Galwan Valley
-
మోదీ, జిన్పింగ్ భేటీ సఫలం.. భారత బోర్డర్లో కీలక పరిణామం
ఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పు లడఖ్ ప్రాంతం నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇటీవల బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాల్లో భాగంగానే బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు స్పష్టం చేసింది.రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా భారత్, చైనా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా రెండు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైందని భారత రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు లఢఖ్ సెక్టార్లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు అధికారులు చెప్పారు.అలాగే, ఈ ప్రాంతంలోని సైనిక సామగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. లడఖ్ నుంచి పశ్చిమ దిశగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఎల్ఏసీ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల బలగాలు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. రెండు దేశాల బలగాలు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మరికొన్ని రోజుల్లోనే డెస్పాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ను మళ్లీ ప్రారంభించనున్నట్టు సమాచారం.Disengagement of troops of India and China has started at two friction points in Demchok and Depsang Plains in Eastern Ladakh sector. As per the agreements between the two sides, the Indian troops have started pulling back equipment to rear locations in the respective areas:… pic.twitter.com/CzwAZs4sJG— ANI (@ANI) October 25, 2024ఇదిలా ఉండగా.. తూర్పు లడఖ్లోని గాల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ సందర్బంగా భారత్కు చెందిన 20 మంది జవాన్లు వీర మరణం పొందారు. ఇదే సమయంలో చైనా కూడా తన సైన్యాన్ని కోల్పోయింది. దీంతో, నాటి నుంచి ఎల్ఏసీ వెంబడి రెండు దేశాల బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి. అయితే, గాల్వాన్ దాడిలోనే తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. -
China: గల్వాన్ ఘటన తర్వాత మరిన్ని..?
ఢిల్లీ: గల్వాన్ ఉద్రిక్తతల తర్వాత.. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్-చైనా సైనిక దళాల మళ్లీ ఘర్షణలు జరిగాయి. కనీసం మరో రెండుసార్లు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజాగా.. భారత సైనిక పశ్చిమ దళం ఆధ్వర్యంలో సైనికులకు సాహస పురస్కారాల ప్రదాన కార్యక్రమం కారణంగా ఈ విషయం బయటపడింది. వారికి ఎందుకు ఈ పురస్కారాలు ఇస్తున్నదీ చెప్పే పత్రాల వల్ల విషయం బయటకు వచ్చింది. ఇక ఈ నెల 13న జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చాందీమందిర్లో ఉన్న ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ ప్రధాన కార్యాలయం యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసింది. అయితే.. సోమవారం ఆ చానెల్ డీయాక్టివేట్ కావడం గమనార్హం. దీనిపై సైన్యం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ, 2021 సెప్టెంబరు- 2022 నవంబరు మధ్య చైనాతో ఘర్షణలు జరిగినట్లు పత్రాల్లో ఉంది. అయితే రెండుసార్లే ఘర్షణలు జరిగాయా? మరిన్ని జరిగాయా? అనేదానిపైనా సైన్యం స్పందించాల్సి ఉంది. మే 2020లో తూర్పు లడఖ్ సరిహద్దు వరుస వివాదం తర్వాత.. వాస్తవాధీన రేక వెంట భారత్, చైనా దళాల మధ్య అనేక వాగ్వివాదాలు జరిగాయి. ఆ మరుసటి నెలలోనే గల్వాన్ లోయలో ఘర్షణలు జరగ్గా.. ఇరువైపులా గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి తర్వాత 3,488 కి.మీ. ఎల్ఏసీ వెంట భారత సైన్యం ప్రత్యేక అప్రమత్తతతో ఉంటోంది. తవాంగ్ సెక్టార్లో కూడా చైనా దళాలు అతిక్రమించడానికి ప్రయత్నించాయని.. చైనా ప్రయత్నాలన్నింటిని భారత సైనికులు దృఢంగా ఎదుర్కొన్నారని పార్లమెంట్లో ఆ సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటన చేశారు కూడా. -
భారత – చైనా బంధం బలపడేనా?
సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే! అయితే గల్వాన్ ఘర్షణలు చైనా ప్రణాళికాబద్ధంగా జరిపినవన్న భారత్ అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్కు కచ్చితమైన ఆలోచన ఉంది. ఎల్ఏసీ గురించి సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. వార్షిక వరల్డ్ పీస్ ఫోరమ్లో పాల్గొనడానికి నేను ఈ నెల ప్రారంభంలో బీజింగ్లో ఉన్నాను. ఆ సమావేశంలోనే అదనంగా భారత్–చైనా సరిహద్దు సమస్యపై ఒక ఆంతరంగిక చర్చ జరిగింది. దీనికి పలువురు చైనా విద్వాంసులు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ చైనా అధికారులు కొందరితో సంభాషణకు కూడా వీలు కలిగింది. ఇవి భారత్–చైనా సంబంధాలకు సంబంధించిన అవకాశాల గురించి చైనా అవగాహన విష యంలో ఒక కొత్త గవాక్షాన్ని అందించాయి. సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే. చైనీయుల ప్రకారం, సరిహద్దు పరిస్థితి ‘స్థిరీకరించబడింది’. ఘర్షణకు సంబంధించిన కొన్ని అంశాలను పరిష్కరించడంలో పురోగతి సాధించామనీ, అయితే మరికొన్ని మిగిలి ఉన్నా యనీ భారతదేశం గుర్తిస్తోంది. 2020 జూన్లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు ముందు ఉన్న యథాతథ స్థితికి తిరిగి రావడానికి చైనా సుముఖంగా ఉన్నట్లు ఎవరూ భావించడం లేదు. భారత–చైనా సరిహద్దు ప్రశ్న (2005) పరిష్కారానికిగానూ రాజకీయ పారామితులు, మార్గదర్శక సూత్రంతో సహా – వాస్తవాధీన రేఖను (ఎల్ఏసీ) స్పష్టం చేయడం కోసం ఉమ్మడి కసరత్తును చేపట్టేందుకు – అనేక శాంతి భద్రతల ఒప్పందాలను ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ, చైనీయులు అలా చేయడానికి నిరాకరించారు. భూభా గాన్ని ‘కొద్దికొద్దిగా కొరుక్కు తింటూ’ చైనాను భారతదేశం దూరంగా నెడుతోందని ఒక ఆరోపణ వచ్చినప్పుడు, భారత్ చేపట్టడానికి సిద్ధంగా ఉన్న ఎల్ఏసీ స్పష్టీకరణ ద్వారా అటువంటి కబళింపును కచ్చి తంగా నిరోధించవచ్చని ఎత్తి చూపడం ద్వారా ఒకరు దీనిని ప్రతిఘటించారు. దీనికి సమాధానం ఏమిటంటే, 2004లో జరిగిన సమా వేశంలో ఈ కసరత్తు ప్రారంభమైనప్పుడు, చైనా ప్రాదేశిక క్లెయిమ్లను బలహీనపర్చగల ‘అతిశయోక్తి’ క్లెయిమ్లను భారతదేశం పశ్చిమ సెక్టార్లో ముందుకు తెచ్చింది. ఎల్ఏసీని సరిగా స్పష్టం చేయకపోవడం వల్ల భారత్ అధీనంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి సందిగ్ధతలను ప్రదర్శించగల వీలు చైనాకు కలుగుతుంది. అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్కు కచ్చితమైన ఆలోచన ఉంది. కొన్ని అంశాల్లో ఎల్ఏసీకి సంబంధించి ‘భిన్నమైన అవగాహనలు’ ఉన్నాయని మనం చెప్పు కోకూడదు. భారత్ పేర్కొన్నట్లుగా ఎల్ఏసీపై పోటీ పడటంలో చైనా పక్షానికి కొంత సమర్థన ఉందని ఇది పరోక్షంగా అంగీకరిస్తుంది. ఎల్ఏసీ అమరికలో మనం పరిగణించే వాటిపై చైనీస్ పక్షాన్ని పోటీ పడనివ్వండి. ఎల్ఏసీ ఎక్కడ ఉందనే దాని గురించి మనకు సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. మొత్తంమీద, సరిహద్దు వద్ద ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉంది. అయితే రెండు వైపులా భారీ సైన్యాన్ని మోహరించే అవకాశం లేదు. ఎల్ఏసీ వైపు చైనా నిర్మించిన తాజా శాశ్వత, పాక్షిక–శాశ్వత నిర్మాణాలను కూల్చి వేయడం, తొలగించడం కూడా అసంభవం. భారత్ అలవర్చుకోవా ల్సిన మెరుగైన సామర్థ్యానికి ఇవి సూచికలా పనిచేస్తాయి. భవిష్యత్లో ఏం జరగవచ్చో సూచించే రెండు ఘటనలు కూడా ఉన్నాయి. సరిహద్దు సమస్యపై తరచూ వ్యాఖ్యానించే చైనా మాజీ పీఎల్ఏ అధికారి ఒకరు, గల్వాన్ ఘర్షణలు చైనా బలగాలు ముంద స్తుగా, ప్రణాళికాబద్ధంగా జరిపిన ఆపరేషన్ అని భారత్ భావిస్తున్న అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ నాతో అన్నారు. నేను ఇంతకు ముందు ఇది వినలేదు. పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? ప్రస్తుతం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కమిషన్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ ఆఫీస్ డైరెక్టర్గా ఉన్న వాంగ్ యీ(జూలై 25నే తిరిగి విదేశాంగ మంత్రి అయ్యారు) ఇటీవల జకార్తాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో జరిపిన భేటీలో, ‘నిర్దిష్ట సమస్యలు మొత్తం సంబంధాన్ని నిర్వచించనివ్వకుండా, సరిహద్దు సమస్యకు ఇరు పక్షాలు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలి’ అన్నారు. ఇది చైనా వైఖరికి పునఃప్రకటన. అయితే, ‘భారత పక్షం చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకునేలా, సరిహద్దు సమస్యకు ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశిస్తున్నట్లు’ ఆయన కొనసాగించారు. ఆ ప్రాంతం చైనా సార్వభౌమ భూభాగమనీ, దానిని కాపాడు కుంటామనీ చైనా ప్రకటనలు పేర్కొంటున్నాయి కాబట్టి గల్వాన్ సంఘటన నేపథ్యంలో, ఇది సాపేక్షంగా సామరస్యపూర్వకమైన భాషగా కనిపిస్తోంది. దీంతో సంబంధాలు ‘మెరుగుపర్చుకునే’ అవ కాశం లేకుండా పోయింది. మారిన భాషను మనం అతిగా వ్యాఖ్యా నిస్తున్నామేమో! కాలమే దీన్ని తేల్చి చెబుతుంది. ప్రధాని మోదీ వాషింగ్టన్ లో ఉన్నత స్థాయి అధికారిక పర్యటన విజయవంతంగా ముగించిన తర్వాత వెంటనే బీజింగ్లో నా సంభాషణలు జరిగాయి. భారత్–అమెరికా సంబంధాల్లో పురోగతిపై చైనా ఆందోళన స్పష్టంగా కనిపించింది. చైనాను నిలువరించే అమెరికా వ్యూహంలో భారత్ భాగమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియాలో ‘నాటో’ పాత్రకు భారతదేశం మద్దతు ఇస్తుందా అనేది నాకు వారు సంధించిన ఒక ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం, నాటో అనేది యూరోపియన్ భద్రతకు సంబంధించినదనీ, ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాలతో సహా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి ఆసియా అనేక యంత్రాంగాలను కలిగి ఉందనీ నేను చెప్పాను. గ్లోబల్ సౌత్ నుండి చైనాను మినహాయించాలని భారతదేశం ప్రయత్నిస్తున్నదా అనే ఆందోళన కూడా వారిలో ఉంది. తాము గ్లోబల్ సౌత్లో భాగమా, కాదా అనేది నిర్ణయించుకోవాల్సింది చైనాయేనని నేను చెప్పాను. త్వరలో జరగనున్న జీ20 సదస్సు సన్నాహాల్లో భాగంగా, గ్లోబల్ సౌత్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు మోదీ చొరవ తీసుకోవడం చైనాను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్థికపరమైన చిక్కులను కలిగించవచ్చు కాబట్టి, చైనాకు ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ హోదాను నిరాకరించే అమెరికా ప్రయత్నాల గురించి వారు ప్రస్తావించారు. చైనా చేసిన మరొక ఫిర్యాదు ఏమిటంటే, ‘షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్’ (ఎస్సీఓ) సమావేశాన్ని భారత్ వ్యక్తిగత స్థాయిలో కాకుండా, క్లుప్తంగా ఆన్ లైన్ సదస్సును నిర్వహించడం ద్వారా దాని ‘స్థాయిని తగ్గించింది’ అని. ఇది అమెరికా ప్రభావంతో జరిగిందనే అనుమానం చైనాకు ఉంది. మొత్తంమీద, చైనా తన గురించి తాను అస్పష్టంగానే ఉందనే భావన కలుగుతుంది. అదే సమయంలో భారత్ తన ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రావీణ్యతనూ, చురుకుదనాన్నీ ప్రదర్శించిందనే అభిప్రాయం ఉంది. పెట్టుబడి, సాంకేతికత ప్రవాహానికి భారతదేశం కొత్త గమ్యస్థానంగా మారినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇది చైనా ఆర్థిక అవకాశాల గురించి గుర్తించిన ఒక నిర్దిష్ట నిరాశా వాదానికి సంబంధించినది కావచ్చు. ఇది భారతదేశం పట్ల చైనా వైఖరిలో మార్పును సూచిస్తుందా? ఇకపై సంఘటనలు ఎలా వెల్లడవుతాయో చూద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ మాజీ కార్యదర్శి,ఆనరరీ ఫెలో, సీపీఆర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రిలయన్స్తో ఒప్పందం.. భారత్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న చైనా కంపెనీ?
చైనాకు చెందిన ఫ్యాషన్ దుస్తుల దిగ్గజం షీఇన్ (Shein) భారత్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. దేశ సరిహద్దుల్లో డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు గల్వాన్ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించింది. ఆ దేశానికి చెందిన యాప్స్, సంస్థలపై నిషేధం విధించింది. వాటిలో షీఇన్ సంస్థ సైతం ఉంది. షీఇన్ ప్రపంచంలో అతి పెద్ద ఆన్లైన్ ఫ్యాషన్ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్ డాలర్లు. ఫ్యాషన్ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్సైట్, యాప్తోనే లావాదేవీలు జరుపుతుంది. అయితే, భారత్ షీఇన్ విభాగం దేశీయంగా ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుంది. ఈ ఒప్పందం తర్వాత దేశీయంగా చైనా కంపెనీ తన కార్యకలాపాల్ని పున:ప్రారంభించనుందని.. ఈ అంశంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. షీఇన్పై రీటైల్ చూపు రీటైల్ రంగంలో దూసుకెళ్తున్న రిలయన్స్ రీటైల్ భారత్ నిషేధం విధించిన షీఇన్ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. 25,000 చిన్న మరియు మధ్య తరహా స్థానిక ఉత్పత్తి దారుల నుంచి కొనుగోలు చేసి వాటిని ఆన్లైన్లో విక్రయిస్తుంది. ఈ సంస్థను దక్కించుకుంటే ఫ్యాషన్ విభాగంలో మరింత వృద్ది సాధించవచ్చని రిలయన్స్ భావించింది. అందుకే ఆ సంస్థను కొనుగోలు చేసి ప్రపంచ వ్యాప్తంగా షీఇన్ బ్రాండెడ్ ఉత్పత్తుల్ని అమ్మే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పెరగనున్న మేడ్ ఇన్ ఇండియా వస్తువుల వాటా కానీ రిలయన్స్ షిఇన్ను కొనుగోలు చేయకుండా.. ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో షీఇన్ తన ప్లాట్ఫారమ్లో మేడ్ ఇన్ ఇండియా దుస్తులు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ఒప్పందం, పున ప్రారంభం వంటి అంశాలపై ఇటు షీన్ ప్రతినిధులు, అటు రిలయన్స్ ఇతర వివరాల్ని వెల్లడించలేదు. నిషేధించబడిన యాప్లు గాల్వాన్ ఘర్షణలనేపథ్యంలో 2020లో భారత్ నిషేధించిన చైనీస్ యాప్లలో షీన్ కూడా ఒకటి. చైనాలో తన దుస్తులను విక్రయించని షీన్ 2021లో దాని ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్కు మార్చింది. షీన్ యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలకు సంబంధించిన డేటా అంతా భారత్లో స్టోర్ అవుతుంది. డేటా భద్రతా సమస్యలపై భారత ప్రభుత్వ కఠినమైన నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్ రిటైలర్ (షీఇన్)కు అందుబాటులో ఉండదు. స్టాక్ మార్కెట్తో ప్రమేయం లేనందున షీఇన్కు రిలయన్స్ సంస్థ లైసెన్స్ రుసుముల్ని చెల్లించనుంది. రిలయన్స్ రిటైల్ రిలయన్స్ రిటైల్ (Reliance Retail) బిజినెస్ కింద రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్, రిలయన్స్ ట్రెండ్స్, ప్రాజెక్ట్ ఈవ్, ట్రెండ్స్ ఫుట్వేర్, రిలయన్స్ జువెల్స్, హామ్లేస్, రిలయన్స్ బ్రాండ్స్, రిలయన్స్ కన్జ్యూమర్ బ్రాండ్స్, 7-ఇలెవన్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. చదవండి👉 ఈషా అంబానీకి సరికొత్త వెపన్ దొరికిందా? -
సైన్యాధికారిణిగా గల్వాన్ అమరుని అర్ధాంగి
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో చైనా సైన్యంతో ఘర్షణల్లో అమరుడైన భారత సైనికుడు నాయక్ దీపక్ సింగ్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సతీమణి సైతం కదనరంగంలోకి దూకారు. చెన్నై కేంద్రంగా పనిచేసే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో విజయవంతంగా ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకున్నాక 29 ఏళ్ల లెఫ్టినెంట్ రేఖా సింగ్.. ఆర్మీ ఆర్డ్నన్స్ కోర్ విభాగంలో శనివారం విధుల్లో చేరారు. తూర్పు లద్దాఖ్లో ఫ్రంట్లైన్ యూనిట్లో ఆమె కర్తవ్య దీక్షను మొదలుపెట్టారని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. ఆర్మీ మెడికల్ కోర్లో సభ్యుడైన నాయక్ దీపక్ సింగ్ ఆ తర్వాతికాలంలో బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్లో నర్సింగ్ అసిస్టెంట్గా చేరారు. 2020 జూన్లో గల్వాన్లోయలో చైనా సైనికులతో పోరాడింది ఈ బెటాలియన్ బృందమే. ఘర్షణల్లో గాయపడినా కూడా నాయక్ తోటి 30 మంది క్షతగాత్రులైన సైనికులకు అత్యవసర వైద్యసాయం చేసి అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించారని నాడు కేంద్రం శ్లాఘించింది. -
గల్వాన్ లోయలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..
న్యూఢిల్లీ: 2020 జూన్ 15. తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ. భారత్, చైనా సరిహద్దులోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–14. సరిగ్గా అక్కడే ఇరు దేశాల సైనికుల నడుమ భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. పదునైన ఆయుధాలతో చైనా జవాన్లు దాడి చేయగా, దెబ్బకు దెబ్బ అన్నట్లుగా భారత సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ కొట్లాటలో తమ జవాన్లు ఎంతమంది బలయ్యారో చైనా ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. 40 మందికిపైగానే చనిపోయి ఉంటారని అంచనా. భారత్ వైపు నుంచి దాదాపు 20 మంది చనిపోయారు. రణక్షేత్రంగా రక్తంతో తడిసిపోయిన పీపీ–14 ఇప్పుడు క్రికెట్ మైదానంగా మారింది. పటియాలా బ్రిగేడ్కు చెందిన త్రిశూల్ డివిజన్ క్రికెట్ పోటీ నిర్వహించింది. సైనికులు సరదాగా క్రికెట్ ఆడారు. పీపీ–14కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ పోటీ జరిగింది. జవాన్లు క్రికెట్ ఆడుతున్న ఫొటోలను భారత సైన్యం శుక్రవారం ట్విట్టర్లో పోస్టు చేసింది. గడ్డ కట్టించే తీవ్రమైన చలిలో పూర్తి ఉత్సాహంతో ఈ పోటీ జరిగిందని వెల్లడించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ఉద్ఘాటించింది. జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా గురువారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే గల్వాన్లో భారత సైనికులు క్రికెట్ పోటీ నిర్వహించుకోవడం విశేషం. -
గాల్వాన్ అమర జవాన్ తండ్రికి అవమానం.. ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చిన పోలీసులు
రెండేళ్ల కిత్రం గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన హింసాత్మక ఘర్షణలో అమరుడైన బిహార్ సైనికుడు జై కిషోర్ సింగ్ తండ్రికి అవమానకర ఘటన ఎదురైంది. ప్రభుత్వ స్థలంలో కొడుకు కోసం స్మారకాన్ని నిర్మించినందుకు సింగ్ తండ్రిపై బిహార్ పోలీసులు అమానుషంగా ప్రవరించారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి దూషించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అసలేం జరిగిందంటే.. వైశాలి జిల్లా జండాహాలోని కజారి బుజుర్గ్ గ్రామానికి చెందిన రాజ్ కపూర్ సింగ్ కుమారుడు జై కిషోర్ సింగ్ 2020లో గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో అమరుడయ్యాడు. గతేడాది ఫిబ్రవరిలోనే సింగ్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందు ఉన్న ప్రభుత్వ భూమిలో సైనికుడి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఆవిష్కరించే కార్యక్రమంలో అనేకమంది ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. అనంతరం గతేడాది డిసెంబర్లో దీని చుట్టూ గోడ కట్టారు. అయితే ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్మారకం ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ సోమవారం అర్థరాత్రి పోలీసులు రాజ్ కపూర్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి అతనిపై చేయిచేసుకున్నారు. అంతేగాక సింగ్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.ఇందులో పోలీసులు సైనికుడి తండ్రి రాజ్ కపూర్ సింగ్ను ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది.. అంతేగాక పోలీసులు సింగ్ను కొట్టారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్మారక స్తూపం వద్దకుచ ఏరుకొని పోలీసుల చర్యకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్మారకం ఏర్పాటు చేశారని రాజ్ కపూర్ సింగ్ ఇంటి పక్కనే ఉండే హరినాథ్ రామ్ ఫిర్యాదు చేశారని తెలిపారు. తన భూమితోపాటు ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా విగ్రహాన్ని నిర్మించారని చెబుతూ.. హరినాథ్ రామ్ ఫిర్యాదు ఆధారంగా రాజ్ కపూర్ సింగ్పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్డిపిఓ మహువా తెలిపారు. అంతేగాక సైనికుడి స్మారకం కారణంగా పొరుగువారు తమ పొలాల్లోకి వెళ్లకుండా అయ్యిందని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆర్మీలో పనిచేస్తున్న అమరవీరుడు సైనికుడి సోదరుడు నంద కిషోర్ సింగ్ మాట్లాడుతూ.. డీఎస్పీ తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లో విగ్రహాన్ని తొలగించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే గత రాత్రి జండాహా పోలీసు స్టేషన్ ఇన్చార్జి తమ ఇంటికి వచ్చి తండ్రిని అరెస్టు చేసి లాక్కెళ్లరని తెలిపారు. తండ్రిని చెంపదెబ్బ కొట్టి దుర్భాషలాడారని, పోలీస్ స్టేషన్లోనూ దాడి చేశారని ఆరోపించారు. అర్థరాత్రి ఇంటికి వచ్చి ఒక తీవ్రవాదిలా అరెస్ట్ చేశారని వాపోయారు. Galwan valley martyr’s father being dragged by @bihar_police @yadavtejashwi @NitishKumar @SpVaishali pic.twitter.com/oJjUnqtQET — Anish Singh (@anishsingh21) February 26, 2023 -
చైనా వ్యూహానికి దూకుడే విరుగుడా?
భారత, చైనా సైనికుల మధ్య తవాంగ్ ప్రాంతంలో జరిగిన ఘటన అనూహ్యమేమీ కాదు. తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించేందుకు చైనా దూకుడుగా వ్యవహరిస్తుందన్నది నిర్వివాదాంశం. చైనా దృష్టిలో ఆసియాలో తన ఆధిపత్యానికి గండికొట్టగల దేశం భారత్ మాత్రమే. అందుకే తన షరతులతోనే సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని చైనా నాయకత్వం భావిస్తోంది. అయితే భారతీయ సైనికులు కైలాశ్ పర్వత శ్రేణిలోని కీలక ప్రాంతాలను ఆక్రమించినప్పుడు మాత్రమే చర్చలు కొంతైనా ముందుకు సాగాయి. చైనా మన మాటలు వినాలంటే, మనం దానిపై ఎంతో కొంత పట్టు సాధించాలి. యాంగ్సీలోనూ చైనా దళాలు వెంటనే వెనక్కు తగ్గడమూ ఈ విషయాన్నే సూచిస్తోంది! అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమభాగంలో... భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నెల తొమ్మిదిన తవాంగ్ ప్రాంతంలోని యాంగ్సీ వద్ద ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘటన అనూహ్యమేమీ కాదు. ఏదో ఒక రోజు తప్పదన్న అంచనాలు చాలాకాలంగా ఉన్నాయి. వాస్తవాధీనరేఖ వెంబడి చాలాకాలంగా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూండటం ఇందుకు కారణం. ఈ ఘర్షణకు ముందస్తు సూచన ఏదైనా ఉందీ అంటే... అది భారత – అమెరికా మిలటరీ ప్రదర్శనలకు పొరుగుదేశం చైనా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయడం! వాస్తవాధీన రేఖకు వంద కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ సెంట్రల్ సెక్టర్లో భారత, అమెరికా మిలటరీ దళాలు కలిసికట్టుగా విన్యాసాలు చేసిన విషయం తెలిసిందే. యాంగ్సీ వద్ద చెలరేగిన ఘర్షణలు తూర్పు లదాఖ్ ఘటనల తరువాత రెండేళ్లకు జరిగాయి. ఈ రకమైన తోపు లాటలు, ఘర్షణలు, పరస్పర దాడులు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింల లోని వివాదాస్పద ప్రాంతాల్లో చాలాకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 2020 జూన్లో గల్వాన్ లోయలో రెండుపక్కల సైనికులకు ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో తాజా ఘటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులు ఈ మధ్యకాలంలో వీధిపోరాటల విషయంలో బాగా ఆరితేరినట్లు కనిపి స్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి వీరు ముళ్ల్లతో కూడిన కర్రలతో, టేజర్లతో(కరెంట్ షాక్ కొట్టే ఆయుధం) ప్రత్యర్థులపైకి విరుచుకుపడు తున్నారు. మందు గుండు ఆయుధాలు వినియోగించడం ఇక్కడ సాధ్యం కాదు మరి! గల్వాన్ ఘర్షణ... ఫలితంగా జరిగిన ప్రాణనష్టం... భౌతిక దాడుల విషయంలో పీఎల్ఏ చేసుకున్న మార్పుల తీవ్రత ఎలాంటిదో తెలిపింది. అయితే తవాంగ్ ఘటనకు భారతీయ సైనికులు సర్వసన్న ద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రత్యర్థి బలగాల మోహరింపును అడ్డుకోవడం, అదనపు సిబ్బందితో తమ స్థానాన్ని పదిలపరచు కోవడం, తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. చలికాలంలో తేమతో కూడిన దుస్తులపై టేజర్లు ప్రయోగిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పో వచ్చు. కాబట్టి... భారతీయ సైనికుల కోసం పెద్ద పెద్ద ఆయుధాలు, ఇతర వ్యవస్థలను సమకూర్చడంతోపాటు ఘర్షణలను ఎదుర్కొ నేందుకు ఉపయోగించే పరికరాలనూ అందించాల్సిన అవసర ముంది. పిడిగుద్దులు, ఘర్షణలతో బెదిరించాలని చూస్తున్న శత్రు వును ఎదుర్కునేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. వ్యూహాత్మక సంకేతం అగ్రరాజ్యాల్లో ఒకటైన అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశం... తన సరిహద్దుల్లో వీధిపోరాటాల స్థాయికి దిగజారడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ... ఇవన్నీ తమ అసలు ఉద్దేశాలను వ్యక్తం చేసేందుకు వ్యూహాత్మకంగా ఇస్తున్న సంకేతాలుగా పరిగ ణించాలి. చైనా నాయకత్వం మరింత దూకుడుగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పడం! చైనీస్ కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్ రెండు నెలల క్రితం బీజింగ్లో విజయవంతంగా ముగిసింది. ఇందులోనే ప్రపంచ వేదికపై చైనా వ్యవహారశైలి ఎలా ఉండబోతోందో స్పష్టమైంది. ఇండోనేసియాలో జరిగిన జీ20 సమావేశాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వైఖరి కూడా చైనా ఆధిపత్య ధోరణికి అద్దం పట్టేదే. సుదీర్ఘ శత్రుత్వం కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్లో స్థానిక సరిహద్దు వివాదాలతో ఎలా వ్యవహరించబోయేదీ అధికారికంగానే వివరించారు. సౌత్ చైనా సముద్రంలో తైవాన్తో ఉన్న వివాదాలు... కొన్ని ద్వీపాల విషయంలో జపాన్తో ఉన్న చిక్కులు, హిమాలయా ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ విషయంలోనూ తమ వైఖరి ఏమిటన్నది అక్కడే నిర్ణయమైంది. తైవాన్, ఇతర సముద్ర సంబంధిత సమస్యలను ఆర్థిక ప్రభా వంతో లేదా బలవంతంగానైనా పరిష్కరించాలని చైనా భావిస్తోంది. అయితే... భారత్ విషయంలోనే చైనా ఆందోళన. ఏకంగా 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖతో కూడిన సరిహద్దు.... దాని వెంబడే గుర్తించిన వివాదాస్పద, సున్నితమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సరిహద్దుపై ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. సద్దుమణిగేందుకు చైనా ఏ రకమైన అవకాశమూ ఇవ్వలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట అగ్గి రాజేస్తూ వివాదాన్ని కొనసాగిస్తోంది. ‘సెంట్రల్ టిబెటెన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎక్సైల్’, దలైలామా భారత నేలపై ప్రవాసంలో ఉండటం భారత, చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో వివాదాస్పదమైన అంశంగా నిలుస్తోంది. అంతేకాకుండా... చైనా దృష్టిలో ఆసియా ప్రాంతంలో తన ఆధిపత్యానికి గండికొట్టగల దేశం భారత్ మాత్రమే. తద్వారా భారత్ అగ్రరాజ్యం స్థాయిని అందుకోగలదని చైనా భావిస్తోంది. అందుకే తన షరతులతోనే భారత్తో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పుడప్పుడే సమసేది కాదు తూర్పు లదాఖ్ ప్రాంతంలో పీఎల్ఏతో 2020 మే నెల నుంచి వివాదం మొదలైంది. పలు దఫాలు చర్చలు నడిచినా సాధించింది ఏమీ లేదు. ఫలితంగా భారత సైనికులు దీర్ఘ కాలంపాటు అననుకూల వాతావరణంలో గస్తీ నిర్వహించాల్సి వస్తోంది. భారతీయ సైనికులు కైలాశ్ పర్వత శ్రేణిలోని కీలక ప్రాంతాలను ఆక్రమించినప్పుడు మాత్రమే చర్చలు కొంతైనా ముందుకు సాగాయి అని చెప్పవచ్చు. ఈ పరిణామంతో చైనా ఖంగుతింది. వెంటనే తాము నిర్మించిన ఆవాసాలను, ఇతర నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించింది. పాంగ్యాంగ్ సో ఉత్తరభాగ తీరం వెంబడి తన దళాలను ఉపసంహరించుకుంది కూడా. చైనా మన మాటలు వినాలంటే... మనం దానిపై ఎంతో కొంత పట్టు సాధించాలని చెబుతోంది ఈ ఘటన. యాంగ్సీలోనూ చైనా దళాలు వెనువెంటనే వెనక్కు తగ్గడం కూడా ఈ విషయాన్నే సూచిస్తోంది! ఒక్క విషయమైతే స్పష్టం. వాస్తవాధీన రేఖ వెంబడి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయన్నది మనమూ అంగీకరించాల్సి ఉంటుంది. తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించేందుకు పీఎల్ఏ దూకుడుగా వ్యవ హరిస్తుందన్నదీ నిర్వివాదాంశం. అదే సమయంలో ద్వైపాక్షిక సంబంధాలనూ, సరిహద్దు వివాదాలనూ వేర్వేరుగా చూడాలని చైనా ఒత్తిడి తీసుకువస్తుంది. ప్రతిగా భారత్ సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే అన్ని విషయాలను సమగ్రంగా సమీక్షించవచ్చునని అంటోంది. అయితే ఈ పరిస్థితి వల్ల భారత ఆర్మీ ఏడాది పొడవునా... అననుకూల పరిస్థితుల్లో గస్తీ కాయాల్సిన పరిస్థితి కొనసాగనుంది. చైనా ఒకవైపు తన మిలిటరీ దూకుడును కొనసాగిస్తూనే... భారత్తో సరిహద్దు వివాదాలను దీర్ఘకాలం నాన్చే ప్రయత్నం చేస్తుందని ప్రస్తుత పరిణామాల ఆధారంగా అంచనా కట్టవచ్చు. ఇందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. దౌత్యం, మిలిటరీ రెండింటిలోనూ అన్నమాట. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుంటే... యాంగ్సీ, గల్వాన్ లాంటి ఘటనలు జరక్కుండా ముందస్తుగానే నివారించడం ఎంతైనా అవసరం. వ్యాసకర్త మిలిటరీ వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నమ్మలేని పొరుగు దేశం
భారత–చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత మరోమారు పార్లమెంట్ సహా దేశమంతటినీ కుదిపి వేస్తోంది. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వద్ద యాంగ్సే ప్రాంతంలో చొచ్చుకొని రావడానికి చైనా సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత సైనికులు గట్టిగా తిప్పికొట్టిన తీరుపై వైనవైనాలుగా కథనాలు వస్తున్నాయి. అక్కడ నిజంగా జరిగిందేమిటో తెలుసుకొని, పరిస్థితిని సమీక్షించి, లోటుపాట్లను సరిదిద్దుకొని, రక్షణ దళాలను బలోపేతం చేసే పనిలో భారత ప్రభుత్వం ఇప్పటికే ఉంది. అయితే, సరిహద్దు వెంట శాంతి నెలకొనాలనీ, అనేక ఇతర అంశాల్లో సహకారం వెల్లివిరియాలనీ – ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని దశాబ్ద కాలంగా పొరుగుదేశం పదే పదే ఉల్లంఘించడం కీలకాంశం. పొరుగునే పొంచివున్న పాము పట్ల అప్రమత్తత అనివార్యం. రెండేళ్ళ క్రితం 2020 జూన్ 15 నాటి గల్వాన్ ఘర్షణల్లోనూ, తాజా తవాంగ్ ఘటనలోనూ చైనా తన తప్పేమీ లేదనే భావన కలిగించడానికి శతవిధాల ప్రయత్నించింది. వాస్తవాలు వెలికి రావడంతో డ్రాగన్ పాచిక పారలేదు. భారత – చైనాల మధ్య సైనిక ఘర్షణ 1962 నుంచి 60 ఏళ్ళుగా సాగుతోంది. లద్దాఖ్ పరిసర పశ్చిమ ప్రాంతం – టిబెట్తో మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్ల సరిహద్దుతో కూడిన మధ్యప్రాంతం – అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దుతో కూడిన తూర్పు ప్రాంతం... ఈ మూడూ భారత–చైనా సరిహద్దులో ప్రధాన ప్రాంతాలు. అరుణాచల్తో ఉన్న 1126 కి.మీల తూర్పు సరిహద్దుపై చైనా ఎప్పుడూ పేచీ పెడుతూనే ఉంది. అరుణాచల్ తనదేనంటోంది. అధిక భాగాన్ని ‘దక్షిణ టిబెట్’ అని ప్రస్తావిస్తూ, అక్కడి ప్రదేశాలకు తన పేర్లు పెట్టి పిలుస్తోంది. అరుణాచల్పై రచ్చ రేపి, చివరకు పశ్చిమాన భారత్ అధీనంలో ఉన్న కీలక అక్సాయ్చిన్ని తమకు వదిలేస్తే, అరుణాచల్పై పట్టు వీడతామని బేరం పెట్టడం డ్రాగన్ వ్యూహమని ఓ విశ్లేషణ. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) తూర్పు ప్రాంతంలో వ్యూహాత్మక తవాంగ్ వద్ద చైనాకు ఎప్పుడూ పట్టు లేదు. 17వేల అడుగుల ఎత్తైన పర్వతప్రాంతాన్ని వశం చేసుకుంటే, ఎల్ఏసీకి ఇరువైపులా స్పష్టంగా చూడవచ్చు. ఆ గుట్టపై ఆధిక్యం సంపాదించి, భారత్కు చోటు లేకుండా చేయాలన్నది చైనా పన్నాగం. అలాగే అరుణాచల్లో వివాదాస్పద సరిహద్దు వెంట భారత దళాల బలమెంతో అంచనా వేయడానికీ తాజా చర్యకు దిగింది. అది ఫలించకపోవడంతో తవాంగ్లో ప్రస్తుతానికి భారత్దే పైచేయి. కానీ, మరోపక్క సిక్కిమ్ సరిహద్దులో 2017లో ఘర్షణ సాగిన కీలక డోక్లామ్ ప్రాంతంలో కొన్నేళ్ళుగా చైనా ఊళ్ళకు ఊళ్ళు కడుతోంది. వంతెనలు నిర్మిస్తోంది. ఇది ఆందోళనకరం. తవాంగ్లో 13 వేల అడుగుల ఎత్తైన చోట, మైనస్ 15 డిగ్రీల్లోనూ భారత్ నిర్మిస్తున్న సేలా సొరంగ మార్గం పూర్తి కావచ్చింది. ఇటు ప్రజలకూ, అటు ఆర్మీకీ పనికొచ్చే ఇలాంటివి చైనాను చీకాకుపరుస్తున్నాయి. ఆసియాపై ఆధిక్యం చూపాలంటే, హిమాలయ ప్రాంతంపై పట్టు బిగించడం చైనాకు కీలకం. పైగా, భవిష్యత్ దలైలామా తవాంగ్ ప్రాంతంలో జన్మిస్తారని ఓ నమ్మకం. అలా ధార్మికంగానూ ఆ ప్రాంతం తమకు కీలకమనీ, అదీ తమ దేశంలో భాగమైపోవాలనీ చైనా తాప త్రయం. మరోపక్క బ్రహ్మపుత్రా నదిపై ప్రాజెక్ట్లు కడుతూ, ఆ జలాలపై ఆధారపడ్డ ఇతర పొరుగు దేశాలను అడకత్తెరలో బిగిస్తోంది. ఇక, తవాంగ్ ఘటనలో భారత్ను అమెరికా సమర్థించడంతో పుండు మీద కారం రాసినట్టయింది. భారత, అమెరికాల బంధం బలోపేతమైతే తన ప్రాంతీయ ఆధిపత్యానికి గండి పడుతుందని చైనా భావన. అందుకే, ఢిల్లీ, వాషింగ్టన్లు దగ్గరవుతున్న కొద్దీ కవ్వింపు పెంచుతోంది. ప్రపంచవేదికలు శాంతివచనాలు పలుకుతున్నా, వాటి ప్రభావం శూన్యం. జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రతపై మన దేశమంతా ఏకతాటిపై ఉందని చాటాల్సిన సమ యమిది. కానీ తవాంగ్ ఘటన సైతం రాజకీయమవుతోంది. తమనూ విశ్వాసంలోకి తీసుకొని, సరిహద్దు రక్షణపై పార్లమెంట్లో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుంటే, కారణాలేమైనా అధి కార బీజేపీ అంగీకరించట్లేదు. 1962 చైనా యుద్ధవేళ నెహ్రూ విధానాన్ని కాషాయధ్వజులు తప్పు పడున్నారు. అప్పట్లో నెహ్రూ సభలో చర్చించి, ఏకంగా 165 మంది ఎంపీలకు మాట్లాడే అవకాశ మిచ్చి, ఆపైనే నిర్ణయం తీసుకున్నారని విస్మరిస్తే ఎలా అని కాంగీయులు ప్రతిదాడి చేస్తున్నారు. వెరసి, అప్పట్లో గల్వాన్ ఘటనలోనూ, ఇప్పుడీ తవాంగ్పైనా ఈ రాజకీయ వాగ్వాదపర్వం కీలకమైన దేశభద్రతలో లోటుపాట్లపై లోతైన చర్చకు దారి తీయకపోవడమే విచారకరం. సరిహద్దు వెంట చైనా లాగానే, టిబెట్, దక్షిణ మంగోలియా, హాంకాంగ్, తవాంగ్ లాంటి చోట్ల చైనాపై మనమూ దూకుడు చూపాలనేది కొందరి వాదన. అయితే, మన పాలకులు ‘ఆత్మనిర్భరత’ అంటూ రొమ్ము విరుచుకుంటున్నా, ఇవాళ్టికీ బొమ్మలు (86 శాతం), ఎలక్ట్రానిక్ విడిభాగాలు (37 శాతం), ఆటో విడిభాగాలు (30 శాతం) సహా అనేక అంశాల్లో మనం చైనా దిగుమతులపైనే ఆధార పడ్డాం. వస్తూత్పత్తిలో స్వీయపురోగతికి దీర్ఘకాలం పడుతుంది. అలా చూస్తే పొరుగున ఉన్న చైనాతో బద్ధశత్రుత్వంతో రోజులు గడవవు. దౌత్యపరమైన ఒత్తిడి పెడుతూనే, నేటికీ స్పష్టంగా అంగీకారం లేని సరిహద్దు రేఖపై చర్చించి, శాశ్వత పరిష్కారానికి ప్రయత్నించాలి. సరిహద్దుల్లో జరగనున్న భారత వైమానికదళ విన్యాసాలతో తోక తొక్కిన తాచులా చైనా బుసలుకొట్టవచ్చు. రానున్న రోజుల్లో ఉద్రిక్తతలూ పెరగవచ్చు. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్లో సర్వర్లను స్తంభింపజేసిన సైబర్ దాడీ చైనా పనేనట. ఈ పరిస్థితుల్లో సైన్యం, భారత గూఢచారి దళాల అప్రమత్తతే మనకు రక్షాకవచం. -
చైనా సేనలను తరిమికొట్టాం
న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన సైన్యం పూర్తిస్థాయిలో తిప్పికొట్టిందని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు. ‘‘అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్ట్సే ప్రాంతం వద్ద వాస్తవాధీన రేఖను దాటేందుకు, తద్వారా యథాతథ స్థితిని మార్చేందుకు డిసెంబర్ 9న చైనా సైన్యం ప్రయత్నించింది. వాటన్నింటినీ మన సైనికులు చాలా గట్టిగా తిప్పికొట్టారు. మన సైనిక కమాండర్లు సకాలంలో స్పందించడంతో చైనా సైన్యం తోక ముడిచింది’’ అని చెప్పారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆయన వేర్వేరుగా ప్రకటన చేశారు. ‘‘ఈ ఘర్షణ ఇరు సైనికుల నడుమ భౌతిక పోరుకూ దారి తీసింది. మనవాళ్లు వీరోచితంగా పోరాడారు. మన భూభాగాల్లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం చేసిన ప్రయత్నాలను వమ్ము చేసి వారిని తరిమికొట్టారు’’ అని వివరించారు. ‘‘ఈ ప్రయత్నంలో మనవైపు ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. కొందరు సైనికులు స్వల్పంగా గాయపడ్డారు’’ అని స్పష్టం చేశారు. ‘‘ఈ ఘటన తర్వాత మన స్థానిక సైనిక కమాండర్, చైనా కమాండర్ మధ్య డిసెంబర్ 11న ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. దీనిపై మన ఆగ్రహాన్ని, అభ్యంతరాలను దౌత్య మార్గాల్లో కూడా చైనాకు తెలియజేశాం. ఇలాంటి దుందుడుకు చర్యలను పునరావృతం చేయొద్దని, సరిహద్దుల వెంబడి శాంతి, సామరస్యాలను కాపాడాలని గట్టిగా చెప్పాం’’ అని వెల్లడించారు. ‘‘మన భూభాగాన్ని ఆక్రమించేందుకు జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా పూర్తిగా తిప్పికొట్టేందుకు, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైన్యం నిత్యం సన్నద్ధంగా ఉంది. సభకు ఈ మేరకు హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. అంతకుముందు తాజా పరిస్థితిపై సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సమీక్ష జరిపారు. గల్వాన్ తరహా ఘర్షణ ► డిసెంబర్ 9 నాటి చైనా ఆక్రమణ యత్నం మరోసారి రెండేళ్లనాటి ‘గల్వాన్ లోయ’ ఉదంతాన్ని తలపించింది. విశ్వసనీయ సమాచారం మేరకు... చైనా సైనికులు అచ్చం అప్పటి మాదిరిగానే ఇనుప ముళ్లతో కూడిన లావుపాటి ఆయుధాలు, కర్రల వంటివాటితో దాడికి దిగారు. అప్పట్లాగే పరిస్థితి మరోసారి బాహాబాహీకి కూడా దారితీసింది. ► తవాంగ్ పరిసరాల్లో యాంగ్ట్సే వద్ద 17 వేల అడుగుల పై చిలుకు ఎత్తున్న మంచు శిఖరాలపై పట్టు కోసం చైనా ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దాదాపు రెండేళ్ల అనంతరం మరోసారి మన భూభాగాల్లోకి సైలెంటుగా చొచ్చుకొచ్చేందుకు డిసెంబర్ 9న దొంగ ప్రయత్నం చేసింది. ► అయితే అక్కడ ఎటు చూసినా మన సైన్యం భారీగా మోహరించిన తీరుతో చైనా దళాలు అవాక్కైనట్టు సమాచారం. వాటి చొరబాటు యత్నాలను మనవాళ్లు దీటుగా అడ్డుకోవడమే గాక పూర్తిస్థాయిలో తరిమి కొట్టారు. ► ఆ ప్రాంతంలో భారత సైన్యపు మోహరింపులు హై రిజల్యూషన్ కెమెరాలతో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ► 2020 జూన్లో తూర్పు లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ లోయ వద్ద చైనా, భారత దళాల మధ్య జరిగిన భీకర పోరు జరగడం తెలిసిందే. దానివల్ల ఇరుదేశాల సంబంధాలు బాగా క్షీణించాయి. ► అప్పటినుంచి తూర్పు ప్రాంతంలో వాస్తవా ధీన రేఖ వద్ద మోహరింపులను, యుద్ధ సన్నద్ధతను సైన్యం బాగా పెంచింది. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. ► ఆ తర్వాత ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న పెద్ద ఘర్షణ ఇదే. ఈ దురాక్రమణ యత్నంలో చైనా వైపు చాలామంది సైనికులు గాయపడ్డట్టు సమాచారం. ► 2012 అక్టోబర్లో కూడా యాంగ్ట్సే ప్రాంతంలోనే భారత, చైనా సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ► కొంతకాలంగా ఈ ప్రాంతంలో చైనా డ్రోన్ల హడావుడి బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా రగడకు ముందే మన యుద్ధ విమానాలు తవాంగ్ పరిసరాల్లో గస్తీ కాయడం, డేగ కళ్లతో నిఘా వేయడం మొదలైంది. ► దాదాపు 3,500 కిలోమీటర్ల పొడవైన నియంత్రణ రేఖ పొడవునా పరిస్థితిపై, దళాల సన్నద్ధతపై త్రివిధ దళాధిపతులు సమీక్ష జరిపారు. భారత సైనికులు అడ్డుకున్నందుకే...తవాంగ్ రగడ: చైనా సైన్యం ‘గల్వాన్ లోయ’ చేదు అనుభవం నేపథ్యంలో తవాంగ్ రగడపై చైనా ప్రభుత్వ ఆచితూచి స్పందించగా సైన్యం మాత్రం తెంపరి వ్యాఖ్యలకు దిగింది! సరిహద్దుల వెంబడి పరిస్థితి నిలకడగా ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘‘భారత దళాలే అక్రమంగా ఎల్ఓసీ దాటాయి. చైనా వైపు డాంగ్జాంగ్ ప్రాంతంలో గస్తీ విధుల్లో ఉన్న మా సైనికులను అడ్డుకున్నాయి. అది డిసెంబర్ 9 రగడకు దారి తీసింది’’ అని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) వెస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి కల్నల్ లోంగ్ షోహువా ఆరోపించారు. నిజాలు దాస్తున్న కేంద్రం రాజ్నాథ్ది అరకొర ప్రకటన: కాంగ్రెస్ ‘తవాంగ్’పై అట్టుడికిన ఉభయసభలు కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాల వాకౌట్ తవాంగ్ రగడ మంగళవారం పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. చైనాను నిలువరించడంలో కేంద్రం సమర్థంగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలన్నీ దుయ్యబట్టాయి. ‘‘ఇది కచ్చితంగా దౌత్య వైఫల్యమే. సరిహద్దుల వద్ద పరిస్థితిపై తక్షణం సవివర చర్చకు ప్రభుత్వం సిద్ధపడాలి’’ అని డిమాండ్ చేశాయి. రాజ్నాథ్ ప్రకటనపై వివరణకు పట్టుబట్టాయి. ఇది సున్నితమైన అంశమంటూ వివరణ కోరేందుకు రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా అనుమతివ్వలేదు. అందుకు నిరసనగా కాంగ్రెస్, ఎస్పీ, జేఎంఎం, ఆర్జేడీ, శివసేన, సీపీఎం, సీపీఐ ఉభయ సభల నుంచీ వాకౌట్ చేశాయి. అనంతరం రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. చైనా సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజీవ్గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్) గుర్తింపు రద్దు అంశాన్ని కావాలని మోదీ సర్కారు తెరపైకి తెస్తోందని ఆరోపించారు. ఉభయ సభల్లో వివరణ ఇవ్వకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. చైనా దురాక్రమణ, ఉగ్రవాదం దేశ భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు పెను ముప్పుగా మారుతున్నా మౌన ప్రేక్షకునిగా చూస్తోందంటూ దుయ్యబట్టారు. మంత్రుల వెనక దాక్కుంటున్న మోదీ చైనా అంశంపై ప్రభుత్వ వ్యవహార శైలిని కాంగ్రెస్తో పాటు విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తవాంగ్ రగడపై రక్షణ మంత్రి అరకొర ప్రకటనతో సరిపెట్టారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. దీనిపై మోదీ ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని పార్టీ నేతలు గౌరవ్ గొగొయ్, పవన్ ఖేరా ఆరోపించారు. ‘‘డిసెంబర్ 9న ఘర్షణ జరిగితే రక్షణ మంత్రి ప్రకటనకు ఇంత ఆలస్యమెందుకు? ప్రజల నుంచి ఏం దాస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. జాతీయ భద్రత అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా మోదీ తన మంత్రుల వెనక దాక్కుంటారని ఎద్దేవా చేశారు. పీఎం కేర్స్ నిధికి విరాళాలిచ్చిన చైనా కంపెనీల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అంగుళం కూడా వదలం: అమిత్ షా రాజీవ్ ఫౌండేషన్కు చైనా నిధులు దాని గుర్తింపు రద్దయినందుకే నిరసనలు కాంగ్రెస్కు హోం మంత్రి చురకలు మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత భూభాగంలో ఎవరూ ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎలాంటి చొరబాట్లనూ అనుమతించబోమన్నారు. ‘లోక్సభలో కార్యకలాపాలను కాంగ్రెస్ పదేపదే అడ్డుకోవడానికి అసలు కారణం తవాంగ్ రగడ కాదు. రాజీవ్గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్)కు విదేశీ విరాళాల చట్టం (ఎఫ్సీఆర్ఏ) గుర్తింపును కేంద్రం రద్దు చేయడమే!’’ అంటూ చురకలంటించారు. ‘‘సమాజ సేవ కోసమంటూ నమోదు చేసుకున్న ఆర్జీఎఫ్కు ఇండో–చైనా సంబంధాల అభివృద్ధి సంబంధిత అధ్యయనం పేరిట చైనా ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లు అందాయి. అందుకే దాని గుర్తింపు రద్దు చేయాల్సి వచ్చింది. విపక్షాల గొడవ వల్ల ప్రశ్నోత్తరాలు తుడిచిపెట్టుకుపోయాయి. లేదంటే ఈ విషయాన్ని సభలోనే చెప్పేవాన్ని. బహుశా ఆర్జీఎఫ్ తన అధ్యయనం ముగించే ఉంటుంది. ఇంతకూ, 1962 చైనా యుద్ధంలో ఎన్ని వేల హెక్టార్ల భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించిందన్నది ఆ అధ్యయనంలో ఉందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. చైనాపై మోదీ ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. నిజానికి విదేశీ నాయకులతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాధినేతలకు ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే ఐరాస భద్రతా మండలిలో స్థానం చేజారిందంటూ ప్రత్యారోపణ చేశారు. ‘‘భద్రతా మండలిలో భారత్ స్థానాన్ని కాంగ్రెస్కు చెందిన దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎందుకు ‘త్యాగం’ చేశారు? కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్సింగ్ అరుణాచల్ప్రదేశ్లో పర్యటిస్తే చైనా అభ్యంతరపెట్టింది. ఆ రాష్ట్ర సీఎం దోర్జీ ఖండూకు వీసా నిరాకరించింది. జమ్మూ కశ్మీర్ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ అక్కడి ప్రజలకు స్టేపుల్ వీసాలిచ్చింది. వీటన్నింటిపై కూడా ఆర్జీఎఫ్ అధ్యయనం చేసిందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ సారథ్యంలోని ఆర్జీఎఫ్కు ఉగ్రవాదులతో లింకుల ఆరోపణలపై నిషేధం ఎదుర్కొంటున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ నుంచి కూడా రూ.50 లక్షలందాయని ఆరోపించారు. -
వివాదంలో ఇరుక్కున్న నటి.. నా ఉద్దేశం అది కాదంటూ.. క్షమాపణలు..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి రిచా చద్దా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె చేసిన ఒక ట్వీట్ సైనికుల్ని అవమానించేలా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో రిచా క్షమాపణలు చెప్పారు. ఆ ట్వీట్ను కూడా తొలగించారు. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, కేంద్రం ఆదేశాల కోసం చూస్తున్నామంటూ ఒక ట్వీట్ చేశారు. రిచా దీనిని ప్రస్తావిస్తూ ‘‘గల్వాన్ సేస్ హాయ్’’ అని పోస్టు పెట్టారు గల్వాన్ ప్రస్తావన తీసుకురావడంతో నెటిజన్లు మండిపడ్డారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసే సైనికుల్ని ఎగతాళి చేయడానికి ఈ ట్వీట్ చేశారంటూ విరుచుకుపడ్డారు. దీంతో రిచా ఆ ట్వీట్ను తొలగించారు. సైనికుల్ని అవమానపరచడం తన ఉద్దేశం కాదని క్షమాపణ కోరారు. చదవండి: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు.. -
దొంగదెబ్బ తీసిన కమాండర్లకు ప్రమోషన్.. టాప్ పోస్టులతో సత్కారం!
బీజింగ్: పొరుగు దేశం చైనా మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత సైనికులపై దొంగదెబ్బ తీయటంలో కీలకంగా వ్యవహరించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ కమాండ్ జనరల్స్పై ప్రశంసలు కురిపించింది. చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. భారత సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు కమాండ్ జనరల్స్కు ప్రమోషన్ కల్పిస్తూ.. టాప్ పోస్టులు కట్టబెట్టారు. ప్రస్తుతం భారత సరిహద్దులోని వెస్టర్న్ థియోటర్ కమాండ్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► జనరల్ హీ వెయిడాంగ్(65)ను సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) కొత్త వైస్ ఛైర్మన్గా నియమించారు జిన్పింగ్. సీఎంసీకు అధ్యక్షుడి హోదాలో జిన్పింగ్ నేతృత్వం వహిస్తారు. మరోవైపు.. సీఎంసీలో ఎలాంటి పదవులు చేపట్టకుండానే వైస్ ఛైర్మన్ పోస్టులోకి జనరల్ హీ వెయిడాంగ్ను నియమించటం గమనార్హం. ► జనరల్ ఝాంగ్ యూక్సియా(72).. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించారు. పదవీ విరమణ వయసు దాటినప్పటికీ ఆయనను ఫస్ట్ ర్యాంకింగ్ వైస్ ఛైర్మన్గా కొనసాగించాలని నిర్ణయించారు. పీఎల్ఏలో జిన్పింగ్కు కుడిభుజంగా ఝాంగ్ను చెప్పుకుంటారు. ► జనరల్ జు క్విలింగ్(60)ను 205 మంది సభ్యులుగా ఉన్న పార్టీ కొత్త సెంట్రల్ కమిటీలో నియమించారు జిన్పింగ్. మరోవైపు.. నియంత్రణ రేఖ వద్ద సంక్షోభం తలెత్తిన క్రమంలో జనరల్ జు క్విలింగ్ ఇంఛార్జిగా ఉన్నారు. దీంతో 2021 జులైలో డబ్ల్యూటీసీ హెడ్గా , లెఫ్టినెంట్ జనరల్ నుంచి జనరల్గా పదోన్నతి పొందారు. మరోవైపు.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ(69)కి సైతం పదవీ విరమణ వయసు దాటినప్పటికీ తనతోనే అట్టిపెట్టుకున్నారు జిన్పింగ్. పొలిట్ బ్యూరోలోకి వాంగ్ యీని తీసుకున్నారు. పార్టీ విదేశీ వ్యవహారాల సెంట్రల్ కమిషన్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: చరిత్రకెక్కిన జిన్పింగ్.. మావో జెడాంగ్ తర్వాత తొలినాయకుడిగా.. -
గోగ్రా నుంచి మూడు రోజుల్లో సైన్యం వెనక్కి
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్లోని గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో సైన్యాన్ని వెనక్కి ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి ఈ నెల 12 సోమవారం వరకు గడువు ఉందని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి గత రెండేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న గోగ్రా–హాట్స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ 15 దగ్గర్నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియను మొదలు పెట్టామని భారత్, చైనా ప్రకటించిన ఒక్క రోజు తర్వాతే భారత్ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వచ్చేవారం ఉజ్బెకిస్తాన్లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఇతర అంశాలను కూడా పరిష్కరించుకొని సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్టుగా విదేశాంగ శాఖ అధికారప్రతినిధి అరిందమ్ బగాచి చెప్పారు. గురువారం ఉదయం 8.30 గంటలకు మొదలైన సైన్యం ఉపసంహరణ సోమవారంతో ముగియాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలనూ ధ్వంసం చేస్తున్నటు చెప్పారు. 2020 జూన్ గల్వాన్లోయలో ఘర్షణలు జరగడానికి ముందు ఎలా ఉండేదో అలా ఉండేలా ఇరు పక్షాలు చర్యలు తీసుకుంటాయన్నారు. -
Rekha Singh: భర్త కన్న కలల కోసం.. భారత ఆర్మీలోకి రేఖా సింగ్
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లోని గల్వాన్ లోయలో 2020 జూన్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన నాయక్ దీపక్ సింగ్ భార్య రేఖా సింగ్ ఇండియన్ ఆర్మీలో చేరారు. తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్న ఆమె లెఫ్టినెంట్ అయ్యారు. ఆర్మీకి సంబంధించిన శిక్షణని మే 28 నుంచి చెన్నైలో రేఖా సింగ్ తీసుకోనున్నారు. దీపక్ సింగ్కు తన భార్య కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని బలమైన కోరిక ఉండేది. ఆయన జీవించి ఉన్నప్పుడు ఆమెను ఆ దిశగా ప్రోత్సాహించారు. వారిద్దరికీ పెళ్లయిన ఏడాదిన్నరలోనే గల్వాన్ ఘర్షణల్లో దీపక్ సింగ్ వీర మరణం పొందడం రేఖను బాగా కుంగదీసింది. భర్త పోయిన దుఃఖం నుంచి కోలుకున్న ఆమె టీచర్ ఉద్యోగం వీడి తన భర్త కన్న కలల్ని సాకారం చేయడానికి ఆర్మీలో చేరారు. అది కూడా ఏమంత సులభంగా ఆమెకి రాలేదు. రెండు సార్లు ప్రయత్నించిన మీద లెఫ్టినెంట్ పదవి దక్కింది. -
బోర్డర్లో భారత్తో కయ్యం.. అజిత్ ధోవల్కు చైనా ఆఫర్ ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య లఢక్ సహా మరిన్ని సరిహద్దు వివాదాస్పద ప్రాంతాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో భారత్ పర్యటనలో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. కాగా, శుక్రవారం విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్తో వాంగ్ యీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగిన ఈ సమావేశంలో.. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. జైశంకర్తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తోనూ సమావేశం అయ్యారు. మరోవైపు.. సమావేశంలో భాగంగా అజిత్ ధోవల్ను తమ దేశానికి రావాలంటూ చైనా విదేశాంగ మంత్రి ఆహ్వానం అందించారు. కాగా, ఆయన ఆహ్వానంపై అజిత్ ధోవల్ పాజిటివ్గా స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు విజయవంతంగా పరిష్కారమైన తర్వాత కచ్చితంగా చైనాకు వస్తానని తెలిపారు. కాగా, ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలంటే, లఢక్తో పాటు ఇతర వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా తమ దళాలను ఉపసంహరించాలని ధోవల్ ఈ సందర్భంగా వాంగ్ యీని కోరారు. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఉన్నాయని ఆమోదయోగ్యంగా లేవన్నారు. ఈ క్రమంలో శాంతి స్థాపనతోనే ఇరు వర్గాల మధ్య నమ్మకం ఏర్పడుతుందని రెండు దేశాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. 2020 జూన్ 15న భారత్, చైనా బలగాల మధ్య గాల్వాన్ లోయలో తలెత్తిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులవడంతో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుంచి ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నప్పటికీ.. అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. కాగా, గాల్వాన్ ఘటన తర్వాత సీనియర్ స్థాయి చైనా నేత భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక, రెండు రోజుల క్రితం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాంగ్ యూ.. తాజాగా భారత్లో పర్యటించడం గమనార్హం. ఢిల్లీకి రాకముందు వాంగ్ యి.. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్లోని కాబూల్లో పర్యటించారు. -
మా ఎంపిక సరైనదే అంటూ చైనా కొత్త పల్లవి
Winter Olympic 2022: వింటర్ ఒలంపిక్స్లో టార్చ్బేరర్గా గల్వాన్లోయ ఘర్షణతో సంబంధం ఉన్న సైనికుడిని ఎంపిక చేయడాన్ని చైనా సమర్థించుకుంది. సదరు సైనికుడిని ప్రమాణాలకు అనుగుణంగా ఎంచుకున్నామని తెలిపింది. ఇందులో రాజకీయ దురుద్దేశాలు చూడవద్దని కోరింది. గల్వాన్ లోయ ఘర్షణలో గాయపడిన కమాండర్ క్వి ఫాబావోను చైనా టార్చ్బేరర్గా ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. దీనికి నిరసనగా వింటర్ ఒలంపిక్స్ ఆరంభోత్సవాలను భారత్ బహిష్కరించింది. యూఎస్ సైతం చైనా చర్యను తప్పుబట్టింది. అయితే ఇది కేవలం ముందుగా అనుకున్న ప్రమాణాలకు లోబడి తీసుకున్న నిర్ణయమని చైనా విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి ఝావో లిజియన్ చెప్పారు. ఈ విషయాన్ని భారత్ హేతుబద్ద దృష్టితో చూడాలని, అనవసర రాజకీయ విమర్శలు చేయవద్దని కోరారు. అయితే ఒలంపిక్స్లాంటి కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయాలని చూడడం చైనా కోరికని భారత ప్రతినిధి బాగ్చీ విమర్శించారు. -
చైనాతో వివాదం: మా మద్దతు భారత్కే.. స్పష్టం చేసిన అమెరికా
వాషింగ్టన్: గాల్వాన్ ఘర్షణలో పాల్గొన్న సైనికాధికారిని బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్బేరర్గా ఎంపిక చేయడంపై చైనాతో ఏర్పడ్డ వివాదంలో తమ మద్దతు భారత్కేనని అమెరికా పేర్కొంది. పొరుగు దేశాలను బెదిరించే, ఇబ్బంది పెట్టే చైనా చర్యలను గతంలో కూడా తప్పుబట్టామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ప్రైస్ అన్నారు. ఇలాంటి విషయాల్లో భారత్ వంటి మిత్ర దేశాలకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని చెప్పారు. భారత్, చైనా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సీనియర్ యూఎస్ సెనేటర్లు మార్కో రూబియో, జిమ్ రిచ్ కూడా చైనా చర్యను దుయ్యబట్టారు. వింటర్ ఒలింపిక్స్కు చైనా రాజకీయ రంగు పూస్తున్న తీరుకు ఇది మరో నిదర్శనమని రూబియో విమర్శించారు. భారత దళాలపై దొంగచాటున దాడికి దిగిన సైనిక బృందంలోని అధికారిని టార్చ్బేరర్గా ఎంపిక చేయడం కచ్చితంగా రెచ్చగొట్టే ప్రయత్నమేనని ట్వీట్ చేశారు. ఈ విషయంలో చైనా తీరు సిగ్గుచేటని రిచ్ ట్వీట్ చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలకూ అమెరికా మద్దతుంటుందన్నారు. 2020 జూన్లో లడఖ్లోని గాల్వాన్ లోయ వద్ద మన దళాలపై చైనా జరిపిన దొంగచాటు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారిని శుక్రవారం నాటి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల టార్చిబేరర్ల బృందంలోకి చైనా ఎంపిక చేయడంపై దుమారం రేగింది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించింది. దూరదర్శన్ కూడా ప్రారంభ, ముగింపు వేడుకలను ప్రత్యక్షప్రసారం చేయబోదని ప్రసారభారతి వెల్లడించింది. -
చైనా చేష్టలు.. భారత్ రియాక్షన్ ఇది
గల్వాన్ లోయ ఘర్షణల్లో పాల్గొన్న కమాండర్, ఉయిగర్ల ఊచకోతలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తిని టార్చ్బేరర్గా అర్హత ఇవ్వడం ద్వారా పెను వివాదానికే కేంద్రం బిందువుగా మారింది వింటర్ ఒలింపిక్స్ 2022. పైపెచ్చు ఇప్పుడు అథ్లెటిక్స్ను స్వేచ్ఛగా మాట్లాడేందుకు వీలు లేకుండా ఆంక్షలు పెట్టింది. ఇక గల్వాన్ లోయ ఘర్షణలకు కారణమైన సీపీఏల్ఏ కమాండర్ క్వీ ఫబోవోను టార్చ్బేరర్గా ఎంపిక చేయడంపై భారత్, చైనా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సరిహద్దు అంశాన్ని కెలిగి.. రాజకీయం చేయాలని చూస్తోందని భారత్ అంటోంది. అందుకే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత రాయబారి, దౌత్యవేత్తలు పాల్గొనడని స్పష్టం చేసింది. ఈ బహిష్కరణతో పాటు ఒలింపిక్స్ ఈవెంట్స్ను టెలికాస్ట్ చేయడంలో దూరదర్శన్ దూరంగా ఉంటుందని ప్రసారభారతి స్పష్టం చేసింది. Consequent to the announcement by @meaindia, @ddsportschannel will not telecast live the Opening and Closing ceremonies of the Winter Olympics being held in Beijing. https://t.co/sSP1EX9pSQ — Shashi Shekhar Vempati शशि शेखर (@shashidigital) February 3, 2022 పదహారు రోజులపాటు బీజింగ్ వేదికగా శీతాకాల ఒలింపిక్స్ జరగున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనంతగా అథ్లెటిక్స్ మీద ఆంక్షలు విధించింది. అంతేకాదు చైనా చట్టాల మీద, రూల్స్కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే.. శిక్ష తప్పదని హెచ్చరించింది బీజింగ్ ఆర్గనైజింగ్ కమిటీ. అంతేకాదు నిరసనలు తెలిపే హక్కును తొలగిస్తూ.. అందుకు సంబంధించిన పోడియంలను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. -
చైనాకు కొంచెమైనా సిగ్గు ఉందా?
ఒకవైపు కరోనా కేసులు దాచి పెడుతూ.. ఎలాగైనా వింటర్ ఒలింపిక్స్ వేడుకల్ని నిర్వహించాలని చైనా తాపత్రయపడుతోంది. ఈ క్రమంలో సరిహద్దు అంశాన్ని కెలికి మరీ విమర్శలు ఎదుర్కొంటోంది. చైనా తాజాగా చేసిన పనిని అగ్రరాజ్యం తీవ్రంగా ఖండించింది. బుధవారం వింటర్ ఒలింపిక్ టార్చ్ రిలేను నిర్వహించిన ఆతిథ్య చైనా.. టార్చ్బేరర్గా క్వీ ఫబోవోను ఎంచుకుంది. ఇతను గల్వాన్ లోయ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన సీపీఏల్ఏ కమాండర్. ఈ విషయాన్ని డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన షిన్జియాంగ్ మిలటరీ కమాండర్, గల్వాన్ లోయ వీరుడు క్వీ ఫబోవో.. బాస్కెట్బాల్ క్రీడాకారుడు వాంగ్ మింగ్తో కలిసి ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని రిలేను ప్రారంభించారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. కాగా, ఈ చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. ‘‘ఇది సిగ్గుమాలిన పని. గల్వాన్ లోయ దాడిలో పాల్గొన్న వ్యక్తిని.. అదీ ఉయిగర్ల ఊచకోతకు కారణమైన వ్యక్తి టార్చ్ బేరర్గా ఎంచుకోవడం వెనుక ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపింది. భారత సార్వభౌమత్వానికి, ఉయిగర్ల స్వేచ్ఛకు అమెరికా ఎప్పుడూ మద్ధతు ఇస్తూనే ఉంటుంది’’ అని యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ర్యాంకింగ్ మెంబర్ ఈ ఉదయం ఒక ట్వీట్ చేశారు. ఇక, శీతాకాల ఒలింపిక్స్ను భారత్ బహిష్కరించనప్పటికీ.. ప్రారంభ వేడుకలు సహా ఒలింపిక్ కార్యక్రమానికి మన దేశం నుంచి ఎవ్వర్నీ పంపడంలేదు. It's shameful that #Beijing chose a torchbearer for the #Olympics2022 who's part of the military command that attacked #India in 2020 and is implementing #genocide against the #Uyghurs. The U.S. will cont. to support #Uyghur freedoms & the sovereignty of India. — Senate Foreign Relations Committee Ranking Member (@SenateForeign) February 3, 2022 నష్టం ఎక్కువే! భారత్ సైన్యంతో గల్వాన్ లోయలో 2020 జూన్ 15న జరిగిన ఘర్షణల్లో 40 మందికిపైగా సీపీఎల్ఏ జవాన్లు చనిపోయినా.. పరువు పోతుందనే భయంతో నలుగురు మాత్రమే మరణించారని డ్రాగన్ తక్కువచేసి చెప్పింది. నలుగురు సైనికులకు మరణానంతరం గత సంవత్సరం గౌరవ బిరుదులు, ఫస్ట్-క్లాస్ మెరిట్ పతకాలను అందజేసింది. గతంలో రష్యా ఏజెన్సీలు చైనా నష్టంపై ఒక ప్రకటన చేయగా.. తాజాగా ఆస్ట్రేలియా పేపర్ ఒకటి ఏడాది విచారణ తర్వాత ఆ మరణాల సంఖ్య ఎక్కువేనని ప్రకటించింది. చీకట్లో శీతల వరద ప్రవాహాంలో పడి చాలామంది సైనికులు కొట్టుకు పోయి ఉంటారని, కానీ, చైనా ఆ విషయాన్ని దాస్తోందని ఆ వార్తా పత్రిక.. ఈ మేరకు చైనా నుంచే పలు ఆధారాలను సేకరించినట్లు మరీ వెల్లడించింది. ఇక గల్వాన్ ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారైన సంగతి తెలిసిందే. చదవండి: షిన్జియాంగ్ కాదు మొత్తం చైనాకే ముడిపెట్టిన బైడెన్ -
గల్వాన్లో మువ్వన్నెల జెండా
న్యూఢిల్లీ: లద్దాఖ్లోని గల్వాన్లోయలో భారీ భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్న ఆర్మీ బలగాల ఫొటోలను రక్షణ వర్గాలు విడుదల చేశాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా భారత సైనిక బలగాలు లోయలో భారత జెండాతో ప్రదర్శన నిర్వహించాయి. ఈ లోయ తమ అదీనంలో ఉన్నట్లు చూపుతూ చైనా ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలను తిప్పికొట్టేందుకే భారతీయ రక్షణ వర్గాలు తాజా ఫొటోలు విడుదల చేశాయి. చైనా బలగాలు చైనా జాతీయ జెండాతో గల్వాన్లోయలో ఉన్నట్లు చూపే చిత్రాలను ఆదేశం మూడు రోజుల కిందట విడుదల చేసింది. దీంతో ఈ ప్రాంతం మొత్తం చైనా అధీనంలోకి వచ్చిందన్న దుమారం రేగింది. అయితే ఇవన్నీ చైనా వక్రబుద్ధికి చిహ్నాలని, ఆ ప్రాంతంపై చైనా పట్టు లేదని కేంద్రం వివరణ ఇచ్చింది. చైనా విడుదల చేసిన చిత్రాలు గల్వాన్ లోయ అవతలి ప్రాంతంలోనివని, ఫొటోల్లోని ప్రాంతం నిస్సైనిక మండలం దగ్గరలో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో భారతీయ ఆర్మీ గల్వాన్లోయలో ఉన్న చిత్రాలు విడుదలయ్యాయి. న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు సైతం తన ట్విట్టర్ అకౌంట్లో ఈ చిత్రాలను పోస్ట్ చేశారు. నూతన సంవత్సర సందర్భంగా గల్వాన్లోయలో వీర భారతీయ సైనికులు అని ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. భారతీయ వర్గాలు విడుదల చేసిన ఫొటోలను ఈనెల 1న గల్వాన్లోయలో తీసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక ఫొటోలో అసాల్ట్ రైఫిళ్లు ధరించిన దాదాపు 30 మంది భారతీయ సైనికులు జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. మరో ఫొటోలో నలుగురు సైనికులు భారతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. ఇందులో డోగ్రా రెజిమెంట్ జెండా కూడా కనిపిస్తోంది. నూతన సంవత్సర సందర్భంగా సరిహద్దుల్లో భారతీయ రక్షణ వర్గాలు చైనా సైనికులకు స్వీట్లు పంచి సహృద్భా వం చాటారు. కానీ చైనా మాత్రం కుయుక్తితో నకిలీ ఫొటోలను, అభూత వీడియోను విడుదల చేసింది. -
డ్రాగన్ దుష్ట పన్నాగాలు
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మరోసారి తన యుద్ధకాంక్షను బయటపెట్టింది. రణక్షేత్రంలో తమకు ఎదురు నిలిచే దేశంపై పైచేయి సాధించేందుకుగాను సరిహద్దులకు వేగంగా సైన్యాన్ని, శతఘ్నులను తరలించేందుకు పటిష్ట ప్రణాళికలతో దూసుకెళ్తోంది. భారత్–చైనా మధ్య 18 నెలలుగా తీవ్ర ఉద్రిక్తంగా తయారైన తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఒక వంతెనను నిర్మించింది. ప్యాంగాంగ్ త్సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలను కలుపుతూ ఈ బ్రిడ్జిని యుద్ధప్రాతిపదికన నిర్మించారని తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా బహిర్గతమైంది. భారత్తో ఘర్షణ తలెత్తితే హుటాహుటిన సైన్యాన్ని, భారీ ఆయుధాలను, యుద్ధ సామగ్రిని తరలించాలనే ఎత్తుగడతోనే చైనా దీన్ని నిర్మించిందని శాటిలైట్ ఫొటోలకు సంబంధించిన జియో ఇంటెలిజెన్స్ నిపుణుడు డామిన్ సైమన్ విశ్లేషించారు. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణం వైపున ఉన్న కైలాస్ శిఖరాలను ముందుగా చేరుకుని గత ఏడాది భారత సేనలు అక్కడ పట్టు సాధించాయి. దీంతో భవిష్యత్తులో భారత సైన్యానికి దీటుగా స్పందించేందుకే సైన్యం మోహరింపునకు వీలుగా కొత్త వంతెనను చైనా సిద్ధం చేసిందని తెలుస్తోంది. కొత్త వంతెన ద్వారా అదనపు ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో సైన్యాన్ని రంగంలోకి దింపి చైనా బరితెగించనుంది. 2020 తొలినాళ్ల నుంచే భారత్, చైనా చెరో 50 వేల సైన్యాన్ని తూర్పు లద్దాఖ్లో మోహరించాయి. 2020 జూన్లో గల్వాన్ నదీ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం ఘర్షణల్లో 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. దాదాపు ఏడాదిపాటు తూర్పు లద్దాఖ్లో తీవ్ర ఉద్రిక్తత రాజ్యమేలింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీల చర్చల తర్వాత ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లాలని ఇరుదేశాల సైన్యాలు నిర్ణయించాయి. అటు వైపే బ్రిడ్జి కట్టారు సరిహద్దు వెంట చైనా అధీనంలోని ప్రాంతంలోనే బ్రిడ్జి నిర్మాణం జరిగిందని భారత ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. రెండు కి.మీల. నిస్సైనిక ప్రాంతంలో ఈ వంతెనను నిర్మించలేదని, గల్వాన్ ఘర్షణల తర్వాత కుదిరిన ఒప్పందాలను చైనా ఉల్లంఘించలేదని భారత సైనిక వర్గాలు తెలిపాయి. అంగుళం కూడా వదులుకోం: గ్లోబల్ టైమ్స్ కొత్త సంవత్సరం మొదలైన కొద్ది గంటలకే గల్వాన్ లోయ తమదేనంటూ తమ జాతీయ జెండాను చైనా గల్వాన్లో ఎగరేసిందని ఆ దేశ జాతీయ మీడియా సంస్థలు సంబంధిత వీడియోను ప్రముఖంగా ప్రసారం చేశాయి. ‘ఒక్క అంగుళం నేల కూడా వదులుకునేది లేదు’ అనే సందేశాన్ని చైనా సైనికులు తమ పౌరులకు కొత్త సంవత్సర కానుకగా పంపించారని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. దీంతో విపక్షాలు మోదీ సర్కార్పై మండి పడ్డాయి. ‘గల్వాన్ లోయకు మన త్రివర్ణ పతాకమే సరిగ్గా సరిపోతుంది. ప్రధాని మౌనదీక్షను వీడి చైనా ఆక్రమణలపై మా ట్లాడాలి’ అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. 🇨🇳China’s national flag rise over Galwan Valley on the New Year Day of 2022. This national flag is very special since it once flew over Tiananmen Square in Beijing. pic.twitter.com/fBzN0I4mCi — Shen Shiwei沈诗伟 (@shen_shiwei) January 1, 2022 (చదవండి: మీ మనసులోకి తొంగి చూడలేను.. శిక్ష అనుభవించాల్సిందే!) (చదవండి: దక్షిణాఫ్రికా ‘పార్లమెంట్’లో అగ్ని ప్రమాదం) -
కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారం
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్బాబుకు(37) మహావీర్చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ భార్య, తల్లి ఈ అవార్డును స్వీకరించారు. కాగా యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే రెండో అత్యున్నత పురస్కారమే మహావీర్ చక్ర. చదవండి: సిద్దిపేట లాల్ కమాన్పై ఉన్నట్టుండి వెలసిన కేసీఆర్ విగ్రహం కాగా భారత్, చైనా సైనికుల మధ్య తూర్పు లద్దాఖ్లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో 2020 జూన్ 15వ తేదీ రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది బిహార్ రెజిమెంట్కు చెందినవారు. 16-బిహార్ రెజిమెంట్లో కమాండింగ్ ఆఫీసర్ సంతోష్ బాబు నేతృత్వం వహిస్తున్న దళంతోనే గల్వాన్ లోయలో చైనా సైనికులు ఘర్షణకు దిగారు. సంతోష్ బాబుది తెలంగాణలోని సూర్యాపేట. సంతోష్ 1982లో జన్మించారు. సంతోష్ బాబుకు భార్య మంజుల, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. ఆయన చైనా సరిహద్దుల్లో ఏడాదిన్నరగా విధుల్లో ఉన్నారు. -
చైనీయులకు షాకిచ్చే త్రిశూల్.. వజ్ర..!
న్యూఢిల్లీ: పరమశివుని చేతిలో త్రిశూలం..ఇప్పుడిక భారత బలగాల చేతుల్లో ఆయుధంగా మారనుంది. డ్రాగన్ ఆర్మీకి షాకిచ్చేందుకు త్రిశూల్, వజ్ర పేర్లతో ప్రాణహాని కలిగించని ఆయుధాలను భారత సైన్యం సిద్ధం చేసుకుంటోంది. గల్వాన్ ఘటన సమయంలో చైనా బలగాలు ఇనుపరాడ్లు, ఇనుప ముళ్లు లాంటి ఆయుధాలతో భారత సైనికులపైకి దాడికి వచ్చిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణల సమయంలో ప్రాణహాని కలిగించని ఆయుధాలనే వాడాలంటూ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు చైనా ఆర్మీ అప్పట్లో వీటిని ఉపయోగించింది. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా సరిహద్దుల్లోని భారత బలగాలు దీటైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. చైనా సైన్యం(పీఎల్ఏ) వాడిన మాదిరిగా సంప్రదాయ ఆయుధాలనే భారత సైన్యం కూడా సమకూర్చుకుంటోంది. ఈ మేరకు బాధ్యతలను నోయిడాకు చెందిన అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ త్రిశూల్, వజ్ర వంటి పేర్లతో ప్రాణహాని కలిగించని సంప్రదాయ ఆయుధాలకు రూపకల్పన చేసింది. దీనిపై అపాస్టెరాన్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మోహిత్ కుమార్ ఏఎన్ఐతో మాట్లాడుతూ..‘చైనా బలగాలను ముఖాముఖి ఎదుర్కొనే సమయంలో ప్రాణహాని కలిగించని ఆయుధాలను తయారు చేయమంటూ భారత ఆర్మీ మాకు బాధ్యతలు అప్పగించింది. మేం రూపొందించిన త్రిశూల్, వజ్ర వంటి వాటిని చూసి ఆర్మీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ‘శివుని చేతిలో త్రిశూలం స్ఫూర్తిగా తీసుకుని ‘త్రిశూల్’ను తయారు చేశాం. త్రిశూల్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. దీనిని తాకిన శత్రు సైనికుడు కొద్ది సెకన్లలోనే షాక్తో పడిపోతాడు. శత్రువుల వాహనాలను అడ్డుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా, వజ్ర.. ఇనుపరాడ్లాగా కనిపించే ఈ ఆయుధం మెరుపులాంటి షాక్ కలిగిస్తుంది. శత్రు సైనికులపై ముఖాముఖి పోరులో దాడి చేసేందుకు, వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల టైర్లకు పంక్చర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చేతికి వేసుకునే గ్లవ్స్ మాదిరిగా ఉండే ‘సప్పర్ పంచ్’అనే ఆయుధం ధరించి శత్రు సైనికుడిని కొడితే ఒకటీ రెండు దెబ్బలకే అతడు షాక్తో పడిపోవడం ఖాయం’అని మోహిత్ చెప్పారు. ‘ఈ ఆయుధాలను కేవలం భారత సైన్యం, భద్రతాబలగాల కోసం మాత్రమే రూపకల్పన చేశాం. ఇతర వ్యక్తులు లేదా సంస్థలకు వీటిని విక్రయించం’అని ఆయన అన్నారు. అయితే, వీటి తయారీ బాధ్యతలను ఆర్మీ ఎప్పుడు అప్పగించిందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. కాగా, నూతన రూపకల్పనలపై ప్రభుత్వం నుంచి గానీ, ఆర్మీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. #WATCH 'Trishul' and 'Sapper Punch'- non-lethal weapons-developed by UP-based Apasteron Pvt Ltd to make the enemy temporarily ineffective in case of violent face offs pic.twitter.com/DmniC0TOET — ANI (@ANI) October 18, 2021 చదవండి: గాల్వాన్ లోయలో అమరులైన మన దేశ ముద్దుబిడ్డలు.. -
రెచ్చగొడితే ధీటైన సమాధానం చెప్తాం
సాక్షి, న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో వివాదాలను కేవలం చర్చల ద్వారానే పరిష్కరించాలని భారత్ కోరుకుంటోందని, అయితే దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తేలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పదునైన వ్యాఖ్యలు చేశారు. భారత్ శాంతి కాముక దేశమని, ఎలాంటి దూకుడును ఆశ్రయించదని తెలిపారు. అయితే ఎవరైనా రెచ్చ గొట్టినా, బెదిరింపులకు పాల్పడినా తగిన ధీటైన సమాధానం ఇచ్చేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం తూర్పు లద్దాఖ్ లోని క్యున్గమ్తోపాటు ఫార్వార్డ్ పోస్కరులో జవాన్లనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన, చైనా సహా అనవసరంగా కాలు దువ్వే ఇతర పొరుగు దేశాలకు అర్థమయ్యేలా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. కాగా గతేడాది జూన్లో గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన 20 మంది సైనికులకు రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఆ అమరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరచిపోదని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా, భారత్లు పాంగోంగ్ సరస్సు ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ తూర్పు లద్దాఖ్లోని కొన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకునేందుకు చైనా అయిష్టత చూపుతుండటంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ మూడు రోజుల పర్యటన ఒక ముందడుగుగా భావించాల్సి ఉంటుంది. ఏ సమస్యకు అయినా స్పష్టమైన ఉద్దేశం ఉంటే చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించవచ్చని రక్షణ మంత్రి తెలిపారు. ‘గతేడాది దేశ ఉత్తర సరిహద్దులో మనం పెద్ద సవాలును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మా సాయుధ దళాలు సవాలును ఎదుర్కొనే విషయంలో వారి ధైర్యాన్ని, అంకితభావాన్ని ప్రదర్శించాయి. ప్రతి సవాలుకు తగిన సమాధానం ఇచ్చే సామర్ధ్యం మన సైన్యానికి ఉంది. మనం ఎల్లప్పుడూ ప్రపంచ శాంతి కోసం పనిచేశాము. ఎవ్వరిపై దాడి చేయలేదు. మన లక్ష్యం ఎవ్వరిపై విజయం సాధించడం కాదు. భారతదేశం ఏ దేశంపై దాడి చేయలేదు సరికదా అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు. మన ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది’అని సైనికులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భారత్ వైఖరిని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అంతేగాక ‘మనం యుగాలుగా పొరుగువారే అని విషయం మన పొరుగు దేశాల వారు గుర్తెరగాలి. ఇకపై అనేక యుగాలపాటు పొరుగువారిగా ఉంటాము. వివాదాస్పద సమస్యలకు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాలు దొరకలేదా? మన దేశానికి చుట్టుపక్కల ఉన్న పొరుగువారు అందరి గురించి మాట్లాడుతున్నాను. మనకు స్పష్టమైన ఉద్దేశం ఉన్నట్లయితే ఎలాంటి వివాదాలను అయినా పరిష్కరించుకోవచ్చు’అని రక్షణమంత్రి వ్యాఖ్యానించారు. అదే సమయంలో సాయుధ దళాలకు అన్ని విధాలా సహకరించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్నాథ్ హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో జరిగే ప్రతీ ఘటనను ఎదుర్కోగల బలమైన సైనికదళాన్ని కలిగి ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనను ఆయన పునరుద్ఘాటించారు. గతేడాది జూన్ 15న గాల్వాన్ లోయలో జరిగిన ఘటనలో భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యాన్ని ప్రశంసించిన రాజ్నాథ్ సింగ్, దేశానికి తన సాయుధ దళాల పట్ల గర్వంగా ఉందని అన్నారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్మించిన 63 వంతెనలను ప్రారంభించారు. కాగా ఆదివారం తూర్పు లద్దాఖ్లో భారత సైనిక సన్నద్ధతపై రాజ్నాథ్ సమీక్ష నిర్వహించారు. రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలకు ప్రస్తుత పరిస్థితులు, లద్దాఖ్–లేహ్ ప్రాంతంలో సైన్యం సంసిద్ధతపై ఆర్మీ చీఫ్ కమాండర్లు సమగ్రంగా వివరించారు. -
సరిహద్దు ఉద్రిక్తత: 50 వేల అదనపు బలగాల మోహరింపు
న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణ అనంతరం భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఎన్నడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దు వెంబడి సుమారు 50వేల అదనపు బలగాలను మోహరించినట్లు సమాచారం. బ్లూంబర్గ్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా చైనా సరిహద్దు వెంబడి మూడు ప్రాంతాలకు దళాలను, స్క్వాడ్రాన్ ఫైటర్ జెట్లను చేరవేసినట్లు తెలిపింది. గతేడాదితో పోల్చుకుంటే.. ఇండియా ఈ ఏడాది 40 శాతం అదనంగా అనగా 20 వేల దళాలలను సరిహద్దులో మోహరించినట్లు నివేదిక వెల్లడించింది. గతేడాది తూర్పు లద్ధాఖ్లో నెలకొన్న ఘర్షణల తర్వాత కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ లోయ నుంచి అత్యుత్తన్న శిఖర ప్రాంతాలకు సైనికులను చేరవేయడం కోసం ఎక్కువ సంఖ్యలో హెలికాప్టర్లతో పాటు ఎం777 హోయిట్జర్ వంటి అత్యాధునిక ఆయుధాలను తరలించిందని బ్లూమ్బర్గ్ నివేదిక పేర్కొంది. ఇక భారత సరిహద్దు సమీపంలో చైనా ఇప్పటివరకు ఎన్ని దళాలను మోహరించిందో స్పష్టంగా తెలియదు. కానీ హిమాలయాల వెంబడి వివాదాస్పద ప్రాంతాలలో పెట్రోలింగ్ బాధ్యత వహించే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల టిబెట్ నుంచి జిన్జియాంగ్ మిలిటరీ కమాండ్కు అదనపు బలగాలను తరలించినట్లు తెలిసింది. చదవండి: శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం.. -
గాల్వాన్ లోయలో అమరులైన మన దేశ ముద్దుబిడ్డలు..
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో ఉన్న గల్వాన్ లోయలో భారత్, చైనా ఆర్మీల మధ్య ఘర్షణ తలెత్తి ఏడాది గడిచింది. చైనా దొంగ దెబ్బ తీయడంతో.. ఈ ఘర్షణలో భారత్ కు చెందిన 20 మంది ముద్దుబిడ్డలు అమరులయ్యారు. అయితే, ఈ సంఘటనలో మన జవాన్లు అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించారు. వారి కాల్పులకు మనవారు సైతం .. గట్టిగా సమాధానం ఇచ్చారు. దీంతో ఈ కాల్పులలో చైనాకు చెందిన 35 సైనికులు మరణించారు. గాల్వాన్ లోయలో అమరులైన మన దేశ ముద్దుబిడ్డలు.. వారి హోదా ఈ క్రింద ఇవ్వబడినాయి. ఆ భగవంతుడు వీర జవాన్ల ఆత్మకు శాంతిని, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 1. బి. సంతోష్ బాబు(కల్నల్) - సూర్యాపేట, తెలంగాణ 2. నాధూరం సోరెన్ ( నాయబ్ సుబేదార్) - మయూర్ బంజ్, ఒడిశా 3. మన్దీప్ సింగ్ ( నాయబ్ సుబేదార్) - పాటియాల, పంజాబ్ 4. సత్నమ్ సింగ్ ( నాయబ్ సుబేదార్) - గురుదాస్పూర్, పంజాబ్ 5. కె. పళని (హవిల్దార్) - మధురై, తమిళనాడు 6. సునిల్ కుమార్ (హవిల్దార్) - పట్నా, బిహర్ 7. బిపుల్ రాయ్ ( హివిల్దార్) - మీరట్, ఉత్తర ప్రదేశ్ 8. దీపక్ కుమార్ (సిపాయి) - రీవా, మధ్యప్రదేశ్ 9. రాజేష్ అరంగ్ (సిపాయి) - బిర్భుమ్, పశ్చిమ బెంగాల్ 10. కుందన్ కుమార్ ఓజా (సిపాయి) - సాహిబ్ గంజ్, జార్ఖండ్ 11. గణేష్రామ్ (సిపాయి) - కాంకెర్, ఛత్తీస్ఘడ్ 12. చంద్రకాంత్ ప్రధాన్ (సిపాయి) - కందమాల్, ఒడిషా 13. గుర్విందర్ సింగ్ (సిపాయి) - సంగ్రూర్, పంజాబ్ 14. గుర్ తేజ్ సింగ్ (సిపాయి) - మాన్నా, పంజాబ్ 15. అంకుశ్ (సిపాయి) - హమిర్పూర్, హిమాచల్ ప్రదేశ్ 16. చందన్ కుమార్ ( సిపాయి) - భోజ్పూర్, బిహర్ 17. కుందన్ కుమార్ (సిపాయి) - సహస్ర, బిహర్ 18. అమన్ కుమార్ (సిపాయి) - సమస్తిపూర్, బిహర్ 19. జై కిశోర్ సింగ్ (సిపాయి) - వైశాలి, బిహర్ 20. గణేష్ హన్స్డ్ (సిపాయి) - తూర్పు సింగ్భమ్, జార్ఖండ్ -
Galwan : వీరులు వీరే.. అంటోన్న ఇండియన్ ఆర్మీ
లేహ్ : తూర్పు లద్ధాఖ్లో గల్వాన్లోయలో ఇండియా, చైనా ఆర్మీల మధ్య ఘర్షణ జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా ఇండియన్ ఆర్మీ వీడియో రిలీజ్ చేసింది. ప్రపంచమంతా కరోనా విపత్తుతో విలవిలాడుతుండగా 2020 జూన్ 15న గల్వాన్లోయలో కీలక ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించింది. కల్నల్ సంతోశ్ కుమార్ నేతృత్వంలో భారత సైనికులు వీరోచితంగా పోరాడి చైనా ఆర్మీ ఆట కట్టించారు. అయితే ఈ ఘర్షణలో కల్నల్ సంతోశ్కుమార్తో పాటు 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనా వైపు యాభై మందికి పైగా చనిపోయినట్టు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. వో హై గల్వాన్కే వీర్ గల్వాన్ ఘర్షణ చోటు చేసుకుని ఏడాది పూర్తైన సందర్భంగా వో హై గల్వాన్ కే వీర్ పేరుతో ఇండియన్ ఆర్మీ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. హరిహరన్, సోనూనిగమ్లతో కూడిన గాయకుల బృందం ఈ పాటను ఆలపించగా... ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఇండియన్ సైనికులు ఏ విధంగా గస్తీ కాస్తూ దేశ భద్రతను కాపాడుతున్నారనే విషయాల్ని వీడియోలో చూపించారు. చివరగా గల్వాన్ పోరాటంలో అమరులు ఈ వీడియోలో కనిపిస్తారు. #WATCH Indian Army releases a video on the first anniversary of the Galwan Valley clash in which 20 Indian soldiers were killed while fighting Chinese aggression pic.twitter.com/ykJhcXrgxg — ANI (@ANI) June 15, 2021 చదవండి: Bomb Blast : ఢిల్లీ పేలుళ్ల వెనుక ఉన్నది వీళ్లే ? -
గల్వాన్ ఎఫెక్ట్: చైనా ఉత్పత్తులపై భారీ దెబ్బ
లడఖ్లోని గల్వాన్ వ్యాలీలో భారతీయ, చైనా సైన్యాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ వల్ల చైనాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గల్వాన్ ఘర్షణ జరిగిన ఏడాది తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫాం లోకల్సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ సర్వే ప్రకారం.. గత 12 నెలల్లో 43 శాతం మంది భారతీయులు చైనా తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయలేదని సర్వేలో తేలింది. గత ఏడాది కాలంలో 'మేడ్ ఇన్ చైనా' ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారిలో 60 శాతం మంది 1-2 వస్తువులను మాత్రమే కొనుగోలు చేసినట్లు ఈ సర్వే పేర్కొంది. గల్వాన్ వ్యాలీ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా నిరసన కారులు డిమాండ్ చేశారు. ఈ సంఘటన తర్వాత దేశంలో స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి టిక్ టాక్, అలీ ఎక్స్ ప్రెస్ వంటి చైనాకు చెందిన 250కి పైగా యాప్స్ ను కేంద్ర ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. నవంబర్ 2020లో పండుగ సీజన్ కాలంలో లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 71 శాతం మంది భారతీయ వినియోగదారులు 'మేడ్ ఇన్ చైనా' ఉత్పత్తులను కొనుగోలు చేయలేదని తేలింది. భారతదేశంలోని 281 జిల్లాల్లో 18,000 మంది ప్రజలు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను తెలిపినట్లు లోకల్ సర్కిల్స్ తెలిపింది. చైనా ఉత్పత్తులను కొనడానికి ప్రధాన కారణం ఖర్చు తక్కువగా ఉండటమే ప్రధానం అని ప్రజలు తెలిపారు. గత ఏడాది కాలంలో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన 70 శాతం మంది ఖర్చు తక్కువగా ఉండటమే వల్ల అలా చేసినట్లు తెలిపారు. ఈ కాలంలో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారిలో 14 శాతం మంది 3-5 ఉత్పత్తులను కొనుగోలు చేయగా, 7 శాతం మంది 5-10 వస్తువులను కొనుగోలు చేశారని చెప్పారు. ఎలక్ట్రికల్ మెషినరీ, ఉపకరణాలు, ఔషధాలు, మందులతో సహా అనేక ఉత్పత్తుల కోసం భారతదేశం చైనాపై ఆధారపడుతుంది. భారతదేశం ఇంటర్మీడియట్ వస్తువుల దిగుమతిలో చైనా వాటా 12 శాతం ఉంటే, మూలధన వస్తువులలో 30 శాతం, తుది వినియోగ వస్తువులలో 26 శాతం ఉంది. మొత్తానికి ఈ గల్వాన్ సంఘటన వల్ల దేశీయ ఉత్పత్తుల కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపినట్లు తెలుస్తుంది. దీని వల్ల ఎంత కొంత చైనా ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. చదవండి: దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీగా బైజుస్ -
గల్వాన్ ఘర్షణలకు ఏడాది పూర్తి
-
గల్వాన్ ఘటన: ఈ కుర్ర జవాన్ ఎవరో తెలుసా!
ఇంఫాల్: పదో విడత కోర్ కమాండర్ స్థాయి సమావేశాలకు ముందు చైనా శనివారం కొన్ని వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్లో జరిగిన గల్వాన్ ఘటనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని చైనా ఆరోపించింది. అయితే ఈ వీడియోల్లో ఆవేశంతో చైనా దళాలను హెచ్చరిస్తూ ఓ కుర్ర జవాను భారత సైన్యాన్ని నడిపించినట్లు కనిపించాడు. దీంతో అందరి దృష్టి ఆ కుర్రాడిపై పడింది. ఇంతకీ అతడు ఎవరా అని తెలుసుకునేందుకు అందరూ ఉత్సుకతతో ఉన్నారు. అయితే చైనా ఈ వీడియోలను విడుదల చేసిన తర్వాత కూడా భారత్ అతడి వివరాలను వెల్లడించడంలో గొప్యత పాటించింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర యువజన వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజీజు ఈ కుర్ర ఆఫీసర్ ఎవరన్నది ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ‘ఇతడు మణిపూర్ సేనాపతి జిల్లాకు చెందిన కెప్టెన్ సోయిబా మనినగ్భా రంగ్నామి. 2018లో సైన్యంలో చేరిన ఈ కుర్ర ఆఫీసరు ప్రస్తుతం 18వ బిహార్ రెజిమెంట్లో కెప్టెన్గా వ్యవహరిస్తున్నట్టు’ ఆయన పేర్కొన్నారు. అలాగే మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ సైతం ట్వీట్ చేసి కెప్టెన్ రంగ్నామీపై ప్రశంసలు కురిపించారు. ‘మీట్ మణిపూర్ సేనాపతి జిల్లాకు చెందిన కెప్టెన్ సోయిబా. ఇతడు గల్వాన్ లోయ వద్ద చైనాకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలో భారత దళాన్ని నడిపించాడు. దేశం కోసం నిలబడి అతడు చూపించిన శౌర్యం మనందరినీ గర్వించేలా చేసింది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా అతడిని ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘మెన్షన్ ఆఫ్ డిస్పాచెస్’ గౌరవాన్ని ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. Meet Capt. Soiba Maningba Rangnamei from Senapati District, Manipur of 16 Bihar, leading his men in Galwan during the confrontation against the Chinese PLA. The valour you have shown while standing up for the Nation has made all of us proud. pic.twitter.com/YUuyGzWtaa — N.Biren Singh (@NBirenSingh) February 20, 2021 చదవండి: గల్వాన్ ఘర్షణ: వీడియో విడుదల చేసిన చైనా గల్వాన్ ఘటన: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా ఎట్టకేలకు దిగొచ్చిన చైనా -
గల్వాన్ ఘర్షణ: వీడియో విడుదల చేసిన చైనా
బీజింగ్: భారత్-చైనా మధ్య గత 10 నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలను మోహరించాయి. పలు దఫాల చర్చల అనంతరం ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. ఈ క్రమంలో చైనా గతేడాది జరిగిన గల్వాన్ ఘర్షణలో తమ సైనికులు కేవలం నలుగురు చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించింది. వారి త్యాగాలను స్మరించుకుంటూ సెంట్రల్ మిలటరీ కమిషన్ ఆఫ్ చైనా వారికి మరణానంతరం శౌర్య పురస్కారలను ప్రదానం చేయనున్నట్లు ఎల్ఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 2020 జూన్లో గల్వాన్ లోయలో భారత, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణ వీడియో ఫుటేజ్ను చైనా ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ విడుదల చేసింది. అప్పుడు జరిగిన ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన 20 మంది సైనికులు చనిపోయారు. ఈ గొడవల్లో తమ సైనికులు నలుగురు చనిపోయారని చైనా అంగీకరించింది. చైనా తరఫున విడుదలైన ఈ వీడియోలో చనిపోయిన నలుగురు సైనికులకు చైనా ఆర్మీ గౌరవ వందనం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ, ఇరు సైన్యాల అధికారులు మాట్లాడుకోవడం కూడా కనిపిస్తుంది. ఈ వీడియోలో చైనా పరోక్షంగా భారత్ను ఉద్దేశిస్తూ ‘‘ఏప్రిల్ నుంచి విదేశీ శక్తులు పాత ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయి. వంతెనలు, రోడ్డు వేయడం కోసం వాళ్లు సరిహద్దును దాటారు. త్వరత్వరగా నిఘా పూర్తి చేశారు" అని ఆరోపించింది. "విదేశీ శక్తులు యధాతథ స్థితిలో మార్పు తెచ్చేందుకు ఏకపక్షంగా ప్రయత్నించారు. ఫలితంగా సరిహద్దుల్లో వేగంగా ఉద్రిక్తతలు పెరిగాయి, ఒప్పందాలను గౌరవిస్తూ మేం చర్చల ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నించడానికి చూశాం’’ అని పేర్కొంది. ఈ వీడియో ఫుటేజిలో భారత, చైనా సైనికులు రాత్రి చీకట్లో ఒకరిపై ఒకరు కాల్పులు జరపడం కనిపిస్తోంది. అందులో చైనా సైనికులు గాయపడ్డ తమ సైనికుడిని తీసుకెళ్లడం కూడా ఉంది. అందులోనే చనిపోయిన తమ సైనికులకు చైనా ఆర్మీ గౌరవ వందనం చేయడం కూడా వీడియోలో కనిపిస్తుంది. మా సైనికులు చనిపోయారు: చైనా అంతకు ముందు చైనా ఆర్మీ అధికారిక పత్రిక పీఎల్ఏ డెయిలీని ప్రకారం ఒక వార్త ప్రచురించిన గ్లోబల్ టైమ్స్ "చైనా తన సార్వభౌమత్వాన్ని రక్షించుకోడానికి త్యాగాలు చేసిన సైనికులకు నివాళిగా వారి పేర్లు, వివరాలను మొదటిసారి వెల్లడించింది" అని తెలిపింది. కారాకోరమ్ పర్వతాల్లో చైనా సైన్యంలోని నలుగురు అధికారులు, సైనికులను చైనా సెంట్రల్ మిలిట్రీ కమిషన్ గుర్తించిందని వారిని తగిన పదవులతో సత్కరిస్తామని పీఎల్ఏ డెయిలీ శుక్రవారం తన రిపోర్ట్లో చెప్పుకొచ్చింది. ఆ రిపోర్టులో చైనా ఆర్మీ మొదటిసారి గల్వాన్ ఘర్షణ గురించి వివరణాత్మక కథనం ఇచ్చింది. "భారత సైన్యం అక్కడికి పెద్ద సంఖ్యలో సైనికులను పంపించింది. వారంతా దాక్కున్నారు. చైనా సైన్యం వెనక్కు వెళ్లేలా బలవంతం చేశారు అని చెప్పింది. ఆ దాడుల సమయంలో చైనా సైనికులు స్టీల్ రాడ్లు, మేకులు ఉన్న రాడ్లు, రాళ్లతో తమ సౌర్వభౌమాధికారాన్ని ఎలా రక్షించుకున్నారో కూడా చైనా ఆర్మీ ఆ రిపోర్టులో వెల్లడించింది. చదవండి: భారత్-చైనా యుద్ధం కాస్తలో తప్పింది..! గల్వాన్ ఘటన: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా -
ఎట్టకేలకు దిగొచ్చిన చైనా
న్యూఢిల్లీ/బీజింగ్: తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో గతేడాది జూన్ 15న భారత సైన్యంతో జరిగిన భీకర ఘర్షణలో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదంటూ ఇన్నాళ్లూ బొంకిన చైనా ప్రజా విముక్తి సైన్యం(పీఎల్ఏ) ఎట్టకేలకు మౌనం వీడింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన అతి పెద్ద ఘర్షణగా రికార్డుకెక్కిన ఈ ఘటనపై దాదాపు ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా స్పందించింది. భారత సైన్యం చేతిలో పెద్ద సంఖ్యలో చైనా సైనికులు హతమయ్యారని ప్రపంచమంతా నమ్ముతున్నప్పటికీ అర్ధసత్యాన్నే బయటపెట్టింది. ప్రజలకు వాస్తవాలు చెబుతున్నామంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. గల్వాన్ ఘర్షణలో తమ సైనికులు కేవలం నలుగురు ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. వారి త్యాగాలను స్మరించుకుంటూ, సెంట్రల్ మిలటరీ కమిషన్ ఆఫ్ చైనా(సీఎంసీ) వారికి మరణానంతర శౌర్య పురస్కారాలను ప్రదానం చేసినట్లు పీఎల్ఏ తెలియజేసింది. కనీసం 45 మంది చైనా సైనికులు మృతి! గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో తమ సైనికులు 20 మంది మృతిచెందినట్లు భారత సైన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన కల్నల్ బి.సంతోష్బాబు కూడా ఉన్నారు. అయితే, ఈ ఘటనలో చైనా సైన్యం 30 మందిని కోల్పోయినట్లు అప్పట్లో భారత్ వెల్లడించింది. కనీసం 45 మంది చైనా సైనికులు మరణించి ఉంటారని రష్యా అధికారిక న్యూస్ ఏజెన్సీ టీఏఎస్ఎస్ అంచనా వేసింది. గల్వాన్ ఘటనలో చైనా సైన్యానికి సంభవించిన నష్టంపై రకరకరాల ప్రచారాలు సాగుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేసి, ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలన్నదే తమ ప్రయత్నమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ చెప్పారు. అందుకే మృతుల వివరాలు బయటపెట్టామని అన్నారు. తమ సైనికుల త్యాగాలను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పారు. నేడు భారత్–చైనా మధ్య చర్చలు పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి భారత్, చైనా సైనిక బలగాలను, ఆయుధాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్పాంగ్ నుంచి బలగాలను వెనక్కి తీసుకోవడంపై చర్చించేందుకు భారత్, చైనా మధ్య ఉన్నతస్థాయి సైనిక చర్చలు జరుగనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. కమాండర్ స్థాయి పదో దఫా చర్చలు ఎల్ఏసీ వద్ద చైనా భూభాగంలో మోల్డో బోర్డర్ పాయింట్లో శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని వెల్లడించాయి. పాంగాంగ్ సరస్సు నుంచి బలగాలను వెనక్కి తీసుకున్న తర్వాత జరిగే తొలి చర్చలు ఇవే. -
గల్వాన్ ఘటన: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా
బీజింగ్: భారత్- చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంబనకు దారి తీసిన గల్వాన్ ఘటనలో మృతి చెందిన తమ సైనికుల వివరాలపై డ్రాగన్ దేశం తొలిసారిగా నోరు విప్పింది. తూర్పు లదాఖ్ ఘర్షణలో ఐదుగురు మిలిటరీ ఆఫీసర్లు, సైనికులు అమరులైనట్లు తెలిపింది. ఈ మేరకు మృతుల పేర్లను కూడా చైనా విడుదల చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. షిన్జియాంగ్ మిలిటరీ కమాండర్ కీ ఫబావోతో పాటు, చెన్ హోంగ్జన్, చెన్ షియాన్గ్రాంగ్, షియాలో సియువాన్, వాంగ్ జురాన్ మృతిచెందినట్లు పేర్కొంది. వీరికి గౌరవ హోదాలు కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి సెంట్రల్ మిలిటరీ కమిషన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అదే విధంగా భారత్తో జరిగిన ఘర్షణలో ఆర్మీని ముందుండి నడిపించిన కల్నల్కు సముచిత గౌరవం కల్పించినట్లు పేర్కొంది. కాగా గతేడాది జూన్లో, వాస్తవాధీన రేఖ వెంబడి భారత జవాన్లు- డ్రాగన్ ఆర్మీకి మధ్య జరిగిన ఘర్షణ కారణంగా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. డ్రాగన్ ఆర్మీ దురాగతానికి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అయితే చైనా మాత్రం ఈ ఘటనలో తమ జవాన్లు మరణించినట్లు గతంలో ధ్రువీకరించలేదు. ఇక శుక్రవారం తొలిసారిగా అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నలుగురు మృతి చెందినట్లు వెల్లడైంది. Chinese top military body Central Military Commission awards 4 Chinese soldiers who lost their lives in the Galwan clash pic.twitter.com/JZ3ZeeIpWK — ANI (@ANI) February 19, 2021 -
భారత్-చైనా యుద్ధం కాస్తలో తప్పింది..!
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో భారత్-చైనాల మధ్య గత తొమ్మిది నెలలుగా తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. సరిహద్దు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు నడిచాయి. తాజాగా సరిహద్దులో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. గతేడాది జూన్లో ఇరు దేశాల మధ్య మొదలైన ప్రతిష్టంభన ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ తొమ్మిది నెలల కాలంలో సరిహద్దులో ఇరు దేశాల మధ్య కొన్ని సార్లు యుద్ధ వాతావరణం నెలకొన్నదని.. ఒకానొక సమయంలో ఇక యుద్ధ భేరి మోగించడమే తరువాయి అనే పరిస్థితులు తలెత్తాయి అని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. ఈ సందర్భంగా వైకే జోషి మాట్లాడుతూ.. ‘‘గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఎర్ర గీత గీశారు. దీని తర్వాత కేంద్రం మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. డ్రాగన్ తోక జాడిస్తే.. దాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆపరేషన్ అయినా చేపట్టవచ్చని మాకు ఆదేశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో గతేడాది ఆగస్టు 29, 30న మన సైన్యం దక్షిణాన ఉన్న కైలాష్ రేంజ్ శిఖరాలను స్వాధీనం చేసుకుంది. ఈ చర్యలను చైనా ఏ మాత్రం ఊహించలేకపోయింది.. సహించలేకపోయింది. దీనికి ప్రతీకారంగా కౌంటర్ ఆపరేషన్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆగస్టు 31న పీఎల్ఏ దళాలు మనకు అతి సమీపంలోకి వచ్చాయి. పరిస్థితి చూస్తే ఏ క్షణంలోనైనా యుద్ధం తప్పదన్నట్లుగా ఉంది’’ అన్నారు. ‘‘ఇక ఇటువైపు మన ట్యాంక్ మ్యాన్, గన్నర్, రాకెట్ లాంచర్ అందరూ సిద్ధంగా ఉన్నారు. ట్రిగ్గర్ వదిలితే చాలు.. దీనికి ధైర్యంతో పని లేదు. ఇక్కడ అత్యంత కష్టమైన పని ఏంటంటే కాల్పులు జరగకుండా చూడటం.. రక్తం చిందకుండా.. ప్రాణాలు కోల్పోకుండా చూడటం. ఈ పరిస్థితి తలెత్తకుండా చూడాలంటే ఎంతో ధైర్యం కావాలి. మాకు స్పష్టంగా అర్థం అవుతుంది యుద్ధం చేసే సందర్భం వచ్చిందని. మన జవాన్లు చాలా నిబద్ధతతో వ్యవహరించారు. మొత్తానికి డ్రాగన్ను కట్టడి చేయగలిగాం. యుద్ధం తప్పించగలిగాం’’ అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు’’ వైకే జోషి. 45 మంది చనిపోయి ఉండొచ్చు గల్వాన్ ఘర్షణ సందర్భంగా 45 మంది చైనా జవాన్లు మరణించారని ఓ రష్యన్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జోషి కూడా నేరుగా నంబర్ చెప్పకపోయినా.. అదే అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. చైనా వైపు చనిపోయిన వాళ్ల గురించి మన ఆర్మీ నుంచి ఇలాంటి ప్రకటన రావడం ఇదే తొలిసారి. ‘‘గల్వాన్ ఘర్షణలో ఎంత మంది మరణించి ఉంటారనే దాని గురించి నేను ఎలాంటి అంచనా వేయను. కానీ ఆ ఘటన జరిగినప్పుడు మా వైపు ఆబ్జర్వేషన్ పోస్ట్లు ఉన్నాయి. చాలా మందిని స్ట్రెచర్లలో తీసుకెళ్లడం కనిపించింది. 60మందికి పైగానే ఇలా తీసుకెళ్లారు. అందులో అందరూ చనిపోయారా లేదా తెలియదు. రష్యన్ ఏజెన్సీ చెప్పినట్లు మరణించిన చైనా సైనికుల సంఖ్య 45 లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చు’’ అన్నారు జోషి. చైనాకు కార్గిల్ హీరో సలహా కార్గిల్ యుద్ధ హీరో అయిన జోషి.. తన కెరీర్లో చాలా వరకూ లద్ధాఖ్ శిఖరాల్లోనే గడిపారు. ఆయనకు చైనా భాష మాండరిన్ చాలా బాగా తెలుసు. ఇక గల్వాన్ ఘర్షణ వల్ల చైనాకు చెడ్డపేరు రావడం తప్ప వాళ్లు సాధించింది ఏమీ లేదన్నారు జోషి. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రముఖ మాండరిన్ సామెతను గుర్తు చేసుకున్నారు. ‘‘దూరంగా ఉన్న బంధువు, దగ్గరగా ఉన్న పొరుగువారు ఎప్పటికీ సమానం కారు’’ అనే సామెత చెప్పారు. అంటే పొరుగు వాళ్లతో మంచి సంబంధాలు నెలకొల్పడం ముఖ్యం కానీ.. దూరంగా ఉన్న బంధువుపై ఆధారపడటం సరికాదు అని దీని అర్థం అన్నారు జోషి. ఇదే సామెతను తాను చైనాకు చెబుతానని అన్నారు. ‘‘మేము(భారత్) వాళ్లతో మంచి పొరుగువారిగా ఉంటాము కానీ రెండు వైపులా ఆ నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యత ఇప్పుడు చైనాపైనే ఉంది’’ అని జోషి స్పష్టం చేశారు. చదవండి: మాటకి కట్టుబడి వెనుదిరిగిన చైనా సైన్యం గల్వాన్ ఘర్షణపై సంచలన విషయాలు బహిర్గతం.. -
గల్వాన్ ఘర్షణపై సంచలన విషయాలు బహిర్గతం..
మాస్కో: భారత్, చైనా దేశాల మధ్య తూర్పు లద్ధాక్లోని గల్వాన్ లోయలో గతేడాది జరిగిన ఘర్షణలో చైనాకే ఎక్కువ ప్రాణ నష్టం వాటిల్లిందని రష్యా న్యూస్ ఏజన్సీ టీఏఎస్ఎస్ సంచలన విషయాలను వెల్లడించింది. ఆ ఘర్షణలో చైనాకు చెందిన 45 మంది సైనికులు మరణించినట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది. 2020 జూన్ 15న ఎల్ఏసీ వద్ద భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుస్సాహసం చేయగా, 16వ బీహార్ బెటాలియన్కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైనికులు చైనా దళాలకు ధీటుగా జవాబిచ్చారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులయనట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అయితే చైనా మాత్రం వారికి జరిగిన ప్రాణనష్టంపై ప్రకటన విడుదల చేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన 40 మందికిపైగా సైనికులు మరణించి ఉంటారని విదేశీ మీడియా కథనాలు వెలువరించినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. కాగా, ఈ ఘర్షణ అనంతరం భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు పోటాపోటిగా సైనిక దళాలను సరిహద్దుల్లో మోహరించాయి. సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సైనిక, దౌత్య చర్చలు పలు దశల్లో కొనసాగాయి. ఘర్షణ జరిగిన పది నెలల అనంతరం బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరు దేశాల మధ్య స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం బుధవారం అధికారికంగా వెల్లడించగా, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పార్లమెంట్లో ప్రస్తావించారు. -
రివ్యూ: ఫౌజీ గేమ్ ఎలా ఉందంటే?
సాధారణంగా ఏదైనా కొత్త గేమ్ ని ఇండియాలో లాంచ్ చేస్తున్నారంటే పెద్దగా పట్టించుకోరు. కానీ, ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రజాదరణ పొందిన 'పబ్జీ’కీ పోటీగా ఓ గేమ్ తీసుకొస్తున్నారంటూ ప్రచారం జరిగిన ఆ గేమ్ విడుదల పెద్ద విషయమనే చెప్పాలి. పబ్జీ గేమ్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించాక చాలా మంది గేమ్ లవర్స్ నిరుత్సాహ పడిపోయారు. సరైన మల్టీప్లేయిర్ ప్లేయర్ యాక్షన్ గేమ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసారు. సరిగ్గా అదే సమయంలో భారత సైనికుల వీరోచిత పోరాటాలు ప్రతిబింబించేలా ఓ గేమ్ను రూపొందిస్తున్నామని బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ ప్రకటించింది.(చదవండి: మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?) అదే ఇండియన్ పబ్జీగా పిలువబడే "ఫౌజీ" గేమ్. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నేతృత్వంలో రూపొందిన ఈ గేమ్ గణతంత్ర దినోత్సవ కానుకగా నేడు అందరికి అందుబాటులోకి వచ్చింది. మరి గేమ్ ఎలా ఉంది? పబ్జీకి పోటీ ఇచ్చే స్థాయిలో రూపొందించారో లేదో తెలుసుకుందామా... అందరికంటే ముందుగా ఫ్రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారుల మొబైల్ లలో ఆటోమేటిక్ గేమ్ డౌన్లోడ్ అయింది. ఈ గేమ్ ను సుమారు 500ఎంబీ సైజ్లో తీసుకొచ్చారు. ఫౌజీ గేమ్ ని ఓపెన్ చేసాక మొదటి దశలో మూడు రకాల మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. క్యాంపెయిన్, టీమ్ డెత్ మ్యాచ్, ఫ్రీ ఫర్ ఆల్ అనే మూడు మోడ్స్ కనిపిస్తాయి. ప్రస్తుతం క్యాంపెయిన్ మోడ్ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత దశలో అప్డేట్స్ రూపంలో మిగిలిన మోడ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాఫిక్ సెట్టింగ్స్ మీడియంలో ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి అల్ట్రా వరకు పెంచుకోవచ్చు. ప్రస్తుతం పబ్జీ గేమ్ లో లాగా మల్టీ ప్లేయర్ కి సపోర్ట్ చేయకపోయిన తర్వాత దశలో మల్టీ ప్లేయర్ సపోర్ట్ తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)తో ఆధారంగా పనిచేస్తుంది. చేతులే ఆయుధాలు అయితే ఈ గేమ్ లో చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ అవి పట్టించుకునేంత కావు. ఉదా: మీరు ఒక గుడారంలో ఉంటే మీరు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్న ఆటగాళ్లను కొట్టవచ్చు. అలాగే ప్రారంభ దశలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఆటగాళ్ళు ఒక్కోసారి మిమ్మల్ని కొట్టడం లేదు. ఇందులో పబ్జీలో లాగా గన్స్ అందుబాటులో లేవు, కేవలం కత్తులు మాత్రమే ఉంటున్నాయి. ఇవి కూడా కొన్ని స్టేజిలు దాటాక మీకు లభిస్తాయి. అప్పటి వరకు మీ శతృవులను మీ చేతితో యుద్ధం చేయాల్సి ఉంటుంది.(చదవండి: గాల్వాన్ వీరుడికి పరమవీర చక్ర ఇస్తే బాగుండేది!) ఇందులో ప్రధాన పాత్రలో ఒక సిక్కు సైన్య అధికారి ఉంటాడు. అయితే తను మిగతా తన తోటి సిబ్బందిని చైనా సైన్యం నుండి రక్షించుకోవాలి. గేమ్ లో ముందుకు వెళ్తున్నపుడు ఎనర్జీని పెంచుకోవడానికి పబ్జీలో లాగా డ్రింక్స్ ఏమి ఉండవు. కేవలం మనం భోగి మంటల దగ్గర కూర్చొని ఉంటే హెల్త్ పెరుగుతుంది. ఒక్కోసారి గేమ్ లో హెల్త్ అయిపోయిన దీని సహాయంతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం గేమ్ లో చేతితో పోరాడే ఆయుధాలు కత్తి లాంటివి మాత్రమే ఉన్నాయి. ఇందులో మీరు ఆశించినట్టు తుపాకులు లేవు. తర్వాత మోడ్ లో తీసుకొస్తారేమో చూడాలి. ఈ కత్తి లాంటి ఆయుధంతో శత్రువులను చంపడం చాలా తేలిక అవుతుంది. వాటిని కూడా మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే అవి రెండు హత్యలకు మాత్రమే పరిమితం చేయబడతాయి. సినిమాటిక్ లుక్స్ ఇందులో నాలుగు దశలు ఉంటాయి. ఏ దశలో ఎంతవరకు వచ్చామనేది పైన బార్లో చూపిస్తుంటుంది. ఇందులో పాస్ ఆప్షన్ ఉండటం చేత రియల్ గేమ్ అనుభూతిని మనం మిస్ అవుతాం. అలాగే శత్రువులను కొట్టేటప్పుడు వారి చనిపోయేరో లేదో తెలిపే సూచికలు లేవు. అందువల్ల కొన్నిసార్లు మీరు వారు చనిపోయాక కొట్టాల్సి వస్తుంది. ప్రధానంగా గేమ్ ను సినిమాటిక్ లుక్స్ లో, ఇటీవలి గాల్వన్ సరిహద్దు సంఘటన ఆధారంగా రూపొందించారు. ఇందులో క్రమంగా చెక్పోస్టులను దాటేటప్పుడు మరింత కష్టమైంది అని చెప్పుకోవాలి. ఇందులో గేమర్స్ వారికీ ఇచ్చిన సమయంలో అన్ని దశలను పూర్తి చేయడం అంటే కష్ట్టమే అని చెప్పుకోవాలి. ఆట నిజంగా చాలా కష్టంగానే ఉంది. నేను, నా సహోద్యోగులు ఎవరూ కూడా ప్రస్తుతం అన్ని దశలను పూర్తీ చేయలేకపోయాము.(చదవండి: ఎలోన్ మస్క్ 'స్పేస్ఎక్స్' సరికొత్త రికార్డ్!) ఆట మీద నా అభిప్రాయం ఈ గేమ్ ని ప్రధానంగా చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినట్లు మనకు భాగా తెలిసిపోతుంది. ఇందులో కేవలం పిడిగుద్దులు, కత్తులు తప్ప గన్స్ ఉండవు. అందుకే గేమ్ ఎక్కువ శాతం ఆసక్తిగా అనిపించదు. పబ్జీకి పోటీ అంటూ ప్రచారం జరిగింది కాబట్టి.. దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాంపెయిన్ మోడ్తో ఈ గేమ్ పబ్జీ ప్రేమికుల అంచనాలను అందుకోలేదు. మిగిలిన రెండు మోడ్స్ లో పబ్జీలో లాగా మల్టి ప్లేయర్ సపోర్ట్ తీసుకొస్తే తప్ప ఏమైనా మార్పు ఉండొచ్చు. సాధారణ సమయాలలో చిన్న పిల్లలతో ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. ‘గల్వాన్’ ఘటన గురించి, ఆ సందర్భంలో మన సైనికుల వీరోచిత పోరాటం గురించి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. -
పరమవీర చక్ర ఇస్తే బాగుండేది!
హైదరాబాద్: గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన అవార్డు అందించి ఆయన త్యాగాన్ని గౌరవించింది. ఆయనకు మహావీర చక్ర అవార్డును అందించనున్నట్లు దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ విషయంపై కల్నల్ సంతోష్ బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ స్పందించారు. గాల్వాన్ లోయలో చైనాతో వీరుడికి మహావీర్ చక్ర పురస్కారం దక్కడం సంతోషంగా, గర్వముగా ఉంది. కానీ, "100 శాతం సంతృప్తిగా లేను" అని సంతోష్ బాబు తండ్రి పేర్కొన్నారు. ఆ మహావీరుడికి పరమవీర చక్ర పురస్కారం అందుకోవడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు.(చదవండి: చైనా యాప్లకు మరో భారీ షాక్!) మహావీర్ చక్ర పురస్కారాన్నితక్కువగా ఏమి చూడటం లేదు, కానీ పరమవీర చక్ర పురస్కారం దక్కితే పూర్తి న్యాయం జరిగేదని నా వ్యక్తిగత అభిప్రాయం. తన కుమారుడు చూపిన శౌర్యం రక్షణ దళాలలో పనిచేసే వారితో సహా చాలా మందికి స్ఫూర్తినిచ్చిందని ఆయన అన్నారు. ప్రస్తుతం సంతోష్ బాబు లేకున్నా అందరి మనసుల్లో వున్నారు. సంతోష్ బాబులా ఆర్మీలో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారని సంతోష్ బాబు తండ్రి పేర్కొన్నారు. గల్వాన్ లోయలో గత ఏడాది 2020 జూన్ 15న జరిగిన భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన 20 మంది భారతీయ సైనికుల్లో 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బాబు కూడా ఉన్నారు. తన కుమారుడు అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించి చైనా దళాలతో వీరోచితంగా పోరాడానని మిస్టర్ ఉపేంద్ర అన్నారు. గత ఏడాది సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.ఐదు కోట్ల పరిహారం, అతని భార్యకు గ్రూప్ -1 పోస్టుతో పాటు హైదరాబాద్ లో నివాస స్థలం కూడా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. -
కల్నల్ సంతోష్బాబుకు మహావీరచక్ర
సాక్షి, సూర్యాపేట: భారత్–చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబుకు మహావీరచక్ర పురస్కారం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ‘మహా వీర చక్ర’రెండో అత్యున్నత పురస్కారం. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన పోరాటంలో గతేడాది జూన్ 15న సంతోష్ వీరమణం పొందిన విషయం తెలిసిందే. చదవండి: (మన కనక రాజుకు పద్మశ్రీ) తండ్రి కల నెరవేర్చిన కుమారుడు.. దేశ సేవ చేయాలన్న తన తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ ఆశయాన్ని నెరవేర్చాడు సంతోష్బాబు. సూర్యాపేటకు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులకు సంతోష్ 1983లో జన్మించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సూర్యాపేటలోని సంధ్య హై స్కూల్లో, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యనభ్యసించారు. పాఠశాలలో మౌర్య, గుప్తా హౌస్కు కెప్టెన్గా వ్యవహరించారు. నేషనల్ ఢిపెన్స్ అకాడమీ పుణేలో డిగ్రీ పూర్తి చేశారు. 2004 డిసెంబర్లో జమ్మూలో తొలిసారి మిలటరీ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబర్లో కల్నల్గా పదోన్నతి వచ్చింది. బిహార్ 16వ బెటాలియన్ కామాండింగ్ అధికారిగా ఉన్న కల్నల్ సంతోష్బాబు.. తాను నేతృత్వం వహిస్తున్న బలగాలతో గాల్వన్ లోయల్లో విధులకు వెళ్లారు. కల్నల్ సంతోష్బాబు తన సర్వీసు ఎక్కువ కాలం సరిహద్దులోనే పని చేశారు. 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించారు. కొంతకాలం కాంగో దేశంలో కూడా విధులు నిర్వహించాడు. సంతోష్బాబు భార్య సంతోషికి రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 ఉద్యోగ నియామక పత్రంతో పాటు రూ.4 కోట్ల చెక్కును సీఎం కేసీఆర్ అందజేశారు. కల్నల్ తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కు ఇచ్చారు. ఆమె ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్నారు. -
మా ఓపికను పరీక్షించొద్దు!
న్యూఢిల్లీ: భారత్ ఓపికను పరీక్షించే సాహసం చేయవద్దని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె శత్రు దేశాలను హెచ్చరించారు. ఉత్తర సరిహద్దులో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే కుట్రను సమర్ధవంతంగా తిప్పికొట్టామని వ్యాఖ్యానించారు. లద్దాఖ్ లో చైనాతో ఉద్రిక్తత కొనసాగుతున్న పరిస్థితుల్లో జనరల్ నరవణె వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, చైనాతో సరిహద్దు సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్లో శుక్రవారం జరిగిన ఆర్మీ డే పరేడ్ కార్యక్రమంలో జనరల్ నరవణె పాల్గొన్నారు. గత సంవత్సరం జూన్లో లద్దాఖ్లో ‘గల్వాన్ హీరోలు’ చేసిన ప్రాణత్యాగం వృధా పోదని, దేశ సమగ్రత, సార్వభౌమత్వం, రక్షణకు ప్రమాదం వాటిల్లనివ్వబోమని స్పష్టం చేశారు. ‘తీవ్రమైన చలి పరిస్థితుల్లోనూ తూర్పు లద్దాఖ్ల్లో విధుల్లో ఉన్న భారత సైనికుల నైతిక స్థైర్యం దెబ్బతినలేదు. అక్కడి పర్వతాల కన్నా ఎత్తుగా వారి ధైర్య, సాహసాలున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ‘చర్చలు, రాజకీయ ప్రయత్నాల ద్వారా సమస్యలు పరిష్కారమవ్వాలనే మేం కోరుకుంటాం. అయితే, మా ఓపికను పరీక్షించే తప్పు ఎవరూ చేయవద్దు’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉందని పాకిస్తాన్పై ఆయన మండిపడ్డారు. -
కలకలం: భారత్లోకి చైనా సైనికుడు
న్యూఢిల్లీ : తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సో వద్ద చైనా సైనికుడొకరు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ని అతిక్రమించి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. అతడిని భారత సైన్యం పట్టుకుంది. అతడిని ప్రశ్నిస్తున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 19వ తేదీన లద్దాఖ్లోని డెమ్చోక్ సెక్టార్లో దారితప్పి ఎల్ఏసీని దాటి వచ్చిన చైనా కార్పొరల్ వాంగ్ యా లాంగ్ను భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని ప్రవేశం వెనుక గూడచార్య ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో భారత ఆర్మీ అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు సైనికుడి అదృశ్యంపై చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్కే) స్పందించింది. తమ సైనికుడిని వెంటనే సురక్షితంగా విడుదల చేయాలని భారత ఆర్మీ అధికారులను కోరింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆదేశ ఆర్మీఅధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. చీకట్లో దారి తప్పి ప్రమాదవశాత్తూ భారత సరిహద్దుల్లోకి ప్రవేశించాడని, అతన్ని వెంటనే తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. అతనిపై ఎలాంటి చర్యలకు పాల్పడకుండా వదిలిపెట్టి సరిహద్దుల్లో శాంతిని కొనసాగించాలని చైనా ఆర్మీ పేర్కొంది. కాగా గల్వాన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. అనంతరం ఇరు దేశాల సైనిక అధికారుల చొరవతో సుదీర్ఘ చర్చల అనంతరం శాంతి నెలకొంది. అయితే చైనా సైనికుడు ప్రవేశంపై ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయని భారత్.. అతన్ని విచారించిన అనంతరం విడుదల చేస్తామని తెలిపింది. అయితే అర్థరాత్రి వేళ చైనా జవాన్ సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించడం కలకలం రేపింది. -
చర్చలు జరుగుతున్నాయి: చైనా
బీజింగ్: సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయేలా భారత్తో చర్చలు కొనసాగిస్తున్నామని చైనా పేర్కొంది. ఉద్రిక్తతలు చల్లారిపోయేలా ఇరు దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయని, త్వరలోనే ఇందుకు పరిష్కారం కనుగొంటామని తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ మాట్లాడుతూ.. ‘‘ చైనా- భారత్ల మధ్య దౌత్యపరమైన, మిలిటరీ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. సరిహద్దు పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. ఇరు వర్గాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాల అమలుపై తదుపరి విధివిధానాలు ఆధారపడి ఉంటాయి’’అని పేర్కొన్నారు.(చదవండి: సరిహద్దుల్లో డ్రాగన్ మరో కుట్ర) కాగా ఈ ఏడాది జూన్లో గల్వాన్ లోయలో డ్రాగన్ ఆర్మీ దురాగతానికి సుమారు 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం విదితమే. వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైనికులు ప్రయత్నించగా, కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత బృందం వారిని అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో వీరు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆనాటి నుంచి తూర్పు లదాఖ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే 8 సార్లు మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. నవంబరు 6న చివరిసారిగా ఇరు దేశాల కార్్ప్స కమాండర్ స్థాయి అధికారులు భేటీ అయ్యారు. -
పథకం ప్రకారమే గల్వాన్ ఘర్షణలు
న్యూఢిల్లీ: భారత్ను లక్ష్యంగా చేసుకొని చైనా చేసే కుట్రలు, కుతంత్రాలు మరోసారి బట్టబయలయ్యాయి. గత జూన్లో భారత్కు చెందిన 20 మంది సైనికుల్ని బలి తీసుకున్న గల్వాన్ ఘర్షణల్ని డ్రాగన్ దేశం పక్కాగా కుట్ర పన్ని పాల్పడినట్టుగా అమెరికా–చైనా ఆర్థిక, భద్రత రివ్యూ కమిషన్ అమెరికన్ కాంగ్రెస్కి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు గత కొన్ని దశాబ్దాలుగా సరిహద్దుల్లో నెలకొన్న అత్యంత తీవ్రమైన సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించింది. లద్దాఖ్లోని గల్వాన్ లోయలో జూన్ 15న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), భారత సైనికుల మ««ధ్య హోరాహోరీ జరిగిన పోరులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోతే, చైనా తరఫున ఎంత ప్రాణ నష్టం జరిగిందో డ్రాగన్ దేశం ఇప్పటికీ వెల్లడించలేదు. చైనా ఒక పథకం ప్రకారమే సరిహద్దుల్లో భారత్తో కయ్యానికి కాలు దువ్విందని ఆ నివేదిక స్పష్టం చేసింది. వారాల ముందు నుంచే... గల్వాన్ ఘర్షణలకు కొద్ది వారాల ముందే చైనా రక్షణ మంత్రి తమ సైన్యం సరిహద్దుల్లో ఘర్షణలకు దిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకే చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్.. అమెరికా, చైనా మధ్య జరిగే పోరులో భారత్ కల్పించుకుంటే చైనాతో ఆర్థిక, వాణిజ్య బంధాలు తెగిపోతాయని హెచ్చరించింది. ఘర్షణకు ముందే చైనా ఆర్మీకి చెందిన వెయ్యి మంది సైనికులు గల్వాన్ లోయను చుట్టుముట్టడం శాటిలైట్ ఇమేజ్లో కనిపించింది. భారీగా ఆయు«ధాల మోహరింపు దృశ్యాలు కూడా ఆ చిత్రాల్లో కనిపించాయని ఆ నివేదిక ప్రస్తావించింది. -
పక్కా ప్లాన్ ప్రకారమే గల్వాన్ దాడి..
వాషింగ్టన్: ఈ ఏడాది జూన్లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికులు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా సైనికులు 45 మంది వరకు చనిపోయినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. అయితే దీనిపై చైనా ఇంతవరకు నోరు విప్పలేదు. ఇప్పటికే కరోనా విషయంలో సీఎన్ఎన్ ప్రచురించిన ‘వుహాన్ ఫైల్స్’ చైనా గుట్టు రట్టు చేయగా.. తాజాగా గల్వాన్ దాడికి సంబంధించిన సంచలన వాస్తవాలను అమెరికా అత్యున్నత స్థాయి కమిషన్ వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ (యూఎస్సీసీ) వార్షిక నివేదిక ప్రకారం చైనా పథకం ప్రకారమే ఈ దాడికి దిగిందని.. భారత్కు ప్రాణ నష్టం కలిగించడమే దాని ప్రధాన ఉద్దేశమని తెలిపే కొన్ని సాక్ష్యాలు లభించాయి అని యూఎస్సీసీ నివేదిక వెల్లడించింది. యూఎస్సీసీ 2000 సంవత్సరంలో ప్రారంభమయ్యింది. అమెరికా-చైనా మధ్య జాతీయ భద్రత, వ్యాణిజ్య సమస్యలను పరిశీలిస్తుంది. బీజింగ్పై అమెరికా కాంగ్రెస్ తీసుకోవాల్సిన పరిపాలన, శాసనపరమైన చర్యలను సిఫారసు చేస్తుంది. ఇక ఈ నివేదిక ప్రకారం వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసి) వెంబడి "చైనా ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రవర్తన వెనుక ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు" అని నివేదిక పేర్కొంది. అయితే గల్వాన్ ఘర్షణకు "ప్రధాన కారణం" భారతదేశం సరిహద్దులో వ్యూహాత్మకంగా వ్యవహరించడం.. దళాలకు మద్దతు ఇచ్చే చర్యలను పెంచుకోవడమే అని యూఎస్సీసీ నివేదిక పేర్కొంది. (చదవండి: తూర్పులద్దాఖ్లో పీఎల్ఏపై ఆర్మీ పైచేయి) #Breaking | Galwan standoff: United States-China Economic & Security Review Commission says 'some evidence suggests that the Chinese Govt had planned the incident potentially including the possibility for fatalities.' pic.twitter.com/ZyEZb0bR29 — TIMES NOW (@TimesNow) December 2, 2020 గల్వాన్ ఘర్షణకు కొన్ని వారాల ముందు డ్రాగన్ రక్షణ మంత్రి వీ చైనా దళాలను ఉద్దేశించి సరిహద్దులో స్థిరత్వం కోసం ఘర్షణలకు దిగండి అని ప్రోత్సాహించాడని నివేదిక వెల్లడించిది. అలానే చైనా కమ్యూనిస్ట్ పార్టీ మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్లో వచ్చిన ఓ సంపాదకీయం ‘ఒకవేళ భారతదేశం గనక అమెరికా-చైనా శత్రుత్వంలో తలదూరిస్తే.. చైనాతో ఇండియాకు గల ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో "వినాశకరమైన దెబ్బ" ను ఎదుర్కొంటుందని హెచ్చరించినట్లు’ నివేదక తెలిపింది. గల్వాన్ ఘర్షణకు కొన్ని రోజుల ముందు చైనా ఆ ప్రాంతంలో భారీ ఎత్తున బలగాలను మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసింది. (చదవండి: చైనాతో ఉద్రిక్తతలకు చెక్! ) ప్రస్తుతం బీజింగ్ వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట విస్తృతమైన మౌలిక సదుపాయాలను నిర్మించడంలో నిమగ్నమై ఉంది. ఇక గల్వాన్ ఘర్షణల తరువాత మొత్తం తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చోరబాట్లకు ప్రయత్నించింది. దాంతో ప్రస్తుతం కొన్ని నెలలుగా భారత్-చైనా మధ్య సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక తన దళాలను వెనక్కి రప్పించడానికి బీజింగ్ ఇష్టపడటంలేదు. ఈ సంవత్సరం చైనా కరోనా మహమ్మారి విషయంలో భారతదేశంతోనే కాకుండా జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్, యూకే, కెనడా వంటి దేశాలతో చైనాదూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్.. చైనీస్ యాప్స్, టెక్ కంపెనీలపై నిషేధం, ఆంక్షలు విధించడం వంటివి చేస్తూ.. డ్రాగన్కు ధీటుగా బదులిస్తోంది. -
72 వేల కోట్ల అమ్మకాలు; చైనాకు భారీ నష్టం!
న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా దేశ వ్యాప్తంగా సుమారు 72 వేల కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు ది కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) వెల్లడించింది. దేశంలోని ప్రధాన మార్కెట్ల(పట్టణాల) నుంచి సేకరించిన వివరాల ప్రకారం పండుగ నేపథ్యంలో ఈ మేరకు భారీ మొత్తంలో టర్నోవర్ జరిగిందని, దీంతో చైనాకు 40 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి, తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటూ అంబానీ, టాటా, అజీం ప్రేమ్జీ, మిట్టల్ తదితర దేశీయ పారిశ్రామిక దిగ్గజాలకు సీఏఐటీ గతంలో లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత సైనికులను పొట్టనబెట్టుకున్న డ్రాగన్ ఆర్మీ దురాగతాలను నిరసిస్తూ బ్యాన్ చైనా అంటూ ప్రచారం నిర్వహించిన ఈ ట్రేడ్బాడీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు.. ‘‘దేశంలోని 20 ప్రధాన వాణిజ్య పట్టణాల నుంచి సేకరించిన నివేదిక ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా సుమారు 72 వేల కోట్ల మేర టర్నోవర్ జరిగింది.తద్వారా చైనా మార్కెట్కు 40 వేల కోట్ల నష్టం వాటిల్లింది. భవిష్యత్లోనూ ఇలాంటి మంచి ఫలితాలే లభిస్తాయని ఆశిద్దాం’’ అని పేర్కొంది. ఇక పండుగ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట సామాగ్రి, ఫర్నీచర్, వాల్హ్యాంగింగ్స్, బంగారం, ఆభరణాలు, ఫుట్వేర్, వాచ్లు, దుస్తులు, ఇంటి అలకంరణ సామాగ్రి, ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్, గిఫ్ట్ ఐటెంలు, స్వీట్లు తదితర వస్తువలు ఎక్కువగా అమ్ముడుపోయినట్లు వెల్లడించింది. (చదవండి: ఆర్సీఈపీపై సంతకాలు.. చైనా ప్రాబల్యం!) కాగా ఈ ఏడాది జూన్లో గల్వాన్ లోయలో చైనా సైనికుల దురాగతానికి 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం విదితమే. వాస్తవాధీన రేఖ యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్ ఆర్మీని అడ్డుకునే క్రమంలో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను నిషేధించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇక సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రత, సమాచార గోప్యతకు భంగం కలిగే అవకాశాలున్న నేపథ్యంలో టిక్టాక్, వీచాట్ తదితర చైనీస్ యాప్లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో డ్రాగన్ కంపెనీలు భారీ నష్టాలు చవిచూశాయి. -
చైనా నుంచి చొరబాట్లు లేవు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల నుంచి గత ఆరునెలల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో పాక్ సరిహద్దుల నుంచి 47 చొరబాటు యత్నాలు చోటు చేసుకున్నాయని బుధవారం రాజ్యసభకు తెలిపింది. గత మూడేళ్లలో పాక్ నుంచి కశ్మీర్లోకి జరిగిన చొరబాటు యత్నాల సంఖ్య 594 అని, వాటిలో 312 విజయవంతమయ్యాయని వెల్లడించింది. మూడేళ్లలో అక్కడ 582 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయని హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఆరు నెలలుగా చైనా సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఆ ప్రకటన గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో ప్రాణాలర్పించిన వీర జవాన్లను అవమానించడమేనని పేర్కొంది. చైనా దురాక్రమణపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి చేసిన వేర్వేరు ప్రకటనలను వరుసగా ప్రస్తావిస్తూ.. ‘మోదీ ప్రభుత్వం మన సైనికుల పక్షాన ఉందా? లేక చైనా వైపు ఉందా?’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నేడు రాజ్నాథ్ ప్రకటన తూర్పు లద్దాఖ్లో చైనాతో సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నేడు రక్షణ మంత్రి రాజ్నాథ్ రాజ్యసభలో ప్రకటన చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్నాథ్ ప్రకటన అనంతరం, విపక్ష సభ్యులను మాట్లాడే అవకాశం ఇస్తారని, ఆ తరువాత అవసరమైతే, రాజ్నాథ్ సభ్యుల అనుమానాలకు వివరణ ఇస్తారని వెల్లడించాయి. రాష్ట్రపతి, ప్రధాని కూడా.. చైనా టెక్నాలజీ కంపెనీ డేటా చౌర్యం అంశాన్ని బుధవారం కాంగ్రెస్ పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తింది. దాదాపు 10 వేల మంది ప్రముఖుల సమాచారంపై నిఘా వేశారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో, చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న షెంజెన్ కేంద్రంగా ఉన్న ఒక టెక్నాలజీ కంపెనీ 10 వేల మంది భారతీయ ప్రముఖుల డిజిటల్ డేటాను ట్రాక్ చేస్తోందని పత్రికల్లో కథనం వచ్చిందని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ వివరించారు. ఆ ప్రముఖుల్లో భారత రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, ఆర్మీ చీఫ్, ముఖ్యమంత్రులు ఉండడం షాక్కు గురిచేస్తోందన్నారు. డేటా చౌర్యంపై నిపుణుల కమిటీ భారత్లోని దాదాపు 10 వేల మంది ప్రముఖులపై చైనా టెక్నాలజీ సంస్థ నిఘాపెట్టి డేటా చౌర్యం చేస్తోందన్న ఆరోపణలపై కేంద్రం ఒక నిపుణుల కమిటీని నియమించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ నేతృత్వంలో ఈ కమిటీ ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నిర్ధారిస్తుంది. -
పాపం.. జిన్పింగ్
వాషింగ్టన్: ఏదో అనుకుంటూ.. ఇంకేదో అయ్యిందే అని బాధపడుతున్నారంట చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్. భారత భూభాగంలోకి చొరబడాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఏమైంది.. మనం సైన్యం ప్రతి దాడి చేయడంతో తోక ముడవాల్సిన పరిస్థితి తలెత్తెంది. చైనా సైన్యం దారుణంగా విఫలమయ్యింది. ఈ పరిణామాలు జిన్ పింగ్ను మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదంట. దాంతో చాలా క్రూరమైన ప్రక్షాళన చర్యలకు దిగబోతున్నాడంటూ అమెరికన్ మీడియా కోడై కూస్తూంది. ఈ మేరకు వరుస కథనాలను వెల్లడిస్తోంది. వాటి ప్రకారం తాజాగా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు జిన్ పింగ్ ఆర్కిటెక్ట్గా వ్యవహరించాడట. అతని సైన్యం మీద అపారమైన నమ్మకం ఉంచి.. దూకుడుగా ప్రవర్తించాడట. అయితే భారత్ కూడా అందుకు ధీటుగా బదులివ్వడం.. రక్షణపరంగా వ్యూహత్మకమైన శిఖరాలను ఆదీనంలోకి తీసుకోవడంతో జిన్ పింగ్ షాక్కు గురయ్యాడట. ఈ ఊహించని అపజయం అతడిని తీవ్రంగా కలిచి వేస్తున్నట్లు అమెరికన్ మీడియా న్యూస్వీక్ కథనం వెలువరించింది. దాంతో జిన్పింగ్ దీన్ని ఒక సాకుగా చూపించి తన రక్షణ దళ సలహాదారులను బలవంతంగా తొలగించమే కాక కొత్త వారిని నియమిస్తాడని న్యూస్వీక్ వెలువరించింది. ఈ ఏడాది జూన్ 15న గల్వాన్ లోయలో భారత్-చైనాల మధ్య ఘర్షణలు జరిగిన నాటి నుంచి ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా ఆక్రమించుకున్న అత్యున్న పర్వత భూభాగాలను భారత దళాలు స్వాధీనం చేసుకోవడంతో చైనా దళాలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాట. గడిచిన అరశతాబ్ధంలో భారత్ ఎప్పుడు ఇంత దుకుడుగా లేదని.. ఈ చర్యలతో చైనా దళాలు వెనక్కి తగ్గాయని న్యూస్ లింక్ తెలిపింది. అంతేకాక భారత బలగాలను నిరోధించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా పేలవంగా ఉన్నట్లు తెలిపింది. చైనా గ్రౌండ్ ఫోర్స్లు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావవంతంగా పని చేయలేకపోయిందని వివరించింది. ఇది కేవలం 1979లో వియాత్నంకు పాఠం నేర్పించే అంశంలో మాత్రమే విజయం సాధించిందని వెల్లడించినంది. (చదవండి: 'జిన్పింగ్ ఓకే అంటేనే లెక్కను వివరిస్తాం') అంతేకాక ప్రస్తుతం భారత దళాలలు ఆక్రమణదారులకు తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని.. ప్రస్తుతం చాలా దూకుడుగా.. రక్షణాత్మకంగా ఉన్నారని.. మొత్తానికి భారత్ తన ఆటని పూర్తిగా మార్చవేసిందని కథనం ప్రచురించింది. అయితే ఈ ఎదురుదెబ్బలను పరిగణలోకి తీసుకుని జిన్ పింగ్ని తక్కువ అంచనా వేయలేమని కూడా హెచ్చరించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో జి జిన్పింగ్ సైనిక అంశాలను పూర్తిగా ప్రక్షాళన చేసే అవకాశం ఉందని తెలిపింది. -
ఉద్రిక్తతల తొలగింపే లక్ష్యం
మాస్కో: తూర్పు లద్దాఖ్లో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే లక్ష్యంతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. ప్యాంగాంగ్ సరస్సు కేంద్రంగా రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న ఈ మే నెల నుంచి రెండు దేశాల విదేశాంగ మంత్రులు ముఖాముఖీ భేటీ కావడం ఇదే ప్రథమం. గల్వాన్ లోయలో చోటు చేసుకున్న తీవ్ర స్థాయి ఘర్షణల సమయంలో జూన్ 17న ఇరువురు నేతలు ఫోన్లో చర్చలు జరిపారు. చైనా దురాక్రమణ చర్యలు కొనసాగిస్తుండటంతో పాటు భారీగా సైనిక దళాలను మోహరించడం, కొన్ని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడంతో.. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోకి భారత్ అదనపు బలగాలను, యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని భారీగా తరలించింది. ‘కాసేపట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమవనున్నారు. సరిహద్దు సమస్యను వారిద్దరు చర్చిస్తారు’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడిం చారు. ‘దౌత్య, మిలటరీ మార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలనే భారత్, చైనా భావిస్తున్నాయి’ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్, వాంగ్ మాస్కో వెళ్లారు. ఆర్ఐసీ విదేశాంగ మంత్రుల భేటీ ఎస్సీఓ సమావేశాల సందర్భంగా గురువారం మాస్కోలో రష్యా, భారత్, చైనా(ఆర్ఐసీ) విదేశాంగ మంత్రులు వరుసగా సెర్గీ లెవ్రోవ్, జైశంకర్, వాంగ్ సమావేశమయ్యారు. పరస్పర సహకారం, స్నేహం, విశ్వాసం స్ఫూర్తిగా త్రైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల విషయమై వారు చర్చించారు. భేటీ అనంతరం వారు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. అంతర్జాతీయంగా అభివృద్ధిదాయక శాంతి, సుస్థిరతలు నెలకొనడానికి ఈ మూడు దేశాల మధ్య త్రైపాక్షిక సహకారం ఆవశ్యకమని అందులో పేర్కొన్నారు. వ్యూహాత్మక పర్వతాలపై భారత్ పాగా ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో చైనా దళాలు ఉన్న ప్రదేశాలపై దృష్టి పెట్టేలా కీలకమైన పలు పర్వతాలపై భారత బలగాలు నియంత్రణ సాధించాయి. రెండు దేశాల ఆర్మీలకు చెందిన బ్రిగేడ్ కమాండర్లు, కమాండింగ్ అధికారులు వేర్వేరుగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. -
భారత్, చైనా మధ్య ‘యుద్ధాటకం’
సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం, అంటే 1975 సంవత్సరం తర్వాత భారత్, చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద మొట్టమొదటి సారి కాల్పుల కలకలం చెలరేగింది. సెప్టెంబర్ ఏడవ తేదీన భారత వాస్తవాధీన పరిధిలోకి చొచ్చుకు వస్తోన్న చైనా సైనికులను భారత సైనికులు అడ్డగించినందుకు చైనా సైనికులు గాలిలోకి కాల్పులు జరిపారని భారత మీడియా పేర్కొనగా, భారత సైనికులే కాల్పులు జరిపారని చైనా మీడియా ఆరోపించింది. గత మే నెల నుంచి ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు చైనా సైనికులు సష్టించిన హింసాకాండలో 20 మంది భారత సైనికులు మరణించడంతో ఒక్కసారిగా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆ పరిస్థితి చివరకు చైనా వస్తువుల బహిష్కరణ, చైనా యాప్లపై నిషేధం దాకా కొనసాగింది. (దక్షిణాన సైనికులు.. ఉత్తరాన నిర్మాణాలు) ఈలోగా సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణ కోసం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య చర్యలు ఫలితాలిస్తున్నట్లుగానే కనిపించాయి. ఇంతలో కాల్పుల కలకలం చెలరేగడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరుకున్నాయి. మాస్కోలో జరుగుతోన్న ‘శాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్’ సమ్మేళనంలో పాల్గొనేందుకు మాస్కో నగరానికి వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ అక్కడ ఈ రోజు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ముఖాముఖి సమావేశమై శాంతి కోసం చర్చలు జరపనున్నారు.(ముదురుతున్న వివాదం) ‘సరిహద్దుల్లో కొంచెం మేఘాలు కమ్ముకున్నాయి’ అని జై శంకర్ మాస్కో వెళ్లే ముందు భారత మీడియాతో వ్యాఖ్యానించారు. వారం రోజుల క్రితమే కేంద్ర ర క్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రిని కలుసుకొని చర్చలు సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చలు జరిపారు. అయినప్పటికీ కాల్పుల కల్లోలం చెలరేగడంతో విదేశాంగ మంత్రులు దౌత్యపరమైన చర్చలను చేపట్టాల్సి వచ్చింది. చైనాతో వ్యాపార సంబంధాల పునరుద్ధరణ, చైనా ఆప్లపై నిషేధం ఎత్తివేత అంశాలను చైనా ప్రస్తావిస్తే అందుకు స్పందిస్తారా ? అని భారత మీడియా ప్రశ్నించగా, లేదని, తాను చర్చల్లో కేవలం సరిహద్దు ఉద్రిక్తతలకే పరిమితం అవుతానని ఆయన సమాధానం చెప్పారు. ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు దట్టమవుతున్నాయని, విదేశాంగ మంత్రుల చర్చలు విఫలమైతే ఇరు దేశాల మధ్య పరిమిత యుద్ధమైన జరుగుతుందని జాతీయ మీడియాలో మెజారిటీ అభిప్రాయపడుతోంది. అమెరికాతో అంటకాగుతున్న భారత్ను తనవైపు తిప్పుకునేందుకు, ముఖ్యంగా చైనా ఉత్పత్తుల దిగుమతి పునరుద్ధరణ కోసం సరిహద్దు ఉద్రిక్తతలకు చైనా పాల్పడుతోందని మీడియాలో ఓ వర్గం భావిస్తుండగా, అణ్వస్త్రాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశమే లేదని, తమ తమ దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి సష్టిస్తోన్న కల్లోల పరిస్థితుల నుంచి ప్రజల దష్టిని మళ్లించేందుకు భారత్, చైనాలు కూడబల్కోని ఆడుతున్న ‘యుద్ధ నాటకం’ అని మీడియాలో మరో వర్గం అనుమానిస్తోంది. -
లడఖ్ ఉద్రిక్తత: కిషన్రెడ్డితో కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా మధ్య తూర్పు లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనా దురక్రమణను తిప్పికొట్టేందుకు భారత సైన్యం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం లడఖ్లో నెలకొని ఉన్న పరిస్థితులను వివరించేందుకు లెఫ్ట్నెంట్ గవర్నర్ రాధాకృష్ణా మాథూర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డితో అత్యవసర భేటీ అయ్యారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా దుశ్చర్యను కేంద్ర మంత్రికి వివరించారు. గల్వాన్ లోయ హింసాత్మక ఘటన అనంతరం గత నెలలో ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య జరిగిన సైనిక ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించినట్లు కిషన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. తూర్పు లడఖ్ ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో చైనా దళాల కదలికల గురించి నివేదించారు. (జే-20 యుద్ధవిమానాలతో చైనా దూకుడు) ఈ భేటీ అనంతరం లడఖ్లో తాజా పరిస్థితులను కిషన్రెడ్డి కేంద్ర పెద్దలకు వివరించే అవకాశం ఉంది. కాగా చైనా వాయుసేనకు చెందిన అత్యాధునిక జే-20 యుద్ధవిమానాలను తిరిగి మోహరించిందని ప్రభుత్వ వర్గాలు ఇది వరకే వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోనూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతకొంత కాలంగా వస్తున్న వస్తున్న విమర్శలను ఏమాత్రం లెక్కచేయని డ్రాగన్.. మరోసారి పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను మోహరించింది. ఈ క్రమంలోనే చైనా జిత్తులను చిత్తు చేసేందుకు దూకుడగా వ్యవహరించిన భారత్ ఓ యుద్ధ నౌకను చైనా నౌక సమీపానికి పంపింది. వారి కార్యాకలాపాలనే నిఘా పెట్టింది. (మారని చైనా తీరు.. మరోసారి కవ్వింపు చర్యలు) ఈ తరుణంలోనే లడఖ్ లెప్ట్నెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖమంత్రితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా హోంమంత్రి అమిత్ షా అనారోగ్య కారణంగా ప్రస్తుతం విధులకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయమే డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల సూచలన మేరకు విధులకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్కే మాథూర్ కిషన్రెడ్డితో భేటీ అయ్యారు. -
చైనాను వణికిస్తోన్న సమాధి ఫోటో..
న్యూఢిల్లీ: ఇండియా-చైనా దళలా మధ్య జూన్ 15న గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. వీరందరికి మన ప్రభుత్వం సైనిక లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించింది. దేశం యావత్తు మన జవాన్ల త్యాగాన్ని కొనియాడింది. ఈ ఘర్షణలో చైనా సైనికులు 40 మంది వరకు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కానీ చైనా నుంచి మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ సమాధి రాయి ఫోటో ఇంటర్నెట్లో వైరలవుతుంది. చైనా సైనికులు మరణించారు అనే దానికి ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజనులు. చైనీస్ ఇంటర్నెట్ వీబో అకౌంట్లో సైనికుడి సమాధి రాయికి సంబంధించిన ఫోటో ప్రత్యక్షమయ్యింది. క్షణాల వ్యవధిలోనే ఆ ఫోటో మన దేశంలోని చాలా ట్విట్టర్ యూజర్ల అకౌంట్లలో ప్రత్యక్షమయ్యింది. (చదవండి: మారని చైనా తీరు.. మళ్లీ కొత్త నిర్మాణాలు!) ఈ సమాధి రాయి చైనా సైనికుడు చెన్ జియాంగ్రాంగ్కు చెందినదిగా తెలుస్తోంది. సమాధి రాయిపై మాండరిన్ భాషలో ‘69316 దళాల సైనికుడు, పింగ్నాన్, ఫుజియాన్ నుంచి’ అని రాసి ఉంది. అంతేకాక ‘చెన్ జియాంగ్రో సమాధి. జూన్ 2020లో భారత సరిహద్దు దళాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన ప్రాణ త్యాగం చేశారు. మరణానంతరం కేంద్ర సైనిక కమిషన్ జ్ఞాపకం చేసుకుంది’ అని తెలుపుతుంది. 2020 ఆగస్టు 5న దక్షిణ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్లో ఈ సమాధిని నిర్మించినట్లు ఫోటో చూపిస్తోంది. మరణించిన సైనికుడు 19 సంవత్సరాల వయస్సు వాడని.. అతడు 2001 డిసెంబర్లో జన్మించినట్లు సమాధి మీద రాసి ఉంది. అయితే దీనిపై ఇంకా చైనా అధికార యంత్రాంగం స్పందించలేదు. తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రెండు దేశాల సైనిక కమాండర్ల మధ్య పలు దఫాల చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. డ్రాగన్ దేశం సరిహద్దులో భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్న సంగతి తెలిసిందే. -
మారని చైనా తీరు.. మళ్లీ కొత్త నిర్మాణాలు!
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదాలకు పరిష్కారం దిశగా చర్చలు కొనసాగుతున్న సమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి డ్రాగన్ మరోసారి సరికొత్త నిర్మాణాలు చేపట్టింది. జూన్ నెలలో చెలరేగిన ఘర్షణలకు కేంద్ర బిందువైన తూర్పు లదాఖ్ సమీపంలో డెమ్చోక్ వద్ద చైనా 5జీ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. వాస్తవాధీన రేఖ వెంబడి మెరుగైన కమ్యూనికేషన్ కోసం ఆగష్టు తొలి వారం నుంచే ఈ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద కొత్తగా గుడారాలు, షెడ్లు నిర్మించినట్లు పేర్కొన్నాయి. ఓవైపు.. సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకై చర్చలు జరుగుతున్న వేళ చైనా ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. దీంతో మరోసారి సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. (చదవండి: విమాన విధ్వంస క్షిపణులను ప్రయోగించిన చైనా) ఇదిలా ఉండగా.. వాస్తవాధీన రేఖ నుంచి వెనక్కి వెళ్లడంలో చైనీస్ బలగాలు జాప్యం చేస్తున్నందున భారత్ కూడా లదాఖ్లో మరిన్ని బలగాలు మోహరించినట్లు సమాచారం. ఇప్పటికే మూడు రెట్ల మేర ఎక్కువ బలగాలను అక్కడికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ఓ ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. ‘‘అనేక సమీక్షలు నిర్వహించిన అనంతరం బలగాల మోహరింపుపై నిర్ణయం తీసుకుంటారు. పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేనందున సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మరింతగా పెంచుకోవడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు.(చదవండి: 45 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ప్రాణనష్టం) మారని డ్రాగన్ తీరు బలగాల ఉపసంహరణకై చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా వైఖరిలో ఎలాంటి మార్పు కనపడటం లేదు. ప్యాంగ్యాంగ్ సరస్సు వెంబడి డ్రాగన్ బలగాలు తమ ఉనికి చాటుకుంటూనే ఉన్నాయి. కేవలం ఫింగర్ 4, ఫింగర్ 5 వద్ద మాత్రమే కాస్త వెనక్కి జరిగినట్లు సమాచారం. దీంతో ప్రత్యర్థికి కౌంటర్ ఇచ్చేందుకు భారత్ సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు పోటాపోటీగా నిర్ణయం తీసుకోవడం సరిహద్దుల వద్ద పరిస్థితులు మరింత సంక్లిష్టతరంగా మారే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా.. ఫింగర్ 4 ఏరియా నుంచి భారత్ బలగాలను వెనక్కి రప్పించినప్పటికీ.. అటువైపు నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఏప్రిల్ నాటికి ఉన్న యథాతథ స్థితిని కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. చైనా మాత్రం ఫింగర్ 5,8 ఏరియాల్లో తన బలాన్ని మరింత పెంచుకున్నట్లు సమాచారం. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో పడవలు తరలించి, గుడారాలు నిర్మించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘‘ప్యాంగ్యాంగ్ సరస్సు నుంచి వెనక్కి వెళ్లాలంటే భారత్ కూడా తన బలగాలను ఉపసంహరించాలని చైనా డిమాండ్ చేస్తోంది. అలా అయితే మా నియంత్రణలో ఉన్న ప్రాంతంపై పట్టు కోల్పోయినట్లు అవుతుంది. యథాస్థితి మార్పునకు ఇది దారి తీస్తుంది. చైనా డిమాండ్లతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి’’అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి సరిహద్దు పరిస్థితుల గురించి జాతీయ మీడియాకు వివరించారు. (చదవండి: గల్వాన్ ఘటన దురదృష్టకరం: చైనా రాయబారి) సైనిక చర్యకు వెనుకాడబోము జూన్లో గల్వాన్ లోయలో చైనా ఆర్మీ ఘాతుకానికి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను రూపుమాపేందుకు ఇప్పటికే పలు దఫాలుగా దౌత్య, మిలిటరీ చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా బలగాల ఉపసంహరణ విషయంలో ఇప్పటికే ఐదుసార్లు కార్్ప్స కమాండర్ స్థాయి చర్చలు జరుగగా.. త్వరలోనే మరోమారు మిలిటరీ అధికారుల సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే విధంగా ఘర్షణకు మూల కారణమైన గల్వాన్, పెట్రోల్ పాయింట్ 15, ప్యాంగ్యాంగ్ నుంచి ఇరు వర్గాలు బలగాల ఉపసంహరణకు అంగీకరించినప్పటికీ.. గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ఏరియా(పెట్రోల్ పాయింట్ 17ఏ) వద్ద మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో చైనా తీరు మారనట్లయితే సైనిక చర్యకు సైతం వెనుకాడేది లేదని చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇటీవలే డ్రాగన్ను ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
గల్వాన్ ఘటన దురదృష్టకరం: చైనా
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ ప్రాంతంలో భారత్, చైనా మధ్య జూన్లో జరిగిన ఘర్షణలపై డ్రాగన్ దేశం విచారం వ్యక్తం చేసింది. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొంది. అలా జరిగి ఉండాల్సింది కాదంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. చైనా, భారత్ యువత పాల్గొన్న ఒక వెబినార్కు బుధవారం హాజరైన భారత్లో చైనా రాయబారి సన్ వీడాంగ్ చరిత్ర పరంగా చూస్తే ఇది చాలా చిన్న ఘటన అని వ్యాఖ్యానించారు. రెండు దేశాలు ఘర్షణాత్మక వాతావరణాన్ని చూడాలని అనుకోవడం లేదని, ఇక మీదట ఇలా జరగకుండా రెండు దేశాలు సరైన దారిలో ప్రయాణిస్తున్నాయని అన్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఏప్రిల్ నుంచి అడపాదడపా మొదలైన ఉద్రిక్తతలు జూన్లో తారస్థాయికి వెళ్లాయి. అప్పుడు చోటు చేసుకున్న ఘటనలో భారత్ సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోతే, చైనా వైపు ప్రాణ నష్టం ఎంత జరిగిందో ఆ దేశం అధికారికంగా వెల్లడించలేదు. భారత్, చైనా మధ్య 70 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతు న్నాయని, ఎన్ని పరీక్షలు , అడ్డంకులు ఎదురైనా మళ్లీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు బలోపేతమవుతున్నాయని సన్ వీడాంగ్ అన్నారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం ఏ సమస్యకైనా చర్చల ద్వారా సరైన పరిష్కారం లభిస్తుందని రాయబారి వీడాంగ్ అన్నారు. చైనా భారత్ని ప్రత్యర్థి కంటే భాగస్వామిగానే చూస్తుందని, పొరుగు దేశం నుంచి ప్రమాదాలని కాకుండా అవకాశాలనే రాబట్టుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. భారత్, చైనా మధ్య ఆర్థికంగా కూడా సంబంధాలు అత్యంత దృఢంగా ఉన్నాయని సన్ వీడాంగ్ వివరించారు. -
గల్వాన్ ఘటన దురదృష్టకరం: చైనా రాయబారి
బీజింగ్ : గల్వాన్ లోయలో భారత్, చైనాకు మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమైన సంఘటన అని భారత్లో చైనా రాయబారి సన్ వెడాంగ్ అన్నారు. ఇదే సమయంలో ఇరుదేశాల మధ్య దైపాక్షిక సంబంధాలకు భంగం కలిగించకుండా రెండు దేశాలు ముందుకు సాగాలని తెలిపారు. శాంతియుత ఒప్పందాలతో విభేదాలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు. 'చైనా భారత్ను ఒక ప్రత్యర్థిగా కాకుండా భాగస్వామిగా చూస్తుంది. సంప్రదింపుల ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు చెక్ పెట్టి తిరిగి ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాలి. శాంతియుతంగా చర్చలు జరిపి ఇరు దేశాల మద్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలి. (గల్వాన్పై చైనాకు హక్కు లేదు: భారత్) ఏ దేశమూ ప్రపంచం నుంచి వేరు చేయబడదు. సొంతంగా అభివృద్దిని మాత్రమే కోరుకుంటుంది. స్వావలంబనకు కట్టుబడి ఉండటమే కాకుండా ప్రపంచీకరణ ధోరణికి అనుగుణంగా అడుగులు వేయాలి. భారత్, చైనా ఆర్థికంగా బలమైన దేశాలు. చాలా సంవత్సరాలుగా భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా కొనసాగుతుంది. దక్షిణ ఆసియాలో భారత్ కూడా చైనాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక ఒప్పందాలు అయస్కాంతాల వలె ఉండాలని నేను భావిస్తున్నాను' అని ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ఇరు దేశాల్లో పురాతన నాగరికతకు సంబంధించి అపారమైన పరిజ్ఞానం ఉందని, చర్చల ద్వారా పరిస్థితులను చక్కదిద్దుకుందామని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. అయితే గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో గత మూడు నెలలుగా ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. (భారత్, చైనా శాంతి మంత్రం) -
బాధ్యతలు స్వీకరించిన సంతోష్ బాబు భార్య
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్గా నేడు బాధ్యతలు చేపట్టారు. బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కలిసి శనివారం ఆమె జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. సంతోషికి రెవెన్యూశాఖలో డిప్యూటీ కలెక్టర్గా పోస్టింగ్ ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నిరోజుల క్రితం ఆమెకు నియామక పత్రాన్నిఅందజేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం వారికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆమెకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. దీంతోపాటు సంతోష్బాబు కుటుంబానికి హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలం, రూ.5 కోట్ల నగదును కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కాగా, గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరో 20 మంది సైనికులు అమరులయ్యారు. (హెలికాప్టర్తో రైతులను రక్షించిన రెస్క్యూ టీం) -
శాంతి మన విధానం
న్యూఢిల్లీ: భారత్ శాంతికాముక దేశమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. అయితే, ఎవరైనా ఆక్రమణవాద దుస్సాహసానికి పాల్పడితే తగిన గుణపాఠం చెప్పగల సామర్థ్యం ఉన్న దేశమని స్పష్టం చేశారు. ‘పొరుగున ఉన్న కొందరు ఇటీవల విస్తరణవాద దుస్సాహసానికి ఒడిగట్టార’ని ఇటీవల తూర్పు లద్దాఖ్లో సరిహద్దుల వెంట ఘర్షణలకు పాల్పడిన చైనాను రాష్ట్రపతి పరోక్షంగా హెచ్చరించారు. ‘ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో మన పొరుగుదేశం విస్తరణవాద దుస్సాహసానికి పాల్పడింది’ అన్నారు. భారతీయ సైనికులు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, ప్రాణాలు పణంగా పెట్టి దేశ భూభాగాన్ని కాపాడుకున్నారని కొనియాడారు. నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగించారు. ‘భరతమాత ముద్దుబిడ్డలు వారు. దేశ గౌరవం కోసం ప్రాణత్యాగం చేశారు. గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు దేశమంతా సెల్యూట్ చేస్తోంది’ అన్నారు. ఒకవైపు సరిహద్దులను, మరోవైపు అంతర్గత భద్రతను కాపాడుతున్న త్రివిధ దళాలు, పారామిలటరీ, పోలీసు బలగాలు మనకు గర్వకారణమన్నారు. గల్వాన్లోయ వద్ద చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెప్పిన స్వావలంబ భారత్ను రాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. భారతదేశ స్వావలంబన విధానం ప్రపంచాన్ని కలుపుకుని పోయేదేనని వివరణ ఇస్తూ విదేశీ పెట్టుబడుదారుల ఆందోళనలను తొలగించే ప్రయత్నం చేశారు. వైద్యులకు సెల్యూట్ కరోనా వైరస్పై ముందుండి అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి దేశమంతా రుణపడి ఉందన్నారు. ‘దురదృష్టవశాత్తూ వారిలోనూ చాలామంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఈ దేశ హీరోలు. వారిని ఎంత ప్రశంసించినా తక్కువే’ అన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రైల్వే, విమానయాన, విద్యుత్ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీవోలు, ఇతర సేవల్లోని వారు అంతా ఈ మహమ్మారిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. ప్రపంచమంతా తలుపులు మూసుకున్నవేళ.. ప్రజలందరికీ ఆరోగ్య సేవలు, ఇతర వసతులు అందేలా వీరు ప్రజా సేవలో నిమగ్నమయ్యారన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా లక్షలాది ప్రాణాలను బలిగొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా తలెత్తిన సవాళ్లను కేంద్ర ప్రభుత్వం సమర్థ్ధవంతంగా ఎదుర్కొన్నదని ఆయన ప్రశంసించారు. కరోనా ముప్పును ముందుగానే పసికట్టి, సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు. ‘భారీ జనాభా ఉన్న, విస్తారమైన, వైవిధ్యభరిత భారత్ లాంటి దేశంలో ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే మానవాతీత శక్తులుండాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచం గుర్తించాలన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు కూడా సరైన చర్యలు తీసుకున్నాయని రాష్ట్రపతి ప్రశంసించారు. ‘ప్రజలంతా కలసికట్టుగా పోరాడారు. ప్రభుత్వాలు, ప్రజలు.. అంతా కలిసి చేసిన పోరాటం ఫలితంగానే ఈ మహమ్మారి విస్తృతిని సాధ్యమైనంతగా అడ్డుకోగలిగాం’ అన్నారు. 2020 నేర్పిన పాఠం 2020 సంవత్సరంలో కరోనా అనే కంటికి కనిపించని సూక్ష్మజీవి మానవాళికి గొప్ప పాఠాలు నేర్పించిందని ఆయన వ్యాఖ్యానించారు. మానవులు సర్వ శక్తిమంతులనే భ్రమను తొలగించిందని వివరించారు. ఇప్పటికైనా ప్రకృతిని నాశనం చేయకుండా, ప్రకృతితో కలిసి సహజీవనం చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. విభేదాలు పక్కనబెట్టి భూగోళ రక్షణ కోసం మానవాళి అంతా ఏకమైన శతాబ్దం ఇదని కోవింద్ వ్యాఖ్యానించారు. మానవ సమాజం ఏర్పర్చుకున్న కృత్రిమ అడ్డుగోడలను కరోనా కూల్చివేసిందన్నారు. ఆరోగ్య సేవల్లో మౌలిక వసతులను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని కరోనా మనకు గుర్తు చేసిందన్నారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వ వైద్యశాలలే ముందున్నాయన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కారణంగా పేదలు, రోజు కూలీలు దారుణంగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన తదితర సంక్షేమ పథకాలను యుద్ధప్రాతిపదికన అమలు చేసిందన్నారు. కరోనా సంక్షోభాన్ని ఆర్థిక పునరుత్తేజానికి లభించిన అవకాశంగా భావించాలన్నారు. రామాలయ నిర్మాణం గర్వకారణం అయోధ్యలో ఆగస్ట్ 5న రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిన విషయాన్ని రాష్ట్రపతి కోవింద్ ప్రస్తావించారు. అది భారతీయులందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. ‘దశాబ్దాలుగా దేశప్రజలు గొప్ప సంయమనాన్ని, ఓపికను ప్రదర్శించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంచారు. రామ మందిర వివాదాన్ని శాంతియుతంగా న్యాయవ్యవస్థ పరిష్కరించింది. సుప్రీంకోర్టు తీర్పును అన్ని వర్గాలు ఆమోదించి.. భారతీయ శాంతి, అహింస, ప్రేమ, సౌభ్రాతృత్వ భావనలను ప్రపంచానికి చూపాయి’ అని పేర్కొన్నారు. -
విషం చిమ్మిన చైనా.. తీవ్ర వ్యాఖ్యలు
బీజింగ్/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడి 20 మంది భారత సైనికుల ప్రాణాలు బలిగొన్న చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. గల్వాన్ లోయలో ఘర్షణలు తలెత్తడానికి భారత ఆర్మీ చర్యలే కారణమంటూ విషం చిమ్మింది. మరోసారి ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత్లో చైనా రాయబారి సన్ వెడాంగ్ జూన్ 15 నాటి ఘటనకు సంబంధించి చైనీస్ ఎంబసీ మ్యాగజీన్లో తన అభిప్రాయాన్ని ప్రచురించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది.(చైనా తీరును ఖండిస్తూ సెనేట్లో తీర్మానం) ‘‘ఈ ఘటనను పూర్తిగా విశ్లేషించినట్లయితే ఇందుకు చైనా బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని స్పష్టమవుతోంది. భారత దళాలే వాస్తవాధీన రేఖను దాటి ముందుకొచ్చి రెచ్చగొట్టడమే గాకుండా చైనా బలగాలపై దాడి చేశాయి. సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత బలగాలు పూర్తిగా ఉల్లంఘించాయి. నిబంధనలను తుంగలో తొక్కి అంతర్జాతీయ సంబంధాలకు తూట్లు పొడిచాయి. ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపించి, చట్టాలు అతిక్రమించిన ఫ్రంట్లైన్ బలగాలపై భారత ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుని జవాబుదారీగా ఉండేలా చూడాలి. అంతేగాక వారు రెచ్చగొట్టే చర్యలు ఆపినపుడే మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయి’’అని సన్ వెడాంగ్ తన ఆర్టికల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.(డ్రాగన్ దూకుడు : భారత్ దిగుమతులపై సుంకాల పొడిగింపు) కాగా జూన్ 14 అర్ధరాత్రి డ్రాగన్ ఆర్మీ గల్వాన్ లోయలో ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలు సృష్టించిన నేపథ్యంలో భారత ఆర్మీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అసువులు బాశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పలు దఫాలుగా దౌత్య, సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి. పరస్పర అంగీకారంతో సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి మళ్లించేందుకు ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి తరుణంలో సన్ వెడాంగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు.. గల్వాన్ లోయ ఘర్షణలో మరణించిన సైనికుల వివరాలను చైనా ఇంతవరకు వెల్లడించలేదు. అంతేగాక వారికి కనీసం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయకుండా అవమానించిందని అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొన్న విషయం విదితమే. -
పట్టు పట్టు ట్రెండే పట్టు.. మనసులు కొల్లగొట్టు!
పట్టు పట్టు.. ట్రెండే పట్టు కాదేదీ సినిమా కథకు అనర్హం. రకరకాల కథల్ని సినిమాలుగా చూస్తూ వస్తున్నాం. ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతుంది. మారిన ట్రెండ్కి తగ్గట్టే.. కథలు రాయాలి.. సినిమాలు తీయాలి. పౌరాణికం, సాంఘికం. ఫ్యాక్షన్. యాక్షన్. ఇలా ట్రెండ్ మారుతూ వచ్చింది. ఆ మధ్య బయోపిక్స్ హవా నడిచింది. ఇప్పుడేమో సమాజంలో జరిగే సంఘటనలతో సినిమాలు తీయడమనే ట్రెండ్ బాగా ఎక్కువైంది. ట్రెండ్ని పట్టుకొని కథల్ని అల్లితే ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టొచ్చు.. కలెక్షన్లు రాబట్టవచ్చు. అందుకే ఏదైనా సంచలనాత్మక సంఘటనలు జరగడం ఆలస్యం ‘పట్టు పట్టు ట్రెండే పట్టు’ అంటూ ఆ అంశం మీద సినిమాలు ప్రకటిస్తున్నారు దర్శక–నిర్మాతలు. ఈ మధ్య కాలంలో ఇలా ప్రకటించిన సినిమాల వివరాలు గల్వాన్ ఘటన పాకిస్తాన్ మీద ఇండియా జరిపిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఉడి’. ఈ చిత్రం భారీ హిట్ అవడమే కాకుండా కలెక్షన్స్ దుమ్ము దులిపింది. గతకొన్ని రోజులుగా లడఖ్ సమీపంలో గల్వాన్ లోయలో భారత్ – చైనాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ సంఘటన మీద సినిమా తీస్తున్నట్టు అజయ్ దేవగణ్ ప్రకటించారు. ఇందులో నటించడమే కాకుండా ఈ చిత్రాన్ని అజయ్ దేవగనే నిర్మిస్తున్నారు కూడా. దర్శకుడు, మిగతా నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. (ఈ హీరోయిన్లు.. భ‘లేడీ’ విలన్లు) అభినందన్ వర్థమాన్ బాల్కోట్ ఎయిర్ అటాక్స్ ఆధారంగా మూడు సినిమాలు తెరకెక్కనున్నట్లు బాలీవుడ్ నుంచి ప్రకటన వచ్చింది. ఉగ్రస్థావరాలపై వైమానిక దళం దాడులు, పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్, ఆ తర్వాత ఆయన ఎలా తిరిగి వచ్చారు? అనే కథాంశంతో ఈ సినిమాలు తెరకెక్కనున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. భన్సాలీ అభిషేక్ కపూర్ కూడా ఓ సినిమాను ప్రకటించారు. అలానే ఆభినందన్గా నటించాలనుందని జాన్ అబ్రహాం తన మనసులోని మాట బయటపెట్టారు. కాబట్టి పైన పేర్కొన్న సినిమాల్లో జాన్ కనిపిస్తారేమో చూడాలి. అయోధ్య కథ అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నం జరిగింది. కృషి ఫలించింది. ఇటీవలే అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సంఘటనను సినిమాగా తీయడానికి బాలీవుడ్లో ఓ నిర్మాత సిద్ధమయ్యారు. అయోధ్యలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘అయోధ్యకీ కథ’ అనే సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత, సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు పహ్లాజ్ నిహ్లానీ. వివిధ భాషల్లో తెరకెక్కించే ఈ చిత్రంలో అన్ని భాషలకు సంబంధించిన నటీనటులు నటిస్తారని తెలిసింది. ఈ ఏడాది నవంబర్ 21న ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా విడుదల కానున్నట్టు సమాచారం. సుశాంత్ సింగ్ రాజ్పుత్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ని ఎంతగా కుదిపేసిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటన తర్వాత బాలీవుడ్లో నెపోటిజం వివాదం మరింత ముదిరింది. అవుట్ సైడర్స్ – ఇన్ సైడర్స్ డిబేట్ జరుగుతోంది. ఇదే సమయంలో సుశాంత్ పై ఓ సినిమా ప్రకటించారు హిందీ దర్శకుడు షామిక్ మౌలిక్. ‘సూసైడ్ ఆర్ మర్డర్?’ అనే టైటిల్తో సుశాంత్ పై ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇది సుశాంత్ బయోపిక్ కాదని కేవలం హీరోగా తన జర్నీ ని చూపించే చిత్రం అని పేర్కొన్నారు. ఈ చిత్రం పోస్టర్స్ ని కూడా విడుదల చేశారు. ఇలా తాజా సంఘటనలను, దాని తాలూకు క్రేజ్ని క్యాష్ చేసుకుందాం అనే ఆలోచనల్లోంచే ఇలా హడావిడిగా సినిమాలను ప్రకటిస్తుంటారు కొందరు. మరి.. ప్రకటించిన సినిమాలన్నీ తెరకొస్తాయా? కేవలం క్రేజ్ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనే కాకుండా ఆ సంఘటనలకు న్యాయం చేసే విధంగా ఈ సినిమాలు రూపొందుతాయా? వేచి చూడాలి. లాక్డౌన్, కరోనా టైటిళ్లతో.. కరోనా వల్ల ఏర్పడ్డ లాక్డౌన్ ద్వారా ప్రపంచం స్తంభించిపోయింది. పనులన్నీ ఆగిపోయాయి. వలస కూలీలు పొట్ట చేత పట్టుకొని వందల మైళ్లు ప్రయాణించారు. సామాన్యులు చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో చాలా కథలు కనబడ్డాయి మన దర్శక – నిర్మాతలకు. లాక్డౌన్ బ్యాక్డ్రాప్ లో పలు సినిమాలను ప్రకటించారు. కన్నడ దర్శకుడు గురు ప్రసాద్ ‘లాక్డౌన్’ అనే టైటిల్తో ఓ సినిమా ప్రకటించారు. లాక్డౌన్ బ్యాక్డ్రాప్ లో ఓ క్రైమ్ కామెడీ కథను రెడీ చేస్తున్నారట. అలాగే ‘కరోనా’ అనే టైటిల్ను ఉమేష్ బంకర్ అనే కన్నడ దర్శకుడు రిజిస్టర్ చేసుకున్నారు. కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ‘కరోనా ప్యార్ హై’ (‘కహోనా ప్యార్ హై’కి పేరడీగా) అనే టైటిల్ను నమోదు చేసుకున్నారు. ‘డెడ్లీ కరోనా’ అనే టైటిల్ కూడా హిందీలో నమోదు అయినట్టు సమాచారం. మరో వైపు లాక్ డౌన్ వల్ల ఇంటికి వెళ్లలేక చిక్కుకుపోయిన కొంతమంది విద్యార్థుల కథతో ‘21 డేస్’ అనే చిత్రాన్ని ప్రకటించారు తమిళ దర్శకుడు విజయ్ భాస్కర్. హిందీ వైపు వస్తే... సుధీర్ మిశ్రా, హన్సల్ మెహతా, కేతన్ మెహతా, సుభాష్ కపూర్ లతో కలసి అనుభవ్ సిన్హా ఓ ఆంథాలజీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఐదుగురు దర్శకులు ఐదు కథలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అన్ని కథలు కరోనా బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతాయని, స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని అనుభవ్ సిన్హా తెలిపారు. ఈ సినిమాను ఆయనే నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ గాంధీ ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఈ చిత్రం వైరస్, లాక్ డౌన్ చుట్టూ తిరుగుతుందని తెలిపారు. -
చైనా సరిహద్దులకు మరిన్ని బలగాలు
న్యూఢిల్లీ: చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి అదనంగా మరో 35 వేల మందిని నియమించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. తూర్పు లద్దాఖ్తోపాటు ఇతర ప్రాంతాల్లో చైనా తరచూ సరిహద్దు వివాదాలు సృష్టిస్తూండటం, ఇటీవల గల్వాన్ లోయలో పొరుగుదేశపు సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీరమరణం పొందడం ఈ నిర్ణయానికి కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. గల్వాన్ ఘటన తరువాత ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పట్లో ఫలితమిచ్చే అవకాశం లేకపోవడం ఇంకో కారణం. భారత్ చైనా సరిహద్దులు 3,488 కిలోమీటర్ల పొడవు ఉండగా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దులను కాపాడుకునేందుకు భారత్ ఇప్పటికే భారీగా ఖర్చు పెడుతోంది. ‘‘వాస్తవాధీన రేఖ వెంబడి మరీ ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలో పూర్తిగా మారిపోయింది. రెండువైపులా అదనపు బలగాలను మోహరిస్తున్నారు. అత్యున్నత స్థాయి రాజకీయ నిర్ణయం జరిగితే మినహా ఏ పక్షమూ తన బలగాలను వెనక్కు తీసుకోదు’’అని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ‘ద యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్’డైరెక్టర్ విశ్రాంత మేజర్ జనరల్ బి.కె.శర్మ తెలిపారు. సరిహద్దు సమస్యపై కమాండర్ల స్థాయిలో ఇంకోసారి చర్చలు జరగనున్నాయని, సమస్య పరిష్కారానికి భారత్ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వ్యాఖ్యానించారు. సైన్యం ఉపసంహరణ పూర్తి కాలేదు తూర్పు లద్దాఖ్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా దళాల ఉపసంహరణ ఇంకా పూర్తి కాలేదని భారత్ గురువారం స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. దళాల ఉపసంహరణ అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి దాదాపు పూర్తయిందని చైనా రెండు రోజుల క్రితం ప్రకటించిన నేపథ్యంలో భారత్ ఈ స్పష్టత ఇచ్చింది. ‘బలగాల ఉపసంహరణకు సంబంధించి కొంత పురోగతి ఉంది. కానీ, పూర్తిగా ఉపసంహరణ జరగలేదు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంట ఘర్షణ కేంద్రాల్లో పూర్తి స్థాయి బలగాల ఉపసంహరణ, సరిహద్దుల్లో శాంతి.. విషయాల్లో చైనా నిజాయతీగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. రెండు దేశాల మధ్య మరో విడత మిలటరీ కమాండర్ స్థాయి చర్చలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. స్మారకంపై గల్వాన్ అమరులు తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో చైనా సైన్యంతో పోరాడి, వీరమరణం పొందిన 20 మంది అమరజవాన్ల పేర్లను ఢిల్లీలోని నేషనల్ వార్మెమొరియల్పై లిఖించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేర్లు చేర్చడానికి కొద్ది నెలల సమయం పట్టనున్నట్టు తెలిపారు. ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా జూన్ 15వ తేదీన గల్వాన్ లోయలో చైనా సైనికులతో భీకర పోరాటం జరిగింది. ఈ పోరాటంలో 16 బిహార్ రెజిమెంట్కి చెందిన కల్నల్ బి.సంతోష్ బాబుతో పాటు, 20 మంది సైనికులు అసువులు బాశారు. చైనా వైపు ఈ ఘర్షణలో ఎంత మంది చనిపోయారనేది ప్రకటించలేదు. అమెరికా నిఘా వర్గాల ప్రకారం 35 మంది చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. -
గల్వాన్ వీరులకు మరింత గౌరవం
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో మన సైనికులు 20మంది అమరులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. జవాన్ల త్యాగాన్ని దేశం వేనోళ్ల కొనియాడింది. తాజాగా ఈ అమరవీరులకు మరింత గౌరవం ఇవ్వడం కోసం కేంద్రం సిద్ధమయినట్లు సమాచారం. నాటి ఘర్షణలో అసవులు బాసిన ఈ 20 మంది సైనికుల పేర్లను ‘నేషనల్ వార్ మెమోరియల్’పై చెక్కేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది నెలల్లో ఇది ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. (చైనా సరిహద్దుల్లో కీలక నిర్మాణాల వేగవంతం) జూన్ 15న లద్దాఖ్ గల్వాన్ వ్యాలీలో పెట్రోలింగ్ పాయింట్ 14 చుట్టూ చైనా ఒక నిఘా పోస్టును నిర్మించడాన్ని భారత సైనికులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇరు దేశాల దళాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ దాడిలో చైనా సైనికులు.. రాళ్లు, మొలలు దిగిన కర్రలు, ఇనుప రాడ్లతో మన సైనికులపై దాడి చేశారు. నాటి ఘటనలో 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బీ సంతోష్ బాబుతో సహా 20 మంది సైనికులు మరణించారు. ఈ ఘర్షణలో చైనా సైనికులు 35 మంది చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. చైనా వారికి ప్రభుత్వ లంఛనాలతో అంత్యక్రియలు కాదు కదా కనీసం అమరులైనా సైనికుల పేర్లు కూడా వెల్లడించలేదు. కానీ భారత్ మాత్రం మన సైనికుల త్యాగాన్ని గర్వంగా వెల్లడించింది. -
అక్కడ బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరణ
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసి) వెంట బలగాల ఉపసంహరణకు భారత్-చైనా ఇరు దేశాలు అంగీకరించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ అంశంపై చైనా మాటమారుస్తోంది. ఈ క్రమంలో ఎంతో ముఖ్యమైన పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతం, గోగ్రా పోస్ట్ నుంచి బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు కీలకమైన పాయింట్ల నుంచి ఇంతవరకు ఎలాంటి ఉపసంహరణ జరగలేదని విశ్వసనీయ సమాచారం. పాంగాంగ్త్సో ప్రాంతంలో పూర్తిగా ప్రతిష్టంభన ఏర్పడగా.. గోగ్రా పోస్ట్ ప్రాంతంలో ఉపసంహరణ తాజాగా నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో సమస్య మళ్లీ మొదటికొచ్చేలా ఉందంటున్నారు అధికారులు. ఇదిలా ఉండగా చైనా కీలకంగా భావించిన హాట్స్ర్పింగ్ ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణ ఈ రోజు మొదలైనట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు ఈ ప్రాంతంలో చైనా అదనంగా 40 వేల మంది సైనికులను మోహరించినట్లు వార్తలు వచ్చాయి. (వెనక్కి తగ్గిన చైనా) భారత్-చైనా సైనిక కమాండర్ల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. జూన్ 15న లద్దాఖ్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. వీటిని తగ్గించుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం కొన్ని పాయింట్ల నుంచి బలగాల ఉపసంహరణ జరిగింది. (చైనాపై ‘విసర్జికల్ స్ట్రైక్’) -
చైనాపై ‘విసర్జికల్ స్ట్రైక్’
‘గాల్వన్’ ఉద్రిక్తతల దరిమిలా భారత ప్రభుత్వం 59 చైనా యాప్స్పై నిషేధం విధించింది. క్రమంగా చైనా వస్తువులను సైతం నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. అతిపెద్ద మార్కెట్గా ఉన్న భారత్లో తమ వస్తువులకు అడ్రస్ గల్లంతయిపోతే, చైనా ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం తప్పదు. ఒకరకంగా ఇది భారత ప్రభుత్వం చైనాపై చేస్తున్న ‘విసర్జికల్ స్ట్రైక్’గా చెప్పుకోవచ్చు. సరి‘హద్దు’ మీరిన చైనా సైనికుల దాడిలో కల్నల్ సంతోష్బాబు సహా ఇరవై మంది భారత సైనికుల మృతి ఉభయ దేశాల నడుమ ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా చైనాపై వ్యతిరేకత చెలరేగింది. చైనా వస్తువులను తగులబెట్టి కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే భారత ప్రభుత్వం దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేవిగా ఉన్నాయంటూ చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్పై నిషేధం విధించింది. నిషేధానికి గురైన యాప్స్లో పెద్దసంఖ్యలో యూజర్లు ఉన్న ‘టిక్టాక్’తో పాటు చాలామంది తరచుగా ఉపయోగించే ‘హెలో’, ‘షేర్ ఇట్’, ‘యూసీ బ్రౌజర్’, ‘యూ వీడియో’ వంటివి కూడా ఉన్నాయి. మన దేశంలో చైనా ప్రమేయం యాప్స్, మొబైల్ఫోన్ల వరకు మాత్రమే పరిమితం కాదు. వివిధ రంగాల్లో చైనా మన మార్కెట్ను ముంచెత్తుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో మన ఆర్థికరంగం నుంచి చైనా ప్రమేయాన్ని పూర్తిగా తొలగించి ‘ఆత్మనిర్భరత’ సాధించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మన దేశంలోని పలు కీలక రంగాల్లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఆటోమొబైల్, ఖనిజ లోహాలు, విద్యుత్తు, భవన నిర్మాణ, సేవా రంగాల్లో చైనా పెట్టుబడులు గణనీయమైన స్థాయిలోనే ఉన్నాయి. గడచిన ఐదేళ్ల వ్యవధిలోనే భారత్లో చైనా పెట్టుబడులు ఐదురెట్లు పెరిగాయి. చైనా పెట్టుబడులు 2014లో 1.60 బిలియన్ డాలర్లు (రూ.11,973 కోట్లు) ఉంటే, 2019 నాటికి 8 బిలియన్ డాలర్లకు (రూ.59,867 కోట్లు) చేరాయి. చైనా కంపెనీలు కొన్ని మన దేశంలో పనిచేస్తున్నాయి. గడచిన కొన్నేళ్లుగా చైనా వస్తువులు దేశం నలుమూలలకూ పాకాయి. మన దేశంలో చాలామంది ఉపయోగించే మొబైల్ ఫోన్లలో చైనాకు చెందినవే ఎక్కువ. చైనాతో మన దేశానికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. వాటిని ఇప్పటికిప్పుడు రద్దు చేసుకునే పరిస్థితులైతే కనిపించడం లేదు. కొన్ని కీలక రంగాల్లో చైనా పెట్టుబడులు ఏ మేరకు ఉన్నాయంటే... భారత్–చైనా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 2001 నాటికి 3.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.27 వేల కోట్లు) మాత్రమే అయితే, 2019 నాటికి ఈ విలువ 90 బిలయన్ డాలర్లకు (సుమారు రూ.6.74 లక్షల కోట్లు) పెరిగింది. ఇన్నాళ్లూ భారత్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతూ వచ్చింది. అయితే, సరిహద్దు ఉద్రిక్తతల దరిమిలా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భారత్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న చైనా కంపెనీలకు భారీస్థాయి ఆర్థికనష్టం తప్పకపోవచ్చు. చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై భారీగా సుంకాలను విధించేందుకు భారత ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందుకోసం కేంద్ర వాణిజ్యశాఖ చైనా దిగుమతి వస్తువుల జాబితాను సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు వాణిజ్య, వర్తక సంఘాలు కూడా ‘బాయ్కాట్ చైనా’ నినాదాన్ని ప్రచారం చేస్తున్నాయి. కొన్నిచోట్ల వర్తక సంఘాలు తమ మార్కెట్లలో చైనా వస్తువులను అమ్మబోమంటూ కూడా ప్రకటించాయి. చైనా వస్తువుల బహిష్కరణ నిర్ణయాన్ని కట్టుదిట్టంగా అమలు చేయగలిగితే దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వస్తువూ దేశంలోనే తయారు కావాలనే భావన ప్రజల్లో ఎక్కువగా ఉన్నా, ఆచరణలో అది సాధ్యమయ్యే అవకాశాలు తక్కువేనని ప్రముఖ ఆర్థికవేత్త యోగేంద్ర కపూర్ అభిప్రాయపడుతున్నారు. చైనా నుంచి మన దేశానికి ప్రధాన దిగుమతులు ఇప్పటికి ఏ స్థాయిలో ఉన్నాయంటే... నిషేధానికి దారితీసిన పరిణామాలు ‘టిక్టాక్’ సహా 59 చైనా యాప్స్కు సంబంధించి కంటెంట్ వివాదం పాతదే అయినా, వీటి నిషేధానికి కంటెంట్ ప్రధాన కారణం కాదు. ఇవి దేశభద్రతకు కలిగించే అవకాశాలు ఉన్నాయనే కారణంతోనే భారత ప్రభుత్వం వీటిని నిషేధించింది. అమెరికా, ఆస్ట్రేలియా కూడా భారత్ బాటలోనే చైనా యాప్స్పై నిషేధం విధించే అంశంపై కసరత్తులు ప్రారంభించాయి. చైనా యాప్స్కు భారత్లో కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. యాప్స్ను అందిస్తున్న సంస్థల్లో చాలావాటికి భారత్లో కార్యాలయాలు ఉన్నాయి. వీటి సర్వర్లు మాత్రం చైనాలో ఉన్నాయి. ఇవి ఇక్కడి నుంచి కోట్లాది మంది భారతీయుల వ్యక్తిగత వివరాలను చైనా సర్వర్లకు చేరవేస్తున్నాయనేదే వీటిపై ప్రధాన అభియోగం. పౌరులకు సంబంధించిన గోప్యమైన వివరాలను దేశం వెలుపలకు పంపడం దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగకరమనే కారణంతోనే భారత ప్రభుత్వం వీటిని నిషేధించింది. గాల్వన్ లోయలో చైనా సైనికుల చొరబాటుకు ముందే, ఈ ఏడాది ఏప్రిల్ 20లోనే ప్రభుత్వం ‘ఈ యాప్స్ ద్వారా చైనా మీ వ్యక్తిగత వివరాలపై కన్నేసి ఉంటుంది’ అని ప్రజలను హెచ్చరించింది. దీనికితోడు సరిహద్దుల వద్ద కూడా చైనా ఆగడాలు శ్రుతి మించడంతో ప్రభుత్వం ఈ యాప్స్పై వేటు వేసింది. చైనా వస్తుబహిష్కరణపై భిన్నస్వరాలు గాల్వన్ లోయ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో చైనాపై ఆగ్రహావేశాలు చెలరేగాయి. ఆర్థికశక్తిగా అగ్రస్థానానికి ఎదగాలనే చైనా ఆకాంక్షలను ఆర్థికంగానే దెబ్బతీయాలని కొన్ని వాణిజ్య, వర్తక సంస్థలు అభిప్రాయపడ్డాయి. ప్రభుత్వం కూడా ఈ దిశగానే చర్యలకు సమాయత్తమవుతోంది. అయితే, చైనా వస్తువులను నియంత్రించడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. చైనాకు చెందిన వస్తువులేవీ భవిష్యత్తులో ఉపయోగించరాదంటూ ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కు ప్రభుత్వం సూచించింది. అయితే, వ్యూహాత్మక అంశాలను కార్పొరేట్ నిర్ణయాలతో కలపకుండా ఉంటేనే బాగుంటుందని టెలికం కంపెనీల సంస్థ ‘సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (సీఓఏఐ) ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే, చైనా వస్తువులను ఇప్పటికిప్పుడే బహిష్కరించడం సాధ్యమయ్యే పరిస్థితులు లేవని లార్సన్ అండ్ టర్బో సీఈవో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఎలాంటి దుందుడుకు నిర్ణయం తీసుకున్నా, తలెత్తబోయే ప్రమాదాలను ఊహించవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దిశగా నిర్ణయం తీసుకునే ముందు సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా బేరీజు వేసుకోవాలని సూచించారు. ‘భారత్లో చైనా కంపెనీలు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నాయి. చాలా అంశాల్లో చైనా వస్తువులు నాణ్యమైనవే కాకుండా, తక్కువ ధరలకే దొరుకుతున్నాయి. చైనాతో మనకు వ్యాపార సమతుల్యత కూడా ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, చైనా వస్తువులను బహిష్కరించడం సాధ్యం కాదు. అలా కాకుండా, దీర్ఘకాలిక దృష్టితో చైనాను శత్రు దేశంగా పరిగణిస్తున్నట్లయితే, మన విధానాలను అందుకు అనుగుణంగా మార్చుకుని, అమలులోకి తేవాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది’ అని సుబ్రహ్మణ్యన్ అన్నారు. ఒకవైపు సుబ్రహ్మణ్యన్ ప్రకటనపై చర్చ సాగుతుండగా, మరోవైపు మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ కూడా ఈ అంశంపై గళం విప్పారు. ‘చైనా నుంచి వచ్చే వస్తువులను నిషేధించడం వల్ల దేశంలో వస్తువుల ధరలు పెరుగుతాయి. అంత నాణ్యమైన వస్తువులు అంత తక్కువ ధరకు భారత్లో అందుబాటులో లేవు. ఎంతోకాలంగా దిగుమతులపై ఆధారపడ్డ కంపెనీలకు ఇది లాభదాయకం కాదు. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. దీనివల్ల కంపెనీల వ్యయం ఇదివరకటి కంటే బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వస్తువులను దిగుమతి చేసుకోవడం మినహా కంపెనీలకు మరో మార్గం లేదు’ అని ఆయన అన్నారు. మరోవైపు, చైనా వస్తువులపై అకస్మాత్తుగా నిషేధం విధిస్తే, అంతిమంగా జనాలపైనే ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, చైనా దిగుమతుల నిషేధానికి వీలుగా ప్రభుత్వం ఎయిర్ కండిషనర్, టీవీల్లో విడి భాగాలు సహా పది పన్నెండు రకాల ఉత్పత్తులపై లైసెన్సింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు సమాయత్తమవుతోందంటూ కథనాలు వస్తున్నాయి. చైనా యాప్స్తో మొదలైన నిషేధపర్వం ఇంకెంత దూరం పోతుందో, పర్యవసానాలు ఎలా ఉంటాయోననే అంశంపై పారిశ్రామిక వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. చర్చ అంతా టిక్టాక్ పైనే.. టిక్టాక్ను కలుపుకొని మొత్తం 59 చైనా యాప్స్పై ప్రభుత్వం నిషేధం విధించినా, ప్రధానమైన చర్చ టిక్టాక్పైనే జరుగుతోంది. మారుమూల అనామకంగా ఉన్న చాలామంది ఔత్సాహికులకు తమ నటనా పాటవాన్ని చాటుకునే వేదికగా నిలిచింది ‘టిక్టాక్’. ఇలాంటి ఔత్సాహికుల్లో కొందరు ‘టిక్టాక్’ ద్వారానే పాపులారిటీ సాధించారు. వీడియో షేరింగ్ యాప్ అయిన ‘టిక్టాక్’ స్వల్పకాలంలోనే చాలామందికి వదులుకోలేని వ్యసనంలా మారింది. ప్రభుత్వం ‘టిక్టాక్’ను నిషేధించడంతో ఇలాంటి వాళ్ల కలల మేడలు ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లయింది. ‘టిక్టాక్’ మైకంలో పడి కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకున్న సంఘటనలు, ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా తరచుగా వార్తలకెక్కాయి. టిక్టాక్పై నిషేధం తర్వాత ఇదే తరహాకు చెందిన స్వదేశీ వీడియో షేరింగ్ యాప్స్కు గిరాకీ పెరిగింది. ‘చింగారీ’, ‘లిట్లాట్’, ‘మిత్రోం’, ‘బోలో ఇండియా’ వంటి యాప్స్కు డౌన్లోడ్లు బాగా పెరిగాయి. ‘యూజర్ జెనరేటెడ్ కంటెంట్’ (యూజీసీ) షేర్ చేసుకోవడానికి ఉపయోగపడే యాప్స్లో ‘టిక్టాక్’ ఒక సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. నిషేధానికి గురైన మిగిలిన చైనా యాప్స్కు కూడా స్వదేశీ ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో యూజీసీ యాప్స్ నడుపుతున్న సంస్థల నిర్వాహకుల్లో ‘టిక్టాక్’ నిషేధం వరమా? శాపమా? అనే చర్చ మొదలైంది. యూజీసీ యాప్స్కు పాపులారిటీ పెరుగుతున్న నేపథ్యంలో వీటి ద్వారా వ్యాప్తి చెందుతున్న కంటెంట్ నాణ్యత, నైతికత, భాషా సాంస్కృతిక విలువలపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అశ్లీలత, అసభ్యకరమైన భాష వీటి ద్వారా వ్యాప్తి చెందడమే కాకుండా, వీటి వలలో చిక్కుకుని కుర్రకారు దారితప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్మార్ట్ఫోన్ల ద్వారా విరివిగా అందుబాటులోకి వచ్చిన పలు సామాజిక మాధ్యమాలు యూజర్లు తమదైన కంటెంట్ను ఇతరులతో తేలికగా పంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. కోట్లాది మంది యూజర్లు తమ కంటెంట్ను క్షణాల్లోనే ప్రపంచానికి చేరవేయగలుగుతున్నారు. కొందరు కంటెంట్ను సృష్టించడంలో వైవిధ్యాన్ని, సృజనాత్మకతను చూపుతుంటే, అక్కడక్కడా కొందరు వీటి ద్వారా తమ మనోవికారాలన్నింటినీ బయటపెట్టుకుంటున్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను, అశ్లీలమైన చేష్టలు, అసభ్యమైన మాటలతో కూడిన వీడియోలను ప్రసారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా యూజర్లు జనాలకు చేరవేసే కంటెంట్పై కట్టుదిట్టమైన పరిశీలన, నియంత్రణ తప్పనిసరిగా ఉండాలని, కంటెంట్ షేరింగ్కు అవకాశం కల్పిస్తున్న సంస్థలే ఈ బాధ్యతను జాగరూకతతో నిర్వర్తించాల్సి ఉంటుందని ‘మామ్స్ప్రెస్సో’ సీఈవో విశాల్ గుప్తా చెబుతున్నారు. ‘మామ్స్ప్రెస్సో’ మహిళల కోసం రూపొందిన ఆన్లైన్ యూజీసీ వేదిక. ఇది పది భాషల్లో పనిచేస్తోంది. దీనికి యూజర్ల నుంచి వచ్చే కంటెంట్లో ప్రతి పీస్ను తమ సిబ్బంది నిరంతరాయంగా పరిశీలిస్తూనే ఉంటారని, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండే కంటెంట్ను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటారని విశాల్ తెలిపారు. సామాజిక మాధ్యమాలను నిర్వహించే సంస్థలు యూజర్ల కంటెంట్పై జాగ్రత్తలు తీసుకోక తప్పదని, భారత్ వంటి దేశంలో సాంస్కృతిక విలువలు, వివిధ వర్గాల ప్రజల మనోభావాలు వంటి సున్నితమైన అంశాలపై మరింత అప్రమత్తంగా ఉండటం అవసరమని సిలికాన్ వ్యాలీకి చెందిన వీడియో షేరింగ్ యాప్ ‘ఫైర్వర్క్’ సీఈవో సునీల్ నయ్యర్ అభిప్రాయపడుతున్నారు. -
ఉపసంహరణపై సమీక్షలు అవసరం: ఆర్మీ
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లోని క్లిష్టమైన తూర్పు లద్దాఖ్ ప్రాంతం నుంచి ఇరు దేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు ధ్రువీకరించుకోవాల్సిన అవసరం ఉందని భారత్ పేర్కొంది. ‘బలగాల పూర్తి ఉపసంహరణకు రెండు పక్షాలు కట్టుబడి ఉన్నాయి. క్లిష్టమైన ఈ ప్రక్రియ అమలుపై ఎప్పటికప్పుడు పరిశీలన అవసరం. దౌత్య, సైనిక స్థాయిల్లో ఇవి క్రమం తప్పకుండా జరుగుతుండాలి’ అని ఆర్మీ ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు లద్దాఖ్లో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునేందుకు కార్ప్స్ కమాండర్ల నాలుగో దఫా జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటి దశ ఉపసంహరణ ప్రక్రియ అమలును సమీక్షించడంతోపాటు పూర్తిస్థాయి ఉపసంహరణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా అధికారులు చర్చించారని తెలిపారు. ‘అయితే, జూన్ 15వ తేదీ నాటి గల్వాన్ ఘటన నేపథ్యంలో పరస్పరం విశ్వాసం నెలకొనడానికి సమయం పడుతుంది. బలగాల సత్వర ఉపసంహరణ కూడా కష్టమే. పూర్తి స్థాయి ఉపసంహరణకు సైనిక స్థాయి చర్చలు మరికొన్ని జరగాల్సి ఉంది’ అని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అయిదో విడత లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు మరికొన్ని రోజుల్లోనే జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలంటున్నాయి. ఈసారి పాంగాంగో సో ప్రాంతం నుంచి ఉపసంహరణలపైనే ప్రధానంగా దృష్టి ఉంటుందని భావిస్తున్నారు. ఘర్షణాత్మక పరిస్థితులను నివారించేందుకే తూర్పు లద్దాఖ్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంట యుద్ధ పరిస్థితులను నివారించేందుకే రెండు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ‘క్లిష్టమైన ఈ ప్రక్రియకు సంబంధించి ఆధారాలు లేని, అసత్య వార్తలను పట్టించుకోవద్దంది. ఎల్ఏసీ వెంట రెగ్యులర్ పోస్టుల్లో తిరిగి బలగాలను మోహరించాలని కూడా నిర్ణయించాయని తెలిపింది. ఇది పరస్పర ఆమోదంతో తీసుకుంటున్న చర్య అనీ, దీనిని తప్పుగా అర్థం చేసుకోరాదని పేర్కొంది. -
శవ ‘సంస్కారం’ లేని చైనా!
వాషింగ్టన్: దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల మృతదేహాలకు గౌరవ ప్రదమైన అంతిమ కర్మలు చేసే సంస్కారమూ లేకపోయింది పొరుగుదేశం చైనాకు! గత నెల 15వ తేదీన తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో భారత సైనికులతో జరిగిన ఘర్షణలో కొంతమంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. భారత్ 20 మంది సైనికులను కోల్పోగా తమ సైనికులు ఎంతమంది ప్రాణత్యాగం చేశారో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్న చైనా.. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అని వారి అంతిమ సంస్కారానికి కూడా అంగీకరించడం లేదని, కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెంచుతోందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్ మాత్రం తన వీరపుత్రులకు తగిన గౌరవ మర్యాదలిచ్చి వారి బలిదానాన్ని గుర్తించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. చైనా మాత్రం ఇప్పటివరకూ ఆ ఘటనలో ఎంత మంది చనిపోయారో కూడా బహిర్గతం చేయలేదు. పైగా శోకసంద్రంలో ఉన్న సైనికుల కుటుంబాలను ప్రభుత్వం అవమానాల పాలు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలంటున్నాయి. సంప్రదాయాల ప్రకారం నిర్వహించే అంతిమ సంస్కారాలను సైనికుల కుటుంబాలు మరచిపోవాలంటూ...కరోనాను సాకుగా చూపినట్లు తెలుస్తోంది. అమెరికా నిఘా వర్గాల ప్రకారం 35 మంది చైనీయులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. -
సైనికుల అంత్యక్రియలు.. చైనా అభ్యంతరం!
బీజింగ్: గల్వాన్ వ్యాలీ ఘటనపై చైనా ఇప్పటికి కూడా వాస్తవాలను వెల్లడించడం లేదు. ఈ క్రమంలో నాటి ఘర్షణలో మరణించిన సైనికులకు ప్రభుత్వ లాంఛనాలు కాదు కదా.. కనీసం సాంప్రదాయపద్దతిలో అంత్యక్రియలు కూడా నిర్వహించకూడదంటూ చైనా ప్రభుత్వం ఆదేశించినట్లు అమెరికా ఇంటిలిజెన్స్ తెలిపింది. ఈ మేరకు సదరు సైనిక కుటుంబాలపై చైనా ఒత్తిడి తెచ్చినట్లు ఇంటిలిజెన్స్ వెల్లడించింది. గత నెల 15న గల్వాన్ వ్యాలీ ఘర్షణలో ఇరు దేశాలు సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో అమరులైన భారత సైనిక వీరులకు యావత్ దేశప్రజలు నివాళులర్పించిన సంగతి తెలిసిందే. కేంద్రం అమరులైన సైనికుల వివరాలు వెల్లడించడమే కాక వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఇదే కాక జూన్ నెల మన్కీబాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ సైనికులు కుటుంబాలకు సంతాపం తెలిపారు. (గల్వాన్ దాడి; విస్తుగొలిపే నిజాలు!) అయితే గల్వాన్ వ్యాలీ ఘర్షణ జరిగి నెలరోజులు కావస్తున్నప్పటికి చైనా మాత్రం ఇంకా తన మరణించిన సైనికులు వివరాలు వెల్లడించలేదు. ఆ కుటుంబాలను ఓదార్చడం కాదు కదా కనీసం ధైర్యం కూడా చెప్పలేదని అమెరికా ఇంటిలిజెన్స్ అభిప్రాయపడింది. నాటి ఘర్షణలో సుమారు 35 చైనా సైనికులు మరణించినట్లు తెలిపింది. అయితే చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీరికి ఒక్కొక్కొరికి సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించకూడదని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాక.. అందరిని ఒకేసారి ఖననం చేయాల్సిందిగా ఆదేశించినట్లు అభిప్రాయపడింది. దీనిపై సదరు సైనికుల కుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇలా ఆదేశించినట్లు చైనా ప్రభుత్వం సమాధానమిచ్చినట్లు సమాచారం. (గల్వాన్పై ఎందుకు చైనా కన్ను?) -
భారత్, చైనా శాంతి మంత్రం
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పూర్తిస్థాయిలో శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని భారత్, చైనా ఒక అంగీకారానికి వచ్చాయి. తూర్పు లద్దాఖ్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. ఇరు దేశాల దౌత్య ప్రతినిధులు మరోసారి శుక్రవారం ఆన్లైన్ ద్వారా చర్చలు జరిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిస్థాపన కోసం సరిహద్దుల్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఇరు దేశాల ప్రతినిధులు అంగీకరించారు. ఎల్ఏసీ వెంబడి సైనికుల ఉపసంహరణ పురోగతిపై సమీక్షించారు. భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం అమెరికా రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్తో చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్లో పరిస్థితిపై రాజ్నాథ్ సమీక్ష తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ అనంతర పరిస్థితులపై శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష జరిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియాతోపాటు పలువురు సీనియర్ సైనికాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణలో మొదటి దశ పూర్తయినట్లేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ అమ్ముల పొదిలో మరిన్ని ‘అపాచీ’లు భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్ల అందజేత పూర్తి చేసినట్లు అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ప్రకటించింది. ఒప్పందం ప్రకారం అపాచీ యుద్ధ హెలికాప్టర్లలోని చివరి ఐదింటిని ఇటీవల భారత వైమానిక దళానికి అందజేసినట్లు బోయింగ్ సంస్థ వెల్లడించింది. (చైనా హెచ్చరికలు.. ఖండించిన కజకిస్థాన్!) -
చైనీస్ యాప్స్కి మరో షాక్
ఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య 59 చైనీస్ యాప్స్పై కేంద్రం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అయితే డేటా సేకరణ పద్ధతులు, లొకేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను మూడు వారాల్లోగా నివేదించాల్సిందిగా టిక్టాక్ సహా 58 ఇతర యాప్లకు ఎలక్ర్టానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేఖలు రాసింది. ఐటీ యాక్ట్ కింద ఆయా సంస్థలకి ఈ- మెయిల్స్ పంపామని, తద్వారా సమగ్రంగా విశ్లేషించడానికి వీలవుతుందని ఐటీ అధికారి ఒకరు వెల్లడించారు. భారత వినియోగదారుల డేటాతో సహా లొకేషన్ వివరాలను చైనా సర్వీర్లకు బదిలీ చేసినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు ఇదివరకే ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బ్యూటీ ప్లస్, సెల్ఫీ కెమెరా లాంటి యాప్లలో అశ్లీల కంటెంట్ ఉందని కూడా నివేదించాయి. చైనీస్ యాప్స్పై విధించిన నిషేదాన్ని డిజిటల్ స్ర్టైక్గా అభివర్ణించిన మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఆయా యాప్స్ నిర్వాహకులు త్వరలోనే ప్యానెల్ ముందు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. (ఆ 89 యాప్స్ తొలగించండి ) ప్రముఖ షార్ట్ వీడియో స్ర్టీమింగ్ యాప్ టిక్టాక్కు భారత్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత ఈ యాప్ను ఎక్కువగా వాడుతున్నట్లు అధ్యయంనంలో తేలింది.భారత్లో టిక్టాక్ యూజర్లు 200 మిలియన్లకు పైగానే ఉన్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో టిక్టాక్ను బ్యాన్చేశారు. తాజాగా భారత్ కూడా నిషేదం విధించడంతో టిక్టాక్కు భారీ నష్టం వాటిల్లందనే చెప్పొచ్చు. అయితే తాము డేటా చోరీకి పాల్పడలేదని భారత చట్టాలు, నిబంధనలకు లోబడే ఉన్నామని వినియోగదారుల డేటా, వారి గోప్యతకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని టిక్టాక్ ప్రతినిధి మరోసారి తెలిపారు. అంతేకాకుండా నిర్ణీత గడువులోపు పూర్తి వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. (చైనా యాప్ల బ్యాన్ దిశగా అమెరికా? ) -
గల్వాన్పై చైనాకు హక్కు లేదు: భారత్
న్యూఢిల్లీ: గల్వాన్ లోయ తమదేనంటున్న చైనా వాదనను భారత్ మరోసారి తోసిపుచ్చింది. చైనా చేస్తున్న ఈ వాదన అతిశయోక్తి అనీ, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా శుక్రవారం భారత్, చైనా ప్రతినిధులు సమావేశం కానున్న నేపథ్యంలో భారత్ ఈ మేరకు స్పందించింది. గల్వాన్ లోయ సహా, ఎల్ఏసీ వెంట యథాతధ పరిస్థితిని తప్పనిసరిగా గౌరవించాల్సిందేననీ, రెండు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు ఇదే ప్రాతిపదిక అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా బలగాలు వెనక్కి మరలడంపై అనురాగ్ శ్రీవాస్తవ స్పందిస్తూ..రెండు దేశాల ప్రతినిధుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం బలగాల ఉపసంహరణతోపాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య, సైనిక ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతాయన్నారు. కాగా, భారత్–చైనా సరిహద్దు వ్యవహారాలపై ఏర్పాటైన సంప్రదింపులు, సమన్వయ కమిటీ ఆన్లైన్ ద్వారా శుక్రవారం సంభాషణలు జరిపే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత సైన్యంతో కుదిరిన ఒప్పందం ప్రకారం చైనా సైన్యం తూర్పు లద్దాఖ్లోని గొగ్రా, హాట్స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంది. -
వెనక్కు వెళ్లిన చైనా బలగాలు
న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తూర్పు లద్దాఖ్లోని ఘర్షణాత్మక హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం నుంచి చైనా దళాలు బుధవారం నాటికి పూర్తిగా వైదొలగాయి. శిబిరాలను తొలగించాయి. సరిహద్దుల్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరుదేశాలు బలగాలను వెనక్కు తీసుకునే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అంతకుముందు, భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య ఆదివారం జరిగిన చర్చల్లో అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సాధ్యమైనంత త్వరగా, దశలవారీగా బలగాల ఉపసంహరణ జరగాలని నిర్ణయించారు. దాంతో సోమవారం నుంచి గల్వాన్ లోయ, హాట్స్ప్రింగ్స్, గొగ్రా, పాంగాంగ్ సొలోని ఫింగర్ ఏరియాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 నుంచి ఇప్పటికే చైనా వెనక్కు వెళ్లింది. హాట్ స్ప్రింగ్ వద్ద ఉన్న పెట్రోలింగ్ పాయింట్ 15 నుంచి బుధవారం నాటికి చైనా బలగాలు పూర్తిగా వైదొలగాయని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఉపసంహరణ ఏ మేరకు జరిగిందనే విషయాన్ని భారత దళాలు త్వరలో ప్రత్యక్షంగా పరిశీలించి నిర్ధారించుకుంటాయని తెలిపాయి. మరోవైపు, ఉపసంహరణ ప్రక్రియ అమలును భారత్, చైనా సైన్యాధికారులు సంయుక్తంగా పరిశీలించి, నిర్ధారించే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది. గొగ్రా(పెట్రోలింగ్ పాయింట్ 17ఏ) నుంచి చైనా దళాలు గురువారం నాటికి వెనక్కు వెళ్లే అవకాశం ఉందన్నాయి. సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో హాట్ స్ప్రింగ్స్, గొగ్రా ఉన్నాయి. జూన్ 30న ఇరుదేశాల కమాండర్ స్థాయి చర్చల్లో.. ఘర్షణలకు అవకాశమున్న ప్రదేశాల్లో కనీసం 3 కిమీల వరకు బఫర్ జోన్(నిస్సైనిక ప్రాంతం)ను ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదిరింది. -
ఉదయం 8.45కి ఫోన్కాల్.. ఆ తర్వాత
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దుల్లో దాదాపు రెండు నెలల తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల తర్వాత తొలిసారిగా తూర్పు లద్ధాఖ్లో తొలిసారిగా సంయమనం దిశగా సోమవారం పురోగతి కనిపించిన విషయం విదితమే. ఘర్షణ వాతావరణానికి కేంద్ర స్థానమైన గల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు కిలోమీటరు మేర వెనక్కు వెళ్లాయి. అంతేగాకుండా పెట్రోలింగ్ పాయింట్(పీపీ) 14 వద్ద నిర్మించిన తాత్కాలిక శిబిరాలు, ఇతర నిర్మాణాలను తొలగించాయి. ఇందుకు ప్రతిగా భారత్ సైతం బలగాలను ఉపసంహరించుకుంది. ఇరుదేశాల కమాండర్ స్థాయి ఆర్మీ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల మేరకు చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాగా తాజా పరిణామాలపై ఆర్మీ అధికారులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఓ అధికారి.. గల్వాన్ లోయలోని పీపీ 14, పీపీ 15, పీపీ 17లతో పాటు గొగ్రా హాట్ స్ప్రింగ్స్, ప్యాంగాంగ్ సరస్సు నుంచి సోమవారం సాయంత్రానికి చైనా బలగాలు పూర్తి స్థాయిలో వెనక్కి మళ్లాయని పేర్కొన్నారు. అయితే వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని.. ప్యాంగాంగ్ త్సో వద్ద పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. గల్వాన్, గోగ్రా హాట్ స్ప్రింగ్స్లో చైనా ఆర్మీ అంతగా బలంగా లేదని.. అయితే ప్యాంగాంగ్ త్సో వద్ద పరిస్థితి వారికి అనుకూలంగా ఉందని తెలిపారు. అదే విధంగా చైనా బలగాలు వెనక్కి మళ్లే అవకాశం ఎక్కువగానే ఉందని అభిప్రాయపడ్డారు. నీటి మట్టం పెరిగినందుకేనా? ‘ఇది చిన్న చర్యే. చైనా సుమారు 1.5 కిలోమీటర్లు వెనక్కు వెళ్లింది. భారత బలగాలు కొంత వెనక్కు వచ్చాయి. ఇదేం శాశ్వతం కాదు. చైనా బలగాలు మళ్లీ ముందుకు రావచ్చు’ అని మరో అధికారి వ్యాఖ్యానించారు. అక్సాయి చిన్ ప్రాంతంలో మంచు కరగడంతో, గల్వాన్ నదిలో నీటిమట్టం పెరిగిందని, ఆ కారణంగా చైనా దళాలు వెనక్కు వెళ్లి ఉండవచ్చని మరికొంత మంది ఆర్మీ అధికారులు భావిస్తున్నాయి. ‘పాంగాంగ్ సొ నుంచి చైనా ఒక్క అంగుళం కూడా వెనక్కు వెళ్లలేదు. మూడు టెంట్లు తొలగించి, 20 వాహనాలను వెనక్కు పంపించడం బలగాల ఉపసంహరణ అనిపించుకోదు’ అని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, ఇరుదేశాల బలగాల ఉపసంహరణ కొంతవరకు సానుకూల చర్యేనని నార్తర్న్ ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ డీఎస్ హూడా వ్యాఖ్యానించారు. ఉదయం 8.45కి ఫోన్.. సోమవారం నాటి బలగాల ఉపసంహరణకు ఒకరోజు ముందుగానే అంటే ఆదివారం ఉదయం ఎనిమిది గంటల 45 నిమిషాల సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణేకు ఫోన్కాల్ వచ్చినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దుల్లో ఇటీవలి పరిణామాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సాయంత్రం చర్చలు జరుపనున్నారన్న విషయం గురించి ఆయనకు తెలియజేసినట్లు పేర్కొన్నాయి. దీంతో డ్రాగన్ కదలికలు గమనిస్తూనే.. అందుకు అనుగుణంగా తాము స్పందించినట్లు తెలిపాయి. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు గంటల పాటు ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరత నెలకొల్పాల్సిన ఆవశ్యకతపై దోవల్.. వాంగ్ యీకి వివరించగా.. భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు అవుతున్న విషయాన్ని వాంగ్ చర్చల్లో ప్రస్తావించినట్లు తెలిపింది. అయితే జూన్ 15 నాటి హింసాత్మక ఘర్షణకు కారణం ఎవరన్న విషయంపై మాత్రం ఇరువురు తమ తమ వాదనలు బలంగానే వినిపించినట్లు తెలుస్తోంది. కాగా దాదాపు 45 ఏళ్ల తర్వాత జూన్ 15న తొలిసారిగా గల్వాన్ లోయలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. చైనా ఆర్మీ ఘాతుకానికి 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. -
వెనక్కి తగ్గిన చైనా
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్లో శాంతి, సంయమనం దిశగా తొలి అడుగులు పడ్డాయి. ఉద్రిక్తతలకు కేంద్ర స్థానమైన గల్వాన్లోయ నుంచి సోమవారం చైనా దళాలు వెనక్కు వెళ్లాయి. పెట్రోలింగ్ పాయింట్(పీపీ) 14 వద్ద నిర్మించిన తాత్కాలిక శిబిరాలు, ఇతర నిర్మాణాలను తొలగించాయి. దాదాపు కిలోమీటరుకు పైగా చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే, ఎంత దూరం వెనక్కు వెళ్లాయో కచ్చితంగా తెలియదన్నాయి. ఇరుదేశాల కమాండర్ స్థాయి ఆర్మీ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల మేరకు చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైందని వెల్లడించాయి. అయితే, భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగిన తరువాతే ఈ ప్రక్రియ వేగవంతమైనట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ధోవల్ ఆదివారం ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. బలగాల ఉపసంహరణను వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ చర్చల సందర్భంగా నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనాలంటే ముందు బలగాల ఉపసంహరణ జరగాలని, అభిప్రాయభేదాలు ఘర్షణలుగా మారకుండా జాగ్రత్త పడాలని ఇరువురు అంగీకారానికి వచ్చారు. ధోవల్, వాంగ్ యి భారత్, చైనాల తరఫున సరిహద్దు చర్చల్లో ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. రెండు దేశాల ఆర్మీలకు భారీగా ప్రాణనష్టం సంభవించిన జూన్ 15 నాటి గల్వాన్ ఘర్షణల తరువాత ఈ ఇద్దరు చర్చించుకోవడం ఇదే ప్రథమం. సరిహద్దుల్లో ఇటీవలి పరిణామాలపై ఆదివారం నాటి చర్చల్లో ధోవల్, వాంగ్ నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. వాస్తవాధీన రేఖను ఇరుదేశాలు గౌరవించాలని, య«థాతథ స్థితిని ఏకపక్షంగా ఎవరూ ఉల్లంఘించరాదని అంగీకారానికి వచ్చారని తెలిపింది. సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొనేవరకు దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగించాలని ధోవల్, వాంగ్ యి నిర్ణయించారని పేర్కొంది. వేగంగా, దశలవారీగా వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునే విషయంపై అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఇరు దేశాల ఆర్మీ కమాండర్ స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించారని పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత సానుకూలంగా ముందుకు సాగాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనడం ఆవశ్యకమని ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపింది. ధోవల్, వాంగ్ యి మధ్య జరిగిన చర్చలపై చైనా విదేశాంగ శాఖ కూడా ప్రకటన విడుదల చేసింది. ఇరువురి మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి లోతైన చర్చ జరిగిందని పేర్కొంది. భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు అవుతున్న విషయాన్ని వాంగ్ చర్చల్లో ప్రస్తావించారని వెల్లడించింది. పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచి వెనక్కు.. పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచే కాకుండా, గొగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి కూడా చైనా బలగాలు, వాహనాలు సోమవారం వెనక్కు వెళ్లాయి. పాంగాంగ్ సొ నుంచి వెనక్కు వెళ్లాయా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా భారత్కు పెరిగిన మద్దతు, ఇటీవల లేహ్ పర్యటనలో ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన సందేశం.. చైనా తాజా నిర్ణయానికి దోహదపడి ఉండొచ్చని పేర్కొన్నాయి. సరిహద్దు వివాదంపై చైనాతో దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. చర్చలే ప్రారంభం కానట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేదని వ్యాఖ్యానించారు. ‘కరోనా మహమ్మారి సమయంలో దౌత్య సంబంధాలు’ అనే అంశంపై జరిగిన వెబినార్లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ‘దేశాలు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. చర్చలు జరగాలి. అలా జరగని పక్షంలో, సమస్యలు, ఘర్షణలు పెరుగుతాయి. ఉదాహరణకు, చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరగనట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేది’ అని వివరించారు. -
రంగంలోకి అజిత్: తోక ముడిచిన చైనా
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో నెలల తరబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడినట్లు కనిపిస్తోంది. సరిహద్దు వివాదం నేపథ్యంలో గతకొంత కాలంగా చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు ఇరు దేశాలు ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద గల్వాన్ లోయలో ఘర్షణలు జరిగాక ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్ వెళ్లి సైన్యంతో మాట్లాడటం, అనంతరం జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ రంగంలోకి దిగడంతో చైనా సైన్యం తోకముడిచి వెనక్కి తగ్గింది. భారత చర్చల ఫలితంగా ఎట్టకేలకు ఫింగర్ 4 పాయింట్ నుంచి చైనా సైన్యం సుమారు కిలోమీటరున్నర దూరం వరకు వెనక్కి వెళ్లింది. మోదీ పర్యటన అనంతరం అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రితో ఆదివారం సుమారు రెండుగంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దేశ భద్రతా వ్యవహారాల్లో ఆరితేరిన అజిత్.. తన చాణిక్యతను ఉపయోగించి చైనాతో సమస్య పరిష్కారానికి దారిచూపారు. (గల్వాన్పై ఎందుకు చైనా కన్ను?) ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దుల్లో శాంతి యుత పరిస్థితులు నెలకొల్పాలని ఇరు దేశాల ప్రతినిధులు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ఇరుదేశాల సైనిక బలగాలను వీలైనంత తొందరగా ఉపసంహరించుకోవాలని అంగీకరించారు. వాస్తవాధీన రేఖను రెండు దేశాలు పరస్పరం గౌరవించుకోవాలని, ఏకపక్షంగా ఎల్ఏసీని మార్చే ప్రయత్నాలను మానుకోవాలి నిర్ణయించారు. అలాగే ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాల కోసం చర్చలు నిరంతరం కొనసాగాలని ఒప్పందం కుదుర్చున్నారు. (గల్వాన్ లోయలో కీలక పరిణామం) తూర్పు లద్దాఖ్ ప్రాంతాంలోని గల్వాయ్ లోయలో గల వివాదాస్పద ప్రాంతంలో చైనా సైన్యం గుడారాలు ఏర్పాటు చేయడం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్ 15న చెలరేగిన హింసాత్మక ఘటనలో 20 మంది భారత సైనికులు మృతిచెందారు. దీంతో చైనాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని యావత్దేశం ముక్తకంఠంతో నినదించింది. అయితే చైనా ఆర్థిక మూలాలపై దెబ్బతీయాలని భావించిన భారత ప్రభుత్వం డిజిటల్ స్ట్రైక్స్ ద్వారా డ్రాగాన్ను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ క్రమంలోనే గతవారం మోదీ అనూహ్యంగా లద్దాఖ్లో పర్యటించి చైనాకు గట్టి హెచ్చరికలు ఇచ్చారు. విస్తరణవాదానికి ఇక కాలం చెల్లిపోయిందని భారత భూభాగాలను ఆక్రమిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని మోదీ తేల్చి చెప్పారు. ఈ పరిణామం చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి గట్టి షాక్ లాంటిదే. ఇక మోదీ లద్దాక్ పర్యటన అనంతరం అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్లతో ప్రత్యేకంగా భేటీ అయిన అజిత్ దోవల్ ఆదివారం సాయంత్రం సుమారు రెండుగంటల పాటు చైనా విదేశాంగమంత్రితో చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని, వివాదాస్పద భూభాగం నుంచి వెనక్కి తగ్గలని కోరారు. ఈ నేపథ్యంలో చర్చల అనంతరం సోమవారం ఉదయం చైనా సైనం వెనక్కి తగ్గింది. కేంద్రంలో కీలక పాత్ర.. మోదీ దేశ ప్రధాని అయ్యాక అజిత్ దోవల్ని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)గా నియమించారు. వివిధ ఆపరేషన్లలో క్షేత్రస్థాయి అనుభవం ఉన్న దోవల్కి సమర్థవంతమై అధికారిగా మంచి గుర్తింపు ఉంది. ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే ఇరాక్లో ఐసిస్ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. 2015 జనవరిలో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి అన్నింటా చైనాకు వత్తాసు పలుకుతున్న అప్పటి అధ్యక్షుడు మహింద రాజపక్సను గద్దె దించడంలోనూ దోవల్ వ్యూహ రచన చేశారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి. గతంలో మణిపూర్లో మన సైన్యానికి చెందిన వాహనశ్రేణిపైన దాడిచేసి 18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న తీవ్రవాదులపైన ప్రతీకారంగా మన సైన్యం మయన్మార్లోకి వెళ్లి మెరుపుదాడి చేసి 40 మంది తీవ్రవాదుల్ని హతమార్చింది. దీని వెనుకా అజిత్ హస్తం ఉంది. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ విషాయాల్లో మోదీ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తూ అజిత్ దోవల్ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా చైనా వివాదాన్ని పరిష్కరించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. -
పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సర్వం సిద్ధం..
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగితే తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు తెలిపారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ అంతటి దుస్సాహసానికి పూనుకుంటుందని తాము భావించడం లేదన్నారు. అయితే తూర్పు లదాఖ్లోని పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని జమ్మూ కశ్మీర్లోకి పాక్ ఉగ్రవాదులను పంపేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గల్వాన్ లోయలో భారత్- చైనాల మధ్య ఘర్షణల నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్తాన్ భారీగా సైన్యాన్ని మోహరిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన శ్రీనగర్ కార్స్ప్ కమాండర్ బీఎస్ రాజు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.(గల్వాన్ లోయలో కీలక పరిణామం) ‘‘ఇప్పటి వరకైతే సరిహద్దుల వెంబడి పాక్ సైన్యం కదలికల్లో పెద్దగా మార్పేమీ కనిపించలేదు. అయితే డిఫెన్స్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు అనిపిస్తోంది. ఏదేమైనా వాళ్లకు ధీటుగా జవాబిచ్చేందుకు మేం సిద్ధంగానే ఉన్నాం. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ నుంచి భారీ సంఖ్యలో ఉగ్రవాదులు భారత్లో ప్రవేశించే అవకాశం ఉంది. దాదాపు 300 మంది ఉగ్రవాదులు దేశంలో చొరబడేందుకు ఎదురుచూస్తున్నారనే సమాచారం ఉంది. వాళ్లను పట్టుకునేందుకు మా సైనికులు సిద్ధంగానే ఉన్నారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ దుస్సాహసానికి పాల్పడకుండా 15 కార్స్స్ అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉంది’’ అని తెలిపారు. ఇక మే నెలలో మోస్ట్వాంటెడ్ ఉగ్రవాది రియాజ్ నైకూను భారత్ మట్టుబెట్టడం గురించి ఆయన మాట్లాడుతూ.. హిజ్బూల్ ముజాహిద్దీన్కు ఇది గట్టి ఎదురుదెబ్బ అని, హిజ్బుల్తో పాటు వివిధ ఉగ్రసంస్థలు కూడా నైకూను మిస్సవుతాయని పేర్కొన్నారు.(పాక్కు చైనా నుంచి 4 ఆర్మ్డ్ డ్రోన్స్!) -
వెనక్కి తగ్గిన చైనా బలగాలు
-
గల్వాన్ లోయలో కీలక పరిణామం
న్యూఢిల్లీ: భారత్, చైనా దేశాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గల్వాన్ లోయలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్వాన్ లోయ, సహా హాట్స్ప్రింగ్స్, లద్దాఖ్ ప్రాంతాల నుంచి నుంచి చైనా బలగాలు దాదాపు కిలోమీటరున్నర మేర వెనక్కి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే విధంగా అక్కడ చేపట్టిన నిర్మాణాలను కూడా తొలగిస్తున్నట్ల పేర్కొన్నాయి. ఇందుకు ప్రతిగా భారత బలగాలు కూడా వెనక్కి మళ్లాయని.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా ‘బఫర్ జోన్’ ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి. కాగా డ్రాగన్ దొంగదెబ్బకు భారత్ ధీటుగా స్పందిస్తుండటంతో వెనక్కి తగ్గిన చైనా ఈ మేరకు జరిగిన చర్చల్లో బలగాల ఉపసంహరణకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే బలగాల ఉపసంహరణలో చైనా ఎంతమేరకు నిజాయితీగా వ్యవహరిస్తుందో తెలియాలంటే మరికొంత సమయం వేచిచూడక తప్పదని అభిప్రాయపడ్డాయి.(గల్వాన్పై ఎందుకు చైనా కన్ను?) కాగా తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ ప్రాంతంలోని భారత భూభాగంలో పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద అక్రమంగా వేసిన గుడారాన్ని తొలగించమని భారత సైనికులు సూచించగా.. చైనా ఆర్మీ జూన్ 15న దాడికి తెగబడిన విషయం తెలిసిందే. రాళ్లు, ఇనుప రాడ్లను ఉపయోగించి భారత సైనికులను దొంగదెబ్బ కొట్టారు. ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయి చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్- చైనా మధ్య వివిధ స్థాయిల్లో మూడు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్లో శుక్రవారం ఆకస్మిక పర్యటన జరిపిన విషయం తెలిసిందే. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన సైనికుల త్యాగాలను కొనియాడుతూనే.. విస్తరణ వాదానికి కాలం చెల్లిందంటూ చైనాను ఉద్దేశించి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇక సరిహద్దుల్లో చైనా తీరును విమర్శించిన అమెరికా, ఫ్రాన్స్, జపాన్ తదితర దేశాలు భారత్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. -
గల్వాన్ దాడి; విస్తుగొలిపే నిజాలు!
న్యూఢిల్లీ/బీజింగ్: ఓ వైపు చర్చల్లో పాల్గొంటూనే మరోవైపు సరిహద్దులో బలగాలను మెహరిస్తూ చైనా కుయుక్తులు ప్రదర్శిస్తోంది. భారత భూభాగాన్ని తమ ప్రాంతంగా ప్రకటించుకుంటూ భారత్ను రెచ్చగొట్టింది. గల్వాన్లో సైనికులను దొంగదెబ్బ తీసి దారుణానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో మన దేశంలో చైనాపై ఎంత విముఖత ఏర్పడిందో, పర్యవసానంగా భారత్.. చైనాపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా గల్వాన్ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమర వీరులయ్యారు. ఇనుప చువ్వలు బిగించి ఉన్న రాడ్లతో చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసి కొట్టి చంపారు. అయితే వారితో ఘర్షణ సందర్భంగా భారత సైనికులు ఆయుధాలు వాడలేదన్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. (చైనాకు చెక్ : మరోసారి మోదీ మార్క్) ఐదుగురు జవాన్ల మృతదేహాలపై గాయాల గుర్తులు నిరాయుధులైన సైనికులను చైనా ఆర్మీ చుట్టుముట్టి దాడికి తెగబడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమరుల కుటుంబాలకు జారీ చేసిన డెత్ సర్టిఫికెట్లలో విస్తుగొలిపే నిజాలు వెలుగు చూశాయి. ముగ్గురు సైనికుల మెడ దగ్గర లోతైన గాయాలు కావడంతో రక్తనాళాలు పూర్తిగా చిట్లిపోయి మరణించారని తేలింది. మరో ఇద్దరు పదునైన, మొనదేలి ఉన్న వస్తువులతో దాడి చేయడం వల్ల మరణించినట్లు తెలిసింది. వీరందరీ తల, మెడపై గాయాల గుర్తులు ఉన్నట్లు మరణించిన సైనికుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇక చీకట్లో సైనికులు రక్షిత ప్రాంతానికి వెళ్లలేకపోయారని ఇదే అదనుగా భావించిన డ్రాగన్ ఆర్మీ వారిపై కర్కశంగా దాడికి దిగిందని కొందరు ఆర్మీ సైనికులు తెలిపారు. ఈ క్రమంలో కొందరిని గల్వాన్ నదిలోకి తోసేయగా గడ్డకట్టిన మృతదేహాలను తరువాతి రోజు ఉదయం బయటకు తీసినట్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. (చైనా ముప్పును ఎదుర్కొందాం) సైనికులను లోయలోకి తోసేసి.. చైనా ఇచ్చిన మాట ప్రకారం తన బలగాలను వెనక్కు తీసుకెళ్లిందా, నిర్మాణాలను కూల్చివేసిందా లేదా అనేది ధ్రువీకరించడానికి జూన్ 15న అర్ధరాత్రి గల్వాన్లో బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ కుమార్ పెట్రోల్ పాయింట్ 14 దగ్గరకు వెళ్లి చూడగా వివాదం మొదలైంది. చైనా సైనికులు మాటకు బదులుగా చేతికి దొరికిన ఆయుధాలతో (ఇనుప రాడ్లు, మేకులతో కూడిన గదల్లాంటి ఆయుధాలను) భారత సైనికులపై మెరుపువేగంతో దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ వెన్నుపోటు పొడిచిన చైనా ఆర్మీపై విజృంభించింది. ఈ ఘర్షణలో 40 మంది చైనా సైనికులు మరణించినట్టు వార్తలు వచ్చినా డ్రాగన్ ధ్రువీకరించలేదు. (లద్దాఖ్కు క్షిపణి వ్యవస్థ) -
గల్వాన్పై ఎందుకు చైనా కన్ను?
న్యూఢిల్లీ/బీజింగ్: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం మూడు దఫాలు చర్చలు జరిగినా సమసిపోలేదు. చైనా మరో అడుగు ముందుకు వేసి తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ తమదేనని సార్వభౌమాధికారం ప్రకటించుకొని మరింత అగ్గి రాజేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు గల్వాన్ ప్రాంతమే ఎందుకంత కీలకం? 1962 యుద్ధంలో గల్వాన్ లోయ ఎందుకు ప్రాధాన్యంగా మారింది? పర్వత సానువుల్లో భారత్ బలగాలు పటిష్టంగా ఎలా ఉన్నాయి? ఎవరి సైనిక సత్తా ఎంత? వంటివన్నీ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రెండు పక్షాలకీ వ్యూహాత్మక ప్రాంతం భారత్, చైనా దేశాలకు వ్యూహాత్మకంగా గల్వాన్ లోయ అత్యంత కీలకం. సబ్ సెక్టార్ నార్త్ (ఎస్ఎస్ఎన్)లో గల్వాన్ లోయ ఉంది. వివాదాస్పద ప్రాంతమైన ఆక్సాయిచిన్ నుంచి భారత్లోని లద్దాఖ్ దాకా గల్వాన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. లేహ్కు చెందిన అన్వేషకుడు గులామ్ రసూల్ గల్వాన్ పేరునే ఈ నదికి పెట్టారు.వాస్తవాధీన రేఖ వెంబడి పశ్చిమాన నదీ పరివాహక ప్రాంతాల్లో గల్వాన్ లోయ ప్రాంతం ఎత్తు తక్కువగా ఉంటుంది. భారత్ బలగాలు ఆక్సాయిచిన్ చేరుకోవాలంటే గల్వాన్ లోయ గుండా చేరుకోవడం సులభం. అంతేకాకుండా పాకిస్తాన్, చైనాలోని జిన్జియాంగ్, లద్దాఖ్ సరిహద్దులతో గల్వాన్ లోయ కలిసి ఉంది. గల్వాన్ నది టిబెట్ నుంచి ప్రవహిస్తూ షివోక్ నదిలో కలుస్తుంది. ఈ నదికి సమీపంలో ఉత్తర లద్దాఖ్ను కలుపుతూ ప్రధాన రహదారి ఉంది. చైనా బలగాలు దీనిని ఆక్రమిస్తే మనకి రోడ్డు ఉండదు. అందుకే గల్వాన్ ప్రాంతం భారత్కు అత్యంత కీలకం. ఈ ప్రాంతంలో భారత్ మౌలిక సదుపాయాల కల్పన, షియోక్ నది వీదుగా వంతెన నిర్మాణం, లేహ్, దౌలత్ బేగ్ ఓల్దీలను కలుపుతూ 255 కి.మీ. పొడవున రోడ్డు నిర్మాణం వంటివి చైనాకు కంటగింపుగా మారాయి. లద్దాఖ్ని కేంద్ర పాలిత ప్రాంతం చేసిన దగ్గర్నుంచి డ్రాగన్ దేశం సరిహద్దుల్లో విషం చిమ్ముతూనే ఉంది. దేశం కోసం ప్రాణత్యాగానికి జవాన్లు సిద్ధం భారత సైన్యం అత్యంత ఉత్సాహంతో ఉందనీ, గతంలో మాదిరిగానే జవాన్లు దేశం కోసం జీవితాలను త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఇండో టిబెటన్ బోర్డర్ పోలిస్ (ఐటీబీపీ)డైరెక్టర్ జనరల్ ఎస్.ఎస్.దేశ్వాల్ పేర్కొన్నారు. చైనాతో సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రధాని మోదీ ఇటీవల లద్దాఖ్లో పర్యటించడం, నిములో చేసిన ప్రసంగంతో సరిహద్దుల్లో ఉన్న సైన్యంలో ధైర్యం ఇనుమడించిందని అన్నారు. పర్వత శ్రేణుల్లో మనకి లేరు పోటీ ! ప్రపంచంలో అత్యధిక సైనికులున్న మన బలగానికి ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే, పోరాడే శక్తి ఉంది. సైనిక బలగాల సంఖ్యలో భారత్, ఉత్తర కొరియా తర్వాత స్థానమే చైనాకు దక్కుతుంది. అయితే ఆయుధాల పరంగా చైనా అత్యంత బలంగా ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఏప్రిల్ నుంచి చెలరేగుతున్న ఘర్షణల్లో మన సైనికులు చైనాకు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. పర్వత శ్రేణుల్లో, పీఠభూముల్లో భారత్ సైనికులకు మించిన వారు లేరని స్వయంగా చైనా నిపుణులే కితాబు ఇచ్చిన సందర్భాలున్నాయి. ‘‘ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత అనుభవమైన, పటిష్టమైన సైనిక బలగాలున్న దేశం అమెరికా, రష్యా, యూరప్ కానే కాదు. అది భారత్’’అని చైనాలో మోడర్న్ వెపనరీ మ్యాగజైన్ సీనియర్ ఎడిటర్ హాంగ్ ఘాజి ఇటీవల తాను రాసిన ఆర్టికల్లో ప్రశంసించారు. వాస్తవాధీన రేఖ వెంబడి మొత్తం 12 డివిజన్లలో 2 లక్షలకుపైగా మన సైనికులు రేయింబగళ్లు గస్తీ తిరుగుతున్నారు. 1970 నుంచి భారతీయ ఆర్మీ తన పరిధిని విస్తరిస్తూ పర్వతాల్లో పెద్ద ఎత్తున సైనికుల్ని మోహరిస్తోంది. భారతీయులెవరైనా సైన్యంలో చేరాలంటే పర్వతారోహణ చెయ్యడం తప్పనిసరి. ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన ప్రాంతమైన సియాచిన్లో వందలాది శిబిరాలను భారత్ ఏర్పాటు చేసిందని హాంగ్ తన వ్యాసంలో వివరించారు. నాటి యుద్ధంలోనూ... 1962లో భారత్, చైనా యుద్ధం కూడా గల్వాన్ లోయ ప్రాంతంలోనే జరిగింది. అప్పట్లో చైనా జిన్జియాంగ్ నుంచి టిబెట్కు 179 కి.మీ. పొడవున రోడ్డు నిర్మించింది. ఈ రోడ్డు భారత్కు చెందిన ఆక్సాయిచిన్ ప్రాంతం గుండా వెళుతుంది. భారత్ అనుమతి లేకుండానే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడమే అప్పట్లో ఇరుపక్షాల మధ్య అగ్గి రాజేసింది. యుద్ధం తర్వాత కూడా చైనా ఎన్నో ప్రాంతాలను ఆక్రమించింది. ఆక్సాయిచిన్ తమదేనని ప్రకటించుకుంది. గల్వాన్ ప్రాంతంపై పట్టు సాధిస్తే భారత్ బలగాలు ఆక్సాయిచిన్ చేరే అవకాశం లేదని భావిస్తున్న చైనా పథకం ప్రకారమే దాడులకు తెగబడుతోంది. పీఠభూముల్లోనూ, పర్వత శ్రేణుల్లో భారత్ సైనికులు బలంగా ఉంటే, ఆక్సాయిచిన్ ప్రాంతంలో చైనా బలంగా ఉంది. అత్యాధునికమైన ఆయుధాలు కూడా ఆ దేశం దగ్గర ఉండడం కలవర పెట్టే అంశం. అయితే 1962తో పోల్చి చూస్తే భారత్ అన్ని రకాలుగా బలమైన దేశంగా అవతరించింది. ‘‘ఆక్సాయిచిన్లో చైనా బలంగా ఉంది. అయితే కరోనా వైరస్తో చైనా అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ దౌత్యపరంగా బలహీనంగా ఉండటం మనకు లాభం చేకూరే అంశం’’ అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఎస్డీ ముని వ్యాఖ్యానించారు. -
తప్పుడు ప్రచారం చేయడం తగదు
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో గాయపడిన భారత సైనికులకు సరైన చికిత్స అందించడం లేదన్న విమర్శలను భారత సైన్యం ఖండించింది. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది. లేహ్లోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 3న పరామర్శించిన సంగతి తెలిసిందే. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అక్కడ సరైన వసతులు లేవని, సైనికులను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కొందరు వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు. దీనిపై భారత సైన్యం శనివారం స్పందించింది. ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేయొద్దని కోరింది. వీర సైనికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. లేహ్లోని జనరల్ హాస్పిటల్లో కొన్ని వార్డులను కరోనా ఐసోలేషన్ వార్డులుగా మార్చారని, అందుకే ఆడియో వీడియో ట్రైనింగ్ హాల్ను ప్రత్యేక వార్డుగా తీర్చిదిద్ది, సైనికులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. అక్కడ సకల సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది. -
‘గల్వాన్’పై అజయ్ దేవగన్ సినిమా
ముంబై: గల్వాన్ వ్యాలీ ఘటన ఆధారంగా సినిమా రూపొందించనున్నట్లు బాలీవుడ్ హీరో-నిర్మాత అజయ్ దేవగన్ వెల్లడించాడు. జూన్15న లడక్లోని గాల్వన్ వ్యాలీ వద్ద చైనా అర్మీ, భారత సైన్యంపై జరిపిన దాడిలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆధారంగా అజయ్ దేవగన్ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఇందులో అజయ్ నటిస్తారా లేదా అనేది స్ఫష్టత లేదు. కానీ ఇప్పటికే ఈ చిత్రం కోసం తారాగణాన్ని ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అజయ్ దేవగన్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హైల్డింగ్ ఎల్ఎల్పీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. (వినూత్నంగా వర్మ 12'0' క్లాక్ ట్రైలర్) ఇప్పటికే అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో 1975లో అరుణాచల్ ప్రదేశ్లో చైనా పీపుల్స్ ఆర్మీ, భారత సైన్యంపై జరిపిన మెరుపుదాడిలో భారత సైన్యం మొట్టమొదటి సారిగా ఎదుర్కొన్న ప్రాణనష్టం ఆధారంగా ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ పేరుతో చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టులో ఓటీటీలో ప్లాట్ఫ్లాంలో విడుదల కానుంది. అభిషేక్ దుధయ్య రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, అమ్మి విర్క్, శరద్ కేల్కర్, రానా, దక్షిణాది భామ ప్రణతిలు ప్రధాన పాత్రల్లో నటించారు. (దేశీ టచ్తో విదేశీ కథలు) -
108 అంబులెన్స్ సర్వీసుపై పవన్ ప్రశంసలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అత్యవసర సేవలందించే 108,104 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో జూలై 1న 1088 అంబులెన్స్ సర్వీసులను సీఎం వైఎస్ జగన్ ఒకేసారి ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అభినందిస్తూ పవన్ ట్విటర్లో స్పందించారు. 'ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా అత్యవసర సేవలు అందించే అంబులెన్స్లను అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం. అలాగే గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలోనూ ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు కూడా అభినందనీయంగా ఉంది.' అంటూ పేర్కొన్నారు. అలాగే గల్వాన్ లోయలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై పవన్ ట్విటర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మోదీని అభినందించారు. ' పీఎం నరేంద్ర మోదీజీ.. నాయకత్వం అనేది దేశస్థులను ఉత్తేజపరిచేది. మన సాయుధ దళాల శౌర్యానికి ఘనమైన నివాళులు అర్పించారు, ఇవాళ లేహ్లో వారితో సంభాషించారు. ఇది మన దళాల మనోధైర్యాన్ని పెంచుతుంది. మీరిచ్చిన ఉత్తేజం వారిలో ఉన్న జోష్ను ఆకాశాన్ని తాకేలా చేసింది' అంటూ ట్వీట్ చేశారు. -
మోదీ లద్దాఖ్ పర్యటన.. రాహుల్ స్పందన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాన మంత్రి లద్దాఖ్ పర్యటనపై స్పందించారు. ఈ క్రమంలో ఓ వీడియోను షేర్ చేస్తూ ‘లద్దాఖ్ ప్రజలు చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది అంటున్నారు.. ప్రధాని నరేంద్ర మోదీ మన నేలను ఎవరు తీసుకోలేరు అంటున్నారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారు’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో కొందరు లడాఖీలు ఈ ప్రాంతంలో చైనా దూకుడును వివరించగా.. మరి కొందరు వారు(చైనా) చట్టవిరుద్ధంగా మన భూమిని ఆక్రమించుకున్నారని చెప్పడం వీడియోలో చూడవచ్చు. అయితే కేంద్రం, ప్రధాన మంత్రి మాత్రం భారత భూభాగంలోకి చైనా ఎలాంటి ఆక్రమణలు చేయలేదని తెలిపారు.(లద్దాఖ్లో మోదీ ఆకస్మిక పర్యటన) Ladakhis say: China took our land. PM says: Nobody took our land. Obviously, someone is lying. pic.twitter.com/kWNQQhjlY7 — Rahul Gandhi (@RahulGandhi) July 3, 2020 అయితే రాహుల్ గాంధీ కేంద్రంపై ఇలాంటి విమర్శలు చేయడం ఇదే ప్రథమం కాదు. గల్వాన్ వ్యాలీ ఘర్షణ జరిగిన నాటి నుంచి రాహుల్, కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్లో ఆకస్మికంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్తో కలిసి లేహ్కు చేరుకున్నారు. పర్యటన సందర్భంగా సరిహద్దు ప్రతిష్టంభనపై సైనికాధికారులతో మోదీ సమీక్ష నిర్వహించారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి తాజా పరిస్థితుల గురించి సైనికులను అడిగి తెలుసుకున్నారు.