‘గల్వాన్‌’పై అజయ్‌ దేవగన్‌ సినిమా | Ajay Devgn Announces His New Film On Galwan Valley Clash | Sakshi
Sakshi News home page

‘గల్వాన్‌’పై అజయ్‌ దేవగన్‌ సినిమా

Jul 4 2020 12:16 PM | Updated on Jul 4 2020 12:52 PM

Ajay Devgn Announces His New Film On Galwan Valley Clash - Sakshi

ముంబై: గల్వాన్‌ వ్యాలీ ఘటన ఆధారంగా సినిమా రూపొందించనున్నట్లు బాలీవుడ్‌ హీరో-నిర్మాత అజయ్‌ దేవగన్ వెల్లడించాడు. జూన్‌15న లడక్‌లోని గాల్వన్‌‌ వ్యాలీ వద్ద చైనా అర్మీ, భారత సైన్యంపై జరిపిన దాడిలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆధారంగా అజయ్‌ దేవగన్‌ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఇందులో అజయ్‌ నటిస్తారా లేదా అనేది స్ఫష్టత లేదు. కానీ ఇప్పటికే ఈ చిత్రం కోసం తారాగణాన్ని ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. అజయ్‌ దేవగన్‌ ఫిల్మ్స్‌, సెలెక్ట్‌ మీడియా హైల్డింగ్‌ ఎల్‌ఎల్‌పీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. (వినూత్నంగా వర్మ 12'0' క్లాక్‌ ట్రైలర్‌)

ఇప్పటికే అజయ్‌ దేవగన్ ప్రధాన పాత్రలో‌ 1975లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా పీపుల్స్‌ ఆర్మీ, భారత సైన్యంపై జరిపిన మెరుపుదాడిలో భారత సైన్యం మొట్టమొదటి సారిగా ఎదుర్కొన్న ప్రాణనష్టం ఆధారంగా ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టులో ఓటీటీలో ప్లాట్‌ఫ్లాంలో విడుదల కానుంది. అభిషేక్‌ దుధయ్య రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్‌ దత్‌, సోనాక్షి సిన్హా, అమ్మి విర్క్‌, శరద్‌ కేల్కర్, రానా, దక్షిణాది భామ ప్రణతిలు ప్రధాన పాత్రల్లో నటించారు.  (దేశీ టచ్‌తో విదేశీ కథలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement