Foreign Tours
-
మోదీ విదేశీ పర్యటన.. విమానానికి బెదిరింపులు..
ముంబై: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో, రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఫోన్ చేసిన వ్యక్తిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా ఫేక్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటన సందర్భంగా బెదిరింపు కాల్ రావడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబై కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని వారు బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఈ సమాచారాన్ని భద్రత అధికారులకు చేరవేశారు. దీంతో, అలర్ట్ అయ్యారు. అనంతరం, ఫోన్ కాల్ చేసిన వ్యక్తని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో అతడి మానసిక స్థితి సరిగాలేదని నిర్ధారించారు. ఇక, ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.ఇదిలా ఉండగా.. భారత ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన ఫ్రాన్స్, అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే మోదీ.. ఫ్రాన్స్లో పర్యటించి ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, అమెరికాలో పర్యటనలో భాగంగా మోదీ నేడు వాషింగ్టన్ చేరుకోనున్నారు. రేపు(గురువారం) అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మోదీ భేటీ కానున్నారు. On 11th February, a call was received at Mumbai Police Control Room warning that terrorists may attack PM Modi's aircraft as he was leaving on an official visit abroad. Considering the serious nature of the information, the Police informed other agencies and began an…— ANI (@ANI) February 12, 2025 -
10న ఫ్రాన్స్కు.. 12న అమెరికాకు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)విదేశీ పర్యటన(foreign tour) ఖరారయ్యింది. ఆయన ఈ నెల 10 నుంచి 12వ తేదీ దాకా ఫ్రాన్స్లో(France)12, 13వ తేదీల్లో అమెరికాలో(America) పర్యటిస్తారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్తో కలిసి కృత్రిమ మేధ(ఏఐ) కార్యాచరణ సదస్సులో మోదీ పాల్గొంటారని చెప్పారు. అలాగే ఇండియా–ఫ్రాన్స్ సీఈఓల సదస్సుకు హాజరవుతారని అన్నారు. ఫ్రాన్స్లోని ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పరిమెంటల్ రియాక్టర్ను మోదీ సందర్శిస్తారని వెల్లడించారు.అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి సమావేశమవుతారని పేర్కొన్నారు. మోదీ పర్యటనతో భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని తెలియజేశారు. ఇరుదేశాల మధ్య పరస్పర సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలు, కీలక రంగాల్లో భాగస్వామ్యంపై మోదీ, ట్రంప్ చర్చిస్తారని వివరించారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కొలువుదీరిన మూడు వారాల్లోపే నరేంద్ర మోదీకి ఆహ్వానం అందిందని అన్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా ట్రంప్ ప్రభుత్వం ఆయనను ఆహ్వానించిందని చెప్పారు. ఇండియాతో భాగస్వామ్యానికి అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదొక ప్రతీక అని విక్రమ్ మిస్త్రీ వివరించారు. ట్రంప్ను ఒప్పిస్తారా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా అమెరికాలో అడుగుపెట్టబోతున్నారు. వారిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదార్లను వెనక్కి పంపిస్తున్న సమయంలో మోదీ, ట్రంప్ సమావేశం కాబోతున్నారు. భారత్–అమెరికా మధ్య వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై వారు విస్తృతంగా చర్చించబోతున్నట్లు సమాచారం. ఇరు దేశాల నడుమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇంధన భద్రత, కృత్రిమ మేధ(ఐఏ) వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకొనేలా నిర్ణయం తీసుకోవచ్చు. అక్రమ వలసదార్ల సమస్యను పరిష్కరించే విషయంలో ట్రంప్ ప్రభుత్వం చురుగ్గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. మోదీతో భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే వీలుంది. భారతీయ అక్రమ వలసదార్లపై కఠినంగా వ్యవహరించకుండా మోదీ తన మిత్రుడైన ట్రంప్ను ఒప్పిస్తారా? అనేది వేచి చూడాలి. అమెరికాలో ఎలాన్ మస్క్ సహా ప్రముఖ వ్యాపారవేత్తలతో మోదీ సమావేశం కానున్నారు. ట్రంప్ ప్రియమిత్రుడు..మోదీ గొప్ప నాయకుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో మాట్లాడిన అతికొద్ది మంది ప్రపంచ దేశాల నేతల్లో మోదీ కూడా ఉన్నారు. గతవారం కూడా ఇరువురు నేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. వలసలు, భద్రత, వాణిజ్య సంబంధాలపై వారు చర్చించుకున్నారు. ట్రంప్, మోదీ మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని వైట్హౌస్ ప్రకటించింది. ట్రంప్తో మోదీకి చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ తనకు ప్రియమిత్రుడు అని మోదీ చెబుతుంటారు. మోదీ గొప్ప నాయకుడు అని ట్రంప్ సైతం ప్రశంసించారు. అయితే, ఇండియాలో అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు అధికంగా విధిస్తున్నారని ట్రంప్ ఆక్షేపించారు. ఇండియాను టారిఫ్ కింగ్గా అభివరి్ణంచారు. గత వారం భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం కనిపించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల మోటార్ సైకిళ్లతోపాటు పలు ఉత్పత్తులపై టారిఫ్ను ప్రభుత్వం రద్దు చేసింది. మోదీ చివరిసారిగా 2024 సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించారు. క్వాడ్ దేశాల అధినేతల సదస్సులో పాల్గొన్నారు. -
ఎంత ఖర్చయినా ఓకే.. ప్రపంచాన్ని చుట్టేద్దాం!
సాక్షి, అమరావతి: ప్రపంచ పర్యాటక రంగ పునర్నిర్మాణంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విదేశీ గమ్యస్థానాలను అన్వేషించడంలో ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ ఉత్సాహం కనబరుస్తున్నారు. ఎంత ఖర్చయినా.. ప్రపంచాన్ని చుట్టేసేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో భారత పర్యాటకులను ఆకర్షించడానికి ప్రపంచ దేశాలు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. వీసా లేకుండానే తమ దేశాల్లో పర్యటించే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. ఖర్చుకు వెనుకాడట్లేదు..కరోనా అనంతర పరిస్థితుల్లో భారతీయుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని అంతర్జాతీయ టూరిస్ట్ ట్రావెల్స్ సంస్థలు చెబుతున్నాయి. విదేశాల్లో పర్యటించేందుకు.. కొత్త అనుభూతి పొందేందుకు భారతీయులు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడట్లేదని పేర్కొంటున్నాయి. భారత పర్యాటకుడు ఒక్కో అంతర్జాతీయ పర్యటనకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపాయి. ఈ ఖర్చు క్రమంగా పెరుగుతోందని వెల్లడించాయి.కాగా, 2023లో 2.82 లక్షల మంది విదేశాలకు ప్రయాణించడం ద్వారా రూ.2.60 లక్షల కోట్లు ఖర్చు చేశారని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ తెలిపింది. దేశంలో అవుట్బౌండ్ ట్రావెల్ మార్కెట్లో గణనీయమైన పెరుగుదల నమోదవుతోందని.. 2034 నాటికి రూ.4.78 లక్షల కోట్లకు పైగా పెరుగుతుందని అంచనా వేస్తోంది. అలాగే భవిష్యత్లో అవుట్ బౌండ్ పర్యాటకులు 8 కోట్లకు చేరుకుంటారని.. ముఖ్యంగా ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం దేశాలకు ప్రాధాన్యం పెరుగుతుందని భావిస్తోంది. ఇది భారత పర్యాటకుల విలాసవంతమైన జీవనశైలి అభివృద్ధిని సూచిస్తోందని, పెరుగుతున్న ఆదాయ మార్గాలు కూడా సరిహద్దుల దాటి ప్రయాణాలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయని అభిప్రాయపడింది.మెరుగైన ఆతిథ్యం..భారత పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ దేశాలు ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నాయి. థాయిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఎంట్రీ ప్రోటోకాల్లను సరళీకృతం చేశాయి. యూఏఈ, టర్కీ తదితర దేశాలు భారతదేశంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. అలాగే పలు దేశాలు అంతరాయం లేని కనెక్టివిటీ, అవాంతరాలు లేని వీసా ప్రక్రియలను అందజేస్తున్నాయి. యూరప్, ఉత్తర అమెరికాకు వీసాల కోసం ఎక్కువ నిరీక్షించాల్సి రావడంతో.. భారత పర్యాటకులు ఎక్కువగా మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలకు తరలి వెళ్తున్నారు.అలాగే భారత పర్యాటకుల కోసం హాస్పిటాలిటీ దిగ్గజ సంస్థలు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అకార్, హిల్టన్, ఐహెచ్జీ వంటి హాస్పిటాలిటీ సంస్థలు తమ చైన్లను ప్రధాన నగరాల నుంచి టైర్ 2, 3 పట్టణాల్లోనూ ఏర్పాటు చేస్తున్నాయి. విమానయాన సంస్థలు కూడా దేశీయ, అంతర్జాతీయ సామర్థ్యాలను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. -
‘సింగపూర్’ స్కిల్స్
ఒప్పందంతో లాభం ఇలా..⇒ ఐటీఈ పాఠాలను స్కిల్స్ వర్సిటీలో బోధిస్తారు. ⇒ టెన్త్ విద్యార్థులు మొదలుకుని చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో ఉద్యోగ నైపుణ్యాలపై సింగపూర్ సంస్థ శిక్షణనిస్తుంది. ⇒ ‘స్కిల్స్ ఫర్ ఫ్యూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’అనే నినాదంతో పనిచేస్తున్న ఐటీఈకి 5 వేల పరిశ్రమలతో భాగస్వామ్య ఒప్పందాలు ఉండగా, ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. ⇒ ప్రస్తుత ఒప్పందంతో స్కిల్స్ వర్సిటీలో వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్లైన్తో పాటు క్యాంపస్ శిక్షణ దొరుకుతుంది. పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి( Revanth Reddy) నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం కీలక ఒప్పందం చేసుకుంది. నైపుణ్య అభివృద్ధిలో పరస్పర సహకారం, శిక్షణకు సంబంధించి.. సింగపూర్ ప్రభుత్వ విద్యాసంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ), రాష్ట్రానికి చెందిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీల మధ్య ఈ పరస్పర అవగాహన (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్స్ యూనివర్సిటీలో బోధించనున్నారు. శుక్రవారం సింగపూర్కు చేరుకున్న రేవంత్రెడ్డి( Revanth Reddy) నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్ టీమ్’కు అక్కడి ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, స్కిల్స్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వీఎల్విఎస్ఎస్ సుబ్బారావుతో కూడిన ప్రతినిధి బృందం ఐటీఈ ప్రాంగణాన్ని సందర్శించింది. కోర్సులు, సదుపాయాల పరిశీలన ఐటీఈ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కోర్సులు, అధునాతన సదుపాయాలను రాష్ట్ర బృందం పరిశీలించింది. అక్కడ శిక్షణ ఇస్తున్న సుమారు 20 రంగాలకు చెందిన నిపుణులు, సంస్థ సిబ్బందితో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలోని స్కిల్స్ యూనివర్సిటీకి సహకరించాలని ఐటీఈ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కోరారు. వర్సిటీ ద్వారా వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పిం చేందుకు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా నిర్వహిస్తున్న కోర్సులను మంత్రి శ్రీధర్బాబు వివరించారు. చర్చల అనంతరం ఐటీఈ, స్కిల్స్ యూనివర్సిటీల మధ్య ఎంఓయూ కుదిరింది. ఒప్పంద పత్రాలపై స్కిల్స్ వర్సిటీ వీసీ సుబ్బారావు, ఐటీఈ అకడమిక్, అడ్మిన్ సర్విసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్, ఐటీ ఎడ్యుకేషన్ సర్విసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ సంతకాలు చేశారు. సింగపూర్ విదేశాంగ మంత్రితో భేటీ ఐటీఈతో భాగస్వామ్యం.. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పునరుత్పాదక వనరులు, పర్యాటకం, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో దీర్ఘకాలిక సహకారానికి మార్గం సుగమం చేస్తుందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలో హైదరాబాద్ను సందర్శిస్తుందని అధికారులు ప్రకటించారు. పర్యటనలో భాగంగా సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సీఎం రేవంత్రెడ్డి( Revanth Reddy), మంత్రి శ్రీధర్బాబు బృందం భేటీ అయ్యింది. -
సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 13 నుంచి 23వ తేదీ వరకు సీఎం విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తన పాస్పోర్టును ఏసీబీ కోర్టుకు అప్పగించిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉందని, ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టును రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. ఇందుకు ఆరు నెలల పాటు తన పాస్పోర్టు ఇవ్వాలని కోర్టును రేవంత్ రెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. జులై 6వ తేదీలోగా పాస్పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది. -
సీఎం రేవంత్ విదేశీ పర్యటన
-
Nara Lokesh: గుట్టుచప్పుడు కాకుండా మూడోసారి..!
విజయవాడ, సాక్షి: నారా లోకేష్ బాబు మరోసారి విదేశీ టూర్కు చెక్కేశారు. అదీ అత్యంత గోప్యంగా..! రెండ్రోజుల కిందటే ఆయన దేశం వదిలి వెళ్లారని, అందుకే కేబినెట్ సమావేశాన్ని సైతం చంద్రబాబు అర్దంతరంగా వాయిదా వేశారని తెలుస్తోంది. అయితే లోకేశ్ ఎక్కడికి వెళ్లారు? ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పర్యటన అంత గోప్యంగా జరగాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలకు మాత్రం టీడీపీ వర్గాల నుంచి సమాధానం వినిపించడం లేదు. కాకపోతే ఆ పార్టీ కార్యకర్తలు, నేతల మధ్య చర్చలు మాత్రం చాలా జోరుగా సాగుతున్నాయి.చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ ఏడాదిలో విదేశాలకు వెళ్లడం ఇది మూడోసారి. జనవరిలో సంక్రాంతి తర్వాత ఆయన చాలారోజులపాటు మీడియాకు కనిపించలేదు. చివరకు.. పుట్టినరోజు కూడా ఆయన హడావిడి లేకపోవడంతో ‘ఏం జరిగిందా?’ అని టీడీపీ కేడర్ గుసగుసలాడుకుంది. సరిగ్గా.. ఆ టైంలోనే అమెరికాలో ఆయన ఏకంగా అరెస్ట్ అయ్యారంటూ కొన్ని వదంతులు వినిపించాయి. ఆసక్తికరంగా ఈ వదంతులను అటు చినబాబు కానీ ఇటు టీడీపీ కానీ ఖండించలేదు. ఆ తర్వాత కూడా కొంత కాలం తరువాత కానీ అంటే ఎన్నికల ప్రచార సమయంలో కానీ ఆయన తెరపైకి వచ్చారు.ఇక రెండోసారి.. ఎన్నికలయ్యాక నారావారి ఫ్యామిలీ ఫారిన్ టూర్ పేరిట ఎటో వెళ్లింది. అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ఇద్దరూ స్వల్ప వ్యవధి తేడాతోో విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లారని టీడీపీ నేతలు ప్రచారం చేసినప్పటికీ.. అక్కడి పార్టీ ప్రతినిధులు మాత్రం ఆయన రాక గురించి సమాచారం లేదనే చెప్పారు. మరోవైపు.. లోకేష్ ఎక్కడికి వెళ్లారనే దానిపై కూడా కచ్చితమైన సమాచారం లేకుండా పోయింది. కట్ చేస్తే.. అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనల గురించి పక్కా సమాచారం ఉంటుంది. వైఎస్సార్సీపీ సైతం ఆ వివరాలను ఫొటోలు, వీడియోలతో సహా వీలైతే పత్రికా ప్రకటన లేదంటే సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తుంది. అయినా కూడా టీడీపీ అనుకూల మీడియా ఆ పర్యటనల గురించి ‘అతి’ కథనాలు వండి వార్చేవి. కానీ, చంద్రబాబు అండ్ లోకేష్ పర్యటనల విషయంలో మాత్రం విపరీతమైన గోప్యత ప్రదర్శిస్తూ వస్తున్నాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను రిగ్గింగ్ చేసి నెగ్గారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రి పదవి చేపట్టిన నెలన్నరలొనే మళ్ళీ లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్లారు. దీంతో.. ఈ రహస్య పర్యటనలను వైఎస్సార్సీపీ ఆయుధంగా చేసుకునే అవకాశం లేకపోలేదు. ఇందుకోసమైనా.. వ్యక్తిగతమైనప్పటికీ లోకేష్ విదేశీ పర్యటనల కనీస వివరాలు వెల్లడించాలని టీడీపీ కీలక నేతలు అధినేత చంద్రబాబును కోరాలని భావిస్తున్నారట. ఒకవేళ లోకేష్ ఫారిన్ టూర్ రాష్ట్ర అభివృద్ధి కోసమో లేదంటే ఒప్పందాలు కోసమో అయ్యి ఉంటే అది ఆయనకు మైలేజ్.. పార్టీకి మంచి చేస్తుంది కదా చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా లోకేష్ తన టూర్పై క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు వాళ్లు. -
మూడోటర్ము.. మోదీ తొలి విదేశీ టూర్ ఇటలీకి..!
న్యూఢిల్లీ: ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారైనట్లు సమాచారం. జూన్ 13 నుంచి 15 వరకు జరిగే జీ7 సమావేశాల కోసం మోదీ ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘జీ7 సమావేశాలకు రావాల్సిందిగా ఇటలీ ప్రధాని మంత్రి జార్జియా మెలోని గురువారం(జూన్6) ఫోన్లో మోదీని ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి మోదీ ఓకే అన్నారు. తనను ఆహ్వానించినందుకు మెలోనికి మోదీ కృతజ్ఞతలు చెప్పారు’అని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణమార్పులు, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల ప్రభావం తదితర అంశాలపై జీ7 సదస్సులో చర్చించనున్నారు. కెనడా, ఫ్రాన్స్,జర్మనీ, ఇటలీ,జపాన్, యూకే,అమెరికా జీ7 కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. జీ7 సదస్సు సైడ్లైన్స్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మోదీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. -
తండ్రీ కొడుకుల రహస్య విదేశీ పర్యటన
-
ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన
కృష్ణా, సాక్షి: ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర సీఎం జగన్కు ఘన స్వాగతం లభించింది. ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్కు స్వాగతం పలికారు. పార్టీ కేడర్ పెద్ద ఎత్తున తరలివచ్చింది. అక్కడి నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. 👉ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండిఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్ దేశాల్లో కుటుంబసమేతంగా ఆయన పర్యటించారు. పదిహేను రోజుల తర్వాత తిరిగి ఇవాళ స్వదేశానికి విచ్చేశారు. జూన్ 4వ తేదీన ఏపీకి జడ్జిమెంట్ డే. ఈ నేపథ్యంలో నేడో, రేపో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్సార్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. -
రహస్యంగా 12 రోజుల టూర్..అసలు నిజం ఇదేనా ?
-
టీడీపీ సైలెన్స్.. దేనికి సంకేతం?
ఎన్టీఆర్, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ?. విదేశీ పర్యటన పేరుతో ఆయన ఎక్కడికి వెళ్లారసలు?. ఎన్నికల ఫలితాల వేళ ఉన్నపళంగా ఎక్కడికి వెళ్లారు?. ఏపీ రాజకీయ వర్గాల్లో.. ఆఖరికి టీడీపీ శ్రేణుల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది.నారా చంద్రబాబు నాయుడు.. విదేశీ యాత్రకు విశ్రాంతి కోసం వెళ్లారు!. కాదు కాదు.. 74 ఏళ్ల చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. ఎన్నికల ఫలితాల ముందర కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకే ఆయన విదేశాలకు వెళ్లారు. ఇలా.. ఎవరికి తోచిన ప్రకటనలు వాళ్లు చేస్తున్నారే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లారు అనేదానిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఆఖరికి ఆయన పార్టీ కూడా!. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత విదేశీ పర్యటన కోసం హైదరాబాద్ నుంచి తొలుత దుబాయ్కు వెళ్లారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అనేదానిపై గోప్యతను ప్రదర్శిస్తోంది తెలుగు దేశం పార్టీ. ఇక.. చంద్రబాబు ఏం చేసినా బాకా ఊదే ఎల్లో పత్రికలు సైతం ఆయన ఫారిన్ టూర్పై వేర్వేరు కథనాలు ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు పర్యటనకు వెళ్లే ముందే ఆయన తనయుడు నారా లోకేష్ విదేశాలకు వెళ్లారు. ఆయన కూడా ఎక్కడికి వెళ్లారనేదానిపై స్పష్టత కొరవడింది. ఇక చంద్రబాబు విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నారంటూ లీకులు ఇచ్చాయి టీడీపీ శ్రేణులు. అయితే.. చంద్రబాబు అసలు అమెరికాకే రాలేదంటూ టీడీపీ ఎన్నారై నేత కోమటి జయరాం ప్రకటన చేయడంతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లయ్యింది.చెప్పాల్సిన అవసరం ఉందిఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్ష ప్రధాన నేతలుగా బాధ్యతాయుతమైన పదవుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి,నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వాళ్లిద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీలు ప్రకటనలు చేస్తుంటాయి. అలాగే ఏ పర్యటనలకు వెళ్లినా.. అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఆ పార్టీల బాధ్యత కూడా. అందుకే వైఎస్సార్సీపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లగానే.. అక్కడ ల్యాండ్ అయిన దృశ్యాలను మీడియా, సోషల్ మీడియా మాధ్యమంగా విడుదల చేసింది. మరి ఇదే పని చంద్రబాబు విషయంలో టీడీపీ ఎందుకు చేయలేకపోతోంది. సాధారణంగానే చంద్రబాబు విదేశీ పర్యటనను ఏదో రాష్ట్రానికి ఉద్దరించే పనిగా చూపించే ఎల్లో మీడియా.. ఈసారి ఆ బిల్డప్లను ఎందుకు ఇవ్వలేకపోతోంది. ఈ లెక్కన.. చంద్రబాబు విదేశీ పర్యటనపై వైఎస్సార్సీపీ ఆరా తీయడంలో.. సారీ నిలదీయడంలో తప్పేముంది?. -
పవన్ ఏ దేశానికి వెళ్లారు?
సాక్షి, అమరావతి : ఎన్నికల పోలింగ్ అనంతరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడకు వెళ్లారన్నది స్పష్టత లేకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. తాజాగా చంద్రబాబుకు దత్తపుత్రుడిగా పేరుపడ్డ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో, హైదరాబాద్లో ఎక్కడా కనిపించకపోవడం ప్రజలతోపాటు సొంత పార్టీలోనూ చర్చకు దారితీసింది. ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారంటూ పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఎక్కడకు వెళ్లారన్నదీ వారికీ తెలియక సతమతమవుతున్నారు. ఈ నెల 13న మంగళగిరిలోని ఓటు వేసిన పవన్ మరుసటి రోజు 14వ తేదీన ఉత్తరప్రదేశ్లో వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత వారణాసి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గానీ, హైదరాబాద్లోని ఆయన నివాసంలో గానీ పార్టీ నాయకులెవరికీ అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రష్యా లేదా దుబాయ్ వెళ్లి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు తరహాలోనే పవన్ కూడా తన విదేశీ పర్యటనపై గోప్యత పాటించడంతో రాజకీయవర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నాగబాబు ‘ఎక్స్’ ట్వీట్ పెను దుమారం రేపినా..పోలింగ్ అనంతరం పవన్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ మెగా కుటుంబంలో, జనసేన పార్టీలో పెద్ద దుమారాన్నే రేపింది. దీనిపైనా పవన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. పోలింగ్ ముగిసిన వెంటనే నాగబాబు ఎక్స్లో ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయి వాడే. మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే..’ అంటూ ట్వీట్ చేశారు. మెగా – అల్లు ఉమ్మడి కుటుంబానికి చెందిన హీరో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి తన మిత్రుడు, అక్కడి వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవి కిషోర్రెడ్డికి మద్దతు ప్రకటించడంతో ఆయన్ని ఉద్దేశించి నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ పెద్ద దుమారం రేగింది.ఆ ట్వీట్పై అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగానే నాగబాబుపై తీవ్రంగా ప్రతిస్పందించారు. దీంతో నాగబాబు తన ఎక్స్ అకౌంట్ను ఒక రోజు బ్లాక్ చేసి, రెండో రోజు ఆ ట్వీట్ను డిలీట్ (తొలగించానంటూ) చేశానంటూ ప్రకటించారు. ఈ వ్యవహారంపై పవన్ స్పందించకపోవడంపై పార్టీలో పెద్ద చర్చే జరిగింది. -
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
కొచ్చి: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మూడు వారాల పాటు విదేశీ పర్యటనకు బయలుదేరినట్లు మీడియా ద్వారా తనకు తెలిసిందని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. సీఎం పర్యటన గురించి తనకు తెలియజేయకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.సీఎం పినరయి విజయన్.. ఆయన కుటుంబసభ్యుల విదేశీ పర్యటనపై గవర్నర్ స్పందన ఏంటని అడిగినప్పుడు నాకు తెలియదు, తెలియజేసినందుకు మీడియాకు చాలా ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి పర్యటల గురించి తనకు గతం నుంచి వెల్లడించడం లేదని రాష్ట్రపతికి ఇదివరకే లేఖ రాశానని ఖాన్ చెప్పారు. అయితే పినరయి విజయన్ పర్యటన గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు.సీఎం.. ఆయన కుటుంబసభ్యులు మే 6న విదేశాలకు వెళ్లారు. కేరళలో లోక్సభ ఎన్నికల ప్రచారం తర్వాత విజయన్ విరామం తీసుకోవాలనున్నారు. అందుకే తన కుటుంబంతో విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ తెలిపారు. -
ఆతిథ్య రంగం జోరు..
ముంబై: ఆతిథ్య రంగం ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 11–13 శాతం మేర వృద్ధి చెందనుంది. దేశీయంగా పర్యాటకానికి డిమాండ్ స్థిరంగా కొనసాగనుండటంతో పాటు విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరగనుండటం ఇందుకు తోడ్పడనుంది. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి 15–17 శాతం స్థాయిలో ఉండగలదని పేర్కొంది. డిమాండ్ పటిష్టంగా ఉండటం, కొత్తగా హోటల్స్ లభ్యత ఒక మోస్తరుగానే పెరుగుతుండటంతో సమీపకాలంలో పరిశ్రమ లాభదాయకత ప్రస్తుత, వచ్చే ఆరి్థక సంవత్సరాల్లో మెరుగ్గా ఉండనుందని నివేదిక వివరించింది. గదుల అద్దె రేట్లు (ఏఆర్ఆర్) సగటున ఈ ఆరి్థక సంవత్సరం 10–12 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరం 5–7 శాతం మేర పెరగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. ఆక్యుపెన్సీ ఆరోగ్యకరంగా 73–74 శాతం స్థాయిలో కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విదేశీ టూరిస్టుల రాక ఈ ఆరి్థక సంవత్సరమూ పెరగనున్నప్పటికీ కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 10 శాతం తక్కువగానే నమోదు కావచ్చని చెప్పారు. అయితే, వచ్చే ఏడాది ఇది పుంజుకోగలదన్నారు. ఆచితూచి పెట్టుబడులు.. డిమాండ్ పుంజుకోవడం పరిశ్రమ సెంటిమెంటు మెరుగుపడేందుకు ఊతమిస్తున్నప్పటికీ కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పరిశ్రమ ఆచితూచి వ్యవహరిస్తోందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ కన్సల్ తెలిపారు. ‘స్థల సేకరణ వ్యయాలు అధికంగా ఉండటం, నిర్మాణ వ్యయాలు పెరిగిపోవడం, పరిశ్రమ సైక్లికల్ స్వభావం కారణంగా లాభాలకు మళ్లాలంటే సుదీర్ఘ సమయం పట్టనుండటం వంటి అంశాల వల్ల కొత్తగా పెట్టుబడి వ్యయాలు చేయాలంటే ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కాబట్టి బ్రాండ్లు తమ ముందస్తు పెట్టుబడి వ్యయాలను తగ్గించుకునేందుకు మేనేజ్మెంట్ కాంట్రాక్టుల ద్వారా గదులను పెంచుకోవడాన్ని కొనసాగించే అవకాశం ఉంది‘ అని కన్సల్ పేర్కొన్నారు. ఏఆర్ఆర్పరమైన ఆదాయ వృద్ధితో సమానంగా నిర్వహణ వ్యయాలు పెరగకపోవడం వల్ల లాభదాయకత మెరుగుపడగలదని ఆయన చెప్పారు. హోటళ్లు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గత రెండేళ్లుగా సిబ్బందిని, ఫుడ్.. బెవరేజ్ల వ్యయాలను క్రమబదీ్ధకరించుకుంటూ పలు చర్యలు తీసుకోవడం కూడా పరిశ్రమకు సానుకూలాంశమని కన్సల్ వివరించారు. -
వీసా లేకున్నా ఇరాన్ వెళ్లొచ్చు
టెహ్రాన్: ఇరాన్ సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇరాన్కు వెళ్లేందుకు ఇక వీసా అవసరమే లేదు. విదేశీ పర్యాటకులు, సందర్శకులకు ఆకర్షించేందుకు ఇరాన్ ప్రభుత్వం భారత్ సహా 33 దేశాల వారికి వీసా లేని ప్రయాణాలకు అనుమతులివ్వనున్నట్లు ప్రకటించింది. ఇరాన్ మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశ పర్యాటక మంత్రి ఎజ్జతొల్లా జర్ఘామి ఇటీవల ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇరాన్ వ్యతిరేక ప్రచారానికి చెక్ పెట్టేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇరాన్ వీసా ఫ్రీ వెసులుబాటు ప్రకటించిన దేశాల్లో భారత్తోపాటు రష్యా, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ, ఖతార్, కువాయిట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్ తదితరాలున్నాయి. మార్చి 21తో ప్రారంభమైన ఈ ఏడాది మొదటి 8 నెలల్లోనే ఇరాన్ను సందర్శించిన విదేశీయుల సంఖ్య 44 లక్షలుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 48.5% ఎక్కువ. భారతీయులు ఇకపై తమ దేశానికి వీసాతో పనిలేకుండా రావొచ్చంటూ ఇటీవలే మలేసియా, శ్రీలంక, వియత్నాం దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
Alex Baty: బ్రిటన్లో పాపం పసివాడు!
అనగనగా అలెక్స్ బాటీ. ఓ 11 ఏళ్ల పాల బుగ్గల పసివాడు. సొంతూరు బ్రిటన్లోని గ్రేటర్ మాంచెస్టర్. తల్లి, తాతయ్య విదేశీ యాత్రకు వెళ్దామంటే సంబరంగా వాళ్లతో కలిసి స్పెయిన్ బయల్దేరాడు. ఆ యాత్ర ఏకంగా ఆరేళ్లకు పైగా సాగుతుందని అప్పుడతనికి తెలియదు పాపం! ఎందుకంటే అప్పట్నుంచీ అతను బ్రిటన్ తిరిగి రానే లేదు. సరికదా, ఆచూకీ కూడా తెలియకుండా పోయాడు! అతనే కాదు, నాటినుంచీ అతని తల్లి, తాతయ్య కూడా నేటికీ పత్తా లేరు!! ఈ ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బ్రిటన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కూడా చేశారు. అలెక్స్ కోసం యూరప్ అంతటా వెదికీ వెదికీ అలసిపోయారు. ఇక తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. అదుగో, అలాంటి స్థితిలో మూడు రోజుల క్రితం అనుకోకుండా ఫ్రాన్స్లో దొరికాడు అలెక్స్. ఈ లాస్ట్ అండ్ ఫౌండ్ స్టోరీ ఇప్పుడు బ్రిటన్ అంతటా టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది! ఇలా దొరికాడు... వాయవ్య ఫ్రాన్స్లోని టౌలోస్ అనే కొండ ప్రాంతంలో గత బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ 17 ఏళ్ల కుర్రాడు హోరు వానలో తడుస్తూ, హైవే పక్కగా పేవ్మెంట్పై ఒంటరిగా నడుస్తూ పోతున్నాడు. అటుగా వెళ్తున్న ఫాబియన్ అసిడినీ అనే ఓ ట్రక్ డ్రైవర్ కంటపడ్డాడు. అది మారుమూల ప్రాంతం, పైగా ఎవరూ బయట తిరగని వేళ కావడంతో అనుమానం వచి్చన ఆ డ్రైవర్ మనవాణ్ని దగ్గరికి తీశాడు. తొలుత బెదురు చూపులతో మారుపేరు చెప్పినా, అనునయించి అడిగేసరికి అసలు పేరు, తాను తప్పిపోయిన వృత్తాంతంమొత్తం చెప్పుకొచ్చాడు. ‘కొన్నేళ్ల కింద మా అమ్మే నన్ను కిడ్నాప్ చేసింది’ అంటూ ముక్తాయించాడు. దాంతో బిత్తరపోయిన అసిడినీ వెంటనే అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాడు. వాళ్లు బ్రిటన్కు సమాచారమివ్వడం, ఫొటో చూసిన నానమ్మ అలెక్స్ను గుర్తు పట్టడం, ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకుని ఆనందబాష్పాలు రాల్చడం చకచకా జరిగిపోయాయి. ఏం జరిగిందంటే... అలెక్స్ అమ్మానాన్నలు చాన్నాళ్ల క్రితమే విడిపోయారు. అలెక్స్ కోరిక మేరకు కోర్టు అతన్ని నానమ్మ సంరక్షణలో ఉంచింది. ఆమె అనుమతి లేకుండానే 11 ఏళ్ల అలెక్స్ను తల్లి, తాతయ్య కలిసి విహారయాత్ర పేరిట 2017లో స్పెయిన్ తీసుకెళ్లారు. అప్పటినుంచీ ముగ్గురూ అయిపు లేకుండా పోయారు. పెద్దవాళ్లిద్దరూ అప్పటికి కొంతకాలంగా ఆధ్యాతి్మక బాట పట్టినట్టు దర్యాప్తులో తేలింది. తమతో పాటు అలెక్స్ కూడా ఆ ప్రత్యామ్నాయ జీవనం గడపాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకుని స్పెయిన్లో ఓ ఆరామం వంటి ప్రదేశానికి వెళ్లినట్టు పోలీసులు ముక్తాయించారు. తాము తొలుత ఓ విలాసవంతమైన ఇంట్లో ఒక రకమైన ఆధ్యాతి్మక సమూహంతో కలిసి కొన్నేళ్ల పాటు గడిపామన్న అలెక్స్ తాజా వాంగ్మూలం కూడా దీన్ని ధ్రువీకరించింది. తర్వాత అమ్మ, తాతయ్య ఇద్దరూ అలెక్స్ను తీసుకుని 2021లో ఫ్రాన్స్లో ప్రత్యామ్నాయ జీవన శైలికి పేరున్న పైరెనీస్ ప్రాంతానికి మారినట్టు భావిస్తున్నారు. అలెక్స్ దొరికిన చోటు కూడా అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది. ఆ జీవన విధానం తనకు నచ్చక నానమ్మ చెంతకు చేరేందుకు తప్పించుకుని వచ్చేశానని అలెక్స్ చెప్పుకొచ్చాడు. అతన్ని ఒకట్రెండు రోజుల్లో నానమ్మ దగ్గరికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతని అమ్మ, తాతయ్యలపై కిడ్నాపింగ్ కేసు ఇప్పటికీ పెండింగ్లోనే ఉండటం విశేషం! తాజా వివరాల ఆధారంగా వారిని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు బ్రిటన్ పోలీసులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా సంస్కృతికి ఎలా ఉంది?
అనంతపురం ఎడ్యుకేషన్: మన సంస్కృతికి, అమెరికా సంస్కృతికి ఏమైనా తేడాలు గమనించారా? అంటూ ఇటీవల ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను రాప్తాడు కేజీబీవీ 9వ తరగతి విద్యార్థిని సౌమ్య ప్రశ్నించింది. ఇంగ్లిష్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసిన పది మంది ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన వారితో అక్కడి అనుభవాలను ఇతర విద్యార్థులతో పంచుకునేలా మంగళవారం అన్ని జిల్లాల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పా టు చేశారు. ప్రతి జిల్లా నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా అనంతపురం నుంచి రాప్తాడు కేజీబీవీ 9వ తరగతి విద్యార్థిని ఆర్.సౌమ్య పాల్గొంది. డీఈఓ చాంబరులో డీఈఓ నాగరాజు, సమగ్రశిక్ష ఏఎంఓ చంద్రశేఖర్రెడ్డి కూడా పాల్గొన్నారు. అమెరికా దేశంలో ఐక్యరాజ్య సమితి కార్యాలయం, లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ, వైట్హౌస్, వరల్డ్బ్యాంక్ తదితర కార్యాలయాలను సందర్శించి వచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన విద్యార్థుల తో ఇంట్రాక్ట్ అయినట్లు వెల్లడించారు. జిల్లా విద్యార్థిని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ... అక్కడి దేశస్తులు తమ ను బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. అక్కడ తమ అనుభవాలను పంచుకున్నారు. డీఈఓ నాగరాజు మాట్లా డుతూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన తొలిరోజు ప్రశాంతం అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష సహిత విద్య విభాగంలో ఖాళీగా ఉన్న రిసోర్స్ పర్సన్ పోస్టులకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తొలిరోజు మంగళవారం ప్రశాంతంగా జరిగింది. సమగ్రశిక్ష జిల్లా కార్యాలయంలో ఈ ప్రక్రియ సాగింది. రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన జాబితా మేరకు తొలిరోజు ఎంఆర్ అభ్యర్థుల సర్టిఫికెట్లను ఎంఈఓలు, హెచ్ఎంల బృందాలు పరిశీలించాయి. మొత్తం 144 మంది అభ్యర్థులకు గాను 120 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను సమగ్రశిక్ష ఏపీసీ, డీఈఓ నాగరాజు, ఐఈడీ కోఆర్డినేటర్ షమా పరిశీలించారు. రెండరోజు బుధవారం వీఐ/హెచ్ఐ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని డీఈఓ తెలిపారు. దరఖాస్తు సమయంలో సమర్పించిన సర్టిఫికెట్లు రెండుసెట్లు గెజిటెడ్ అధికారి ధ్రువీకరణతో పాటు ఆన్లైన్ దరఖాస్తు కాపీ తీసుకురావాలని సూచించారు. -
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. భారత్ పాస్పోర్టుతో 57 దేశాలకు..
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?.. అయితే ఎలాంటి వీసా లేకుండా కేవలం భారత పాస్పోర్టుతో 57 దేశాలకు వెళ్లిపోవచ్చు. తాజాగా లండన్కు చెందిన హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ ర్యాంకుల్లో భారత్ 80వ స్థానంలో నిలిచింది. మనతోపాటు సెనెగల్, టోగోలకు కూడా 80వ ర్యాంక్ లభించింది. సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా భారత్ ర్యాంకు మెరుగుపడుతుండటం విశేషం. 2022లో భారత్ 87వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది అగ్రస్థానంలో సింగపూర్ నిలిచింది. ఈ దేశానికి చెందిన పాస్పోర్టుతో 192 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో సింగపూర్ గతేడాది ర్యాంకుల్లో ముందున్న జపాన్ను అధిగమించింది. ఇక జర్మనీ, ఇటలీ, స్పెయిన్లు రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్పోర్టులతో వీసా లేకుండా 190 దేశాలకు వెళ్లొచ్చు. జపాన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, దక్షిణ కొరియా, స్వీడన్ మూడో స్థానం దక్కించుకున్నాయి. ఈ దేశాల పాస్పోర్టులతో 189 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. బ్రిటన్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. వీసా లేకుండా వెళ్లగలిగే దేశాలు బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, కుకు దీవులు, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, డొమినికా, ఎల్ సాల్వడార్, ఫిజీ, గబాన్, గ్రెనడా, గినియా–బిస్సావు, హైతీ, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజకిస్థాన్, లావోస్, మకావు, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రోనేషియా, మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా, సమోవా, సెనెగల్, సీషెల్స్ దీవులు, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, టాంజానియా, థాయిలాండ్, తైమూర్–లెస్టే, టోగో, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ట్యునీషియా, తువాలు, వనటు, జింబాబ్వే. ► దాదాపు పదేళ్ల క్రితం వరకు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా తాజాగా వీసా లేకుండా ప్రయాణించే దేశాలకు హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ ర్యాంకులను ప్రకటించింది. చెత్త పాస్పోర్టు గల దేశాల్లో పాకిస్థాన్ హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ నాలుగో చెత్త పాస్పోర్ట్ కలిగిన దేశంగా నిలిచింది. పాక్ పాస్పోర్టుతో వీసా లేకుండా కేవలం 33 దేశాలకు వెళ్లడానికి మాత్రమే వీలుంది. ఇక ఆఫ్ఘనిస్థాన్, ఉత్తర కొరియా, పపువా న్యూ గినియా, తుర్కిమెనిస్థాన్ దేశాలకు జీరో ర్యాంక్ లభించింది. అంటే ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా పాస్పోర్టుతో ఏ దేశంలోకి ప్రవేశించలేరు. ఇది కూడా చదవండి: గవర్నర్కు డీఎంకే ఫైల్స్–2 -
Gurdeep Kaur Chawla: ప్రధాని విదేశానికి వెళ్తే.. ఈమె ఉండాల్సిందే
దేశ నేతలు ఇతర దేశాల నేతలతో సరిగా మాట్లాడాలి. వారు చెప్పేది సరిగా వినాలి. దౌత్య సంబంధాలు సఫలం కావాలంటే సంభాషణే కీలకం. కాని అన్ని భాషలు అందరు నేతలకూ రావాలని లేదు. అందుకే దుబాసీలను ఎంచుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో తరచు కనిపిస్తున్న దుబాసి గుర్దీప్ కౌర్ చావ్లా. ఇటీవల మోదీ అమెరికా పర్యటనలో ఆమె కీలక పాత్ర పోషించింది. అది వేదిక మీద ఎవరో ఒక నాయకుడు చేస్తున్న రాజకీయ ప్రసంగాన్ని అనువాదం చేయడం కాదు. లేదా ఒక కథనో వ్యాసాన్నో అనువాదం చేయడం కాదు. అగ్రనేతలు చర్చలు చేసుకుంటున్నప్పుడు ఆ సంభాషణను అనువాదం చేయడం. దుబాసీగా ఉండటం. ‘ఆ పని చాలా కష్టం’ అంటారు గుర్దీప్ కౌర్ చావ్లా. అమెరికాలో స్థిరపడిన ఈ పంజాబీ భారతీయురాలు గత 26 ఏళ్లుగా దౌత్యరంగంలో దుబాసీగా సేవను అందిస్తున్నారు. ‘డిప్లమాటిక్ ఇంటర్ప్రెటర్’గా అంతర్జాతీయ గుర్తింపు పొందారు గుర్దీప్ కౌర్. So good to see Gurdeep Kaur Chawla (interpreter) at the historic meeting between President Biden and Prime Minister Modi. Gurdeep is simply brilliant!#Politics #India #Historic pic.twitter.com/DuelcjJNUB — Dr. Jagdish N. Sheth (@JagSheth) June 27, 2023 ఢిల్లీలో చదువుకుని గుర్దీప్ కౌర్ ఢిల్లీలో ఎం.ఏ. ఇంగ్లిష్ చదవి, ఆ తర్వాత పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ చేసి, పీహెచ్డీ చేశాక పార్లమెంట్లో అనువాదకురాలిగా కెరీర్ను ప్రారంభించారు. ఇంగ్లిష్, హిందీ, పంజాబీ, ఉర్దూ భాషల్లో గొప్ప ప్రవేశం ఉండటంతో దుబాసీగా ఆమె సేవలను పార్లమెంట్ భవన్ ఉపయోగించుకునేది. అయితే భర్త ఉద్యోగరీత్యా 1996లో అమెరికా వెళ్లిన గుర్దీప్ అక్కడ కూడా దౌత్యపరమైన దుబాసీగా కావాల్సిన అనుభవం కోసం ‘జ్యుడిషియల్ కౌన్సిల్ ఆఫ్ కాలిఫోర్నియా’లో పని చేశారు. ‘దౌత్యరంగానికి అవసరమైన మేలిమి ఇంటర్ప్రెటర్ల కొరతను ఆ రోజుల్లోనే నేను గమనించాను. అలాంటివారిని తయారు చేయడానికి ‘ఇండియన్ లాంగ్వేజస్ సర్వీసెస్’ అనే సంస్థను స్థాపించి దుబాసీలను తయారు చేస్తున్నాను. భారతీయ నేతల కోసమే కాదు ప్రపంచ నేతల కోసం కూడా అరబిక్, స్పానిష్, చైనీస్ తదితర భాషలలో నిపుణులైన దుబాసీలను మేము ఏర్పాటు చేస్తాం’ అంటారు గుర్దీప్ కౌర్. We are proud of Pacific Council member Dr. Gurdeep Kaur Chawla, who is interpreting bilateral talks during the #ASEAN summit in #Singapore. pic.twitter.com/PqyFBbRYP4 — Pacific Council (@PacCouncil) November 15, 2018 ప్రధానులకు దుబాసీ అమెరికా పర్యటనకు వచ్చే భారతీయ ప్రధానులకు గుర్దీప్ దుబాసీగా పని చేసి ప్రశంసలు అందుకున్నారు. వి.పి.సింగ్, చంద్రశేఖర్, పి.వి.నరసింహారావు, వాజ్పేయి, గుజ్రాల్, మన్మోహన్ సింగ్ వీరందరూ అమెరికా వచ్చినప్పుడు వారి అధికారిక దుబాసీగా గుర్దీప్ పని చేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ కోసం పని చేస్తున్నారు. అయితే ట్రంప్ హయాంలో మోదీ అమెరికా వచ్చినప్పుడు ట్రంప్కు కూడా దుబాసీగా గుర్దీప్ పని చేశారు. అంటే ట్రంప్ మాట్లాడేది హిందీలో అనువాదం చేసి మోదీకి తెలిపారు. ఒబామాకు కూడా గుర్దీప్ పని చేశారు. సవాళ్లతో నిండిన పని ‘అగ్రనేతలు పాల్గొనే దౌత్య సంబంధ సమావేశాలలో దుబాసీగా పని చేయడం చాలా సవాలు. నేతలు మాట్లాడేది ఒక మాట తక్కువ కాకూడదు ఒక మాట ఎక్కువ కాకూడదు. ముఖ్యంగా మన భావాలు, పెడర్థాలు కలపకూడదు. నేను ఒక నేతకు దుబాసీగా పని చేయాలని అనుకున్న వెంటనే ఆ నేత వాడే పదసముదాయం, ఉచ్చారణ, యాస, వ్యక్తీకరణ మొత్తం స్టడీ చేస్తాను. రెండు దేశాల మధ్య ఉండే దౌత్య పరమైన సంబంధాల అవగాహన ఉండాలి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, సాంస్కృతిక అంతరం, అధికారిక సంబంధాల మధ్య ఉండే సవాళ్లు... వీటన్నింటిని తెలుసుకుని ఆ అగ్రనేత ఏం మాట్లాడబోతాడో ఊహించి సిద్ధంగా ఉండాలి. ఇంత హోమ్వర్క్ లేకపోతే తక్షణ అనువాదం సాధ్యం కాదు’ అంటుంది గుర్దీప్ కౌర్. ఐక్యరాజ్యసమితి, ఐ.ఎం.ఎఫ్, వరల్డ్ బ్యాంక్, యూ.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్, డబ్లు్య.హెచ్.ఓ తదితర సంస్థలకు గుర్దీప్ కౌర్ వ్యక్తిగతంగా తన సంస్థ తరఫున సేవలు అందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరు దేశాలు ఏవైనా మాట్లాడుకోవాలంటే గుర్దీప్ కౌర్ సేవలు తప్పనిసరి అనే స్థితిలో ఆమె తన సేవలను విస్తరించారు. భాష తెలియడం వల్ల వచ్చిన విజయం ఇది. భాషల మీద పట్టు సాధించి ఇటువైపు కెరీర్ మలుచుకోవాలనుకునేవారికి గుర్దీప్ గొప్ప స్ఫూర్తి. Super proud of our colleague, Dr Gurdeep Kaur Chawla @ Imagindia Institute - she is sitting to the right of US Secy State Pompeo, as he meets Prime Minister Modi today morning in Delhi. pic.twitter.com/lCLz1DcLCa — Imagindia (@Imagindia) June 26, 2019 -
విదేశీ గడ్డపై స్వదేశాన్ని విమర్శించడం తగదు: అమిత్ షా
పటన్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల సమయంలో దేశాన్ని విమర్శించడం, అంతర్గత రాజకీయాలను గురించి మాట్లాడటాన్ని హోం మంత్రి అమిత్ షా తప్పుపట్టారు. ఇటువంటి వాటిపై రాహుల్ తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని, దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోవాలని హితవు పలికారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుజరాత్లోని పటన్ జిల్లా సిద్ధ్పూర్లో శనివారం జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. ‘దేశభక్తి ఉన్న ఎవరైనా భారత రాజకీయాల గురించి భారత్లోనే మాట్లాడాలి. ఏ రాజకీయ పార్టీ నేత అయినా సరే విదేశాల్లో ఉండగా దేశాన్ని విమర్శించడం, దేశ రాజకీయాలపై చర్చించడం సరికాదు. రాహుల్ బాబా.. దేశ ప్రజలు ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి’అని ఆయన పేర్కొన్నారు. ‘వేసవి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు రాహుల్ బాబా విదేశాలకు విహారయాత్రకు వెళ్తున్నారు. అక్కడున్న సమయంలోనూ దేశాన్ని విమర్శిస్తున్నారు. ఇది సరికాదన్న విషయాన్ని తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని రాహుల్కు సలహా ఇస్తున్నా’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో పెను మార్పులు చోటుచేసుకున్నా కాంగ్రెస్ మాత్రం భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు ఆపలేదని విమర్శించారు. -
సమ్మర్లో ఫారిన్ షూటింగ్ అంటున్న స్టార్ హీరోలు
సమ్మర్లో కూల్గా ఉండే లొకేషన్స్ని ఎంచుకుని, వెకేషన్కి వెళుతుంటారు కొందరు స్టార్స్. కొందరిని షూటింగే చల్లని ప్రాంతాలకు తీసుకెళుతుంది. అలా ‘కేరాఫ్ ఫారిన్’ అంటూ షూటింగ్స్కి, వెకేషన్కి విదేశాలు వెళ్లిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► రెండు వారాలుగా ఫారిన్లోనే ఉంటున్నారు ఇండియన్. హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తైవాన్లో జరిగిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతోంది. కమల్పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు శంకర్. ఈ వారం కూడా ‘ఇండియన్ 2’ టీమ్ సౌతాఫ్రికాలోనే ఉంటుందని తెలిసింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ► ఇటలీలో ఫైట్స్ చేశారు ప్రభాస్. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగ ‘సలార్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గత నెలలో ఇటలీ లొకేషన్స్లో జరిగింది. ముఖ్యంగా ప్రభాస్పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ‘సలార్’ సినిమా యూనిట్ మరోసారి ఫారిన్ వెళ్లనుందని సమాచారం. బుడాపెస్ట్ లొకేషన్స్లో ‘సలార్’ షూటింగ్ను ప్లాన్ చేశారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ‘సలార్’ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొంటున్నారని తెలిసింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కాగానే ‘సలార్’ కోసం ప్రభాస్ ఫారిన్ ఫ్లైట్ ఎక్కుతారని ఫిల్మ్నగర్ సమాచారం. ► లండన్లో ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతీ శెట్టి జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల లండన్లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. గత వారం శర్వానంద్, కృతీపై కీలక సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించారు. ► బాలీవుడ్ ‘బడే మియా చోటే మియా’ లండన్కు షిఫ్ట్ అయ్యారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలోరూపొందుతున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. ఇటీవల ఓ యాక్షన్ సీక్వెన్స్ను స్కాట్లాండ్లో చిత్రీకరించారు. అట్నుంచి అటు లండన్ వెళ్లారు. మరో పది రోజులపాటు లండన్ షెడ్యూల్ జరుగుతుందట. అలాగే మరో బాలీవుడ్ మూవీ ‘యానిమల్’ షూటింగ్ కూడా లండన్లో జరిగింది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్.ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు ఫారిన్ లొకేషన్స్లో షూటింగ్స్ను ప్లాన్ చేశాయి. -
ట్రావెల్ నౌ, పే లేటర్..ఎగిరిపోతే ఎంత బావుంటుంది: ప్రతి నెలా బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారతీయులు విదేశీ ప్రయాణాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రతి నెలా బిలియన్ డాలర్లను (రూ.8,200 కోట్లు) ఇందు కోసం వెచ్చిస్తున్నట్టు ఆర్బీఐ అవుట్వర్డ్ రెమిటెన్స్ డేటా స్పష్టం చేస్తోంది. కరోనా ముందు నాటితో పోలిస్తే ఇది ఎంతో అధికం కావడం గమనార్హం. 2022-23 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద వ్యక్తులు ప్రయాణాల కోసం 9.95 బిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. అంతక్రితం ఏడాది ఇదే తొమ్మిది నెలల్లో ఇలా వెచ్చించిన మొత్తం 4.16 బిలియన్ డాలర్లుగానే ఉంది. ఇక కరోనా ముందు 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో విదేశీ ప్రయాణాల కోసం చేసిన అవుట్వర్డ్ రెమిటెన్స్లు 5.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో అవుట్వర్డ్ రెమిటెన్స్లు 7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రయాణించి.. తర్వాత చెల్లించు ‘‘భారతీయులు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి వియత్నాం, థాయిలాండ్, యూరప్, దుబాయ్, బాలి తదితర ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు’’అని వీ3ఆన్లైన్ పార్ట్నర్ సపన్ గుప్తా తెలిపారు. ప్రయాణ చార్జీలు అందుబాటులో ఉండడంతో పరిశ్రమ పెద్ద బూమ్ను చూస్తున్నట్టు సంకాష్ సహ వ్యవస్థాపకుడు ఆకాశ్ దహియా పేర్కొన్నారు. ‘‘మా కస్టమర్లలో 5 శాతం మంది అంతర్జాతీయ ప్రయాణాలను ఎంపిక చేసుకుంటున్నారు. యూరప్, బాలి, వియత్నాం, దుబాయి ప్రాంతాలకు భారతీయుల నుంచి డిమాండ్ ఉంది’’అని చెప్పారు. ‘ఇప్పుడు ప్రయాణించు-తర్వాత చెల్లించు’ అనే కాన్సెప్ట్కు పర్యాటకులు ఆకర్షితులవుతున్నట్టు దహియా తెలిపారు. నెలవారీ చెల్లింపులపైనా విదేశాలను చూసి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
వామ్మో.. భారతీయులు ప్రయాణాలపై నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా!
ప్రజలు తీరిక సమయాల్లో విహారయాత్రకు ప్లాన్ చేసుకుని పర్యాటక ప్రాంతాలలో తిరుగుతూ ఉంటారు. తమకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి చిల్ అవుతూ అందులో ఉన్న మజాని ఆశ్వాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మనదేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలలో కూడా చుట్టేసి వస్తుంటారు. ఇలా విదేశీ ట్రిప్ల కోసం భారతీయులు ప్రతి నెలా దాదాపు 1 బిలియన్ డాలర్లను ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చు కోవిడ్కు ముందు ఉన్న స్థాయిల కంటే చాలా ఎక్కువ అని రిజర్వ్ బ్యాంక్ విదేశీ చెల్లింపులపై డేటా వెల్లడించింది. 2022-23 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో ప్రయాణాల కోసం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) ద్వారా భారతీయులు జరిపిన చెల్లింపులు 9.95 బిలియన్ డాలర్లుగా ఉంది. RBI డేటా ప్రకారం, 2021-22లో ప్రయాణానికి సంబంధించిన ఖర్చు 4.16 బిలియన్ డాలర్లు కాగా, 2019-20కి ముందు కోవిడ్ సంవత్సరంలో 5.4 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతీయులు తమ కుటుంబాలు లేదా స్నేహితులతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ట్రిప్లకు వెళ్తుంటారు. వియత్నాం, థాయిలాండ్, యూరప్, బాలి భారతీయులు ఇష్టపడే కొన్ని ప్రధాన గమ్యస్థానాలుగా చెప్పచ్చు. యూరప్, ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, దుబాయ్ కూడా ఆ జాబితాలో ఉన్నాయి. సరసమైన ప్రయాణాల పెరుగుదల, సాంకేతిక పురోగతితో, ట్రావెల్ పరిశ్రమ అంతర్జాతీయ గమ్యస్థానాలలో భారీగా వృద్ధి వైపు పరుగెడుతోంది. ముఖ్యంగా ఇప్పుడే ప్రయాణం చేసి తరువాత చెల్లించండి అనే విధానం టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ రేటును ప్రస్తుత 5 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన భారతీయుల విదేశీ ప్రయాణాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం, ప్రధానంగా కోవిడ్-19 వ్యాప్తి తరువాత పరిమితుల కారణంగా 2020-21లో బయటి ప్రయాణాలపై ఖర్చు 3.23 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2019-20, 2018-19లో ప్రయాణానికి సంబంధించిన బాహ్య చెల్లింపులు వరుసగా 6.95 బిలియన్ డాలర్లు, 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది. చదవండి పెళ్లైన రెండో రోజే విగతజీవులైన నవ దంపతులు.. రిసెప్షన్కు ముందే.. -
..పన్లో పని విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా మీరే తీసేసుకోండి సార్!
..పన్లో పని విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా మీరే తీసేసుకోండి సార్!