాయింట్లు కోల్పోగానే లైసెన్సులను సస్పెండ్ చేస్తారు. ఈ నేపథ్యంలో వాహనదారులను కాపాడేందుకు ఆ యువకుడు నేరాన్ని తనపై వేసుకొని జరిమానాలు కడుతున్నాడట. ఇప్పటివరకు అతని డ్రైవింగ్ లైసెన్స్ కింద ఏకంగా మైనస్ 321 పాయింట్లు ఉండటం గమనార్హం. రెండేళ్లుగా పోలీసులను బురిడీ కొట్టిస్తున్న ఆ యువకుడు ఇటీవల మాత్రం దొరికిపోయాడట. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల కోసం ఓ ద్విచక్ర వాహనదారుడి వాహనాన్ని పోలీసులు ఆపబోగా అతను ఆపకుండా పరారయ్యాడు. కానీ మర్నాడే ఆ నేరాన్ని తానే చేశానంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ యువకుడి డ్రైవింగ్ లైసెన్స్ను ఆన్లైన్లో తనిఖీ చేయగా అసలు బండారం బయటపడింది. దీంతో అతన్ని జైలుకు పంపారు. చదవండి: మళ్లీ చూడాలంటే 107 ఏళ్లు ఆగాల్సిందే! -
ఎంపవర్మెంట్: డైనమిక్ సిస్టర్స్
అవసరం నుంచే కాదు... ఆపద నుంచి కూడా ఆవిష్కరణలు పుడతాయి. ‘ఇండియా–హెంప్ అండ్ కంపెనీ’ ఉత్పత్తులు ఈ కోవకే చెందుతాయి. భరించలేని వెన్నునొప్పితో బాధ పడిన షాలిని తన పరిశోధనలో భాగంగా తెలుసుకున్న విషయం... హెంప్ మొక్కకు వెన్నునొప్పిని తగ్గించే శక్తి ఉంది అని. అది ప్రయోగాత్మకంగా నిరూపణ కావడంతో హెంప్ ఉత్పత్తుల విలువను ప్రపంచానికి పరిచయం చేయడానికి సోదరి జయంతి భట్టాచార్యతో కలిసి ‘ఇండియా హెంప్ అండ్ కంపెనీ’కి శ్రీకారం చుట్టి విజయపథంలో దూసుకుపోతోంది. షాలిని భట్టాచార్య నిలకడగా ఒకచోట ఉండే రకం కాదు. స్పెయిన్లో ఉంటున్న శాలినికి ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడం అంటేనే ఎక్కువ ఇష్టం. అలాంటి షాలినికి కష్టం వచ్చిపడింది. భరించలేని వెన్నునొప్పి! బయట అడుగు వేయలేని పరిస్థితి. చిన్న బ్యాగ్ను ఇటు నుంచి అటు పెట్టాలన్నా వీలయ్యేది కాదు. హాస్పిటల్స్ చుట్టూ తిరగడం మొదలైంది. ఏదో కాస్త తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉంటున్న సోదరి జయంతితో కలిసి తన సమస్యకు పరిష్కారాన్ని వెదకడానికి పరిశోధన మొదలుపెట్టింది. ఈ పరిశోధన క్రమంలో వారికి ఎప్పుడో విన్న హెంప్ (ఒక రకమైన కనబిస్ మొక్క) గుర్తుకు వచ్చింది. వేసవి సెలవులు వస్తే చాలు...కొండకోనల్లో తిరగడం తమ అలవాటు. అలా వెళ్లినప్పుడు అక్కడి మొక్కల గురించి స్థానికుల నుంచి ఆసక్తికరమైన వివరాలు తెలుసుకునేవారు. ఒకసారి హిమాలయాలో విస్తారంగా పెరిగే, విస్తృత ఔషధగుణాలు ఉన్న హెంప్ గురించి విని ఉన్నారు. ఆ జ్ఞాపకంతో హెంప్ గురించి లోతైన పరిశోధన ప్రారంభించారు. వెన్నునొప్పిని తగ్గించే సామర్థ్యం ఈ మొక్కకు ఉన్నట్లు ప్రయోగాత్మకంగా తెలుసుకున్నారు. ఆ సమయంలోనే వారికి ఒక ఆలోచన వచ్చింది... అజ్ఞాతంగా ఉన్న హెంప్ను ప్రజల్లోకి తీసుకువెళ్లి దాని ఔషధశక్తి ఏమిటో తెలియజేయాలని. ఇందుకు వారు ఎంచుకున్న మార్గం ఇండియా హెంప్ అండ్ కంపెనీ. బెంగళూరు కేంద్రంగా మొదలైన ఈ కంపెనీ హెంప్ ట్రేల్ మిక్స్, హెంప్ హార్ట్, ప్రొటీన్ పౌడర్, హెంప్ ఆయిల్... మొదలైన న్యూట్రీషన్–ప్యాక్డ్ హెంప్ ప్రాడక్స్ను తీసుకువచ్చింది. ‘షార్క్ ఇండియా రియల్టీ షో’ నుంచి ఆహ్వానం అందడాన్ని ఔత్సాహిక వ్యాపారవేత్తలు గొప్పగా భావిస్తారు. తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఒక విశాలవేదికగా షార్క్ ఇండియా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫండింగ్ విషయంలో మేలు జరుగుతుంది. ‘ఇండియా హెంప్ అండ్ కంపెనీ’ కో–ఫౌండర్గా జయంతి భట్టాచార్యకు షార్క్ ఇండియా నుంచి ఆహ్వానం లభించింది. అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్లో మాస్టర్స్ డిగ్రీ ఉన్న జయంతికి తమ ఉత్పత్తుల గురించి ఎలా ప్రచారం చేసుకోవాలో అనేది తెలియని విషయమేమీ కాదు. ఆమె ప్రసంగం ఎందరినో ఆకట్టుకుంది. రకరకాల దేశాల నుంచి ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. అయితే సరిౖయెన డీల్ కుదరకపోవడంతో వాటిని ఆమోదించలేదు. ఫండింగ్ మాట ఎలా ఉన్నా ‘షో’కు వచ్చిన ప్రముఖుల సూచనలతో బ్రాండింగ్ స్ట్రాటజీని మార్చుకున్నారు. ఆ తరువాత సరిౖయెన ఇన్వెస్టర్లు వచ్చారు. కంపెనీ విజయపథంలో దూసుకెళుతుంది. నిజానికి హెంప్ ఉత్పత్తులను మార్కెట్ లో సక్సెస్ చేయడం అంత ఆషామాషీ విషయమేమీ కాదు. మన దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెంప్ సాగు చేయడానికి అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట అనుమానం మిగిలే ఉంది. దీన్ని తీసివేయడానికి ప్రచార రూపంలో గట్టి ప్రయత్నాలు ప్రారంభించి విజయం సాధించారు ఈ డైనమిక్ సిస్టర్స్. ‘ప్లానెట్ ఫ్రెండ్లీ ప్లాంట్ అయిన హెంప్పై మాకు ఉన్న నమ్మకం వృథాపోలేదు. మా వ్యాపారం విజయవంతమైంది అనేదానికంటే, ఇండియా హెంప్ అండ్ కంపెనీ ద్వారా హెంప్లోని ఔషధ గుణాల గురించి చాలామంది తెలుసుకోగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది’ అంటుంది షాలిని. -
'కోచ్ ఇబ్బంది పెడుతున్నారు.. తట్టుకోలేకపోతున్నాం'
కోచ్తో ఉన్న ఇబ్బంది కారణంగా 15 మంది మహిళా ఫుట్బాల్ ప్లేయర్లు జట్టు నుంచి వైదొలగడం కలకలం రేపింది. స్పెయిన్ ఫుట్బాల్లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. స్పెయిన్ మహిళల ఫుట్బాల్ కోచ్గా జార్జ్ విల్డా వ్యవహరిస్తున్నాడు. తమ ఆరోగ్యంపై, మానసిక పరిస్థితిపై ప్రభావం చూపేలా కోచ్ విల్డా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ మహిళా ప్లేయర్లు ఆరోపించారు. తమ సమస్యలకు ప్రధాన కారణం కోచ్ విల్డా అంటూ స్పానిష్ సాకర్ ఫెడరేషన్కు ఈ-మెయిల్ పంపారు. కోచ్పై వేటు వేయాలని స్పష్టంగా పేర్కొనలేదు కానీ అతని వల్ల ఇబ్బంది కలుగుతుందని మాత్రం లేఖలో వెల్లడించారు. ఈ పరిస్థితిలో మార్పు వచ్చేంతవరకు జట్టుకు దూరంగా ఉంటామని 15 మంది తేల్చి చెప్పారు. కాగా కోచ్ విల్డా పనితీరుపై సంతృప్తిగా లేకపోవడం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిసింది. ఇంతకముందు కూడా మీడియా సమావేశంలోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు. మరోవైపు తమకు ఎలాంటి లేఖ, ఈ-మెయిల్ అందలేదని స్పానిష్ సాకర్ ఫెడరేషన్ పేర్కొంది. కోచ్ విల్డా మహిళా ప్లేయర్లను ఇబ్బందికి గురిచేసినట్లు.. లైంగిక వేధింపుల పాల్పడినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. కోచ్ విల్డాకు క్షమాపణ చెప్పేవరకు 15 మంది మహిళా ప్లేయర్లను జట్టులోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. కాగా స్పెయిన్ మహిళల ఫుట్బాల్ జట్టు వచ్చే నెల 7న స్వీడన్, 11న అమెరికాతో ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లకు ఆడే జట్టును కోచ్ విల్డానే ఎంపిక చేయాల్సి ఉంది. చదవండి: ఓటమితో కెరీర్కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటి పర్యంతం బుమ్రా యార్కర్కు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫిదా -
60 ఏళ్లగా ఆ ఊరు ఖాళీ... ఒక్కరు కూడా లేరు! ఎక్కడంటే?
దాదాపు అరవయ్యేళ్లుగా ఆ ఊరు ఖాళీగానే ఉంటోంది. చిట్టచివరి మనిషి ఈ ఊరిని ఖాళీచేసి వెళ్లిపోయిన నాటి నుంచి ఇక్కడ పిట్టమనిషి కూడా ఉండటం లేదు. స్పెయిన్లోని స్వయంపాలిన ప్రాంతమైన ఎస్ట్రెమాడురాలో ఉన్న ఈ ఊరి పేరు గ్రానడిల్లా. ప్రపంచం నలుమూలలా రకరకాల కారణాల వల్ల అక్కడక్కడా ఖాళీ ఊళ్లు కనిపిస్తుంటాయి గాని, గ్రానడిల్లా ఖాళీగా పడి ఉండటానికి కారణం మాత్రం కొంత విచారకరమైనది. ఈ చిన్న పట్టణాన్ని తొమ్మిదో శతాబ్దిలో అప్పటి ముస్లింపాలకులు నిర్మించారు. ఈ ఊళ్లోని జనాలు ప్రధానంగా ఊరిబయటి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్లు. స్పెయిన్ నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో 1950లో ఈ ఊరి సమీపంలోని నది మీద రిజర్వాయర్ నిర్మించనున్నట్లు ప్రకటించాడు. రిజర్వాయర్ పనులు కొనసాగుతుండగా, 1960 ప్రాంతంలో ఊరు మునిగిపోవచ్చని అప్పటి అధికారులు అంచనా వేశారు. దాంతో ఊళ్లోని జనాలు భయపడి ఊరిని ఖాళీచేసేశారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినా, ఊరు మునిగిపోలేదు. అయితే, రిజర్వాయర్ కోసం ఊరికి దారితీసే రోడ్లన్నిటినీ కొట్టేశారు. దాంతో ఈ ఊరు బాహ్యప్రపంచంలో సంబంధాలు కోల్పోయి ఒక ద్వీపంలా మారింది. చదవండి: Pauline Death Mystery: పాలిన్ చనిపోయిందంటున్నారు.. ఇంటికి వచ్చిందెవరు? -
US Open 2022: ‘నంబర్వన్’ సమరం
న్యూయార్క్: పురుషుల టెన్నిస్ చరిత్రలో తొలిసారి గ్రాండ్స్లామ్ టోర్నీ ఫైనల్లో ఇద్దరు క్రీడాకారులు ఏకకాలంలో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్తోపాటు ప్రపంచ నంబర్వన్ ర్యాంక్నూ సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. ఫైనల్లో గెలిచిన ప్లేయర్కు తొలి గ్రాండ్స్లామ్ టైటిల్తోపాటు ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ లభిస్తుంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి ఒంటి గంట 30 నిమిషాలకు ఈ ఫైనల్ మొదలవుతుంది. సెమీఫైనల్స్లో ఏడో సీడ్ కాస్పర్ రూడ్ 7–6 (7/5), 6–2, 5–7, 7–2తో 27వ సీడ్ ఖచనోవ్ (రష్యా)పై... మూడో సీడ్ అల్కరాజ్ 6–7 (6/8), 6–3, 6–1, 6–7 (5/7), 6–3తో 22వ సీడ్ టియాఫో (అమెరికా)పై గెలిచారు. 23 ఏళ్ల కాస్పర్ రూడ్ తన కెరీర్లో రెండో సారి గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరగా... 19 ఏళ్ల అల్కరాజ్ తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ ఏడాది కాస్పర్ రూడ్ ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్ చేరి రన్నరప్గా నిలిచాడు. పక్కా ప్రణాళికతో... నాన్న క్రిస్టియాన్ శిక్షణలో రాటుదేలిన కాస్పర్ పక్కా ప్రణాళికతో ఆడి రష్యా ఆజానుబాహుడు ఖచనోవ్ ఆట కట్టించాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ శక్తివంతమైన సర్వీస్లను రిటర్న్ చేయడానికి కాస్పర్ బేస్లైన్ వెనుక నిల్చోని రిటర్న్ చేశాక సుదీర్ఘ ర్యాలీలు ఆడాడు. తొలి సెట్ టైబ్రేక్లో కాస్పర్, ఖచనోవ్ మధ్య 12వ పాయింట్ కోసం ఏకంగా 55 షాట్ల ర్యాలీ జరగడం విశేషం. మూడు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్లో కాస్పర్ పది ఏస్లు సంధించాడు. నెట్ వద్దకు 23 సార్లు దూసుకొచ్చి 20 సార్లు పాయింట్లు గెలిచాడు. 53 విన్నర్స్ కొట్టిన కాస్పర్ తన ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఖచనోవ్ 41 అనవసర తప్పిదాలు చేశాడు. వరుసగా మూడో మ్యాచ్లో... ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న అల్కరాజ్ ఈ టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్లోనూ ఐదు సెట్ల పోరాటంలో విజయాన్ని దక్కించుకున్నాడు. 4 గంటల 19 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో 59 విన్నర్స్ కొట్టిన అల్కరాజ్ నెట్ వద్దకు 42 సార్లు దూసుకొచ్చి 32 సార్లు పాయింట్లు గెలిచాడు. మరోవైపు టియాఫో 15 ఏస్లు సంధించి ఆరు డబుల్ ఫాల్ట్లు, 52 అనవసర తప్పిదాలు చేశాడు. 7: ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో వరుసగా మూడు ఐదు సెట్ల మ్యాచ్లు గెలిచి ఫైనల్ చేరిన ఏడో ప్లేయర్గా అల్కరాజ్ గుర్తింపు పొందాడు. గతంలో అగస్సీ (అమెరికా; 2005 యూఎస్ ఓపెన్), ఎడ్బర్గ్ (స్వీడన్; 1992 యూఎస్ ఓపెన్), బన్గెర్ట్ (జర్మనీ; 1967 వింబుల్డన్), టోనీ రోచ్ (ఆస్ట్రేలియా; 1967 ఫ్రెంచ్ ఓపెన్), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా; 1962 ఫ్రెంచ్ ఓపెన్), అలెక్స్ ఒల్మెడో (పెరూ/అమెరికా; 1959 ఆస్ట్రేలియన్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. రాజీవ్–సాలిస్బరీ జోడీకి డబుల్స్ టైటిల్ పురుషుల డబుల్స్లో రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీ టైటిల్ను నిలబెట్టుకుంది. ఫైనల్లో రాజీవ్ రామ్–సాలిస్బరీ ద్వయం 7–6 (7/4), 7–5తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. వరుసగా 22వ ఏడాది యూఎస్ ఓపెన్లో ఆడిన రాజీవ్ 11 వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగాడు. వుడ్ఫర్డ్–వుడ్బ్రిడ్జ్ (ఆస్ట్రేలియా; 1995, 1996) ద్వయం తర్వాత యూఎస్ ఓపెన్లో వరుసగా రెండేళ్లు డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి జోడీగా రాజీవ్–సాలిస్బరీ ద్వయం గుర్తింపు పొందింది. -
మనం మళ్లీ పిల్లల్లా మారిపోతే! శాస్త్రవేత్తల అధునాతన ప్రయోగం
కాలం గడుస్తున్న కొద్దీ వయసు పెరుగుతుంది. వృద్ధాప్యం మీద పడుతుంది. వందేళ్లు బతికినా అందులో మూడు వంతులకుపైగా ముసలితనంతోనే గడిచిపోతుంది. అలాకాకుండా బతికినంత కాలం యంగ్గానే బతికేస్తే.. అసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వయసును వెనక్కి తీసుకెళ్లి.. మళ్లీ ఆ బాల్యాన్ని, యవ్వనాన్ని ఎంజాయ్ చేయగలిగితే..!? ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో సీన్లా అనిపిస్తోందా.. అలాంటిది ఎప్పటికైనా సాధ్యమేనా అన్న ప్రశ్న వస్తోందా? ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అలాంటి రోజు రావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం సముద్రంలో జీవించే ఓ చిత్రమైన జెల్లీ ఫిష్పై చేస్తున్న పరిశోధనలు తోడ్పడతాయని అంటున్నారు. ఆ వివరాలేమిటో చూద్దామా.. అన్ని జీవులకు భిన్నంగా.. సాధారణంగా సముద్రాల్లో నివసించే చాలా రకాల జెల్లీ ఫిష్లకు తమ వయసును వెనక్కి తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. కానీ ఇది కొంతకాలం మాత్రమే, అదీ పునరుత్పత్తి చేయగలిగే దశ వరకు మాత్రమే ఉంటుంది. ఈ దశ దాటితే తిరిగి వయసును వెనక్కి తగ్గించుకునే సామర్థ్యం పోతుంది. కానీ శాస్త్రవేత్తలు కొన్నేళ్ల కింద సముద్రంలో సరికొత్త జెల్లీ ఫిష్ను కనుగొన్నారు. టుర్రిటోప్సిస్ డొహ్రని (టీ.డోహ్రని) అని పేరుపెట్టి.. పరిశోధన చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. జీవితంలో ఏ దశలో అయినా, ఎప్పుడైనా తిరిగి తన వయసును వెనక్కి తగ్గించుకోలదు. దీనికి ఈ సామర్థ్యం ఎలా వచ్చిందన్న దానిపై స్పెయిన్లోని ఓవిడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇటీవలే ఈ పరిశోధన వివరాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. రెండు సెట్ల జన్యువులతో.. సాధారణంగా ఏ జీవిలో అయి నా వయసు పెరుగుతున్న కొద్దీ, శరీరంలో కణ విభజన జరుగుతూ.. జన్యువుల్లో మార్పులు జరుగుతుంటాయి. కణాల్లో జన్యుక్రమానికి సంబంధించిన సమాచారం నిల్వ ఉండే టెలోమెర్ల (జన్యువులు ఉండే క్రోమోజోమ్ల చివరన ఉండే భాగాలు) పొడవు తగ్గిపోతూ ఉంటుంది. ఈ మార్పులే వృద్ధాప్యానికి కారణమవుతాయి. టీ.డోహ్రని జెల్లీ ఫిష్పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. దానిలో జన్యువులన్నీ మరో సెట్ కాపీ చేసి ఉన్నాయని గుర్తించారు. దీనివల్ల ఈ జెల్లీ ఫిష్ వయసు పెరిగినకొద్దీ ప్రధాన జన్యువుల్లో మార్పులు జరిగినా, దెబ్బతిన్నా.. వాటిని మరో సెట్ సాయంతో తిరిగి సరిచేసుకుంటున్నట్టు తేల్చారు. అంతేగాకుండా ఈ జెల్లీఫిష్ల కణాల్లోని టెలోమెర్ల పొడవు తగ్గకుండా అంతర్గత వ్యవస్థలు పనిచేస్తున్నట్టు గుర్తించారు. దీనివల్ల ఇవి వృద్ధాప్య లక్షణాలను దరిచేరనీయడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సామర్థ్యంతో ఏం చేస్తుంది? టి.డోహ్రిని జెల్లీఫిష్లకు వృద్ధాప్యం రానప్పుడు.. మళ్లీ వయసును తగ్గించుకునే సామర్థ్యం ఎందుకనే అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ జెల్లీ ఫిష్లు మరీ ఎక్కువ వయసుకు వచి్చనప్పుడు, ఇతర జీవుల దాడుల్లో దెబ్బతిన్నప్పుడు, అవి ఉన్న పరిస్థితులు జీవించడానికి అనుకూలంగా లేనప్పుడు.. వయసు తగ్గించేసుకుని, తిరిగి ఎదుగుతున్నట్టు గుర్తించారు. చాలా రకాల కీటకాలు, ఇతర జీవుల తరహాలోనే జెల్లీ ఫిష్ల పరిణామక్రమం ఉంటుంది. ఉదాహరణకు దోమ మొదట పిండం రూపంలో, తర్వాత లార్వా వంటి మధ్యస్థ దశలో, తర్వాత పూర్తి రూపంలోకి ఎదుగుతుంది. సీతాకోక చిలుకలు మొదట గుడ్డు, తర్వాత పురుగు, చివరిగా ఎగిరే సీతాకోక చిలుకల్లా మారుతాయి. ఇదే తరహాలో టి.డోహ్రిని జెల్లీ ఫిష్లు క్రమంగా తమ పూర్వరూపాలకు మారుతూ.. పిండం దశదాకా (జెల్లీ ఫిష్.. సిస్ట్.. పాలిప్ రూపాలదాకా) వెళ్తాయి. అక్కడి నుంచి తిరిగి పూర్తిస్థాయి జీవిగా ఎదుగుతూ వస్తాయి. ఈ క్రమంలో మళ్లీ బాల్యం నుంచి యవ్వనం దాకా అనుభవిస్తాయని అనుకోవచ్చు. ఇదే శక్తి మనకూ వస్తే..? ఈ జెల్లీ ఫిష్లలో ఉండో రెండో సెట్ జన్యువులు కణాల రక్షణకు, పునరుద్ధరణకు తోడ్పడే ప్రోటీన్లు ఉత్పత్తి చేస్తున్నాయని ఓవిడో వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రోటీన్లపై పరిశోధన చేయడం ద్వారా.. మనం తిరిగి మరీ చిన్నపిల్లల్లా మారిపోకున్నా, వృద్ధాప్యాన్ని దూరం చేసే అత్యాధునిక విధానాలను అభివృద్ధి చేయవచ్చని చెప్తున్నారు. ఎన్నోరకాల జన్యు సంబంధ వ్యాధులు, ఇతర అనారోగ్యాలకూ సమర్థవంతమైన చికిత్సలను రూపొందించవచ్చని అంటున్నారు. అంతేకాదు.. భవిష్యత్తులో అసలు వృద్ధాప్యమే దరి చేరకుండా ఉండే ఔషధాలు, చికిత్సలు వచ్చే అవకాశమూ ఉంటుందని పేర్కొంటున్నారు. చదవండి: జంతువుల మాదిరిగానే..మనుషులకు తోక! -
నడి రోడ్డుపై ఎద్దుతో పరాచకాలు... దెబ్బకు కుమ్మిపడేసింది: వీడియో వైరల్
జంతువులను ఇబ్బంది పెట్టే స్టంట్లు వంటివి చేయకూడదు. జంతు చట్టాలు ప్రకారం నేరం కూడా. ఐతే కొన్ని దేశాల్లో జంతువులతో చేసే ఫైట్లు, స్టంట్లు నేరం కాదు. పైగా అక్కడ చట్టాలు వాటిని ప్రోత్సహిస్తాయి. జంతువులకు జ్ఞానం ఉండదు కాబట్టి మనం ఏం చేస్తున్నామన్నది వాటికి తెలియదు. వాటితో స్టంట్లు చేయాలనుకునే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మనకే ప్రమాదం. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి వ్యవహారించి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు. వివరాల్లోకెళ్తే....స్పెయిన్లోని ఒక వ్యక్తి ఎద్దుతో పరాచకాలు ఆడబోయి పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. నడిరోడ్డులో బహిరంగంగా ఆ ఎద్దును పట్టుకుని గేలి చేస్తూ....ఒక చేతితో దాని తలపై చేయి వేసి ఏదో చెప్పబోతుండగా సదరు ఎద్దు ఒక్క ఊదుటున తన కొమ్ములతో కుమ్మేసింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడ ఉన్నవారందరూ భయంతో కేకలు వేయడం ప్రారంభించారు. ఈ ఘటన స్పెయిన్లో వీధుల్లో చోటుచేసుకుంది. బుల్ ఫైట్ సందర్భంగా ఎద్దులను సిద్ధం చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. అక్కడ కోడిపందాలు, బుల్పైట్లు చట్టబద్ధమని అక్కడ కోర్టులే చెబుతుండటం విశేషం. ఈమేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. -
స్పెయిన్లో జెండా ఎగురవేసిన నయనతార దంపతులు
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవం’ను నిజం చేస్తూ నయనతార, విఘ్నేష్ శివన్ జంట విదేశాల్లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రేమ, పెళ్లి అంటూ సినీ పరిశ్రమలో సమ్థింగ్ స్పెషల్గా నిలిచిన జంట వీరిది. పెళ్లికి ముందు షూటింగ్లో విరామం దొరికినప్పుడల్లా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవారు. వివాహం తరువాత కూడా ఈ జంట అలాగే ఎంజాయ్ చేస్తోంది. చదవండి: సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! ప్రస్తుతం స్పెయిన్లో సేద తీరుతున్నారు. తరచూ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా స్పెయిన్ దేశం, బార్సిలోనా నగరంలోని ప్రసిద్ధి గాంచిన దేవాలయాన్ని దర్శించి ఆ ఫొటోలను ట్విటర్లో పోస్టు చేశారు. అలాగే 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నయనతార, విఘ్నేష్ శివన్ జంట బార్శిలోనా నగర వీధుల్లో భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి దేశ గొప్పతనాన్ని చాటారు. -
డేవిస్కప్కు నాదల్ దూరం
వచ్చే నెలలో జరిగే ప్రతిష్టాత్మక డేవిస్కప్ టీమ్ టెన్నిస్ టోర్నీ లీగ్ దశ మ్యాచ్ల్లో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ బరిలోకి దిగడం లేదు. తొలి మ్యాచ్లో ప్రపంచ మాజీ నంబర్వన్ జొకోవిచ్ సభ్యుడిగా ఉన్న సెర్బియాతో స్పెయిన్ ఆడుతుంది. అనంతరం కెనడా, కొరియా జట్లతో మ్యాచ్లు ఉంటాయి. మొత్తం నాలుగు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నవంబర్లో స్పెయిన్లో జరిగే నాకౌట్ దశ టోర్నీకి అర్హత సాధిస్తాయి. -
అక్కడ కాస్త ఎండపొడ కనిపించినా చాలు.. పిల్లల్ని తీసుకెళ్లి...
అలవాటు.. ఆచారం.. వ్యవహారం.. ఏదైనా సరే పాటిస్తున్నవారికి సర్వసాధారణమనిపిస్తుంది. ఆ పట్టింపులు.. పాటింపుల్లేని వారికి మాత్రం వింతగా కనిపిస్తుంది. కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. కాలక్షేపాన్నిస్తుంది. అలాంటి సంగతులు కొన్ని.. ఎండల్లో పడక ఫిన్లాండ్లో ఏ కాస్త ఎండపొడ కనిపించినా చాలు.. గబగబా చంటి పిల్లలను స్ట్రాలర్స్లో వేసి తీసుకెళ్లి ఇంటి ముందు వాకిళ్లలో, వాకిళ్లు లేని వాళ్లు పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉంచేసి వాళ్లు ఇళ్లకు వెళ్లిపోతారు. అలా వెచ్చటి ఎండకు ఆ పిల్లలు గంటలు గంటలు ఆదమరచి నిద్రపోతారు. ఇదో ఆచారంగా కొనసాగుతోందట ఆ దేశంలో. కొందరు మోడర్న్ తల్లులు ఇప్పుడు పిల్లలను అలా ఆరుబయట వదిలిపెడుతున్నప్పుడు వాళ్లను చూసుకోవడానికి ఆయాలను పెడుతున్నారట కానీ ఇదివరకైతే పిల్లల దగ్గర ఎవరూ ఉండేవారు కాదట మరి. అలా వదిలేయడమే ఆచారమట. మనసు పవిత్రమవుతుందని.. .. ఎక్కడ? స్పెయిన్లో. ఏం చేస్తే? చంటి పిల్లల మీద నుంచి దూకితే.. చంటి పిల్లల ఆత్మ పరిశుద్ధమవుతుందట. ఎవరు దూకుతారు? అలా దూకడానికి ప్రత్యేక వ్యక్తులు ఉంటారట. వాళ్లు పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న దుస్తులను వేసుకుని ఆరుబయట పడుకోబెట్టిన పిల్లల మీద నుంచి లాంగ్ జంప్ చేస్తారు. అలా చేయడం వల్ల పిల్లలను పట్టుకున్న దుష్టశక్తులు వదిలిపోతాయని.. పిల్లలు పవిత్రమైపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని అక్కడి జనాల నమ్మకమట. చదవండి: Aaron Sanderson King Of Piel Island: రాజయోగం.. ఎలక్ట్రీషియన్ వృత్తి నుంచి ఓ దీవికి రాజుగా..! -
వింతైన ట్రిక్ : ఇంధనం పొదుపు చేయడం కోసం నెక్కి 'టై' ధరించొద్దు!
డబ్బలు వృధాగా ఖర్చుపెట్టకుండా ఉండటం కోసం, కాలుష్య నివారణ కోసం తదితర వాటిన్నంటికి నిపుణులు చిన్న లాజికల్ ట్రిక్లు సూచించడం మాములే. ఇది అందరికి తెలిసిన విషయమే. ఐతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు, ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిదేశం ఈ సంక్షోభం తలెత్తకుండా ఉండేలా తమదైన తరహాలో పద్ధతులను అవలంబిస్తున్నాయి. ఐతే ఈ విషయమై స్పెయిన్ ప్రధాని తమ ప్రజలకు ఒక విభిన్నమైన ట్రిక్ అనుసరించమని సూచించాడు. ఆ ప్రధాని చెప్పిన పరిష్కార మార్గం వింటే చాలా వింతగానూ, అర్థం లేనిదిగానూ అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే...స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తమ దేశ ప్రజలకు ఇంధనాన్ని సాధ్యమైనంత మేర తక్కువగానే వినియోగించుకోవాలంని విజ్ఞప్తి చేశాడు. పైగా వృధాగా ఇంధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండేందుకు ఇలా చేయండి అంటూ ఒక వింతైన ట్రిక్ గురించి చెప్పాడు. ఈ మేరకు ఆయన విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ... ఇంధనాన్ని ఆదా చేసేందుకు నెక్కి 'టై' లు ధరించవద్దని చెప్పాడు. అంతేకాదు ఆయన కూడా ఆ ప్రసంగంలో నెక్కి టై ధరించకుండా ఉన్నాడు. ఇంధనం ఆదా చేయడానికికి నెక్కి టై ధరించకపోవడానికిక సంబంధం ఏమిటో అర్థం కాదు ప్రజలకు. అంతేకాదు తాను కూడా టైం ధరించకపోవడాన్ని గమనించండని చెబుతుంటాడు. అంతేకాదు తన ప్రజలను మంత్రులను దీన్ని అనుసరించాలని కూడా కోరాడు. ఐతే స్పెయిన్ ప్రధాని సాంచెజ్ దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు సమాచారం. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా స్పెయిన్ ప్రజలు ఎయిర్ కండిషనింగ్ పై ఆధారపడుతున్నారు. దీంతో దేశంలో గృహాలకు, వ్యాపార కార్యాలయాలకు అధిక ఇంధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాదు యూటీలిటీ బిల్లులను తగ్గించడంతోపాటు ఇంధనం కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ఈ పొదుపు ప్రణాళిక ట్రిక్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. (చదవండి: భూ వాతావరణంలోకి చైనా రాకెట్ శకలాలు.. వీడియో వైరల్) -
బాలుడి ప్రాణాలు కాపాడిన డ్రోన్
డ్రోన్స్... వీడియో, ఫొటోషూట్స్, వివిధ సరుకుల డెలివరీ చేయడమే కాదు మనుషుల ప్రాణాలనూ కాపాడుతున్నాయి. స్పెయిన్లో ఓ లైఫ్గార్డ్ డ్రోన్ బాలుడి ప్రాణాలు కాపాడింది. వాలెన్సియా బీచ్లో సాధారణ తనిఖీల్లో ఉన్న డ్రోన్ పైలట్ మిగెల్ ఏంజిల్ పెడ్రెరో అలల ధాటికి ఓ బాలుడు కొట్టుకుపోతుండటం గమనించాడు. అది గుర్తించిన పెడ్రెరో వెంటనే డ్రోన్ ద్వారా లైఫ్గార్డ్ వెస్ట్ను కిందికి విసిరాడు. కానీ పెద్ద పెద్ద అలల తాకిడికి అది ఆ అబ్బాయిని చేరడం కష్టమైంది. కొద్ది ప్రయత్నం తరువాత ఎట్టకేలకు వెస్ట్ను అందుకున్న బాలుడు... దాని సహాయంతో కోస్ట్గార్డ్ బోట్ వచ్చేంతవరకూ ప్రాణాలు నిలుపుకోగలిగాడు. అనంతరం బోట్లో వచ్చిన కోస్ట్గార్డ్స్ బాలుడిని అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు. 24 గంటల తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ట్విట్టర్లో ‘అవర్ వరల్డ్’పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. -
రూ.13 కోట్లు విలువైన ‘వైన్’ చోరీ.. మెక్సికన్ బ్యూటీ క్వీన్ జంట అరెస్ట్!
మాడ్రిడ్: అత్యంత విలువైన పాతకాలపు వైన్ బాటిళ్ల చోరీని తొమ్మిది నెలల తర్వాత ఛేదించారు పోలీసులు. 1.7 మిలియన్ డాలర్లు(సుమారు రూ.13.57 కోట్లు) విలువైన ప్రఖ్యాత వైన్ బాటిళ్ల చోరీ కేసులో మాజీ మెక్సికన్ బ్యూటీ క్వీన్, రోమానియా డచ్ వ్యక్తిని పోలీసులు క్రోయేషియాలో అరెస్ట్ చేశారు. ఈ విలువైన మద్యం బాటిళ్లు 9 నెలల క్రితం స్పెయిన్లో మాయమయ్యాయి. దొంగలను పట్టుకునేందుకు యూరప్ మొత్తం జల్లెడపట్టినట్లు చెప్పారు పోలీసులు. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది స్పెయిన్ జాతీయ పోలీసు విభాగం. ‘2021, అక్టోబర్ 21న పశ్చిమ నగరం కేసర్స్లో 1.65 మిలియన్ యూరోలు విలువ కలిగిన 45 వైన్ బాటిళ్లు చోరీకి గురయ్యాయి. అందులో 19వ శతాబ్దానికి చెందిన ఓ ప్రత్యేకమైన బాటిల్ సైతం ఉంది. దాని విలువ 3.10 లక్షల యూరోలు. వాటిని ప్రముఖ హోటల్ రెస్టారెంట్ ఈఐ అట్రియోలోని సెల్లార్ నుంచి పక్కా ప్రణాళికతో ఎత్తుకెళ్లారు.’ అని తెలిపారు. పోలీసుల ప్రకటన ప్రకారం.. స్పానిష్ డైలీ ఈఐ పైస్కు చెందిన 29 ఏళ్ల మెక్సికన్ యువతి.. అట్రియోలోని వెయిటర్స్ను రూమ్ సర్వీస్ అంటూ దారి మళ్లించింది. ఆ సమయంలోనే ఆమెతో ఉన్న 47 ఏళ్ల వ్యక్తి వైన్ బాటిళ్లు ఉన్న సెల్లార్లోకి వెళ్లాడు. తన వద్ద ఉన్న మాస్టర్ కీతో బాక్సులను తెరిచి మూడు బ్యాగుల్లో నింపాడు. వాటిని టవల్స్లో చుట్టారు. ఆ మరుసటి రోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో బ్యాగులతో సెక్యూరిటీని తప్పించుకుని హోటల్ నుంచి వెళ్లిపోయారు. హోటల్లోని సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు నమోదయ్యాయి. ప్రాథమికంగా ఓ గ్యాంగ్ పక్కా ప్రణాళికతో చేసినట్లు పోలీసులు భావించారు. ఈ చోరీ జరగక ముందు ఇరువురు మూడు సార్లు అట్రియో హోటల్కి వచ్చారు. అందరిలాగే వారికి సైతం వైన్ బాటిళ్లు ఉన్న సెల్లార్ను చూపించారు హోటల్ సిబ్బంది. చోరీకి గురైన వాటిలో 200 ఏళ్ల నాటి బాటిల్.. చోరీకి గురైన వాటిలో 1806 నాటికి చెందిన ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ బోర్డియాక్స్ యక్వెమ్ బాటిల్ ఉంది. దాని విలువ భారీగా ఉంటుందని ఎల్ అట్రియో సహ యజమాని సొమెలియర్ జోస్ పోలో చెప్పారు.‘ఆ బాటిల్ నా వ్యక్తిగత చరిత్రలో భాగం. ఆ బాటిల్ అట్రియో, కేసర్స్, ఇక్కడి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైన్ ప్రేమికుల చరిత్రలో ఒకటి.’ అని పోలో పేర్కొన్నారు. చోరీ చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే దొంగలిద్దరు స్పెయిన్ దాటి వెళ్లారు. నెలల తరబడి వారికోసం యూరప్ మొత్తం గాలింపు చేపట్టారు పోలీసులు. ఇటీవలే మొంటెనెగ్రో నుంచి సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా పట్టుబడ్డారు. వారిని పట్టుకునేందుకు నెదర్లాండ్స్, క్రొయేషియా, రొమానియా పోలీసులతో పాటు ఇంటర్పోల్ సాయం కూడా తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసినప్పటికీ చోరీకి గురైన వైన్ మాత్రం తిరిగి స్వాధీనం చేసుకోలేదు. ఇదీ చదవండి: బాప్రే!.. ఆ జంట దొంగలించిన వైన్ బాటిల్స్ ఖరీదు రూ.3 కోట్లా! -
World Cup 2022: అసలైన మ్యాచ్లలో చేతులెత్తేశారు! జపాన్తో పోరులో..
టెరసా (స్పెయిన్): అసలైన మ్యాచ్ల్లో గెలుపొందలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు వర్గీకరణ పోటీల్లో వరుస విజయాలు సాధించి ప్రపంచకప్లో తొమ్మిదో స్థానంతో ముగించింది. బుధవారం 9 నుంచి 12 స్థానాల కోసం జరిగిన మ్యాచ్లో భారత్ 3–1తో జపాన్పై విజయం సాధించింది. ఫార్వర్డ్ ప్లేయర్ నవ్నీత్ కౌర్ (30వ, 45వ ని.) రెండు ఫీల్డ్ గోల్స్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. జట్టులో మరో గోల్ను దీప్ గ్రేస్ ఎక్కా పెనాల్టీ కార్నర్ ద్వారా (38వ నిమిషం) సాధించింది. జపాన్ జట్టులో నమోదైన ఏకైక గోల్ను యు అసయ్ 20వ నిమిషంలో చేసింది. జపాన్కు లభించిన పెనాల్టీ కార్నర్ను యు అసయ్ పొరపాటు చేయకుండా గోల్పోస్ట్ లోకి పంపడంతో 1–0తో మ్యాచ్లో పైచేయి సాధించింది. భారత శిబిరంలో ఒత్తిడి నెలకొన్నప్పటికీ మూడో క్వార్టర్లో దీప్ గ్రేస్, నవ్నీత్ గోల్స్తో భారత్ తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. చదవండి: ICC World Cup Super League: వన్డే సిరీస్ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా? -
క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం స్పెయిన్తో భారత్ పోరు
ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నీలో ఆదివారం జరిగే ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్లో స్పెయిన్తో భారత్ ఆడుతుంది. గెలిచిన జట్టు క్వార్టర్ ఫైనల్ చేరుతుంది. న్యూజిలాండ్తో జరిగిన పూల్ ‘బి’ మ్యాచ్లో సవితా పూనియా కెప్టెన్సీలోని టీమిండియా 3–4తో ఓడిపోయింది. అయితే ఇంగ్లండ్ జట్టు చేతిలో చైనా కూడా ఓడిపోవడం భారత్కు కలిసొచ్చింది. భారత్, చైనా రెండు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన గోల్స్ అంతరంతో భారత్ మూడో స్థానంలో నిలిచి ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్కు అర్హత సాధించింది. -
ప్రపంచానికి ప్రమాద ఘంటికలు.. ‘నాటో’ విస్తరణకై తీవ్ర ప్రమాదకర నిర్ణయాలు!
స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో జూన్ 28 నుండి 30 వరకూ ‘నాటో’ సదస్సు జరిగింది. ఇందులో నాటో మిలిటరీ కూటమి విస్తరణౖకై తీవ్ర ప్రమాదకర నిర్ణయాలు వెలువడ్డాయి. ఐరోపాలో నాటో సైనికుల సంఖ్యను పెంచడంతోపాటు, ఆ కూట మిని మొదటిసారిగా ఆసియా పసిఫిక్ ప్రాంత దేశా లలో విస్తరించే ప్రణాళికలు తయారైనాయి. ప్రస్తుతం యూరప్ లోనున్న 40 వేల సంసిద్ధతా దళాలను ఒకే సారి 3 లక్షల వరకూ పెంచుతామనీ, లెక్కలేనన్ని యుద్ధ ట్యాంకులను, విమానాలను రష్యా సరిహద్దుకు పంపిస్తామనీ; రష్యా, చైనాలతో నూతన వ్యూహాత్మక పోటీకి దిగుతామనీ నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్ బర్గ్ అన్నాడు. లాత్వియా, లిథువేనియా, ఎస్తోనియా దేశాల్లో ఉన్న సైనిక శిబిరాలకు బ్రిగేడ్ హోదా కల్పిస్తా మనీ నాటో అంటోంది. నార్డిక్ తటస్థ దేశాలైన నార్వే, స్వీడన్లను తన పరిధిలోకి నాటో ఆహ్వానించటంతో దశాబ్దాల యూరప్ భద్రత ప్రశ్నార్థకమయింది. ‘‘ఈ దేశాల్లో మిలిటరీ మౌలిక సదుపాయాలతో నాటో స్థావరాలను మోహరిస్తే అందుకు దీటుగా మా ప్రతిస్పందన ఉంటుం’’దని పుతిన్ అన్నాడు. ఉక్రె యిన్ను అడ్డం పెట్టుకొని రష్యాతో పరోక్ష యుద్ధం చేస్తూ, శాంతి చర్చలు కాదని యూరప్ కల్లోలానికి కారణమైన నాటో కూటమి యూరప్లో భారీగా మిలి టరీ మోహరింపునకు సన్నద్ధం అవుతూనే, ‘‘మా భద్రతకు, మా ఆసక్తులకు, విలువలకు చైనా విసిరే సవాళ్ళను స్వీకరించటానికి ఆసియా పసిఫిక్ దేశాలకు కూడా నాటోను వ్యాప్తి చేస్తాం’’ అని నాటో ప్రధాన కార్యదర్శి అన్నాడు. చదవండి👉లుహాన్స్క్లో జెండా పాతేశాం: పుతిన్ చైనా సరిహద్దుల వరకు వెళ్ళటం తమ విధానాలలో వచ్చిన మార్పు అని చెప్పుకొచ్చాడు. రష్యాపై దాడి చేయటానికి అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి పాశ్చాత్య నాటో దేశాల కాల్బలంతో పాటు... ఆయా దేశాల నౌకలు, యుద్ధ విమానాలతో మూకుమ్మడి దాడిని గంటల వ్యవధిలో చేస్తాయని స్టోల్టెన్బర్గ్ యుద్ధోన్మాదాన్ని బయటపెట్టాడు. నాటో కూటమి రష్యాతో యుద్ధంలో పాల్గొనదని అధ్యక్షుడు బైడెన్ చాలాసార్లు చెప్పినా... ఆచరణలో ఉక్రెయిన్ మిలిటరీ ముసుగున అనేకమంది నాటో సైని కులు, సలహాదారులు, శిక్షణలు ఇచ్చే జనరల్స్ను ఉక్రెయిన్కు నాటో పంపింది. రష్యాకు చెందిన వందల కోట్ల డాలర్లను విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసి, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటానికి కంకణం కట్టుకొన్న పశ్చిమ దేశాలు, 1918 తర్వాత మొదటిసారిగా రష్యా చెల్లించవల్సిన వాయిదాను తీర్చలేని స్థితికి తీసుకు రాగలిగాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా పాల్గొంటున్న నాటో ఇప్పటివరకూ విజయాలను సాధించలేకపోయింది. తూర్పు డోనబాస్ ప్రాంత మంతా రష్యా ఆధీనంలోకి రావటంతోపాటు, నల్ల సముద్ర తీర ప్రాంతాలు 90 శాతం రష్యా సేనలు ఆక్ర మించడం గమనార్హం. రష్యా–ఉక్రెయిన్ వివాదం ద్వారా నాటో యుద్ధ కూటమి ఐక్యంగా బయటకు కనబడటానికి ప్రయత్ని స్తోంది. కానీ అంతరంగాన నాటో సభ్యదేశాల మధ్య లుకలుకలున్నాయి, చర్చల ద్వారా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని ఒత్తిడి వస్తోంది. ప్రపంచం మొత్తంలో రెండంకెలు దాటిన ద్రవ్యోల్బణంతో పాటు రికార్డు స్థాయిలో నిరుద్యోగం, ధరలు పెరుగు తున్నాయి. అమెరికా, చైనా కూటములకు తటస్థంగా భారత్ ఉండి అలీనోద్యమ పూర్వ వైభవానికి కృషి చేస్తే... ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు అగ్రరాజ్యాల ఆధిపత్య ధోరణుల నుండి కాపాడుకొనే అవకాశాలుంటాయి. ఆంక్షల ఫలితంగా యూరప్ ఇంధన సమస్య తీవ్ర స్థాయికి చేరుకొంది. తొందరలోనే ప్రపంచ ఆర్థిక మాంద్యం సంభవించ వచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నాటో విస్తరణ ఏ పరిస్థితులకు దారి తీస్తుంది? చదవండి👉ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అదే జరిగితే అధ్యక్ష పోటీ ఆశలు గల్లంతు వ్యాసకర్త: బుడ్డిగ జమిందార్, కె.ఎల్. యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ‘ మొబైల్: 98494 91969 -
మహిళల ప్రపంచకప్ హాకీకి సర్వం సిద్దం
టెరసా (స్పెయిన్): మహిళల ప్రపంచకప్ హాకీకి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 17 రోజుల పాటు అమ్మాయిలు స్టిక్స్తో అలరించనున్నారు. స్పెయిన్, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచకప్ను ముద్దాడాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. నేడు జరిగే మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్లో స్పెయిన్తో కెనడా తలపడుతుంది. భారత అమ్మాయిల జట్టు ఆదివారం తమ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ను ఢీకొంటుంది. డిఫెండింగ్ చాంపియన్, టోర్నీ హాట్ ఫేవరెట్ నెదర్లాండ్స్ మరోసారి హ్యాట్రిక్ టైటిళ్లపై కన్నేసింది. 2014, 2018లో విజేతగా నిలిచిన డచ్ అమ్మాయిలు 1983, 1986, 1990లలో హ్యాట్రిక్ టైటిల్స్ గెలిచారు. ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యమవని రీతిలో 8 టైటిల్స్ను నెదర్లాండ్స్ కైవసం చేసుకుంది. భారత మహిళలు గత టోక్యో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో ప్రపంచకప్లోనూ రాణించాలనే పట్టుదలతో ఉన్నారు. 48 ఏళ్ల అమ్మాయిల ప్రపంచకప్ హాకీ చరిత్రలో భారత్ మెరుగైన ప్రదర్శన ‘నాలుగో స్థానం’. మెగా ఈవెంట్ ఆరంభమైన 1974లో కాంస్య పతక పోరులో వెస్ట్ జర్మనీ చేతిలో ఓడింది. ఆ తర్వాత మళ్లీ పతక పోటీలో ఏనాడు నిలువలేకపోయింది. 4 పూల్స్... 16 జట్లు... పూల్–ఎ: నెదర్లాండ్స్, జర్మనీ, ఐర్లాండ్, చిలీ. పూల్–బి: భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, చైనా. పూల్–సి: స్పెయిన్, అర్జెంటీనా, దక్షిణ కొరియా, కెనడా. పూల్–డి: ఆస్ట్రేలియా, బెల్జియం, జపాన్, దక్షిణాఫ్రికా. చదవండి: SL-W vs IND-W: శ్రీలంకతో భారత్ తొలి పోరు.. -
నాటో భద్రతకు రష్యాతో ముప్పు
మాడ్రిడ్ (స్పెయిన్): నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గజేషన్ (నాటో) సభ్య దేశాల శాంతిభద్రతలకు రష్యా నేరుగా ముప్పుగా పరిణమించిందని అమెరికా సహా పలు దేశాలు ఆందోళన వెలిబుచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద భద్రతా ముప్పుని ఎదుర్కొంటున్నామన్నాయి. యూరప్లో ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత కుదుర్చుకున్న భద్రతాపరమైన ఒప్పందాలను రష్యా తుంగలోకి తొక్కి ఉక్రెయిన్పై దండెత్తిందని ధ్వజమెత్తాయి. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో బుధవారం నాటో సభ్య దేశాల వార్షిక సదస్సు జరిగింది. అనంతరం 30 దేశాల నాటో కూటమి ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు రాజకీయంగా, ఆచరణీయంగా మద్దతిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యూరప్లో శాంతిని విచ్ఛిన్నం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోటెన్బెర్గ్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో సభ్య దేశాలకు భద్రతాపరంగా పెను సవాళ్లు విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలండ్లో శాశ్వత సైనిక కేంద్రం యూరప్కు మరిన్ని అమెరికా బలగాలను తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ప్రాంతీయ భద్రత కోసం పోలండ్లో తొలి శాశ్వత మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమెరికాకు చెందిన లక్ష బలగాలు నిరంతరం యూరప్లో ఉండేలా చూస్తామన్నారు. -
కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్స్టాగ్రామ్లోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రొనాల్డోకు కార్లంటే యమా క్రేజ్. తన ఇంట్లోనే దాదాపు అన్ని మోడల్స్కు సంబంధించిన కార్లను కలెక్షన్గా కలిగి ఉన్నాడు. తాజాగా రొనాల్డోకు సంబంధించిన కోట్ల విలువైన కారు అయింది. 1.8 యూరో మిలియన్(భారత కరెన్సీలో దాదాపు రూ. 14 కోట్ల 87 లక్షలు) డాలర్ల విలువ కలిగిన బుగట్టి వెయ్రోన్ సూపర్ కార్ మేజర్ యాక్సిడెంట్కు గురయ్యింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. సోమవారం స్పెయిన్లోని రొనాల్డో నివాసం ముందే కారు ప్రమాదం జరిగినట్లు తెలిసింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు మొదట రొనాల్డో కారులోనే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఫుట్బాల్ స్టార్ ప్రస్తుతం హాలిడే గడపడానికి తన ఫ్యామిలితో కలిసి ఒక ఐలాండ్లో ఉన్నట్లు తెలిసింది. కాగా రొనాల్డో కారును తన డ్రైవర్ తీసుకెళ్లాడని.. కారును కంట్రోల్ చేయడంలో పట్టు కోల్పోవడంతో రొనాల్డో ఇంటి ముందు ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న డ్రైవర్కు ఎలాంటి గాయాలు కానప్పటికి.. కారు ముందు భాగం మాత్రం బాగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు కారును ఆటోగ్యారెజ్కు తరలించారు. ఏ ఇతర వాహనము కారును యాక్సిడెంట్ చేయలేదని.. డ్రైవర్ తనంతట తానుగానే పట్టు తప్పడంతో కారుకు యాక్సిడెంట్ అయిందని పేర్కొనడంతో అతనిపై కేసు నమోదు చేశారు. కాగా రొనాల్డో ఎంతో ఇష్టపడి కొనుకున్న కారు రిపేరుకు సంబంధించిన బిల్ పెద్దదిగానే ఉండనుందని అభిమానులు కామెంట్స్ చేశారు. Cristiano Ronaldo 's Bugatti Veyron suffered an accident on Monday morning in Mallorca. Apparently Cristiano was not inside the vehicle. [@UHmallorca] #mufc pic.twitter.com/WtG5crWWsd — The United Stand (@UnitedStandMUFC) June 20, 2022 చదవండి: Neeraj Chopra: భారత్ స్టార్ నీరజ్ చోప్రాకు తప్పిన పెను ప్రమాదం -
14వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రాఫెల్ నాదల్ (ఫోటోలు)