increased
-
ఆదాయం ఏం మారలేదబ్బా..!
సాక్షి, అమరావతి: దేశంలో గత ఏడాది 41.5 శాతం గ్రామీణ కుటుంబాల ఆదాయంలో ఎటువంటి మార్పులేదు. 36.0 శాతం గ్రామీణ కుటుంబాల ఆదాయం పెరిగింది. 22.6 శాతం గ్రామీణ కుటుంబాల ఆదాయం తగ్గింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల సెంటిమెంట్స్ సర్వేలో ఈ విషయాలు గుర్తించినట్లు నాబార్డు వెల్లడించింది.వివిధ రాష్ట్రాల్లో గ్రామాల్లోని కుటుంబాల ఆదాయం, వినియోగం, ఆర్థిక పొదుపు, రుణాలు, మూలధన పెట్టుబడులకు సంబంధించి సర్వే చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను అంచనా వేసినట్లు ఆ నివేదిక పేర్కొంది. గ్రామీణ వినియోగ డిమాండ్ ఉత్సాహంగా ఉందని సర్వే తెలిపింది. పొదుపు చేయడంలో గ్రామీణ కుటుంబాల్లో ఎటువంటి మార్పులేదని, మూలధన పెట్టుబడి పెట్టిన కుటుంబాల శాతం పెరిగిందని సర్వేలో తేలింది. -
కరెంటు కోత..చార్జీల మోత.! . ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో భారీగా పెరిగిన విద్యుత్ చార్జీలు
-
మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు
జమ్ము: జమ్ముకశ్మీర్లోని పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం మైదాన ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో మైదాన ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. కాశ్మీర్లోని పర్వతప్రాంతాల్లో మంచు కురిసిన అనంతరం జమ్ముకశ్మీర్లో విపరీతమైన చలి వాతావరణం ఏర్పడింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. సోన్మార్గ్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 5.3 డిగ్రీలుగా నమోదైంది.కుప్వారాలోని మచిల్ సెక్టార్లో మంచు కురవడంతో ఆ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది. భారీగా పేరుకున్న హిమపాతం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. గురేజ్, తులైల్, కంజల్వాన్ సరిహద్దు ప్రాంతాలతో సహా బందిపోరా ఎగువ ప్రాంతాలలో కూడా తెల్లటి మంచు దుప్పటి అందంగా పరుచుకుంది.మైదాన ప్రాంతాల్లో కురుస్తున్న పొగమంచు ప్రభావం సిమ్లా వరకు వ్యాపించింది. పొగమంచు కారణంగా మైదాన ప్రాంతాల నుంచి రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో కల్కా నుంచి సిమ్లా వెళ్లే నాలుగు రైళ్లు నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. దీంతో వారాంతాల్లో సిమ్లా వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే మూడు రోజుల పాటు మైదాన ప్రాంతాల్లో మంచుకురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో రైళ్ల రాకపోకలపైనా ప్రభావం పడనుంది.హిమాచల్ ప్రదేశ్లో చలి తీవ్రత అధికమయ్యింది. ఆదివారం నాడు 13,050 అడుగుల ఎత్తయిన రోహ్తంగ్ పాస్తో సహా పలు పర్వత శిఖరాలపై భారీగా మంచు కురిసింది. లాహౌల్-స్పితి, కులులో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో నదులు, వాగులు, జలపాతాలు గడ్డకడుతున్నాయి.ఇది కూడా చదవండి: కార్తీక వనసమారాధనలో గలాటా -
బస్సు చార్జీల పెంపు అవాస్తవం: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ టికెట్ ధరలు పెంచిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పష్టం చేశారు. స్పెషల్ బస్సుల చార్జీలను మాత్రమే సంస్థ సవరించిందని, రెగ్యులర్ సర్వీసుల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఒక ప్రకటనలో తెలిపారు.పండుగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లేప్పుడు బస్సుల్లో ప్రయాణికులు అధికంగా ఉంటారని, వారిని దింపి బస్సులు ఖాళీగా నగరానికి రావలసి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో డీజిల్ ఖర్చుకు సరిపడా ఆదాయం కూడా ఉండదని తెలిపారు. అందుకోసం స్పెషల్ బస్సుల్లో చార్జీలను స్వల్పంగా సవరించే వెసులుబాటు ఉందని వెల్లడించారు. -
డ్రోన్ల వినియోగంతో పెరిగిన సాగు ఉత్పత్తి
న్యూఢిల్లీ: డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్, రైతుల కోపరేటివ్ సొసైటీ ఇఫ్కో మధ్య భాగస్వామ్యం.. సాగు ఉత్పాదకత పెంపునకు తోడ్పినట్టు ఈ సంస్థలు ప్రకటించాయి. 2023 డిసెంబర్లో ఈ సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా 500 డ్రోన్లను రైతులకు సమకూర్చాయి. సాగులో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్ల సాయాన్ని అందించాయి. ఇది 11 రాష్ట్రాల పరిధిలో 500 రైతులపై సానుకూల ప్రభావం చూపించినట్టు ఈ సంస్థలు వెల్లడించాయి.అగ్రిబోట్ డ్రోన్ కస్టమర్లకు ఈ సంస్థలు ఇటీవలే ప్రత్యేక పరిమిత కాల ఆఫర్ను కూడా ప్రకటించాయి. దీని కింద రైతులకు ఎలాంటి గరిష్ట విస్తీర్ణం పరిమితి లేకుండా ఇఫ్కో డ్రోన్లను అందిస్తుంది. పంటల నిర్వహణ, సామర్థ్యాలను పెంచడం దీని ఉద్దేశ్యమని ఇవి తెలిపాయి. ఒక డ్రోన్ ఆరు ఎకరాలకు ఒక గంటలో స్ప్రే చేసే సామర్థ్యంతో ఉంటుందని, ఒకటికి మించిన బ్యాటరీ సెట్తో ఒక రోజులో ఒక డ్రోన్తో 25 ఎకరాలకు స్ప్రే చేయొచ్చని తెలిపాయి. -
ప్రజలకు విద్యుత్ చార్జీల షాక్
సాక్షి, అమరావతి: అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి.. ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందే మాట తప్పి రాష్ట్ర ప్రజలపై రూ.8,100 కోట్ల భారం మోపేందుకు సిద్ధమైంది. వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నందుకు కానుకగా ప్రజలపై విద్యుత్ చార్జీల పిడుగు వేస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్పీపీసీఏ) చార్జీల ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ)కి సమరి్పంచాయి. ఆ ప్రతిపాదనలపై ఈ నెల 18న బహిరంగ విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు ఏపీ ఈఆర్సీ సోమవారం వెల్లడించింది.ఈ చార్జీలు, ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈ విచారణలో తెలపాలని కోరింది. అలాగే ఆన్లైన్ సూచనలు, అభ్యంతరాలను ఈనెల 14వ తేదీలోగా కమిషన్ చిరుమానాకు పోస్టు ద్వారాగానీ, ఈ–మెయిల్ ద్వారాగానీ పంపాలని కోరింది. అయితే.. ఈ విచారణ నామమాత్రమే. డిస్కంలు ప్రతిపాదించిన మేరకు చార్జీలు వసూలు చేసుకునేందుకు మండలి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఎఫ్పీపీసీఏ చార్జీలు ఒక్కో డిస్కంలోనూ ఒక్కో విధంగా ఉండనున్నాయి. వాటికి ప్రసార, పంపిణీ నష్టాలు(టీఆండ్డి)లను కూడా డిస్కంలు కలిపాయి. డిస్కంలలో ఈ నష్టాలు 7.99 శాతం నుంచి 10.90 వరకూ ఉన్నాయి. ఈ రెండూ కలిపి చార్జీల రూపంలో అమల్లోకి వస్తే ఒక్కో వినియోగదారునిపైనా నాలుగు త్రైమాసికాలకు కలిపి యూనిట్కు రూ.4.14 నుంచి రూ.6.69 వరకూ భారం పడనుంది.చంద్రబాబు పచ్చి మోసం సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి ఇప్పటికే ప్రజలను మోసం చేసిన చంద్రబాబు మరో హామీని తుంగలో తొక్కారు. గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచకపోయినా పెంచేసినట్టు తప్పుడు ప్రచారం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విద్యుత్ చార్జీలనూ పెంచబోమని ప్రకటించారు. చివరకు ఎప్పటిలాగానే ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా విద్యుత్ వినియోగదారులకు చార్జీలు పెంచుతున్నారు. ఇదే చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ఈఆర్సీని తప్పుదోవ పట్టించారు.డిస్కంలు ఇంధన సర్దుబాటు చార్జీలను సమరి్పంచకుండా అడ్డుకున్నారు. దాంతో ఆ తరువాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆ భారం పడింది. అప్పటికే డిస్కంలు రూ.వేల కోట్ల అప్పుల్లోకి వెళ్లిపోయాయి. చంద్రబాబు హయాంలో వసూలు చేయని ట్రూ అప్ చార్జీలను డిస్కంలు వసూలు చేసుకుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేశారు. అదే చంద్రబాబు ఇప్పుడు ఇచ్చిన మాట తప్పి.. ప్రజలపై సర్దుబాటు పేరిట చార్జీల పిడుగు వేస్తున్నారు. -
LPG Price Hike: పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. దీని ప్రభావం సామాన్యులపై కూడా కనిపించనుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.39 పెరిగింది. దీంతో ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర రూ.1,691.50గా మారింది. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.కోల్కతాలో వాణిజ్య సిలిండర్ కొత్త ధర రూ.1802.50గా, ముంబైలో కమర్షియల్ సిలిండర్ కొత్త ధర రూ.1644గా, చెన్నైలో కమర్షియల్ సిలిండర్ కొత్త ధర రూ.1855కి చేరింది. గత జూలై ఒకటిన వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. జూలై ఒకటిన 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.30 తగ్గింది.ప్రతి నెల ప్రారంభంలో ఎల్పీజీ సిలిండర్ ధరలలో చోటుచేసుకుంటున్న సర్దుబాట్లు మార్కెట్ను ప్రభావితం చేస్తుంటాయి. అంతర్జాతీయ చమురు ధరలు, పన్నుల విధానాలు , సరఫరా, డిమాండ్ వంటి వివిధ అంశాలు ఈ ధర నిర్ణయాలలో కీలకంగా ఉంటాయి. -
రైల్వే ట్రాక్లపై గస్తీ పెంపు
ఇటీవలి కాలంలో తరచూ రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని నివారించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ పలు చర్యలు చేపడుతోంది. తాజాగా ఏఐ సాయంతో ట్రాక్లపై భద్రతను పెంచే దిశగా ముందుకు కదులుతోంది.ఆగస్టు 17న అహ్మదాబాద్కు వెళ్లే సబర్మతి ఎక్స్ప్రెస్ కాన్పూర్ - భీమ్సేన్ జంక్షన్ మధ్య పట్టాలు తప్పింది. ఎవరో పట్టాలపై ఉంచిన భారీ వస్తువును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు రైల్వేశాఖ గుర్తించింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రైల్వే ట్రాక్లపై పెట్రోలింగ్ను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) సాయం తీసుకోవాలని వారు భావిస్తున్నారు.ఆర్పీఎఫ్తో పాటు ట్రాక్ మెయింటెనెన్స్ సిబ్బంది ఏడాది పొడవునా క్రమ వ్యవధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. కాగా సబర్మతి ఎక్స్ప్రెస్ ప్రమాదం తర్వాత వారు మరింత అప్రమత్తంగా ఉన్నారని రైల్వే బోర్డు అధికారులు మీడియాకు తెలిపారు. అయితే ట్రాక్ల నిర్వహణకు సిబ్బంది కొరత కారణంగా ఏడాది పొడవునా నైట్ పెట్రోలింగ్ నిర్వహించడం లేదని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయి. సబర్మతి ఎక్స్ప్రెస్ ప్రమాదం విషయానికొస్తే ఈ సంఘటనకు ముందు నైట్ పెట్రోలింగ్ చేయలేదని అందుకే ప్రమాదం చోటుచేసుకున్నదని అధికారులు గుర్తించారు. రైలు రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు ఎవరైనా ఆ భారీ వస్తువును పట్టాలపై ఉంచారా? అనే కోణంలో రైల్వే శాఖ దర్యాప్తు చేస్తోంది. -
ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్ ఫీజు పెంపు
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ రాష్ట్రాల వారీగా ప్రారంభమయ్యింది. జాతీయ స్థాయిలో ఆగస్టు 14న ఇది ప్రారంభం కానుంది. అయితే మనదేశంలోని ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్ చేయాలంటే భారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.పంజాబ్లోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ కోర్సు ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. అడ్మిషన్లను నియంత్రించేందుకే మెడికల్ ఫీజులను ఐదు శాతం మేరకు పెంచినట్లు అధికారిక నోటిఫికేషన్లో తెలియజేశారు.బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో 1,550 సీట్లలో ప్రవేశాలు ఉంటాయని, వీటిలో 750 సీట్లు రాష్ట్రంలోని నాలుగు మెడికల్ కాలేజీలలో, 800 సీట్లు మైనారిటీ రాష్ట్రాల్లోని నాలుగు ప్రైవేట్, రెండు మెడికల్ ఇన్స్టిట్యూట్లలో ఉన్నాయనిమెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ తెలిపింది. పంజాబ్లో ఇప్పటికే నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.నోటిఫికేషన్లోని వివరాల ప్రకారం అమృత్సర్, ఫరీద్కోట్, పటియాలా, మొహాలీలలోని నాలుగు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫీజును రూ.9.50 లక్షలకు పెంచారు. గతంలో ఇక్కడ ఫీజు రూ.9.05 లక్షలుగా ఉండేది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని అన్ని మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఎంబీబీఎస్ కోర్సుకు గతంలో రూ.55.28 లక్షలుగా ఉన్న పూర్తి ఫీజును రూ.58.02 లక్షలు చేశారు. కాగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ కోటాలోని ఎంబీబీఎస్ సీట్ల ఫీజు గతంలో రూ.21.48 లక్షలుగా ఉండగా, దానిని ఇప్పుటు రూ.22.54 లక్షలకు పెంచారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,535 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు.నేడు అంగప్రదక్షిణ టోకెన్ల ఆన్లైన్ కోటా విడుదలఆగస్టు 10వ తేదీ శనివారం రోజున తిరుమల ఆలయంలో అంగప్రదక్షిణ చేసుకునే భక్తులకు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 250 టోకెన్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో అంగప్రదక్షిణ టోకెన్లను బుక్ చేసుకోవాలని కోరుతోంది. -
కన్వర్ యాత్రకు ఉగ్రవాద ముప్పు.. ఏటీఎస్ బలగాల మోహరింపు
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కన్వర్ యాత్రకు ఉగ్రవాద ముప్పు పొంచివుందంటూ నిఘా వర్గాలకు సమాచారం అందిన నేపధ్యంలో యాత్ర భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీని పర్యవేక్షణ బాధ్యతను యాంటీ టెర్రరిస్ట్ స్క్యాడ్(ఏటీఎస్)కు అప్పగించారు. ఈ నేపధ్యంలో ఏటీఎస్ బృందం భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది.ఉగ్రవాదుల దాడి యత్నానికి సంబంధించిన ఇన్పుట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపధ్యంలో యూపీలోని ముజఫ్ఫర్నగర్ జిల్లాకు ఏటీఎస్ కమాండోల బృందం తరలివచ్చింది. వీరికి ఎస్ఎస్పీ అభిషేక్ సింగ్ విధులకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందాన్ని శివచౌక్, మీనాక్షి చౌక్, హాస్పిటల్ తిరహా తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో మోహరించినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు యాంటీ శాబోటేజ్ టీం, బీడీడీఎస్ (బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్) కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి. -
ఉగ్రవాదుల ఏరివేత.. జమ్ములో సైనికుల మోహరింపు
జమ్ము ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపధ్యంలో ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో సైనికులను మోహరించారు. జమ్ములో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇంటర్ కమాండ్లో మార్పులు చేశారు. కథువా, సాంబా, దోడా, బదర్వా, కిష్త్వార్లలో సైనికుల సంఖ్యను మరింతగా పెంచారు. వెస్ట్రన్ కమాండ్ నుండి కూడా ఇక్కడకు సైనికులను పంపారు.గత సోమవారం జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్కు చెందిన సాయుధ ఉగ్రవాదులతో జరిగిన భీకర ఎన్కౌంటర్లో కెప్టెన్తో సహా నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. మూడు వారాల్లో జమ్మూ ప్రాంతంలో ఇది మూడో అతిపెద్ద ఉగ్రవాద ఘటన. దీనికి ముందు కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. అంతేసంఖ్యలో సైనిక సిబ్బంది గాయపడ్డారు.అంతకుముందు జూలై 9న కిష్త్వార్ జిల్లా సరిహద్దుల్లోని అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఉగ్రవాదులు పారిపోయారు. జూన్ 26న గండో ప్రాంతంలో ఒక రోజంతా జరిగిన ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అదేవిధంగా జూన్ 12న జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది, ఒక ప్రత్యేక పోలీసు అధికారి గాయపడటంతో దోడాలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరం చేశారు.గండోలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఒక పోలీసు గాయపడ్డాడు. 2005- 2021 మధ్య భద్రతా దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించిన తర్వాత జమ్ము ప్రాంతం సాపేక్షంగా శాంతియుతంగా ఉంది. అయితే ఈ ప్రాంతంలో గత నెల నుంచి ఉగ్రవాద దాడులు పెరిగాయి. ఇటీవల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన దాడిలో తొమ్మిది మంది మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు. -
పసిడి వెలుగులు
న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగులు పెడుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయర్క్ కమోడిటీ ఎక్సే్చంజ్లో చురుగ్గా ట్రేడవుతున్న ఆగస్టు కాంట్రాక్ట్ ధర ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో ఔన్స్కు (31.1గ్రా) ఆల్టైమ్ హై 2,469 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోత అంచనా, ఈటీఎఫ్ల డిమాండ్, డాలర్ స్థిరత్వం వంటి అంశలు దీనికి కారణం. ఢిల్లీలో ఐదురోజుల్లో రూ.1,300 అప్ ఇక అంతర్జాతీయ ట్రెండ్కు తోడు ఆభరణ వర్తకుల డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర దేశ రాజధాని న్యూఢిల్లీలో వరుసగా ఐదవ రోజూ పెరిగింది. పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర మంగళవారం రూ.550 పెరిగి రూ.75,700కు చేరింది. గడచిన ఐదు సెషన్లలో రేటు రూ.1,300 పెరిగింది. -
సీట్లు పెరిగినా.. సీఎస్ఈకే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి సీట్లు భారీగా పెరిగాయి. ఇప్పటివరకూ రెండు దశల కౌన్సెలింగ్ చేపట్టారు. వీటిల్లో 59,917 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది 57,152 సీట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పోలిస్తే ఈ సంవత్సరం 2,765 సీట్లు పెరిగాయి. ఐఐటీల్లో స్వల్పంగా సీట్లు పెరిగితే, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ నిధులతో నడిచే జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులను చేర్చారు. వీటిల్లోనూ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. మరికొన్ని కోర్సులకు అనుమతి రావాల్సి ఉంది. కొన్ని జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులతో ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేసే వీలుంది. దీంతో ఆఖరి దశ కౌన్సెలింగ్ నాటికి మరికొన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. దీనిపై త్వరగా నిర్ణయం వెల్లడించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకవైపు సీట్లు పెరిగినా... ప్రధాన కాలేజీల్లో డిమాండ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం అన్ని ప్రాంతాల్లోనూ విద్యార్థులు పోటీ పడుతున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సంపాదించిన వారి మధ్య కూడా ఈసారి పోటీ కన్పిస్తోంది. జాతీయ స్థాయిలో డిమాండ్ జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)కు భారీగా డిమాండ్ కని్పస్తోంది. జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్లో ఇది స్పష్టంగా కన్పిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఎక్కువ మంది సీఎస్ఈకే దరఖాస్తు చేశారు. గత ఏడాది కన్నా కటాఫ్ పెరిగినప్పటికీ టాప్ కాలేజీల్లో పోటీ మాత్రం ఈసారి కాస్త ఎక్కువగానే కని్పస్తోంది. వాస్తవానికి దేశంలోని 23 ఐఐటీల్లో గత ఏడాది 17,385 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఈ సంవత్సరం 17,740 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.జాతీయ కాలేజీల్లోనూ ఈసారి కొన్ని కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. వీటిల్లో కొన్నింటికి అనుమతులు రాగా.. మరికొన్నింటికి రావాల్సి ఉంది. ఆఖరి దశ కౌన్సెలింగ్ వరకూ ఎన్ఐటీల్లో సీట్లు పెరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం 121 విద్యాసంస్థల్లో ఈ ఏడాది 59,917 సీట్లు భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్ పూర్తికాగా, మరో మూడు దశలు ఉంది. టాప్ కాలేజీల్లోనూ... దేశంలోని ప్రధాన ఐఐటీలు, ఎన్ఐటీల్లో కంప్యూటర్ సైన్స్కు పోటీ ఎక్కువగా ఉంది. అయితే, దూర ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో పెద్దగా పోటీ కన్పించలేదు. ఈ ప్రాంతాల్లో లక్షల్లో ర్యాంకులు వచి్చన వాళ్లకూ సీట్లు దక్కుతున్నాయి. తిరుపతి ఐఐటీలో సీట్లు ఈసారి 244 నుంచి 254కు పెరిగాయి. అయితే, సీఎస్ఈ ఓపెన్ కేటగిరీలో బాలురకు 4,522, బాలికలకు 6,324 ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఈసారి ఇక్కడ నాలుగేళ్ల ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ సీఎస్ఈ వైపే పోటీ కని్పంచింది. వరంగల్ ఎన్ఐటీలో కూడా సీట్లు 989 నుంచి 1049కు పెరిగాయి. ఇక్కడ 60 సీట్లతో ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సును ప్రవేశ పెట్టారు.అయితే, సీఎస్ఈకి ఇక్కడ బాలురకు ఓపెన్ కేటగిరీలో 201, బాలికలకు 3,527 ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఐఐటీ గాం«దీనగర్లో 288 నుంచి 370కు గత ఏడాదే పెంచారు. ఈసారి కొత్తగా 30 సీట్లు అదనంగా ఇచ్చారు. ఇక్కడ కూడా 90 శాతం మంది సీఎస్ఈకే దరఖాస్తు చేశారు. ఐఐటీ బాంబే 1,358 నుంచి 1,368కి, ధార్వాడ్లో 310 నుంచి 385కు, భిలాయ్లో 243 నుంచి 283కు, భువనేశ్వర్లో 476 నుంచి 496కు, ఖరగ్పూర్లో 1,869 నుంచి 1,889కి, జోథ్పూర్లో 550 నుంచి 600కు, పట్నాలో 733 నుంచి 817కు, గువాహటిలో 952 నుంచి 962కు సీట్లు పెరిగాయి. ఈ పెరిగిన సీట్లతో పోలిస్తే సీఎస్సీ కోసం పోటీ పడిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కన్పిస్తోంది. -
టోలు ఒలుస్తున్నారు!
సాక్షి, అమరావతి: వాహనంతో రోడ్డెక్కితే చాలు ‘టోలు’ ఒలిచేస్తున్నారు. దేశంలో టోల్ చార్జీల రాబడి రికార్డుస్థాయిలో పెరిగింది. దేశంలో 2023–24లో రూ.64,809 కోట్లు టోల్ చార్జీల రూపంలో వసూలు చేయడం విశేషం. ఇది 2022–23 కంటే 39శాతం అధికం. కేంద్ర ప్రభుత్వం ‘బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్’(బీవోటీ) విధానంలో జాతీయ రహదారులను నిర్మిస్తుండటంతో కొత్త రహదారులు టోల్ చార్జీల పరిధిలోకి వస్తున్నాయి. దేశంలో 2022 డిసెంబర్ నాటికి 35,996 కి.మీ.మేర టోల్ చార్జీలు వసూలు చేసే జాతీయ రహదారులు ఉండేవి. కాగా, 2023 డిసెంబర్ నాటికి జాతీయ రహదారులు 45,428 కి.మీ.కు పెరిగాయి. దాంతోపాటు వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో టోల్ చార్జీల రూపంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ)కు ఆదాయం అమాంతంగా పెరుగుతోంది. 8 కోట్లకుపైగా ఫాస్టాగ్లు వాహనదారుల నుంచి టోల్ చార్జీల వసూలు చేసేందుకు 2023, డిసెంబర్ నాటికి 8కోట్లకు పైగా ఫాస్టాగ్లను జారీచేశారు. దీంతో ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున రూ.147.31కోట్లు టోల్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. ఇక త్వరలోనే శాటిలైట్ ఆధారిత టోల్ ఫీజు విధానాన్ని ఎన్హెచ్ఏఐ ప్రవేశపెట్టనుంది. టోల్ చార్జీలను కూడా దశలవారీగా పెంచనుంది.వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలు పెంచాలని ఎన్హెచ్ఏఐ ముందుగా నిర్ణయించింది. కానీ, సాధారణ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం అమలును రెండు నెలలు వాయిదా వేసింది. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత 5శాతం టోల్ చార్జీలను పెంచింది. శాటిలైట్ ఆధారిత టోల్ ఫీజు అమల్లోకి వచ్చినప్పుడు మళ్లీ పెంచే అవకాశం ఉంది. దీంతో వాహనదారులపై టోల్ చార్జీల భారం మరింత పెరగనుంది. -
వంట చేయాలంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. తీవ్రమైన వేడిగాలులు ఈ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయలు, పప్పుల ధరలపైన కూడా కనిపిస్తోంది. ఇప్పటికే కూరగాయలు, పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయి. వీటి సరఫరా తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా బంగాళదుంపలు, టమాటా, ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు వాటిని కొనుగోలు చేయాలంటే ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.కూరగాయల ద్రవ్యోల్బణం అత్యంత అస్థిరంగా ఉంటుంది. వేడిగాలులు, భారీ వర్షాలు, పంట నష్టం మొదలైన పరిస్థితుల కారణంగా కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 11 నెలల కనిష్ట స్థాయి అంటే 4.8 శాతానికి పడిపోయింది. వెల్లుల్లి, అల్లం ద్రవ్యోల్బణం మార్చి , ఏప్రిల్లలో మూడు అంకెలలో ఉంది.పప్పులు, కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే సరఫరా తగినంతగా లేదు. ప్రతికూల వాతావరణం కూరగాయల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేడిగాలు ఇదే రీతిన కొనసాగితే ధరలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైన అధిక ధరలను అరికట్టడానికి కూరగాయలు, పప్పుల దిగుమతులను సరళీకరించాలని వారు సూచిస్తున్నారు. -
ప్రైవేట్ కాలేజీల్లో 50 శాతం పెరిగిన ఇంటర్ ఫీజులు...‘ఇంటర్’ ద డ్రాగన్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ ఫీజుల మోత మోగుతోంది. ప్రైవేటు కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు పెంచేశాయి. గత ఏడాదితో పోలి స్తే ఏకంగా 40–50% అదనంగా డిమాండ్ చేస్తున్నా యి. ఇటీవలే టెన్త్ పరీక్షలు మొదలైన నేపథ్యంలో.. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్మీడియట్లో చేర్చేందుకు కాలేజీల్లో ఆరా తీస్తున్నారు. ఇదే అదనుగా కాలేజీల యాజమాన్యాలు ఫీజు దోపిడీకి తెరతీశాయి. నిర్వహణ ఖర్చు, బోధన వ్యయం పెరిగిందని చెప్పుకొస్తున్నాయి. కాలేజీలు చెప్తున్న ఫీజుల మొత్తాన్ని చూసి.. తల్లిదండ్రులు హతాశులవుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని.. ఫీజుల నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీల అడ్డగోలు ఫీజు వ్యవహారంపై ఇంటర్ బోర్డు అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఫీజుల కట్టడిపై రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేకంగా ఆదేశిస్తే తప్ప ప్రస్తుతం తామేమీ చేయలేమని అంటున్నారు. 4 లక్షల మంది విద్యార్థులపై భారం రాష్ట్రంలో ఏటా 4 లక్షల మంది వరకు విద్యార్థులు టెన్త్ పాసవుతున్నారు. గత ఏడాది గణాంకాలను చూస్తే ఇంటర్ ఫస్టియర్లో 3,27,202 మంది చేరారు. రాష్ట్రంలో మొత్తం 3,339 ఇంటర్ జూనియర్ కాలేజీలు ఉండగా.. అందులో ప్రైవే టువి 1,441 ఉన్నాయి. వాటిలో 2,02,903 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోనూ 2 లక్షల మందికిపైగా ప్రైవేటు కాలేజీల్లోనే ఉంటారు. వారంతా కాలేజీల యాజ మాన్యాలు చెప్పినంత ఫీజులు కట్టాల్సి న పరిస్థితి. వాస్తవానికి కరోనా మహ మ్మారి ఎఫెక్ట్ తర్వాత కాలేజీలు ఏటా 10– 20% మేర ఫీజులు పెంచుతున్నాయి. ఈసారి గరిష్టంగా 50% వర కూ పెంచాయి. అన్ని ఖర్చులు పెరిగాయి కాబట్టి ఫీజులు పెంచుతున్నామని యాజమాన్యాలు చెప్తున్నాయి. కోవిడ్ సమయంలో కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారని, కొరత కారణంగా ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని అంటున్నాయి. నిర్వహణ భారం పెరిగిందని చెప్పుకొస్తున్నాయి. అఫిలియేషన్ ఫీజు పెంచకున్నా.. రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు మూడు కేటగిరీల కింద అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇస్తుంది. ప్రతీ విద్యాసంస్థలో గరిష్టంగా 960 మందిని చేర్చుకునేందుకు అనుమతిస్తారు. అఫిలియేషన్ ఫీజు కింద ఏటా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాలేజీల నుంచి రూ.1.20 లక్షలు, మున్సిపాలిటీల పరిధిలోని కాలేజీల నుంచి రూ.60 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల నుంచి రూ.20వేల చొప్పున వసూలు చేస్తారు. రెండేళ్లకోసారి ఈ ఫీజులను సమీక్షించి పెంచాల్సి ఉన్నా.. ఇంటర్ బోర్డు కొన్నేళ్లుగా పెంచలేదు. 50శాతం దాకా పెంపు.. సాధారణ జూనియర్ కాలేజీల్లో గత ఏడాది వరకూ గరిష్టంగా రూ.60 వేల ఫీజు ఉంటే.. ఈసారి రూ.90 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. కార్పొరేట్ కాలేజీలు రూ.1.25 లక్షల నుంచి రూ. 2 లక్షలకుపైగా (కాలేజీని బట్టి) డిమాండ్ చేస్తున్నాయని.. అదే హాస్టల్నూ కలిపితే ఏకంగా రూ.3.25 లక్షల వరకు చెప్తున్నారని వాపోతున్నారు. కార్పొరేట్ కాలేజీలు ఫీజులు పెంచడాన్ని చూసి.. సాధారణ కాలేజీలు కూడా పెంచుతున్నాయని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల పరిధిలోనూ వార్షిక ఫీజులను రూ.75 వేలకు తక్కువ వసూలు చేయడం లేదని అంటున్నారు. మరోవైపు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్కుల ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే 20శాతం మేర పెరిగాయని.. ప్రైవేటు కాలేజీల రవాణా, ఆటో చార్జీలు కూడా 30శాతం వరకూ పెంచారని తల్లిదండ్రులు చెప్తున్నారు. దీంతో ఇంటరీ్మడియట్ విద్య కోసమే రూ.లక్షల్లో వెచి్చంచాల్సి వస్తోందని వాపోతున్నారు. అంత ఫీజు ఎలా కట్టగలం? ఇటీవల టెన్త్ పరీక్షలు రాసిన మా అబ్బాయిని చేరి్పంచాలంటూ ఓ ప్రైవేటు కాలేజీ సిబ్బంది వెంటపడ్డారు. అడ్మిషన్ కోసం వెళ్తే ఏటా రూ.2.25 లక్షల ఫీజు అని చెప్పారు. కావాలంటే ఓ రూ.25 వేలు రాయితీ ఇస్తామన్నారు. అంత ఫీజేమిటని అడిగితే ఈ ఏడాది ఖర్చులు పెరిగాయని, అందుకే ఫీజులు పెంచామని చెప్పారు. రెండేళ్లకు రూ.4 లక్షల ఫీజు ఎలా కట్టగలం. వేరే కాలేజీల్లో ఆరా తీసినా అడ్డగోలుగా పెంచారు. ప్రభుత్వం నియంత్రణ చేపడితే పేదలకు ఊరటగా ఉంటుంది. – సుచిత్ర, ఇంటర్ విద్యార్థి తల్లి, హైదరాబాద్ దోపిడీని నియంత్రించకుంటే ఆందోళన ప్రైవేటు కాలేజీల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సర్కారు నుంచి ఏ విధమైన ఆదేశాలూ లేకపోవడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. పేదలు భరించలేని విధంగా కాలేజీలు ఫీజులు పెంచుతున్నాయి. తక్షణమే నియంత్రణ చేపట్టాలి. లేని పక్షంలో ఆందోళనలు చేపడతాం. – టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కార్పొరేట్ ఆగడాలను అడ్డుకోరా? అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తవకుండానే ప్రైవేటు ఇంటర్ కాలేజీలు అడ్మిషన్లు చేపట్టడం చట్ట విరుద్ధం. దీనికితోడు పేదలు ఏమాత్రం భరించలేని విధంగా ఫీజులు పెంచడం దుర్మార్గం. పాలక వర్గాలు దీన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయి. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి.. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ఫీజు దోపిడీని అడ్డుకోవాలి. – చింతకాయల ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఫీజుల నియంత్రణ అవసరం కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారం ఫీజులు పెంచడం వల్ల అన్ని కాలేజీలూ ఆ నింద మోయాల్సి వస్తోంది. ప్రభుత్వమే కాలేజీలను కేటగిరీలుగా విభజించి, ఫీజుల నిర్ణయం చేయాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. పేదలకు ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవడానికి ఫీజుల కట్టడి చట్టాలు అవసరం. – గౌరీ సతీశ్, తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఫిర్యాదులు వస్తున్నాయి.. పరిశీలిస్తున్నాం ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై అన్ని వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నియంత్రణ కోసం ఏం చేయాలనేది పరిశీలిస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇంటర్ బోర్డ్ సిద్ధంగా ఉంది. – జయప్రదాబాయి, ఇంటర్ బోర్డ్ సీనియర్ అధికారి -
అమర్నాథ్కు పెరిగిన భక్తుల సంఖ్య!
అమర్నాథ్ యాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీనికి 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించడమే కారణమని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. దీనిని తొలగించకముందు మధ్యప్రదేశ్ నుంచి ఏటా అరమ్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్య 26 నుంచి 30 వేలు కాగా, దీనిని తొలగించిన తర్వాత యాత్రికుల సంఖ్య 40 వేలకు చేరుకుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుండి ప్రారంభం కానుంది. ఇది ఆగస్టు 19 న రక్షాబంధన్ వరకు కొనసాగనుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు భక్తుల ప్రయాణాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఈ తేదీని ప్రకటించిన వెంటనే ప్రయాణికులు రైలు రిజర్వేషన్ల కోసం ప్రయత్నించనున్నారు. అయితే కొందరు ప్రయాణ తేదీలను అంచనా వేస్తూ రిజర్వేషన్లు చేయించుకుటున్నారని సమాచారం. ఈసారి మధ్యప్రదేశ్ నుంచి అమర్నాథ్ వెళ్లే యాత్రికుల సంఖ్య 45 వేలు దాటుతుందని ఓం శివసేవా శక్తి మండల్ సంస్థ అంచనా వేసింది. ఎంపీ నుంచి 2018లో 35 వేల మంది అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. 2019లో 30 వేల మంది అమర్నాథ్ యాత్ర చేశారు. అయితే 2020, 2021లలో కరోనా కారణంగా అమర్నాథ్ యాత్ర జరగలేదు. 2022లో 35 వేల మంది, 2023లో 40 వేల మంది అమర్నాథ్ను దర్శించుకున్నారు. -
కియా కార్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతోంది. ఏప్రిల్ 1 నుంచి సవరించిన ధరలు అమలులోని రానున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ముడిసరుకు ధరలు, సరఫరా సంబంధిత వ్యయాల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ధరలను పెంచడం ఈ ఏడాది ఇదే తొలిసారి అని కియా తెలిపింది. -
రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు - వాటివైపే కొనుగోలుదారుల చూపు!
రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకి పెరుగుతోంది. ప్లాట్ల్స్ లేదా అపార్ట్మెంట్ కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అయితే గత కొంత కాలంగా పెద్ద ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో భారతదేశంలో ఏడు ప్రధాన నగరాల్లో సగటు అపార్ట్మెంట్ సైజులు గత ఏడాది 11 శాతం పెరిగాయి. పెద్ద ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2022లో 1175 చదరపు అడుగులు ఉన్న అపార్ట్మెంట్ల పరిమాణం 2023 నాటికి 1300 చదరపు అడుగులకు చేరిందని అనరాక్ రీసెర్చ్ ఒక నివేదికలో వెల్లడించింది. 2020, 2021 కంటే కూడా 2023లో ఢిల్లీ NCR, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, హైదరాబాద్, కోల్కతా, పూణే, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఫ్లాట్స్ పరిమాణం పెరిగినట్లు తెలిసింది. 👉ఢిల్లీ NCRలో ఫ్లాట్ పరిమాణం అత్యధిక వృద్ధిని సాధించింది. అంటే 2022లో 1375 చదరపు అడుగులు ఉన్న ప్లాట్ 2023 నాటికి 1890 చదరపు అడుగులకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ఈ నగరంలో పరిమాణం 37 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. కొనుగోలుదారుల డిమాండ్ విలాసవంతమైన అపార్ట్మెంట్ల వైపు తిరగడం వల్ల డెవలపర్లు పెద్ద అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. 👉హైదరాబాద్లో 2022లో 1775 చదరపు అడుగులున్న ప్లాట్ 2023 నాటికి 2300 చదరపు అడుగులకు చేరింది. అంటే హైదరాబాద్లో ప్లేట్ సైజు 30 శాతం పెరిగింది. 👉బెంగళూరులో, సగటు ఫ్లాట్ పరిమాణం 2023వ సంవత్సరంలో 26% పెరిగింది. 2022లో 1,175 చదరపు అడుగుల నుంచి 2023లో 1,484 చదరపు అడుగులకు పెరిగింది. 👉పూణేలో సగటు ఫ్లాట్ పరిమాణాలు 2022లో 980 చదరపు అడుగుల నుంచి 2023లో 11% పెరిగి 1,086 చదరపు అడుగులకు చేరుకున్నాయి. 👉చెన్నైలో ప్లాట్ పరిమాణం 2022 కంటే 5 శాతం పెరిగింది. 2022లో 1200 చదరపు అడుగులున్ ఫ్లాట్ సైజు 2023 నాటికి 1260 చదరపు అడుగులకు చేరింది. ఇదీ చదవండి: ముందుగానే హింట్ ఇచ్చిన నిర్మలమ్మ - నాలుగు అంశాలు కీలకం -
రాష్ట్రంలో డిపాజిట్లు పెరిగాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిపాజిట్లు, క్రెడిట్ పెరిగినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో ఏపీలో డిపాజిట్ల వార్షిక సగటు వృద్ధి 9.4 శాతం ఉంటే.. అదే సమయంలో ప్రజలకు అవసరమైన క్రెడిట్ కూడా వార్షిక సగటు వృద్ధి 14.3 శాతం నమోదైనట్లు పేర్కొంది. ఐదేళ్లలో బ్యాంకుల్లో ప్రజల డిపాజిట్లు సగటు వార్షిక వృద్ధి 9.4 శాతం నమోదవ్వడం అంటే ప్రజల ఆదాయాలు పెరగడమే నిదర్శనంగా కనిపిస్తోంది. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలు సత్ఫలితాలిచ్చాయనడానికి డిపాజిట్లలో వృద్ధి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక నవరత్నాలు ద్వారా అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నేరుగా నగదు బదిలీని అమలుచేసింది. అలాగే, బ్యాంకుల ద్వారా పేదలతో పాటు రైతులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు, ఎంఎస్ఎంఈలతో పాటు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వారి ఆదాయాలు మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా.. ► ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను చేపట్టింది. దీంతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో వార్షిక సగటు క్రెడిట్ వృద్ధి 14.3 శాతం నమోదైంది. ► అలాగే, ఇచి్చన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నావడ్డీ పథకాన్ని అమలుచేస్తోంది. ► అంతేకాక.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలను ఇప్పిస్తోంది. ► వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నావడ్డీకే రుణాలు ఇప్పిస్తోంది. ► ఇక వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆరి్థక సాయం అందించడంతో పాటు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించడమే కాకుండా వ్యాపారాలు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ► దీంతో ఈ వర్గాలన్నింటికీ బ్యాంకులు విరివిగా రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఇలా రుణాలు తీసుకున్న వారు సకాలంలో వాటిని తిరిగి చెల్లిస్తున్నారు. -
అదానీ పవర్ ఆకర్షణీయం - గణనీయంగా పెరిగిన లాభం
న్యూఢిల్లీ: అదానీ పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.9 కోట్లతో పోల్చి చూసినప్పుడు ఎన్నో రెట్ల వృద్ధితో రూ.2,738 కోట్లకు దూసుకుపోయింది. మొత్తం ఆదాయం సైతం రూ.8,290 కోట్ల నుంచి రూ.13,355 కోట్లకు వృద్ధి చెందింది. మహన్ వద్ద 1,600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం ప్రణాళిక ప్రకారమే కొనసాగుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఇనార్గానిక్ (ఇతర సంస్థల కొనుగోళ్లు) మార్గంలో తమ నాయకత్వ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొమ్మిది నెలల్లో ముంద్రా, ఉడుపి, రాయిపూర్, మహన్ ప్లాంట్లు అధిక విక్రయాలకు సాయపడినట్టు తెలిపింది. అదే సమయంలో గొడ్డా ప్లాంట్ నుంచి అదనపు ఉత్పత్తి తోడైనట్టు వివరించింది. బంగ్లాదేశ్ విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఇది (గొడ్డా ప్లాంట్) కీలక భాగంగా మారినట్టు పేర్కొంది. మూడో త్రైమాసికంలో 21.5 బిలియన్ యూనిట్ల విద్యుత్ను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 11.8 బిలియన్ యూనిట్లుగానే ఉంది. రుణాలకు చేసే వ్యయాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.946 కోట్ల నుంచి రూ.797 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంత్సరం డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి నికర లాభం 230 శాతం పెరిగి రూ.18,092 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.5,484 కోట్లుగా ఉంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అదానీ పవర్ షేరు 4 శాతానికి పైగా లాభపడి రూ.542 వద్ద ముగిసింది. -
‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్!
పతంగులు ఎగురవేసే అభిరుచి కలిగినవారికి మకర సంక్రాంతి ఎంతో ప్రత్యేకం. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని వారణాసి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వారణాసి గగనతలంలో ప్రత్యేక గాలిపటాలు సందడి చేస్తున్నాయి. ఈసారి వారణాసి మార్కెట్లో ‘బుల్డోజర్ బాబా’ గాలిపటాలకు అత్యధిక డిమాండ్ ఏర్పడింది. ఈ బుల్డోజర్ బాబా గాలిపటంపై సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు ఉన్నాయి. దీంతోపాటు బుల్డోజర్ బాబా బొమ్మకు కూడా చోటు దక్కింది. అంతే కాదు ఈ గాలిపటంపై భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కమలాన్ని కూడా ముద్రించారు. దుకాణదారుడు అరవింద్ మాట్లాడుతూ బుల్డోజర్ బాబా గాలిపటాలను యువత అమితంగా ఇష్టపడుతున్నారని, అందుకే వాటిని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. వారణాసిలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ‘బుల్డోజర్ బాబా’ పతంగికి డిమాండ్ ఉంది. ఈ గాలిపటం ధర 5 నుంచి 15 రూపాయల వరకు ఉంది. గాలిపటాలంటే అమితమైన ఇష్టం ఉన్న వారణాసి కుర్రాడు ఆదిత్య ఈసారి మకర సంక్రాంతికి బుల్డోజర్ బాబా గాలిపటం ఎగురవేస్తానని చెప్పాడు. యోగి ఆదిత్యనాథ్ యూపీలో తన ‘బుల్డోజర్’ చర్యలతో మాఫియా వెన్ను విరిచి, చట్టబద్ధ పాలనను తీసుకొచ్చారని ఆదిత్య పేర్కొన్నాడు. సీఎంకు మద్దతుగా తాను ఈ గాలిపటాన్ని ఎగురవేస్తానన్నారు. ఇది కూడా చదవండి: 25 అడుగుల జాయింట్ కైట్ ఎగురుతుందిలా.. -
బై బై మాల్దీవులు చలో లక్షద్విప్
సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజూ వందలాది మంది టూరిస్టులు మాల్దీవులకు వెళ్తారు. హైదరాబాద్ నుంచి కేవలం రెండున్నర గంటల ప్రయాణం కావడం, ఎక్కువ సంఖ్యలో దీవులు, ఆకట్టుకునే బీచ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో మూడు, నాలుగు రోజుల పాటు గడిపేందుకు ఆసక్తి చూపుతారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొద్ది రోజులుగా ఈ టూర్లు పూర్తిగా తగ్గిపోయాయి. సాక్షి, హైదరాబాద్: పర్యాటకులకు స్వర్గధామంగా భావించే మాల్దీవుల పట్ల నగరవాసులు విముఖతను ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి మాల్దీవులకు రోజూ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. పర్యాటకులతోపాటు కొత్తగా పెళ్లయిన జంటలు మాల్దీవులను హనీమూన్కు ఎంపిక చేసుకుంటారు. అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్లకు కూడా మాల్దీవులు కొంతకాలంగా కేరాఫ్గా మారింది. కానీ ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంతోపాటు నగరం నుంచీ అక్కడికి వెళ్లే పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పడిపోయింది. ఇప్పటికే ప్యాకేజీలు బుక్ చేసుకున్న వాళ్లు పర్యటనలు వాయిదా వేసుకుంటుండగా, కొత్తగా ఎలాంటి బుకింగ్లు కావడం లేదని హైదరాబాద్కు చెందిన పలు ట్రావెల్స్ సంస్థలు తెలిపాయి. పలు ఎయిర్లైన్స్, ట్రావెల్స్ సంస్థలు విమాన, ప్యాకేజీ చార్జీలను తగ్గించినప్పటికీ మాల్దీవులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని నగరానికి చెందిన ఒక ప్రముఖ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. సంక్రాంతి సందర్భంగా వరుస సెలవులను దృష్టిలో ఉంచుకుని వెళ్లే వాళ్లు కూడా తమ పర్యటనలను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దీంతో కొత్త సంవత్సరం సందర్భంగా ఉండే డిమాండ్ కూడా బాగా తగ్గిందన్నారు. లక్షద్విప్ వైపు సిటీ చూపు.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా నగర పర్యాటకులు లక్షద్విప్ను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో లక్షద్వీప్కు పర్యాటక ప్యాకేజీలు, విమాన చార్జీలు కూడా పెరిగాయి. లక్షద్విప్లో రెండు రోజుల క్రూయిజ్ పర్యటనకు గతంలో రూ.20 వేలు ఉంటే ప్రస్తుతం రూ.35 వేల వరకు ప్యాకేజీ ధరలు పెరిగాయి. ప్యాకేజీల వివరాలను తెలుసుకొనేందుకు పదుల సంఖ్యలో ఫోన్కాల్స్ వస్తున్నట్లు సికింద్రాబాద్కు చెందిన ఒక పర్యాటక సంస్థ ప్రతినిధి చెప్పారు. లక్షద్విప్తోపాటు సమీప ప్రాంతాల్లో పర్యటించేందుకూ సిటీజనులు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు గోవా, డామన్ డయ్యూ, కోవలం తదితర ప్రాంతాలకు సైతం సిటీ టూరిస్టులు తరలివెళ్తున్నారు. ప్యాకేజీల్లో భారీ రాయితీలు ఒక్కసారిగా మాల్దీవులకు వెళ్లే టూరిస్టులు తగ్గిపోవడంతో ట్రావెల్స్ సంస్థలు, ఎయిర్లైన్స్ భారీ ఆఫర్లతో ముందుకొచ్చాయి. గతంలో మూడు రోజుల ప్యాకేజీ రూ.55,000 నుంచి రూ.72,000 వరకు ఉంటే దాన్ని ఇప్పుడు రూ.45,000 నుంచి రూ.60,000 వరకు తగ్గించినట్లు ఒక ట్రావెల్ ఏజెంట్ చెప్పారు. అలాగే రూ.లక్షల్లో ఉండే ప్రీమియం ప్యాకేజీలపైనా భారీ తగ్గింపును ప్రకటించారు. ప్రీమియం ప్యాకేజీలపై రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు తగ్గించినట్లు మరో ట్రావెల్స్ ప్రతినిధి తెలిపారు. విమానంలో సింగిల్ జర్నీ గతంలో రూ.20 వేల వరకు ఉంటే ఇప్పుడు రూ.15వేల వరకు తగ్గించారు. మరోవైపు ఇప్పటికే బుకింగ్లు చేసుకున్నవారు మాత్రం తమ పర్యటనలను రద్దు చేసుకోకుండా వాయిదా వేసుకుంటున్నారు. బుకింగ్లను రద్దు చేసుకుంటే భారీగా నష్టపోయే అవకాశం ఉండటంతో వాయిదా వేసుకుంటున్నారు. కానీ కొత్తగా బుకింగ్లు మాత్రం కావడం లేదు. అన్ని ట్రావెల్స్ సంస్థల్లో మాల్దీవులకు బుకింగ్లు పూర్తిగా స్తంభించాయి. -
‘మహాలక్ష్మి’కి భద్రత!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ వసతి కల్పించటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అదనంగా 13 లక్షల ప్రయాణికులు పెరగటంతో బస్సులు చాలక ఆర్టీసీకి కొత్త సమస్య ఎదురుకాగా, అది చాలదన్నట్టు ఇప్పుడు మరో ఇబ్బంది తలెత్తింది. బస్సులతోపాటు బస్టాండ్లు కూడా బాగా రద్దీగా మారటంతో ఒక్కసారిగా దొంగల బెడద తీవ్రమైంది. రోజురోజుకు బస్టాండ్లలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ప్రయాణికుల బ్యాగులు, సెల్ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను మాయం చేస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. బస్టాండ్లలో భద్రత ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో పోలీసు రక్షణ కావాలని ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. సొంతంగానే సెక్యూరిటీ.. గతంలో ఆర్టీసీ బస్టాండ్లలో పోలీసు భద్రత ఉండేది. పోలీసు శాఖ హోంగార్డులను కేటాయించింది. కానీ ఆ తర్వాత పోలీసు శాఖలోనే సిబ్బంది కొరత ఏర్పడటంతో వారిని ఉపసంహరించుకుని సొంత అవసరాలకు వాడుకుంటోంది. అప్పటి నుంచి ఆర్టీసీ సొంతంగానే సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటోంది. కానీ డిపోలు, బస్టాండ్లలో నియోగించేంత సంఖ్యలో సిబ్బంది లేరు. ఇప్పుడు కూడా పోలీసు శాఖ నుంచి హోంగార్డులను కేటాయించే పరిస్థితి ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆర్టీసీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రారంభించినట్టు తెలిసింది. ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. అన్ని బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు దొంగలు రెచ్చిపోతుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. పోలీసుకు ఫిర్యాదు చేస్తే ఆధారాల కోసం వారు సీసీటీవీ ఫుటేజీలు కోరుతున్నారు. కానీ అన్ని బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాలు లేవు. ఇటీవల ఎండీ నిర్వహించిన సమావేశంలో అన్ని రీజియన్ల నుంచి దొంగతనాల అంశం చర్చకు వచ్చింది. దీంతో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు కావాలో కూడా అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లతోపాటు బస్సులు నిలిపే ప్రధాన రోడ్లలోని పాయింట్ల వద్ద కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అన్నిచోట్లా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. 60 కొత్త బస్సులు సిద్ధం మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రాకముందే కొన్ని కొత్త బస్సులకు ఆర్టీసీ ఆర్డరిచ్చింది. మార్చి నాటికి 2 వేల బస్సులు రానుండగా తొలివిడతలో 60 బస్సులు సిద్ధమయ్యాయి. ఏసీ, నాన్ ఏసీ స్లీపర్, రాజధాని, ఎక్స్ప్రెస్ బస్సులు వీటిల్లో ఉన్నాయి. వీటిని బుధవారమే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించాల్సి ఉంది. కానీ, ఆ కార్యక్రమం రద్దయింది. మరో రెండుమూడు రోజుల్లో వాటిని ప్రారంభించనున్నట్టు తెలిసింది. -
మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. వాతావరణంలో నెలకొంటున్న మార్పు లు, శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చాలాచోట్ల సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మంలో 31 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా.. అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత సిర్పూర్లో 8.3 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయని.. వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్
ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్ -
ఢిల్లీని బెంబేలెత్తిస్తున్న కాలుష్య స్థాయిలు
దీపావళి తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం మరింతగా పెరిగింది. గాలి నాణ్యత ‘పేలవమైన’ కేటగిరీకి పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం ఢిల్లీ-ఎన్సిఆర్లో గాలి నాణ్యత స్థాయి 450కి చేరుకుంది. ఆనంద్ విహార్లో ఏక్యూఐ 360, ఆర్కె పురంలో 422, పంజాబీ బాగ్లో 415గా ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ-ఎన్సిఆర్లో కాలుష్యంతో పాటు పొగమంచు కమ్మేయనుంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ)దీపావళి సందర్భంగా ఢిల్లీలోని 31 ప్రదేశాలలో శబ్ద కాలుష్యాన్ని అంచనా వేసింది. వీటిలో ఏడు నిశ్శబ్ద మండలాలు, ఎనిమిది నివాస ప్రాంతాలు, 11 వాణిజ్య, ఐదు పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. నజాఫ్గఢ్లో అత్యల్ప స్థాయి శబ్ధ కాలుష్యం, కరోల్ బాగ్లో అత్యధిక శబ్ధ కాలుష్యం నమోదైంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ విశ్లేషణ ప్రకారం, దేశ రాజధానిలోని దాదాపు అన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లలో గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగాయి. దీపావళి (ఆదివారం) నాడు ఢిల్లీలో 24 గంటల సగటు పార్టికల్ మీటర్(పీఎం)10 గాఢత ఒక క్యూబిక్ మీటరుకు 430 మైక్రోగ్రాములుగా ఉంది. గత సంవత్సరం క్యూబిక్ మీటరుకు 322 మైక్రోగ్రాములు, 2021లో క్యూబిక్ మీటరుకు 748 మైక్రోగ్రాములుగా నమోదయ్యింది. అలీపూర్, పట్పర్గంజ్, నజాఫ్గఢ్, కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లలో 2022తో పోలిస్తే 2023లో పార్టికల్ మీటర్ 10 సాంద్రతలు పెరిగాయని డీపీసీసీ డేటా వెల్లడించింది. ఇది కూడా చదవండి: గాజాపై హమాస్ పట్టుకోల్పోయింది: ఇజ్రాయెల్ -
పెరిగిన వడ్డీరేట్లు - కెనరా బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిందే!
న్యూఢిల్లీ: నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ – ఐదు బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. ఇటీవలే ప్రైవే టు రంగ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇదే స్థాయిలో కొన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ను పెంచిన సంగతి తెలిసిందే. అయితే కెనరా బ్యాంక్ మాత్రం అన్ని కాలపరిమితులపై రుణ రేటును పెంచింది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన అన్ని రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. పెంచిన రేట్లు ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. కెనరా బ్యాంక్ తాజా రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం– సాధారణంగా ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలకు ప్రాతిపదికన అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ 8.70 శాతం నుంచి 8.75%కి చేరింది. ఓవర్నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు కూడా 5 బేసిస్ పాయింట్ల చొప్పున పెరిగాయి. -
ఎంపీపై దాడి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంపు
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 2+2 ఉన్న భద్రతను 4+4గా పెంచుతూ అన్ని జిల్లా అధికారులకు ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ ఆదేశాలు జారీ చేశారు.పెంచిత భద్రత నిన్నటి నుంచి రిపోర్ట్ చేయాలని సర్కులర్ లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంపు పై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు కూడా భద్రత పెంచాలని విపక్ష పార్టీల పలువురు ఎమ్మేల్యేలు, నాయకులు డీజీపీకి విజ్ఞప్తి చేసుకున్నారు. విపక్ష నేతల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోలేదని ఎన్నికల సంఘానికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇదీ చదవండి: పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ జరపాలి: సీఎం కేసీఆర్ -
భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: దేశంలోనూ, రాష్ట్రంలోనూ గడచిన ఐదేళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో సెప్టెంబర్ నెల విద్యుత్ వినియోగం నమోదైంది. జాతీయ స్థాయిలో డిమాండ్తో పోటీ పడుతున్నది మన రాష్ట్రం. 2019 సెప్టెంబర్ నెల మొత్తం వినియోగం 4,855.8 మిలియన్ యూనిట్లు కాగా రోజువారీ సగటు డిమాండ్ 161.86 మిలియన్ యూనిట్లుగా ఉంది. అదే ఈ ఏడాది అదే నెల మొత్తం డిమాండ్ 6,550.2 మిలియన్ యూనిట్లుకాగా, రోజువారీ సగటు వినియోగం 218.34 మిలియన్ యూనిట్లకు చేరింది.అంటే మొత్తం వినియోగం ఐదేళ్లలో 1,694.4 మిలియన్ యూనిట్లు, సగటు వినియోగం 56.48 మిలియన్ యూనిట్లు పెరిగింది. విద్యుత్ వినియోగం పెరుగుతున్నదంటే ఆ మేరకు రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వృద్ధి చెందుతున్నాయని అర్థం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పేదలకు ఉచిత, సబ్సిడీ విద్యుత్ను ఇవ్వడంతో పాటు వ్యవసాయానికి పూర్తిగా ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల కూడా విద్యుత్ వాడకం పెరిగింది. దీనివల్ల వ్యవసాయం సక్రమంగా జరిగి పంటలు సంవృద్ధి గా పండుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు తమ వృత్తులను నిర్వర్తిస్తూ, విద్యుత్ బిల్లుల భారం లేకుండా ఆర్థి కంగా స్థిరపడుతున్నారు. ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. విదేశీ బొగ్గుకు అనుమతి పొడిగింపు.. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 142 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. గడచిన ఐదేళ్లలో ఇదే గరిష్టం. ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ 238 గిగావాట్లు జరిగితే సెప్టెంబరులో అది 240 గిగావాట్లకు చేరుకుంది. పెరుగుతున్న ఈ డిమాండ్ను తీర్చడానికి విద్యుత్ సంస్థలు స్వల్పకాలిక విద్యుత్ మార్కెట్లో తరచుగా విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే ఆగస్టులో బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.9.60 ఉండగా సెప్టెంబర్లో యూనిట్ రూ.9.37గా ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి. రాష్ట్రంలోనూ, దేశంలోనూ వారం రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో బొగ్గు కొరతను తీర్చేందుకు దిగుమతి చేసుకున్న బొగ్గు (విదేశీ బొగ్గు)ను సమకూర్చుకోవడానికి వచ్చే ఏడాది మార్చి 2024 వరకు కేంద్రం గడువు పొడిగించింది. -
మార్కెట్లో పెరిగిన ప్యాసింజర్ వెహికల్ సేల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల హోల్సేల్ అమ్మకాలు ఆగస్ట్లో 3,59,228 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 9% వృద్ధి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన త్రిచక్ర వాహనాల సంఖ్య 2022 ఆగస్ట్తో పోలిస్తే గత నెలలో 38,369 నుంచి 64,763 యూనిట్లకు ఎగశాయి. టూ–వీలర్లు 15,57,429 నుంచి 15,66,594 యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వాహన విభాగంలో 16% వృద్ధితో మారుతీ సుజుకీ 1,56,114 యూనిట్ల విక్రయాలను సాధించింది. హుందాయ్ అమ్మకాలు 49,510 నుంచి 53,830 యూనిట్లకు చేరాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏడీఏ) ప్రకారం గత నెల రిటైల్లో ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 7 శాతం దూసుకెళ్లి 3,15,153 యూనిట్లు నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాల సేల్స్ 11,80,230 నుంచి 12,54,444 యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 66% ఎగసి 99,907 యూనిట్లుగా ఉన్నాయి. -
సోలార్ రేడియేషన్ ఎఫెక్ట్.. పెరిగిన ఎండలు
సాక్షి, అమరావతి: సోలార్ రేడియేషన్ (అల్ట్రా వయొలెట్ కిరణాలు) ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. సూర్య కిరణాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలు, విటమిన్ లోపం ఉన్న వ్యక్తులు అసౌకర్యానికి గురవుతారు. సాధారణంగా ఇలాంటి వాతావరణం వేసవిలోనే ఉంటుంది. వర్షాకాలం కావడం వల్ల ఆగస్టులో ఇలాంటి వాతావరణం దాదాపు ఉండదు. కానీ.. ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో మేఘాలు ఏర్పడి సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అందుకే నేరుగా ఎండ భూమిపై పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత కూడా ఆ సమయాల్లో తక్కువగా ఉండటానికి కారణం అదే. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వాతావరణంలో మార్పుల కారణంగా మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్య కిరణాలు నేరుగా భూమిపై ప్రసరిస్తున్నాయి. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 32 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సాధారణ వాతావరణం కంటే భిన్నంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ హెచ్చరించింది. 18 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఈ పరిస్థితి మరికొద్ది రోజులే ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 18వ తేదీ నుంచి కోస్తాంధ్ర అంతటా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. -
సీటు రానివారికి టెలీ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: యూపీఎస్సీ, నీట్, జేఈఈ వంటి ప్రముఖ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చి ఎంబీబీఎస్, ఐఐటీ వంటి వాటిల్లో సీటు రాని వారికి మానసిక చికిత్స అందజేసేందుకు 24 గంటల టెలీ కౌన్సెలింగ్ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఆయా పరీక్షలు రాసి కొద్ది మార్కులతో సీట్లు కోల్పోతున్నవారు అనేకమంది ఉంటున్నారు. వీరిలో కొందరు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మానసిక ఆరోగ్యం.. వర్తమాన పరిస్థితుల్లో దాని నిర్వహణ’అనే అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఓ నివేదిక తయారు చేసి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు అందజేసింది. వివరాలిలా ఉన్నాయి.. ఆత్మహత్యలు 10 శాతానికి తగ్గాలి పాఠశాలల్లోనూ మానసికంగా కుంగిపోయే విద్యార్థుల కోసం కౌన్సిలర్లను నియమించాలి. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్యను 2030 నాటికి 10 శాతానికి తగ్గించాలి. కేంద్రీకృత సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీ, స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీలను ఏర్పాటు చేయాలి. జైళ్లల్లోనూ మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మానసిక ఆరోగ్య, సమస్యలను ఆరోగ్య బీమాలో చేర్చాలి. దేశంలో 47 మానసిక చికిత్సాలయాలున్నాయి. అయితే 2017లో ఏర్పాటైన మానసిక ఆరోగ్య చట్టానికి అనుగుణంగా అవి లేవు. ఆ మేరకు వాటిని తీర్చిదిద్దాలి. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ మెంటల్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మానసిక చికిత్సకు సంబంధించిన 17 రకాల మందులను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చారు. అవన్నీ మెడికల్ కాలేజీలు, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఉన్నాయి. వాటిల్లో కనీసం 13 మందులను ప్రాథమిక ఆసుపత్రి స్థాయికి తీసుకురావాలి. పోలియో చుక్కల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు సినీ తారలు, క్రీడాకారుల వంటి ప్రముఖులతో ప్రచారం చేస్తారు. అలాగే మానసిక సమస్యలకు సంబంధించి కూడా ఆయా రంగాల ప్రముఖులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించి అవగాహన పెంచాలి. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు.. స్వయం ఉపాధి పొందుతున్నవారిలోనే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తర్వాత వేతన జీవులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ప్రైవేట్ రంగం, రైతుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 2021లో స్వయం ఉపాధికి చెందిన వారి లో 20,237 మంది ఆత్మహత్య చేసుకు న్నారు. వేతన జీవులు 15,870, నిరుద్యోగులు 13,714, విద్యార్థులు 13,089, వ్యా పారస్తులు 12,055, ప్రైవేట్రంగ ఉద్యోగులు 11,439, రైతులు 5,318, కూలీలు 5,563 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కోవిడ్ తర్వాత మానసిక సమస్యలు 28% పెరిగాయి. 2017లో 1.29 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటే, 2021లో 1.64 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్కహాల్ వల్ల 4.7 శాతం మంది, పొగాకు వల్ల 20.9 శాతం మంది మానసిక సమస్యలకు గురవుతున్నారు. డిప్రెషన్, ఉద్వేగాలు, ఇతరత్రా కారణాలతో 10.9 శాతం మందికి సమస్యలు వస్తున్నాయి. తీవ్రమైన స్కిజోఫ్రేనియా వంటి సమస్యలతో 1.4 శాతం, యాంగ్జయిటీతో 3.2 శాతం, స్ట్రెస్తో 3.7 శాతం, ఇతరత్రా ఏదో ఒక మానసిక సమస్యతో 13.7 శాతం బాధపడుతున్నారు. దేశంలో లక్ష జనాభాకు 0.75 మంది మానసిక చికిత్స నిపుణులు ఉన్నారు. అంటే 1.34 లక్షల మంది జనాభాకు ఒక మానసిక చికిత్స నిపుణుడు మాత్రమే ఉన్నారు. ప్రపంచ సగటు 1.7గా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో లక్షకు 8.6 మంది మానసిక నిపుణులు ఉన్నారు. . ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్న బడ్జెట్లో రెండు శాతమే మానసిక ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నారు. దీన్ని 10 శాతానికి పెంచాలని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక మానసిక రోగుల్లో 85 శాతం మందికి తగిన వైద్యం అందడం లేదు. మానసిక చికిత్సలను ఆయుర్వేద, యోగా పరిధిలోకి తీసుకురావాలి. జిల్లా కేంద్రంగా మానసిక వైద్యం ఉండాలి. మానసిక రోగుల్లో అవగాహన పెంచాలి జిల్లాకొక యువ స్పందన కార్యక్రమం పెట్టి 20 మందిని రిక్రూట్ చేసుకొని ప్రజల్లో మానసిక రోగాలపై అవగాహన పెంచాలి. బ్రిక్స్ దేశాల్లోని దక్షిణాఫ్రికాలో 35.8 శాతం మంది మానసిక సమస్యలున్నవారే. మన దేశంలో 30.1 శాతం మంది ఏదో ఒక మానసిక సమస్యలతో ఉన్నారు. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ, సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ -
దశాబ్దిలో రెండింతలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాల సంఖ్య గత పదేళ్ల కాలంగా గణనీయంగా పెరిగింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 70,73,109 వాహనాలు ఉండగా.. 2022–23 నాటికి 1,54,77,512కు చేరాయి. సగటున ఏడాదికి 9% చొప్పున పెరుగుదల నమోదు అయినట్లు రవాణా శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే 10 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి వచ్చాయి. ఇక రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో దాదాపు సగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం. గణనీయంగా పెరుగుతున్న ఈవీలు తెలంగాణలోని మొత్తం 1.54 కోట్ల వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 1.13 కోట్ల వరకు ఉన్నాయి. మోటారు కార్లు 20 లక్షలు, ఆటోలు 4.5 లక్షలు, స్కూలు బస్సులు 28,962, గూడ్స్ ఆటోలు 6.09 లక్షలు, ఈ–కార్ట్స్ 235, మోటారు క్యాబ్స్ 20,335, మ్యాక్సీ క్యాబ్స్ 31,060, కాంట్రాక్ట్ క్యారేజెస్ 9,244, ట్రక్కులు/ట్రాక్టర్లు 7 లక్షల వరకు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఉన్న 70 లక్షల వాహనాల్లో 50 లక్షలు ద్విచక్ర వాహనాలు కాగా కార్ల వంటి తేలికపాటి వాహనాలు 13 లక్షలు ఉన్నాయి. 2013–14 నాటికి రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్న 70.73 లక్షల వాహనాల్లో 8.22 లక్షలు రవాణా వాహనాలు ఉండగా... 63.68 లక్షలు సరుకు రవాణా వాహనాల కేటగిరీకి చెందినవి. అప్పట్లో ద్విచక్ర వాహనాలు 52.84 లక్షలు, కార్లు 7,96,232, జీపులు 14,989, ట్యాక్సీలు 74,097, బస్సులు 40,807, సరుకు రవాణా చేసే తేలికపాటి వాహనాలు 1,85,688, ట్రక్కులు/ట్రాక్టర్లు 1,25,240 ఉండేవి. సెకండ్ హ్యాండ్ మార్కెట్ను సైతం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా కొన్ని ఉత్తరాది నగరాల్లోని బడాబా బులు, సంస్థలు ఆర్థిక సంవత్సరం ముగిసేటప్పుడు పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలను ఖరీదు చేస్తుంటారు. ఆదాయపన్ను రిటర్న్స్లో లెక్కలు చూపించడానికే ఇలా చేస్తుంటారు. ఆయా సమ యాల్లో అక్కడ నుంచి భారీ సంఖ్యలో సెకండ్ హ్యాండ్ వాహనాలు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్తుంటాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్లో వాహనాల సంఖ్య 25 లక్షలు ఉండగా... గత దశాబ్ద కాలంగా ఏటా ఈ వాహనాలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లపై 46,937 విద్యుత్ (ఎలక్ట్రిక్) వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు రవాణశాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఈ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపు ఇస్తోంది. దీంతో ఏటా ఈ వాహనాల సంఖ్య పెరుగుతోందని, రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు కేవలం తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాలకు సంబంధించినవి మాత్రమే కాగా.. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్టర్ అయినవి కూడా రాష్ట్రంలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో నగరానికి వచ్చేవీ పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి ఇక్కడకు తీసుకువచ్చే వాహనాలను రిజిస్టర్ చేయించి నంబర్ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ఇప్పటికీ వేల సంఖ్యలో వాహ నాలు అక్కడి రిజిస్ట్రేషన్ నంబర్లతోనే తిరిగేస్తున్నా యి. ఈ కారణంగా వీటి సంఖ్య అధికారిక గణాంకాల్లోకి చేరట్లేదు. -
జూన్లో 12% పెరిగిన జీఎస్టీ వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది జూన్ జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ ఏడాది జూన్లో జీఎస్టీ కింద రూ.1,61,497 కోట్లు వసూలైనట్లు చెప్పారు. రాజ్య సభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవా బిచ్చారు. ఒక్క నెలలో జీఎస్టీ మొత్తం వసూళ్లు రూ.1.6 లక్షల కోట్లు అధిగమించడం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది నాలుగోసారని చెప్పారు. జీఎస్టీ వసూళ్లలో ప్రతి సంవత్సరం సాధిస్తున్న వృద్ధితో అనుకూల ధోరణి కనిపిస్తోందన్నారు. తాత్కాలికంగా అనుమతించిన జీఎస్టీ నష్టపరిహారం కింద మొత్తం సొమ్మును కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిందని, బకాయిలేమీ లేవని చెప్పారు. పార్లమెంటులో చేసిన చట్టానికి లోబడి జీఎస్టీ యాక్ట్ ప్రకారం జీఎస్టీ అమలు చేయడం ద్వారా మొదటి 5 సంవత్సరాలు 2017 జూన్ 1 నుంచి 2022 జూన్ 30 వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పడిన రెవెన్యూ నష్టాలను పూడ్చేందుకు కేంద్రం నష్టపరి హారం చెల్లించిందని తెలిపారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ప్రతి రెండు నెలల కోసారి లెక్కించి విడుదల చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వ్యవస్థను బలోపేతం చేస్తేనే మీడియేషన్ ద్వారా కేసుల పరిష్కారం: విజయసాయిరెడ్డి మధ్యవర్తిత్వం (మీడియేషన్)తో కేసులు పరిష్కరించాలంటే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్రానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సూచించారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కోటికి పైగా కేసులు పరిష్కరించాలంటే ఈ వ్యవస్థను వందరెట్లు బలోపేతం చేయాల్సి ఉంటుందన్నారు. మధ్యవర్తిత్వం బిల్లు–2021పై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశంలోని వివిధ కోర్టుల్లో నాలుగున్నర కోట్లకుపైగా కేసులు పెండింగ్లో ఉంటే.. అందులో కోటికిపైగా సివిల్ కేసులేనని తెలిపారు. దేశంలో 2022 నాటికి 570 మీడియేషన్ కేంద్రాలు, 16 వేలమంది మీడియేటర్లు ఉన్నారని చెప్పారు. ఈ సివిల్ కేసుల్లో 90 వేల కేసులను మాత్రమే పరిష్కరించగల సామర్థ్యం ప్రస్తుత మీడియేషన్ వ్యవస్థకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో బిల్లు చట్టరూపం దాలిస్తే తగినన్ని మీడియేషన్ సెంటర్లు, మీడియేటర్లు లేనందున ఆ వ్యవస్థపై మోయలేనంత భారం పడుతుందన్నారు. వ్యవస్థను వందరెట్లకు పైగా బలోపేతం చేయకపోతే ఈ బిల్లు ప్రయోజనం నెరవేరదని చెప్పారు. కమ్యూనిటీ మీడియేషన్ ఈ బిల్లులోని ప్రధాన అంశాల్లో ఒకటని, సున్నితమైన రాజకీయ అంశాలు ఇమిడి ఉండే కేసుల పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. ఇదే బిల్లుపై వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ప్రీ లిటిగేషన్ మీడియేషన్ మాండేటరీపై కేంద్రానికి పలు సూచనలు చేశారు. ప్రీ లిటిగేషన్ మీడియేషన్కు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీవవైవిధ్య పరిరక్షణకు తగినన్ని నిధులేవి? విస్తారమైన జీవవైవిధ్యం ఉన్న దేశంలో దాని పరిరక్షణకు ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.7 కోట్లు మాత్రమే కేటాయిస్తోందని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో జీవవైవిధ్య సవరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 34 జీవవైవిధ్య హాట్స్పాట్లలో నాలుగు మనదేశంలో ఉన్నాయని చెప్పారు. ఈ నాలుగు హాట్స్పాట్స్లో 90 శాతం ప్రాంతం కోల్పోయినట్లుగా డేటా చెబుతోందన్నారు. వీటి పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని కోరారు. ప్రపంచం మొత్తం మీద నమోదైన జీవరాశుల్లో 96 వేల జాతులు భారత్లోనే ఉన్నాయని తెలిపారు. 47 వేల వృక్షజాతులు, ప్రపంచంలోకెల్లా సగం నీటి మొక్కలతో భారత్ విలక్షణమైన జీవవైవిధ్యం కలిగి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా లంకమహేశ్వరం వన్యసంరక్షణ కేంద్రం, తిరుమల, సింహాచలం గిరులతోపాటు అనేక ప్రాంతాల్లో రోగచికిత్సకు వినియోగించే అరుదైన మొక్కలున్నా యని చెప్పారు.ఇలాంటి జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రభుత్వం తగినన్ని నిధులతో కార్యా చరణ చేపట్టాలని ఆయన కోరారు. ఇదే బిల్లుపై వైఎస్సార్సీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పుల తీవ్రత జీవ వైవిధ్యంపై ప్రభావం చూపుతున్న ందున ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ (సీబీడీ)లో భాగంగా దేశ అంతర్జాతీయ బాధ్యతల్లో సమన్వయం అవసరమని చెప్పారు. జీవవైవిధ్యం, ప్రయోజనాలు రక్షించడానికి కేంద్రం చొరవ చూపాలన్నారు. బిల్లులో ప్రయోజనం – భాగస్వామ్య నిబంధనలు నిర్ణయించడంలో స్థానిక సంఘాల ప్రత్యక్ష పాత్రను తీసివేయడం సరికాదని చెప్పా రు. పరిహారం విషయాల్లో జరిమానా ఎలా అంచనా వేయాలనే దానిపై న్యాయనిర్ణయ అధికారికి మార్గద ర్శకత్వం లేకపోవడం సమస్యలకు తావిచ్చేలా ఉందన్నారు. న్యాయమూర్తులు, లేదా కోర్టులకు కాకుండా ప్రభుత్వ అధికారులకు ఆ తరహా అధికారం అవసర మా అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నందున బిల్లులో ఆ అంశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. అటల్ జ్యోతి కింద ఏపీలో 5,500 సోలార్ వీధిలైట్లు అటల్ జ్యోతి యోజన ఫేజ్–2 కింద ఆంధ్రప్రదేశ్లో యాస్పిరేషనల్ జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నాల్లో 5,500 సోలార్ వీధిలైట్లు అమర్చినట్లు కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. అటల్ జ్యోతి పథకం మొదటి ఫేజ్లో ఆమోదిత రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదని చెప్పారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు మొత్తం 5,500 సోలార్ వీధిలైట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయగా వాటిని అమర్చినట్లు తెలిపారు. -
ఏపీ: ప్రభుత్వ ఉద్యోగుల HRA పెంచుతూ ఉత్తర్వులు
-
ఏప్రిల్లో ఇంధన అమ్మకాలు పెరగటానికి కారణం ఇదే!
న్యూఢిల్లీ: రబీ పంటల కోత పనులు ప్రారంభం కావడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వంటి అంశాల దన్నుతో ఏప్రిల్లో ఇంధనాలకు డిమాండ్ పెరిగింది. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే డీజిల్ అమ్మకాలు 6.7% పెరిగి 7.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలవారీగా చూస్తే మార్చితో పోల్చినప్పుడు 4.8% వృద్ధి నమోదైంది. సోమవారం వెలువడిన గణాంకాల ప్రకారం.. పెట్రోల్ అమ్మకాలు ఏప్రిల్లో వార్షికంగా 2.5% పెరిగి 2.64 మిలియన్ టన్నులకు చేరగా, నెలవారీగా మాత్రం స్వల్పంగా 0.5% మేర తగ్గాయి. రబీ పంటల కోతకు ట్రాక్టర్లను ఉపయోగిస్తుండటం వల్ల డీజిల్ వినియోగం పెరుగుతుంది. -
లాభాల బాటలో ఐసీఐసీఐ బ్యాంక్.. ఫలితాలు ఇలా!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధింంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి-మార్చి(క్యూ4)లో నికర లాభం 27 శాతం ఎగసి రూ. 9,853 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 30 శాతం జంప్చేసి రూ. 9,122 కోట్లకు చేరింది. ఇందుకు రుణాలపై పెరిగిన వడ్డీ రేట్లు సహకరించాయి. సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 40 శాతం దూసుకెళ్లి రూ. 17,667 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4 శాతం నుంచి 4.9 శాతానికి బలపడ్డాయి. రుణాల్లో 19 శాతం వృద్ధి ఇందుకు దోహదపడింది. ఆదాయం సైతం అప్ గతేడాది క్యూ4లో ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 27,412 కోట్ల నుంచి రూ. 36,109 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 17,119 కోట్ల నుంచి రూ. 22,283 కోట్లకు పెరిగాయి. స్థల మొండిబకాయిలు 3.6 శాతం నుంచి 2.81 శాతానికి దిగివచ్చాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 1,068 కోట్ల నుంచి రూ. 1,619 కోట్లకు పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.34 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం రూ. 185 కోట్ల నుంచి రూ. 235 కోట్లకు, సాధారణ బీమా లాభం రూ. 313 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు జంప్చేశాయి. -
ఏపీలో పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ వేతనం పెంపు
-
మొబైల్ డేటా వినియోగంలో భారీగా పెరుగుదల
-
వాహనదారులకు షాక్.. పెరగనున్న టోల్ చార్జీలు!
హైవేలపై ప్రయాణించే వాహదారులకు టోల్ బాదుడు మరింత పెరగనుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హోచ్ఏఐ) ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై టోల్ రేట్లను పెంచే అవకాశం ఉందని హిందీ దినపత్రిక హిందూస్థాన్ ప్రచురించింది. దీని ప్రకారం.. టోల్ రేట్లు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉంది. జాతీయ రహదారుల రుసుము నియమావళి-2008 ప్రకారం.. సాధారణంగా ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త టోల్ చార్జీ రేట్లు అమలులోకి వస్తాయి. అవసరాలను బట్టి నిర్దిష్ట టోల్ విషయమై విధాన నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. టోల్ ఫీజు పెంపు ప్రతిపాదనలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మార్చి నెల చివరి వారంలోపు పరిశీలించి ఆమోదించే అవకాశం ఉందని హిందూస్థాన్ నివేదిక పేర్కొంది. కార్లు, తేలికపాటి వాహనాలపై 5 శాతం, ఇతర భారీ వాహనాలపై 10 శాతం వరకు టోల్ చార్జీ పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులకు టోల్ ఫీజుపై రాయితీ ఇస్తూ నెలవారీ పాస్లు జారీ చేస్తుంటారు. ఆ పాస్ రుసుము కూడా 10 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Samsung Galaxy Z Fold 5: మడత అంటే ఇదీ.. పర్ఫెక్షన్ అంటే ఇదీ! -
తెలంగాణాలో భారీగా పెరిగిన అప్పులు
-
చేపల్లో మహా‘రాణి’లు!.. లొట్టలేసుకుని తింటారు.. ఎందుకంత డిమాండ్?
సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు అంతగా డిమాండ్ లేని రాణి ఫిష్ చేపలకు ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. స్థానిక మార్కెట్లో గులివిందలుగా పిలిచే ఈ చేపలు అధిక డిమాండ్, ధరలతో కొన్నాళ్లుగా మహారాణులయ్యాయి. మత్స్యకారులకు కాస్త ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. లేత ఎరుపు, పసుపు, తెలుపు, బంగారు, నీలి రంగుల చారలతో కంటికి ఒకింత ఇంపుగా కనిపించే ఈ చేపలకు చెన్నై, కేరళ రాష్ట్రాల్లో లొట్టలేసుకుని తింటారు. అరేబియా సముద్రం కంటే బంగాళాఖాతంలో లభించే ఈ చేపలకు రుచి ఎక్కువ. అందువల్ల తమిళనాడు, కేరళ ప్రాంతాల ప్రజలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. ఒడిశాలోని చిలక ప్రాంతం నుంచి మన రాష్ట్రంలోని కాకినాడ వరకు వీటి లభ్యత అధికంగా ఉంటుంది. నవంబరు నుంచి ఏప్రిల్ వరకు మత్స్యకారులకు సముద్రంలో ఇవి పెద్ద సంఖ్యలో లభ్యమవుతాయి. గతంలో చెన్నై, కేరళల నుంచి వర్తకులు విశాఖపట్నం వచ్చి వీటిని కొనుగోలు చేసి తమ ప్రాంతాలకు ఎగుమతి చేసుకునే వారు. అప్పట్లో ఇక్కడ కిలో రూ.50కి మించి కొనుగోలు చేసే వారు కాదు. అక్కడ కిలో రూ.100కు పైగా విక్రయించుకునే వారు. పైగా ఈ ప్రాంతంలో వీటికి అంతంతమాత్రపు ధరే లభించేది. కానీ కొన్నాళ్లుగా వీటికి మహా రాణి యోగం పట్టింది. కొంతమంది స్థానిక వర్తకులు ఈ రాణి చేపలను ఇక్కడ నుంచి నేరుగా చెన్నై, కేరళలకు ఎగుమతులు చేస్తున్నారు. అక్కడ కిలో రూ.130 వరకు అమ్ముతున్నారు. దీంతో ఇక్కడ రాణి ఫిష్కు అనూహ్యంగా మంచి ధర లభిస్తోంది. ఇలా ప్రస్తుతం వీటిని ట్రేడర్లు కిలో రూ.100 వరకు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో పెద్ద సైజు రాణి ఫిష్ను కిలో రూ.200 ధర కూడా పలుకుతోంది. ఇలా గతంలో అక్కడ అమ్మకం చేసే ధరే దాదాపు ఇక్కడ వస్తోంది. చదవండి: మదనపల్లెలో కశ్మీరీ కుంకుమపువ్వు అసలే వేట గిట్టుబాటు కాక సతమతమవుతున్న మత్స్యకారులు, బోటు యజమానులకు గులివిందల ధర లాభదాయకంగా ఉంటోంది. ఇది మత్స్యకారులకు ఊరటనిస్తోంది. ‘డీజిల్ ధర కొన్నాళ్లుగా మాకు పెను భారంగా మారింది. ఈ తరుణంలో సమృద్ధిగా లభ్యత, మంచి ధరతో గులివందలే ఆదుకుంటున్నాయి.’ అని మైలపిల్లి రాము అనే బోటు యజమాని ‘సాక్షి’తో చెప్పారు. రోజుకు 25–30 టన్నుల రాణి ఫిష్లు విశాఖ ఫిషింగ్ హార్బర్కు రోజుకు సగటున 150 టన్నుల చేపలు వస్తుంటాయి. వీటిలో ప్రస్తుతం రాణి ఫిష్ (గులివిందలు) చేపలు 25–30 టన్నుల వరకు ఉంటున్నాయి. వీటిలో కొనుగోళ్లు చేయగా మిగిలిన చేపలను కొన్ని రోజులపాటు ఎండబెట్టిన తర్వాత విక్రయిస్తారు. -
RBI Report: ఏపీలో జీతభత్యాల వ్యయం భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వేతనాలు, జీతాల వ్యయం గత నాలుగేళ్లలో భారీగా పెరిగింది. ఎంతగా అంటే.. 67.26 శాతం మేర పెరిగింది. ఇదే సమయంలో మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గడచిన నాలుగేళ్లలో ఈ వ్యయం కేవలం 39.34 శాతం మాత్రమే పెరిగింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై చేసిన అధ్యయన నివేదిక వెల్లడించింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అధికంగా రూ.25,086.3 కోట్ల మేర వేతనాలు, జీతాల రూపంలో వ్యయం అవుతోందని నివేదిక పేర్కొంది. అంటే.. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో జీతభత్యాల రూపంలో అధికంగా 84.5 శాతం వ్యయం అవుతోంది. అలాగే, రాష్ట్రంలో ఈ వ్యయం ఒక్క ఆర్థిక ఏడాదిలోనే ఏకంగా రూ.10 వేల కోట్లు పెరిగింది. చంద్రబాబు హయాం 2018–19లో వేతనాలు, జీతాల వ్యయం రూ.32,743.4 కోట్లు ఉండగా వైఎస్ జగన్ హయాంలో 2019–20లో రూ.42,673.8 కోట్లకు పెరిగింది. ఈ గణాంకాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బడ్జెట్ అకౌంట్లను అధ్యయనం చేసిన తరువాత ఆర్బీఐ పేర్కొంది. అలాగే, 2018–19లో వేతనాలు, జీతాల రూపంలో అకౌంట్స్ ప్రకారం రూ.32,743 కోట్లు వ్యయం కాగా.. 2022–23లో బడ్జెట్ అంచనాల ప్రకారం రూ, 54,768.4 కోట్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. అంటే నాలుగేళ్లలో రూ.22,025 కోట్ల మేర జీతభత్యాల వ్యయం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. కొత్త ఉద్యోగాలు, చిరుద్యోగుల వేతనాలు పెంపుతోనే.. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హమీ మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. అలాగే, వివిధ రంగాల్లోని 3.01 లక్షల మంది చిరుద్యోగుల వేతనాలనూ భారీగా పెంచారు. దీంతోపాటు 11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల అమలు, వైద్య ఆరోగ్యశాఖతో పాటు వివిధ శాఖల్లో వేల సంఖ్యలో కొత్తగా ఉద్యోగాలు భర్తీ.. అలాగే, గ్రామ, వార్డు సచివాలయాల్లో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించడంతో రాష్ట్రంలో జీతభత్యాల వ్యయం భారీగా పెరిగినట్లు ఆర్బీఐ తన నివేదికలో స్పష్టంచేసింది. -
విదేశీ కొలువు.. బహు సులువు.. 140కి చేరిన రిక్రూటింగ్ ఏజెన్సీలు..
మోర్తాడ్(బాల్కొండ): కరోనా కల్లోలం నుంచి తేరుకున్న తర్వాత భారత్ నుంచి విదేశాలకు వలసలు పెరిగాయి. ఇందుకు అనుగుణంగా లైసెన్స్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. విదేశాంగ శాఖ వెబ్ పోర్టల్లో పొందుపరిచిన సమాచారం ప్రకారం 2020కి ముందు తెలంగాణలో రిక్రూటింగ్ ఏజెన్సీల సంఖ్య 33 ఉండగా.. ఇప్పుడు 140కి చేరింది. ఇందులో 101 ప్రధాన కార్యాలయాలు కాగా మరో 39 వాటి శాఖలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గతంలో 11 ఏజెన్సీలుండగా ఇప్పుడు 25 ప్రధాన కార్యాలయాలు, వాటికి అనుబంధంగా 30 శాఖలు ఏర్పాటయ్యాయి. లైసెన్స్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల సంఖ్య పెరగడం వల్ల విదేశాలకు చట్టబద్ధంగా వెళ్లడానికి అవకాశం కలుగుతుంది. నకిలీ ఏజెంట్ల వల్ల మోసపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. లైసెన్స్ల జారీలో సడలింపులతో.. గతంలో రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్స్ పొందాలంటే రూ.50 లక్షల బ్యాంక్ గ్యారంటీని సమరి్పంచాల్సి వచ్చేది. ఇలా పొందిన లైసెన్స్తో ఇమ్మిగ్రేషన్ చట్టాలకు లోబడి వెయ్యి మందిని విదేశాలకు పంపించడానికి అవకాశం ఉండేది. లైసెన్స్ జారీ విధానంలో విదేశాంగ శాఖ సడలింపులు ఇవ్వడంతో రిక్రూటింగ్ ఏజెన్సీల విస్తరణకు అవకాశం ఏర్పడింది. ఇప్పుడు లైసెన్స్ పొందాలంటే రూ.8 లక్షల బ్యాంకు గ్యారెంటీ సమర్పిస్తే సరిపోతుంది. వంద మందిని విదేశాలకు పంపించడానికి అవకాశం ఉంటుంది. విదేశాలకు పంపించే వారి సంఖ్యను పెంచుకోవాలంటే బ్యాంక్ గ్యారంటీని పెంచుకోవలసి ఉంటుంది. 300కు మించి నకిలీ ఏజెంట్లు విదేశాంగ శాఖ లైసెన్స్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల వివరాలతో పాటు నకిలీ ఏజెంట్లు, ఏజెన్సీల పేర్లను వెబ్సైట్లో పొందుపరిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాలలో 300కు మించి నకిలీ ఏజెంట్లు ఉన్నారు. మోసపోయినవారి ఫిర్యాదుల ఆధారంగా నకిలీ ఏజెంట్ల వివరాలను ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో తాము మోసపోయినట్లు కొంతమంది ఫిర్యాదు చేయగా.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించకుండానే విదేశాంగ శాఖ లైసెన్స్ పొందిన ఏజెన్సీలను కూడా నకిలీ ఏజెంట్ల జాబితాలో కలిపేసి వెబ్పోర్టల్లో నమోదు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. లైసెన్స్డ్ ఏజెన్సీల ద్వారా గల్ఫ్ ఇతర దేశాలకు వెళ్లిన వారు ఒప్పందం ప్రకారం పని, వేతనం ఉన్నా.. బద్ధకంతో ఇంటిదారి పట్టి తప్పుడు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అలాంటి వారు ఇచ్చిన ఫిర్యాదులలో వాస్తవాలను గుర్తించకపోవడంతో కొన్ని లైసెన్స్డ్ ఏజెన్సీలను నకిలీ ఏజెన్సీల జాబితాలో నమోదు చేయడం వల్ల విదేశాంగ శాఖకు చెడ్డపేరు వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇమిగ్రేషన్ చట్టాలను పక్కాగా అమలు చేస్తే నకిలీ ఏజెంట్లు, ఏజెన్సీల ఆటకట్టించడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ‘వీహబ్’తోడుగా.. విజయం దిశగా.. -
గిరిజన రిజర్వేషన్లు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో ఆరుశాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గిరిజనుల జనాభా ప్రకారం వారికి సమాన వాటా ఇవ్వాలన్న లక్ష్యంతో ఆరుశాతం రిజర్వేషన్లను పదిశాతానికి పెంచింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయగా... పెంచిన 10 శాతం రిజర్వేషన్లను రోస్టర్ జాబితాలో సర్దుబాటు చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో ప్రతి పది అవకాశాల్లో ఒకటి గిరిజనులకు దక్కేలా రోస్టర్లో ఎస్టీ రిజర్వేషన్లను పొందుపర్చింది. కాస్త అటు ఇటుగా మారిన రోస్టర్ విద్య, ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల ప్రక్రియను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రోస్టర్ చార్ట్నే ప్రామాణికంగా తీసుకుంటుంది. దీని ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తుంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న రోస్టర్లో గిరిజనులకు పదిశాతం కోటాను సర్దుబాటు చేయడంతో కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ... ఇప్పటికే గిరిజనులకు రిజర్వ్ చేసిన అంకెలను రిజర్వులో కాస్త అటు ఇటుగా మార్చి పెరిగిన 4 శాతం అంకెలను సర్దుబాటు చేశారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుతో గిరిజనులకు 4 శాతం అదనంగా అవకాశాలు పెరిగాయి. ఈ క్రమంలో రోస్టర్లో కొత్తగా 15, 42, 67, 92 స్థానాల్లో గిరిజనులు అవకాశాలను దక్కించుకోనున్నారు. ఇప్పటివరకు ఈ నాలుగు పాయింట్లు జనరల్ కేటగిరీకే కేటాయించగా... తాజాగా గిరిజనులకు కేటాయిస్తూ రోస్టర్లో మార్పులు జరిగాయి. 6% రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పాయింట్లు ఎస్టీ(మహిళ): 8, 58 ఎస్టీ(జనరల్): 25, 33, 75, 83 10శాతం రిజర్వేషన్ల పెంపుతో రోస్టర్ పాయింట్లు ఎస్టీ(మహిళ): 8, 33, 75 ఎస్టీ(జనరల్): 15, 25, 42, 58, 67, 83, 92 కొత్త నియామకాలకు మార్గం సుగమం గిరిజన కోటా అంశం తేలడంతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు శాఖల్లో కొలువుల భర్తీకి అనుమతులు ఇవ్వగా... గిరిజన రిజర్వేషన్ల అంశంతో కాస్త జాప్యం నెలకొంది. ఇప్పుడు రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో కొత్తగా నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. ఇకపై గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు అమలయ్యేలా నియామకాలు చేపట్టాలి. ఈమేరకు నియామక ఏజెన్సీలు సైతం పక్కాగా చర్యలు తీసుకోవాలి. అతి త్వరలో ప్రభుత్వం అనుమతించిన పోస్టుల భర్తీలో వేగిరం పుంజుకోనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. చదవండి: కోమటిరెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు -
గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆ బెడద ఉండదు
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ యూజర్లకు భారీ ఊరట కల్పించింది. ఇప్పటివరకూ ఉన్న 15జీబీ స్టోరేజీ సామర్థ్యాన్ని ఏకంగా 1టీబీ సామర్థ్యానికి పెంచనుంది. ఈ మేరకు ప్రతి గూగుల్ వర్క్స్పేస్ వ్యక్తిగత ఖాతాలో ఆటోమేటిగ్గా 1 టీబీ నిల్వ సామర్థ్యం ఉండేలా అప్గ్రేడ్ చేయనుంది. ఈ విషయాన్ని గూగుల్ తన తాజా బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. దీంతో గూగుల్ స్టోరేజ్, జీమెయిల్ లాంటి వాటిల్లో స్టోరేజ్ బాధ లేకుండా అపరిమితంగా ఫైల్స్ను దాచుకోవచ్చు. ప్రతి Google Workspace వ్యక్తిగత ఖాతా 1 టీబీ సురక్షిత క్లౌడ్ స్టోరేజ్తో వస్తుందని కంపెనీ ప్రకటించింది. వినియోగదారులు అడగాల్సిన అవసరం లేకుండానే ప్రతి ఖాతాలో 1 టీబీ స్టోరేజ్ స్వయంచాలకంగా స్టోరేజ్ అప్గ్రేడ్ చేస్తామని బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. తాజా చర్య గూగుల్ డ్రైవ్ దాదాపు 100 రకాల ఫైల్స్ స్టోరేజ్కు, పీడీఎఫ్, సీఏడీ, జేపీజీ తదితర రకాల ఫైల్స్ స్టోర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. వీటిని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైల్స్లా కన్వర్ట్ చేసుకోకుండానే ఎడిట్ చేసేలా ఆప్షన్స్ ఎనేబుల్ చేయనుంది. దీనికి తోడు గూగుల్ డ్రైవ్ ఇప్పుడు మాల్వేర్, స్పామ్, రాన్సమ్వేర్ నుంచి రక్షణగా బిల్ట్ ఇన్ ప్రొటెక్షన్ ఫీచర్లను అందించనుంది. -
ఇక కొత్త రోస్టర్.. ఎస్టీ రిజర్వేషన్లు 10శాతానికి పెరగడంతో భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలో నూతన రోస్టర్ రూపకల్పన అనివార్యమైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 శాతం ఉండగా తాజాగా 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గిరిజను లకు కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలంటే ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్ల శాతానికి తగినట్లుగా గిరిజనుల వాటాను క్రమపద్ధతిలో సర్దుబాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్ల అమలుకు రోస్టర్ పాయింట్లే కీలకం. ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లోకి ప్రవేశాల్లో రోస్టర్ ప్రాతిపదికన కేటాయింపులు జరుపుతున్నారు. ఇప్పటివరకు ప్రతి వందలో 8, 25, 33, 58, 75, 83 స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేసి ఈ లెక్కన ఉద్యోగ కేటా యింపులు, విద్యాసంస్థల్లో అడ్మిషన్లు ఇస్తూ వచ్చారు. తాజాగా రిజర్వేషన్లు 10 శాతానికి పెంచడంతో ఆ మేరకు ఎస్టీ రిజర్వేషన్ స్థానాలను ఖరారు చేయాల్సి ఉంది. దసరా తర్వాతే స్పష్టత... గిరిజన రిజర్వేషన్ల పెంపు అమలుకు రోస్టర్ సిద్ధం కావాల్సి ఉండటం, ఇందుకు కాస్త సమయం పట్టనుండటం, దసరా సెలవుల అనంతరం రెండో శనివారం, ఆదివారం సెలవు ఉండటంతో కొత్త రోస్టర్పై కాస్త సందిగ్ధం నెలకొంది. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా వరుస సెలవులతో మరో రెండ్రోజులు ఈ ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో దసరా సెలవుల తర్వాతే నూతన రోస్టర్పై స్పష్టత వస్తుందని అధికార వర్గాల సమాచారం. ప్రతి పదిలో ఒకటిగా... ప్రస్తుత రోస్టర్ చార్ట్లో 6 శాతం ప్రకారం కేటాయించిన స్థానాలతోపాటు అదనపు స్థానాల్లో 4 శాతం కోటాను సర్దుబాటు చేసే అవకాశం లేదు. దీంతో కోటా 6% ఉన్నప్పుడు పోస్టుల మధ్య పాటించిన అంతరాన్ని తగ్గించాల్సి ఉంది. ఈ క్రమంలో వంద సీట్లలో 10 శాతం కేటాయింపులు జరపాల్సి వస్తే ప్రతి పదిలో ఒకటి చొప్పున స్థానాన్ని సర్దుబాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగని ప్రతి పదో నంబర్ను కేటాయిస్తే దూరం పెరుగుతుందని భావిస్తున్న అధికారులు... ఆ సంఖ్యను కాస్త తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అత్యంత వెనుకబడ్డ వర్గంగా ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్లకు తాజా రోస్టర్ న్యాయబద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఈ దిశగా రోస్టర్ పాయింట్లు సర్దుబాటు చేయాలని, వీలైనంత వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చని సీఎం ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. చదవండి: కాంగ్రెస్ జీ-23 గ్రూప్పై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు -
భారీగా పెరిగిన ఇన్స్టంట్ నూడిల్స్ ధరలు, 14 ఏళ్ల తర్వాత..తొలిసారి!
థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14ఏళ్ల తర్వాత ఇన్స్టంట్ నూడిల్స్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్స్టంట్ నూడుల్స్ ధరలను పెంచే ప్రతిపాదనకు థాయ్లాండ్ ఆమోదం తెలిపిందని ఆ దేశ వాణిజ్య విభాగం వెల్లడించింది. పెరిగిన ధరలు ఆగస్ట్ 25 (నిన్న)నుంచి అమల్లోకి వచ్చాయి. 2008లో చివరి సారిగా థాయిల్ లాండ్ ప్రభుత్వం ఇన్స్టంట్ నూడిల్స్ ధరల్ని పెంచింది. అయితే కొద్ది రోజుల క్రితం.. ఉక్రెయిన్పై రష్యా వార్, గత సంవత్సరాల్లో సంభవించిన కరువు, వరదలతో పాటు గోధుమలు, ఇంధనం, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయని ఇన్ స్టంట్ నూడుల్స్ ఐదు ప్రధాన ఉత్పత్తిదారులు తమ ధరలను పెంచడానికి అనుమతించాలని థాయ్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో తాజాగా ఉత్పత్తి దారులు విజ్ఞప్తితో థాయ్ ప్రభుత్వం ధరల పెంపుపై మద్దతు పలికింది. దీంతో ప్రతి సాధారణ పరిమాణ ప్యాకెట్పై ఏడు భాట్ల (అంటే భారత్ కరెన్సీలో రూ.15.48) పెంచుతూ వాణిజ్య విభాగం ఆమోదం తెలిపింది. ఇన్స్టంట్ నూడుల్స్ ధరలను బ్యాంకాక్ ఇప్పటివరకు ఒక్కో ప్యాకెట్కి ఆరు భాట్ (రూ.13.27కి) పరిమితం చేసింది. ►ఇటీవలి వారాల్లో, గోధుమ పిండి ధర దాదాపు 20-30 శాతం పెరిగింది. పామాయిల్ ధర రెండింతలు పెరిగిందని థాయ్ ప్రభుత్వ ప్రిజర్వ్డ్ ఫుడ్ విభాగానికి చెందిన వీర నాఫప్రుక్చార్ట్ చెప్పారు. ►జూన్లో థాయ్లాండ్లో ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిందని, వినియోగదారులపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని నిత్యావసర వస్తువులపై ధరల నియంత్రించాలంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ►జపాన్, దక్షిణ కొరియా వంటి ఇతర ఆసియా దేశాలలో నూడిల్స్ ధరలు ఇప్పటికే పెరిగాయి. చైనాలో ఈ సంవత్సరం గోధుమ ధర 30 శాతం పెరగవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. -
నా వల్లే భారతీయ రైల్వేస్కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్
Kareena Kapoor Says Indian Railways Income Increased By Geet Role: బాలీవుడ్ దివా కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయంతో బీటౌన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బ్యూటీ కరీనా. ఆమెను అభిమానులంతా ముద్దుగా బెబో అని కూడా పిలుచుకుంటారు. కభీ ఖుషీ కభీ ఘమ్, జబ్ వి మెట్, ఉడ్తా పంజాబ్, తషాన్, భజరంగీ భాయిజాన్, 3 ఇడియట్స్, హీరోయిన్ వంటి చిత్రాలతో అలరించింది. సినిమాలకు చాలా దూరంగా ఉన్న ఈ భామ ఇటీవల అమీర్ ఖాన్కు జోడీగా లాల్ సింగ్ చద్ధా సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కుదేలైంది. ఇదిలా ఉంటే కరీనా కపూర్ తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలిపింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్, వరుణ్ శర్మ లాయర్లుగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో 'కేస్తో బన్ తా హై'. ఈ షోలో పాల్గొన్న జబ్ వి మెట్ సినిమాలోని గీత్ అనే పాత్ర వల్లే రైల్వేస్కు ఆదాయం పెరిగిందని తెలిపింది. ''నేను చేసిన గీత్ పాత్ర వల్లే ప్యాంట్స్ అమ్మకాలు, భారతీయ రైల్వేలకు ఆదాయం పెరిగింది'' అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. కాగా కరీనా కపూర్, షాహిద్ కపూర్ జోడిగా కలిసి నటించిన చిత్రం జబ్ వి మెట్. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గీత్గా కరీనా కపూర్ అలరించింది. ఇదిలా ఉంటే కరీనా కపూర్ త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. సుజయ్ ఘోష్ డైరెక్షన్లో విజయ్ వర్మ, జైదీప్ అహ్లవత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
దేశీ ‘యాడ్స్’ మార్కెట్ 16 శాతం అప్
న్యూఢిల్లీ: డిజిటల్, టీవీ మాధ్యమాల ఊతంతో దేశీ అడ్వర్టైజింగ్ మార్కెట్ ఈ ఏడాది 16 శాతం మేర వృద్ధి చెందనుంది. 11.1 బిలియన్ డాలర్లకు (రూ. 88,639 కోట్లు) చేరనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్గా నిలవనుంది. గ్లోబల్ యాడ్ స్పెండ్ ఫోర్కాస్ట్స్ జులై 2022 నివేదికలో మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ డెంట్సూ ఈ మేరకు అంచనాలు పొందుపర్చింది. లాక్డౌన్పరమైన ఆంక్షల సడలింపుతో ట్రావెల్, హాస్పిటాలిటీ(ఆతిథ్య) రంగాలు తిరిగి క్రమంగా కోలుకుంటున్నా యని, వాటి ప్రకటనలు కూడా పెరుగుతున్నాయని వివరించింది. అలాగే ఎడ్టెక్, ఫిన్టెక్, గేమింగ్, క్రిప్టోకరెన్సీ వంటి వ్యాపారాల ప్రకటనలు కూడా ఓవర్-ది-టాప్ (ఓటీటీ) ప్లాట్ఫాంలలో పెరుగుతున్నాయని పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ♦ 2021లో భారతీయ అడ్వరై్టజింగ్ మార్కెట్ 9.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022లో ఇది 11.1 బిలియన్ డాలర్లు, 2023లో 12.8 బిలియన్ డాలర్లు, 2024లో 14.8 బిలియన్ డాలర్లకు చేరనుంది. ♦ ప్రకటనల్లో డిజిటల్ వాటా 33.4 శాతం వాటా ఉండనుంది. టీవీ అడ్వరై్టజింగ్ వాటా 41.8 శాతం స్థాయిలో కొనసాగనుంది. కొత్త కంటెంట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇందుకు ఊతమివ్వ నున్నాయి. టీవీ మాధ్యమంతో పోలిస్తే డిజిటల్ ప్రకటనల విభాగం రెండు రెట్లు పెరగనుంది. డిజిటల్ విభాగం 31.6 శాతం, టీవీ విభాగం 14.5 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. ♦ అంతర్జాతీయంగా అడ్వరై్టజింగ్ వ్యయాలు 8.7 శాతం పెరిగి 738.5 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. ఆసియా పసిఫిక్లో ఇవి 250 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. ఇందులో చైనా మార్కెట్ 5.6 శాతం వృద్ధితో 130.2 బిలియన్ డాలర్లకు చేరనుంది. ♦ 329.6 బిలియన్ డాలర్లతో ప్రకటనలపై అత్యధికంగా వ్యయం చేసే దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండనుంది. అమెరికాలో యాడ్ల మార్కెట్ 13.1 శాతం పెరగనుంది. బ్రెజిల్ 9 శాతం వృద్ధి చెందనుంది. ♦ ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రకటనల రంగంలో రికవరీ కొనసాగుతోంది. అయితే, కీలక మార్కెట్లలో లాక్డౌన్లు, భౌగోళికరాజకీయపరమైన ఉద్రిక్తతలు, సరఫరాపరమైన సమస్యలు మొదలైనవి వ్యాపారాలపైన, తత్ఫలితంగా మార్కెటింగ్ వ్యయాలపైనా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దేశీ ‘యాడ్స్’ మార్కెట్ 16 శాతం అప్ -
హైదరాబాద్లో ఎండలు దంచికొడితే చిల్డ్ బీర్ పొంగాల్సిందే!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపంతో అల్లాడుతున్న మద్యం ప్రియులు బార్లు, వైన్షాపుల వద్ద బారులు తీరుతున్నారు. నిప్పులు చెరిగే ఎండల బారి నుంచి ఉపశమనం కోసం చిల్డ్ బీర్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో గత రెండు నెలలుగా గ్రేటర్లో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. సాధారణ రోజుల్లో ‘కిక్’నిచ్చే మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టగా బీర్ల అమ్మకాలు మాత్రం భారీగా పెరిగినట్లు ఆబ్కారీ వర్గాలు తెలిపాయి. మార్చి, ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 21,68,537 కేస్ల బీర్ల విక్రయాలు జరిగాయి. అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఒక్క జిల్లాలోనే ఈ నెలలో ఇప్పటి వరకు 7.57 లక్షల కేస్లకుపైగా బీర్లు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. చదవండి👉: కన్నతండ్రి కళ్ల ముందే విగతజీవిలా మారితే.. దిక్కులు పిక్కటిల్లేలా చేసిన రోదన వేసవి ప్రభావంతో.. వేసవి దృష్ట్యా మద్యం అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. గత నెలలో హైదరాబాద్లో 2.7 లక్షల కేస్లకు పైగా మద్యం విక్రయాలు జరగగా ఈ నెలలో ఇప్పటి వరకు 1.85 లక్షల కేస్లు మాత్రమే అమ్ముడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోనూ మద్యం విక్రయాలు 4.33 లక్షల కేస్ల నుంచి ఈ నెలలో 3.97 లక్షల కేస్లకు తగ్గాయి. మేడ్చల్ జిల్లాలోనూ మద్యం అమ్మకాలపై వేసవి ప్రభావం పడింది. మార్చిలో 82 వేలకుపైగా విక్రయించగా ఈ నెలలో 79 వేలకు పైగా మద్యం కేస్లు అమ్ముడయ్యాయి. ఆదాయంలోనూ ఈ తేడా కొట్టొచ్చినట్లు ఉంది. గత నెలలో రంగారెడ్డి జిల్లాలో అన్ని రకాల మద్యం, బీర్ల అమ్మకాలపై రూ.389 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.398.32 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్లోని మూడు జిల్లాల పరిధిలో బీర్ల అమ్మకాలే టాప్ గేర్లో దూసుకెళ్తున్నాయి. మే నెలలోనూ ఇదే హవా..? మరోవైపు వచ్చే మే నెలలోనూ ఐఎంఎల్ లిక్కర్ కంటే బీర్ల అమ్మకాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 19.30 లక్షల కేస్ల బీర్ల విక్రయాలు జరిగాయి. ఈ నెలలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 32.72 లక్షల కేస్ల బీర్లు అమ్ముడు కావడం గమనార్హం. మే నెలలోనూ అమ్మకాల్లో ఇదే ఒరవడి కొనసాగనుంది. -
నాటుకోడి పులుసు.. రాగిముద్ద.. ఆహా ఆ రుచే వేరు.. పుంజు రూ.5 వేలు!
కోవిడ్ నేర్పిన పాఠంతో ప్రస్తుతం ఇంటింటా నాటు కోడి రుచులు ఘుమఘుమలాడుతున్నాయి. రహదారికి ఇరువైపులా నాటుకోడి పులుసు–రాగిముద్ద హోటళ్లు వెలుస్తున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచే నాటుకోళ్లు పూర్వ వైభవంతో రెక్కలు విప్పుతున్నాయి. రుచిని, ఆరోగ్యాన్నిచ్చే పెరటి కోళ్ల వినియోగంతోపాటు ధరలూ పెరుగుతున్నాయి. ఈ కోళ్ల పెంపకందారులకు కాసులు కురుస్తున్నాయి. చదవండి👉 Health Tips: రోజూ కోడిగుడ్డు తిన్నారంటే.. కొలువులు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్లకూ ఈ కోళ్లే ఉపాధి కల్పిస్తున్నాయి. నాటుకోడి పులుసు–రాగిముద్ద హోటళ్లు వెలుస్తున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచే నాటుకోళ్లు పూర్వ వైభవంతో రెక్కలు విప్పుతున్నాయి. రుచిని, ఆరోగ్యాన్నిచ్చే పెరటి కోళ్ల వినియోగంతోపాటు ధరలూ పెరుగుతున్నాయి. ఈ కోళ్ల పెంపకందారులకు కాసులు కురుస్తున్నాయి. కొలువులు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్లకూ ఈ కోళ్లే ఉపాధి కల్నిస్తున్నాయి. పలమనేరు/బైరెడ్డిపల్లె: ఆదివారం వచ్చిందంటే చాలు ఇళ్లల్లో మాంసాహారం ఘుమఘుమలాడాల్సిందే. అందులోనూ నాటుకోడి చారు దానికి కాంబినేషన్గా రాగిముద్ద ఇప్పుడు జిల్లాలో ఓ ట్రెండ్గా మారింది. కోవిడ్ నేర్పిన పాఠంతో ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోయింది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుకొనేందుకు మాంసాహారంపై దృష్టి సారించారు. మందులతో పెంచే బ్రాయిలర్ కోళ్లకంటే నాటు కోళ్లలో మంచి ప్రోటీన్లు ఉండడంతో వీటికి గిరాకీ పెరిగింది. రాయలసీమ ప్రత్యేక వంటగా పేరొందిన రాగిముద్దకు నాటుకోడి పులుసుంటే ఆ మజానే వేరు. దీనికున్న డిమాండ్ను చూసి చిత్తూరుతోపాటు కర్ణాటకలోని కోలారు, చింతామణి, చిక్కబళ్లాపుర, బెంగళూరు ప్రాంతాల్లోనూ ఈ నాటుకోడిచారు రాగిముద్ద హోటళ్లు భారీగా వెలిశాయి. పెరుగుతున్న పెంపకం-వినియోగం గతంలో పల్లెల్లో ప్రతి ఇంటికి పెరటి కోళ్లు ఉండేవి. బంధువులు ఇంటికొచ్చినా, పండుగలొచ్చినా కోడి కూర వండడం అప్పటి సంప్రదాయం. కాల క్రమేణా జీవనశైలిలో వచ్చిన మార్పుతో పెరటికోళ్ల పెంపకం తగ్గింది. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండే బ్రాయిలర్కోళ్ల వినియోగం పెరిగింది. కేవలం 40 రోజుల్లో పెరిగే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అంతంతమాత్రమే. దీనికితోడు కోవిడ్ కారణంగా ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకునే మార్గాలు అన్వేషించి, రుచిని అందించే నాటు కోడిని ఎంచుకున్నారు. చదవండి👉: నీట్, ఎంసెట్ విద్యార్థులకు సాక్షి మాక్టెస్టులు దీంతో నాటుకోళ్ల పెంపకంతోపాటు వినియోగమూ పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 80 దాకా నాటుకోళ్ల ఫారాలున్నాయి. కోవిడ్కారణంగా కొలువులు వదిలేసి వచ్చిని సాఫ్ట్వేర్లు సైతం నాటుకోళ్ల ఫామ్లు పెట్టి రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బ్రాయిలర్ కోళ్ల అమ్మకాలు రోజుకు సగటున 30 టన్నులుగా ఉంది. నాటుకోళ్ల అమ్మకాలు 5 టన్నులుగా ఉండేది. ప్రస్తుతం రోజువారీ నాటుకోళ్ల వినియోగం 8 టన్నులకు చేరుకుందని వ్యాపారులు చెబుతున్నారు. బైరెడ్డిపల్లె సంత ప్రసిద్ధి పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లెలో ప్రతి శనివారం జరిగే నాటుకోళ్ల సంత రాయలసీమలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కోళ్ల సంత మూడు దశాబ్దాలుగా సాగుతోంది. చుట్టుపక్కల గ్రామాలనుంచి నాటుకోళ్లను పెంచేవాళ్లు ఇక్కడికి అమ్మకానికి తీసుకొస్తారు. వీటిని కొనేందుకు వందలాదిమంది వ్యాపారులు బయటి రాష్ట్రాలనుంచి సంతకు వస్తుంటారు. ఇక్కడ లక్షల్లో నాటుకోళ్ల వ్యాపారం జరుగుతుంది. ముఖ్యంగా బెంగళూరునుంచి ఖరీదైన కార్లలో వచ్చే వారు ఇక్కడి పందెంకోళ్లు, బెనిసికోళ్లను కొనుగోలు చేస్తుంటారు. నాటుకోడి పులుసు హోటళ్లు పలమనేరు, కుప్పం, చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, రాయచోటి ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని కోలారు, ముళబాగిలు, బంగారుపేట, కేజీఎఫ్, మాలూరు, విజయపుర, షిడ్లగట్ట, దొడ్డబళ్లాపురల్లో నాటుకోడిచారు– రాగిముద్ద హోటళ్లు, దాబాలు ప్రత్యేకంగా వెలిశాయి. చిన్న చిన్న పట్టణాల్లో అయితే ఇళ్లలోనే నాటు కోడివంటలు చేసి తోపుడు బండ్లపై విక్రయిస్తున్నారు. రహదారుల పక్కన వాహనాల్లోనూ నాటుకోడి పులుసు అమ్మకాలు సాగుతున్నాయి. పుంజు రూ.5 వేలు ప్రస్తుతం నాటుకోడి(లైవ్) కిలో రూ.250 నుంచి రూ.300 పలుకుతోంది. కోడి బరువునుబట్టి ధర నిర్ణయిస్తారు. అయితే ఈ సంతకొచ్చే కోడిపుంజుల్లో కొన్ని పందెంకోళ్లుంటాయి. వీటి ధర డిమాండ్ను బట్టి రూ.3వేల నుంచి 5వేల దాకా పలుకుతుంటాయి. మాంసం కోసమైతే కోడి పుంజు, బెనిసికోడి, నల్లకోడి, కోడిపెట్ట, గుడ్లుకోడికి మంచి డిమాండ్ ఉంటుంది. ఎంతో ఆరోగ్యం నాటుకోడిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. దీంతో విటమిన్-బి6తో పాటు ప్రొటీన్లు, ఫాస్ఫరస్, జింక్ ధాతువులు అందుతాయి. జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బందులుండవు. వీటికి పూర్తి సహజ సిద్ధంగా తయారైన ఆహారాన్ని అందిస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కోడికి పూర్వ వైభవం వచ్చింది. పెరిగిన గిరాకీ నేను బైరెడ్డిపల్లి సంతలో 20 ఏళ్లుగా నాటుకోళ్లను కొంటున్నాను. గత రెండేల్లుగా వీటికి డిమాండ్ బాగా పెరిగింది. నాటుకోడి మాంసం తినేవారి సంఖ్య పెరిగింది. బ్రాయిలర్ కోడిమాంసం కంటే కొంచెం ఎక్కువ ధర అయినప్పటికీ జనం ఎగబడి కొంటున్నారు. మాకు వ్యాపారం బాగానే ఉంది. ఇక్కడ కోళ్లను కొని కర్ణాటకలో అమ్ముతుంటాం. ప్రతివారం కోళ్ల సంతకు వస్తుంటాం. – రియాజ్, నంగిళి, కర్ణాటక ఈ కోళ్ల రుచే వేరు ఎన్నో ఏళ్లుగా బైరెడ్డిపల్లెలో నాటుకోళ్ల వ్యాపారం చేస్తున్నాను. మా కర్ణాటకలో బైరెడ్డిపల్లె నాటుకోళ్ల్లకు మంచి గిరాకీ ఉంటుంది. ఎందుకంటే వీటిని రైతుల పొలాలవద్ద, పల్లెల్లో పెంచుతారు. అవి ప్రకృతిలో తిరుగుతూ పెరుగుతాయి కాబట్టి రుచిగా ఉంటాయి. ఫారాల్లో పెంచే నాటుకోళ్లు క్రాసింగ్ కాబట్టి అంతరుచి రాదు. నాటుకోడి పులుసు తినేటపుడే నాటుదా ఫారమ్దా అని తెలిసిపోతుంది. శ్రీధర్, కోళ్లవ్యాపారి, ముళబాగిళు, కర్ణాటక -
మాకొక ‘కారు’ కావలె.. ఎందుకంటే కారణాలివే?
కర్నూలు: ఒకప్పుడు కారులో ప్రయాణించడమంటే గొప్పగా భావించే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు కారుకు జై కొడుతున్నారు. మాకొక కారు కావలె అంటూ.. కార్ల వైపు చూస్తున్నారు. కరోనా భయంతో కారే నయం అంటున్నారు. బడ్జెట్ కుదిరితే కారు.. లేదంటే బైక్ కొనుగోలు చేస్తున్నారు. కరోనా మార్చిన జీవనయానం, పెరిగిన రవాణా చార్జీల నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ప్రజా రవాణాపై ఆధారపడిన వారు లాక్డౌన్ సమయంలో చాలా ఇబ్బందులుపడ్డారు. చదవండి: విశాఖ జూకు కొత్త జంతువులు వచ్చాయోచ్.. అవేమిటంటే..? సడలించిన తరువాత కూడా భౌతిక దూరం పాటింపు, కోవిడ్ భయంతో సొంత వాహనాలే మేలన్న అభిప్రాయంతో ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజలు వారి ఆర్థిక స్తోమతను బట్టి కొత్త లేదా పాత వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లా లో వాహనాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది రెండు నెలల్లో రిజి్రస్టేషన్ అయిన వాహనాల సంఖ్య సుమారు 10 వేలు ఉండగా వాటిలో సగానికి పైగా ద్విచక్ర వాహనాలే. స్కూలు బస్సులు, లారీలు, ట్రక్కులు, గూడ్సు వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాలు కలిపి 1,169 వరకు రిజి్రస్టేషన్ జరిగాయి. కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి ముఖ్య పట్టణాలతో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వాహన విక్రయాల షోరూమ్లు, వ్యాపార అనుబంధ శాఖలు, విడిభాగాల అమ్మకాలు, మరమ్మతుల దుకాణాలు, మెకానిక్ షెడ్లు దాదాపు 2250 వరకు ఉన్నాయి. ఈ రంగానికి సంబంధించి రోజుకు సగటున రూ. 2.50 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంటుంది. పాత వాహనాలకు డిమాండ్ కొంతకాలంగా పాతకార్లు, బైకులకు డిమాండ్ పెరిగింది. కరోనా, లాక్డౌన్ సమయంలో ప్రయాణ కష్టాలను అనుభవించిన కొందరు మరో ఆలోచన లేకుండా సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసి ఆ తరువాత డ్రైవింగ్ నేర్చుకుని దూసుకెళ్తున్నారు. ఒక ప్పుడు నగరాలకే పరిమితమైన పాతకార్ల కొనుగో లు ట్రెండ్ మండలాలు, గ్రామాలకు పాకింది. రూ. 5 లక్షలు పెడితే చాలు కండిషన్లో ఉన్న సెకండ్ హ్యాండ్ కారు వస్తుందని కర్నూలుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తన స్వీయఅనుభవాన్ని తెలిపాడు. రవాణా శాఖ లెక్కలేం చెబుతున్నాయంటే రవాణాశాఖ అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో గతేడాది 3800 కార్లకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలోనే 700కు పైగా కార్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. సంపన్నులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు, కొందరు ఉద్యోగులు మార్కెట్లోకి వచ్చిన కొత్తరకం కార్లను కొంటుండగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు రూ. 3 నుంచి రూ. 5 లక్షల విలువైన కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఆసక్తికి కారణాలివే ►లాక్డౌన్ సమయంలో ప్రజా రవాణా నిలిచిపోవడం, సడలింపు తరువాత చార్జీల భారం పెరగడం. ►ద్విచక్ర వాహనం ఇద్దరికే పరిమితం కావడం, కారైతే కుటుంబమంతా అనువుగా ఉండటంతో కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ►రూ. 5 లక్షల విలువైన కారుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష చెల్లిస్తే చాలు అందుబాటులోకి వచ్చేలా ఫైనాన్స్ సౌకర్యం చేరువైంది. ►వాయిదాలను కూడా వార్షిక ఆదాయానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవడంతో కారు విక్రయాల జోరు సాగుతోంది. అందుబాటులో షోరూంలు కార్ల కొనుగోళ్లకు గతంలో జిల్లా కేంద్రం కర్నూలుకు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లకు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు నంద్యాల, ఆదోని ప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడు అన్ని నియోజకవర్గ కేంద్రాలకు షోరూంలు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ వడ్డీతో పాటు సులభతర వాయిదాల పద్ధతిలో చెల్లించే విధంగా ఫైనాన్స్ సంస్థలు రుణాలు మంజూరు చేస్తుండటంతో గ్రామీణులు సైతం వాహన కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. వ్యక్తిగత వాహన కొనుగోళ్లు పెరిగాయి జిల్లాలో వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు బాగా పెరిగాయి. ప్రజా రవాణాపై ఆధారపడిన వారు లాక్డౌన్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సొంత వాహనాలను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. పండుగల సీజన్ నేపథ్యంలో వాహనాల విక్రయాలు ఊపందుకుంటాయి. రవాణా రంగం ద్వారా ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ. కోట్లలో ఆదాయం వస్తోంది. – రమేష్, ఇన్చార్జ్ డీటీసీ -
AP: ప్రతికూలతలోనూ పెరిగిన దిగుబడులు
సాక్షి, అమరావతి: ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు వరుస ప్రకృతి వైపరీత్యాలు.. అయినా, వ్యవసాయ రంగం పురోభివృద్ధి సాధించింది. దిగుబడులు పెరిగాయి. రైతు మోములో నవ్వు విరిసింది. పూర్తి ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో రాష్ట్రంలో రైతన్నలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్రం కరువుతో అల్లాడింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వ్యవసాయానికి చేయూతనిచ్చారు. రైతన్నకు అండదండగా నిలిచారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో నదీజలాలు పుష్కలంగా లభించాయి. ఆ నీటిని రాష్ట్ర ప్రభుత్వం సమర్ధంగా వినియోగించింది. ప్రాజెక్టులు, చెరువుల నిండుగా నీరుండేలా చర్యలు తీసుకుంది. రైతులకు పంటలకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చింది. దీంతో రైతులు రికార్డు స్థాయి దిగుబడులతో చరిత్ర సృష్టిస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా వస్తున్న దిగుబడులే ఇందుకు నిదర్శనం. 2021–22 సీజన్లో సైతం రికార్డుస్థాయిలో దిగుబడులు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆరి్ధక సర్వే వెల్లడించింది. 2019–20 సీజన్లో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో 175 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులు వచ్చాయి. 312 లక్షల టన్నుల ఉద్యాన పంటల దిగుబడులొచ్చాయి. ఇవి 2014–18 మధ్య కాలంలో వచ్చిన దిగుబడుల కన్నా చాలా అధికం. కరోనాకు తోడు వైపరీత్యాల ప్రభావంతో 2020–21 సీజన్లో కాస్త తగ్గినప్పటికీ, టీడీపీ హయాంతో పోల్చుకుంటే మెరుగ్గానే దిగుబడులొచ్చాయి. ఆ సీజన్లో 165.04 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, 307 లక్షల టన్నుల ఉద్యాన పంటల దిగుబడులొచ్చాయి. 2021–22 సీజన్లో కూడా వరదలు, వైపరీత్యాలు కలవర పెట్టినప్పటికీ దిగుబడులపై పెద్దగా ప్రభావం చూపలేదు.169.57 లక్షల ఆహారధాన్యాలు, 314 లక్షల టన్నుల ఉద్యాన పంటల దిగుబడులొస్తాయని అంచనావేశారు. ముఖ్యంగా ధాన్యం దిగుబడులు 2020–21లో 130.89 లక్షల టన్నులు కాగా, 2021–22 సీజన్లో 135.24 లక్షల టన్నులు వస్తాయని అంచనా. పాడి ఉత్పత్తులను పరిశీలిస్తే 2019–20లో పాలు 152.63 లక్షల టన్నులు, 8.5 లక్షల టన్నుల మాంసం, 2170.77 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరిగింది. 2020–21 సీజన్లో పాల దిగుబడులు 3.60 శాతం తగ్గినప్పటికీ మాంసం, కోడిగుడ్ల ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగింది. ఈ సీజన్లో 147.14 లక్షల టన్నుల పాలు, 9.54 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి కాగా, 2496.39 కోట్ల కోడి గుడ్ల ఉత్పత్తి జరిగింది. 2021–22 సీజన్లో 150 లక్షల టన్నుల పాలు, 10 లక్షల టన్నులు మాంసం, 2600 కోట్ల కోడి గుడ్లు ఉత్పత్తి సాధించబోతున్నట్టు అంచనా వేశారు. మత్స్య ఉత్పత్తులు 2019–20 సీజన్లో 41.75 లక్షల టన్నుల దిగుబడులురాగా, 2020–21లో 46.23 లక్షల టన్నులు వచ్చాయి. 2021–22 సీజన్లో 50.85 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నారు. జనవరి నెలాఖరు నాటికి 36.12లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు వచ్చాయని ఆరి్థక సర్వే తెలిపింది. -
కొత్త అసెంబ్లీల్లో పెరిగిన మహిళా ప్రాతినిథ్యం
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఎంఎల్ఏల ప్రాతినిథ్యం పెరిగింది. గత అసెంబ్లీలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో మహిళా ఎంఎల్ఏల సంఖ్య పెరిగిందని పీఆర్ఎస్ రిసెర్చ్ సంస్థ తెలిపింది. 2017లో యూపీ అసెంబ్లీలో 42 మంది మహిళా ఎంఎల్ఏలు ఉండగా ప్రస్తుతం వీరి సంఖ్య 47కు పెరిగింది. అదేవిధంగా ఉత్తరాఖండ్లో మహిళా ఎంఎల్ఏల సంఖ్య 5 నుంచి 8కి, మణిపూర్లో 4 నుంచి 8కి పెరిగింది. ఎంఎల్ఏలుగా ఎన్నికైన వారిలో 55 సంవత్సరాలు నిండినవారి సంఖ్య పెరిగింది. మరోవైపు యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్లో వయసులో పెద్దవారైన ఎంఎల్ఏల సంఖ్య పెరిగింది. 55 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ఎంఎల్ఏల సరాసరి 2017లో 64.7 శాతం ఉండగా, 2022కు 59.5 శాతానికి పెరిగినట్లు సంస్థ తెలిపింది. కనీసం డిగ్రీ అర్హత ఉన్న ఎంఎల్ఏల వాటా యూపీలో 72.7 నుంచి 75.9 శాతానికి పెరగ్గా, ఉత్తరాఖండ్లో 77 నుంచి 68 శాతానికి, మణిపూర్లో 76 నుంచి 68 శాతానికి తగ్గిందని సంస్థ వెల్లడించింది. -
గుండు బాస్ ఖాతాలోకి లక్షా నలభై వేల కోట్లు!
ఆయన తల్చుకుంటే.. బోడిగుండుపైన జుట్టు మొలిపించుకోవడం ఎంత సేపు? కానీ, ఆయనకది ఇష్టం లేదు. ఎందుకంటే.. సక్సెస్ అనేది లుక్కులో కాదు.. లక్కులో, హార్డ్ వర్క్లో ఉందని నమ్ముతున్నాడాయన. అందుకే గుండ్ బాస్గా పాపులర్ అయ్యాడు. ఆయనే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. జెఫ్ బెజోస్(58).. అమెజాన్ అనే ఈ-కామర్స్ కంపెనీతో సంచలనాలకు నెలవయ్యాడు. అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి పక్కకు జరిగాక.. సొంత స్పేస్ కంపెనీ బ్లూఆరిజిన్ మీదే ఆయన ఫోకస్ ఉంటోంది. అయితే గత కొంతకాలంగా ఆయనకు కలిసి రావడం లేదు. పెద్దగా లాభాలు రాకపోవడంతో.. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు ఆయన(ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం). ఈ తరుణంలో తాజా పరిణామాలు బెజోస్కి బాగా కలిసొచ్చాయి. అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ అమెజాన్ ఆమధ్య ఈవీ కంపెనీ రివియన్లో పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు ప్రైమ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో షేర్ల ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. 15 శాతం పెరగ్గా.. అక్టోబర్ 2009 నుంచి ఇదే అధికం కావడం గమనార్హం. మరోవైపు అమెజాన్ కేవలం అడ్వర్టైజింగ్ బిజినెస్ల ద్వారా 31 బిలియన్ డాలర్లు సంపాదించుకోవడం గమనార్హం. ఈ దెబ్బతో బెజోస్ వ్యక్తిగత సంపద 20 బిలియన్ డాలర్లకు(మన కరెన్సీలో లక్షా నలభై వేల కోట్ల రూ.) పెరిగింది. ప్రస్తుతం ఈయన మొత్తం సంపద విలువ.. 164.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒకవైపు ఫేస్బుక్ యూజర్ల ఎఫెక్ట్తో జుకర్బర్గ్ ఒక్కరోజులోనే 2.2 లక్షల కోట్ల రూపాయలు పొగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్తో రియల్ టైం బిలియనీర్ల జాబితాలో దిగజారిపోగా.. భారతీయ బిజినెస్ టైకూన్స్ ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీలు జుకర్బర్గ్ కంటే పైస్థానాల్లోకి ఎగబాకడం తెలిసిందే. చదవండి: అపర కుబేరుడి పెద్ద మనసు.. భారీగా సొమ్ము దానం! -
తెలంగాణలో ఎకరం భూమి కనిష్ట ధర రూ.1.20 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్ల ప్రభుత్వ విలు వల మదింపు ప్రక్రియ క్రమంగా కొలిక్కి వస్తోం ది. గత ఏడాది జూలైలో సవరించిన విలువలను మరోమారు సవరించాలని ప్రభుత్వం నిర్ణయిం చిన నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు గత వారం రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గతంలో వ్యవసాయ భూమి ఎకరానికి కనిష్టంగా రూ.75 వేలు ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.1.20 లక్షలుగా నిర్ధారించనున్నారు. అంటే సవరించిన విలువలు అమల్లోకి వస్తే వ్యవసాయ భూమి ఎక్కడ ఉన్నా ఎకరం కనిష్టంగా రూ.1.20 లక్షలు ఉంటుందన్న మాట. ఈ మేరకే లెక్కకట్టి రిజి స్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. గ్రామాల్లోని సబ్ డివిజన్ సర్వే నంబర్లు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, హెచ్ఎండీఏ, వైటీడీఏ, కుడా, వీటీ డీఏ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రాతిపదికన వ్యవసాయ భూముల విలువలను పెంచ నున్నారు. మొదట్లో వ్యవసాయ భూముల విలు వలను 50% వరకు పెంచాలని నిర్ణయించగా, తాజా మదింపు అనంతరం ఆయా భూములకు బహిరంగ మార్కెట్లో ఉన్న విలువలను బట్టి 100 శాతం పెంచేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధ్ధమవుతున్నాయి. వాస్తవానికి జిల్లాల నుంచి వ్యవసాయ భూముల విలువలను 100, 200 శాతంతో పాటు కొన్నిచోట్ల మూడు రెట్లు సైతం పెంచుతూ ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఆ మేరకు విలువలు పెంచితే ప్రజలపై అధిక భారం పడుతుందనే ఉద్దేశంతో గరిష్టంగా 100 శాతం మేరకే విలువలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఖాళీ స్థలాలకు సంబంధించి చదరపు గజానికి గతంలో కనిష్ట విలువ రూ.200 ఉండగా దాన్ని రూ.500గా నిర్ధారించనున్నారు. అదే విధంగా ఫ్లాట్లు, అపార్ట్మెంట్లకు సంబం ధించి చదరపు అడుగుకు గతంలో రూ. 1000 ఉండగా, ఇప్పుడు ఆ కనిష్ట విలువను రూ.1100 లేదా రూ.1200 చేయనున్నారు. అగ్రీ ‘భూమ్’ రాష్ట్రంలోని మెజార్టీ గ్రామాల్లో ఎకరం వ్యవ సాయ భూమి బహిరంగ మార్కెట్లో కనీసం రూ.10–12 లక్షలు పలుకుతున్న నేపథ్యంలో.. ఈ బూమ్ ఆధారంగానే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ఏ ప్రాంతంలో ఉన్న భూమి బహిరంగ మార్కెట్లో ఎంత విలువ పలుకుతుందన్న దాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వ విలువలను కూడా ఖరారు చేయనున్నారు. దీంతో ఈసారి వ్యవసాయ భూముల విలువల సవరణ కనీసం 50 శాతం నుంచి 100 శాతం వరకు పెరగవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెపుతున్నారు. ముఖ్యంగా టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలు, కొత్తగా ఏర్పడిన జిల్లాలు, ఉమ్మడి జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ శివార్లలోని భూముల విలువలు 90–100 శాతం పెరుగుతాయని తెలుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో కనీసం 50 శాతం మేర విలువలు సవరించనున్నారు. నేడో, రేపో సబ్రిజిస్ట్రార్లకు తుది ప్రతిపాదనలు! ఉన్నత స్థాయిలో జరుగుతున్న భూముల విలువల మదింపు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో ముగుస్తుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెపుతున్నారు. జిల్లా రిజిస్ట్రార్ల స్థాయిలో ముగిసిన పరిశీలన ప్రక్రియపై ఉన్నతాధికారులు మదింపు చేస్తుండగా, ఇందుకు సంబంధించిన తుది ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తీసుకుని నేడో, రేపో సబ్ రిజిస్ట్రార్లకు పంపుతారని, వాటిపై క్షేత్రస్థాయి కమిటీల ఆమోదం తీసుకుని, అవసరమైతే అక్కడక్కడా విలువలు సవరించి పూర్తిస్థాయి ప్రతిపాదనలు తయారు చేస్తామని అంటున్నారు. మొత్తం మీద ఫిబ్రవరి 1 నుంచే సవరించిన ప్రభుత్వ విలువలు అమల్లోకి వచ్చేలా ముందుకెళుతున్నామని, సీఎం ఆమోదం విషయంలో జాప్యం జరిగితే తప్ప అప్పటినుంచే విలువలు పెరుగుతాయని చెబుతున్నారు. సీఎం సలహాలు, సూచనల మేరకు ఈ ప్రక్రియలో స్వల్ప మార్పులుండే అవకాశం కూడా ఉందని అంటున్నారు. -
రష్మిక ఇక 'తగ్గేదే లే'.. రెమ్యునరేషన్ పెంచేసిన శ్రీవల్లి !
Rashmika Mandanna Increased Remuneration After Pushpa: తెలుగులో 'ఛలో' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన 'గీత గోవిందం' సినిమాతో ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్గా మారిపోయింది. తర్వాతి సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన రష్మిక ప్రతి ఈవెంట్లో తన అల్లరి చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కుర్రకారు గుండెల్లో నేషనల్ క్రష్గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్తో జంటగా నటించిన 'పుష్ప: ది రైజ్' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అందులో శ్రీవల్లిగా రష్మిక ఫ్యాన్స్తోపాటు ఆడియెన్స్ను ఆకట్టుకుంది. అయితే వరుస విజయాలతో జోరు మీద ఉన్న అమ్మడు తన రెమ్యునరేషన్ పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన పుష్ప 5 భాషల్లో రిలీజ్ కావడంతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది రష్మిక. అంతేకాకుండా హిందీలో కూడా పలు ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటోంది. దీంతో పారితోషికాన్నిపెంచేసిందన్న వార్త ఫిల్మ్ దునియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రూ. 1.75 నుంచి 2 కోట్ల వరకు తీసుకున్న రెమ్యునరేషన్ను రూ. 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట ఈ ఎక్స్ప్రెషన్ క్వీన్. రష్మిక మందన్నా ప్రస్తుతం హిందీలో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' చిత్రాలు చేస్తోంది. తెలుగులో శర్వానంద్కు జంటగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు', పుష్ప సీక్వెల్ 'పుష్ప: ది రూల్' సినిమాలు రష్మిక చేతిలో ఉన్నాయి. ఇదీ చదవండి: మారిపోయిన రష్మిక పేరు.. మందన్నా కాదట -
రెమ్యునరేషన్ పెంచేసిన బాలయ్య.. నెక్ట్స్ మూవీకి ఎంతంటే ?
Nandamuri Balakrishna Increased Remuneration After Akhanda: నందమూరి నటసింహం బాలకృష్ణ తన నటవిశ్వరూపాన్ని చూపించిన మరో సినిమా 'అఖండ'. ఈ చిత్రంతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు బాలకృష్ణ. ఒకవైపు హీరోగా తానేంటో ఇప్పటికే చూపించిన బాలకృష్ణ హోస్ట్గా కూడా అదరగొడుతున్నాడు. ఆహా ఓటీటీలో వస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు వ్యాఖ్యతగా చేస్తూ తాను ఏ పాత్రనైనా రఫ్పాడిస్తానంటూ జోష్ మీద ఉన్నాడు. అయితే ఈ షోకు బాలకృష్ణ తీసుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఈ టాక్ షోకు ఒక్కో ఎపిసోడ్కు సుమారు రూ. 40 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తం 12 ఎపిసోడ్లకు గాను రూ. 5 నుంచి 6 కోట్ల వరకు బాలకృష్ణ వెనకేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా బాలకృష్ణ తన తదుపరి సినిమాకు తీసుకునే పారితోషికం కూడా టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. బాలకృష్ణ ఇటీవలి చిత్రం అఖండకు రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమా హిట్తో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు బాలయ్య. ఈ మూవీకి సుమారు రూ. 15 నుంచి 20 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడట బాలకృష్ణ. ఈ సినిమాతో పాటు బాలయ్య మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే బాలకృష్ణ యాక్టింగ్, స్టార్డమ్, బిజినెస్ను దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట నిర్మాతలు. ఈ నాలుగు సినిమాలన్ని ఓకే అయి పట్టాలకెక్కితే బాలకృష్ణ సుమారు రూ. 50 కోట్లు అందుకోనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: బాలకృష్ణ సినిమాలో విలన్గా కన్నడ హీరో.. ఇట్స్ అఫిషియల్ -
స్టాండింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించండి
న్యూఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న పార్లమెంటు స్టాండింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు మంగళవారం లేఖ రాశారు. 31 మంది సభ్యులున్న ఈ స్థాయీ సంఘంలో ఒకే ఒక్క మహిళా ఎంపీ (టీఎంసీకి చెందిన సుస్మితా దేవ్) ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు సంబంధించిన కీలక బిల్లును పరిశీలించడానికి సగం కంటే ఎక్కువమంది మహిళలను స్టాండింగ్ కమిటీలో నియమించాలని కోరారు. అలాగే ఈ కమిటీ మహిళా ఎంపీనే చైర్మన్గా నియమించాలని స్వాతి డిమాండ్ చేశారు. చదవండి: వాళ్లు అగాథం పెంచితే.. మేం అభివృద్ధి చేశాం -
రికార్డు స్థాయిలో.. పట్టు‘మనీ’ లాభాలే
పిఠాపురం(తూర్పుగోదావరి): కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో విదేశాలకు సిల్క్ ఎగుమతులు నిలిచిపోయి, స్వదేశీ సిల్క్కు గిరాకీ పెరిగింది. ఫలితంగా పట్టుగూళ్ల రేటు ఒక్కసారిగా రెండు రెట్లు పెరిగి, తమ పంట పండిందని రైతులు సంతోషిస్తున్నారు. మరోపక్క మల్బరీ తోటలు, పట్టుగూళ్ల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం తోడవుతోంది. పట్టు పురుగుల పెంపకానికి కేంద్రంగా ఉన్న గొల్లప్రోలు మండలంలోని పట్టు పరిశ్రమ సాంకేతిక సేవా కేంద్రం ద్వారా రైతులకు మంచి తోడ్పాటు ఇస్తున్నారు. వీటన్నింటి ఫలితంగా మల్బరీ సాగు గణనీయంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ 5, పెద్దాపురం డివిజన్ 12, కాకినాడ డివిజన్ 2 మండలాల్లోని 4,500 ఎకరాల్లో 1,100 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. చదవండి: సమగ్ర భూ సర్వేకు సర్కారు కసరత్తు కలిసొచ్చిన ఈ–మార్కెట్ గతంలో జిల్లాలో పండించిన పట్టుగూళ్లను రాష్ట్రంలో పలమనేరు, హిందుపురం, హనుమాన్ జంక్షన్ వంటి ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ–మార్కెట్ ద్వారా కొనుగోళ్లు జరుగుతుండడంతో గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని నోటిఫైడ్ పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రంలో అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి మార్కెట్ అధికారి స్థానికంగా వచ్చిన పట్టుగూళ్ల నాణ్యతను పరిశీలించి, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే కొనుగోలుదారులు ఆన్లైన్లోనే కావాల్సిన పట్టు కొనుగోలు చేసి, దానికి సంబంధించిన నగదును నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన బాధ రైతులకు తప్పింది. పైగా రవాణా ఖర్చులు మిగిలి, గత పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో వారు లాభాలు ఆర్జిస్తున్నారు. భారీగా పెరిగిన ధర పట్టుగూళ్ల ధరలు గత నెలలో కేజీ రూ.300 వరకూ మాత్రమే ఉండేది. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల్లో పట్టుగూళ్ల దిగుబడులు లేకపోవడంతో స్థానిక పట్టుగూళ్లకు గిరాకీ ఏర్పడి ఒక్కసారిగా ధర పెరిగింది. ప్రస్తుతం కిలో పట్టుగూళ్ల ధర రూ.750 నుంచి రూ.900 వరకూ పలుకుతోంది. అది కూడా ఆన్లైన్ మార్కెట్ వల్ల రైతులకు శ్రమ తగ్గిపోవడంతో పాటు లాభాలు తెచ్చి పెడుతోంది. చేబ్రోలు పట్టు పరిశ్రమ సాంకేతిక సేవా కేంద్రం ద్వారా ప్రతి రోజూ 2 నుంచి 5 టన్నుల పట్టుగూళ్ల అమ్మకాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పట్టు సాగు వివరాలు పట్టు సాగు చేస్తున్న మండలాలు-19 సాగు జరుగుతున్న గ్రామాలు-155 సాగు విస్తీర్ణం 4,500 ఎకరాలు పట్టు రైతులు 1,150 మంది పట్టుగూళ్ల దిగుబడి: రోజుకు 5 టన్నులు మన పట్టుగూళ్లకు ఆన్లైన్లో మంచి గిరాకీ చేబ్రోలు పట్టు పరిశ్రమ సాంకేతిక సేవా కేంద్రం ద్వారా విక్రయించే పట్టుగూళ్లకు ఆన్లైన్లో మంచి గిరాకీ ఉంది. మేము మా కేంద్రానికి వచ్చిన పట్టుగూళ్లను పరిశీలించి నాణ్యత, సిల్క్ శాతం నిర్ధారించి ఆన్లైన్లో పెడితే కొనుగోలుదారులు కొనుక్కుంటారు. సిల్క్ శాతం ఎక్కువగా ఉండటంతో మన ఏరియా పట్టుగూళ్లకు మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం దిగుబడి కూడా బాగా పెరిగింది. – ఇంగువ వాసు, మార్కెట్ అధికారి, చేబ్రోలు నోటిఫైడ్ పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రం ప్రభుత్వ ప్రోత్సాహం ప్రభుత్వం ప్రోత్సాహం పెంచడంతో మల్బరీ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మల్బరీ సాగుకు, షెడ్ల నిర్మాణానికి యూనిట్ విలువ రూ.7 లక్షల వరకూ ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుతం దీనిని రూ.10 లక్షలకు పెంచారు. ఇందులో పట్టు పరిశ్రమల శాఖ ద్వారా రూ.3 లక్షలు, రైతు వాటా రూ.లక్ష, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. రైతు రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రభుత్వం రూ.9 లక్షలు ఇస్తోంది. – కోనేటి అప్పారావు, చేబ్రోలు పట్టు పరిశ్రమ సాంకేతిక సేవా కేంద్రం అధికారి ఈ–మార్కెట్తో మంచి ఆదాయం ఆన్లైన్ మార్కెట్ వల్ల మాకు శ్రమ తగ్గింది. రవాణా చార్జీలు లేవు. మాకు దగ్గరలోనే కొనుగోళ్లు చేస్తుండడంతో ఖర్చు తగ్గి, లాభాలు పెరిగాయి. గత పదేళ్లలో ఎక్కడా, ఎన్నడూ లేనంతగా రేటు పెరిగింది. దీంతో ఎప్పుడూ రానంత లాభం వచ్చింది. ఆన్లైన్ అమ్మకాలతో రైతులకు పట్టుగూళ్ల పెంపకంపై ఆసక్తి పెరిగింది. – గుండుబిల్లి గణేష్, పట్టు రైతు, చేబ్రోలు ప్రభుత్వ చేయూత పెరిగింది గతంలో పట్టుగూళ్ల పెంపకం కత్తి మీద సాములా ఉండేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు రైతులకు అండగా నిలిచారు గతంలో వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబులు పట్టు రైతుల బకాయిల విడుదలకు విశేష కృషి చేశారు. ప్రస్తుతం పట్టుగూళ్ల రేట్లు ఆశాజనకంగా ఉండడంతో ఆదాయం మరింత పెరిగింది. గతంలో తక్కువ సబ్సిడీ ఇచ్చేవారు. ప్రస్తుతం ప్రభుత్వ చేయూత పెరగడంతో పెట్టుబడి పెద్దగా అవసరం లేకపోతోంది.. దీంతో ఎక్కువ మంది రైతులు మల్బరీ సాగుపై ఉత్సాహం చూపుతున్నారు. – ఉలవకాయల నాగ లోవరాజు, పట్టు రైతు, జెడ్పీటీసీ సభ్యుడు, గొల్లప్రోలు -
జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న ట్రూకాలర్..!
స్టాక్హోమ్ ఆధారిత కాలర్ వెరిఫికేషన్ ప్లాట్ఫారమ్ ట్రూకాలర్ జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల యూజర్లను ట్రూకాలర్ సొంతం చేసుకుంది. ఒక్క భారత్లోనే ఏకంగా 220 మిలియన్ల యూజర్లు ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు సుమారు 50 మిలియన్ల కొత్త యూజర్లు ట్రూకాలర్లో చేరారు. చదవండి: కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోన్న ట్రూకాలర్..! 11 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ట్రూకాలర్ యాప్ బహుళ భాషలకు మద్దతునిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. సుమారు 220 మిలియన్ల యూజర్లతో భారత్ ట్రూకాలర్ అతి పెద్దమార్కెట్గా నిలుస్తోంది. కాల్ ఐడెంటిఫికేషన్, స్పామ్ బ్లాకింగ్ ప్రధాన లక్షణాలతో పాటు ట్రూకాలర్ స్మార్ట్ ఎస్ఎమ్ఎస్, ఇన్బాక్స్ క్లీనర్, ఫుల్-స్క్రీన్ కాలర్ ఐడీ, గ్రూప్ వాయిస్ కాలింగ్ ఇతర ఫీచర్లను యూజర్లకు ట్రూకాలర్ అందిస్తోంది. ట్రూకాలర్ 300 మిలియన్ల యూజర్ల మైలురాయిపై ట్రూకాలర్ సీఈవో, సహా వ్యవస్థాపకుడు అలాన్ మామెడి మాట్లాడుతూ...చిన్న ప్లాట్పాంగా మొదలై 300 మిలియన్ల ఆక్టివ్ యూజర్లను ట్రూకాలర్ సొంతం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ మైలురాయిని చేరుకోవడానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలను తెలిపారు. చదవండి: భారతీయ రైల్వేతో జట్టుకట్టిన ట్రూకాలర్..! ఎందుకంటే.? -
భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు
-
పెరుగుతున్న బంగారం ధర
ముంబై: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం కొంతమేరకు ధరలు తగ్గగా.. ఈ సోమవారం (జూలై 26, సోమవారం) స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కు దిగువనే ఉన్నాయి. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్కి సంబంధించి ప్రారంభ సెషన్లో రూ.94.00 పెరిగి రూ.47628.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.118.00 పెరిగి రూ.47902.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం రూ.48,000 పైకి చేరుకున్న పుత్తడి చివరి సెషన్లలో కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక వెండికి సంబంధించి సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.189.00 పెరిగి రూ.67213.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.205.00 పెరిగి రూ.68380.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,000 స్థాయిలో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత క్షీణించాయి. డెల్టా వేరియంట్ భయాలతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లు సేఫ్గా భావించడంతో ఆ ప్రభావం ధరలపై కనిపించింది. -
నెత్తురోడుతున్న రహదారులు
ముంబై సెంట్రల్: రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏటికేడు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ ప్రభావంతో వాహనాల రాకపోకలపై గత ఏడాదిన్నర కాలంగా అనేక ఆంక్ష లు ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. గత సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోలిస్తే, ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏకంగా 25 శాతం మేర పెరిగిందని పోలీసు విభాగ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతేగాక ప్రమాదాలతో పాటు మృతుల సంఖ్య కూడా 28 శాతం వరకు పెరగడం విస్మయం కలిగిస్తోంది. ఆ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని నగరాల కంటే ఎక్కువగా ముంబైలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అయితే, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య మాత్రం నాసిక్లో ఎక్కువగా ఉంది. ఈ అంకెలు రాష్ట్రంలోని రోడ్ల అధ్వాన్న పరిస్థితికి అద్దం పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. అలాగే, వెల్లడించిన లెక్కల ప్రకారం, 2020 జనవరి నుంచి జూన్ వరకు రాష్ట్రంలో 11,481 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 2021లో జనవరి నుంచి జూన్ వరకు 14,245 ప్రమాదాలు సంభవించాయి. ఈ ఏడాది ప్రమాదాలతో పాటు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య కూడా భారీగానే పెరిగింది. గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 5,209 మంది మృతి చెందగా.. ఈ సంవత్సరం ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య 6,708గా ఉంది. గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 9,641 మంది గాయపడగా.. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10,879 మంది క్షతగాత్రులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బుల్డాణా, థాణే, పాల్ఘర్ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ ప్రమాదాల సంఖ్య పెరిగింది. ముంబైలో గత సంవత్సరం 809 రోడ్డు ప్రమాదాలు సంభవించగా.. ఈ సంవత్సరం 956 ప్రమాదాలు జరిగాయి. అయితే, ఇక్కడ మృతుల సంఖ్య మాత్రం తగ్గింది. గత సంవత్సరం ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 141 మంది మృతి చెందగా.. ఈ సంవత్సరం ప్రమాదాల్లో 131 మంది మరణించారు. గతేడాది ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారి సంఖ్య 822 కాగా.. ఈ సంవత్సరం జరిగిన ప్రమాదాలు 809 మందిని క్షతగాత్రులను చేశాయి. -
భారీగా పెరిగిన వన్ప్లస్ టీవీ ధరలు...!
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీదారు వన్ప్లస్ తన యూజర్లకు భారీ షాక్నిచ్చింది. భారత మార్కెట్లో టీవీలకు ఉన్న గిరాకీని కంపెనీ క్యాష్ చేసుకోవడం కోసం టీవీల మార్కెట్లోకి దిగిన విషయం తెలిసిందే. తాజాగా వన్ప్లస్ తీసుకున్న నిర్ణయంతో కొనుగోలుదారుల జేబులకు చిల్లుపడనుంది. వన్ప్లస్ తన టీవీ ధరలను గణనీయంగా పెంచింది. సుమారు వన్ప్లస్ టీవీ శ్రేణిల్లో ఆరు మోడళ్ల కొత్త ధరలను ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్లలో అందుబాటులో ఉండనున్నాయి. వన్ ప్లస్ టీవీ 32ఇంచ్వై1మోడల్ను 2 వేలు పెంచి రూ.18,999లుగా, టీవీ40వై1మోడల్ను రూ.2,500 పెంచి రూ.26,499లుగా, టీవీ43వై1 మోడల్ను రూ.2500 పెంచి కొత్త ధరను రూ.29,499లుగా, టీవీ 50యూ1ఎస్ మోడల్ను ఏకంగా రూ. 7000 పెంచి కొత్త ధర 46,999గా. టీవీ 55యూ1ఎస్ మోడల్ను రూ. 5000 పెంచి కొత్త ధరను రూ.52,999లుగా, టీవీ 65యూ1ఎస్ మోడల్ను రూ.6000 పెంచిన కొత్త ధరను రూ.68,999లుగా నిర్ణయించింది. -
పొంగిపొర్లుతున్న భూగర్భ జలాలు
పాతాళగంగ పొంగిపొర్లుతోంది. నేలబావుల నుంచి బోరు బావుల వరకూ దేన్ని పరిశీలించిన నీరు ఉబికివస్తోంది. గతంలో కంటే భూజగర్భ జలాలు బాగా పెరిగాయి. మండువేసవిలో కూడా సాధారణ పరిస్థితి ఉండడం విశేషం. రాజాం నియోజకవర్గం వ్యాప్తంగా పరిస్థితి మరీ అనుకూలంగా ఉంది. మడ్డువలస జలాశయం ఉన్నందున ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు బాగా పెరిగాయని సంబంధిత అధికారులు అంచనా వేశారు. రాజాం: జిల్లాలో కొన్ని మండలాలు మినహా మిగిలిన చోట్ల భూగర్భ జలాలు బాగున్నాయి. రాజాం నియోజకవర్గం పరిధి సంతకవిటి మండలంలో 1.52 మీటర్ల లోతులోనే లభ్యమవుతున్నాయి. మండువేసవిలోనే ఇలా ఉండగా. వర్షాకాలంలో మరింత మీదకు వచ్చే అవకాశం ఉంది. రాజాంలో 1.72 మీటర్లలో, రేగిడిలో 2.31, వంగరలో రెండు, ఎల్ఎన్పేట మండలంలో 1.89, సరుబుజ్జిలిలో 1.84, జలుమూరులో 2.82, హిరమండలంలో 2.34, గార మండలంలో 2.34 మీటర్ల లోతులోనే భూ గర్భజలాలు తొణికిసలాడుతున్నాయి. ఈప్రాంతాల్లో బోర్లు తక్కువలోతులో వేస్తున్నా నీరుపడుతోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో సాగునీటి కోసం తక్కువ ఖర్చుతోనే వ్యవసాయ బోర్లు, బావులు, ఇంటి అవసరాలకు బోరింగులను వేయించుకుంటున్నారు. 20 నుంచి 30 మీటర్ల లోతుకు వెళ్లగానే కావాల్సినంత నీరు పడుతోంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో వేసవిలో కూడా సాగునీటి చెరువులు, బావులు జలకళను సంతరించుకున్నాయి. రణస్థలం మండలంలోని పైడిభీమవరం వద్ద అత్యంత ప్రమాదకరంగా 13.91 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, ఎచ్చెర్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అలాగే పలాస, కంచిలి, సోంపేటలో కూడా భూగర్భ జలాలు కొంతవరకూ అడుగంటాయి. జిల్లా వ్యాప్తంగా లెక్కిస్తే సరాసరిన 7.88 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభ్యమవుతూ సేఫ్ జోన్లో ప్రస్తుతం కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది సుమారు ఎనిమిది మీటర్లగా ఉండేది. సాగునీటి కాలువలు ఉన్న ప్రాంతాల్లో.. సాగునీటి కాలువలు, నదులు ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు అనుకూలంగా ఉండగా.. పరిశ్రమలు, బీడు భూములు ఉన్న ప్రాంతాల్లో నీటి వనరులు తగ్గుముఖం పడుతున్నాయి. వీటికి తోడు అనుమతులు లేకుండా ప్రైవేట్ నేలబావులు తవ్వకాలతో కొన్నిచోట్ల నీటి లభ్యత అనుకూలంగా లేదని నేషనల్ గ్రీన్కోర్ ఉపాధ్యాయుడు పూజారి హరిప్రసన్న తెలిపారు. -
జనం ఉత్సాహంతో అమాంతం పెరిగి వాక్సిన్ ధరలు
-
ఏపీ: వాహన విక్రయాల్లో జోష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాణిజ్య, వ్యవసాయ వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. గతేడాది మార్చితో పోల్చితే ఈ ఏడాది మార్చిలో పెద్ద ఎత్తున వాహనాల అమ్మకాలు జరిగాయి. వాణిజ్య అవసరాల నిమిత్తం ఈ ఏడాది మార్చిలో 1,366 ట్రాక్టర్లు, ప్రైవేట్ వినియోగానికి మరో 1,891 ట్రాక్టర్లను ప్రజలు కొనుగోలు చేశారు. అలాగే వ్యవసాయ అవసరాల కోసం ఈ ఏడాది మార్చిలో 430 ట్రిల్లర్లు, వాణిజ్య అవసరాల కోసం మరో 960 ట్రిల్లర్లను కొన్నారు. ఆటోల విక్రయాలు అయితే ఈసారి భారీగా పెరిగాయి. గతేడాది మార్చిలో కేవలం 158 ఆటోల విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 1,842 ఆటోలను విక్రయించారు. అలాగే మోటారు సైకిళ్లు, కార్ల అమ్మకాలు కూడా గతేడాది మార్చితో పోల్చితే.. ఈ ఏడాది మార్చిలో పెరిగాయి. మొత్తం మీద గతేడాది మార్చిలో 32,814 వాహనాలను విక్రయించగా.. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 84,509 వాహనాలను విక్రయించారు. చదవండి: విదేశీ ఎగుమతుల్లో ఏపీ రికార్డు కొనుగోళ్లకు అధిక ప్రా'ధాన్యం' -
బడ్జెట్: పెరిగిన కొలువులు!
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 1 నాటికి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని మొత్తం కొలువుల సంఖ్య 34,14,226కు చేరనున్నట్లు సోమవారం బడ్జెట్లో వెల్లడించారు. మార్చి 1, 2019 నాటికి 32,71,113 కేంద్ర ఉద్యోగాలు ఉండగా, ఈ ఏడాది మార్చి 1 నాటికి 1,43,113 ఉద్యోగాలు పెరగనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, సహకార, రైతు సంక్షేమం శాఖలో మార్చి 1, 2019 నాటికి 3,619 ఉద్యోగాలు ఉండగా ఈ రెండేళ్లలో 2,207 పెరిగి 5,826కు చేరనున్నాయి. అలాగే పౌరవిమానయానంలో 1,058 పెరిగి 1,254 నుంచి 2,312కు, రక్షణ శాఖలో 12,537 పెరిగి 80,463 నుంచి 93,000కు చేరనున్నాయి. అలాగే సాంస్కృతిక శాఖలో 3,638, ఎర్త్ సైన్సెస్లో 2,859, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖలో 2,263, విదేశీ వ్యవహారాల్లో 2,204, వాణిజ్యంలో 2,139, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 1,452; ఆరోగ్య–కుటుంబ సంక్షేమంలో 4,072, కార్మిక–ఉపాధి కల్పనలో 2,419, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగానది పునర్వవస్థీకరణలో 1,456 పెరగనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన విభాగాల్లోనూ ఇలాగే పెరిగినట్లు వివరించారు. చదవండి: బడ్జెట్: ఈ విషయాలు మీకు తెలుసా! చదవండి: బడ్జెట్ 2021: రక్షణ రంగం కేటాయింపులు.. ‘గిగ్’ కార్మికులకూ సామాజిక భద్రత న్యూఢిల్లీ: ఈ కామర్స్ వ్యాపార సంస్థల్లో పనిచేసే ‘గిగ్’ కార్మికులకూ సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పిస్తామని కేంద్రం సోమవారం తెలిపింది. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. గిగ్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతరుల సమాచారం సేకరించేందుకు ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గిగ్, ప్లాట్ఫాం కార్మికులతో సహా మొత్తం శ్రామికశక్తికి తొలిసారి సామాజిక భద్రతను కల్పించడానికి నిబంధనలు రూపొందించినట్లు ఆమె వెల్లడించారు. ఉబెర్, ఓలా, స్విగ్గీ, జొమాటో వంటి ఈ–కామర్స్ సంస్థల్లో పనిచేసే గిగ్, ప్లాట్ఫాం కార్మికులకు క్రమబద్ధమైన వేతనాలు ఉండవు. దీంతో ప్రావిడెంట్ ఫండ్, ఆరోగ్య బీమా, పెన్షన్లు వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారు. దేశంలో మొత్తం 50 కోట్లకు పైగా శ్రామిక శక్తి ఉండగా ఇందులో 40 కోట్లు అసంఘటిత రంగాల్లోనే ఉన్నారు. వీరిలో ఎక్కువగా వ్యవసాయ, గ్రామీణ కార్మికులే ఉన్నారు. వేతనాలు, పారిశ్రామిక సంబంధం, సామాజిక భద్రత, వృత్తి భద్రత, ఆరోగ్యం–పని పరిస్థితులపై తెచ్చిన కార్మిక చట్టాలకు సంబంధించిన సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని నిర్మల పేర్కొన్నారు. చదవండి: కేంద్ర బడ్జెట్: ఇందులో నాకేంటి? -
ధరలు చూసి ‘బోరు’మనాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: నీటి సమస్యను అధిగమించేందుకు ఇంట్లోనో... పొలం దగ్గరో బోరు వేయాలనుకుంటున్నారా.. అయితే కనీసం రెండు, మూడు లక్షలు సిద్ధం చేసుకోవల్సిందే. ఎందుకంటే బోరు తవ్వకం చార్జీలు భారీ పెరిగాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ధరలు సగటున యాభై శాతానికిపైగా పెరిగిపోయాయి. లాక్డౌన్, ఆ తర్వాతి పరిస్థితులు, డీజిల్ ధరలు, లేబర్ చార్జీల పెరుగుదల తదితర అంశాలను చూపుతూ రిగ్ ఓనర్ల సంఘం బోరు తవ్వకం ధరలను అమాంతం పెంచేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారీగా ధరల్లో కాస్త వ్యత్యాసం ఉన్నప్పటికీ... మొత్తంగా ధరల పెంపు భారీగా ఉండడంతో బోరు తవ్వించాలనున్న వాళ్లు ధరలు చూసి బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెయ్యి ఫీట్లకు రూ.2లక్షల పైమాటే.... బోరు తవ్వేందుకు చార్జీల తీరు స్లాబుల ఆధారంగా ఉంటుంది. భూమిలోకి డ్రిల్ చేసే ప్రతి వంద ఫీట్లకు ఒక్కో ధర ఉంటుంది. లోతుకు వెళ్తున్న కొద్ది బోర్వెల్ మిషన్పై ఒత్తిడి పెరగడంతో ధరలను క్రమంగా పెంచుతారు. రంగారెడ్డి జిల్లాలో కోవిడ్–19కు ముందు బోరు తవ్వేందుకు ప్రారంభంలో తొలి వంద ఫీట్లకు (అడుగులు) ఫీట్కు రూ.45 చొప్పున ఉండేది. క్రమంగా ప్రతి వంద ఫీట్లకు రూ.10 చొప్పున, 500 ఫీట్లు దాటిన తర్వాత రూ.20 చొప్పున, 800 ఫీట్లు దాటిన తర్వాత రూ.50 చొప్పున ధరలు పెంచేవాళ్లు. ప్రస్తుతం ఈ ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రారంభంలో తొలి వంద ఫీట్ల వరకు ఫీట్కు రూ.70గా నిర్ధారించగా... ఆ తర్వాత వందకు రూ.80 చొప్పున తర్వాతి వంద ఫీట్లపై రూ.100... ఇలా పెంచుతూ 900–1000 ఫీట్లలోతు తవ్వేందుకు ధర రూ.360గా ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. 2019లో 900–1000 ఫీట్ల లోతు తవ్వేందుకు ధర రూ.200 చొప్పున మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.160 పెంచేశారు. మొత్తంగా వెయ్యి ఫీట్ల లోతుకు బోరు తవ్వేందుకు ఏడాదిన్నర క్రితం గరిష్టంగా 1.25 లక్షలు (కేసింగ్, చార్జీలన్నీ కలిపి) కాగా... ప్రస్తుతం రూ.2.30 లక్షలు అవుతోంది. డీజిల్, కూలీల ధరలు పెరగడం వల్లే.. డీజిల్ ధరలు ఏడాదిన్నర క్రితంతో పోల్చుకుంటే ప్రస్తుతం 25 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. అదేవిధంగా లాక్డౌన్ తర్వాత లేబర్ షార్టేజీతో కూలీల ధరలు కూడా పెరిగాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే బోరు తవ్వకం ధరలు పెంచాం. – జె.గంగారెడ్డి, బోర్వెల్ నిర్వాహకుడు, బీఎన్ రెడ్డి నగర్, హైదరాబాద్ రెండేళ్లలో డబుల్ ఖర్చయ్యింది నాకున్న నాలుగున్నర ఎకరాల పొలంలో రెండేళ్ల క్రితం బోరు తవ్వించా. దాదాపు 900 ఫీట్లు వేశారు. అప్పుడు రూ.80 వేలు ఖర్చు అయ్యింది. ఇప్పుడు పూర్తిగా వరి వేయాలను కోవడంతో ఒక్క బోరు సరిపోదని 15 రోజుల క్రితం మరొకటి తవ్వించా. ఇదివరకు తవ్విన వ్యక్తే 950 ఫీట్లు తవ్వి రూ.1.92 లక్షల బిల్లు చేతిలో పెట్టాడు. రెండేళ్ల వ్యవధిలో డబుల్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. – డి.లక్ష్మణరావు, రైతు, మాల్ గ్రామం, రంగారెడ్డి జిల్లా -
డీఏ పెంపు 5.24 శాతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం 5.24 శాతం కరువు భత్యం(డీఏ) పెంచింది. తక్షణమే ఒక డీఏ చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో... ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూల వేతనంపై కరువు భత్యం 33.536 శాతం నుంచి 38.776 శాతానికి పెరిగింది. 2019 జూలై 1 నుంచి డీఏ పెంపు వర్తించనుంది. డిసెంబర్లో చెల్లించనున్న నవంబర్ వేతనం/ పెన్షన్తో కలిపి పెరిగిన కరువు భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. బకాయిల చెల్లింపు ఇలా.. 2019 జూలై 1 నుంచి 2020 అక్టోబర్ 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలను సంబంధిత ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2021 మార్చి 31కి ముందు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను మాత్రం ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించనుంది. ఈ ఉత్తర్వుల జారీకి ముందే ఎవరైనా ఉద్యోగులు మరణిస్తే వారి చట్టబద్ధ వారసులకు నగదు రూపంలో డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమై, కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) వర్తించే ఉద్యోగులకు, 2019 జూలై 1 నుంచి 2020 అక్టోబర్ 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిల్లో 10 శాతాన్ని వారి ప్రాణ్ ఖాతాల్లో జమ చేస్తారు. మిగిలిన 90 శాతం డీఏ బకాయిలను డిసెంబర్ నుంచి నాలుగు సమవాయిదాల్లో ప్రభుత్వం చెల్లించనుంది. పెన్షనర్లకు సంబంధించిన డీఏ బకాయిలను సైతం నాలుగు సమ వాయిదాల్లో 2020 డిసెంబర్ నుంచి చెల్లించనున్నారు. జీపీఎఫ్కు అనర్హులైన ఫుల్టైమ్ కాంటిజెంట్ ఉద్యోగుల డీఏ బకాయిలను డిసెంబర్లో చెల్లించనున్న వేతనంతో కలిపి నగదు రూపంలో చెల్లించనుంది. -
మళ్లీ పసిడి ధరల పరుగు
ముంబై : గత కొద్దిరోజులుగా దిగివస్తున్న బంగారం ధరలు మళ్లీ పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ బంగారం ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్లో సోమవారం పదిగ్రాముల బంగారం 200 రూపాయలు భారమై 51,648 రూపాయలు పలికింది. కిలో వెండి ఏకంగా 930 రూపాయలు పెరిగి 66,906 రూపాయలకు చేరింది. ఆగస్ట్ 7న బంగారం ధరలు రికార్డుస్ధాయిలో 56,200 రూపాయలకు చేరిన తర్వాత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇక వడ్డీరేట్లను మరికొంత కాలం దిగువ స్ధాయిలోనే ఉంచాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు పంపడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎగిశాయి. డాలర్ బలహీనపడటం కూడా పసిడి ధరలకు డిమాండ్ పెంచింది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా వడ్డీ రేట్లను నామమాత్ర స్ధాయిలో కొనసాగించేందుకు ఫెడ్ రిజర్వ్ నిర్ణయించడంతో బంగారం, వెండి ధరలు లాభపడ్డాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషించింది. ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో స్పాట్ గోల్డ్ రెండు వారాల గరిష్టస్ధాయిలో ఔన్స్కు 1971.68 డాలర్లకు చేరింది. చదవండి : పసిడి ధరల పతనానికి బ్రేక్ -
భగ్గుమన్న బంగారం : మళ్లీ కొండెక్కిన వెండి
ముంబై : గత వారం దిగివచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. గత రెండు రోజుల్లో పదిగ్రాముల బంగారం 1500 రూపాయలు భారం కాగా, కిలో వెండి ఏకంగా 3000 రూపాయలు పెరిగింది. డాలర్ బలహీనపడటంతో పాటు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు పసిడికి డిమాండ్ పెంచాయని, కోవిడ్-19 కేసుల పెరుగుదలతో కూడా ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ఎంసీఎక్స్లో మంగళవారం పదిగ్రాముల బంగారం 645 రూపాయలు పెరిగి 53,920 రూపాయలకు చేరింది. కిలో వెండి 1978 రూపాయలు భారమై మళ్లీ 70 వేల మార్క్ దాటి 71,133 రూపాయలు పలికింది. అమెరికన్ డాలర్ ఈ వారం కనిష్టస్ధాయిలో పతనమవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్కు 2000 డాలర్ల మార్క్ను తిరిగి చేరాయి. హువాయి టెక్నాలజీస్పై అగ్రరాజ్యం తాజా ఆంక్షలతో అమెరికా-చైనా ఉద్రిక్తతలు పెరగడం పసిడి డిమాండ్ను పెంచింది. చదవండి : వచ్చే ఏడాదిలోగా 2300డాలర్లకు బంగారం: గోల్డ్మెన్ శాక్స్ -
భారం : బంగారం ధరలు మళ్లీ పైపైకి..
ముంబై : గతవారం భారీగా పడిపోయిన పసిడి ధరలు మళ్లీ భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ బంగారం ధర పుంజుకుంది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో అంతర్జాతీయ మార్కెట్లో గతవారం 4.5 శాతం తగ్గిన బంగారం ధరలు డాలర్ బలహీనపడటంతో పైకెగిశాయి. ఎంసీఎక్స్లో సోమవారం పదిగ్రాముల బంగారం 306 రూపాయలు భారమై 52,533 రూపాయలకు పెరిగింది. ఇక కిలో వెండి ఏకంగా 1729 రూపాయలు పెరిగి 68,900 రూపాయలు పలికింది. కాగా కరోనా వైరస్ విజృంభణ, అమెరికా-చైనా ట్రేడ్వార్, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధరలు 28.4 శాతం పెరిగాయి. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు రాబోయే రోజుల్లో పసిడి ధరల కదలికలను నిర్ణయిస్తాయని బులియన్ నిపుణులు చెబుతున్నారు. చదవండి : ఊరట : పసిడి నేలచూపులు -
మళ్లీ పెట్రో షాక్..
-
వరుస షాక్లు : మళ్లీ పెట్రో పిడుగు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో షాక్లు కొనసాగుతున్నాయి. శుక్రవారం వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. పెట్రోల్ లీటర్కు 21 పైసలు, డీజిల్ ధర లీటర్కు 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 83 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు 80.13కు, డీజిల్ లీటర్కు 80.19 రూపాయలకు ఎగబాకింది. ఇక పెట్రో భారాలపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నా ధరల సవరణ పేరుతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలను మోతెక్కిస్తున్నాయి. కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ప్రజలపై పెట్రో భారాలను మోపడం సరైంది కాదని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు పెట్రో ధరలను మించి డీజిల్ ధర పరుగులు తీయడంతో నిత్యావసరాల ధరలూ చుక్కలు చూస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి : ‘పెట్రో’ మంట; వైరలవుతున్న బిగ్బీ ట్వీట్ -
‘లాక్డౌన్’లో గృహ విద్యుత్ వాడకం పెరిగింది
సాక్షి, హైదరాబాద్: వరుసగా 3 నెలలు రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉండటం, ప్రజలంతా ఇళ్లలోనే ఉండడంతో గృహ విద్యుత్ వినియోగం పెరిగి బి ల్లుల పెరుగుదలకు కారణమైందని దక్షిణ తెలంగా ణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీ ఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. గత మార్చి, ఏప్రి ల్, మే నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను 40 శాతం మంది గృహ వినియోగదారులు చెల్లించలేదని, దీంతో జూన్లో బకాయిలతో కలిపి ఒకేసారి 4 నెలల బిల్లులు రావడంతో ఎక్కువ మొత్తంగా కని పించడం మరో కారణమన్నారు. విద్యుత్ బిల్లులను అడ్డుగోలుగా పెంచారని విమర్శలు రావడంతో శని వారం ఆయన సంస్థ కార్యాలయంలో విలేకరుల స మావేశం ఏర్పాటుచేసి వివరణ ఇచ్చారు. మూడేళ్లు గా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని, బిల్లులు పెంచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలల్లో మీ టర్ రీడింగ్ తీయకుండా తాత్కాలిక విధానంలో బిల్లులు జారీ చేశామన్నారు. ప్రస్తుత జూన్ నుంచి మీటర్ రీడింగ్ తీస్తున్నామని, జూన్లో 3నెలల విని యోగానికి సంబంధించి మీటర్ రీడింగ్ తీసి గత రెండు నెలల్లో వినియోగదారులు చెల్లించిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులను సర్దుబాటు చేస్తున్నామన్నారు. వాస్తవ వినియోగం కంటే ఎవరై నా అధికంగా బిల్లులు చెల్లించి ఉంటే వారికి జూన్ బిల్లులను ఆ మేరకు తగ్గించి సర్దుబాటు చేస్తామన్నారు. లాక్డౌన్ వల్ల అనివార్య పరిస్థితిలో తాత్కాలిక బిల్లులు వసూలు చేయాల్సి వచ్చిందని, దీంతో 3 నెలల వినియోగానికి సంబంధించిన మీటర్ రీ డింగ్ను ఒకేసారి తీసి సగటున ఒక్కో నెలకు ఎంత వినియోగం ఉంటుందో అంచనా వేసి ప్రస్తుత నెల లో బిల్లులు జారీ చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో కొందరి స్లాబులు ఎగబాకి కొంత వరకు బిల్లులు పెరిగిన మాట వాస్తవమేనన్నారు. తాత్కాలిక బిల్లులతో స్థూలంగా విద్యుత్ సంస్థలే నష్టపోయాయని, వినియోగదారులకు ప్రయోజనం కలిగిందన్నారు. వారంలో చార్జీల పెంపు ప్రతిపాదనలు రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలతో పాటు 2019–20, 2020–21 ఆర్థిక సం వత్సరాలకు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను వారంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పిస్తామని రఘుమారెడ్డి తెలి పారు. టారిఫ్ ప్రతిపాదనల తో పాటు ఏఆర్ఆర్ సమర్పించేందుకు గడు వు పొడిగించడానికి ఈఆర్సీ అంగీకరించలేదని, తక్షణమే వాటిని సమర్పించాలని ఆదేశించిందని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. -
కోవిడ్ ‘ట్యాబ్లెట్’
సాక్షి, హైదరాబాద్: విద్యావ్యవస్థకు కోవిడ్ కొత్త బాటలు వేసింది. ఇంతకాలం విదేశాలకే పరిమితమైన ఆన్లైన్ బోధన ఇప్పుడు మనల్నీ పలకరిస్తోంది. గతంలో కొన్ని పెద్ద విద్యాసంస్థలే ఆన్లైన్ చదువుకు ప్రాధాన్యమిచ్చేవి. ఇప్పుడు గల్లీ బడులు కూడా అదే బాట పడుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల చేతుల్లో ట్యాబ్లెట్ మొబైల్స్ సాధారణమయ్యే పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ తర్వాత క్రమంగా తెరుచుకుంటున్న మొబైల్ షాపుల్లో టాబ్లెట్ మొబైల్స్కు డిమాండ్ ఏర్పడింది. గత మంగళవారం నుంచి నగరవ్యాప్తంగా మొబైల్ షాపులు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే చిన్న షాపులు దాదాపు తెరుచుకోగా, పెద్ద షోరూమ్లు క్రమంగా ప్రారంభమవుతున్నాయి. తెరుచుకున్న వాటిల్లో సాధారణ సెల్ఫోన్లు కొనేవారు ఎక్కువగా వస్తుండగా, గతంలో ఎన్నడూ లేన ట్టు ట్యాబ్లెట్ మొబైల్స్ కొనుగోలు రెట్టిం పైంది. గతంలో నెలలో 10 – 15 టాబ్లెట్స్ అమ్మే షోరూమ్ల్లో ఇప్పుడు రోజూ 2 – 3 చొప్పున కొంటున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. వీరంతా విద్యార్థులే కావటం విశేషం. మూడేళ్ల క్రితం సాధారణ ట్యాబ్స్ ధర రూ.10వేలుగా ఉండేది. ప్రస్తుతం రూ.3వేలకు మామూలు ట్యాబ్స్ లభిస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్ల హైఎండ్ మోడల్ దాదాపు రూ.30వేలకుపైగా ఉంటోంది. కానీ ప్రస్తుతం సాధారణ ట్యాబ్స్ను కొనేందుకే విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. మధ్య, దిగువ మధ్య తరగతి వారు తక్కువ ధర వాటినే ఎంచుకుంటున్నారు. డిమాండ్కు అనుగుణంగా షాపుల్లో 20 వరకు ట్యాబ్స్ సిద్ధంగా ఉంచుతున్నామని ఓ షోరూమ్ నిర్వాహకుడు చెప్పారు. అయితే, పెద్ద కంపెనీల నుంచి సకాలంలో ఫోన్లు, ట్యాబ్స్ సరఫరా కావట్లేదని, పూర్తిగా క్రమబద్ధం కావటానికి మరో నెల పడుతుందని ఆయన తెలిపారు. కాగా, లాక్డౌన్ తర్వాత తెరుచుకున్న షోరూమ్లకు కొనుగోలుదారులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. లాక్డౌన్ సమయంలో చాలా ఫోన్లు పాడవటంతో షాపులు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయా అని వినియోగదారులు ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు దుకాణాలు తెరుచుకోగానే క్యూ కడుతున్నారు. దీంతో మొబైల్ షాపులు రద్దీగా మారాయి. ‘ట్యాబ్లెట్స్’ ట్రెండ్ నడుస్తోంది లాక్డౌన్ తరువాత షోరూమ్లు తెరిస్తే కొనుగోలుదారులు వస్తారా అనే అనుమానం ఉండేది. కానీ లాక్డౌన్కు ముందున్నట్టే ఇప్పుడూ స్పందన ఉంది. అయితే, గతంతో పోలిస్తే 20శాతం మేర కొనుగోలుదారుల రాక తక్కువగా ఉం దనిపిస్తోంది. త్వరలోనే అదీ భర్తీ అవుతుంది. కోవిడ్ నిబంధనలను అనుసరించి కొనుగోలుదారులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. గతంలో మాదిరిగా వినియోగదారులు ఎక్కువసేపుండకుండా తొందరగా వెళ్లిపోతున్నారు. హైఎండ్ మోడల్స్ తక్కువగా, బడ్జెటరీ మోడల్స్ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ట్యాబ్లెట్స్ కొనుగోళ్లు ట్రెండ్గా మారాయి. – బాలు చౌదరి, ఫౌండర్ అండ్ సీఎండీ, బిగ్ సీ -
పొల్యూషన్ మళ్లీ పరేషాన్
సాక్షి,హైదరాబాద్: మళ్లీ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. రెండునెలల కాలంలో సాధించిన ఫలితాలు కేవలం రెండ్రోజుల్లోనే నష్టపోయి మునుపటిస్థాయికి చేరుకుంటోంది. ప్రస్తుతం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు రంగాల కార్యకలాపాలు మొదలుకావడం, రెడ్జోన్లో లాక్డౌన్ సడలింపులతో ఒక్కసారిగా వాహనాలు రోడ్లపైకి రావడంతో పాటు, దుమ్ము, ధూళి కణాల విస్తరణ, ఎండ వేడిమి పెరగడం వంటి కారణాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాలినాణ్యత ఒక్కసారిగా పడిపోయింది. దాదాపు 60 రోజులుగా లాక్డౌన్ కారణంగా స్వచ్ఛమైనగాలి పీల్చుకుంటున్న ప్రజలు మళ్లీ వాయు కాలుష్యాన్ని పీల్చుకోవాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. సడలింపులతో తగ్గిన వాయునాణ్యత లాక్డౌన్ అమల్లో ఉండగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, అమరావతి, విశాఖ, రాజమండ్రి, తిరుపతి వంటి నగరాలు, పట్టణాలు వాయునాణ్యత సూచీలో మొదటిసారి ‘గుడ్’కేటగిరీ సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలతో పాటు దక్షిణాదిలోని నగరాలు కూడా ఈ కోవలోకే చేరాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో వాయునాణ్యత పరిస్థితి కొంత బాగుపడినా, దక్షిణాది నగరాలు మెరుగైన వాయునాణ్యతను సాధించాయి. అయితే లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో శుక్రవారం (మే 22న) దేశంలోని ప్రధాన నగరాలు, అందులోని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వాయునాణ్యత తగ్గింది. తిరుపతిలో ఒక మోస్తరు మెరుగైన వాయునాణ్యత నమోదు కాగా దక్షిణాదిలోని త్రివేండ్రం, బెంగళూరులలో దాదాపు ఏప్రిల్ 22 నాటి పరిస్థితులే కొనసాగాయి. కొచ్చి, చెన్నైలలో కొంతమేర మాత్రమే వాయునాణ్యత తగ్గింది. గత నెలతో పోల్చితే హైదరాబాద్, రాజమండ్రి, విశాఖ, అమరావతిలలో వాహనాల రద్దీ కారణంగా వాయునాణ్యత తగ్గినట్టుగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా గణాంకాల్లో వెల్లడైంది. రంగుల వారీగా వర్గీకరణ ఇలా... వాయు నాణ్యత లెక్కింపు ఇలా... దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యతను (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్– ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వాస్తవ సమయంలో పరిశీలించి ‘సమీర్ యాప్’ద్వారా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటుంది. ► ఏక్యూఐ 50 పాయింట్లలోపు ఉంటే స్వచ్ఛమైన వాతావరణంతో పాటు నాణ్యమైన గాలి ప్రజలకు అందుతున్నట్టు లెక్క. ► 50 – 100 పాయింట్లు నమోదైతే గాలి నాణ్యతగా ఉన్నట్టు లెక్కిస్తారు. ► 100 పాయింట్లు మించి నమోదైతే ఆయా స్థాయిలను బట్టి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. -
మహిళలకు మళ్లీ నాటి పరిస్థితి?
సాక్షి, హైదరాబాద్: సమాజంలో అసమానతలు, లింగ వివక్షకు కరోనా వైరస్ పరోక్షంగా కారణమవుతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. తొలి దశలో ప్రపంచవ్యాప్తంగా పురుషుల ఆరోగ్య స్థితిని కరోనా దెబ్బ తీస్తుందని, ముఖ్యంగా వృద్ధులను బలి తీసుకుంటుందని భావించామని, క్రమంగా రూటు మార్చుకున్న కరోనా మహిళల భద్రతకే సవాలుగా మారిందని ఆయన తెలిపారు. కరోనా పరిణామ క్రమంపై గుటెర్రస్ అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి రాసిన ఓ వ్యాసాన్ని ఐరాస తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. ఈ వ్యాసంలో ఆయన కరోనా కారణంగా మహిళా శక్తి అర్ధ శతాబ్దం వెనక్కు వెళ్ళినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. (ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు) గుటెర్రస్ వ్యాసంలోని ముఖ్యాంశాలు: ‘ఇప్పటికే లాక్ డౌన్, క్వారంటైన్ వల్ల మహిళలపై ప్రపంచవ్యాప్తంగా గృహ హింస పెరిగింది. అయితే మహిళలపై హింస పెరగకుండా ఇప్పటికే ప్రపంచంలోని 143 దేశాలు రక్షణ చర్యలు మొదలుపెట్టాయి. కానీ, కరోనా కారణంగా తలెత్తనున్న ఆర్థిక సంక్షోభం ప్రపంచ మహిళల ముఖ చిత్రం మార్చబోతోంది. ఇటీవలి సంక్షోభ కాలంలో మహిళలపై భౌతిక అరాచకం పెరిగిపోతోంది. వారి హక్కులు, స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. నేను 1960ల్లో విద్యార్థిగా ఉన్నప్పుడు మహిళల శ్రమ చూశాను. మోయలేని బరువులు నెత్తిన పెట్టుకుని కూలీ పనికి వెళ్లడం గమనించాను. నేను రాజకీయాల్లోకి రావడానికి అది కూడా కారణం అయింది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని, మహిళలకు సమాన ఉపాధి, వేతనం లభించాలని కోరుకున్నా. తరువాత కాలంలో నేను ఆశించినది జరిగింది. (కరోనా విపత్తు: భారీ ఉపశమనం) కానీ, కరోనా వైరస్ మళ్లీ పాత పరిస్థితుల్లోకి వారిని నెడుతోందని అనిపిస్తోంది. పనిమనిషిగా, దినసరి కూలీగా, తోపుడు బండి వ్యాపారిగా, చిన్న తరహా ఉద్యోగినిగా మహిళ పురుషుడికన్నా ఎక్కువ శ్రమ చేస్తుంది. ఐఎల్ఓ అంచనా ప్రకారం రానున్న మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల ఉద్యోగాలు పోతాయని అంటున్నారు. మొదట ప్రభావం చూపేది మహిళల మీదనే అని నా అభిప్రాయం. మరో విషయం ఏమిటంటే కరోనా బాలికా విద్యను కూడా ప్రభావితం చేయనుంది. ఎబోలా వైరస్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా (వైరస్ ప్రభావం ఉన్న దేశాల్లో) బాలికా విద్య 50 నుంచి 34 శాతానికి తగ్గిపోయిన విషయం విస్మరించలేనిది. ఈ అంశాలన్నింటిపై రాజకీయ నాయకత్వం దృష్టి పెట్టాలి. బాలికా విద్యతో పాటు, మహిళలకు సామాజిక భద్రత, హెల్త్ ఇన్సూరెన్స్, సిక్, చైల్డ్ కేర్ సెలవులు, నిరుద్యోగ భృతి కల్పనలాంటి విషయాలపై పని చేయాలి. కరోనా దృష్టాంతం తర్వాత ప్రపంచం ఆ దిశలో ముందుకెళ్లినప్పుడే మహిళా హక్కులు పరిరక్షింపబడతాయి.’ (వైరల్ వీడియా షేర్ చేసిన ప్రధాని మోదీ) -
బంగారం నెక్ట్స్ టార్గెట్ ఇదేనా..?
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్ధితులతో పసిడి ధరలు పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతున్నాయి. భారత్లో కరోనా కేసులు పెరగడం, లాక్డౌన్ పొడిగింపు వార్తలతో సోమవారం ఒక్కరోజే ఎంసీఎక్స్లో పదిగ్రాముల పసిడి రూ 1000 భారమై ఏకంగా రూ 46,255కు ఎగబాకింది. బంగారం ధరలు ఇదే ధోరణిలో కొనసాగుతూ ఏడాది చివరికి రూ 50,000 నుంచి రూ 55,000కు చేరుతాయని పీఎన్జీ జ్యూవెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సౌరవ్ గాడ్గిల్ ఓ వార్తాసంస్ధతో మాట్లాడుతూ అంచనా వేశారు. 2019లో 23.74 శాతం పెరిగిన ధరలు ఈ ఏడాది సైతం భారీ రిటన్స్ అందిస్తాయని బులియన్ ట్రేడర్లు చెబుతున్నారు. వైరస్ భయాలు, స్పెక్యులేషన్, ప్రస్తుత ఆర్థిక పరిస్ధితులపై అనిశ్చితితో రాబోయే రెండు మూడేళ్లు బంగారం ధరలు పైపైకే ఎగబాకుతాయని అంచనా వేస్తున్నారు. యుద్ధాలు, ఇతర సంక్షోభ సమయాల్లో బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు సానుకూలంగా ఉంటారని గాడ్గిల్ పేర్కొన్నారు. 2020లో బంగారం పదిగ్రాములకు ఇప్పటికే రూ 6794 (17.31 శాతం) చొప్పున పెరిగింది. అంతర్జాతీయ అనిశ్చితి, ఈక్విటీ మార్కెట్లు కుదేలవడంతో సురక్షిత పెట్టుబడిగా మదుపుదారులు పసిడివైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. కరెన్సీలు, మార్కెట్లలో అనిశ్చితి రాజ్యమేలుతుండటంతో రానున్న రోజుల్లో అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు పెట్టుబడి సాధనంగా బంగారాన్ని ఎంచుకుంటాయని ఇది బంగారానికి మరింత డిమాండ్ పెంచుతుందని గాడ్గిల్ అన్నారు. చదవండి : బంగారం రికార్డు : రూ. 45 వేలను దాటేసింది ప్రస్తుతం అమెరికా తర్వాత చైనా, రష్యా జర్మనీ వద్ద అత్యధికంగా బంగారం నిల్వలున్నాయని, ఐరోపా యూనియన్, ఐఎంఎఫ్ వద్దా పసిడి నిల్వలున్నాయని, రాబోయే రోజుల్లో భారత్ సహా పలు దేశాలు తమ బంగారం నిల్వలను పెంచుకుంటాయని ఆయన అంచనా వేశారు. బంగారాన్ని దశలవారీగా కొనుగోలు చేసుకుంటూ వెళితే రాబోయే రెండు మూడేళ్లలో మెరుగైన రిటన్స్ లభించే అవకాశం ఉందని అన్నారు. -
ఏపీలో 363కు చేరిన కరోనా పాజిటివ్
-
మరో 15 కేసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363కి చేరింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం రాత్రి 8 వరకు 674 శాంపిళ్లు పరీక్షించగా 15 కేసులు పాజిటివ్గా వచ్చాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 11 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 2, తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. పదికి చేరిన డిశ్చార్జిలు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన బాధితుడు కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన ఈ యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 23న తిరుపతి జీజీహెచ్ ఎస్వీఆర్ఆర్ హాస్పిటల్లో చేరారు. ప్రోటోకాల్ ప్రకారం మూడుసార్లు జరిపిన టెస్టుల్లో నెగిటివ్గా తేలడంతో డిశ్చార్జి చేశారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 10కి చేరింది. కరోనా బారిన పడి అనంతపురం, గుంటూరు జిల్లాలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. అనంతపురంలో 70 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 6న కరోనా లక్షణాలతో హాస్పిటల్లో చేరగా ఆ మర్నాడే చనిపోయాడు. 8వ తేదీన శాంపిళ్లలో పాజిటివ్గా వచ్చింది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన 45 సంవత్సరాల వ్యక్తి ఆరోగ్యం పూర్తిగా విషమించిన తర్వాత 7వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు హాస్పిటల్లో చేరగా అదే రోజు మధ్యాహ్నం 2.15కు మరణించాడు. బాధితుడు కరోనా పాజిటివ్గా శాంపిళ్లలో తేలింది. గుంటూరు జిల్లాలో కరోనాతో ఇదే తొలి మరణం. నరసరావుపేటలోని వరవకట్ట, రామిరెడ్డిపేటలో పరిధిలో మూడు కిలోమీటర్లను రెడ్ జోన్ గా ప్రకటించారు. పొన్నూరులో కూడా కరోనా కేసు వెలుగులోకి రావడంతో పట్టణంలోని శరాబ్ బజారుకు కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్గా ప్రకటించి రసాయనాలను పిచికారీ చేశారు. -
లాక్డౌన్ వేళ.. ఆన్లైన్ బాట
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశమంతా లాక్డౌన్ నడుస్తోంది.. దాదాపు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.. ఈ నేపథ్యంలో.. ఓవర్ ద టాప్( ఓటీటీ) ప్లాట్ఫామ్స్ తెరలపై బొమ్మలు మరింతగా సందడి చేస్తున్నాయి. ప్రజలు తమ స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, ఆహా తదితర ఓటీటీ ప్లాట్ఫామ్స్కు అతుక్కుపోతున్నారు. తమకు ఇష్టమైన సినిమాలు, వెబ్ సిరీస్లు, ఇతర కార్యక్రమాలు తెగ చూసేస్తున్నారు. దీంతో గత పది రోజుల్లో ఓటీటీల వ్యూయర్షిప్ 25శాతం పెరిగింది. ►లాక్డౌన్ నేపథ్యంలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రై మ్, హాట్స్టార్, జీ5, హంగామా డిజిటల్, ఆహా.. వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మరింతగా విస్తరిస్తున్నాయి. ►రిలయన్స్ జియో, ఎయిర్టెల్, టాటాస్కై వంటి డీటీహెచ్ సర్వీసులు కూడా తమ ప్యాకేజీల్లో ఓటీటీలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ►రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటీటీల వీక్షణం అంతకంతకూ పెరుగుతోంది. ►గతంలో ఉదయం 6 నుంచి 8, తిరిగి సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఓటీటీల వ్యూయర్షిప్నకు పీక్ టైమ్గా ఉండగా.. ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు పీక్ టైమ్గా ఉంటోంది. ►ఓటీటీల వ్యూయర్షిప్ తక్కువ ఉండే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల సమయంలోనూ ప్రస్తుతం వ్యూయర్షిప్ బాగా పెరిగింది. ►ఇక లాక్డౌన్ సమయంలో.. చూడదగ్గ సూపర్హిట్లు, అవార్డులు సాధించిన సినిమాలు, ఇతర కార్యక్రమాల జాబితాలను కూడా జాతీయ, ప్రాంతీయ న్యూస్ చానళ్లు ప్రత్యేకంగా వివరిస్తుండటంతో ప్రజలు వాటిని చూసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ►ఓటీటీ ప్లాట్ఫామ్స్కు కొత్త చందాదారులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు కూడా. ►ఏప్రిల్ 14 వరకు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హెడ్డీ లేదు.. ఎస్డీనే.. క్వాలిటీనే.. ►లాక్డౌన్ నేపథ్యంలో పలు ఐటీ, ఇతర కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేస్తుండటంతో బ్రాడ్బ్యాండ్ సేవలందించే టెలికాం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లపై లోడ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ►మరోవైపు ఇళ్లల్లో ఉన్న వాళ్లు ఓటీటీల ద్వారా సినిమాలు, ఇతర కార్యక్రమాలను ఎక్కువగా చూస్తుండటంతో లోడ్ మరింత అధికమవుతోంది. ►ఈ నేపథ్యంలో టెలికాం సర్వీసు ప్రొవైడర్ల సేవలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ తమ ప్రసారాలను హెడ్డీ కాకుండా ఎస్డీ క్వాలిటీతో ఇవ్వాలని కేంద్ర టెలికాం శాఖ ఆదేశించింది. ఆన్లైన్ పుస్తకాలూ ఫ్రీ ►ఆన్లైన్లో పుస్తకాలను అందిస్తున్న సంస్థలన్నీ వాటి సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించాయి. ►అమెజాన్ బుక్స్, కేంబ్రిడ్జ్ బుక్స్ లాంటి సంస్థలతో ప్రపంచంలోని దాదాపు అన్ని సంస్థలు ఆన్లైన్లో పుస్తకాలు చదువుకునేందుకు చార్జీలు వసూలు చేయడం లేదు. ►పిల్లలు ఇష్టపడే పలురకాల చిత్రాలను కూడా ప్రఖ్యాత సంస్థలు ఉచితంగా అందిస్తున్నాయి. అందులో అమర్చిత్రకథ లాంటి వెబ్సైట్లు కూడా ఉన్నాయి. -
ఫ్రాన్స్ లో కూడా కరోనా తగ్గలేదు
-
షేర్ల బేజారు.. బంగారానికి క్రేజు
ముంబై : కరోనా వైరస్ వ్యాప్తిపై నెలకొన్న భయాందోళనలతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం స్వర్ణానికి కలిసివచ్చింది. మహమ్మారి వైరస్ షేర్ మార్కెట్ను షేక్ చేస్తుండటంతో మదుపరులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. షేర్లను తెగనమ్మి బంగారంలోకి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లించడంతో హాట్మెటల్ కాస్ల్టీగా మారింది. పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. బంగారానికి డిమాండ్ పెరగడంతో సోమవారం ఎంసీఎక్స్లో పదిగ్రాముల పసిడి రూ 517 ఎగిసి రూ 40,875 పలికింది. ఇక కిలో వెండి ఏకంగా రూ 1259 పెరిగి రూ 37,102కు చేరింది. డెడ్లీ వైరస్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న ఆందోళనతో బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత ఎగబాకుతాయని బులియన్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. చదవండి : గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం -
5 రోజుల్లో 5000 తగ్గి మళ్లీ ఎగిసిన పసిడి
ముంబై: గత ఐదురోజుల్లో 5 వేల రూపాయల వరకూ తగ్గిన పదిగ్రాముల పసిడి మంగళవారం స్వల్పంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి బంగారంలో పెట్టుబడులకు మళ్లుతుండటంతో యల్లో మెటల్కు డిమాండ్ పెరిగింది. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం 107 రూపాయలు పెరిగి రూ. 39,625 పలికింది. ఇక కిలో వెండి రూ. 155 తగ్గి రూ. 36,052కు దిగివచ్చింది. కాగా, కొద్ది రోజులు బంగారం, వెండి ధరలు ఒడిదుడుకుల మధ్య సాగినా క్రమంగా స్థిరంగా ముందుకు సాగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: బిగ్ రిలీఫ్ : భారీగా తగ్గిన బంగారం -
పసిడి మళ్లీ పైపైకి..
ముంబై : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిపై భయాందోళనల నేపథ్యంలో పసిడి ధరలు మళ్లీ పైకెగిశాయి. మంగళవారం వరుసగా రెండోరోజూ బంగారం ధరలు ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా దేశీ మార్కెట్లోనూ బంగారం భారమైంది. ఎంసీఎక్స్లో పదిగ్రాముల పసిడి రూ 514 పెరిగి రూ 42,470 పలికింది. ఇక బంగారం బాటలోనే వెండి ధరలు సైతం భగ్గుమన్నాయి. కిలో వెండి రూ 711 భారమై రూ 45,272 పలికింది. కరోనా భయాలతో బంగారం ధరలు కొద్దిరోజులు ఒడిదుడుకులతో సాగినా స్ధిరంగా ముందుకే కదులుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : బంగారం ‘బంగారమే’ : మళ్లీ పెరిగింది -
మళ్లీ భారమైన బంగారం
ముంబై : గత రెండు రోజులుగా స్వల్పంగా దిగివచ్చిన బంగారం గురువారం మళ్లీ కొండెక్కింది. ఈక్విటీ మార్కెట్ల పతనంతో మదుపరులు బంగారం వైపు మొగ్గుచూపడంతో హాట్మెటల్ మళ్లీ పైపైకి ఎగబాకింది. ఎంసీఎక్స్లో పదిగ్రాముల పసిడి రూ 210 భారమై రూ 42,714 పలికింది. మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా భగ్గుమంది. ఎంసీఎక్స్లో కిలో వెండి రూ 492 పెరిగి రూ 47,068 పలికింది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : జ్యూవెలర్లకు ఐటీ షాక్ -
ఐడీబీఐ బ్యాంక్ షేరు జోరు
బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పతనంకాగా.. ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్కు మాత్రం డిమాండ్ పెరిగింది. బ్యాంకులో మిగిలిన వాటాను విక్రయించనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లింది. బీఎస్ఈలో శనివారం ఐడీబీఐ బ్యాంకు షేరు రూ. 3.4 ఎగసి రూ. 37.30 వద్ద ముగిసింది. ప్రమోటర్గా ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటాను కలిగి ఉంది. ఎల్ఐసీకి 51 శాతం వాటా ఉంది. గత సెప్టెంబర్లో ఎల్ఐసీ, ప్రభుత్వం సంయుక్తంగా బ్యాంకులో రూ. 9300 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. బ్యాంకు పెట్టుబడి అవసరాలకు తదుపరి ఎల్ఐసీ మరో రూ. 4743 కోట్లను పంప్చేసింది. కాగా.. ప్రభుత్వం స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా ఐడీబీఐ బ్యాంకులో వాటాను విక్రయించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజాగా వెల్లడించింది. -
డిపాజిట్లకు ‘ఐదు లక్షల’ అభయం
న్యూఢిల్లీ: సామాన్య బ్యాంకు డిపాజిటర్లకు భరోసాను కల్పించే తీపి కబురును నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డిపాజిట్లకు మరింత రక్షణ కల్పిస్తూ, వాటిపై బీమాను ఐదు రెట్లు– రూ. 5 లక్షలకు పెంచారు. వివరాల్లోకి వెళితే... బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్... ఎక్కువ మందికి సురక్షిత పెట్టుబడి సాధనం. ప్రస్తుతం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) పరిధిలో ఒక్కో డిపాజిట్దారుడికి గరిష్టంగా రూ.లక్ష బీమా సౌలభ్యతను బ్యాంకులు అందిస్తున్నాయి. దీంతో ఏదైనా బ్యాంకు సంక్షోభం పాలై చెల్లింపుల్లో విఫలమైతే... అప్పుడు ఒక్కో డిపాజిట్ దారుడికి గరిష్టంగా రూ.లక్ష చొప్పున చెల్లిస్తారు. అయితే ఈ మొత్తాన్ని ఆర్థికమంత్రి ఐదు లక్షలకు పెంచారు. ఇటీవలే మహారాష్ట్రకు చెందిన పీఎంసీ బ్యాంకు సంక్షోభం పాలవడంతో ఆ బ్యాంకుల్లో భారీగా డిపాజిట్ చేసుకున్న వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిపాజిటర్ల ఆగ్రహాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముంబై వెళ్లిన సందర్భంగా స్వయంగా చవి చూశారు కూడా. ఆర్బీఐ సైతం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలు బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని బలంగా చాటాయి. దీంతో కేంద్ర సర్కారు ఈ అవసరాన్ని గుర్తించింది. దీనితో ఆర్థికశాఖ తాజా బడ్జెట్లో కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. 1993 తర్వాత...: చివరిగా 1993 మే1న డిపాజిట్లపై బీమాను సవరించారు. 1992లో జరిగిన సెక్యూరిటీస్ స్కామ్ దెబ్బకు బ్యాంక్ ఆఫ్ కరద్ మూతపడడం నాడు డిపాజిట్లపై గరిష్ట బీమాగా ఉన్న రూ.30,000 మొత్తాన్ని రూ.లక్షకు పెంచడానికి కారణమైంది. ఇటీవలి పీఎంసీ బ్యాంకు సంక్షోభం మరో విడత సవరణ అవసరాన్ని గుర్తు చేసింది. అయితే, డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచితే బ్యాంకులు చెల్లిస్తున్న ప్రీమియం కూడా పెరుగుతుంది. డిపాజిట్ ఎంతున్నా బీమా ఐదు లక్షలకే..! బ్యాంకింగ్ అకౌంట్లు అందులోని మొత్తాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఐదు లక్షల డిపాజిట్ వరకే బీమా వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి వద్ద రూ.10 లక్షలు ఉన్నాయనుకుందాం. రెండు వేర్వేరు బ్యాంకుల్లో రూ.ఐదు లక్షల చొప్పున డిపాజిట్ చేస్తే, మొత్తం రూ.10 లక్షలకూ బీమా వర్తించదు. పాన్ నెంబర్సహా తాజా బ్యాంకింగ్ సేవల సాంకేతికత వల్ల ఒక వ్యక్తికి బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ మొత్తం ఎంతుందన్న విషయంలో తేలిగ్గా వెల్లడవుతుంది. అందువల్ల బ్యాంకుల్లో డిపాజిట్ పరిమాణం ఎంతయినా, కేవలం రూ. 5 లక్షలకే బీమా వర్తిస్తుందన్న విషయం గమనార్హం. సేవల వ్యయం పెరుగుతుంది తాజా నిర్ణయం వల్ల బ్యాంకింగ్ సేవల వ్యయం పెరుగుతుంది. ప్రీమియం ఐదు రెట్లు పెరగడం వల్ల బ్యాంకులపై వ్యయ భారం తీవ్రంగానే ఉంటుంది. ఇది కస్టమర్లకు బదలాయించే అవకాశాలే ఉన్నాయి. – అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ మాజీ చైర్మన్ -
బంగారం : ఏం కొనేట్టు లేదు..
ముంబై : రోజుకో రకంగా హెచ్చుతగ్గులతో కదులుతున్న బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. అంతర్జాతీయ అనిశ్చితికి తోడు కరోనా వైరస్ వ్యాప్తిపై భయాందోళనలతో పసిడి ధర పరుగులు పెట్టింది. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం ఏకంగా రూ 209 భారమై రూ 40,559కు ఎగబాకింది. మరోవైపు వెండి ధర సైతం కిలోకు రూ 367ప పెరిగి రూ 45,918కి చేరింది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు నిలకడగా పైపైకి ఎగబాకుతాయని బులియన్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఆర్థిక మందగమనం, అనిశ్చితితో మదుపరులు సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారాన్నే ఎంచుకోవడంతో యల్లోమెటల్ మరింత తళుకులీనుతుందని వారు చెబుతున్నారు. చదవండి : మళ్లీ పసిడి పరుగు.. -
మార్కెట్కు చమురు నష్టాలు
ముడి చమురు ధరలు భగ్గుమనడంతో శుక్రవారం మన మార్కెట్ నష్టపోయింది. అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ కమాండర్ ఖాసీమ్ సులేమాని మరణించడం, దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించడంతో ముడి చమురు ధరలు పెరిగి ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా నష్టపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 37 పైసలు పతనమై 71.75కు చేరడం ప్రతికూల ప్రభావం చూపించింది.దీంతో కొత్త ఏడాది వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఇంట్రాడేలో 278 పాయింట్ల మేర పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 162 పాయింట్లు పతనమై 41,465 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 12,227 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక వారం పరంగా చూస్తే, మార్కెట్ నష్టపోయింది. సెన్సెక్స్ 111 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. చివర్లో ఒకింత రికవరీ అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసీమ్ మరణించడం, దీనికి ప్రతి దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరగనున్నాయి. ఈ దాడి నేపథ్యంలో సురక్షిత సాధనాలైన పుత్తడి, జపాన్ కరెన్సీ యెన్ల్లోకి రిస్క్ అధికంగా ఉన్న ఈక్విటీల నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఈ దాడి కారణంగా ముడి చమురు ధరలు 4.4 శాతం మేర పెరిగాయి. మధ్యాసియాలో ఉద్రిక్తతలు చెలరేగుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, మార్కెట్ రికార్డ్ల స్థాయిల్లో ఉండటంతో లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశాలున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. డాలర్ బలపడటంతో ఐటీ షేర్లు ఎగిశాయని పేర్కొన్నారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ లాభాల్లో మొదలైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ట్రేడింగ్ చివర్లో కొంత రికవరీ చోటు చేసుకోవడంతో నష్టాలు తగ్గాయి. ►రూపాయి పతనం కారణంగా ఐటీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. ►ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ షేర్లు 0.04–2.1 శాతం రేంజ్లో నష్టపోయాయి. ముడి చమురును ముడి పదార్థంగా వినియోగిస్తున్న పెయింట్స్, విమానయాన కంపెనీల షేర్లు కూడా నష్టపోయాయి. ►ఏషియన్ పెయింట్స్ షేర్ 2.1 శాతం నష్టంతో రూ.1,752 వద్ద ముగిసింది. పెయింట్ల తయారీలో ముడి పదార్థంగా ముడి చమురు ఉత్పత్తులను వినియోగిస్తారు. -
తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు
-
మద్యం ధరలకు కిక్కు!
సాక్షి, హైదరాబాద్: మందు బాబుల జేబులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ చిల్లు పెట్టింది. మద్యం ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పేదలు తాగే చీప్ లిక్కర్ నుంచి సంపన్నులు సేవించే ఖరీదైన మందు వరకు అన్ని బ్రాండ్ల ధరలను 10 నుంచి 30 శాతం వరకు పెంచేసింది. చీప్ లిక్కర్ ధరలు 30 శాతం వరకు పెంచడం గమనార్హం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. సాధారణ మద్యంపై క్వార్టర్కు కనీసం రూ.20 చొప్పున పెరగ్గా, ప్రీమియం బ్రాండ్లపై రూ.40 వరకు పెరిగింది. ఇక బీర్ల ధరలను రూ.20, రూ.30 చొప్పున పెంచింది. విస్కీ, బ్రాందీ, రమ్, బీర్లు ఇలా అన్నిరకాల మద్యంపై పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని, అయితే మద్యం వ్యాపారులు ఇప్పటికే తీసుకున్న స్టాక్ను పాత ధరలకే అమ్మాల్సి ఉంటుందని, కొత్తగా బుధవారం నుంచి తీసుకునే స్టాక్కే కొత్త ధరలు వర్తిస్తాయని ఎక్సైజ్ వర్గాలు స్పష్టం చేశాయి. బీర్ ‘భారమే’... కనీసం ఒక్కో క్వార్టర్కు రూ.20 చొప్పున ధరలను పెంచగా, కొన్ని బ్రాండ్లకు ఇంకా ఎక్కువే పెంచారు. మొత్తం మీద సాధారణ మద్యం ప్రస్తుతమున్న ధరలతో పోలిస్తే 90 ఎంఎల్ రూ.10, క్వార్టర్ రూ.20, హాఫ్ బాటిల్ రూ.40, ఫుల్బాటిల్ రూ.80, లీటర్ బాటిల్ రూ.110 వరకు పెంచారు. కొన్ని ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్ ధర రూ.150 వరకు పెరిగాయి. యువత ఎక్కు వగా తీసుకునే బీర్ల ధరలనూ భారీగానే పెంచారు. గతంలో లైట్ బీర్ రూ.100 కాగా, ఇప్పుడు దాన్ని రూ.120 చేశారు. స్ట్రాంగ్ బీర్ను రూ.120 నుంచి 130కి పెంచగా, కొన్ని బ్రాండ్లు రూ.180 వరకు పెరిగాయి. చిన్న బీర్ల విషయానికి వస్తే రూ.60 ఉన్న బీరు 70కి, రూ.80 ఉన్న బీరు 90కి పెరిగింది. చీప్లిక్కర్ ధరలూ విపరీతంగా పెంచారు. డైమండ్, ఆర్కేఎస్, కేరళ, రైజోమ్ లాంటి బ్రాండ్లపై క్వార్టర్కు రూ.20 చొప్పున పెం చారు. అన్ని బ్రాండ్ల బ్రీజర్లపై రూ.30 వరకు పెంచారు. గప్చుప్గా... వాస్తవానికి మద్యం ధరలను పెంచాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ దీనికోసం మంత్రివర్గ ఉప సంఘం వేయాలని భావించింది. కానీ, ఉప సంఘం నియమించకుండానే, ఆ కమిటీ సిఫారసు లేకుండానే ఎక్సైజ్ అధికారులు గప్చుప్గా మద్యం ధరలను సవరించేశారు. సవరించిన ధరలను అమల్లోకి తెచ్చేందుకు ఎలాంటి సూచన లేకుండా సోమవారం నుంచే మద్యం డిపోల నుంచి సరఫరా నిలిపివేశారు. మంగళవారం కూడా వైన్షాప్లకు డిపోల నుంచి మద్యం ఇవ్వడం లేదని, బుధవారం నుంచే కొత్త స్టాక్ ఇస్తామని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. -
విజయ పాలు..లీటరు రూ.44
సాక్షి, హైదరాబాద్ : విజయ పాల ధర లీటరుపై రూ.2 పెరిగింది. ప్రస్తుతం విజయ పాలు లీటరుకు రూ.42 వంతున విక్రయిస్తుండగా... ఇకపై రూ.44కు విక్రయించాలని నిర్ణయించింది. పాలసేకరణ ధరలు పెరగడంతో పాల సరఫరా ధర పెంచాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(టీఎస్డీడీసీఎఫ్) ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. స్టాండడైజ్ పాలు, హోల్ మిల్క్ ధరల్లో మార్పు లేదని, పెరిగిన ధరల నేపథ్యంలో వెండర్ మార్జిన్ను లీటర్కు 25 పైసలు పెంచినట్లు ప్రకటించింది. పాల ధరలను తగ్గించాలి: బాలల హక్కుల సంఘం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పెంచిన విజయ పాల ధరను వెంటనే తగ్గించాలని రాష్ట్ర బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు ప్రకటన విడుదల చేశారు. పిల్లలకు దొరికే ఏకైక పౌష్టికాహారాన్ని, అలాగే తల్లి పాలకు దూరమైన పిల్లలు ఆధారపడే పాల ధరను పెంచితే పేద, మధ్యతరగతి పిల్లలు పాలకు దూరమవుతారన్నారు. -
సంక్రాంతి పోరుకు పొరుగు పుంజులు
ఆకివీడు: సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో పందెంకోళ్లకు డిమాండ్ పెరిగింది. ఇతర జిల్లాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి పందెం కోళ్లను తీసుకువచ్చి జిల్లాలోని పలు గ్రామాల్లో విక్రయిస్తున్నారు. కోడి పందాలకు ప్రసిద్ధి గాంచిన పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, భీమవరం, జువ్వలపాలెం, పెద అమిరం, మహదేవపట్నం, తదితర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన పందెంకోళ్లను విక్రయిస్తున్నారు. కోడి ఒక్కింటికి రూ.5 వేలు నుండి రూ.10 వేల వరకూ ధర పలుకుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పెంచే పందెం కోళ్ల ధరలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల కోడి పుంజుల్ని పందెంరాయుళ్లు బాగానే కొనుగోలు చేస్తున్నారు. తనిఖీల్లో కనపడకుండా పలుచటి గోనె సంచుల్లో కోడి పుంజుల్ని ఉంచి రవాణా చేస్తున్నారు. తమ రాష్ట్రంలో కోడి పుంజులకు అంతగా డిమాండ్ లేదని, అందువల్ల ఇక్కడ విక్రయిస్తున్నామని తమిళనాడుకు చెందిన ఓ విక్రయదారుడు తెలిపాడు. -
నగరంలో మాస్క్ మస్ట్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. దీనికి తోడు చలి తీవ్రత పెరగడంతో స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి నెలకొంది. చలి ప్రభావంతో సాయంత్రమైందంటే చాలు శ్వాసనాళాలు మూసుకుపోతుండడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న రోగుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇన్హేలర్ సపోర్ట్ లేనిదే ఊపిరి తీసుకోవడం కష్టతరంగా మారింది. నగరంలో 12–15 శాతం మంది శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుండగా... ప్రస్తుత సీజన్లో బాధితుల సంఖ్య 15–20 శాతానికి పెరిగినట్లు అంచనా. అంతేకాకుండా ప్రస్తుత వాతావరణం స్వైన్ఫ్లూ కారక వైరస్, ఇతర బ్యాక్టీరియాల వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, పిల్లలు, గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాహన, పారిశ్రామిక కాలుష్యానికి దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆర్ఎస్పీఏం అధికం.. గ్రేటర్ పరిధిలో సుమారు 50వేల పరిశ్రమలు ఉండగా.. 55లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న ఉద్గారాలు వాతావరణంలో చేరుతున్నాయి. ఈ కాలుష్యానికి చలి తీవ్రత తోడైంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం పొగతో కూడిన మంచు కురుస్తోంది. వాతావరణంలో రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ (ఆర్ఎస్పీఎం)నిర్ణీత ప్రమాణాలకు మించి నమోదవుతోంది. సాధారణంగా వాతావరణంలో 60 మైక్రో గ్రాములు/క్యూబిక్ మీటరు వరకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ దీపావళి తర్వాత వాతావరణ కాలుష్యం తీవ్రత మరింత పెరిగింది. శుక్రవారం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 158గా నమోదైంది. అందులో పీఎం 2.5. పీఎం 1.0 ఉద్గారాల తీవ్రత నమైదైంది. గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బోమోనాక్సైడ్ వంటి రసాయనాలు కలిసిపోవడం, పొగమంచులో ఇవి కలిసిపోయి శ్వాస తీసుకున్నప్పుడు అవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాససంబంధ సమస్యలకు కారణమవుతున్నాయి. జాగ్రత్తలు అవసరం గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరంలో వాహన కాలుష్యం ఎక్కువ. ముఖ్యంగా బేగంపేట, బాలానగర్, నెహ్రూ జులాజికల్ పార్క్, జీడిమెట్ల, పంజగుట్ట, ఖైరతాబాద్, అబిడ్స్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఆయా పరిసరాల్లో నివసించే వృద్ధులు, పిల్లల్లో ఎక్కువగా వెలుగుచూస్తున్న శ్వాస సంబంధ సమస్యలకు ఇదే కారణం. వాహనాల నుంచి వెలువడిన కాలుష్య కారక ఉద్గారాలు గాలి ద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాసకోశ సంబంధ సమస్యలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం, ఇంటి పరిసరాల్లో పచ్చదనాన్ని వృద్ధి చేసుకోవడం, సాధ్యమైనంత వరకు గ్రీనరీ ప్రదేశాల్లో ఎక్కువగా గడపడం వల్ల వీటి నుంచి బయటపడొచ్చు. సాధ్యమైనంత వరకు ఈ సీజన్లో జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ముక్కుకు మాస్క్ ధరించడం తప్పనిసరి. – డాక్టర్ రఫీ,ఫల్మనాలజిస్ట్, కేర్ ఆస్పత్రి -
50 ఏళ్లలో 8.5 సెం.మీ. పెరిగిన సముద్రమట్టం
న్యూఢిల్లీ: 50 ఏళ్లలో భారత తీరం వెంబడి సముద్రమట్టం 8.5 సెంటీమీటర్లు పెరిగిందని పర్యావరణ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో రాజ్యసభలో చెప్పారు. గ్లోబల్ వార్మింగ్తో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా అనేక నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఐదు దశాబ్దాల్లో భారత తీరం వెంబడి సముద్ర మట్టం సగటున సంవత్సరానికి సుమారు 1.70 మిల్లీమీటర్లు పెరిగిందన్నారు. శాటిలైట్ అల్టిమెట్రి, మోడల్ సిమ్యులేషన్ ప్రకారం 2003–13 మధ్య ఉత్తర హిందూ మహా సముద్రం వైవిధ్యతను ప్రదర్శించిందని, సంవత్సరానికి 6.1 మి.మీ మేర పెరిగిందని రాతపూర్వకంగా బదులిచ్చారు. సునామీ, తుఫాను ప్రభావం, తీర ప్రాంతంలో వరదలు కూడా సముద్రమట్టం పెరుగుదలకు కారణమవుతాయని తెలిపారు. -
ఆరోగ్యం కోసం ఆస్తుల అమ్మకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలు అనారోగ్యం తలెత్తినపుడు చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారని నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నివేదిక వెల్లడించింది. వారి సంపాదనలో అధిక మొత్తం వైద్యానికే వెచ్చిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఒక్కో వ్యక్తి సంవత్సరానికి సగటున రూ.13,968, పట్టణ ప్రాంత వాసులు రూ.26,092 హాస్పిటల్ ఖర్చులకు వెచ్చిస్తున్నట్టు సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. హాస్పిటల్ ఖర్చుల కోసం నేటికీ లక్షల మంది ఆస్తులు అమ్ముకుంటున్నట్టు నివేదిక వెల్లడించింది. వైద్య ఖర్చుల కోసం గ్రామీణ ప్రాంతంలో 0.8% మంది, పట్టణ ప్రాంతాల్లో 0.4% మంది ఆస్తులు అమ్ముకుంటున్నారు. గ్రామాల్లో 24.9%, పట్టణాల్లో 18.2% మంది హాస్పిటల్ ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. ఇక గ్రామాల్లో 67.8% మంది, పట్టణాల్లో 74.9% మంది తమ పొదుపు చేసుకున్న సొమ్ము (సేవింగ్స్)ను హాస్పిటల్ ఖర్చుల కోసం వెచ్చిస్తుండడం గమనార్హం. దేశంలో డెలివరీ ఖర్చు కూడా పెరిగిపోయిందని నివేదిక వెల్లడించింది. సగటున ఒక డెలివరీకి గ్రామీణ ప్రాంతంలో సగటున రూ. 5,544, పట్టణ ప్రాంతాల్లో రూ. 11,685 ఖర్చు అవుతోంది. ప్రైవేటు ఆసుపత్రులో అయితే, గ్రామీణ ప్రాంతాల్లో సగటున రూ.14,778, పట్టణ ప్రాంతాల్లో సగటున రూ. 20,328 డెలివరీ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. దేశ జనాభా 130 కోట్లు దాటినా, ప్రభుత్వ దవాఖానాల్లో పడకల సంఖ్య 10 లక్షలు దాటడం లేదు. దేశవ్యాప్తంగా 25,778 ప్రభుత్వ హాస్పిటల్స్ ఉండగా, వీటిల్లో 7,13,986 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో 863 దవాఖానాలు ఉండగా, 20,983 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 802 దవాఖానాలు 7,668 బెడ్లు, అర్బన్ ఏరియాలో 61 హాస్పిటళ్లు 13,315 బెడ్లు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దేశానికి హైపర్ టెన్షన్... 2018లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరిపించిన ఒక సర్వేలో 6,51,94,599 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 31,02,186 మందికి డయాబెటీస్, 40, 38,166 మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు తేలింది. తెలంగాణలో 2018లో 28,50,666 మందిని స్క్రీన్ చేయగా ఇందులో 1,22,456 మందికి డయాబెటీస్, 1,43,118 మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా 1,68,122 మందికి కేన్సర్ సోకినట్టు సర్వేలో తేలగా, ఇందులో తెలంగాణ నుంచి 13,130 మంది ఉన్నారు. పెరిగిన ఆయుర్దాయం... నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నివేదికలో వీటితోపాటు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వీటిలో ప్రధానంగా భారతీయుల్లో ఆయుర్దాయం పెరగడం గమనార్హం. ►1.1970–75లో సగటు ఆయుర్దాయం 49.5 ఏళ్లు ఉండగా, 2012–16కు 68.7 ఏళ్లకు పెరి గింది. వీరిలో మహిళల సగటు 70.2 ఏళ్లుగా ఉండగా పురుషులు 67.4 ఏళ్లుగా ఉంది. ►2.ఢిల్లీలోని నేషనల్ కేపిటల్ టెరిటరీ (ఎన్సీటీ) ప్రాంతంలో చదరపు కిలోమీటరుకు 11,320 మంది, అరుణాచల్ప్రదేశ్లో అతితక్కువగా 17 మందే నివసిస్తున్నారు. ►3.యువకులు, ఆర్థికంగా చైతన్యవంతుల సంఖ్య పెరిగిందని నివేదిక చెబుతోంది. 2016 వరకు మొత్తం జనాభాలో 27శాతం 14 ఏళ్లలోపువారు ఉండగా, 15–59 వయసు వారు 64.7 శాతం ఉన్నారు. వీరిలో అధికశాతం ఆర్థికంగా చైతన్యవంతులు. 60–85 ఏళ్లలోపు వారిలోనూ 8.5% మంది ఆర్థికంగా చైతన్యంగా ఉన్నారు. ►4.డెంగీ, చికెన్గున్యా తదితర దోమకాటుతో వచ్చే అనారోగ్యాలు భయపెడుతున్నాయి. ►5.1950లో భారత్లో వెలుగుచూసిన డెంగీ మరణాలు 2 దశాబ్దాలుగా పెరిగాయి. ►6.ఇక స్వైన్ఫ్లూ కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. 2012, 13తో పోలిస్తే 2014లో తగ్గుదల రికార్డయింది. తిరిగి 2015లో స్వైన్ఫ్లూ కేసులు పెరిగాయి. 2016లో తగ్గినప్పటికీ 2017, 18లో ఊపందుకున్నాయి. ►7.2018లో 67,769 కేసులు, 2017లో 57,813 చికున్గున్యా కేసులు నమోదయ్యాయి. ►8.2015లో ప్రమాదాల్లో మరణించినవారు 4.13 లక్షలు మంది. 1.33 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా యువకుల్లో ఆత్మహత్య రేటు పెరగడం ఆందోళనకరం. వీరిలో 30–45 ఏళ్ల వయసు ఉన్నవారు 44,593 మంది ఉన్నారు. ►9.2018లో 1.64 లక్షల పాము కాటు కేసులు నమోదయ్యాయి. 885 మంది మరణించారు. ►10.2018లో 2.68కోట్ల మంది దివ్యాంగులుగా మారారు. -
రాష్ట్రానికి ధాన్య కళ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని రీతిలో కాస్త ఆలస్యంగా అయినా వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం సహా మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీనికి తోడు 12వేల చెరువులు వందకు వంద శాతం నిండాయి. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఖరీఫ్లో 40.41 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ జరగ్గా, ఈ ఏడాది అంతకు మించి మరో 15లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా సేకరించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. మొత్తంగా 55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు వీలుగా 2,544 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ధాన్యం సేకరణ విధానంపై జిల్లాల వారీగా వ్యవసాయ శాఖతో సమన్వయం చేస్తూ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగానే కొన్ని జిల్లాల్లో అంచనాకు మించి ధాన్యం దిగుబడులు రావచ్చనే అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా సాగునీటి లభ్యత పుష్కలంగా ఉన్న ఖమ్మం జిల్లాలో గత ఏడాది 1.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా, ప్రస్తుతం అక్కడ సాగైన వరి విస్తీర్ణాన్నిబట్టి 2.50 లక్షల మెట్రిక్ టన్నులు రావొచ్చని అంచనా వేశారు. ఇదే రీతిన జగిత్యాలలో గత ఏడాది 3.3 లక్షలు కొనుగోళ్లు చేయగా, ఈ ఏడాది 6.80 లక్షల టన్నులు, నల్లగొండలో గత ఏడాది 2.20 లక్షలు కొనుగోళ్లు జరగ్గా ఈ ఏడాది 4.6 లక్షలు, సిద్దిపేటలో 70వేల టన్నులు చేయగా, ఈ ఏడాది 1.80 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేయాల్సి ఉంటుందని లెక్కించారు. వీటితో పాటే సూర్యాపేట, మంచిర్యాల, వనపర్తి జిల్లాల్లోనూ అంచనాకు మించి ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని తేల్చారు. మొత్తంగా తొలి అంచనాకన్నా 10లక్షల మెట్రిక్ టన్నుల మేర అధికంగా ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని లెక్కగట్టారు. దీనికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను 2,544 నుంచి 3,297 కేంద్రాలకు పెంచాలని నిర్ణయించారు. మొత్తంగా ఈ ధాన్యం కొనుగోళ్లకు రూ.18వేల కోట్ల మేర వెచ్చించనున్నారు. ఇక ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు తెరిచినప్పటికీ వర్షాల కారణంగా ధాన్యం ఇంకా కేంద్రాలకు రావడం లేదు. దీపావళి తర్వాత నుంచి పెద్దఎత్తున ధాన్యం రానున్న దృష్ట్యా, కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. దీపావళి తర్వాత ముమ్మరంగా ధాన్యం సేకరణ ఆరంభం కానుంది. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అంచనాలకు మించి ధాన్యం మార్కెట్లను ముంచెత్తనుంది. విస్తారంగా కురిసిన వర్షాలు, సాగునీటి ప్రాజెక్టుల కింద పెరిగిన సాగు, చెరువుల కింద పూర్తి స్థాయిలో సాగైన పంటల కారణంగా తొలుత అంచనా వేసిన యాభై అయిదు లక్షల మెట్రిక్ టన్నులకు మించి మరో పది లక్షల మేర ధాన్యం అదనంగా సేకరించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ తాజాగా అంచనా వేసింది. దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఏడెనిమిది జిల్లాల నుంచి గత ఏడాది కన్నా రెట్టింపు ధాన్యం రావచ్చన్న అంచనాలతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. స్టోరేజీపైనా ముందస్తు జాగ్రత్తలు.. పెరుగుతున్న ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా బియ్యం నిల్వలకు అవసరమైన గోదాములను సిద్ధంచేసే అంశంపై పౌర సరఫరాల శాఖ కసరత్తులు ముమ్మరం చేసింది. ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా మార్చిన అనంతరం వాటి నిల్వలకు ఇబ్బంది లేకుండా ఎఫ్సీఐతో చర్చించింది. గత ఏడాది రబీకి సంబంధించిన 11 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ నుంచి తీసుకునేందుకు ఎఫ్సీఐ సుముఖత తెలిపింది. ముఖ్యంగా స్టోరేజీ సమస్య అధికంగా ఉన్న కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, కొత్తగూడెంలలో స్టోరేజీ సమస్యను అధిగమించే చర్యలు చేపట్టింది. -
ఉల్లి బాటలో టమాట..
న్యూఢిల్లీ : ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తుంటే తాజాగా టమాట కూడా మోతెక్కిస్తోంది. కర్ణాటక సహా టమాట దిగుబడులు అధికంగా ఉండే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా బుధవారం దేశ రాజధానిలో కిలో టమాట రూ 80కి ఎగబాకింది. సరఫరాలు తగ్గడంతో గత ఐదు రోజులుగా టమాట ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్ వర్తకులు టమాటాను రూ 60 నుంచి రూ 80 మధ్య విక్రయిస్తుండగా, మదర్డైరీ సఫల్ అవుట్లెట్లలో కిలో రూ 58కి విక్రయిస్తున్నారు. అక్టోబర్ 1న రూ 45 పలికిన కిలో టమాట బుధవారం సగటు రిటైల్ ధర రూ 54కు పెరిగిందని అధికారులు తెలిపారు. వరదలు, భారీ వర్షాలతో పంట దెబ్బతినడం, సరఫరా అవాంతరాలతో టమాట ధరలు మండుతున్నాయని ఆజాద్పూర్ మండిలో హోల్సేల్ ట్రేడర్ చెప్పుకొచ్చారు. ఇతర మెట్రో నగరాలు కోల్కతాలో కిలో టమాట రూ 60 కాగా, ముంబైలో రూ 54, చెన్నైలో రూ 40 వరకూ పలుకుతోంది. -
దిగుబడిపై పత్తి రైతుల గంపెడాశలు
సాక్షి, ఆదిలాబాద్: తెల్ల బంగారమేనా.. పత్తి రైతులు పంటపై గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పంట పూత, కాత దశలో ఉంది. పంట చేతికొచ్చే దశ ఆసన్నమవుతోంది. సాధారణంగా జిల్లాలో దసరా నుంచి పత్తి పంట కొనుగోలు ప్రారంభమవుతుంది. అయితే ఈసారి ఆలస్యంగా అక్టోబర్ చివరి వారంలో పంట కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది పత్తి క్వింటాలుకు స్వల్పంగా వంద రూపాయల మద్దతు ధర పెంచింది. సాధారణం కన్నా మించి విస్తీర్ణం జిల్లాలో ఈయేడాది పత్తి పంట సాధారణ సాగు విస్తీర్ణం కంటే మించింది. పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 4500 ఎకరాల్లో పంట నష్టం సంభవించగా అందులో 90శాతానికి పైగా పత్తి పంటకే నష్టం చేకూరింది. ఈ దశలో ప్రకృతి సహకరిస్తేనే రైతుకు లాభం చేకూరే పరిస్థితి. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడిపై రైతు ఆశలు పెట్టుకున్నాడు. రైతు నుంచి పంట చేజారిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధరను స్వల్పంగా పెంచింది. గతేడాది క్వింటాలుకు రూ.5450 ఉండగా, ఈయేడాది దానికి అదనంగా మరో వంద రూపాయలు పెంచింది. అయితే గతేడాది పత్తి రైతులు పంటను అమ్ముకున్న తర్వాత మార్కెట్లో క్వింటాలు పత్తి ధర గణనీయంగా పెరుగుతూ వస్తూ ఓ దశలో రూ.6050కు చేరుకుంది. అయితే అప్పటికే రైతుల నుంచి పంట చేజారింది. దీంతో అప్పటికే పంటను కొనుగోలు చేసిన ప్రైవేట్ ట్రేడర్సే లాభపడ్డారు. గతేడాది జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ మీనమేషాల నేపథ్యంలో మార్కెట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ సంఘాలతో గ్రామాల్లో కొనుగోళ్లు చేయించారు. చిన్న, సన్నకార రైతులు తమ పంటను ఈ సంఘాలకు అమ్ముకున్నారు. తద్వారా వారికి రవాణ చార్జీలు మిగిలాయి. ఈయేడాది కూడా సీసీఐతో పాటు పీఏసీఎస్, ఐకేపీ సంఘాలు పత్తి పంటను కొనుగోలు చేయనున్నాయి. అయితే ఈ సంఘాలు నామమాత్రంగా కొనుగోలు చేయగలిగాయి. ప్రధానంగా మార్కెట్లో ప్రైవేట్ ట్రేడర్స్ రైతులకు మద్దతు ధర కల్పించడంలో విఫలమైన పక్షంలో సీసీఐ రంగంలో ఉంటుంది. ఒకవేళ మద్దతు ధరను మించి మార్కెట్లో హెచ్చు ధర ఉన్నప్పుడు సీసీఐ పాత్ర నామమాత్రంగా ఉంటుంది. గతేడాది ఎంఎస్పీ కంటే ధర అధికంగా ఉండడంతో సీసీఐ కొనుగోలు అంతంత మాత్రంగా చేపట్టింది. నార్నూర్కు ప్రతిపాదనలు.. జిల్లాలో గతేడాది ఆదిలాబాద్, సొనాల, నేరడి గొండ, బోథ్, పొచ్చర, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బేలలో ఎనిమిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి పంటను కొనుగోలు చేశారు. ఈయేడాది వీటితో పాటు నార్నూర్లో కొను గోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ సీసీఐకి ప్రతిపాదన చేసింది. అయితే ఇది కార్యరూపం దాల్చుతుందా?.. లేదా అనేది వేచి చూడాల్సిందే. నార్నూర్లో జిన్నింగ్ ఫ్యాక్టరీ లేకపోవడం సమస్యకు కారణమైంది. ప్రైవేట్ ట్రేడర్సే అత్యధికంగా కొనుగోలు గతేడాది సీసీఐ, పీఏసీఎస్, ఐకేపీ సంఘాలు పత్తి కొనుగోలు కోసం రంగంలో ఉన్నప్పటికీ ప్రైవేట్ ట్రేడర్సే పంటను అత్యధికంగా కొనుగోలు చేశారు. జిల్లాలో దిగుబడి వచ్చిన పంటలో సీసీఐ నామమాత్రంగా 18.69 శాతం మాత్రమే కొనుగోలు చేసింది. ఇక వ్యాపారులు 80 శాతం వరకు కొనుగోలు చేశారంటే దాదాపు పంట మొత్తం వారే కొనుగోలు చేశారనేది స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో విపణి ధరలను బట్టి పత్తి ధరలో హెచ్చు, తగ్గులు ఉంటాయి. గతేడాది కొనుగోలు సీజన్ చివరిలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో పత్తి మద్దతు ధర కంటే అధిక ధర పలికింది. ఈ నేపథ్యంలోనే రైతులు తెల్లబంగారంపై ఆశలు పెంచుకున్నారు. పత్తి పంట వివరాలు పంట సాగైన విస్తీర్ణం: 1,32,047 హెక్టార్లు దిగుబడి అంచనా: 18,48,658 క్వింటాళ్లు మద్దతు ధర: రూ.5,550 (క్వింటాలుకు) సీసీఐ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు: 9 గతేడాది కొనుగోలు వివరాలు ప్రైవేట్ ట్రేడర్స్: 14,62,011 క్వింటాళ్లు సీసీఐ: 3,36,092 క్వింటాళ్లు పీఏసీఎస్ (11 కేంద్రాలు): 998 క్వింటాళ్లు ఐకేపీ (12 కేంద్రాలు): 2,939 క్వింటాళ్లు అక్టోబర్ చివరిలో కొనుగోలు అక్టోబర్ మూడోవారంలో పత్తి పంట కొనుగోలు ప్రారంభించే అవకాశం ఉంది. సీసీఐ తొమ్మిది కేంద్రాలతో కొనుగోలు కోసం ప్రతిపాదనలు చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ సంఘాలు కూడా గ్రామాల్లో పంటను కొనుగోలు చేస్తాయి. మార్కెట్ యార్డుల్లో ఏర్పాట్లు చేస్తున్నాం. – గజానంద్, జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి, ఆదిలాబాద్ -
కిరోసిన్ ధరల మంట
సాక్షి, జోగిపేట(అందోల్): ప్రజా పంపిణీ కిరోసిన్ లీటరుపై రూ.1 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధర ఈ నెల నుంచే అమలులోకి వస్తుంది. ఈ నెలలో లీటరుకు రూ.34, అక్టోబర్లో రూ.35కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. వీలైనంత వరకు కిరోసిన్ వినియోగాన్ని తగ్గించేలా ప్రభుత్వం తరచూ ఇప్పటికే కట్ చేశారు . ప్రతి నెలా 1.26 లక్షల లీటర్ల కిరోసిన్ సరఫరా చేస్తున్నారు. ధరలు పెంచడంతో ఆహార భద్రత కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు భారం తప్పడం లేదు. 2016లో కిరోసిన్ ధర లీటర్ రూ.19 ఉండగా, 2017లో రూ.24కు చేరింది. 2018లో రూ.29కు పెంచారు. ప్రస్తుత కోటా వచ్చే సరికి ఏకంగా రూ.34లకు చేరింది. ఈ లెక్కన మూడేళ్లలో రాయితీ కిరోసిన్పై లీటరుకు రూ.15 పెంచినట్లయ్యింది. నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై కిరోసిన్ను పంపిణీ చేస్తోంది. ఇటీవల దీని వినియోగం భారీగా తగ్గింది. ప్రస్తుతం కిరోసిన్పై వంట చేసుకునే వారు చేతివేళ్లపై లెక్క పెట్టే సంఖ్యలోనే ఉన్నారు. గ్రామాల్లో స్నానానికి నీళ్లు వేడి చేసుకునేందుకు కొందరు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ గ్యాస్ పొయ్యిలనే వినియోగిస్తున్నారు. గతంలో కార్డుకు 15 లీటర్ల చొప్పున కిరోసిన్ పంపిణీ చేసేవారు. ప్రస్తుతం లీటరుకు వచ్చింది. జిల్లాలో నెలకు 1.26 లక్షల లీటర్ల సరఫరా జిల్లాలో 3.70 లక్షల లీటర్లు కిరోసిన్ పంపిణీ చేసేవారు. గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి కిరోసిన్ కోటాను కట్ చేయాలన్న ఉత్తర్వులు రావడంతో వారిని గుర్తించి తొలగించాం. ప్రస్తుతం ప్రతి నెలా 1.26 లక్షల లీటర్ల కిరోసిన్ను జిల్లాలో పంపిణీ చేస్తాం. సెప్టెంబర్లో రూ. 34కు, అక్టోబర్లో రూ.35కు పెంచి విక్రయించాలని ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయి. గ్యాస్ కనెక్షన్ లేని దీపం కనెక్షన్ ఉన్న 22వేల మందికి కూడా రాయితీ కిరోసిన్ సరఫరా చేస్తాం. – శ్రీకాంత్రెడ్డి,డీఎస్ఓ, సంగారెడ్డి -
కరెంటు కాల్చేస్తున్నారు...
వర్షాకాలం వచ్చేసి అప్పుడే రెండు నెలలవుతోంది. వాతావరణం చల్ల బడి విద్యుత్ వినియోగం తగ్గాలి. కానీ జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. వాతావరణం ఏమాత్రం చల్లబడలేదు. వేసవి పరిస్థితులే కొనసాగుతున్నాయి. దీనివల్ల ఏసీలు... కూలర్లు... వంటివి ఏమాత్రం ఆగట్లేదు. ఫలితంగా విద్యుత్ వినియోగం భారీగానే పెరుగుతోంది. దీనికి తోడు ఆశించిన వర్షాలు లేక వ్యవసాయానికి తప్పనిసరిగా మోటార్లు అధిక సంఖ్యలో వినియోగించడం కూడా మరో కారణం. మొత్తమ్మీద విద్యుత్ను హద్దు... పద్దు లేకుండా వాడకంవల్ల కొరత ఏర్పడే ప్రమాదమూ లేకపోలేదు. విజయనగరం మున్సిపాలిటీ: ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగుతోంది. అరకొర వర్షాలతో వాతావరణం నేటికీ చల్లబడలేదు. ఆగస్టులోనూ వేడిమి వేసవిని తలపిస్తోంది. ఉదయం 10 గంటల నుం చి ఎండతో వేడి గాలులు వీస్తున్నాయి. పగలూ, రాత్రీ తేడా లేకుండా అసాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. తీవ్ర ఉక్కపోత ప్రభావంతో కూలర్లు, ఏసీల వినియోగం నేటికీ తగ్గలేదు. దీనివల్ల విద్యుత్తుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అధికారిక లెక్కల ప్రకారం చెప్పాలంటే రోజుకు జిల్లా వాసులు 72 లక్షల యూనిట్లకుపైగా విద్యుత్ను విని యోగించేస్తున్నారు. ఈ ఏడాది మండు వేసవి లో 63 లక్షల నుంచి 65 లక్షల యూనిట్లు విద్యుత్వినియోగం కాగా... వర్షాకాలంలో తగ్గుముఖం పట్టాల్సిన వినియోగం అందుకు భిన్నంగా మరో 7 లక్షల యూనిట్లకు పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమే. మరో వైపు ఆశించిన వర్షాలు లేక వ్యవసాయ విద్యుత్ సర్వీసుల నుంచి డిమాండ్ పెరగటం వల్లే ఇంత మొత్తంలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలోనూ అసాధారణ ఉష్ణోగ్రతలు.. జిల్లాలో ఏటా జూన్, జూలై నెలల్లో భారీ వర్షాలు కురుస్తుంటాయి. వాతావరణం చల్లబడి గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పడిపోయేవి. ఈ ఏడాది కనిష్ఠంగా 26 డిగ్రీలు, గరిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోవుతోంది. జూలై నెలలో గరిష్టంగా 37 నుంచి 38 డిగ్రీలు కూ డా నమోదవడం విశేషం. ఉక్కపోత వాతావరణంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అం దువల్ల ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. గృహ, వాణిజ్యావసరాల విద్యుత్తు వినియోగం భారీగా నమోదవుతోం ది. వర్షాలు లేక వ్యవసాయ పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. జిల్లాలో ప్రస్తుతం కూరగాయలు, ఉద్యాన పంటలు, కొన్ని ప్రాం తాల్లో నారుమడులు, ఇతర వ్యవసాయ అవసరాలకు కొంతమేర విద్యుత్తు వినియోగిస్తున్నా రు. వ్యవసాయ విద్యుత్తు వాడకం మరో నాలు గు రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మరింత ఒత్తిడి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అనూహ్యంగా పెరిగిన డిమాండ్.. ప్రస్తుతం జిల్లాలో విద్యుత్తు డిమాండ్ అసాధారణంగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 16వ తేదీన 72లక్షల 60వేల యూనిట్ల విద్యుత్ వినియోగించారు. జిల్లాలో ఉన్న 6.30 లక్షల విద్యుత్ సర్వీసులు ఏపీఈపీడీసీఎల్ సంస్థ మాత్రం 60లక్షల 36 వేల యూనిట్లను మాత్రమే రోజు వారీగా కేటాయిస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఉన్న కేటాయింపులకన్నా హెచ్చుగా 12లక్షల 24వేల యూనిట్లను వినియోగించేస్తున్నారన్నమాట. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఆవిర్భావం తరువాత ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగించటం ఈ ఏడాదేనన్న అంచనా వ్యక్తం చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలు, మరల రాత్రి 8 నుంచి 10 గంటల సమయంలో ఎక్కువగా విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వినియోగదారులకు అవసరమయ్యే విద్యుత్ కన్నా ఎక్కువ మొత్తంలో కేటాయింపులు ఉండటంతో ఇబ్బందులు ఉం డవన్న ధీమా అధికారుల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో విద్యుత్ సరఫరాకు సంబంధించి మాచ్ఖండ్, సీలేరు, సింహాచలం, వీటీపీఎస్, కృష్ణపట్నం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ కేటాయింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఆటంకాలు లేవని నిరంతరాయ సరఫరా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. అనధికారిక కోతలు...? విద్యుత్తు అసాధారణ డిమాండ్, వర్షాలు లేకపోవడంతో జిల్లాలో అనధికారిక కోతలు అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. నగరం, జిల్లాలోని పట్టణాల పరిధిలో కొంతమేర నయమే అయినా పల్లె ప్రాంతాల కు విద్యుత్తు సరఫరా చేసే పలు ఉపకేంద్రాల పరిధిలో గంటల తరబడి విద్యుత్తు నిలిపివేస్తున్నారని తెలుస్తోంది. వినియోగం గణనీయంగా పెరిగింది.. జిల్లాలో పొడి వాతావరణం కారణంగా గృహ, వాణిజ్య విద్యుత్తు వినియోగం భారీ గా పెరిగింది. సరఫరాకు ఎలాంటి అంతరాయాలు లేవు. వినియోగం భారీగా నమోదయ్యే ఉపకేంద్రాల సామర్థ్యం పెంచాం. ఎక్కడైనా సరఫరాకు అంతరాయం కలిగి నా వెంటనే పునరుద్ధరిస్తున్నాం. ప్రతి ఒక్క రు కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్లు వాడుతున్నారు. వినియోగదారులు కోరే డిమాండ్ ను ఎదర్కొనగలిగే సామర్ధ్యం ఉంది. అయి తే వినియోగదారులు అవసరం లేని సమయంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి పొదుపు పాటించాలి. –వై.విష్ణు, విద్యుత్ శాఖ ఎస్ఈ, విజయనగరం -
జల్సా దొంగలు
సాక్షి, హైదరాబాద్: వెస్ట్ మారేడ్పల్లిలోని అశ్వినినగర్కు చెందిన గౌడి శివశంకర్ పదో తరగతి మధ్యలోనే మానేశాడు. సంజీవయ్యనగర్కు చెందిన డిగ్రీ విద్యార్థి గుగ్గిలం కార్తీక్ ఇతడి స్నేహితుడు. వీరిద్దరూ తరచూ మారేడ్పల్లి ప్రాంతంలో కలుసుకుంటూ మద్యం తాగేవాళ్లు. ఓ రోజు నిషా తలకెక్కడంతో అర్ధరాత్రి వేళ వాకింగ్కు వెళ్లి కనిపించిన వారిపై దాడి చేసి సెల్ఫోన్లు దోచుకుంటూ పోలీసులకు చిక్కారు. కొత్తపేట నివాసి ఎం.అరుణ్కుమార్ సికింద్రాబాద్లోని ఓ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో డిగ్రీ విద్యార్థి. అతడి స్నేహితుడు అభిల్ మరో విద్యాసంస్థలో ఇంటర్ చదువుతున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి మౌలాలీలో ఉంటున్న మనీష్ ఉపాధ్యాయ, తుకారాంగేట్కు చెందిన టమాటో సంజయ్సింగ్ ఇంకో విద్యాసంస్థలో ఇంటర్ స్టూడెంట్స్. ఈ నలుగురూ గంజాయి తాగేందుకు నేరాలు చేస్తూ టాస్క్ఫోర్స్కు చిక్కారు. మంగళ్హట్ ప్రాంతానికి చెందిన సునీల్సింగ్ విద్యార్థి. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. మూడు నెలలుగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తూ బుకీగా మారాడు. సెల్ఫోన్లోనే ఓ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారానే దందా చేస్తూ టాస్క్ఫోర్స్ పోలీసులకు దొరికాడు. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. జల్సాల కోసం నేరాలకు పాల్పడుతున్న యువత, విద్యార్థుల వ్యవహారాలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వీరు చేస్తున్న నేరాల్లో స్నాచింగ్స్, వాహన దొంగతనాలు, చోరీలతో పాటు సైబర్ నేరాలు అధికంగా ఉంటున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. జీవన విధానంలో మార్పులు, సాంకేతిక విప్లవం కారణంగా ఇలాంటి నేరగాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాపర్టీ అఫెన్సులకు పాల్పడి ఏటా పోలీసులకు చిక్కుతున్న వారిలో 70 శాతానికి పైగా కొత్తవారు ఉండడం గమనార్హం. అలా మొదలై... సిటీలో పెరిగిన పార్టీ కల్చర్, అందుబాటులోకి వచ్చిన పబ్స్ తదితరాలు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. విలాసాలకు బానిసలుగా మారుతున్న ఉన్నత విద్యావంతులు, పెద్ద కుటుంబాలకు చెందినవారు కూడా నేరాలు చేయడాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఈ పరిణామం పోలీసులకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా పేరుమోసిన దొంగలు, ముఠాలకు సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరిపై కన్నేసి ఉంచుతారు. అయితే కొత్తగా పుట్టుకొస్తున్న ఈ దొంగల కారణంగా కేసుల దర్యాప్తు కూడా మందకొడిగా సాగి, కొలిక్కితేవడం కష్టసాధ్యంగా మారుతోందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వారు తొలుత చిన్నాచితకా చోరీలతో ప్రారంభించి జైలుకు వెళ్లడం ద్వారా రాటుదేలుతున్నారని, ఆపై నేరాలు చేయడమే వృత్తిగా మార్చుకొని జల్సారాయుళ్లుగా బతికేస్తున్నారని కొన్ని కేస్ స్టడీస్ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. బెరుగ్గా.. భేషుగ్గా ఇలాంటి నేరగాళ్లు తమ బలహీనతలు, వ్యసనాలతో నేరబాట పడుతున్నా తొలినాళ్లలో బెరుగ్గానే చేస్తున్నారు. ఒక నేరం చేసిన తర్వాత ఈజీ మనీకి అలవాటు పడిపోయి పట్టుబడే వరకు వరుసగా నేరాలు చేస్తున్నారు. పోలీసులకు చిక్కి జైలుకు వెళ్తున్నా చట్టాల్లోని లోపాలు, తేలిగ్గా బెయిల్ దొరుకుతున్న విధానం, తీర్పులు వెలువడడంలో జాప్యం తదితర వారు అదే బాటలో కొనసాగేలా పురిగొల్పుతున్నాయి. నివాస ప్రాంతాలు, పేర్లను తరచూ మార్చుకుంటూ భేషుగ్గా నేరాలు కొనసాగిస్తున్నారు. వీరికి సంబంధించిన పూర్తి రికార్డులు సైతం పోలీసుల వద్ద ఉండకపోవడం, మౌలిక వసతుల కొరత నేపథ్యంలో ప్రతినిత్యం నిఘా ఉంచడం కూడా సాధ్యం కాకపోవడం వీరికి కలిసొస్తోంది. ‘ప్రతీకారం’తో సైబర్ నేరాలు ప్రాపర్టీ నేరాలు చేసే వారిలో అత్యధికులు జల్సాల కోసం చేస్తుండగా... సైబర్ నేరాలకు పాల్పడే విద్యాధికుల్లో ఎక్కువ మంది ‘ప్రతీకారం’తోనే ఆ పని చేస్తున్నారు. పాత స్నేహితులు, ప్రేమను నిరాకరించినవారు, మాజీ సంస్థలకు చెందిన ఉన్నతోద్యోగులు తదితరులపై అనేక కారణాల నేపథ్యంలో కక్ష పెంచుకుంటున్న యువకులు, విద్యాధికులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సెల్ఫోన్ నుంచి నెట్ కేఫ్ వరకు ఎక్కడపడితే అక్కడ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో పాటు ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఈ నేరాలు చేసి కటకటాల్లోకి వెళ్తున్నారు. కారణాలు అనేకం... యువతలో ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావడానికి సామాజిక, ఆర్థిక, కుటుంబ పరంగా అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు విశ్లేషిస్తున్నారు. సమాజంలో విలాసాలు అనేవి ఒకప్పుడు ఉన్నత కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాహనం, సెల్ఫోన్లు, పార్టీలు కాలక్రమంలో నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. గ్రామాల నుంచి నగరాలకు వస్తున్నవారు, సిటీలో నివసిస్తున్న మధ్యతరగతి వారు వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒకసారి విలాసాలకు అలవాటుపడి పదేపదే అలాంటి జీవితం కోసం ఈజీమనీ వైపు మొగ్గి నేరాల బాటపడుతున్నారు. నగర యువత కూడా గర్ల్ఫ్రెండ్స్, స్నేహితురాళ్లతో షికార్ల కోసం, వారిని మెప్పించేలా ఖర్చులు చేయడం కోసం నేరగాళ్లుగా మారుతున్నారు. అజమాయిషీ లేకపోవడంతో.. నగరంలో ఒంటరి జీవులు పెరిగిపోతున్నారు. చదువులు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి నగరాలకు అనేక మంది వలస వస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి పెరిగింది. ఇలా వస్తున్న యువత తల్లిదండ్రులు, కుటుంబాలకు దూరంగా సహోద్యోగులు, మిత్రులతో కలిసో, ఒంటరిగానో జీవిస్తున్నారు. దీంతో ఏం చేసినా పట్టించుకునేవారు లేకుండాపోతున్నారు. నగరంలోనూ మారిన జీవన విధానం, చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రుల అజమాయిషీ తక్కువగా ఉంటోంది. వీరి బాగోగులు పట్టించుకోవడం, కదలికల్ని కనిపెట్టడంలో వారు విఫలం కావడంతో పెడదారి పడుతున్న యువకుల సంఖ్య ఎక్కువ అవుతోందన్నది పోలీసుల మాట. -
సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!
ముంబై: చెన్నై నగరం ఎదుర్కొంటున్న దారుణమైన నీటి ఎద్దడిని చూస్తూనే ఉన్నాం. వందల కిలోమీటర్ల దూరం నుంచి రైలు ట్యాంకర్ల ద్వారా నీరు చెన్నై నగరానికి చేరవేయాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. వేసవిలో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల పరిస్థితి ఇలానే ఉంది. వర్షపు నీటిని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని నిపుణులు, పర్యావరణ ప్రేమికులు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. ఈ పరిస్థితులు దేశంలో భారీ పెట్టుబడులకు దారితీయనున్నట్లు అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనా వేసింది. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టబోయే పలు నీటి ప్రాజెక్టుల రూపేణా వచ్చే 15 ఏళ్లలో ఏకంగా 270 బిలియన్ డాలర్ల మేర (రూ.18.9 లక్షల కోట్లు) పెట్టుబడులు రానున్నాయి. వివాదాస్పద నదుల అనుసంధాన ప్రాజెక్టు రూపంలోనే 168 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే పదిహేనేళ్లలో వస్తాయి. ఇక ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నీరు అందించే ప్రాజెక్టు కోసం 94 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయి’’ అని ఈ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ‘‘ఈ తరహా ప్రాజెక్టుల కోసం అవసరమైనన్ని నిధులను సమకూర్చుకోవడం ప్రభుత్వానికి చాలా కష్టం. అందుకని ప్రైవేటు రంగమూ పాల్గొనేలా తగిన నమూనాలు రూపొందించడం అవసరం’’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ భారత విభాగ అధిపతి అమిష్షా పేర్కొన్నారు. వ్యవసాయంలో నీటి పొదుపు అవసరం... సాగు రంగంలో నీటి వినియోగాన్ని తగ్గించే విధానాలపై గట్టిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని షా సూచించారు. మన దేశంలో ఒక కిలో బియ్యం పండించేందుకు 5,600 లీటర్ల నీటిని వినియోగిస్తుంటే, చైనాలో వినియోగం కేవలం 300 లీటర్లు ఉన్నట్టు తెలిపారు. ‘‘తాజా జలంలో 89 శాతాన్ని వ్యవసాయ రంగమే వాడేస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు లేదా సబ్సిడీతో కూడిన విద్యుత్ అధిక వాడకానికి, భూగర్భ జల వాడకానికి దారితీస్తున్నదో లేదో అనే విషయమై మనం తప్పక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’’ అని సూచించారు. గత ఐదేళ్లలోనే నీటి సంబంధిత సదుపాయాల కోసం పెట్టుబడులు ఏటేటా 15 శాతం పెరిగాయని, గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 21 బిలియన్ డాలర్లకు చేరాయని షా తెలిపారు. ఈ మొత్తాన్ని కూడా రాష్ట్రాలే ఇన్వెస్ట్ చేశాయని, జలం అన్నది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని చెప్పారాయన. ‘‘క్లీన్ గంగా ప్రాజెక్టు కోసం కేంద్రం సైతం కొంత పెట్టుబడులు పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనూ 2.5 బిలియన్ డాలర్లను కేటాయించారు. క్లీన్గంగా ప్రాజెక్టుపై గత మూడేళ్లలో 1.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. వచ్చే ఐదేళ్లలో 3 బిలియన్ డాలర్లను అదనంగా ఇన్వెస్ట్ చేయనున్నారు. నదుల అనుసంధానానికి సంబంధించి రెండు భారీ ప్రాజెక్టుల అంచనాలు (ఏపీలో పోలవరం, యూపీలో కెంట్–బెటావా ప్రాజెక్టు) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఆధారంగా చేసినవి’’ అని షా వివరించారు. మంత్రి నితిన్ గడ్కరీ గతంలో పేర్కొన్న గోదావరి– కృష్ణా– కావేరి అనుసంధాన ప్రాజెక్టు కేంద్రం చేపట్టబోయే తదుపరి ప్రాజెక్టుగా పేర్కొన్నారు. తెలంగాణ సర్కారు సైతం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై భారీగా వెచ్చిస్తున్న విషయం తెలిసిందే. -
పెన్షన్ల సొమ్ము 3 రెట్లు పెంపు
‘‘సమాజంలో ప్రతి కుటుంబం, ప్రతి ఊరు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం మనది. నవరత్నాల్లోని ప్రతి పథకం నిరుపేద కుటుంబాలకు మేలు చేసేదే. త్వరలోప్రారంభం కానున్న గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థతో ప్రతి రైతు కుటుంబానికి, ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చే దిశగా తొలి అడుగులు పడబోతున్నాయి’’ ‘‘ప్రభుత్వ పథకాలను ప్రజల ఇళ్లకు డోర్ డెలివరీ చేసే విషయంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతాలు చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం. చివరకు వారు ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా పట్టించుకోం. గతంలో మాకు ఓటు వేయని వారు కూడా మా పాలన చూసి ఎన్నికల్లో మాకు ఓటు వేసేలా సుపరిపాలన అందిస్తాం’’ సాక్షి ప్రతినిధి కడప: చంద్రబాబు ప్రభుత్వం గత ఐదేళ్లలో పెన్షన్ల కోసం ఇచ్చిన సగటు సొమ్ము కంటే తాము మూడింతలు అధికంగా వ్యయం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ‘రైతు దినోత్సవం’ సభలో జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురికి పెన్షన్లు ఇచ్చారు. పెన్షన్ల పెంపు, గ్రామ వలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల ఏర్పాటు వంటి పథకాలను తమ ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. రైతు దినోత్సవంలో జగన్మోహన్రెడ్డి ఇంకా ఏం చెప్పారంటే... మీ బిడ్డ, ఈ జిల్లా ముద్దుబిడ్డ అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కడప గడప నుంచే నవరత్నాలకు శ్రీకారం చుడుతున్నాం. నవరత్నాల్లో మొదటి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. నాలుగు నెలల క్రితం వరకు రూ.1,000 మాత్రమే ఉన్న పెన్షన్ను రూ.2,250కి పెంచాం. దివ్యాంగులకు రూ.3,000 పెన్షన్, డయాలసిస్(రక్తశుద్ధి) చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు రూ.10,000 పెన్షన్ ఇస్తున్నాం. పెండింగ్లో ఉన్న అక్షరాలా 5.40 లక్షల పెన్షన్లను ఈ నెలలోనే మళ్లీ మంజూరు చేస్తున్నాం. ఇంకా పెన్షన్లు అందకుండా మిగిలిపోయిన అవ్వాతాతలు ఉంటే గ్రామ వలంటీర్ల ద్వారా, గ్రామ సచివాలయాల ద్వారా వారికి సంతృప్తికర స్థాయిలో మంచి చేయడానికి అడుగులు ముందుకేస్తాం. పెన్షన్ల కోసం చంద్రబాబు సర్కారు ఇచ్చిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. వలంటీర్ తప్పు చేస్తే తొలగింపే 2,000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ను(సచివాలయం) ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్ను నియమిస్తున్నాం. ఆ వలంటీర్ తన పరిధిలోని ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేస్తాడు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచే ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ గ్రామ వలంటీర్లు లంచాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదనే వారికి నెలనెలా రూ.5,000 చొప్పున వేతనం ఇస్తున్నాం. ఏ గ్రామ వలంటీరైనా లంచాలు తీసుకున్నాడని, అన్ని అర్హతలు ఉన్న కూడా పింఛన్లు మంజూరు చేయలేదని భావిస్తే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం ఒక టెలిఫోన్ నెంబర్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. తప్పు చేసిన సదరు వలంటీర్ను విధుల నుంచి తొలగిస్తాం. జమ్మలమడుగులో రైతు దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్రెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వెంకటసుబ్బయ్య, మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు డీసీ గోవింద్రెడ్డి, కత్తి నరసింహారెడ్డి, సీఎం కార్యక్రమాల నిర్వహణ ఓఎస్డీ తలశిల రఘురాం, వైఎస్సార్సీపీ కడప, రాజంపేట పార్లమెంట్ అ«ధ్యక్షులు సురేష్బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, కలెక్టర్ హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లు కావాలంటే లంచాలు ఇవ్వక్కర్లేదు కడప జిల్లాకు నాలుగు నెలల క్రితం వరకు పెన్షన్ల కింద కేవలం రూ.32 కోట్లు ఇచ్చేవారు. ఇదే కడప జిల్లాకు ఇవాళ నెలకు పెన్షన్ల కింద అక్షరాలా రూ.73 కోట్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడి హయాంలో 2014–15లో అవ్వాతాతల పెన్షన్ల కోసం కేవలం రూ.3,378 కోట్లు ఖర్చు చేశారు. పెన్షన్ల కోసం చంద్రబాబు సర్కారు 2015–16లో రూ.5,221 కోట్లు, 2016–17లో రూ.5,270 కోట్లు, 2017–18లో రూ.5,436 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. 2018–19లో ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు డ్రామాలు ఆడుతూ పెన్షన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్ము రూ.8,234 కోట్లు మాత్రమే. మన ప్రభుత్వంలో పెన్షన్దారుల కోసం ఈ సంవత్సరం రూ.15,675 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇకపై గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాలు ఉండవు. పెన్షన్లు మంజూరు కావాలంటే లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కొట్టి, మీ పెన్షన్ను మీ చేతుల్లోనే పెట్టే రోజులు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచే మొదలవుతాయి. గండి ఆంజనేయునికి వస్త్రాల సమర్పణ చక్రాయపేట : వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలంలోని మారెళ్ల మడకలోని గండిక్షేత్రంలోని ఆంజనేయస్వామిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారి గురుప్రసాద్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు కేసరిస్వామి, ముఖ్య అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రి చేత ఆలయ అర్చకులు స్వామి వారికి విశేష పూజలు చేయించారు. అనంతరం ఆయనను ఆర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు గండిలో రూ.3.5 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆలయ పరిధిలో దక్షిణ రాజగోపుర నిర్మాణం, దక్షిణ ప్రాకార నిర్మాణం, డార్మెటరీతో పాటు ఆలయ పరిధిలో మరిన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. పులివెందులలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో తలపెట్టిన అరటి పరిశోధనా కేంద్రానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. బాగున్నావా పెద్దాయనా! మాజీ ఎమ్మెల్యే కలిచెర్లకు సీఎం ఆత్మీయ పలకరింపు సాక్షి ప్రతినిధి, కడప : హోదాలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా పెద్దలపట్ల ఆయనకున్న గౌరవం, ఆయన పలకరింపులోని ఆత్మీయత అక్కడున్న వారికెంతో ఊరటనిచ్చాయి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెకు చెందిన మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్రెడ్డి వయసు రీత్యా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవాలని ఆయన కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడికి విచ్చేసిన వైఎస్ జగన్.. వీల్చైర్లో కదలలేని స్థితిలో ఉన్న ప్రభాకర్రెడ్డి వద్దకు వెళ్లి ‘బాగున్నావా పెద్దాయనా’ అంటూ మనువడిలా ఆత్మీయంగా పలకరించారు. ఆయన ఏదో చెప్పబోతుండగా.. తానే తలవంచి ఆయన చెప్పింది సావధానంగా విని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
ఏప్రిల్లో భారీగా పెరిగిన పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: దేశంలోకి పసిడి దిగుమతులు ఏప్రిల్లో భారీగా పెరిగాయి. 2018 ఏప్రిల్ దిగుమతుల పరిమాణం 2.58 బిలియన్ డాలర్లతో పోల్చితే 2019 ఏప్రిల్లో 54 శాతం వృద్ధితో 3.97 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. అయితే ఈ పరిణామం కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి ఒక నిర్ధిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకం మధ్య ఉండే నికర వ్యత్యాసం)పై ప్రభావం చూపడం గమనార్హం. ఏప్రిల్లో క్యాడ్ విలువ 15.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది ఐదు నెలల గరిష్టస్థాయి. 2018–19 మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో పోల్చితే కరెంట్ అకౌంట్ లోటు 2.5 శాతంగా ఉంది. 2017–18 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ లోటు 2.1 శాతమే కావడం గమనార్హం. భారత్ వార్షికంగా దాదాపు 800 నుంచి 900 టన్నుల విలువైన పసిడిని దిగుమతి చేసుకుంటోంది. -
ఎన్ఎస్ఈలో అక్షయ తృతీయ స్పెషల్ ట్రేడింగ్
అక్షయ తృతీయ సందర్భంగా ఈనెల 7న (మంగళవారం) కాపిటల్ మార్కెట్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించినట్లు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) ప్రకటించింది. ఈ విభాగంలోని గోల్డ్ ఈటీఎఫ్లు (ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్), ప్రభుత్వ గోల్డ్ బాండ్ల ప్రత్యక్ష ట్రేడింగ్ సమయాన్ని పెంచినట్లు వివరించింది. మార్కెట్ సాధారణ ట్రేడింగ్ మార్కెట్ సమయం ఎప్పటిలానే ఉండనుండగా.. గోల్డ్ ఈటీఎఫ్లకు మాత్రం క్లోజింగ్ సెషన్ రోజువారీలా ఉండదని తెలిపింది. వీటి ప్రీ–ఓపెన్ సమయం 4 గంటల 25 నిమిషాల నుంచి 4:30 వరకు కొనసాగనుండగా.. ఈ సమయంలో ఆర్డర్లు రద్దు చేసుకోవడానికి, క్యారీ ఫార్వార్డ్ చేయడానికి అవకాశం ఉన్నట్లు ఎన్ఎస్ఈ స్పష్టంచేసింది. ప్రీ–ఓపెన్ తరువాత 4:30 నిమిషాలకు ట్రేడింగ్ మొదలై ఏడు గంటలకు ముగుస్తుంది. -
పశుసంపద పైపైకి
ఆత్మకూరు(పరకాల): జిల్లాలో పశుగణన పూర్తయ్యింది. 2012 సంవత్సరంలో జరిగిన గణనతో పోలిస్తే ఈసారి పశువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేసీఆర్ గొర్రెల పథకంతో 12,832 మందికి 21 గొర్రెల చొప్పున పంపిణీ చేశారు. దీంతో గొర్రెల సంఖ్య పెరిగింది. అలాగే మిగతా జాతి పశువులు, కోళ్ల సంఖ్య కూడా పెరిగింది. జిల్లాలో ఆవులు, ఎద్దులు 1,13,431, గేదెలు, దున్నపోతులు 1,42,582, గొర్రెలు 7,92,050, మేకలు 1,22,208, పందులు 8,826, కుక్కలు 2,464, కుందేళ్లు 32, కోళ్లు 20,58,459, బాతులు 1,418 ఉన్నాయి. కేసీఆర్ స్కీమ్తో.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పథకంతో లబ్ధిదారులకు గొర్రెలు అందాయి. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను తీసుకొచ్చి లబ్ధిదారులకు అందచేశారు. ఒక్కో లబ్ధిదారుడికి 21గొర్రెల చొప్పున అందజేశారు. ఫలితంగా గొల్లకురుమలు ఉపాధి పొందడంతో పాటు ఆదాయం కూడా సమకూర్చుకుంటున్నారు. ప్రోత్సాహకాలతో.. ప్రభుత్వం పాడిపరిశ్రమలో వివిధ ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. దీంతో రైతులు పశువుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. డెయిరీలకు కూడా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఉత్సాహవంతులు డెయిరీలు ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నారు. స్త్రీనిధి రుణాలతో.. మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి రుణాలు రూ.50వేల నుంచి లక్ష వరకు రుణాలు ఇస్తున్నారు. స్వయం ఉపాధిలో భాగంగా మహిళలు గేదెలు కొనుగోలు చేసి పాలను స్థానిక డెయిరీలకు సరఫరా చేస్తున్నారు. రోజువారీ ఆదాయంతో పాటు పాడి పరిశ్రమ వృద్ధి చెందుతోంది. పశుపోషణ వైపు యువత చూపు.. నిరుద్యోగ యువత పశుపోషణ వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ఇంటిదగ్గరే ఉండి స్వయం ఉపాధి పొందేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ద్వారా కోళ్ల పెంపకం, పశుపెంపకం తదితర పాడి పరిశ్రమపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో యువత ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఫలితంగా కోళ్ల ఫారాలను నెలకొల్పి కోళ్లను పెంచి ఉపాధి పొందుతున్నారు. -
చిన్న వ్యాపారులకు భారీ ఊరట
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులకు ఊరట కల్పిస్తూ జీఎస్టీ కౌన్సిల్ గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు రూ.20 లక్షల వరకు వార్షిక వ్యాపారంపై జీఎస్టీ మినహాయింపు ఉండగా... దీన్ని రెట్టింపు చేస్తూ రూ.40 లక్షలకు పెంచింది. దీనికితోడు ఒక శాతం పన్ను చెల్లించే కాంపోజిషన్ స్కీమ్ టర్నోవర్ పరిమితిని రూ.1.5 కోట్లు చేయాలని గతంలోనే నిర్ణయించగా... ఇది వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కౌన్సిల్ ప్రకటించింది. భారీ వరదలతో దెబ్బతిన్న కారణంగా... పునర్నిర్మాణ కార్యక్రమాలకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అంతర్రాష్ట్ర రవాణాపై రెండేళ్ల పాటు ఒక శాతం విపత్తు సెస్సును విధించుకునే అవకాశాన్ని కేరళ రాష్ట్రానికి కౌన్సిల్ కల్పించింది. ఈ మేరకు గురువారం జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం వార్షికంగా రూ.20 లక్షల టర్నోవర్ లోపు ఉంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఉందని, దీన్ని రూ.40 లక్షలకు పెంచామని చెప్పారు. పర్వత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉండగా, ఇకపై రూ.20లక్షలు అవుతుందన్నారు. జీఎస్టీ మినహాయింపును రెట్టింపు చేయడం వల్ల... అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే రూ.5,200 కోట్ల మేర పన్ను రాబడి తగ్గుతుందని అంచనా. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఎంఎస్ఎంఈలు, ట్రేడర్లు, సేవల రంగానికి మేలు చేస్తాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. సులభమైన ప్రజా అనుకూల జీఎస్టీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కాంపోజిషన్ స్కీమ్ మినహాయింపులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి వరకు టర్నోవర్ ఉన్న వారు... కాంపోజిషన్ స్కీమ్ కింద టర్నోవర్పై ఒక శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈ పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచుతూ కౌన్సిల్ నవంబర్ నాటి సమావేశంలోనే నిర్ణయం తీసుకుంది. దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడర్లు, వస్తు, సేవల సరఫరా దారులు రూ.50 లక్షల్లోపు టర్నోవర్ ఉంటే, కాంపోజిషన్ స్కీమ్ కింద 6 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. కాంపోజిషన్ స్కీమ్లో టర్నోవర్ పరిమితి పెంచటం వల్ల రూ.3,000 కోట్ల మేర ఆదాయం తగ్గొచ్చని అంచనా. ఈ నిర్ణయాలు, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు (ఎంఎస్ఎంఈ) ఉపశమనం కల్పిస్తాయని జైట్లీ అభిప్రాయపడ్డారు. కాంపోజిషన్ స్కీమ్ను ఎంచుకునే వ్యాపారులు వార్షికంగా ఒకేసారి ట్యాక్స్ రిటర్ను వేస్తే సరిపోతుందని, పన్ను మాత్రం త్రైమాసికానికి ఓ సారి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారాయన. ‘‘జీఎస్టీలో ఎక్కువ భాగం వ్యవస్థీకృత రంగం, పెద్ద కంపెనీల నుంచే వస్తోంది. ఈ నిర్ణయాలు ఎంఎస్ఎంఈలకు మేలు చేస్తాయి. వారికి పలు ఆప్షన్లు ఇచ్చాం. సేవల రంగంలో ఉంటే, 6 శాతం కాంపౌండింగ్ పొందొచ్చు. తయారీ రంగంలో ఉంటే రూ.1.5 కోట్ల టర్నోవర్పై ఒక శాతం కాంపౌండింగ్ ఎంచుకోవచ్చు. వీరు రూ.40 లక్షల వార్షిక టర్నోవర్ వరకు పన్ను మినహాయింపును కూడా పొందొచ్చు. సరుకుల సరఫరాదారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్, చెల్లింపు విషయంలో రూ.40 లక్షలు, రూ.20 లక్షల పరిమితులు ఉన్నాయి. పరిమితి పెంచుకునేందుకు, తగ్గించుకునేందుకు వారికి అవకాశం ఉంటుంది’’ అని అరుణ్ జైట్లీ వివరించారు. ఇతర నిర్ణయాలు... ⇒ రియల్ ఎస్టేట్పై జీఎస్టీ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో ఏడుగురు సభ్యుల మంత్రివర్గ గ్రూపును ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ⇒ లాటరీలపైనా ఇదే పరిస్థితి నెలకొనడంతో దీన్నీ మంత్రివర్గ బృందమే తేల్చనుంది. ⇒ ప్రస్తుతం రూ.20 లక్షల్లోపు టర్నోవర్కు పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ... 10.93 లక్షల మంది పన్నులు చెల్లిస్తున్నారని కేంద్ర రెవెన్యూ సెక్రటరీ అజయ్భూషణ్ పాండే తెలిపారు. రూ.40 లక్షల టర్నోవర్ వరకు మినహాయింపు అనేది సరుకుల వర్తకానికి, ఒకే రాష్ట్రం పరిధిలో వాణిజ్యానికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య లావాదేవీలకు ఇది వర్తించదన్నారు. ⇒ జీఎస్టీ కింద 1.7 కోట్ల వ్యాపారులు నమోదు చేసుకోగా, వీరిలో 18 లక్షల మంది కాంపోజిషన్ స్కీమ్ను ఎంచుకున్నారు. వీరు మూన్నెళ్లకోసారి పన్ను చెల్లించాలి. మిగిలిన వారు ప్రతీ నెలా పన్ను చెల్లించాలి. పైగా కాంపోజిషన్ స్కీమ్లో వ్యాపారులు రికార్డులను నిర్వహించాల్సిన అవసరం ఉండదు. లక్షలాది వర్తకులకు మేలు: పరిశ్రమ వర్గాల హర్షం న్యూఢిల్లీ: రూ.40 లక్షల టర్నోవర్ కలిగిన వ్యాపారులకూ జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల దేశ పారిశ్రామిక రంగం హర్షం వ్యక్తం చేసింది. ఇది లక్షలాది వ్యాపారులకు మేలు చేస్తుందని, వ్యాపార సులభత్వాన్ని పెంచుతుందని పేర్కొంది. ‘‘జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం ఉత్పత్తుల వ్యయాన్ని తగ్గిస్తుంది. ఎంఎస్ఎంఈల పోటీతత్వాన్ని పెంచుతుంది’’ అని సీఐఐ పేర్కొంది. కాంపోజిషన్ స్కీములో మూడు నెలలకోసారి పన్ను చెల్లింపు, ఏడాదికోసారి రిటర్నుల దాఖలు అన్నది పన్నుల విధానాన్ని మరింత సులభంగా మార్చేస్తుందని, ఎంఎస్ఎంఈ రంగంపై నిబంధనల అమలు భారాన్ని తగ్గిస్తుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. లక్షలాది చిన్న, మధ్య స్థాయి వర్తకులకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని అసోచామ్ పేర్కొంది.జీఎస్టీ మినహాయింపు రూ.40 లక్షలు చేయడం వల్ల, నమోదిత పన్ను చెల్లింపుదారుల సంఖ్య 50–60% మేర తగ్గుతుందని, వారికి నిబంధనల అమలు భారం తొలగిపోతుందని కేపీఎంజీ పార్ట్నర్ సచిన్ మీనన్ అభిప్రాయపడ్డారు. -
భారీ వర్షాలతో ఏపీలో పోంగుతున్న వాగులు, నదులు
-
నాగర్జునసాగర్కు పెరుగుతున్న వరద ఉధృతి
-
పెరిగిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఆదాయం జూలై నెలలో తిరిగి గాడిన పడింది. పన్ను వసూళ్లు అంతకుముందు నెలలో ఉన్న రూ.95,610 కోట్ల నుంచి రూ.96,483 కోట్లకు పెరిగాయి. ఈ వే బిల్లు అమలు చేశాక నిబంధనల అమలు పెరగడం సానుకూల ఫలితాన్నిచ్చింది. జూలైలో 66 లక్షల వ్యాపార సంస్థలు రిటర్నులు దాఖలు చేశాయి. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత జీఎస్టీఆర్–3బీ రిటర్నులు ఈ స్థాయిలో దాఖలవడం ఇదే ప్రథమం. పన్ను వసూళ్లు అంచనాలకు అనుగుణంగానే ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రూ.1.03 లక్షల కోట్లుగా ఉంటే, మే నెలలో రూ.94,016 కోట్లుగా నమోదయ్యాయి. జూన్లో రూ.95,610 కోట్లుగా ఉన్నాయి. పన్ను ఎగవేతలను నివారించేందుకు తీసుకొచ్చిన ఈ–వే బిల్లు కారణంగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయని, అయితే బడ్జెట్ అంచనా సగటు నెలవారీ వసూళ్ల కంటే తక్కువే ఉన్నట్టు ‘ట్యాక్స్మన్’ సంస్థ డీజీఎం విషాల్ పేర్కొన్నారు. -
అర్ధరాత్రి సూరీడొచ్చెనమ్మా!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: వేసవి కాలం ముగింపుకొచ్చేసింది... రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... అనుకున్న ప్రజల ఆశలపై సూరీడు నిప్పులు కురిపిస్తున్నాడు! ఎండలు తగ్గినట్టే తగ్గి గత నాలుగు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. వడగాలులు భయపెడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణంగా వేసవికాలంలో రాత్రిపూట (కనిష్ట) ఉష్ణోగ్రత 22 డిగ్రీల నుంచి 25 డిగ్రీల వరకూ ఉంటే కాస్త అహ్లాదంగా ఉంటుంది. కానీ ఇప్పుడది కాస్త 30 డిగ్రీలకు తగ్గట్లేదు. అంతేగాకుండా ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా మంగళవారం పగటిపూట (గరిష్ట) ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే నమోదైంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రానురాను ప్రమాదకరంగా మారుతున్నాయి. జిల్లాలో ఏదొక చోట అడపాదడపా వర్షాలు పడుతున్నా అనూహ్యమైన వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వాటికితోడు పిడుగులు హడలెత్తిస్తున్నాయి! ఇటీవల కాలంలో ప్రాణనష్టం కూడా చోటుచేసుకుంటోంది. ఇక గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం కేవలం పది డిగ్రీలకు తగ్గిపోవడం పర్యావరణంలో ప్రమాదకర సంకేతాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్లే అర్ధరాత్రి కూడా వేడిగాలులు, ఉక్కపోత తగ్గట్లేదు. దీంతో ప్రజలకు వడదెబ్బతో నిస్సత్తువ, చిరాకుతో నిద్రలేమి సమస్యలు తప్పట్లేదు. పెరిగిన ఉష్ణోగ్రతలతో బెంబేలు... రాజాం, కొత్తూరు ప్రాంతంలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. సోమవారం రాత్రి నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత కూడా కొత్తూరు మినహా జిల్లాలో మిగతా అన్నిచోట్ల 30 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఈ పరిస్థితి వల్ల తలెత్తే వడగాల్పులు, పొడి వాతావరణం వల్ల వడదెబ్బ ప్రమాదం పొంచి ఉంటుంది. ఈనెల 23వ తేదీ వరకూ ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టరు జగన్నాథం తెలిపారు. 24వ తేదీ నుంచి చిరుజల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు. -
8 శాతం పెరిగిన ప్యాసింజర్ వాహన విక్రయాలు!
న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో ఫిబ్రవరి నెలలో 7.77 శాతం వృద్ధి నమోదయ్యింది. యుటిలిటీ వాహనాల బలమైన డిమాండ్ దీనికి ప్రధాన కారణం. సియామ్ గణాంకాల ప్రకారం.. ♦ దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 2,55,470 యూనిట్ల నుంచి 2,75,329 యూనిట్లకు పెరిగాయి. అలాగే దేశీ కార్ల అమ్మకాలు 3.7 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,72,737 యూనిట్ల నుంచి 1,79,122 యూనిట్లకు ఎగశాయి. ఇక యుటిలిటీ వాహన అమ్మకాలు 21.82 శాతం వృద్ధితో 65,877 యూనిట్ల నుంచి 80,254 యూనిట్లకు పెరిగాయి. ♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య కాలంలో పీవీ విక్రయాలు 8.04 శాతం, వాణిజ్య వాహన అమ్మకాలు 19.3 శాతం, త్రీవీలర్స్ విక్రయాలు 19.11 శాతం, టూవీలర్స్ అమ్మకాలు 14.47 శాతం ఎగశాయి. ♦ మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా దేశీ ప్యాసింజర్ అమ్మకాలు 13.31 శాతం వృద్ధితో 1,36,648 యూనిట్లకు చేరాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 5.15 శాతం వృద్ధితో 44,505 యూనిట్లకు పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 8.43 శాతం వృద్ధితో 22,339 యూనిట్లకు, టాటా మోటార్స్ పీవీ అమ్మకాలు 43.45 శాతం వృద్ధితో 20,022 యూనిట్లకు ఎగశాయి. ♦ మొత్తం టూవీలర్ విక్రయాలు 23.77 శాతం వృద్ధి చెందాయి. ఇవి 13,62,043 యూనిట్ల నుంచి 16,85,814 యూనిట్లకు చేరాయి. ♦ మోటార్సైకిల్ అమ్మకాలు 26.48 శాతం పెరిగాయి. ఇవి 10,53,230 యూనిట్లుగా నమోదయ్యాయి. మార్కెట్ లీడర్ హీరో మోటొకార్ప్ దేశీ మోటార్ సైకిల్ విక్రయాలు 18.8 శాతం వృద్ధితో 5,35,232 యూనిట్లకు ఎగశాయి. ♦ స్కూటర్ విభాగానికి వస్తే.. మార్కెట్ లీడర్ హోండా స్కూటర్ అండ్ మోటార్సైకిల్ ఇండియా దేశీ విక్రయాలు 30.1 శాతం వృద్ధి చెందాయి. ఇవి 3,25,204 యూనిట్లుగా నమోదయ్యాయి. ♦ వాణిజ్య వాహన అమ్మకాలు 31.13 శాతం వృద్ధితో 87,777 యూనిట్లకు ఎగశాయి. ‘ప్యాసింజర్ వెహికల్స్, టూవీలర్స్ సహా అన్ని విభాగాల్లోనూ విక్రయాలు పెరుగుతున్నాయి. అయితే కేవలం హెవీ బస్సుల విభాగం దీనికి మినహాయింపు. దీని గురించే మేం ఆందోళన చెందుతున్నాం’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ వినోద్ మాథూర్ తెలిపారు. టూవీలర్ విభాగంలో మోటార్సైకిల్స్ కేటగిరీ మంచి పనితీరు కనబరుస్తోందని సియామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగతో సేన్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి విక్రయాలు తొలిసారి 2 కోట్ల యూనిట్లను అధిగమించొచ్చని అంచనా వేశారు. -
తిరుమలలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
-
బరువెక్కిన ఎరువు
గోపాల్పేట: ఎరువు మరింత బరువెక్కింది. యాసంగి సాగు వేళ రైతులకు మరింత భారంపడింది. ఎరువులు, పురుగు మందుల ధరలు ఏటా పెరుగుతుండడంతో పెట్టుబడి అధికమవుతోంది. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1నుంచి కంపెనీలు అమల్లోకి తీసుకురానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకు పెరగడంతో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచినట్లు ఆయా కంపెనీలు చెబుతున్నాయి. జిల్లాలో సుమారు 1,19,700 మంది రైతులు ఉన్నారు. పెరిగిన ఎరువుల ధరలతో రబీలో రైతులపై రూ.2.50కోట్ల అదనపు భారం పడనుంది. ఒక్కోరైతుపై రూ.వెయ్యి నుంచి రూ.ఐదువేల మేర భారం పడుతుందని అంచనా.. పెరిగిన ధరలు ఇలా డీఏపీ బస్తా పాత ధర రూ.1081ఉండగా కొత్తధర రూ.1215కి చేరింది. కాంప్లెక్స్ ఎరువులైన 14–35–14 పాత ధర రూ.1122ఉండగా కొత్తధర రూ.1240కి చేరింది. 20–20–0–13 పాత ధర రూ.873ఉండగా కొత్త ధర రూ.930కి చేరింది. 10–26–26 పాతధర రూ.1044 ఉండగా, కొత్తధర రూ.1150కి చేరింది. 28–28–0 పాత ధర రూ.1122 ఉండగా కొత్త ధర రూ.1240కి చేరింది. 16–20–0–13 పాత ధర రూ.821 ఉండగా కొత్త ధర రూ.880కు చేరింది. డీఏపీ(5 శాతం జింక్)పాత ధర 1107 ఉండగా కొత్త ధర రూ.1240కి చేరింది. 20–20–0–13 పాత ధర రూ.925 ఉండగా కొత్తధర 980కి చేరింది. యాసంగిలో ఇప్పటికే రైతులు ఎరువులను కొనుగోలు చేసి పంటలకు వేశారు. మళ్లీ ఇప్పుడు కొనుగోలుచేసే రైతులపై పెరిగిన భారం పడనుంది. కంపెనీలు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి ప్రకటించలేదు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు కోరుతున్నారు. ఎరువు ధరలు తగించాలి రోజు రోజుకు వ్యవసాయం సాగుఖర్చులు పెరిగిపోతున్నాయి. కూలీల కొరత, పెరుగుతున్న ఎరువులు, విత్తనాల ధరలు రైతులకు భారంగా మారింది. ఖరీఫ్లో సరైన వర్షాలు లేక పంటలు ఎండి దిగుబడి తగ్గిపోయింది. కేఎల్ఐ నీళ్లు పుష్కలంగా చెరువులు, కుంటల్లో ఉండడంతో యాసంగిలో ఎక్కువగా వరి, వేరుశనగ సాగు చేశారు. ఈ పరిస్థితుల్లో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచడంతో రైతులకు భారం పడుతుంది. -శ్రీనువాసులు, రైతు, గోపాల్పేట పాత ధరలకే విక్రయించాలి కొత్తస్టాకు ధరలు ముద్రిం చి వస్తాయి. అప్పటి వరకు పాత స్టాకును పా త ధరలకే విక్రయించాలి. ఎక్కువ ధరలకు విక్రయించొద్దు.. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువు బస్తా ల ధరలు పెరగడంతో యాసంగిలో జిల్లా రైతాంగంపై సుమారు రూ.2.50కోట్ల భారం పడనుంది. –నూతన్కుమార్, టెక్నికల్ ఏడీఏ, వనపర్తి జిల్లా -
ఆక్స్ఫామ్ సంచలన రిపోర్టు: ప్రధానికి కీలక సూచనలు
దావోస్: ఆక్స్ఫామ్ ఇండియా సంచలన నివేదికను విడుదల చేసింది. దేశంలోని కోట్లామంది పేదరికంలోనే మగ్గుతుండగా సంపన్నుల సంపద మరింత పెరుగుతోందని తాజా రిపోర్టులో వెల్లడించింది. 2017లో భారత్లో లక్షాధికారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆక్స్ఫామ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా స్విట్జర్లాండ్లోని దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ సమ్మిట్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఈ అధ్యయనాన్ని విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్లో సంపద ఎక్కువ భాగం అత్యంత ధనవంతులైన కొద్ది మంది వద్దే కేంద్రీకృతమై ఉందని 'రివార్డ్ వర్క్, నాట్ వెల్త్' పేరుతో నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న అసమానతలపై ఆందోళన వ్యక్తం చేసింది. 2017 సంవత్సరంలో సంపద సృష్టిలో 73శాతం కేవలం ఒక్క శాతం మంది వద్దే ఉందని ఆక్స్ఫామ్ సర్వే తెలిపింది. సర్వే ప్రకారం.. భారత్లోని ఒక్క శాతం ధనికుల సంపద 2017లో రూ.20.9లక్షల కోట్లు పెరిగింది. ఇది దాదాపుగా ఓ ఏడాది కేంద్ర బడ్జెట్తో సమానం. మరోవైపు దాదాపు 67కోట్ల మంది భారతీయుల సంపద కేవలం ఒక్క శాతమే పెరిగిందని నివేదించింది. 2010 నుంచి భారత్లో బిలియనీర్ల సంపద ఏడాదికి సగటున 13శాతం పెరిగిందట. సాధారణ ఉద్యోగి సంపదతో పోలిస్తే ఇది ఆరు రెట్లు ఎక్కువ. భారత్లో ఓ ప్రముఖ కంపెనీలో అధిక వేతనం తీసుకునే ఎగ్జిక్యూటివ్ ఏడాదిపాటు సంపాదించిన మొత్తం సొమ్మును.. గ్రామీణ ప్రాంతంలో కనీస వేతనం తీసుకునే ఓచిన్న ఉద్యోగి సంపాదించడానికి దాదాపు 941 ఏళ్లు పడుతుందనే షాకింగ్ అంశాన్ని కూడా ఈ సర్వే తెలిపింది. అంతేకాదు ఇదే అమెరికాలో అయితే ఓ ప్రముఖ కంపెనీ సీఈఓ ఒక్క రోజు తీసుకునే వేతనాన్ని.. సాధారణ ఉద్యోగి సంపాదించడానికి ఏడాది పడుతుందట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని కూడా వ్యాఖ్యానించింది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన మొత్తం సంపదలో 82శాతం ధనివంతులైన కేవలం ఒక్క శాతం మంది వద్దకు చేరిందని సర్వే తెలిపింది. సుమారు 3.7బిలియన్ల మంది ప్రజలకు వారి సంపాదనలో ఏమాత్రం వృద్ధి లేదని పేర్కొంది. కాగా ఈ సమావేశానికి భారత ప్రధానమంతి నరేంద్రమోదీ హాజరు కానున్నారు. గత20 ఏళ్లలో తొలిసారిగా ఇండియా ప్రధాని ఈ సదస్సు హాజరవుతుండగా బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉన్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ సదస్సుకు హాజరు కావడం లేదు. అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కేవలం కొంతమంది అదృష్టవంతుల కోసమేకాకుండా ప్రతి ఒక్కరి కోసం పనిచేయాలని భారత ప్రభుత్వాన్ని ఆక్స్ఫామ్ కోరింది. మరిన్ని ఉద్యోగాలు సృష్టించే కార్మికశక్తిని ప్రోత్సహించటం, వ్యవసాయంలో అధిక పెట్టుబడి పెట్టుబడులు, సామాజిక రక్షణ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా ప్రోత్సాహకరమైన అభివృద్ధిని సాధించాలని సూచించింది. -
ఈ కార్ల ధరకు రెక్కలు
సాక్షి,న్యూఢిల్లీ: కొత్త ఏడాది కార్ల ధరలను పెంచనున్నట్టు పలు వాహన కంపెనీలు ప్రకటించగా, తాజాగా ఫ్రెంచ్ కార్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ రెనాల్ట్ తమ కార్లు క్విడ్, డస్టర్, లాడ్జీ వెరైటీలను మూడు శాతం మేర పెంచనున్నట్టు ప్రకటించింది. జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతోనే వాహన ధరల పెంపు అనివార్యమైందని రెనాల్ట్ పేర్కొంది. అయితే ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన ప్రీమియం ఎస్యూవీ క్యాప్చర్ ధరలు మాత్రం యథాతథంగా ఉంటాయని స్పష్టం చేసింది. మహీంద్ర అండ్ మహీంద్ర, వోక్స్వ్యాగన్లు భారత్లో తమ వాహన ధరలను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పాసింజర్, కమర్షియల్ వాహనాల ధరలను మూడు శాతం పెంచుతున్నట్టు మహీంద్ర వెల్లడించగా, తమ వాహన ధరలను రూ 20,000 వరకూ పెంచనున్నట్టు వోక్స్వ్యాగన్ తెలిపింది. -
నేరాల తీరం
చీరాల: ఎప్పుడు ఏ బజారులో హత్య జరుగుతుందో.. ఎప్పుడు ఏ ఇల్లు లూటీకి గురవుతుందో.. ఏ క్షణాన మహిళ అత్యాచారానికి గురవుతుందో.. ఏ రోడ్డు వెంట దోపిడీ దొంగలు ఎప్పుడు పైన పడతారో! క్షణం క్షణం భయం..భయం. ఇదీ చీరాల సబ్ డివిజన్లో నేటి పరిస్థితి. ఇంత జరుగుతున్నా పోలీస్ శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో ఎవరికీ అంతుబట్టడంలేదు. నిందితుల జాడ లేదు.. చీరాల్లో జరుగుతున్న నేరాలు ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో శవనం లక్ష్మీ తేజని గోపిచంద్ అనేవ్యక్తి గొంతుకోసి అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఇప్పటికి నిందితుణ్ణి కానీ.. అందుకు సహకరించిన వారిని కానీ పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. అలానే అధికార పార్టీకి చెందిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు శ్రీహరి నివాసంలో దొంగలుపడి ఇంటి తాళం పగులకొట్టి సుమారు రూ. 70 లక్షలు విలువైన నగలు, నగదు, వెండిని అపహరించినా రికవరీలో అడుగు ముందుకు పడలేదు. ఆరు నెలల వ్యవధిలో మూడు హత్యలు.. గడచిన మూడు నెలల్లో చీరాల నియోజకవర్గంలో మూడు హత్యలు జరిగాయి. మూడు నెలల క్రితం రౌడీ షీటర్ కత్తి శ్రీను సైకిల్పై రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి వెళుతుండగా గతం తాలూకు కక్షలు నేపథ్యంలో పాత ప్రసాద్ థియేటర్ సమీపంలోని బోసు నగర్లో అతని బంధువులు క్రికెట్ బ్యాట్లతో తలపై మోది హతమార్చారు. వేటపాలెం మండలంలోని బచ్చులవారిపాలెంలోని పెరుగు శ్రీనివాసరావుకు చెందిన రొయ్యల చెరువులకు గుంటూరు జిల్లాకు చెందిన రాజు పోతురాజు రెడ్డి అతని భార్య రొయ్యల కాపలా ఉంటున్నారు. ఈ క్రమంలో పోతురాజు రెడ్డి భార్యతో చెరువుల యజమాని వివాహేతర సంంధం నెరపుతున్నాడు. ఈ విషయం పోతురాజు రెడ్డికి తెలిసి భార్యను మందలించాడు. ఇది శ్రీనివాసరావు తెలియడంతో పోతురాజు రెడ్డిని మరోవ్యక్తి సాయంతో కలిసి నెల రోజుల క్రితం కొట్టి చంపేశారు. వారం రోజుల క్రితం వేటపాలెం మండలం పాత పందిళ్లపల్లికి చెందిన రొయ్యల సాగుచేసే తిరుమల శ్రీహరిని.. అతని బావ ఆర్థిక లావాదేవీల కారణంగా అత్యంత పాశవికంగా హత్యచేసి తన ఇంట్లోనే పూడ్చివేశాడు. పోలీస్ స్టేషన్ ఉన్నా లెక్కలేదు.. ఇటీవల కాలంలో దొంగలు వరుస చోరీలకు తెగబడుతున్నారు. పోలీసు స్టేషన్కు కూత వేటు దూరంలోని షాపులు, మద్యం దుకాణాలను కూడా వదిలిపెట్టడంలేదు. ఇటీవల ఓ బనియన్ దుకాణంలోకి అర్ధరాత్రి సమయంలో దూరిన దొంగలు విలువైన బట్టలు, కొంత నగదును అపహరించారు. అలానే డీజీకే పార్కు సెంటర్లోని ఓ మద్యం దుకాణంలోకి ప్రవేశించి మద్యం బాటిళ్లతో పాటు 50 వేలకు పైగా నగదును అపహరించారు. సాల్మన్ సెంటర్కు చెందిన ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్న వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి 20 సవర్లు బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, కొంత నగదును అపహరించారు. సబ్ డివిజన్ పరిధిలో... పట్టణమే కాకుండా చీరాల సబ్ డివిజన్ పరిధిలో కూడా నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఇటీవల మార్టూరు పోలీసు స్టేషన్లో ఆదిలాబాద్కు చెందిన విజయ్ రాధోడ్ లాకప్ డెత్కు గురయ్యాడు. బొల్లాపల్లి పెట్రోలు బంకు సమీపంలో విధి నిర్వహణలో ఉన్న మార్టూరు ఎస్సై నాగ మల్లేశ్వరరావుపై ఓ దొంగల ముఠా దాడిచేసింది. అలానే జూలై 18న కొమరనేని వారిపాలెంలో 60 సవర్లు బంగారం, రెండు కేజీల వెండి, రెండు లక్షల నగదును అపహరించారు. జూదం జోరు బడుగు, బలహీన వర్గాలు అధికంగా జీవించే చీరాలలో.. చేనేతలు అధికంగా నివసించే జాండ్రపేట, దేశాయిపేట, ఈపూరుపాలెం, పేరాల ప్రాంతాల్లో సింగిల్ నంబర్ లాటరీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సెన్సెక్స్ పాయింట్ల అధారంగా జరిగే జూదంలో చేనేత కార్మికులు, చిన్నచిన్న పనులు చేసుకుని బతికేవారు అప్పుల పాలవుతున్నారు. ఇటీవల వరసగా జరిగిన అంతర్జాతీయ క్రికెట్ పోటీల సందర్భంగా చీరాలలో బెట్టింగ్ జోరుగా సాగింది. . విద్యార్థులే దీనిలో బాధితులవుతున్నారు. బెట్టింగ్ల కారణంగా ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సిబ్బంది కొరత చీరాల సబ్ డివిజన్లో శాంతి భద్రతలు తప్పుతుండగా మరోవైపు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. నిత్యం అమరావతిలోని సీఎం క్యాంపు ఆఫీస్తో పాటు కిర్లంపూడి వంటి ప్రాంతాలకు కూడా వెళ్లి విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఉదయం నుంచి స్టేషన్లలో విధులు నిర్వర్తించే ఎస్సైలను ప్రతిరోజూ రాత్రి హైవే పెట్రోలింగ్ అంటూ మార్టూరు ప్రాంతానికి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులంతా జిల్లా ఎస్పీ బూసరపు సత్య ఏసుబాబు తీసుకొనే చర్యలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సస్పెన్షన్ల పర్వం బచ్చులవారిపాలెంలో జరిగిన ఓ హత్య కేసులో కేసు నమోదు చేయకుండా ఓ ఎస్సై, సీఐ శాఖాపరమైన విచారణ ఎదుర్కొని సస్పెండయ్యారు. వాడరేవులో పోలీసు అతిథి గృహం పేరుతో లక్షల రూపాయల నిధులు సేకరించిన సీఐ స్థాయి అధికారి, సీసీ కెమెరాల ఏర్పాటు కంటూ భారీగా నిధులు సేకరించిన సీనియర్ సీఐ, కొత్తపేటలోని టూ టౌన్ పోలీసు స్టేషన్లో ఓ మహిళను అర్ధరాత్రి స్టేషన్కు తీసుకొచ్చిన విషయంలో ఎస్సై, సీఐ సస్పెండ్కు గురయ్యారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయడంతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుపారీ సంస్కృతి ఇదిలా ఉంటే చీరాలలో కిరాయి హంతక ముఠాలు ఏర్పడ్డాయి. సుపారీలు తీసుకోవడం మొదలెట్టారు. చెన్నంబొట్ల అగ్రహరంలో ట్రిపుల్ మర్డర్ నిందితునులను హత మార్చేందుకు సుపారీ తీసుకుని వాటిని పంచుకునే విషయంలో విభేదాలు ఏర్పడటతో ముఠా సభ్యులే ఒకరినొకరు హత మార్చుకునేందుకు సిద్ధమై చివరకు పోలీసులకు చిక్కారు. -
మళ్లీ రెక్కలు
ఇసుక యూనిట్ ధర రూ.3 వేలు ర్యాంపులు తగ్గడంతో డిమాండ్ సొమ్ము చేసుకుంటున్న నిల్వదారులు అమలాపురం : ఒకవైపు గోదావరిలో వరద... మరోవైపు జిల్లాలో ఒకటి రెండు ర్యాంపులకు మాత్రమే అనుమతి... ఇంకొక వైపు శ్రావణమాసంలో భారీగా నిర్మాణాలకు శంకుస్థాపనలు జరగడంతో ఇసుకకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ఇదే అక్రమ నిల్వదారులకు కాసులు పంట పండిస్తోంది. యూనిట్ ధర రూ.2,500ల నుంచి రూ.3 వేలు పెంచి అక్రమ నిల్వదారులు దొడ్డిదారిన ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ప్రకారం ర్యాంపు బాట నిర్వహణ, కూలీలకు యూనిట్కు రూ.425 మాత్రమే వసూలుకు అనుమతి ఉంది. జిల్లావ్యాప్తంగా ఇసుక ర్యాంపులకు అనుమతి ఉన్న సమయంలోనే ఈ నిబంధన అమలు కాలేదు. ర్యాంపు ఎగుమతి, బాట నిర్వహణకు వసూలు చేయడమే కాకుండా యూనిట్కు అదనంగా రూ.500 చొప్పున వసూలు చేసేవారు. వీటిని అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు జేబులో వేసుకున్న విషయం తెలిసిందే. గడువు పూర్తికావడంతోపాటు, వరద పోటెత్తడంతో ర్యాంపులు మూతపడ్డాయి. ప్రస్తుతం కడియం మండలం వేమగిరి, పి.గన్నవరం మండలంలో ఒక ర్యాంపు వద్ద తవ్వకాలు సాగుతున్నాయి. దీనిని ముందే గుర్తించి ఇసుక అక్రమ వ్యాపారులు భారీగా ఇసుకను నిల్వ చేశారు. శ్రావణమాస డిమాండ్ ఏర్పడడంతో అదను చూసి ధర పెంచి అమ్మకాలు చేస్తున్నారు. వినియోగదారులు సైతం ఎంత ధరైనా వెచ్చించి కొనుగోలు చేస్తుండడంతో అక్రమార్కులకు కాసుల వర్షం కురుస్తోంది. జిల్లాలోనే కాకుండా విశాఖ, విజయనగరం వంటి ప్రాంతాలకు ఎగుమతి జోరుగా సాగుతుండడం కూడా ధర పెరుగుదలకు కారణమైంది. లారీల యజమానులు సైతం కిరాయి పెంచివేశారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక అధికారులు పట్టుకుంటే ఇబ్బందని చెబుతూ ధరలను అమాంతంగా పెంచారు. రావులపాలెం నుంచి రెండు యూనిట్ల లారీ అమలాపురం తరలిస్తే ఇసుకకు రూ.ఆరు వేలు, కిరాయి మరో రూ.ఆరు వేల చొప్పున రూ.12 వేలు అవుతోందని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. అదే కాకినాడ వంటి ప్రాంతాలకు మరో రూ.మూడు వేలు రవాణా ఖర్చులవుతున్నాయి. ఇసుక అక్రమ వ్యాపారులు గతంలో రహస్య ప్రాంతాల్లో నిల్వలు చేసేవారు. వీటిమీద మైన్స్, రెవెన్యూ శాఖల నిఘా ఉండడంతో అక్రమార్కులు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, అపార్ట్మెంట్ల నిర్మాణాల సమీపంలో భారీ ఎత్తున ఇసుక నిల్వ చేస్తున్నారు. అధికారులు ఆరా తీస్తుంటే నిర్మాణాలకు తీసుకువచ్చామని చెబుతూ కళ్లు గప్పుతున్నారు. ఆనక ఇసుక అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. ఇదే పంథాలో ఇసుకను ఊరూరా నిల్వ చేసి సొమ్ములు చేసుకుంటున్న వ్యాపారులు సైతం పెరిగిపోయారు. అడపాదడపా అధికారులు దాడి చేసినా అవి చాలా తక్కువ మొత్తంలోనే. ఆత్రేయపురం మండలం వెలిచేరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి తరలిస్తుండగా ఒక లారీని గుర్తించి పోలీసులు గురువారం సీజ్ చేశారు. అయితే ఇక్కడ నుంచి శుక్రవారం యథావిధిగా ఇసుక రవాణా జరగం గమనార్హం. ఇసుక ధర పెరుగుదల ప్రభావం ప్రభుత్వం చేపట్టిన సీసీరోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలపై సైతం పడింది. ఇంత ధరలో ఇసుక కొనుగోలు చేసి నిర్మాణాలు చేయలేమని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తివేయడంతో పనులు నిలిచిపోతున్నాయి. అధికారులు అక్రమ నిల్వలపై దాడులు చేసి ఉన్న ఇసుకను తక్కువ ధరకు అమ్మకాలు జరిగేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. -
భూముల విలువకు రెక్కలు
- ఆగస్టు 1వ తేదీ నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు - ఆదేశాలిచ్చిన సర్కారు - కసరత్తులో రిజిస్ట్రేషన్ అధికారులు - 10 నుంచి 25 శాతం వరకు పెరుగుదల - గ్రామాల్లో 25 శాతం వరకు పెంపు ? భూములు, భవనాల విలువలకు త్వరలో రెక్కలు రానున్నాయి. రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తాజా పెంపుదల ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఆ దిశగా ఇప్పటికే జిల్లా రిజిస్ట్రేషన్ యంత్రాంగం కసరత్తు చేపట్టింది. ప్రస్తుత విలువపై 10 నుంచి 25 శాతం వరకు భూముల విలువ పెరగనున్నట్టు అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం వరకు పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. పట్టణ భూములు విలువ పెంచిన సర్కారు తాజాగా పల్లెలపై కన్నేసింది. ఉదాహరణకు మండపేటలో భూముల పెంపుదలను పరిశీలిద్దాం. సంపన్న వర్గాల వారు నివసిస్తున్న విజయలక్ష్మి నగర్లోని ఓ రోడ్డులో గజం విలువ రూ.11,000ల వరకూ పెంచగా...అదే ప్రాంతంలోని పక్క రోడ్డులో రూ.4,500 మాత్రమే పెంచారు. పట్టణంలోని పేదవర్గాల వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన సంఘం పుంత కాలనీలో రూ.1800 ఉన్న గజం విలువను రూ.11,000లకు పెంపుదల చేశారు. ఆలమూరు రోడ్డులో రూ.1800లు ఉన్న గజం విలువను రూ.10,500లకు పెంచేశారు. - మండపేట జిల్లాలో 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా కాకినాడ, రాజమహేంద్రరం, అమలాపురం ప్రధాన సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు మిగిలిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు దాదాపు వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఆయా రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు రూ. 2.1 కోట్లు ఆదాయం వస్తోంది. గత ఏడాది భూముల విలువ పెంపులో అనాలోచిత నిర్ణయాలు ప్రజలను ఇబ్బందుల పాల్జేశాయి. చాలాచోట్ల ప్రధాన రహదారిని ఆనుకుని భూములు, భవనాల విలువతో సమానంగా వాటి వెనుక ఉన్న వాటి విలువను పెంచేశారు. ఉదాహరణకు మండపేటలో సంపన్న వర్గాల వారు నివసిస్తున్న విజయలక్ష్మి నగర్లోని ఒక రోడ్డులో గజం విలువ రూ.11,000లు వరకు పెంచగా, అదే ప్రాంతంలోని పక్క రోడ్డులో రూ. 4,500 మాత్రమే పెంచారు. పట్టణంలోని పేదవర్గాల వారికి ఇళ్లస్థలాలు పంపిణీ చేసిన సంఘంపుంత కాలనీలో రూ.1800 ఉన్న గజం విలువను రూ. 11,000లకు పెంపుదల చేయడం గమనార్హం. ఆలమూరు రోడ్డులో రూ.1800లు ఉన్న గజం విలువను రూ.10,500లకు పెంచేశారు. విలువలేని చోట ఇష్టారాజ్యంగా భూముల ధరలు పెంచేయ్యడంపై అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ ప్రతిపక్షనేత రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు) పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో ధ్వజమెత్తారు. లేని విలువను పెంచి చూపడంతో రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో పేద వర్గాల వారు తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొని ఉండటంతో పలువురు బాధితులు అప్పట్లో కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదులు సైతం చేశారు. అయిన వాటిపై ఏ విధమైన స్పందన లేకపోయింది. తాజాగా మరోమారు భూముల విలువ పెంచేందుకు కసరత్తు చేస్తుండటంతో ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామీణంపై మరింత భారం... గత ఏడాది పట్టణ ప్రాంతాల్లో అధికంగా భూముల విలువ పెంచగా ఈసారి గ్రామీణ ప్రాంతాలపై అధికార యంత్రాంగం దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 10 శాతానికి పైగాను, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం మేర భూముల విలువ పెంపుదలకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఏఏ ఏరియాల్లో ఎంత పెరిగేదీ రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. జిల్లా మొత్తంగా 25 శాతం వరకు భూముల విలువ పెరగవచ్చునని తెలుస్తోంది. మూలిగే నక్కపై తాటికాయ... పెద్దనోట్లు రద్దుతో ఇప్పటికే కుదేలైన నిర్మాణ రంగానికి తాజాగా రిజిస్ట్రేషన్ విలువ పెంపు నిర్ణయం మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద నోట్లు రద్దు ప్రభావంతో జిల్లాలో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయింది. ప్రసుతం రోజుకు 60 శాతం మేర మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. తాజాగా భూముల విలువ పెంపుదల చేయనుండటం విమర్శలకు తావిస్తోంది. లేని విలువను చూపించి రిజిస్ట్రేషన్ల చార్జీల రూపంలో భారీగా దోపిడీకి పాల్పడుతున్నారని పలువురు మండిపడుతున్నారు. పెంపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు. -
గృహోపకరణాల ధరలు పై పైకే
న్యూఢిల్లీ: జీఎస్టీ కొత్తపన్నులు అమల్లోకి రావడంతో అనేక గృహోపకరణాల ధరలు మోత మోగనున్నాయి. జీఎస్టీ పరిధిలో ప్రస్తుత పన్ను రేటు 25-27శాతంనుంచి 28 శాతానికి చేరడంతో ఇప్పటికే డ్యూరబుల్ మేకర్స్ ధరలను పెంచేశారు. దీంతో శనివారం నుంచి ఈ వస్తువులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి బాదుడు తప్పదు. అంతేకాదు రానున్న దసరా , దీపావళి పండుగల సీజన్లో మరోసారి ధరల పెంపు తప్పదనే అంచనాలు నెలకొన్నాయి. ఇన్పుట్ క్రెడిట్ (ముడి పదార్ధాల, విడిభాగాల ప్రస్తుత స్టాక్) ఆధారంగా ధరల సమీక్ష ఉండనుండటంతో ఈ పండుగ సీజన్ (దసరా, దీపావళి) టీవీలు, ఫ్రిజ్, ఏసీ, వాసింగ్ మెషీన్ లాంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు బాగా పెరగనున్నాయి. జీఎస్టీ కారణంగా తమపై 2-3శాతం భారం పడనున్న కారణంగా పండుగల ముందు ధరల పెంపు తప్పదని తయారీదారులు భావిస్తున్నారు. తమ రంగానికి సంబంధించి పన్ను పెరిగిందనీ, 28శాతంగా జీఎస్టీ పన్ను నిర్ణయించడంతో మార్జిన్ను నిలబెట్టుకోవటానికి ధరలు పెంచక తప్పదని గోద్రేజ్ గృహోపకరణాల బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. ఇప్పటికే 50శాతం డిస్కౌంట్లను డీలర్లు అందించారన్నారు. అలాగే గిడ్డంగుల్లో ఉన్న స్టాక్ క్లియర్ కావడంతో పాటు, టాక్స్ క్రెడిట్ పొందడానికి ఇంకా రెండు మూడు నెలల సమయం పడుతుందన్నారు. సోమవారం లేదా మంగళవారం నాటికి అన్ని బ్రాండ్ల ధరల జాబితా వెల్లడికానుందని తెలిపారు. ఈ జాబితా వెల్లడి అనంతరం వ్యాపారం ప్రారంభం కానుందని చెప్పారు. ఇతర వాణిజ్య భాగస్వాములు ఇప్పటికే తమ స్టాక్లను విక్రయించి, కొనుగోళ్లను ప్రారంభించారని నంది చెప్పారు. ఈ నేపథ్యంలో పండుగ సీజన్లో భారీ అమ్మకాలను ఆశించడంలేదన్నారు. కానీ నెమ్మదిగా పుంజుకుంటాయని ఆశిస్తున్నామన్నారు. అయితే ధరల పెంపుపై మరో గృహోపకరణాల విక్రయ సంస్థ పానసోనిక్ వచ్చే వారం నిర్ణయం తీసుకోనుంది. రేపటినుంచే కాదుకానీ, తరువాతి వారంలో ధరలను సమీక్షిస్తామని పానాసోనిక్ ఇండియా సేల్స్ అండ్ సర్వీస్ డైరెక్టర్ అజయ్ సేథ్ చెప్పారు. -
ఆడియో హిట్తో అంచనాలు పెరిగాయి
ఆకలి పోరాటం చిత్ర నిర్మాత పీవీ రాఘవులు రాజమహేంద్రవరం కల్చరల్ : రామ్సాయి గోకులం క్రియేషన్స్పై నిర్మించిన ‘ఆకలిపోరాటం’ సినిమాలోని ఆరు పాటలు హిట్ కావడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయని నిర్మాత పీవీ.రాఘవులు(రవి) తెలిపారు. ఈ నెల 25న రాజమహేంద్రవరంలో విడుదల చేసిన ఆకలి పోరాటం ఆడియో విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్ శుక్రవారం ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలను తెలిపారు. ఈ సందర్బంగా హీరో గంగాధర్ మాట్లాడుతూ ఎంత పెద్ద సినిమాలో అయినా ఏవో కొన్ని పాటలు హిట్ అవుతాయని, అయితే చిన్న సినిమా అయిన తాను నటించిన ఆకలి పోరాటంలో ఆరు పాటలు ప్రజాదరణ పొందడం ఆనందంగా ఉందన్నారు. ఈ విజయం తమది మాత్రమే కాదని, గోదావరి ప్రాంత సెంటిమెంట్, ఇక్కడి ప్రజల ఆదరణే ఈ విజయానికి కారణమన్నారు. చిత్ర నిర్వాహకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సినిమాలో ఆరు పాటలు మంచి హిట్ అయ్యాయని, ఈ విజయం గోదావరి ప్రాంత వాసులదేనన్నారు. సినిమా విడుదలకు సిద్ధమౌతున్నామని, పాటలను విజయవంతం చేసిన మాదిరిగానే సినిమాను హిట్ చేయాలని ఆక్షాంక్షించారు. కొల్లపురెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యతో తెరకెక్కిన ఈ సినిమాను అందరూ ఆదరించాలని, ప్రస్తుతం యువత పడుతున్న కష్టాలను ఆకలి పోరాటం ద్వారా చూపామన్నారు. -
పాదగయ.. అద్భుతమయా!
ఈ ఏడాది ఆదాయం రూ.1.41 కోట్లు పెరిగిన భక్తుల సంఖ్య ఇక నుంచి ‘ఏసీ స్థాయి హోదా’ పిఠాపురం : ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ ఆదాయంలో ప్రముఖ ఆలయాల చెంతకు చేరింది. దేవాదాయ ధర్మాదాయ చట్టం 6(ఏ) నిబంధనల ప్రకారం గత మూడేళ్ల నుంచి రూ. కోటికి పైగా ఆదాయం ఆర్జించడంతో కార్యనిర్వహణాధికారి స్థాయి నుంచి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి చేరినట్టు ఈఓ చందక దారబాబు తెలిపారు. జిల్లాలో ఏసీ స్థాయి ఆలయాల్లో అంతర్వేది, తలుపులమ్మలోవ, మందపల్లి, అప్పనపల్లి ఆలయాలు ఉండగా ఈ ఏడాది నుంచి పిఠాపురం పాదగయ క్షేత్రం వాటి సరసన చేరింది. మూడేళ్ల క్రితం వరకు రూ.90 లక్షలు దాటని ఆదాయం.. వరుసగా మూడేళ్ల నుంచి రూ.కోటి దాటడంతో పాటు స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. 2013– 2014 వార్షికాదాయం రూ.90 లక్షల వరకు ఉండగా.. 2014–2015 నుంచి ఆదాయం ఒక్కసారిగా పెరగడం ప్రారంభమైంది. గత ఏడాది వార్షికాదాయం ఏకంగా రూ.1.63 కోట్లు లభించింది. వీటిలో హుండీల ద్వారా రూ.40 లక్షలు, టికెట్ల ద్వారా రూ.60 లక్షలు లభించగా మరో రూ.63 లక్షలు ఇతర మార్గాల ద్వారా లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. అలాగే 2013– 2014లో 15 నుంచి 18 లక్షల మంది వరకు ఉండే భక్తులు 2014–2015 నుంచి ఒక్కసారిగా పెరిగి.. ఈ ఏడాది సుమారు 24 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. గత ఐదేళ్ల నుంచి ఆలయ వివరాలతో వెబ్సైట్ ప్రాంభించడంతో దేశ, విదేశాల నుంచి భక్తుల రాక పెరిగింది. తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా తరలివస్తుండడంతో ఆదాయం అనుకోని రీతిలో పెరిగినట్టు ఆలయ ఈఓ చందక దారబాబు తెలిపారు. ఆదాయం పెరుగుదల ఇలా 2013– 2014– రూ 89,92,000 2014– 2015– రూ 1,10,60,639 2015– 2016– రూ 1,63,29,819 2016–2017– రూ 1.41,47,766 పెరిగిన శ్రీసంస్థానం ఆదాయం పిఠాపురానికి చెందిన శ్రీసంస్థానం సత్రం ఆదాయం మూడేళ్లుగా పెరిగింది. 2013–2014లో రూ.11.50 లక్షలు ఉండే ఆదాయం 2014– 2015లో రూ.49 లక్షలకు చేరుకోగా, 2015–2016 రూ.25 లక్షలు, 2016- 2017లో రూ.29 లక్షలు లభించిందని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 6బీ కేటగిరిలో ఉండే ఈసత్రం గత ఏడాది నుంచి 6ఏ కేటగిరిలోకి వచ్చిందని ఈఓ చందక దారబాబు తెలిపారు. ఈ సంస్థానానికి సంబంధించి తొండంగి మండలంలో సుమారు 500 ఎకరాలకు పైగా భూములు ఉండగా వాటి ద్వారా శిస్తు రూపంలో ఆదాయం లభిస్తోంది. -
పెరిగిన సహజ జలాలు
-డెల్టా కాలువలకు సమృద్ధిగా నీరు -అయినా శివార్లకు తప్పని కొరత -తోటలు, చెరువులకు మోటార్లతో తోడకమే కారణం అమలాపురం : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సహజ జలాల రాక అనూహ్యంగా పెరుగుతోంది. ఈనెల మొదటివారంలో (6వ తేదీ) 965 క్యూసెక్కులు ఉన్న సహజ జలాల రాక రెండవ వారం (8వ తేదీ) నాటికి 2,700 క్యూసెక్కులకు పెరిగింది. సోమవారం నాటికి ఇన్ఫ్లో 9,828 క్యూసెక్కులకు పెరిగింది. ఒక విధంగా ఇది ఆశ్చర్యకర విషయమే. వేసవి ఎండలు పెరిగిన ఈ సమయంలో ఇన్ఫ్లో వెయ్యి క్యూసెక్కుల లోపే ఉంటుంది. అయితే మన్యంలో పలు ప్రాంతాల్లో అడపాదడపా కురుస్తున్న వర్షాలకు ఇన్ఫ్లో పెరిగిందని నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. సహజ జలాల రాక పెరగడం వల్ల సీలేరు పవర్ డ్రాప్ నుంచి వచ్చే నీరు తగ్గినా డెల్టా కాలువలకు అధికారులు సమృద్ధిగా సాగునీరందిస్తున్నారు. సీలేరు నుంచి ప్రస్తుతం 2810.64 క్యూసెక్కుల నీరు వస్తోంది. మొత్తం 12,638.64 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా, డెల్టా కాలువలకు 10,060 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. తూర్పుడెల్టాకు 2,940, మధ్యడెల్టాకు 2,010, పశ్చిమ డెల్టాకు 5,110 క్యూసెక్కుల చొప్పున నీరందిస్తున్నారు. తూర్పు, పశ్చిమ డెల్టాలకు 90 డ్యూటీ (ఒక క్యూసెక్కు 90 ఎకరాలకు చొప్పున), మధ్యడెల్టాకు 86 డ్యూటీలో సాగునీరందిస్తున్నారు. కాలువల కట్టివేత గడువు పెంపును ప్రకటించాలి.. పంట కాలువలకు సమృద్ధిగా సాగునీరందిస్తున్నా.. శివారు, మెరక ప్రాంతాలకు నీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇందుకు సాగునీటి నిర్వహణా వైఫల్యం ఒక కారణమైతే.. మార్చి 31 నాటికి పంట కాలువలు మూసివేస్తామని అధికారులు చెప్పడం మరొక కారణమని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. 31 నాటికి కాలువలు మూసివేస్తే ఇబ్బందులు తప్పవని కాలువలను ఆనుకుని ఉన్న కొబ్బరితోటలు, ఆక్వా చెరువులు (చేపలు, రొయ్యలు) సాగు చేసే రైతులు మోటార్లతో పెద్ద ఎత్తున నీరు తోడుతున్నారు. తూర్పుడెల్టాలో కె.గంగవరం, తాళ్లరేవు, కాజులూరు, కరప, మధ్యడెల్టాలో ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, అయినవిల్లి, ఐ.పోలవరం, కాట్రేనికోన, మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి, పి.గన్నవరం, అమలాపురం మండలాల్లో తోటలకు, చేలకు నీటి తోడకం ఎక్కువగా ఉంది. ఏప్రిల్ 15 వరకు నీరు ఇవ్వాల్సి ఉందని తెలిసి కూడా అధికారులు పదేపదే మార్చి 31 నాటికి మూసివేస్తామనడంతో వరిసాగు చేసే శివారు రైతులు అనుకోని నీటి ఎద్దడిని ఎదుర్కొనాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కాలువలకు గడువు పెంచుతున్నట్టు అధికారులు ప్రకటిస్తే జలచౌర్యం కొంత వరకు తగ్గి తమ చేలకు నీరందుతుందని రైతులు అంటున్నారు. -
గలగలా గోదారి..
కాస్త ఊరట పెరిగిన సహజ జలాలు రోజుకు 2,700 క్యూసెక్కుల రాక రబీకి ఢోకా ఉండదంటున్న అధికారులు అమలాపురం (అమలాపురం) : రబీవరి చేలు పాలుపోసుకుని గింజ గట్టిపడుతున్న కీలక సమయంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సహజ జలాల రాక గడిచిన రెండు రోజులుగా పెరిగింది. కీలక సమయంలో నీరు పెరగడం రైతుల్లో ఆనందాన్ని నింపుతుండగా, అధికారుల్లో కొంత వరకు ఒత్తిడి తగ్గింది. వారం రోజుల క్రితం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సహజ జలాల రాక కేవలం 965 క్యూసెక్కులు మాత్రమే. ఇదే సమయంలో సీలేరు పవర్ జనరేషన్, బైపాస్లో ఏకంగా 7,575 క్యూసెక్కులు మాత్రమే. దీంతో వచ్చిన 8,400 క్యూసెక్కుల నీటిని మూడు కాలువలకు విడిచిపెడుతున్నారు. రెండు రోజుల్లో జిల్లాలో మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. దీని వల్ల ఏజెన్సీలోని పాములేరు, ఎద్దువాగు వంటి వాగుల నుంచి నీరు గోదావరిలోకి వస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సహజ జలాలు 2,700 క్యూసెక్కులకు పెరిగాయి. అడపాదడపా వర్షాలు పడితే ఇదే ఒరవడి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో బ్యారేజ్ వద్ద పాండెలెవెల్ 13.63 మీటర్ల మేరకు పెంచారు. సహజ జలాలు తగ్గినా రబీకి నీటికి వచ్చే ఎద్దడి ఉండదని అధికారులు «ధీమా వ్యక్తం చేస్తున్నారు. రబీకి ఢోకా లేదు రబీకి ఎట్టిపరిస్థితుల్లోనూ నీటి ఎద్దడి వచ్చే అవకాశం లేదు. సహజ జలాల రాక పెరిగింది. ఇది కొంతకాలం ఉంటుంది. ఇదే సమయంలో బ్యారేజ్ వద్ద 2.60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సీలేరు నుంచి క్రమం తప్పకుండా నీరు వచ్చే చర్యలు తీసుకున్నాం. చివరి ఆయకట్టు వరకు సాగునీరందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. – ఎన్వీ కృషారావు, హెడ్వర్క్స్ ఈఈ, ధవళేశ్వరం -
పల్లెలకు పన్ను పోటు
మూడింతలు పెరిగిన ఇంటిపన్ను కొత్తగా గ్రంథాలయం, క్రీడా సెస్సు మంచినీరు ఇవ్వకపోయినా నీటిపన్ను డ్రైనేజీ, లైటింగ్ పన్నులు అదనం లబోదిబోమంటున్న గ్రామీణులు రేషనలైజ్ చేశామంటున్న అధికారులు గతంలో తక్కువ వసూలు చేశామంటూ వివరణ సాక్షి, రాజమహేంద్రవరం : పన్నులు వేసి ప్రజల ముక్కుపిండి వసూలు చేయడంలో తనకు తానే సాటి అని టీడీపీ ప్రభుత్వం మరోసారి నిరూపించుకుం టోంది. గతంలో సీఎంగా పని చేసిన కాలంలో విద్యుత్ చార్జీలు, ఇంటి పన్నులు, వివిధ రకాల సెస్సుల పేరుతో గ్రామీణులు, రైతుల నుంచి భారీ ఆదాయం రాబట్టుకున్న చంద్రబాబు.. ఈ దఫా కూడా తన పంథా ఏమాత్రం మార్చుకోలేదు. గ్రామాల్లో ఇంటి పన్నులు మూడింతలు పెరగడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోం ది. వీటితోపాటు త్వరలో విద్యుత్ చార్జీల వడ్డనకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు గతంలో కన్నా మూడింతలు పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఎన్నడూ లేనివిధంగా గ్రం«థాలయం, క్రీడా సెస్సు లు, లైటింగ్, నీటి పన్నులు విధించిన ప్రభుత్వం.. ఆ మేరకు నూరు శాతం వసూళ్లు చేయాలంటూ అధికారులకు లక్ష్యాలు నిర్దేశిస్తోంది. మూడు రెట్లు పెరిగిన ఇంటి పన్నులు 2013–14 ఆర్థిక సంవత్సరంలో ఓ ఇంటికి రూ.135గా ఉన్న ఇంటి పన్ను ప్రస్తుత 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.520కి పెరిగింది. రూ.135లో ఇంటి పన్ను రూ.125, గ్రంథాలయం సెస్సు రూ.10 లెక్కన వసూలు చేశారు. తాజాగా అదే ఇంటికి వేసిన రూ.520 పన్నులో పలు రకాలు ఇంటి పన్ను రూ.352, గ్రంథాలయం సెస్సు రూ.28, లైటింగ్ పన్ను రూ.35, డ్రైనేజీ పన్ను రూ.70, క్రీడా సెస్సు రూ.35 చొప్పున విధించారు. ఇంటి విస్తీర్ణాన్నిబట్టి ఈ లెక్కలు మారుతూంటాయి. ఇంటి పన్ను మొత్తంలో 8 శాతం జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లిస్తూండగా, మిగతా సొమ్ము పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు. లేని సేవకు సెస్సులు, పన్నులు : ఏదైనా ఒక సేవను ఆ ప్రాంతంలోని ప్రజల కు అందిస్తున్నప్పుడు సాధారణంగా ప్రభుత్వం పన్ను లేదా సెస్సు విధిస్తుంది. ఉదాహరణకు స్వచ్ఛభారత్ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సేవపై 0.5 శాతం సెస్సు విధిస్తోంది. జిల్లాలో 1069 గ్రామ పంచాయతీలుండగా, చాలాచోట్ల గ్రంథాలయాలు లేవు. పంచాయతీ కార్యాలయాల్లో కనీసం దినపత్రికలు కూడా దొరకవు. అలాంటిది ఇం టి విస్తీర్ణం ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వం గ్రంథాల యం పన్ను వసూలు చే స్తోంది. క్రీడా సెస్సు వసూలు చేస్తోంది. వీటితోపాటు మంచినీటి సరఫరా లేకపోయినా, డ్రైనేజీ వ్యవస్థ ఉన్నా లేకపోయినా ప్రజలు పన్నులు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేసింది. గ్రామాల్లో వీధిదీపాలు వెలిగినా, వెలగకపోయినా ఏడాదికి సరిపడా లైటింగ్ పన్ను చెల్లించాల్సిందే. ప న్ను వసూళ్లలో నూరు శాతం లక్ష్యం చేరుకోని సిబ్బం దిపై చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. కాగా, పన్నులు పెరగలేదని, గతంలో తక్కువ వసూలు చేశారని, ఇప్పుడు రేషనలైజేష¯ŒS చేయడంవల్ల కొందరి ఇంటి పన్నులు పెరగగా, మరికొందరివి తగ్గాయని అధికారులు అంటున్నారు. గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం.. లేని సౌకర్యాలకు పన్నులు గుంజడంపై గ్రామాల్లో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. -
వామ్మో గ్యాస్ ధర
– కొండెక్కి కూర్చున్న గ్యాస్ ధరలు – ఫిబ్రవరిలో రూ.700, ఈ నెల రూ.790.50 – వచ్చే నెలలో ఎంతో...? – అంతర్జాతీయ మార్కెట్ అధారంగా మార్పులు – ప్రతి నెలా వడ్డింపులు చేస్తున్న కంపెనీలు – వ్యాపార గ్యాస్ ధర కూడా పెంపు – బెంబేలెత్తుతున్న వినియోగదారులు ఇలా బండ పెరుగుదల... - జనవరిలో ఇంటి గ్యాస్ సిలిండర్ 14.2 కేజీల ధర రూ.632 ఉండగా ఫిబ్రవరిలో అది కాస్త రూ.700లకు చేరుకుంది. - మార్చి నెల ఒకటో తేదీన మరోసారి గ్యాస్ ధర పెరిగింది. ఫిబ్రవరిలో రూ.700 ఉన్న ధర మరో రూ.90.50 పెరిగి రూ.790.05లకు చేరుకుంది. గ్యాస్ ఇంటికి తెచ్చిన డెలివరీ బాయ్ చార్జీ రూపంలో మరో రూ.30లు అదనంగా పడుతోంది. - వెరసి మార్చి నెల మొత్తంలో ఏ రోజైనా గ్యాస్ సిలిండర్ కొన్న వారు రూ. 820.50లు చెల్లిస్తున్నారు. సబ్సిడీలా... గత ఏడాది గ్యాస్ సబ్సిడీ రూ.250 వచ్చేది. అయితే జనవరిలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.632కు పెరగడంతో సబ్సిడీ రూ.161లు మాత్రమే వినియోగదారులు ఖాతాలో జమ అవుతోంది. - ఇక ఫిబ్రవరి నెలలో గ్యాస్ ధర రూ.700, మార్చిలో రూ.790.50లకు పెరిగింది. గ్యాస్ ధర పెరిగిన మేర సబ్సిడీలో కోత పడుతోంది. అదే జాడలో ధరలూ... - ఇంటి అవసరాలకు 14.2 కేజీల బండను సరఫరా చేస్తున్న ప్రభుత్వం వ్యాపార అవసరాలకు ప్రత్యేకంగా 19 కేజీల సిలిండర్ను అందిస్తోంది. - ఈ సిలిండర్ ధర జనవరిలో రూ.1180 ఉండగా ఫిబ్రవరిలో రూ.1285, మార్చిలో రూ.1440లకు పెరిగింది. - కేవలం రెండు నెలల్లో గ్యాస్ ధర రూ.260 మేర పెరగడంతో టిఫిన్ సెంటర్లు, తోపుడు బండిపై టిఫిన్ విక్రయించేవారు, రోడ్డుపై చిరుతిళ్లు తయారు చేసి అమ్మేవారు బెంబేలెత్తుతున్నారు. - పెరిగిన ధర మేరకు వారు విక్రయించే తిను బండారాల ధరలు పెంచడం లేదా వాటి సైజు తగ్గించడం చేస్తున్నారు. ఇక రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఇందుకు ఏ మాత్రం భిన్నంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొంది. సాక్షి, రాజమహేంద్రవరం: వంట గ్యాస్ ధర కొండెక్కి కూర్చుంది. వినియోగదారులు గ్యాస్ పోయ్యి వెలిగించకుండానే సెగ తగులుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలను అనుసరించి గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా ధరలను నిర్ణయించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో అంతర్జాతీయ మర్కెట్ ఆధారంగా ధరల్లో ప్రతి నెలా గ్యాస్ కంపెనీలు మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ విధానం ప్రస్తుతం ఏడాది నుంచి అమలు చేస్తున్నాయి. జనవరిలో ఇంటి గ్యాస్ సిలిండర్ 14.2 కేజీల ధర రూ.632 ఉండగా ఫిబ్రవరిలో అది కాస్త రూ.700లకు చేరుకుంది. ఇక మార్చి నెల ఒకటో తేదీన మరోసారి గ్యాస్ ధర పెరిగింది. ఫిబ్రవరిలో రూ.700 ఉన్న ధర మరో రూ.90.50 పెరిగి రూ.790.05లకు చేరుకుంది. గ్యాస్ ఇంటికి తెచ్చిన డెలివరీ బాయ్ చార్జీ రూపంలో మరో రూ.30లు అదనంగా పడుతోంది. వెరసి మార్చి నెల మొత్తంలో ఏ రోజైనా గ్యాస్ సిలిండర్ కొన్న వారు రూ. 820.50లు చెల్లిస్తున్నారు. సబ్సిడీలో కోత... నగదు బదిలీ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, వస్తువులపై ఇస్తున్న సబ్సిడీని ఖాతాదారులకు నేరుగా ఇచ్చేలా యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్యాస్ ధర సబ్సిడీ కూడా వారి ఖాతాల్లో జమయ్యేలా గ్యాస్ కనెక్షన్, బ్యాంకు ఖాతాలతో ఆధార్, మొబైల్ నంబర్లను అనుసంధానం చేసింది. ఖాతాదారుడు తన మొబైల్ నంబర్ నుంచి సంబంధింత గ్యాస్ ఏజెన్సీ ఇచ్చిన సెల్ నంబర్కు ఫోన్ చేసి గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఇస్తున్నారు. దీనివల్ల గ్యాస్ ఏజెన్సీలు అవకతవకలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావించింది. వినియోగదారుడు గ్యాస్ ధరను ముందు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. ఇదే విధానాన్ని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తోంది. గత ఏడాది గ్యాస్ సబ్సిడీ రూ.250 వచ్చేది. అయితే జనవరిలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.632కు పెరగడంతో సబ్సిడీ రూ.161లు మాత్రమే వినియోగదారులు ఖాతాలో జమ అవుతోంది. ఇక ఫిబ్రవరి నెలలో గ్యాస్ ధర రూ.700, మార్చిలో రూ.790.50లకు పెరిగింది. గ్యాస్ ధర పెరిగిన మేర సబ్సిడీలో కోత పడుతోంది. సబ్సిడీ వదులుకున్న వారు నామమాత్రమే... జిల్లాలో 13,10,669 గ్యాస్ కనెక్షన్లున్నాయి. పేద, ధనిక, ప్రభుత్వ ఉద్యోగి, ప్రైవేటు ఉద్యోగి, యజమాని, కార్మికుడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ గ్యాస్ సబ్సిడీ వర్తిస్తోంది. ధనవంతులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంతో మన జిల్లాలో ఉన్న 13,10,669 మంది వినియోగదారుల్లో కేవలం 6000 మంది మాత్రమే సబ్సిడీ వదులుకున్నారు. సాధారణ గ్యాస్ కనెక్షన్లతోపాటు జిల్లాలో 6,056 వ్యాపార కనెక్షన్లున్నాయి. హెచ్పీ, భారత్, ఇండేన్ కంపెనీలు జిల్లాలో 71 ఏజెన్సీలను ఏర్పాటు చేసి వినియోగదారులకు గ్యాస్ను సరఫరా చేస్తున్నాయి. బెంబేలెత్తుతున్న వ్యాపారులు... గ్యాస్ ధర ప్రతి నెలా పెరుగుతుండడంతో సాధారణ వినియోగదారులతోపాటు, వ్యాపారస్తులు బెంబేలెత్తుతున్నారు. ఇంటి అవసరాలకు 14.2 కేజీల బండను సరఫరా చేస్తున్న ప్రభుత్వం వ్యాపార అవసరాలకు ప్రత్యేకంగా 19 కేజీల సిలిండర్ను అందిస్తోంది. ఈ సిలిండర్ ధర జనవరిలో రూ.1180 ఉండగా ఫిబ్రవరిలో రూ.1285, మార్చిలో రూ.1440లకు పెరిగింది. కేవలం రెండు నెలల్లో గ్యాస్ ధర రూ.260 మేర పెరగడంతో టిఫిన్ సెంటర్లు, తోపుడు బండిపై టిఫిన్ విక్రయించేవారు, రోడ్డుపై చిరుతిళ్లు తయారు చేసి అమ్మేవారు బెంబేలెత్తుతున్నారు. పెరిగిన ధర మేరకు వారు విక్రయించే తిను బండారాల ధరలు పెంచడం లేదా వాటి సైజు తగ్గించడం చేస్తున్నారు. ఇక రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఇందుకు ఏ మాత్రం భిన్నంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు: 13,10,669 సబ్సిడీ వదులుకున్నవారు: 6000 వ్యాపార కనెక్షన్లు: 6,056 జిల్లాలో ఏజెన్సీలు: 71 అంతర్జాతీయ మర్కెట్కు అనుగుణంగా మార్పులు.. పెట్రోల్, డీజిల్ ధరల లాగానే అంతర్జాతీయ మర్కెట్ ధరల ఆధారంగా ప్రతి నెలా గ్యాస్ ధరలు మారుతుంటాయి. ప్రతి నెలా ఇది తప్పనిసరి. ఒక నెల ధర పెరిగితే మరో నెల తగ్గొచ్చు. పెరిగిన ధరకు అనుగుణంగా వినియోగదారులకు సబ్సిడీ నగదు వారి ఖాతాల్లో జమ అవుతుంది. ధర పెరిగితే సబ్సిడీ మొత్తం తగ్గుతుంది. గ్యాస్ ధర తగ్గితే సబ్సిడీ మొత్తం పెరుగుతుంది. – వేమూరి రవికిరణ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి. -
అరటి ధర హాసం
సంక్రాంతితో జోరందుకున్న ఎగుమతులు తమిళనాడులో పెరిగిన డిమాండ్ రావులపాలెం : కొద్ది రోజులుగా ధర లేక వెలవెలబోయిన రావులపాలెం (కొత్తపేట) అరటి మార్కెట్ యార్డులో ఎగుమతులు జోరందుకున్నాయి. అరటికి ధర పెరగడంతో రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ గిట్టుబాటు ధరలేక నష్టాలు చవిచూసిన రైతులకు పెరిగిన ధరలు కొంత ఉపశమనం కలిగించాయి. తమిళనాడులో అరటి దిగుబడి తగ్గడంతో అక్కడి వ్యాపారులు రావులపాలెం మార్కెట్కు రావడంతో ధరలు పెరిగాయి. సంక్రాంతికి వినియోగం పెరిగే అవకాశాలు ఉండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు ఎగుమతులు పెరగడంతో ధరలు ఊపందుకున్నాయి. యార్డు పరిధిలోని సుమారు 20 వేల ఎకరాల్లో నిన్నమొన్నటి వరకూ గెలలు కోయని రైతులు పెరిగిన ధరతో కోతలు ముమ్మరం చేశారు. 80 శాతం పంట పూర్తి కావడంతో ఉన్న 20 శాతం పంటలో పక్వానికి వచ్చిన ప్రతీ గెలను రైతులు మార్కెట్కు తరలిస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ ధరల లేక నష్టపోయిన రైతులు పెరిగిన ధరలతో కాస్త కోలుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం యార్డు పరిధిలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట, కపిలేశ్వరపురం, మండపేట, పి.గన్నవరం, పెనుగొండ, పెరవలి, మార్టేరు మండలాల నుంచి రోజుకు 10 నుంచి 20 వేల గెలను అమ్మకానికి తీసుకువస్తున్నారు. తమిళనాడు, ఒరిస్సా, బీహర్, తదితర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 15 నుంచి 20 లారీల సరుకు రవాణా జరుగుతోంది. రోజుకు సుమారు రూ.15 నుండి రూ.20 లక్షల వ్యాపారం జరుగుతుంది. ఎగుమతులు పెరిగాయి నిన్నమొన్నటి వరకూ సరైన ధర లేక అంతమాత్రంగా కొనుగోళ్లు జరిగాయి. ప్రసుత్తం తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో వినియోగం పెరడంతో ధర పెరిగింది. ఎగుమతులు కూడా జోరందుకున్నాయి. మరో రెండు వారాల పాటు ఇదే జోరు కొనసాగే అవకాశం ఉంది. - కోనాల చంద్రశేఖరరెడ్డి, వ్యాపారి పెరిగిన ధరలు ఊరటనిస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అరటి సాగులో తీవ్ర నష్టాలు చవిచూశాం. చాలా రోజుల తరువాత అరటి ధరలు పెరగడం ఊరటనిస్తోంది. మరి కొద్ది రోజులు మార్కెట్ ఇదే విధంగా ఉంటే రైతులు నష్టాల నుంచి బయటపడతారు. - నామాల ఏసుప్రసాద్, రైతు, ర్యాలి -
నోట్ల రద్దుతో ఆలయాలకు పెరిగిన విరాళాలు
-
పన్ను వసూళ్లు రూ.8.62 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో (ఏప్రిల్-అక్టోబర్) రూ.8.62 లక్షల కోట్లుగా నమోదయ్యారుు. ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యం 16.26 లక్షల కోట్లలో ఇది సగానికన్నా అధికం కావడం గమనార్హం. ఈ కాలంలో పరోక్ష పన్ను వసూళ్లు 26.7 శాతం పెరిగి రూ.4.85 లక్షల కోట్లకు చేరారుు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 10.6 శాతం ఎగసి రూ.3.77 లక్షల కోట్లకు పెరిగారుు. ప్రత్యక్ష పన్నుల విభాగంలో కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్నులు ఉన్నారుు. ఎకై ్సజ్, సేవలు, కస్టమ్స్ సుంకాలు పరోక్ష పన్నుల్లో ఉంటారుు. -
జిల్లాకు అదనపు ‘ఉపాధి’
∙50 పని దినాలు పెంచుతూ ఆదేశాలు ∙ఇప్పటికే వలసబాట పట్టిన గ్రామీణులు ∙సాఫ్ట్వేర్ వస్తేనే పనుల కల్పన అనంతపురం టౌన్ : కరువు జిల్లాలో వలసల నివారణకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం కల్పిస్తున్న పనులతో పా టు మరో 50 దినాలను అదనంగా కల్పిస్తోంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అదనపు పనులకు సంబంధించి నూతన సాఫ్ట్వేర్ ఇంకా అందాల్సి ఉంది. వలస బాటలో గ్రామీణులు : జిల్లాలో ఈ ఏడాది కనీవినీ రీతిలో కరువు కారణంగా గ్రామీణులు వలసబాట పట్టారు. వర్షాభావం కారణంగా ఖరీఫ్లో 6 లక్షల హె క్టార్లకు పైగా వేరుశనగ దెబ్బతింది. రబీలోనూ 1.50 లక్షల హెక్టార్లలో సాగులోకి రావాల్సిన పంటలు కూడా పత్తాలేకుండాపోయాయి. ఫలితంగా వ్యవసాయ కూలీలు పనులులేక వలసబాట పడుతు న్నారు.కొందరు బెంగళూరు, చెన్నై ప్రాం తాలకు వలసవెళ్లిపోవడంతో కొన్ని గ్రా మాల్లో వెలవెలబోతున్నాయి. రాయదు ర్గ, కళ్యాణదుర్గం, కదిరి, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పటికే వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న జాబ్కార్డు దారులు గ్రామాల్లోఖాళీగా ఉంటున్నారు. 63 మండలాల్లో అదనపు పనులు వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 241 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. మన జిల్లా వరకు 63 మండలాలనూ కరువు మండలాలుగా పది రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ అదనపు పనులు కల్పించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు 2,48, 428 కుటుంబాలకు గాను 4,31,677 మందికి ఉపాధి పనులు కల్పించారు. 22,802 కుటుంబాలు వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ఈ కుటుంబాలకు కూడా పనిదినాలు కల్పిస్తారు. సాఫ్ట్వేర్ వస్తేనే పనులు ఈ ఏడాది ఇప్పటికే కోటి 26 లక్షలకు పై గా పనిదినాలు క ల్పించాం. కరువు మండలాలుగా ప్రకటించడంతో 50 పని దినాలను అదనంగా ఇవ్వాలని సర్క్యులర్ వచ్చింది. సాఫ్ట్వేర్ రాగానే పనులు కల్పిస్తాం. ప నులు కావాల్సిన వారు అధికారులను సంప్రదించొచ్చు. – నాగభూషణం, డ్వామా పీడీ -
మ్యాక్బుక్ ధర భారీగా పెంచిన ఆపిల్
బ్రెగ్జిట్ కారణంతో తమ ఉత్పత్తుల ధరలను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించిన ఆపిల్, భారత్లోనూ మ్యాక్ బుక్ ధరలను పెద్ద ఎత్తున పెంచేసింది. మ్యాక్బుక్ ధరలపై ఏకంగా రూ.10వేలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. గతవారమే ఈ ధరలు ఎగిసినప్పటికీ, ప్రస్తుతమే ఆపిల్ ఇండియా వెబ్సైట్లో ఈ కొత్త ధరలు ప్రతిబింబిస్తూ అప్డేట్ అయ్యాయి. దీంతో దేశీయంగా మ్యాక్బుక్ మరింత ఖరీదైనదిగా మారింది. రెండు మ్యాక్ బుక్ మోడల్స్ ధరలను భారీగా ఆపిల్ పెంచింది. వాటిలో ఒకటి 12 అంగుళాల మ్యాక్ బుక్ ధర రూ.6,000ల వరకు పెరిగి ప్రస్తుతం రూ.1,12,900ల నుంచి ప్రారంభమవుతోంది. ఫాస్టర్ ప్రాసెసర్, డబుల్ ఎస్ఎస్డీ స్టోరేజ్ కలిగిన మ్యాక్బుక్ వేరియంట్, రూ.10వేలు ఎగిసి, రూ.139,900గా నమోదవుతోంది. రోజ్ గోల్డ్, స్పేస్ గ్రే, గోల్డ్, సిల్వర్ వేరియంట్లలో మ్యాక్బుక్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఆఫర్ చేసే వాటిల్లో మ్యాక్బుకే చిన్న పోర్టబుల్ ల్యాప్టాప్. ఆశ్చర్యకరవిషయమేమిటంటే మ్యాక్బుక్ ధరలను ఏకంగా రూ.10వేలు పెంచిన ఆపిల్, ఇతర మ్యాక్ డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటికే అంతర్జాతీయం ఆపిల్ ఉత్పత్తుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్, స్థానిక దిగుమతి చట్టాలు, వ్యాపార పద్దతులు, పన్నులు, వ్యాపార ఖర్చులు వంటి ప్రభావంతో అంతర్జాతీయంగా ఆపిల్ ఉత్పత్తుల ధరలు పెంచినట్టు కంపెనీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో చెప్పారు. అయితే అమెరికా రిటైల్ మార్కెట్లో మాత్రం ఆపిల్ ఉత్పత్తుల ధరలను ఎలాంటి మార్పులు చేయలేదు. -
చైనా ఉత్పత్తుల నిషేధానికి పెరుగుతున్న మద్ధతు
-
మరో సబర్మతిలా మానేర్ తీరం
-
ధరలు పెంచేసిన టాటా మెటార్స్
ముంబై: ఆటో మేజర్ టాటా మోటార్స్ వాహనాల ధరలను పెంచేసింది. ప్యాసింజర్ వాహనాల ధరలను దాదాపు రూ.12వేల వరకు పెంచింది. ఉత్పాదక వ్యయం పెరిగిన కారణంగా తమ వివిధ మోడళ్ల కార్ల ధరలను పెంచినట్టు టాటా మోటార్స్ బిజినెస్ డైరెక్టర్ మయాంక్ పరీక్ మీడియాకు తెలిపారు. ప్యాసింజర్ వాహనాలు ధరలను రూ. 5,000 నుంచి రూ12 వేల మధ్య పెంచుతున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉక్కు ,జింక్ లాంటి ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయని చెప్పారు. టాటా మోటార్స్ ఎంట్రీ లెవల్ చిన్న కారు నానో, కొత్తగా విడుదలైన హ్యాచ్ బ్యాక్ టియాగో, ఎరియా, సహా ప్యాసింజర్ వాహనాలను విక్రయిస్తుంది. వీటి ధరలు సుమారు రూ 2.15 లక్షలనుంచి 16.3 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉన్నాయి. కాగా మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నెల నుంచి1 శాతం వరకు ధరలు పెంచగా, ఈ ఏడాది ఆగష్టు లో హ్యుందాయ్ మోటార్ ఇండియా, మారుతి సుజుకి తమ వివిధ మోడళ్ల కార్ల ధరలను రూ.20వేల వరకు పెంచిన సంగతి తెలిసిందే. , -
హృదయం.. ఎంత పదిలం..?
-
భూగర్భానికి ఊపిరి
► గత నెలలో సాధారణ వర్షపాతం కన్నా ► 32 శాతం అధికం సాక్షి, హైదరాబాద్: గత రెండేళ్లుగా ప్రతినెలా సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు కురవగా ఈ సెప్టెంబర్లో మాత్రం అనూహ్యంగా అదనపు వర్షపాతం కురిసింది. సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం 715 మిల్లీమీటర్లు కాగా ఏకంగా 943 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 32 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు భూగర్భ జలవిభాగం గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అధికంగా హైదరాబాద్లో 60 శాతం, రంగారెడ్డిలో 48, మెదక్లో 43, నిజామాబాద్లో 42, నల్లగొండలో 37, వరంగల్లో 33, మహబూబ్నగర్లో 24, కరీంనగర్లో 21 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో గణనీయంగా భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే సగటున 6.64 మీటర్ల మేర వృద్ధి ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆగస్టుతో పోలిస్తే 3.49 మీటర్లు, గతేడాదితో పోలిస్తే 2.76 మీటర్ల మేర భూగర్భ మట్టాలు పెరిగాయి. మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి ,నల్లగొండ, హైదరాబాద్లో ఆశాజనకంగా భూగర్భజలాలు పెరిగాయి. మెదక్ జిల్లాలో 8.92 మీటర్లు, హైదరాబాద్లో 4.19 మీటర్లు, నల్లగొండ జిల్లాలో 5.57 మీటర్ల చొప్పున భూగర్భ జల మట్టాలు పెరిగాయి. ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం 0.91 మీటర్ల జలమట్టం తగ్గిపోయింది. రాష్ట్రంలో 65 మండలాల్లో 2 మీటర్లలోనే భూగర్భ జలాలుండగా, 70 మండలాల్లో 2 నుంచి 5 మీటర్లలో నీటి లభ్యత ఉంది. 95 మండలాల్లో 5 నుంచి 10 మీటర్లలోపు, 113 మండలాల్లో 10 నుంచి 20 మీటర్లలోపు, 56 మండలాల్లో 20 మీటర్ల కింద జలాలున్నాయి. ఇందులో మెదక్లో 15, మహబూబ్నగర్లో 14, నల్లగొండలో 11, నిజామాబాద్లో 7 మండలాలు ఉన్నాయి. -
పైకొచ్చిన పాతాళ గంగమ్మ
మోర్తాడ్ : కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భూగర్భ జల మట్టం గణనీయంగా అభివృద్ధి చెందింది. భూగర్భ జలాలు పైకి రావడంతో.. ఎత్తిపోయిన బోరుబావుల్లోకీ నీరువచ్చింది. కొన్ని బోరుబావుల్లోంచి నీరు దానికదే పైకి వస్తుండడంతో విద్యుత్ అవసరం కూడా తప్పింది. భూగర్భ జలవనరుల శాఖ శాస్త్రవేత్తలు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఫీజో మీటర్ల నుంచి సేకరించిన నీటి మట్టం వివరాలను పరిశీలిస్తే గతంలో కంటే తక్కువ లోతుకు నీటి మట్టం చేరిందని స్పష్టం అవుతోంది. మూడేళ్ల తర్వాత జిల్లాలో నీటి మట్టం సాధారణ స్థితికి వచ్చిందని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మేలో జిల్లా సగటు నీటి మట్టం 21.06 మీటర్లు ఉండగా ఇప్పుడు 13.01 మీటర్లకు చేరింది. గతేడాది తక్కువ వర్షపాతం నమోదు కావడంతో సెప్టెంబర్ 2015లో నీటి మట్టం 16.12 మీటర్ల లోతులో ఉంది. భూగర్భ జలవనరుల శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం 15 మీటర్లకంటే ఎక్కువ లోతులో నీరు ఉంటే ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నట్లు.. రెండేళ్ల పాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జల మట్టం జిల్లాలో 15 మీటర్ల నుంచి 40 మీటర్ల లోతుకు వెళ్లింది. దీంతో చాలా బోరుబావులు ఎత్తిపోయాయి. చాలాచోట్ల వెయ్యి ఫీట్లకుపైగా లోతుకు బోరు తవ్వించినా ఫలితం లేకపోయింది. సెప్టెంబర్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురియడంతో పరిస్థితి మారింది. ఈ సీజన్లో జిల్లా సాధారణ వర్షపాతం 826 మిల్లీమీటర్లు కాగా.. 1,059 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అంటే 233 మిల్లీ మీటర్ల వర్షపాతం ఎక్కువ నమోదు అయ్యింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో భూగర్భ జల మట్టం సాధారణ స్థితికి చేరుకోలేదు. ఆ ప్రాంతాలలో నీటి పొరల మధ్య దూరం ఎక్కువ ఉండడం వల్ల నీటి మట్టం సాధారణ స్థితికి చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుందని భూగర్భ జల శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లో మేలో నీటి మట్టం 21.32 మీటర్ల లోతులో నమోదు అయ్యింది. ఇప్పుడు 10.23 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలున్నాయి. బోధన్ డివిజన్లో మేలో 16.56 మీటర్ల లోతులో నీరుండగా ఇప్పుడు 11.12 మీటర్ల లోతులో ఉంది. కామారెడ్డి డివిజన్లో మేలో 24.34 మీటర్ల లోతులో నీరుండగా ఇప్పుడు 17.85 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు వచ్చాయి. జిల్లాలోని నిజామాబాద్, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో నీటి మట్టం సాధారణ స్థితికి చేరుకున్నా కామారెడ్డి ప్రాంతంలో మాత్రం ఇంకా పరిస్థితి మెరుగుపడాల్సి ఉంది. భూగర్భ జలవనరులు వృద్ధి చెందడానికి తగిన ఏర్పాట్లు లేక పోవడంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయినా కామారెడ్డి ప్రాంతంలో మాత్రం భూగర్భ జలాలు ఇంకా లోతులోనే ఉండిపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేసి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని ఫీజో మీటర్ల వారీగా నీటి మట్టం వివరాలు ఇలా ఉన్నాయి. ఫీజో మీటరు కేంద్రం నీటి మట్టం లోతు(మీటర్లలో) పుల్కల్ 1.06 నస్రూల్లాబాద్ 1.09 అర్సపల్లి 1.24 నూత్పల్లి 1.63 ఎర్రాపహాడ్ 2.07 గన్నారం 4.36 బోధన్ 4.4 బాన్సువాడ 5.18 మంచిప్ప 5.41 జుక్కల్ 6.41 పెద్దవాల్గోట్ 6.62 పెర్కిట్ 7.09 అంక్సాపూర్ 7.35 అయిలాపూర్ 8.12 చౌట్పల్లి 9.0 వెల్మల్ 9.45 భవానీపేట్ 10.04 అర్గొండ 10.1 వర్ని 10.17 జక్రాన్పల్లి 10.45 మహమ్మద్నగర్ 11.65 సదాశివనగర్ 12.2 యానంపల్లి 12.86 ముప్కాల్ 12.91 రెడ్డిపేట్ 13.21 మీనూర్ 13.5 రామడుగు 13.75 మదన్పల్లి 13.92 నర్సన్నపల్లి 15.1 మాచారెడ్డి 16.24 మాల్తుమ్మెద 17.18 రాయ్కూర్ 17.45 భీమ్గల్ 18.5 ఎడపల్లి 19.11 మోర్తాడ్ 20.51 దూపల్లి 21.4 గాంధారి 22.0 భిక్కనూరు 22.23 కోటగిరి 22.32 అడ్లూర్ 22.35 సర్వాపూర్ 22.73 వేల్పూర్ 22.86 పెద్దమల్లారెడ్డి 23.21 బీబీపేట్ 26.95 దోమకొండ 29.19 -
దసరా పేరుతో భక్తుల దోపీడీకి రంగం సిద్ధం
-
రాకెట్లా పాకెట్ మనీ
20 ఏళ్ల క్రితం.. ‘అమ్మా ఇరవై రూపాయలుంటే ఇస్తావా... ఫ్రెండ్స్ సినిమాకెళ్దామంటున్నారు’ పదేళ్ల క్రితం..‘మమ్మీ.. నాకో హండ్రెడ్ రూపీస్ కావాలి. ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్కు వెళ్లాలి’ ఇప్పుడు.. ‘మామ్.. నెలకో ఫైవ్ థౌజెండ్ కావాల్సిందే. లేదంటే కుదరదు’.. రెండేళ్ల క్రితం అసోచామ్నిర్వహించిన సర్వేలో.. యూత్ పాకెట్ మనీ నెలకు రూ.3,600 నుంచి రూ.12,000 వరకు ఉంది.ప్రస్తుతం అది రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు పెరిగినట్లు అంచనా. నేటి యువతరం పాకెట్మనీ డిమాండ్లు.. రాకెట్లా దూసుకెళ్తున్నాయి. పాకెట్మనీ రూ.10, రూ.100 నుంచి ఇప్పుడు వేల రూపాయలకు చేరుకుంది. కొంతమందిపేరెంట్స్ తమ బిడ్డలు బాగా చదవాలని అడిగినంత ఇస్తున్నారు.. మరికొందరుపిల్లల పాకెట్ మనీ డిమాండ్స్తో బేజారవుతున్నారు. ఇష్టంగా ఇచ్చినా, కష్టంగా ఇచ్చినా.. పాకెట్ మనీ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే.. మరి ఈ డబ్బుతో నేటి యువత ఏం చేస్తోంది? పర్యవసానాలు ఏంటి? అసలు ఈ పాకెట్ మనీ సంస్కృతి పెరగడానికి కారణాలేంటి? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? తదితర అంశాలపై విశ్లేషణ.. లేనిపోని గొప్పల కోసం.. పాకెట్ మనీ కోసం యువత వేల రూపాయలు డిమాండ్ చేసే పరిస్థితులకు ఒక కారణం లేనిపోని గొప్పలకు పోవడం. ముఖ్యంగా అర్బన్, సిటీ ప్రాంతాల్లో భిన్న సంస్కృతులు, నేపథ్యాలు ఉన్న పిల్లలతో కలిసి చదువుతున్న యువత.. సహచరుల ముందు గొప్పల కోసం పర్సు ఎల్లప్పుడూ ఫుల్గా ఉండాలని ఆతృత పడుతోంది. నలుగురు స్నేహితులు కలిసి కాఫీ తాగినప్పుడో, క్యాంటీన్లో తిన్నప్పుడో ‘బిల్’ చెల్లించే విషయంలో తాము ముందుంటే నలుగురిలో తమకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందనే భానవతో వ్యవహరిస్తోంది. ఆచితూచి ఖర్చుచేసే వారి గురించి హేళనగా మాట్లాడే పరిస్థితులు సైతం యువతపై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని సందర్భాల్లో తమ వ్యక్తిగత నేపథ్యాన్ని కూడా మరచి యువత ఖర్చు పెడుతోంది. ఇందుకోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తోంది. రెండేళ్ల క్రితం అసోచామ్ నిర్వహించిన సర్వేలో.. యూత్ పాకెట్ మనీ నెలకు రూ.3,600 నుంచి రూ.12,000 వరకు ఉంది. ప్రస్తుతం అది రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు పెరిగినట్లు అంచనా. ఈట్ అవుట్స్.. గ్యాడ్జెట్స్ పేరెంట్స్ నుంచి పిండి తీసుకుంటున్న పాకెట్ మనీలో ఈట్-ఔట్స్, కొత్త కొత్త గ్యాడ్జెట్స్కు యువత ఎక్కువగా ఖర్చు చేస్తోంది. పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీలో 50 శాతానికి పైగా గాడ్జెట్స్ కోసం వెచ్చిస్తున్నారు. మరో 25 శాతం సినిమాలు, షికార్లకు; 20 శాతం రెస్టారెంట్స్, న్యూ ఫ్యాషన్ అపరెల్స్ కొనడానికి వినియోగిస్తున్నారు. యువతలో సగటున 40 శాతం మంది ఏడు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో కొత్త ఫోన్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా కొందరు విద్యార్థులు క్లాస్లకు బంక్ కొట్టి కాఫీ క్లబ్స్లో చాటింగ్స్కు, మల్టీప్లెక్స్లలో సినిమాలు చూసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. తమ ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేసే తరగతులకు గైర్హాజరవుతున్నారు. తల్లిదండ్రుల పాత్ర యువత ఈ స్థాయిలో డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్న విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని చెప్పొచ్చు. ఈ కోణంలో తల్లిదండ్రులను రెండు వర్గాలుగా విభజించొచ్చు.‘తాము కష్ట పడేది పిల్లల కోసమే కదా.. వారు కోరింది ఇవ్వకపోతే ఎలా?’ అనుకునేది ఒక వర్గం. కాగా ‘పిల్లలు కనీసం ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోలేని బిజీ షెడ్యూల్స్’ ఇంకొక వర్గానిది. వీరిలో అధిక శాతం మంది హై ప్రొఫైల్స్ ఉన్నవారు, లేదా ఇద్దరూ ఉద్యోగస్తులు ఉంటున్నారు. తల్లిదండ్రులు ఎంత బిజీ షెడ్యూల్స్తో ఉన్నా కొంత సమయాన్ని తమ పిల్లల కెరీర్ దిశగా ఆలోచించేందుకు కేటాయించాలంటున్నారు నిపుణులు. అలాగే పిల్లలకు ఇస్తున్న పాకెట్ మనీ, కల్పిస్తున్న సదుపాయాలను వారు ఏ విధంగా వినియోగిస్తున్నారో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా టీనేజ్ యువత విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపకపోతే.. అది వారి భవిష్యత్తుకు చేటు తెస్తుందని వివిధ సర్వేలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ముఖ్యంగా పిల్లలను హాస్టల్లో ఉంచి చదివిస్తున్న తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలి. డబ్బులు దేనికోసం అడుగుతున్నారో తెలుసుకోవాలి. నేరుగా పాకెట్ మనీ చేతికి ఇవ్వకుండా.. బ్యాంక్లో డిపాజిట్ చేయడం, ట్రాన్షాక్షన్స్ వివరాలు మెసేజ్ రూపంలో తమ ఫోన్కు వచ్చే విధంగా చేస్తే పిల్లల్లో జవాబుదారీతనం ఏర్పడుతుందని, క్రమశిక్షణ అలవడుతుందని విశ్లేషకులు అంటున్నారు. బాధ్యత తెలుసుకొని.. ప్రస్తుతం చదువు విలువపై అందరిలో అవగాహన పెరిగిన నేపథ్యంలో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోకుండా భారీ స్థాయిలో పాకెట్ మనీ డిమాండ్ చేస్తూ యువత తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదని నిపుణులు అంటున్నారు. అవసరమైతే ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ తమ తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని, వారి బాధ్యతలను పంచుకోవాలని సూచిస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ తల్లిదండ్రులు చిన్నతనం నుంచే తమ పిల్లలకు ఆర్థిక క్రమ శిక్ష నేర్పించాలి. దేనికి ఎంత అవసరమో? దేనికి ఎంత ప్రాధాన్యమివ్వాలో? తెలియజేయాలి. ముఖ్యంగా టీనేజ్ యువత అంతా తమకు తెలుసు అనే ధోరణిలో ప్రవర్తిస్తుంది. అలాంటప్పుడు.. వారితో పేరెంట్స్ ఫ్రెండ్స్లా వ్యవహరించాలి. వాస్తవ పరిస్థితులు అర్థమయ్యేలా వివరించాలి. పొదుపు అవసరాన్ని తెలియజెప్పాలి. అవసరమైన వాటికే.. పాకెట్ మనీని అవసరమైన వాటికే వెచ్చించేలా యువత వ్యవహరించాలి. డబ్బును అనవసరంగా వృథా చేయకుండా నియంత్రించుకోవాలి. కొంత మొత్తాన్ని చదువుకునేందుకు అవసరమైన పుస్తకాలు లేదా ఇతర స్ఫూర్తిదాయక పుస్తకాలు కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్తో పిక్నిక్స్, సినిమాలకు వెచ్చించే బదులు స్టడీ టూర్స్కు కేటాయిస్తే ఆహ్లాదంతో పాటు కొత్త నైపుణ్యాలు లభిస్తాయి. -
సర్కారు దవాఖానాలపై నమ్మకం ఏర్పడింది
బీబీనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తుండడంతో ప్రజలకు సర్కారీ దవాఖానాలపై నమ్మకం పెరిగిందని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బీబీనగర్లోని నిమ్స్ యూనివర్సిటీ భవనంలోని ఎమర్జెన్సీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల్లో కొనసాగుతున్న నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఒక సంవత్సరకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మం ది రోగులు వైద్యం చేయించుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక సేవలు అందించేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రసు ్తతం నిమ్స్లో కొనసాగుతున్న ఐదు వి భాగాల వైద్య సేవలతో పాటు డిసెంబర్లోపు మరో మూడు విభాగాలకు చెందిన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చి ఇన్ పెషెంట్ను ప్రారంభించేలా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రయల్ రన్ను నిర్వహించిన మంత్రి మిషన్ భగీరథలో భాగంగా బీబీనగర్ రైల్వే గేట్ సమీపంలోని ఏర్పాటు చేసిన ట్యాంక్కు గోదావరి జలాలు చేరుకున్నాయి. అయితే బుధవారం బీబీనగర్కు వచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి జలాల ట్రయల్ రన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ము ఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరును అంది స్తున్నారని అన్నారు. ఆయన వెంట ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్రెడ్డి, జడ్పీటీసీ బస్వయ్య, సర్పంచ్లు స్వరుపారాణి, ఇస్తారి, అంజయ్య, ఎంపీటీసీలు లింగయ్యగౌడ్, వెంకటేశ్గౌడ్, మన్నె బాల్రాజు, చంద్రశేఖర్, రవి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎరుకల సుధాకర్గౌడ్, గాదె నరేందర్రెడ్డి, వెంకటకిషన్, అమరేందర్, మండల నాయకులు అశోక్, రాములు పాల్గొన్నారు. ప్రతి పక్షాలు రాద్ధాంతాలు చేస్తున్నాయి... నిమ్స్ను ఎయిమ్స్గా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాదనలు పంపినప్పటికీ ప్రతి పక్షాలు కావాలనే రాద్ధాం తాలు చేస్తున్నాయని మంత్రి అన్నారు. ఎయిమ్స్ కోసం కేం ద్రానికి ప్రతి పాదనలు పం పగా వచ్చే బడ్జెట్లో పెడతామని కేంద్ర మంత్రి వివరణ కూడా ఇచ్చారని ఆయ న తెలిపారు. ఇవేవి తెలుసుకోకుండా ప్ర తిపక్ష నాయకులు అర్థంలేని మాటా లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. -
హెచ్చెల్సీలో పెరిగిన నీటి ఉధృతి
ఉరవకొండ : మండలంలోని మోపిడి గ్రామం వద్ద ఉన్న లింక్ చానల్ నుంచి పెన్నహోబిళం బ్యాలె న్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్) కు 1150 క్యూసెక్కులు, మిడ్ పెన్నార్ డ్యాంకు 400 క్యూసెక్కుల నీటిని అధికారులు మళ్ళించారు. గత వారం రోజుల నుంచి కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర ఎగువ కాలువకు నీటి ఉధృతి పెరిగింది. నింబగల్లు హెడ్ రెగ్యులేటర్ వద్ద హెచ్చెల్సీ నీటి ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతుండటంతో అధికారులు నీటిని ఎక్కువ శాతం జలాశయాలకు మళ్లిస్తున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య
చిలుకూరు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యాశాఖ చేపట్టిన చర్యలు కొంతమేరకు సత్పలితాలను ఇచ్చాయి. ఈ విద్యా సంవత్సరం పలు సర్కార్ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ఆంగ్ల మాద్యమం బాగానే కలిసొచ్చింది. గత ఏడాదితో చూస్తే ఈసారి 10 నుంచి 15 శాతం విద్యార్థుల సంఖ్య పెరిగింది. చిలుకూరు గతంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సంఖ్య విపరీతంగా ఉండేది. కానీ, గత కొన్నేళ్లుగా వివిధ కారణాల వల్ల ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీంతో గత ప్రభుత్వం సర్కార్ స్కూళ్ల బలోపేతానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సక్సెస్ స్కూళ్లను తీసుకువచ్చింది. కానీ వాటిని పకడ్బందీగా నిర్వహించకపోవడంతో ఆశించిన ఫలితం కనిపించలేదు. విద్యార్థుల లేమితో ఒకానొక దశలో జిల్లాలోని పలు స్కూళ్లను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేల్కొన్న విద్యాశాఖ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. అం దులో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిబాట, తదితర కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల గురించి, వాటిలో కల్పిస్తున్న వసతుల గురించి ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి విస్త్రృత ప్రచారం నిర్వహించారు. ఇంగ్లిష్ మీడియం లేకపోవడం వల్లే ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపడం లేదని, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే స్థానికంగానే చదివిస్తామని మెజార్టీ అభిప్రాయాలు వ్యక్తం కావడంతో విద్యాశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చి పలు చోట్ల ఆ మేరకు అమలు చేస్తుండడంతో ఈ విద్యాసంవత్సరం పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 610 జిల్లా పరిషత్, 310 ప్రాథమికోన్నత, 2900 ప్రాథమిక, 88 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా ఈ విద్యా సంవత్సరం చాలా వరకు పాఠశాలలు విద్యార్థులతో కలకలలాడుతున్నాయి. చిలుకూరు మండలంలో ఇలా.. చిలుకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఈసా రి 50 మంది కొత్తగా చేరారు. అలాగే మండలంలోని బేతవోలు, జెర్రిపోతులగూడెం, కొండాపురం, నారాయణపురం, రామాపురం జిల్లా పరిషత్ స్కూళ్లలో, ఆర్లెగూడెం ప్రాథమికోన్నత, చిలుకూరు కేంద్ర ప్రాథమిక పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య గణనీయంగానే పెరిగింది. ముఖ్యంగా జిల్లా పరిషత్ స్కూళ్లలో 10 నుంచి 15 శాతం పెరిగింది. ఇవి కూడా కారణాలే.. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు కరువు, ప్రైవేట్ స్కూళ్లలో వసూలు చేస్తున్న విపరీతమైన ఫీజులు, డొనేషన్లు కూడా తోడయ్యాయి. ప్రైవేట్ స్కూళ్లలో వేలవేలకు ఫీజు వసూలు చేస్తుండడంతో చాలా మందికి చెల్లించే స్థోమత లేక ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించినట్లు తెలుస్తోంది.