గత ఏడాది జనవరితో పోల్చితే ఈ సంవత్సరం జనవరిలో విదేశీ టూరిస్ట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది జనవరిలో 7.91 లక్షల మంది విదేశీ పర్యాటకులు మన దేశాన్ని సందర్శించగా, ఈ సంఖ్య 2016 జనవరిలో 8.44 లక్షలకు పెరిగింది. విదేశీ పర్యటకుల సంఖ్య రికార్డు స్థాయిలో 6.8 వృద్ధిని సాధించింది. టూరిజం నుంచి వచ్చే విదేశీ మారక నిల్వలు(ఫారన్ ఎక్స్ఛేంజ్ ఎర్నింగ్స్) గత ఏడాది జనవరితో పోల్చితే ఈ ఏడాది 13 శాతం పెరిగాయని ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
విదేశీ పర్యటకులలో జనవరి నెలలో టాప్ స్థానంలో నిలిచిన దేశాలు:
1) అమెరికా 2) బంగ్లాదేశ్ 3) యూకే 4) కెనడా 5) అస్ట్రేలియా 6)రష్యా 7)జర్మనీ 8)ఫ్రాన్స్ 9) శ్రీలంక 10)చైనా 11) మలేషియా 12) జపాన్ 13)కొరియా 14)నేపాల్ 15) అఫ్ఘనిస్తాన్
మన దేశంలో ఎక్కువగా విదేశీ పర్యటకులు అడుగుపెట్టిన ప్రాంతాలు:
1)ఢిల్లీ ఎయిర్ పోర్టు 2)ముంబై ఎయిర్ పోర్టు 3) చెన్నై ఎయిర్ పోర్టు 4)హరిదాస్ పూర్ లాండ్ చెక్ పోస్ట్ 5)బెంగళూరు ఎయిర్ పోర్టు 6) గోవా ఎయిర్ పోర్టు
భారత్కు పెరిగిన విదేశీ పర్యాటకుల తాకిడి
Published Wed, Feb 17 2016 7:05 PM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM
Advertisement
Advertisement